Social Media
-
లోన్ ఆశ చూపి.. రూ.39 వేల నాటు కోళ్లు తిన్న బ్యాంక్ మేనేజర్!
చత్తీస్గఢ్లో ఓ వింత ఘటన వెలుగుచసింది. నాటు కోడి కూర అంటే తెగ ఇష్టపడే ఓ బ్యాంక్ మేనేజర్.. ఓ రైతును బకరాలాగా ఉపయోగించుకున్నాడు. అతడికి లోన్ ఇప్పిస్తానని ఆశ చూపి ఏకంగా వేల విలువైన నాటు కోళ్లను అమాంతం తినేశాడు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం బిలాస్పూర్ జిల్లాలోని మస్తూరి పట్టణంలో ఈ ఘటన చోటుచేసుకుంది.వివరాల్లోకి వెళ్తే.. మస్తూరి పట్టణానికి చెందిన రైతు మన్హర్కు కోళ్ల ఫారమ్ ఉంది. తన పొలంలో ఏర్పాటు చేసిన ఆ కోళ్ల ఫారాన్ని మరింత విస్తరించాలని రైతు భావించాడు. అందుకు లోన్ తీసుకోవాలని నిర్ణయించుకుని స్థానిక ఎస్బీఐ బ్రాంచ్ మేనేజర్ను కలిశాడు. లోన్ ఇస్తానని చెప్పిన మేనేజర్ తనకు నాటు కోడి కూర అంటే ఇష్టమని, తనకు ప్రతి శనివారం నాటు కోడి తెచ్చివ్వాలని కోరాడు. లోన్ వస్తుందన్న ఆశతో రైతు మన్హర్ బ్యాంకు మేనేజర్ చెప్పినట్టే చేశాడు. అప్పటి నుంచి మొదలు లోన్ పేరు చెప్పి తరచూ అతడు మన్హర్ ద్వారా నాటు కోళ్లు తెప్పించుకుని తిన్నాడు.ఇలా రెండు నెలల వ్యవధిలో అతడు మొత్తం రూ.39 వేల విలువ చేసే నాటుకోళ్లు తిన్నాడు. పైగా రైతు నుంచి లోన్ కోసం 10 శాతం కమిషన్ కూడా డిమాండ్ చేశాడు. దాంతో అతను తన ఫారమ్లోని కోళ్లను అమ్మి రూ.10 లక్షల లోన్ కోసం 10 శాతం కమిషన్ కూడా ఇచ్చాడు. అయినా బ్యాంకు మేనేజర్ లోన్ మంజూరు చేయకుండా ఇంకా నాటు కోళ్ల కోసం డిమాండ్ చేశాడు. దాంతో బ్యాంకు మేనేజర్ తనకు లోన్ ఇవ్వదల్చుకోలేదని, తనను మోసం చేశాడని గ్రహించిన మన్హర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తాను కొనుగోలు చేసి మేనేజర్కి ఇచ్చిన కోళ్ల బిల్లులు కూడా తన వద్ద ఉన్నాయని, మేనేజర్ తిన్న కోళ్లకు కూడా డబ్బులు ఇవ్వడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నాడు. మేనేజర్పై చర్య తీసుకోవాలని లేదంటే.. తాను ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. తనకు న్యాయం చేయకపోతే నిరహార దీక్షకు కూర్చుంటానని, మస్తూరి ఎస్బీఐ బ్రాంచ్ ముందే తాను చచ్చిపోతానని హెచ్చరించాడు. దాంతో పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
వృద్ధురాలిపై వీధి కుక్కల దాడి, వైరల్ వీడియో
థానేలోని టిటా్వలా థానేలో కుక్కలు వీరంగం సృష్టించాయి. ఓ వృద్ధురాలిపై దాడి చేయడంతో పరిస్థితి విషమించింది. ఈమేరకు పోలీసు అధికారి ఆదివారం వివరాలు వెల్లడించారు. శుక్రవారం తెల్లవారుజామున 2 గంటలకు జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటనకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఉన్నట్టుండి దాడిచేసిన నాలుగు కుక్కలు ఆమెపై ఎగబడ్డాయి. మహిళ వాటి నుంచి తప్పించుకునేందుకు శతవిధాలా ప్రయత్నించిది. అయినా కూడా ఒకదాని తరువాత ఒకటి నలువైపులా ఆమెపై ఎటాక్ చేశాయి. దాడిలో తీవ్రంగా గాయపడిన ఆమెను ఉల్హాస్నగర్ సెంట్రల్ ఆసుపత్రిలో చేర్చారు. ముంబైలోని ప్రభుత్వ ఆధ్వర్యంలోని జేజే ఆసుపత్రికి అధునాతన సంరక్షణ కోసం తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉంది. ఆమె స్టేట్మెంట్ను ఒకసారి నమోదు చేస్తాం. ఆమె ఆరోగ్యం మెరుగుపడుతుంది’ అని కల్యాణ్ తాలూకా పోలీస్ స్టేషన్ అధికారి వెల్లడించారు. ठाणे के टिटवाला में आवारा कुत्तों ने एक बुजुर्ग महिला पर हमला किया.आवारा कुत्तों ने महिला को 50 मीटर तक घसीटा..महिला बुरी तरह से घायल.महिला का इलाज अस्पताल में चल रहा है..चार आवारा कुत्तों ने महिला पर किया जानलेवा हमला..पूरी घटना सीसीटीवी में कैद. pic.twitter.com/BX5CmYQFYj— Vivek Gupta (@imvivekgupta) December 8, 2024 -
Video: అరుదైన సన్నివేశం.. మోదీ, ఖర్గే ముచ్చట్లు
న్యూఢిల్లీ: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 69వ వర్థంతి సందర్భంగా ఢిల్లీలో శుక్రవారం అరుదైన సన్నివేశం చోటుచేసుకుంది. పార్లమెంట్ ఆవరణలో నిర్వహించిన మహాపరినిర్వాన్ దివస్ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అంబేద్కర్ చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ క్రమంలో ఆసక్తికర పరిణామం జరిగింది. ప్రధాని మోదీ, ఖర్గే పరస్పరం పలకరించుకొని కాసేపు నవ్వుతూ మాట్లాడుకున్నారు. దీనికి సంబంధించిన దృశ్యాలను కెమెరామెన్లు క్లిక్మనిపించడంతో.. ఇవి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.ఈ కార్యక్రమానికి మోదీ, ఖర్గేతోపాటు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్, మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఖర్గే మోదీ వద్దకు వచ్చి షేక్హ్యాండ్ ఇచ్చారు. అనంతరం ఇరువురు నేతలు కాసేపు నవ్వుతూ ముచ్చటించారు. రాజకీయాల్లో ఎప్పుడూ పరస్పర విమర్శలు, ఆరోపణలు చేసుకొనే నేతలు ఇలా ఒకేచోట అభివాదం చేస్తూ నవ్వుకుంటున్న దృశ్యాలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.. మరోవైపు లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అంబేద్కర్కు నివాళులర్పించారు.#WATCH | Delhi: Prime Minister Narendra Modi, Vice President Jagdeep Dhankhar, Former President Ram Nath Kovind, Congress President Mallikarjun Kharge and Lok Sabha Speaker Om Birla at the Parliament House Lawns as they pay tribute to Dr BR Ambedkar on the occasion of 69th… pic.twitter.com/TUrefyCY1m— ANI (@ANI) December 6, 2024 -
పుష్ప రాజ్ మేనియా.. టీచర్కి షాక్!
సాక్షి, మహబూబాబాద్ జిల్లా: ఎక్కడ చూసిన "పుష్ప" మేనియా ఊపేస్తోంది. థియేటర్ల దగ్గర జనం బారులు తీరుతున్నారు. ఇక స్కూళ్లలోనూ కూడా ‘పుష్ప’ హవా నడుస్తోంది.. అందులో ఒక స్కూల్లో అయితే, ఒక విద్యార్థి రాసిన లీవ్ లెటర్ వైరల్గా మారింది. ఎందుకో తెలుసా...?. ఆ స్టూడెంట్కి "పుష్ప: ది రూల్" సినిమా అంటే పిచ్చి! అల్లు అర్జున్ స్టైల్ కి ఫిదా! సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలని "తపన" పట్టుకుంది. కానీ స్కూల్ కి వెళ్ళాలి! ఏం చేయాలి? ఆలోచించి ఆలోచించి, ఒక "ధైర్యమైన" నిర్ణయం తీసుకున్నాడు. మాష్టారు గారికి ఒక లెటర్ రాశాడు.అందులో ఏముందో తెలుసా..?.. "సార్, నేను పుష్ప సినిమాకు వెళ్తున్నాను. ఎందుకంటే ఆ హీరో నా ఫేవరెట్. దయచేసి నాకు లీవ్ ఇవ్వండి." అంతే! నిజాయితీగా లీవు అడిగేశాడు. లెటర్ చదివిన టీచర్ కి మొదట షాక్..! తర్వాత ఆనందం! "ఇంత నిజాయితీగా లీవు అడిగే విద్యార్థిని ఇంతవరకు చూడలేదు" అనుకున్నారు. తన శిష్యుడు నిజం చెప్పాడు అని గర్వంగా ఫీల్ అయి..,ఏం చేశారంటే, ఆ లెటర్ ని ఫోటో తీసి వాట్సాప్ స్టేటస్ లో పెట్టేశారు!. "పుష్ప" సినిమా కన్నా ఆ లెటర్ వైరల్ అయిపోయింది.ఇదీ చదవండి: బన్నీ నట విశ్వరూపం.. ‘పుష్ప 2’ హిట్టా? ఫట్టా? -
ఏడు ఖండాలను చుట్టి వచ్చిన వందేళ్ల బామ్మ..!
