'మేము తలుచుకుంటే 2 నిమిషాలు పట్టదు' | vishnu kumar raju warns YSRCP MLAs in AP assembly | Sakshi
Sakshi News home page

'మేము తలుచుకుంటే 2 నిమిషాలు పట్టదు'

Published Fri, Dec 18 2015 4:37 PM | Last Updated on Sat, Jun 2 2018 2:30 PM

'మేము తలుచుకుంటే 2 నిమిషాలు పట్టదు' - Sakshi

'మేము తలుచుకుంటే 2 నిమిషాలు పట్టదు'

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్ శాసనసభలో వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలపై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఒంటికాలిపై లేచారు. 'కాల్ మనీ' సెక్స్ రాకెట్ వ్యవహారంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటన చేస్తుండగా వైఎస్సార్ సీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. దీంతో కలజేసుకున్న విష్ణుకుమార్ రాజు వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలపై మండిపడ్డారు. సభలో ఆందోళన చేయడం సరికాదన్నారు.
 

వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు పట్టువీడకపోవడంతో తాము తల్చుకుంటే రెండు నిమిషాలు పట్టదంటూ హెచ్చరిక ధోరణిలో మాట్లాడారు. ముఖ్యమంత్రిపై ఆరోపణలు చేయడం తగదంటూ చంద్రబాబును వెనకేసుకొచ్చారు. సభకు దారికి తీసుకొచ్చేందుకు ఓపిగ్గా ప్రయత్నిస్తున్న స్పీకర్ కు జోహార్లు అర్పించారు. స్పీకర్ తో వాదించడం సమంజసం కాదని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలకు సూచించారు.

కాగా, వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే రోజాను సభ నుంచి సంవత్సరం పాటు సస్పెండ్ చేయాలని పాయకరావుపేట టీడీపీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత డిమాండ్ చేశారు. ప్రతిపక్ష నాయకుడిపై కూడా చర్య తీసుకోవాలని స్పీకర్ కు విజ్ఞప్తి చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement