హైదరాబాద్ : గురువారం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్ పై ఎంపీ కవిత హర్షం వ్యక్తం చేశారు. విలేకరులతో మాట్లాడుతూ.. ఈ ఏడాది రైల్వే బడ్జెట్ లో మౌలిక సదుపాయాలకు పెద్ద పీట వేశారని ఆమె అభిప్రాయపడ్డారు. మహిళల భద్రతకు తీసుకుంటున్న చర్యలు బాగున్నాయని అన్నారు. పెద్ద పల్లి- నిజామాబాద్ లైన్ కు నిధుల కేటాయించినందుకు సంతోషంగా ఉందని కవిత పేర్కొన్నారు.