మన దేశంలో ఉండే పర్యాటక ప్రదేశాలను చుట్టిరావడమే కష్టంగా ఉంటుంది. ఎందుకంటే బడ్జెట్, జర్నీ ప్లాన్ అన్నీ అనుకూలంగా ఉంటేనే సాధ్యం. ముఖ్యమైన పర్యాటక ప్రదేశాలు.. ఏ మూడో.. నాలుగో చుట్టి వచ్చి హమ్మయ్యా అనుకుంటాం. కానీ ఈ బామ్మ మాత్రం ఏకంగా ఏడు ఖండాలను చుట్టి రావాలనుకుంది. అక్కడ విభిన్న సంప్రదాయాలు, ప్రజల జీవనశైలిని గురించి తెలుకోవాలని ఆరాటపడింది ఈ బామ్మ. వృద్ధాప్యం సమీపిస్తున్న వెనక్కి తగ్గలేదు. చివరకు తాను అనుకున్నట్లుగానే ఏడు ఖండాలు చుట్టివచ్చి..అందిరిచే ప్రశంసలందుకుంది. ఆమె ఎవరంటే..102 ఏళ్ల డోరతీ స్మిత్ అత్యంత సాహసోపేతమైన కలను నిజం చేసుకుని.. అద్భతమైన ఘనతను సాధించింది. మొత్తం ఏడు ఖండాలను సందర్శించి శెభాష్ అనిపించుకుంది. చాలాకాలంగా ఈ బామ్మ భూగోళాన్ని చుట్టిరావాలని కలలు కంది. ఆ కలను నిజం చేసుకునేలా..సుమారు ఆరు ఖండాలను సందర్శించింది. అయితే చివరి ఖండం వచ్చేటప్పటికీ వృద్ధరాలైపోవడంతో.. ఎలా? అని కలవరపడింది. అయితే "యస్ థియరీ" అనే యూట్యూబ ఛానెల్ క్రియేటర్స్ అమ్మర్ కందిల్, స్టాపన్ టేలర్ ఈ బామ్మ డ్రీమ్కు సాయం అందించారు. ఈ క్రియేటర్స్ కాలిఫోర్నియాలోని రెడ్వుడ్స్ రిటైర్మెంట్ విలేజ్లో ఒక కథను చిత్రీకరిస్తుండగా .. బామ్మ స్మిత్ని కలిశారు. ఆమె జీవిత అభిరుచుకి ఫిదా అయ్యి..ఆమెకు సాయం చేసేందుకు ముందుక వచ్చారు. ఆమె చూడాల్సిన చివరి ఖండమైన ఆస్ట్రేలియాను తన కూతరు అడ్రియన్తో కలిసి వెళ్లేలా జర్నీ ప్లాన్ చేశారు ఈ క్రియేటర్స్. ఆ బామ్మ జర్నీలో కందిల్, టేలర్ కూడా చేరారు. ఇక 102 ఏళ్ల బామ్మ క్వాంటాస్ విమానంలోని బిజినెస్ క్లాస్లో ప్రయాణించి ఆస్ట్రేలియా చేరుకుంది. అక్కడ చూడవల్సిన స్మిత్ సిడ్నీ హార్బర్ క్రూయిజ్, వైల్డ్ లైఫ్ సిడ్నీ జూ, ఒపేరా హౌస్, బోండి బీచ్ వంటి ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలన్నింటిని సందర్శించింది. తనకు ఈ సిడ్నీ పర్యటన అత్యంత మనోహరంగా ఉందని, అక్కడి ఆహారం, ప్రజల జీవనశైలి అత్యద్భుతంగా ఉన్నాయంటోంది స్మిత్. అంతేగాదు ఆస్ట్రేలియాలో టేకాఫ్కు ముందు పైలట్లు, సిబ్బంది ఆమెను సత్కరించడం విశేషం. అందుకు సంబంధించిన వీడియోని కూడా కందిల్, టేలర్ యూట్యూబ్లో అప్లోడ్ చేయడంతో నెట్టింట తెగ వైరల్గా మారింది. (చదవండి: ప్రపంచంలోనే చెత్త ఎయిర్లైన్స్.. ఇండిగో స్థానం ఇది!) -
ఫుట్బాల్ మ్యాచ్లో గొడవ.. 100 మంది మృతి
సౌత్ ఆఫ్రికాలోని గినియా దేశంలో పెను విషాదం చోటుచేసుకుంది. గినియాలోని రెండవ అతిపెద్ద నగరమైన ఎన్జెరెకోర్లో ఫుట్బాల్ మ్యాచ్ సందర్భంగా అభిమానుల మధ్య భారీ ఘర్షణ జరిగింది. రెండు వర్గాలు పరస్పరం దాడి చేసుకోవడంతో దాదాపు 100 మందికి పైగా మరణించారు. ఈ మేరకు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి.కాగా గినియా మిలిటరీ జుంటా నేత మమాడి దౌంబోయ గౌరవార్థం జెరెకొరె నగరంలో ఆదివారం ఫుట్బాల్ టోర్నమెంట్ను నిర్వహించారు. ఫుట్బాల్ మ్యాచ్ మధ్యలో రిఫరీ తీసుకున్న ఓ నిర్ణయం వివాదాస్పదమైంది. దాన్ని వ్యతిరేకించిన ఓ జట్టు అభిమానులు మైదానంలోకి దూసుకెళ్లారు. దీంతో అవతలి జట్టు అభిమానులు వీరిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది.అనంతరం వందలాది మంది వీధుల్లోకి వచ్చి పరస్పరం దాడులు చేసుకున్నారు. స్థానిక పోలీస్ స్టేషన్ను కూడా ధ్వంసం చేసి, నిప్పంటించారు. ఈ క్రమంలో వంద మందికిపైగా మరణించగా.. చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు. దీంతో వీధులంతా రక్తసిక్తంగా మారాయి. ఎక్కడ చూసినా మృతదేహాలు చెల్లాచెదురుగా పడిఉన్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని వైద్యులు వెల్లడించారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.⚠️🔞 WARNING: GRAPHIC 18+ 🔞⚠️❗️🇬🇳 - At least 100 people lost their lives in violent clashes between rival fans during a football match in N'zerekore, Guinea. This tragic event, which occurred at the end of a game, resulted in hundreds of fatalities. Medical sources confirmed… pic.twitter.com/xV3COoViUE— 🔥🗞The Informant (@theinformant_x) December 2, 2024 -
భార్యకోసం బంగారు గొలుసుకొన్నాడు.. దెబ్బకి కోటీశ్వరుడయ్యాడు!
