Chitoor
-
బస్సు రూపంలో వెంటాడిన మృత్యువు....మిన్నంటిన రోదనలు
దేవుడా ఎంత పని చేశావయ్యా.. సంతోషంగా శుభకార్యానికి వెళ్తున్న వారిని ఎందుకింత నిర్దయగా కబళించావు.. మేము ఏం పాపం చేశామయ్యా.. ఇంత విషాదాన్ని మా కుటుంబాలకు మిగిల్చావు’ అంటూ బస్సు ప్రమాద బాధితులు రోదించిన తీరు అందరినీ కలచివేసింది. తిరుపతి సమీపంలోని భాకరాపేట వద్ద లోయలో బస్సు బోల్తాపడిన ఘటనలో చనిపోయిన వారి మృతదేహాలను అంబులెన్సుల్లో ధర్మవరానికి తీసుకురాగానే బాధితుల రోదనలు మిన్నంటాయి. సాక్షి, ధర్మవరం టౌన్/ అర్బన్/ తనకల్లు/ కదిరిటౌన్/ పుట్టపర్తి: ధర్మవరంలోని ప్రముఖ పట్టు చీరల వ్యాపారి మలిశెట్టి మురళి కుమారుడు వేణు వివాహ నిశ్చితార్థ వేడుకలకు తిరుచానూరులోని రాధాకృష్ణ కల్యాణమండపానికి బయల్దేరిన వారిని బస్సు ప్రమాద రూపంలో మృత్యువు వెంటాడింది. భాకరాపేట వద్ద లోయలో శనివారం రాత్రి బస్సు బోల్తాపడిన ఘటనలో అక్కడికక్కడే ఎనిమిది మంది మృతి చెందగా, ఆదివారం సాయంత్రం మరొకరు చనిపోయారు. దీంతో మృతి చెందిన వారి సంఖ్య తొమ్మిదికి చేరుకుంది. మృతుల్లో ధర్మవరానికి చెందిన మలిశెట్టి మురళి (45), తమ్ముడు మలిశెట్టి గణేష్ (42), మరో తమ్ముడు శివ భార్య కాంతమ్మ (38), బంధువు, పెళ్లిళ్ల పేరయ్య అయిన మలిశెట్టి వెంగప్ప (75), భార్య నాగలక్ష్మి (60), తనకల్లు మండలం కొక్కంటి క్రాస్కు చెందిన జింకా చంద్ర కుమార్తె చందన (10), ధర్మవరానికి చెందిన బస్సు డ్రైవర్ నబీరసూల్ (42), కదిరికి చెందిన క్లీనర్ షకీల్ (22), మలిశెట్టి మురళి స్నేహితుడు, విలేకరి అయిన బుక్కపట్నం మండలం మారాలకు చెందిన ఆదినారాయణరెడ్డి (45) ఉన్నారు. వీరిలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు, మరో కుటుంబంలో దంపతులు ప్రాణాలు కోల్పోవడం తీరని విషాదం మిగి ల్చింది. గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారు 33 మంది ఉన్నారు. కన్నీటి వీడ్కోలు.. బస్సు ప్రమాద మృతుల్లో ఎక్కువమంది ధర్మవరానికి చెందిన ఒకే కుటుంబానికి చెందినవారు ఉన్నారు. తిరుపతి ఆస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం మలిశెట్టి మురళి, తమ్ముడు గణేష్, మరో తమ్ముడు శివ భార్య కాంతమ్మ మృతదేహాలను ఆదివారం అంబులెన్స్లో కొత్తపేట ఉషోదయ స్కూల్ వద్దకు తీసుకొచ్చారు. అప్పటికే అక్కడకు చేరుకున్న బంధువులు, కుటుంబ సభ్యులు, పట్టణ ప్రజలు బోరున విలపించారు. మృతదేహాలను ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి సోదరుడు, వైఎస్సార్సీపీ నాయకుడు కేతిరెడ్డి వెంకటకృష్ణారెడ్డి, ఏపీ ఔట్సోర్సింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ వడ్డే బాలాజీ, దేవరకొండ రమేష్, గుండా ఈశ్వరయ్య సందర్శించి, పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గరుడంపల్లి