హైదరాబాద్ : ఓటుకు నోటు కేసులో టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని సోమవారం ఏసీబీ కోర్టులో హాజరు పరిచారు. ఆయన జ్యుడిషియల్ కస్టడీ నేటితో ముగియటంతో చర్లపల్లి జైలు నుంచి కోర్టుకు తరలించారు. ఉదయసింహా, సెబాస్టియన్ లను కూడా న్యాయస్థానంలో హాజరుపరిచారు.
మరోవైపు ఈ కేసులో ప్రధాన సాక్షి అయిన నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ వాంగ్మూలాన్ని మెజిస్ట్రేట్ ఎదుట నమోదు చేయనుండడంతో పాటు వీడియో, ఆడియో రికార్డులకు సంబంధించి ఫోరెన్సిక్ నివేదిక న్యాయస్థానానికి అందనుంది.
జైలు నుంచి ఏసీబీ కోర్టుకు రేవంత్ రెడ్డి
Published Mon, Jun 15 2015 11:55 AM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM
Advertisement
Advertisement