భారతీయ సంతతికి చెందిన వ్యక్తి భార్య కోసం బంగారు గొలుసు కొనుగోలు చేసి జాక్పాట్ దక్కించు కున్నాడు. ఒకటీ రెండూ కాదు ఏకంగా రూ. 8 కోట్ల లాటరీ గెల్చుకున్నాడు. ప్రస్తుతం ఈ స్టోరీ నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. ఎక్కడ? ఎలా? అని ఆసక్తిగా ఉంది కదూ? అయితే క్షణం ఆలస్యం చేయకుండా వివరాలు తెలుసుకుందాం పదండి! సింగపూర్లో భారతీయ సంతతికి చెందిన వ్యక్తి రాత్రికి రాత్రికే కోటీశ్వరుడయ్యాడు. మూడు నెలల క్రితం భార్య సంతోషం కోసం సుమారు రూ. 3 లక్షల రూపాయలతో ఒక గోల్డ్ చైన్ కొన్నాడు. ప్రతీ ఏడాది నిర్వహించే లాటరీలో భాగంగా గత ఆదివారం (నవంబర్ 24) జ్యువెలరీ కంపెనీ నిర్వహించిన లక్కీ డ్రాలో 8 కోట్ల రూపాయలకు పైగా బహుమతిని గెలుచుకున్నాడు. దీంతో కుటుంబం అంతా సంతోషంతో పొంగిపోయింది. “ఈ రోజు మా నాన్నగారి నాలుగో వర్ధంతి.. ఇది ఆయన ఆశీర్వాదం’’ అంటూ కన్నీటి పర్యంతమయ్యాడు చిదంబరం. సింగపూర్లో ఉన్న ఇన్నాళ్లకు అదృష్టం వరించిందనీ, తన తల్లితో ఈ శుభవార్త పంచుకోవాలంటూ సంతోషం వ్యక్తం చేశాడు. తనకు వచ్చిన ఈ డబ్బులో కొంత సమాజానికి విరాళంగా ఇవ్వాలని యోచిస్తున్నట్లు తెలిపాడు.ముస్తఫా జ్యువెలరీ షాపులో 250 సింగపూర్ డాలర్ల కన్నా ఎక్కువ విలువైన ఆభరణాలు కొనుగోలు చేసిన వారు లక్కీ డ్రాకి అర్హులు. ఈ లక్కీ డ్రాలో సింగపూర్లో 21 ఏళ్లుగా ప్రాజెక్ట్ ఇంజనీర్గా పనిచేస్తున్న బాలసుబ్రమణ్యం చిదంబరం టాప్ ప్రైజ్ని కైవసం చేసుకున్నట్లు ఆసియా వన్ తెలిపింది. ఈయనతోపాటు మరి కొంతమందికి కూడా భారీ బహుమతులను అందించినట్టు కంపెనీ తెలిపింది. View this post on Instagram A post shared by Mustafa Jewellery Singapore (@mustafajewellerysg) -
ఇంజనీరింగ్ అద్భుతంగా పంబన్ కొత్త బ్రిడ్జి.. ఫోటోలు వైరల్
తమిళనాడులోని రామేశ్వరంలో నిర్మిస్తున్న కొత్త పంబన్ వంతెన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. దేశంలోనే తొలి వర్టికల్ లిఫ్ట్ రైల్వే సీ బ్రిడ్జిగా రూపొందుతున్న ఈ వంతెన ఫోటోలను కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ షేర్ చేయడమే ఇందుకు కారణం. కొత్త వంతెనకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను ఎక్స్లో షేర్ చేస్తూ.. దానికి సంబంధించిన విషయాలు, విశేషాలను ఆయన పంచుకున్నారు.ఈ బ్రిడ్జి ఆధునిక ఇంజనీరింగ్ అద్భుతమని కేంద్రమంత్రి కొనియాడారు. ఈ ప్రాజెక్టు వేగం, భద్రత కోసం డిజైన్ చేసినట్లు వెల్లడించారు. ఇప్పటికే నిర్మాణం పూర్తయ్యిందని, అనేక సార్లు పరీక్షించినట్లు వెల్లడించారు. అయితే కమిషన్ ఆఫ్ రైల్వే సేఫ్టీ (CRS) ద్వారా భద్రతా తనిఖీలు నిర్వహించాల్సి ఉందని తెలిపారు. త్వరలోనే ప్రారంభించనున్నట్లు చెప్పారు.కొత్త బ్రిడ్జి ద్వారా రామేశ్వరం అభివృద్ధి చెందుతున్నారు. అమృత్ భారత్ స్టేషన్ల పథకం ద్వారా రూ. 90 కోట్ల వ్యయంతో రామేశ్వరం రైల్వే స్టేషన్ను కూడా అప్గ్రేట్ చేస్తున్నట్లు తెలిపారు. దీని ద్వారా ద్వీపానికి పర్యాటకం, వాణాజ్యం, కనెక్టివిటీ మెరుగవుతుందని తెలిపారు. అలాగే రెండు వంతెనల మధ్య ఉన్న తేడాలను వివరించారు.పాత వంతెన మధ్య నుంచి పడవలు షిప్లు వెళ్లాలంటే కష్టమయ్యేది.16 మంది కార్మికులు పని చేస్తేనే బ్రిడ్జి తెరుచుకుంటుంది.సముద్ర మట్టానికి 19 మీటర్లు ఎత్తు ఉండే బోట్లు మాత్రమే వంతెన మధ్య ప్రయాణించేవిసింగిల్ ట్రాక్ మాత్రమే ఉండేది.కొత్త బ్రిడ్జి వర్టికల్ లిఫ్ట్ స్పాన్.. పూర్తిగా ఆటోమేటెడ్.ట్రాక్ ఉన్న వంతెనను పూర్తిగా పైకి లిఫ్ట్ చేసేలా డిజైన్సముద్ర మట్టానికి 22 మీటర్లు ఎత్తు ఉండే బోట్లు, షిప్లు కూడా ప్రయాణించగలవు.డబుల్ ట్రాక్లు, విద్యుదీకరణ కోసం రూపొందించారు.హై-స్పీడ్ రైలు అనుకూలత, ఆధునిక డిజైన్.వందే ళ్లపాటు సేవలుకాగా రామేశ్వరంలోని పంబన్ ద్వీపంలో నిర్మించిన పంబన్ వంతెన గురించి అందరికీ తెలిసిందే. దీనిని 1914 ఫిబ్రవరి 24న ప్రారంభించారు. అప్పట్లో రూ.20 లక్షలతో నిర్మాణం పూర్తయింది. ఈ వంతెన న 105 ఏళ్ల పాటు రామేశ్వరం నగరాన్ని ఇతర ప్రధాన భూభాగంతో కలిపింది.ఇది దేశంలోనే తొలి సముద్ర వంతెన. అంతేగాక 2010లో బాంద్రా- వర్లీ సముద్రపు లింక్ను ప్రారంభించే వరకు దేశంలోనే అతి పొడవైన వంతెన కూడా. 2. 06 కి.మీ. పొడవైన వంతెనను 2006-07లో మీటర్గేజ్ నుంచి బ్రాడ్గేజ్కి మార్చారు. 2022లో ఈ వంతెనకు తుప్పు పట్టడంతో దీనిని పూర్తిగా మూసేశారు.దీని స్థానంలో 2019లో కొత్త వంతెన నిర్మాన్ని ప్రారంభించారు. మార్చి 2019లో ఈ కొత్త పంబన్ బ్రిడ్జికి ప్రధాని నరేంద్ర మోదీ పునాదిరాయి వేశారు. ఇది 105 ఏళ్ల నాటి పాంత వంతెనను భర్తీ చేయనుంది.🚆The New Pamban Bridge: A modern engineering marvel!🧵Know the details 👇🏻 pic.twitter.com/SQ5jCaMisO— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) November 29, 2024 -
ప్రధాని మోదీ పక్కన ‘లేడీ ఎస్పీజీ’ వైరల్ : తప్పులో కాలేసిన కంగనా
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పక్కన ఉన్న మహిళా కమాండో ఫోటో తెగ వైరల్ అవుతోంది. ముఖ్యంగా హీరోయిన్, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ ఇటీవల ఇన్స్టాగ్రామ్లో లేడీ ఎస్పీజీ అంటూ ఈ ఫోటోను షేర్ చేయడం మరింత చర్చకు దారి తీసింది. ప్రధాని భద్రతా విభాగం ఎస్పీజీలోకి కొత్తగా మహిళా కమాండో చేరిందంటూ సందడి మొదలైంది. అసలు సంగతి ఏంటంటే..బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ పార్లమెంట్ వద్ద నరేంద్రమోదీతో పక్కన బ్లాక్ డ్రెస్లో నడుస్తున్న ఒక ఫోటోను తన ఇన్స్టాగ్రామ్లో ఫోటో పోస్ట్ చేశారు. దీంతో ఆమె ప్రత్యేక శిక్షణ తీసుకున్న ఎస్పీజీ అంటూ నెట్టింట హాట్ టాపిక్గా మారింది. దీనిపై భద్రతా వర్గాలు స్పందించాయి. కొన్ని మహిళా ఎస్పీజీ కమాండోలు 'క్లోజ్ ప్రొటెక్షన్ టీమ్'లో సభ్యులుగా ఉన్నారని వెల్లడించాయి. అలాగే ఆ ఫోటోలో కనిపించిన మహిళ ఎస్పీజీ బృందంలో భాగమని అనుకోవడం తప్పు అని కూడా భద్రతా వర్గాలు స్పష్టం చేశాయి. ఆమె రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు కేటాయించిన వ్యక్తిగత భద్రతా అధికారి అని వెల్లడించాయి. అయితే సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF)లో అసిస్టెంట్ కమాండెంట్గా పనిచేస్తున్న ఈ అధికారి పేరు లేదా ఇతర వివరాలు మాత్రం వెల్లడించలేదు.కాగా భారత ప్రధానమంత్రి, మాజీ ప్రధాన మంత్రులు, వారి కుటుంబాలకు భద్రత కల్పించేందుకు స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ 1985లో ఏర్పాటైంది. ఇది అత్యున్నత ప్రొఫెషనల్ భద్రతా సంస్థ. -
ఫెంగల్ పంజా.. చూస్తుండగానే కూలిన భవనం
చెన్నై: తమిళనాడులో ఫెంగల్ తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. బుధవారం ఉదయం నుంచి ఫెంగల్ ధాటికి రాష్ట్రంలో పలు జిల్లాలు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. మైలాదుత్తురై జిల్లా కేంద్రంలోని ఓ పాత భవనం ఫెంగల్ దెబ్బకు కుప్పకూలింది. దీంతో వాతావరణ శాఖ రాష్ట్రంలోని ప్రాంతాల్లో ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. అలాగే బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఉత్తర-వాయవ్య దిశగా కదులుతూ తమిళనాడు, శ్రీలంక తీరాలవైపు పయనిస్తుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఫలితంగా రాబోయే 24గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందనే అంచనాలతో.. తమిళనాడు ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రంలోని 15 జిల్లాలలోని కాలేజీలు, స్కూళ్లకు రెండురోజుల పాటు సెలవు ప్రకటించింది.వాతావరణ శాఖ వివరాల ప్రకారం.. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ఆరు గంటలపాటు గంటకు 13 కిలోమీటర్ల వేగంతో ఉత్తర-వాయువ్య దిశగా ప్రయాణించింది. సాయంత్రం 5:30 గంటల సమయంలో త్రికోణమలీకి తూర్పు- ఆగ్నేయంగా 130 కిలోమీటర్లు నాగపట్టినానికి ఆగ్నేయంగా 400 కిలోమీటర్లు, పుదుచ్చేరికి ఆగ్నేయంగా 510 కిలోమీటర్లు, చెన్నైకి ఆగ్నేయంగా 590 కిలోమీటర్లు దూరంలో ఉన్నట్లు పేర్కొంది. VIDEO | An old house collapsed in Tamil Nadu's Mayiladuthurai due to heavy rains earlier today.(Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7)#TamilNaduRains pic.twitter.com/sYHwEFfO5W— Press Trust of India (@PTI_News) November 27, 2024 -
ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ : దేవుడా..ప్యాక్ చూసి షాక్!
ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేసినపుడు ఒకటికి బదులు ఒకటి రావడం, లేదంటే ఆహారంలో పురుగులు, సిగరెట్ పీకలు రావడం లాంటి ఘటనలు గతంలో చాలా చూశాం. తాజాగా అమెరికాలోని ఒక మహిళకు మరో వింత అనుభవం ఎదురైంది. తను ఆర్డర్ చేసిన ప్యాకేజీ ఓపెన్ చేసి, చూసి షాకయ్యింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. స్టోరీ ఏంటంటే..!న్యూజెర్సీలో డ్రైవర్గా పని చేసే ఒక మహిళ ఉబెర్ ఈట్స్నుంచి బురిటో(షావర్మా) లాంటిది ఆర్డర్ చేసింది. ఉబెర్ ఈట్స్ డెలివరీ అందుకొని ఓపెన్ చేసి, తిందామని ఏంతో ఆతృతగా ఫాయిల్ రేపర్ విప్పి ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. ఎందుకంటే అందులో బురిటోకు బదులుగా గంజాయి ప్యాక్ చేసి ఉంది. ఘటన వాషింగ్టన్ టౌన్షిప్, క్యామ్డెన్ కౌంటీలో చోటుచేసుకుంది. ప్రస్తుతం ఈ విషయంపై స్థానిక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.అయితే తన డెలివరీ ప్యాకేజీలో బురిటోకు బుదులుగా ఏదో తేడా వాసన వచ్చినట్టుగా అనిపించిందని బాధితురాలు తెలిపిందని వాషింగ్టన్ టౌన్షిప్ పోలీస్ చీఫ్ పాట్రిక్ గుర్సిక్ ఒక ప్రకటనలో తెలిపారు. అది ఒక ఔన్స్ గంజాయి అని తేలిందని ఆయన వెల్లడించారు. డ్రగ్స్, ఆల్కహాల్ లేదా మందులను రవాణాపై నిషేధం ఉన్న నేపథ్యంలో ఉబెర్ ఈట్స్లో ప్యాకేజీ డెలివరీ ఫీచర్ను ఎవరైనా ఉపయోగించుకోవడానికి ప్రయత్నించి ఉంటారని అనుమానిస్తున్నారు.ఉబెర్ ఈట్స్ స్పందనదీనిపై ఉబెర్ ఈట్స్ కూడా స్పందించింది. ఈ ఘటన తీవ్రంగా కలపర్చేదేనని ఉబెర్ ప్రతినిధి వ్యాఖ్యానించారు. స్థానిక అధికారులను వెంటనే అప్రమత్తం చేసినందుకు ఆమెను అభినందించారు. ఇలాంటి అనుమానాస్పద డెలివరీలపై వెంటనే రిపోర్ట్ చేయాలని ఇతర డ్రైవర్లను కూడా కోరారు.ఇదీ చదవండి : వయసు 28, తులసి పంట రారాజు ఫిలిప్పో సక్సెస్ స్టోరీ, ఆదాయం ఎంతో తెలుసా? -
యాక్షన్-ప్యాక్డ్ థ్రిల్లర్ని తలపిస్తూ..కొత్త పెళ్లికొడుకు సాహసం, వైరల్ వీడియో
కాబోయే భార్యను తలచుకుంటూ ముసి ముసి నవ్వులతో పెళ్లి కొడుకు దేవ్ కుమార్ గుర్రమెక్కి పెళ్లి మంటపానికి బందు మిత్ర సపరివారంగా తరలి వెళ్లాడు. బాజా భజంత్రీల సమక్షంలో అమ్మాయి మెడలో మూడు ముళ్లు వేశాడు. కొత్తభార్యతో ఆనందంగా ఇంటికి బయలుదేరాడు. మెడలో మెరిసిపోతున్న కరెన్సీ మాలను చూసుకుంటున్నాడు. ఇంతలో ఎక్కడనుంచి వచ్చాడో తెలియదు ఆగంతకుడు. పెళ్లి కొడుకు మెడలోని కరెన్సీ దండలోని 100 రూపాయలనోటను అమాంతం ఎగరేసుకుపోయాడు ఘొక మినీ ట్రక్ డ్రైవర్ కాజేశాడు. ఒక్క క్షణం బిత్తరపోయినా, వెంటనే తేరుకుని అత్యత సాహసంగా అతణ్ణి వెంబడించి పట్టుకున్నాడు. బాలీవుడ్ బ్లాక్బస్టర్ యాక్షన్-ప్యాక్డ్ థ్రిల్లర్గా సాగిన ఈ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.పియూష్ రాయ్ అనే జర్నలిస్టు ఈ వీడియోను ఎక్స్లో పోస్ట్ చేశారు. దీని ప్రకారం. తన మెడలోని నోట్ల దండను ట్రక్ డ్రైవర్ కొట్టేయడంతో వెంటనే అప్రమత్తమైన వరుడు పెళ్లీ, గిళ్లీ తరువాత చూద్దాం అనుకున్నాడో ఏమో గానీ, నగదు దండను చోరీ చేసిన డ్రైవర్ను పట్టుకునేందుకు రంగంలోకి దిగిపోయాడు. హైవేపై ట్రక్ను వెంబడించాడు. అత్యంత సాహసంతో స్టంట్మ్యాన్లాగా ట్రక్పైకి దూకాడు. చాకచక్యంగా క్యాబిన్లోకి ప్రవేశించి అతగాడిని దొరకబుచ్చుకున్నాడు. నాలుగు తగిలించాడు. ఇంతులో అతని వెనకాలే ఫాలో అయిన స్నేహితులు, చుట్టుపక్కల వాళ్లు కూడా తోడయ్యాడు. దీంతో పొరపాటు జరిగిందని వదిలేయాలంటూ లబోదిబో మన్నాడు. దీంతో దేవ్ కుమార్ హీరోగా అయిపోయాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని మీరట్లో జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు పన్నీ కామెంట్లను షేర్ చేశారు. దెబ్బకి పెళ్లి కూతురు ఫిదా అని ఒకరు, కొత్త పెళ్లి కూతురు స్పైడర్ మాన్ స్పైడర్ మాన్ నా మనసు దోచేశావ్ అని పాడుకుంటుందేమో అని మరికొందరు వ్యాఖ్యానించారు. మరోవైపు పెళ్లి రాత్రిని తప్పించుకోవడానికి వరుడు ఇలా ప్లాన్ చేసి ఉంటాడని కొందరు, ఇంత చేసినా అమ్మాయి ఇంప్రెస్ అవుతుందా అని ఇంకొందరు ఫన్నీగా కమెంట్ చేశారు. <Video of the year! In UP's Meerut, groom Dev Kumar was happily getting home after the wedding when a pick up driver pinched a note from his currency tucked garland. What followed was a near Bollywood, daring chase for justice! Groom Dev Kumar asked for lift from a motorist,… pic.twitter.com/libIH8PRTT— Piyush Rai (@Benarasiyaa) November 25, 2024రవాణా సంస్థ ప్రకటనట్రక్ స్థానిక రవాణా సంస్థకు చెందినది, దీని యజమాని మనీష్ సెహగల్ ఈ సంఘటనపై భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ట్రక్ డ్రైవర్ దొంగ కాదని, దొంగతనంతో అతనికి ఎటువంటి సంబంధం లేదని వాదించారు. అతని వాహనానికి వ్యతికేంగా వేగంగా దూసుకురావడం వల్లే పెళ్లి ఇలా చేశాడని ఆరోపించారు. ఎలాంటి సంబంధం లేనప్పటికీ వరుడు , అతని స్నేహితులు డ్రైవర్పై దాడి చేశారని సెహగల్ ఆరోపించారు. దీంతో ఏం జరిగిందో స్పష్టత లేక బుర్ర గోక్కుంటున్నారట స్థానిక పోలీసులు. ప్రస్తుతానికి ఈ వ్యవహారంపై ఎలాంటి కేసు నమోదు కాలేదు. -
న్యూయార్క్ వీధుల్లో మంచు లక్ష్మి చిల్.. బ్లూ శారీలో మేఘా ఆకాశ్!
