
‘సీఆర్డీఏ’లో భూసేకరణ తుది డిక్లరేషన్లు రద్దు
సీఆర్డీఏ పరిధిలోని 10 గ్రామాల్లో భూ సేకరణ నిమిత్తం కొత్త భూసేకరణ చట్టం కింద జారీ చేసిన తుది డిక్లరేషన్లను హైకోర్టు రద్దు చేసింది.
తమ గ్రామాల్లోని వేల ఎకరాల భూములను ప్రభుత్వం సేకరిస్తోందని పిటిషనర్లు తెలిపారు. మాస్టర్ ప్లాన్కు విరుద్ధంగా ఈ భూములను వినియోగించేందుకు ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి, సంబంధిత అధికారుల ముందు ఈ అభ్యంతరాలను లేవనెత్తేందుకు పిటిషనర్లకు వెలుసుబాటు కల్పించారు. అభ్యంతరాలు విన్న తరువాత వాటిని పరిగణనలోకి తీసుకుని తగిన ఉత్తర్వులు జారీ చేయాలని అధికారులకు తేల్చి చెప్పారు. ఈ ఉత్తర్వులపై అభ్యంతరం ఉంటే రైతులు వాటిని కోర్టులో సవాలు చేసుకోవచ్చని స్పష్టంచేశారు.