సిడ్నీ: బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో ఇక్కడ జరుగుతున్న చివరి టెస్ట్ మ్యాచ్ లో నాలుగో రోజు భారత్ 352 పరుగుల వద్ద ఏడో వికెట్ కోల్పోయింది. భారత్ ఆటగాడు సాహా 130.2 ఓవర్లలో ఏడో వికెట్ రూపంలో పెవిలియన్ చేరాడు. 96 బంతుల్లో 35 పరుగులు చేసిన సాహా, హాజిల్వుడ్ బౌలింగ్లో స్మిత్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాటపట్టాడు. అంతకముందు భారత్ కెప్టెన్ వీరాట్ క్లోహీ 119.3 ఓవర్లో ఆరో వికెట్ రూపంలో పెవిలియన్ చేరాడు. 230 బంతుల్లో 20 ఫోర్లు బాదిన కోహ్లీ 147 పరుగులు చేసి హారీస్ బౌలింగ్లో రోజర్స్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. భారత్ 132.5 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 390 పరుగులతో కొనసాగుతోంది. ప్రస్తుతం భువనేశ్వర్(0), అశ్వీన్ (19) పరుగులతో క్రీజ్ లో ఉన్నారు.
అయితే మూడో రోజు ఆటముగిసే సమయానికి టీమిండియా ఐదు వికెట్ల నష్టానికి 342 పరుగులు చేసింది. ఆసీస్ బౌలర్లలో లయోన్, హరీస్, హాజిల్వుడ్ తలో వికెట్ తీసుకోగా, స్టార్క్, వాట్సన్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. అంతకముందు ఆసీస్ తన తొలి ఇన్నింగ్స్ను 7 వికెట్ల నష్టానికి 572 పరుగుల వద్ద డిక్లేర్ చేసిన సంగతి తెలిసిందే.
383 పరుగుల వద్ద ఏడో వికెట్ కోల్పోయిన భారత్
Published Fri, Jan 9 2015 6:22 AM | Last Updated on Sat, Sep 2 2017 7:27 PM
Advertisement
Advertisement