సికిందర్ కా ముఖద్దర్ మూడ్లో తమన్నా భాటియా...బుల్లితెర భామ మౌనీ రాయ్ స్టన్నింగ్ లుక్స్..న్యూయార్క్ వీధుల్లో మంచు లక్ష్మి పోజులు..పుష్ప 2 డబ్బింగ్ పూర్తి చేసుకున్న బిగ్బాస్ దివి..కోట్ డ్రెస్లో బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా...బ్లూ శారీలో మేఘా ఆకాశ్ హోయలు.. View this post on Instagram A post shared by Digangana Suryavanshi (@diganganasuryavanshi) View this post on Instagram A post shared by URVASHI RAUTELA (@urvashirautela) View this post on Instagram A post shared by Divi (@actordivi) View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) View this post on Instagram A post shared by Megha Akash (@meghaakash) View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) View this post on Instagram A post shared by mon (@imouniroy) -
మంటల్లో విమానం.. 89 మందిని సినీ ఫక్కీలో రక్షించిన సిబ్బంది
టర్కీలో ఘోర విమాన ప్రమాదం తప్పింది. రష్యా నుంచి వచ్చిన ఓ ప్యాసింజర్ ప్లేన్కు మంటలు అంటుకున్నాయి. అయితే.. ఎయిర్పోర్ట్ సిబ్బంది అప్రమత్తతో ప్రయాణికులు, విమాన సిబ్బంది మొత్తం అందరూ సురక్షితంగా బయటపడ్డారు.అజిముత్ ఎయిర్లైన్స్కు చెందిన సుఖోయ్ సూపర్ జెట్ విమానం(రష్యా).. నల్ల సముద్రం తీరాన ఉన్న సోచి రిసార్ట్ నుంచి ప్రయాణికులను తీసుకుని టర్కీ అంటల్యా ఎయిర్పోర్టుకు చేరింది. అయితే ల్యాండ్ అయ్యే సమయంలో ఇంజిన్లో మంటలు చెలరేగి.. క్రమంగా విమానానికి వ్యాపించాయి.విమానంలో 89 మంది ప్రయాణికులతో పాటు ఆరుగురు సిబ్బంది ఉన్నారు. వెంటనే పైలట్ విమానాన్ని రన్వేపై ర్యాష్ ల్యాడింగ్ చేశాడు. అయితే సకాలంలో ఎయిర్పోర్ట్ సిబ్బంది స్పందించారు. సినీ ఫక్కీలో రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు. విమానం నుంచి అందరినీ బయటకు రప్పించారు. మంటలను ఆర్పేశారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సదరు విమానం ఏడేళ్ల కిందటే సర్వీస్లోకి వచ్చిందని, అలాగే ఈ ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు జరుపుతున్నట్లు విమానయాన సంస్థ ప్రకటించింది. This was the terrifying moment a plane the #Russian-made #Sukhoi Superjet 100 passenger plane from #AzimuthAirlines went up in flames following a nightmare landing at a #Turkish #Antalya airport. pic.twitter.com/QY3EmzdQBY— Hans Solo (@thandojo) November 25, 2024 -
‘సింగిల్ బల్బుకు రూ.86 లక్షల బిల్లు!’
అతనిది సింగిల్ రూమ్ షెటర్లో టైలరింగ్ షాపు. ప్యాంట్లు, చొక్కాలతో పాటు షేర్వాణీలు కుడుతుంటాడు. నెల నెలా కరెంట్ బిల్లును ఫోన్ పేలో కడుతుంటాడు. ఉన్న సింగిల్ బల్బ్కు నెలలో రోజంతా కరెంట్ వాడినా.. నెలకు రూ.2 వేలు రావడం కూడా కష్టమే. అయితే ఈ నెల బిల్లు చూడగానే.. గుండె ఆగినంత పనైందట అతనికి. ఏకంగా 86 లక్షల బిల్లు వచ్చింది.గుజరాత్ వల్సద్కు చెందిన అన్సారీ.. తన మామతో కలిసి టేలర్ షాప్ నడుపుతున్నాడు. కరెంట్ బిల్లు నెల నెల ఫోన్ పేలో కడుతుంటాడు. అయితే ఈ నెల బిల్లు చూసి అతని కళ్లు బయర్లు కమ్మాయట. ఏకంగా 86 లక్షల బిల్లు రావడంతో.. ఎలక్ట్రిసిటీ బోర్డుకు పరుగులు తీశాడు. ఆ వెంటనే డిస్కం సిబ్బంది సైతం అంతే వేగంగా అతని షాపు మీటర్ను పరిశీలించారు. అయితే..వల్సద్లో ఇతని దుకాణం ఉన్న ఏరియాకు దక్షిణ్ గుజరాత్ విజ్ కంపెనీ లిమిటెడ్ నుంచి పవర్ సప్లై జరుగుతుంది. ఈ పరిధిలో గుజరాత్ ఏడు జిల్లాల నుంచి 32 లక్షల మంది ఉన్నారు. ఇతని షాప్ మీటర్లో రెండు డిజిట్స్ పొరపాటున ఎక్కువ యాడ్ అయ్యాయట. అలా.. అతనికి అంతలా బిల్లు వచ్చిందని సిబ్బంది గుర్తించారు.వెంటనే సిబ్బంది తమ తప్పును సరిదిద్దుకుని.. రివైజ్ బిల్లును అన్సారీ చేతిలో పెట్టారు. అందులో రూ.1,540 మాత్రమే ఉంది. దీంతో హమ్మాయ్యా అనుకున్నాడా టైలర్. అయితే బిల్లు సంగతి ఏమోగానీ.. ఆ నోటా ఈ నోటా పాకి ఇప్పుడతని టైలర్ షాప్కు సెల్ఫీల కోసం జనం క్యూ కడుతున్నారట. దీంతో అన్సారీ హ్యాపీగా ఫీలవుతున్నాడు.86 લાખનું અધધ બિલ... વલસાડમાં વીજ વિભાગની બેદરકારીથી દરજીની દુકાનમાં મસમોટું લાઇટ બિલ આવ્યું#ligthbill #valsad #gujarat #viralvideo #trendingvideo pic.twitter.com/nEOdfr2g6G— Zee 24 Kalak (@Zee24Kalak) November 25, 2024 Video Credits: Zee 24 Kalakఇదీ చదవండి: గత 75 ఏళ్లుగా ఫ్రీ టిక్కెట్ సర్వీస్ అందిస్తున్న ఏకైక రైలు ఇదే..! -
అంతగనం ఏముంది అనుకోకండి : కోటి దిశగా దూసుకుపోతోంది!
సోషల్ మీడియాలో ఏది సంచలనంగా మారుతుందో.. ఏది వైరల్గా మారుతుంది ఊహించలేం. తాజాగా అలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.నైజీరియాకు కెందిన వైవన్నే అనే యూజర్ ఒక వీడియోను ఎక్స్లో పోస్ట్ చేశారు. ది బ్యూటిఫుల్ రెస్క్యూ టీం అనే క్యాప్షన్తో పోస్ట్ అయిన ఈ వీడియో నెటిజనులకు బాగా నచ్చేసింది. రీట్వీట్లు, లైక్ల వర్షం కురుస్తోంది. సూపర్.. క్యూట్ అంటూ కమెంట్లు వెల్లువెత్తాయి. ఇప్పటికే ఇది 90 లక్షలకు పైగా వ్యూస్ను దక్కించుకుంది.ఇంతకీ ఈ వీడియోలో ఏముంది అంటే...మీరే చూసేయండి!That was a beautiful rescue team😁🥰 pic.twitter.com/75AZNcFi64— Yvonne (@Yummy_yvy) November 24, 2024 -
వాట్ ఏ ఆఫర్: డ్యాన్స్ చెయ్యి..కాఫీ తాగు..!
కొన్ని కేఫ్లు ప్రజలను సంతోష పెట్టేలా మంచి ఆఫర్లు అందిస్తాయి. అవి వినడానికి చూడటానికి చాలా వింతగా ఉంటాయి. కానీ ఈ కేఫ్ ఇచ్చిన ఆఫర్ మాత్రం సంతోషం తోపాటు మంచి రుచిని కూడా ఆస్వాదించేలా చేస్తుంది. ప్రస్తుతం ఈ ఆఫర్ నెట్టింట తెగ వైరల్గా మారింది. యూఎస్లోని కేఫ్లోకి డ్యాన్స్ చేస్తూ.. ఎంటర్ అయ్యితే చాలు మంచి రుచికరమైన ఓ కప్పు కాఫీని సిప్ చెయ్యొచ్చు అంటూ కస్టమర్లకు మంచి ఆఫర్ ఇచ్చింది. అంతే జనాలంతా తమ టాలెంట్ని వెలికి తీసి మరీ మంచి మంచి స్టెప్పులతో అలరించారు. వృద్ధులు సైతం ఈ ఆఫర్ కోసం ఎగబడ్డారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. నెలకోసారైనా..ఈ ఫన్ ఇనిషియేటివ్ని అందివ్వాలని కేఫ్ ఓనర్ ప్లాన్ చేస్తున్నారట. ఇలా ఉదారంగా ఆలోచించే కేఫ్లు దొరకడం అత్యంత అరుదు. View this post on Instagram A post shared by Hope Rises (@hoperisesnetwork) (చదవండి: నాడు బెదిరింపులు, నిషేధానికి గురైన అమ్మాయి..నేడు ప్రపంచమే..!) -
Video: పెళ్లి ఊరేగింపులో బంధువుల రచ్చ.. గాల్లోకి 20 లక్షలు జల్లుతూ
పెళ్లి.. ప్రతి ఒక్కరి జీవితంలో ఓ గొప్ప మలుపు. సంప్రదాయంతో ఒక్కటయ్యే మధురమైన వేడుక. పెళ్లిని ఎవరైనా జీవితంలో గుర్తిండిపోయేలా చేసుకోవాలనుకుంటారు. అతిథులందరి సమక్షంలో గ్రాండ్గా జరుపుకుంటారు. అయితే ఒక చోట మాత్రం కొందరు పెళ్లి ఊరేగింపులో హల్చల్ చేసి వివాదంలో చిక్కుకున్నారు. గాల్లోకి ఏకంగా లక్షలు వెదజల్లారు. ఈఘటన ఉత్తర ప్రదేశ్లోని సిద్ధార్థనగర్లో వెలుగుచూసింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్గా మారింది.అఫ్జల్, అర్మాన్ వివాహాం జరిగిన అనంతరం ఊరేగింపు నిర్వహించారు. అంత సవ్యంగా సాగుతుండగా.. వరుడు, వధువు పక్కన ఉన్న బంధువులు ఒక్కసారికి గాలిలోకి డబ్బులు విసిరారు. చుట్టుపక్కలా ఉన్న ఇళ్లపై, జేసీబీలపై నిలబడి నోట్ల కట్టలను గాల్లోకి జల్లారు. రూ. 100, 200, 500 నోట్ల కట్టలను గాలిలోకి విసిరారు.దీంతో గాల్లో ఎగురుతున్న నోట్లను స్థానికులు పట్టుకునేందుకు ఎగబడ్డారు. గాలిలో దాదాపు రూ. 20 లక్షలు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఈ వీడియో వైరల్ అవ్వడంతో.. నెటిజన్ల నుంచి భిన్న స్పందనలు వస్తున్నాయి. కొంతమంది నెటిజన్లు డబ్బును అవసరమైన వారికి పంచాలని సూచించారు., మరికొందరు ఆదాయపు పన్ను కార్యాలయానికి కాల్ చేసి దీనిపై ఫిర్యాదు చేయాలని చెప్పారు. ఇంత డబ్బుతో నలుగురు పేద అమ్మాయిలకు పెళ్లిళ్లు చేసి ఉండేవారని మరొకరు వ్యాఖ్యానించారు. అయితే దీనిపై ఇంకా పోలీసులు స్పందించలేదు. View this post on Instagram A post shared by 𓂀 𝔹𝕒𝕣𝕖𝕚𝕝𝕝𝕪_𝕛𝕙𝕦𝕞𝕜𝕒𝕔𝕚𝕥𝕪𝟘𝟘𝟙 𓂀 (@bareilly_jhumkacity001) -
తల్లీ.. నీకు సెల్యూట్!
నాడు ఝాన్సీ లక్ష్మీబాయి తన దత్త పుత్రుడిని వీపుకు కట్టుకుని జవనాశ్వాన్ని దౌడు తీయిస్తూ బ్రిటిష్ వారిపై కత్తి ఝళిపిస్తే, నేడు ఈ రాజ్కోట్ యువతి తన బిడ్డను మోటార్ బైక్ పైన కూర్చోబెట్టుకుని, వీపుకు బ్యాగు తగిలించుకుని, డెలివరీ ఏజెంట్గా జీవన పోరాటం సాగిస్తోంది! ఈ దృశ్యాన్ని చూసిన ‘విష్విద్’ అనే ఇన్ స్టాగ్రామ్ యూజర్ ఆమెను వీడియో తీసి, బ్యాక్గ్రౌండ్లో కత్తి పట్టిన ఝాన్సీరాణిని ఆమెకు జత కలిపి పెట్టిన పోస్ట్కు ఇప్పటివరకు 9 లక్షలకు పైగా లైకులు వచ్చాయి. నెటిజెన్ లు తమ కామెంట్లలో ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు.‘‘బైక్ నడుపుతున్నావ్.. బద్రం సిస్టర్’’ అని జాగ్రత్తలు చెబుతున్నారు. హెల్మెట్ పెట్టుకోవాలని కొందరు సూచిస్తున్నారు. కాళ్లకు చెప్పులు తొడుక్కోవాలని మరికొందరు కోరుతున్నారు. ఈ యువతి గత నెల రోజులుగా డెలివరీ ఏజెంటుగా పని చేస్తోంది. ఇన్ స్టాలో వెల్లడైన వివరాలను బట్టి.. ఈమె హోటల్ మేనేజ్మెంట్ కోర్సు చేసింది. పెళ్లయ్యాక, ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉద్యోగం రాలేదు. ఇక ఇప్పుడైతే.. ‘‘బిడ్డ తల్లివి కదా.. ఉద్యోగం ఎలా చేస్తావ్?’’ అని అడుగుతున్న వారే ఎక్కువమంది! చివరికి డెలివరీ ఏజెంట్ ఉద్యోగాన్ని ఎంచుకుని, తనతోపాటు కొడుకునూ వెంట బెట్టుకుని ధైర్యంగా జీవనయానం సాగిస్తోంది. -
మంచు కురిసిన వేళ: కశ్మీర్ సొగసు చూడ తరమా!
శీతాకాలం మంచు అనగానే ఇండియాలో తొలుతగా గుర్తొచ్చే ప్రదేశం జమ్ము కశ్మీర్. రాష్ట్రంలో లోని పలు ప్రాంతాల్లో మంచు విపరీతంగా కురుస్తోంది. దీనికి సంబంధించిన వీడియోలు, దృశ్యాలు సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతున్నాయి. #WATCH | J&K: Upper reaches of Bandipora, including border areas of Gurez, Tulail & Kanzalwan, covered under a white sheet of snow as snowfall continues in the region. pic.twitter.com/UL23aw4xwX— ANI (@ANI) November 16, 2024 కాశ్మీర్లోని పర్యాటక ప్రాంతం, స్కీయింగ్కు ప్రసిద్ధి చెందిన గుల్మార్గ్లో శనివారం తొలి మంచు ప్రవాహమై మెరిసింది. ఇంకా కుప్వారా జిల్లా , బందిపొరా జిల్లా, గురెజ్ , కంజల్వాన్ తదితర ప్రాంతాల్లో కూడా భారీగా మంచు కురుస్తోంద. కొండలపై ఎటు చూసిన వెండి వెన్నలలా మంచుకురుస్తున్న దృశ్యాలు ఆకట్టుకుంటున్నాయి. కాశ్మీర్లోని ఎగువ ప్రాంతాల్లోని కొన్ని ప్రాంతాల్లో శుక్రవారం తేలికపాటి మంచు కురుస్తుందని, మైదాన ప్రాంతాల్లో కొన్ని చోట్ల వర్షం కురిసిందని అధికారులు ఇక్కడ తెలిపారు. కొన్ని చోట్ల తేలికపాటి వర్షం లేదా మంచు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది . Snowing heavily over Sonamarg, almost 1-2 inches snowfall accumulated in the area. pic.twitter.com/RTAGuMPGaP— Kashmir Weather Forecast (@KashmirForecast) November 16, 2024 -
దోస ప్రింటింగ్ మెషీన్ : వైరల్ వీడియో
‘దోసెలందు డెస్క్టాప్ దోసెలు వేరయా’ అని ఎవరూ అనలేదు కానీ ఈ మనసు దోచే దోసెను చూస్తే మాత్రం అనక తప్పదు. పట్నాలోని పూల్బాగ్ పట్న కాలేజి’కి ముందు ఉన్న చిన్న హోటల్ యజమాని తయారుచేసే ‘దోశ’‘హార్ట్’ టాపిక్గా మారింది. దీనికి కారణం ఆ దోసెను ప్రింటింగ్ మెషీన్తో తయారు చేయడం! ఈ ‘యంత్ర దోశ’ను చూసి ఆశ్చర్యపడి, అబ్బురపడి‘ఎక్స్’లో ‘22వ శతాబ్దం ఆవిష్కరణ’ కాప్షన్తో మోహిని అనే యూజర్ పోస్ట్ చేశారు. ఇది చూసి ముగ్ధుడై ముచ్చటపడిన పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా ‘ది డెస్క్ టాప్ దోశ’ అనే కాప్షన్స్తో ఈ వీడియోను రీపోస్ట్ చేశారు.ఇంతకూ ఆ వీడియోలో ఏముంది?’ అనే విషయానికి వస్తే... సదరు హోటల్ యజమాని మెషిన్లోని ఐరన్ ప్లేట్పై రుబ్బిన పిండి పోసిన వెంటనే ఇటు నుంచి ఒక రోలర్ వచ్చి ‘దోశ’ ఆకారాన్ని సెట్ చేస్తుంది. దీనిపై తగిన దినుసులు వేయగానే అటు నుంచి రోలర్ వచ్చి రోల్ చేస్తుంది. నిమిషాల వ్యవధిలో ‘ఆహా’ అనిపించేలా దోశను అందిస్తుంది.The Desktop Dosa… https://t.co/gw6EHw3QZ7— anand mahindra (@anandmahindra) November 14, 2024 ఇక సోషల్ మీడియావాసుల రెస్పాన్స్ చూస్తే.... ‘భవిష్యత్తులో ఈ దోసె మెషిన్ ఆహార పరిశ్రమలో విప్లవాత్మక మార్పులు తీసుకురాగలదు’ అన్నారు చాలామంది. కొద్దిమంది మాత్రం... ‘చాల్లేండి సంబడం. ఎంతైనా దోసెకు మనిషి స్పర్శ ఉండాల్సిందే. మనిషి చేసిన దానితో ఇలాంటి యంత్ర దోసెలు సరితూగవు’ అని తూలనాడారు. లోకో భిన్న‘రుచిః’!‘ఇంతకీ ఈ మెషిన్ ఎలా పనిచేస్తుంది..’ అనేది చాలామందికి ఆసక్తి కలిగించే విషయం. ఆ రహçస్యం గురించి అడిగితే... ‘అమ్మా.... ఆశ దోశ అప్పడం వడ... నేను చెప్పనుగాక చెప్పను’ అంటాడో లేక ‘ఇది నా ట్రేడ్ సీక్రెట్టేమీ కాదు. అందరూ బేషుగ్గా చేసుకోవచ్చు’ అని చెబుతాడో... వేచి చూడాల్సిందే. -
Video: ప్రధాని మోదీ కాళ్లు మొక్కబోయిన నితీష్ కుమార్..
పాట్నా: బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తన అనూహ్య ప్రవర్తనతో మరోసారి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. దర్భంగాలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ కాళ్లను నమస్కరించేందుకు నితీష్ కుమార్ ప్రయత్నించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.బిహార్లోని దర్భంగా ప్రాంతంలో ఎయిమ్స్కు ప్రధాని మోదీ శంకుస్థాపన చేసి, రూ.12,100 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం నితీష్ కుమార్.. ప్రధాని మోదీ వైపు నడుస్తూ రెండు చేతులు జోడించి నమస్కరించారు. అనంతరం వెంటనే మోదీ పాదాలను తాకేందుకు ప్రయత్నించారు. గమనించిన ప్రధాని.. తన పాదాలను తాకకుండా సీఎంను ఆపారు. నితీష్కు కరచాలనం అందించారు.అయితే మోదీ పాదాలను నితీష్ తాకడం ఇదేం తొలిసారి కాదు. గత జూన్లో పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ప్రధాని కాళ్లకు నమస్కరించేందుకు ఆయన ప్రయత్నించారు. అంతకముందు ఏప్రిల్లోనూ నవాడాలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో నితీష్ కుమార్.. మోదీ కాళ్లను ముట్టుకున్నారు.చదవండి: ఎన్నికల వేళ.. అజిత్ పవార్ ఎన్సీపీకి సుప్రీంకోర్టు చీవాట్లుBihar CM Nitish Kumar attempts to touch PM Modi's feet again, showing a growing bond between the leaders. #NarendraModi #Bihar #NitishKumar #BreakingNewsFollow @DigitalUpdateIN pic.twitter.com/kOopns9ZrY— Digital Update India 🇮🇳 (@DigitalUpdateIN) November 13, 2024 -
డ్రీమ్ జాబ్స్ అంటే ఇలా ఉంటాయా? వైరల్ వీడియో
నోట్లోకి నాలుగు వేళ్లు వెళ్లేందుకు ఏదో ఒక పని దొరికితే చాలు.. ఇది సగటు మానవుని ఆరాటం. అర్హతకు తగ్గ ఉద్యోగం రావాలి? కుటుంబాన్ని పోషించుకోవాలి. ఆ తరువాత ఉండటానికి చిన్న ఇల్లు కొనుక్కోవాలి ఇది కొంతమంది ఆశ.పే..ద్ద హోదా ఉన్న ఉద్యోగం కావాలి. నెలకు ఇదెంకల జీతం, బంగ్లా..కారు.. ఎక్స్ట్రా.. ఇది మరికొంతమంది డ్రీమ్ జాబ్. మరి ఇస్త్రీ మడత నలగకుండా, ఒళ్లుఅలవకుండా, చెమట పట్టకుండా ఉండే జాబ్ కావాలి? ఇలా ఆలోచించే జీవులు చాలామందే ఉన్నారు. సరిగ్గా ఇలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. డ్రీమ్ జాబ్స్.. అంటూ సీసీటీవీ ఇడియట్స్ అనే ట్విటర్ ఖాతా ఒక ఫన్నీ వీడియోను షేర్ చేసింది. అదేంటో మీరు కూడా చూడండి. అన్నట్టు ఇలాంటి ఉద్యోగాలు నిజంగా డ్రీమ్ జాబ్సేనా? కొన్నాళ్లకు బోర్ కొట్టదూ? ఏమంటారు? Dream jobs! 😂😂 pic.twitter.com/jfsNGwI0H7— CCTV IDIOTS (@cctvidiots) November 11, 2024 -
కీరవాణిగారూ.. ఒక్క ఛాన్స్ ప్లీజ్: ఆర్టీసీ ఎండీ సజ్జనార్
తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సోషల్ మీడియాలో ఎపుడూ యాక్టివ్గా ఉంటారు. కేవలం ఆర్టిసీ సంస్థ,ఉద్యోగులు, సంక్షేమం, సమస్యలు ఇవి మాత్రమే కాకుండా, అనేక సామాజిక అంశాలపై కూడాపలు ఆసక్తికర విషయాలను ఎక్స్లో పోస్ట్ చేస్తూ ఉంటారు. తాజాగా సజ్జనార్ పోస్ట్ చేసిన వీడియో ఒకటి నెట్టింట విశేషంగా నిలిచింది.ఒక దివ్యాంగుడు (అంధుడు) ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తూ 'శ్రీ ఆంజనేయం' సినిమాలోని 'రామ రామ రఘురామ' అనే పాటను అద్భుతంగా ఆలపించిన వీడియోను ఆర్టీసీ ఎండీ ఎక్స్లో షేర్ చేశారు. అతన్ని ప్రశంసిస్తూ ఇలా ట్వీట్ చేశారు. 'మనం చూడాలే కానీ ఇలాంటి మట్టిలో మాణిక్యాలు ఎన్నో. ఈ దివ్యాంగుడు అద్భుతంగా పాడారు కదా ఒక అవకాశం ఇచ్చి చూడండి సర్' అంటూ సినీగేయ రచయిత, సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణిని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. మరి దీనిపై కీరవాణి ఎలా స్పందిస్తారో చూడాలి.అద్భుతమైన గొంతుతో ఆ పాటను పాడడమే కాకుండా చేతితో, తాళం వేస్తూ లయబద్దంగా పాడటం ఆకట్టుకుంటోంది. అటు ఆ యువకుడి ప్రతిభకు నెటిజన్లు ముగ్ధులైపోయారు. నిజంగానే మట్టిలో మాణిక్యం అంటూ ప్రశించారు. ఇలాంటి వారికి అవకాశం ఇచ్చి ప్రోత్సాహాన్నివ్వాలని కోరారు.మనం చూడాలే కానీ.. ఇలాంటి మట్టిలో మాణిక్యాలు ఎన్నో..!ఈ అంధ యువకుడు అద్భుతంగా పాడారు కదా..! ఒక అవకాశం ఇచ్చి చూడండి @mmkeeravaani సర్.@tgsrtcmdoffice @TGSRTCHQ @PROTGSRTC pic.twitter.com/qu25lXVzXS— V.C. Sajjanar, IPS (@SajjanarVC) November 10, 2024 -
పదేళ్లలో భారత్ను విడిచిపెట్టినవారు ఇంతమందా?.. కారణం ఇదేనా..
2014 తర్వాత.. ఈ పదేళ్లలో దేశాన్ని విడిచిపెట్టిన వారి సంఖ్యలో 67శాతం పెరుగుదల నమోదైంది. 2014లో మోదీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చిన నాటి రోజులను గుర్తు చేసుకుందాం. పాలన చేపట్టిన కొన్నాళ్లకే మోదీ ఓ పథకాన్ని తీసుకొచ్చారు.. అదే మేక్ ఇన్ ఇండియా..! భారత్ను ప్రపంచంలో టాప్ మాన్యుఫాక్చరింగ్ సెంటర్గా మార్చాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని ప్రారంభించారు. అయితే సీన్ కట్ చేస్తే.. ఈ పథకం ఆశించిన స్థాయిలో హిట్ కాలేకపోయిందని నిపుణులు చెబుతున్నారు. అందుకే ఇండియన్స్ భారీగా భారత్ను విడిచి వెళ్తున్నారని.. పెట్టుబడులు కూడా ఇతర దేశాల్లో ఎక్కువగా పెడుతున్నారని లెక్కలు స్పష్టం చేస్తున్నాయి.చాలా మంది భారతీయులు.. ముఖ్యంగా బడా పెట్టుబడిదారులు, వ్యాపారవేత్తలు ఇండియాలో కాకుండా విదేశాలలో అవకాశాలను సృష్టించుకుంటున్నారు. ఇటీవల భారత పౌరసత్వం విడిచిపెట్టిన వారి సంఖ్య కూడా బాగా పెరిగింది. 2022లో 2 లక్షల 25 వేల మంది భారతీయులు తమ పౌరసత్వాన్ని వదిలేశారు. వీరంతా ఎక్కువగా అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా లాంటి దేశాలకు వెళ్లారు. అక్కడ ఉద్యోగ అవకాశాలతో పాటు క్వాలిటీ ఆఫ్ లైఫ్ వీరిని ఎక్కువగా ఆకర్షించింది.విదేశాల్లో పెట్టుబడులు పెట్టడానికి కారణాలుమరోవైపు భారతీయులు విదేశాల్లో పెట్టుబడులు పెడుతుండడానికి అనేక కారణాలు కనిపిస్తున్నాయి. భారత్లో పన్ను వసూలు ఎక్కువ. దీని కారణంగా ఇండియాలో వ్యాపారం చేయడం కష్టంతో పాటు నష్టంతో కూడుకున్న విషయమని చాలామంది వ్యాపారవేత్తలు భావిస్తున్నారు. అటు వైద్య సేవలు, విద్య, భద్రత లాంటి అంశాల కోసం జీవన ప్రమాణాలు మెరుగ్గా ఉన్న దేశాలకు వలస వెళ్లే వారి సంఖ్య కూడా అంతకంతకూ పెరుగుతోంది. ఇక కొన్ని దేశాలు నైపుణ్యం కలిగిన వ్యక్తులకు, పెట్టుబడిదారులకు ప్రత్యేక ప్రయోజనాలు అందిస్తున్నాయి. కొన్ని యూరప్ దేశాలు, కరేబియన్ దేశాలు పెట్టుబడుల ద్వారా పౌరసత్వం లేదా రెసిడెన్సీ ఇవ్వడం లాంటి ప్రోగ్రామ్లను నిర్వహిస్తున్నాయి. దీంతో మార్కెట్ రిస్క్ ఎందుకని.. ఇతర దేశాల్లో పెట్టుబడులు పెడితే బెటర్ అని చాలామంది భారతీయులు భావిస్తున్నారు...!భారతీయులు ఇతర దేశాల్లో పెట్టుబడులు భారీగా పెడుతుండడానికి పదేళ్ల నుంచి కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలు కూడా ఒక కారణంగా విశ్లేషకులు అభిప్రాయడపతున్నారు. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్న కొన్ని ఆర్థిక విధానాలు, దేశీయ పెట్టుబడిదారులకు భయాన్ని కలిగించాయి. ఉదాహరణకు.. డీమానిటైజేషన్.. అంటే నోట్ల రద్దు లాంటి నిర్ణయాలు ఆర్థిక సంక్షోభానికి దారితీశాయన్నది నిపుణుల మాట. 2016లో నోట్ల రద్దు తర్వాత బడా వ్యాపారులు తమ పెట్టుబడులను ఇండియాలో ఉపసంహరించుకున్నారు. అటు నోట్ల రద్దు తర్వాత, చిన్న వ్యాపారాలు MSME సంస్థలు భారీ నష్టాల పాలయ్యాయి. ఆ తర్వాత దేశీయ పెట్టుబడులు క్రమంగా తగ్గాయి.వ్యాపారుల కష్టాలను పెంచిన జీఎస్టీమరోవైపు 2017లో కేంద్రం తీసుకొచ్చిన జీఎస్టీ విధానం కూడా వ్యాపారుల కష్టాలను పెంచింది. జీఎస్టీ అమలు తర్వాత వ్యాపార ఖర్చులు పెరిగాయి. దీంతో భారత్లో పెట్టుబడులు పెట్టేందుకు వ్యాపారులు ఆసక్తి చూపడం తగ్గిపోయింది. ఇక 2014 తర్వాత దేశంలో ఉపాధి అవకాశాలు తగ్గుముఖం పట్టాయి. ప్రతి సంవత్సరం లక్షలాది మంది యువతులు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ఇండియాలో తగినంత అవకాశాలు లేకపోవడంతో యువత ఎక్కువగా విదేశాలకు వలసపోయే పరిస్థితి ఏర్పడింది. దీంతో వారు అక్కడే పెట్టుబడులు కూడా పెట్టుకుంటున్నారు. 2014 నుంచి 2020 వరకు దేశీయ ఉపాధి రేటు కేవలం 3-4శాతం మాత్రమే ఉంది.ఇదీ చదవండి: ఈ లింక్ క్లిక్ చేస్తే మీ డబ్బు డబుల్!.. ఇవి నమ్మారో..పెట్టుబడిదారులకు శాపంగా పన్నులుదేశంలో పెరిగిన పన్నులు పెట్టుబడిదారులకు శాపంగా మారాయి. ఫ్లిప్కార్ట్ లాంటి భారతీయ కంపెనీలు కూడా విదేశాలలో పెట్టుబడులు పెంచడం ప్రారంభించాయి. అటు భారత్ రూపాయి విలువ అంతర్జాతీయంగా తగ్గిపోవడం కూడా పెట్టుబడిదారులపై ప్రభావం చూపింది. రూపాయి విలువ 2014లో డాలర్కి 60 రూపాయల వద్ద ఉంటే ఇప్పుడది 80 దాటేసింది. ఇలా మేకిన్ ఇన్ ఇండియా ఫెయిల్యూర్, పన్నులు, నోట్ల రద్దు, జీఎస్టీ, రూపాయి బలహీనత లాంటి అంశాలు భారత్ పెట్టుబడిదారులపై ప్రతికూల ప్రభావం చూపాయి. దీంతో విదేశాల్లో భారతీయ పెట్టుబడులు పెరిగాయి.