సమీపాన మలిశెట్టి మురళి పొలంలో నిర్వహించిన ముగ్గురి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. మలిశెట్టి వెంగప్పకు హిందూ శ్మశాన వాటికలోను, డ్రైవర్ నబీరసూల్కు ముస్లిం శ్మశానవాటికలో అంత్యక్రియలు జరిగాయి. కదిరిలో క్లీనర్ షకీల్, బుక్కపట్నం మండలం మారాలలో విలేకరి ఆదినారాయణరెడ్డి అంత్యక్రియలు నిర్వహించారు. చిన్నారి చందనకు తనకల్లు మండలం కొక్కంటి క్రాస్ సమీపంలో అంత్యక్రియలు పూర్తి చేశారు. మృత్యువులోనూ వీడని బంధం.. ధర్మవరం పట్టణానికి చెందిన మలిశెట్టి మురళి, తమ్ముడు గణేష్, మరో తమ్ముడు శివ భార్య కాంతమ్మ బస్సు ప్రమాదంలో మృతిచెందారు. ముగ్గురు అన్నదమ్ములూ పట్టుచీరల వ్యాపారం చేసుకుంటూ జీవించేవారు. కానీ బస్సు ప్రమాదం ఆ ఇంట విషాదాన్ని నింపింది. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి చెందడంతో కుటుంబ సభ్యుల బాధ వర్ణనాతీతంగా మారింది. మురళి కుమారుడు వేణు (పెళ్లికొడుకు), భార్య లలితమ్మ, తమ్ముడు గణేష్ భార్య భైరవి తిరుపతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మురళి మృతితో అన్నదమ్ముల కుటుంబాలు పెద్ద దిక్కు కోల్పోయినట్లయ్యింది. నీ వెంటే నేనూ.. ధర్మవరానికి చెందిన మలిశెట్టి వెంగప్ప శనివారం రాత్రి బస్సు ప్రమాదంలో మృతిచెందగా, గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అతని భార్య నాగలక్ష్మి (60) ఆదివారం సాయంత్రం తుదిశ్వాస విడిచింది. భర్త మృతి చెందిన విషయం కూడా ఆమెకు తెలియకనే కన్నుమూసింది. అర్ధంతరంగా ముగిసిన విలేకరి జీవితం.. బుక్కపట్నం మండలం మారాల గ్రామానికి చెందిన ఆదినారాయణరెడ్డి బస్సు ప్రమాదంలో మృతిచెందారు. ఆదినారాయణరెడ్డి 20 ఏళ్లుగా పత్రికారంగంలో విలేకరిగా పనిచేస్తున్నారు. మలిశెట్టి మురళి స్నేహితుడు కావడంతో ఆయన కుమారుడి నిశ్చితార్థానికి ఆదినారాయణరెడ్డి బస్సులో వెళ్లారు. అలా వెళ్లిన విలేకరి అర్ధంతరంగా తనువు చాలించాడు. ఈయనకు భార్య గౌతమి, కుమార్తె మనీషా, కుమారుడు గణేష్రెడ్డి ఉన్నారు. అయ్యో ‘పాపం'.. ధర్మవరం కొత్తపేట నివాసి జింకా చంద్ర కుమార్తె జింకా చందన (10) స్థానిక మున్సిపల్ స్కూల్లో నాలుగో తరగతి చదువుతోంది. బంధువుల నిశ్చితార్థానికి వెళ్లి బస్సు ప్రమాదంలో చందన మృతి చెందింది. తండ్రి చంద్ర తిరుపతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. వీరి సొంతూరు తనకల్లు మండలం కొక్కంటి క్రాస్. ఛిద్రమైన పేదల బతుకులు బస్సు ప్రమాదంలో మృతి చెందిన డ్రైవర్ నబీరసూల్, క్లీనర్ షకీల్ నిరుపేదలు. ఈ ప్రమాదంతో రెండు కుటుంబాలు ఛిద్రమయ్యాయి. కదిరికి చెందిన క్లీనర్ షకీల్ అవివాహితుడు. నార్పల మండలం గూగూడుకు చెందిన డ్రైవర్ నబీరసూల్ 12 ఏళ్ల క్రితం పొట్టకూటి కోసం తాడిపత్రికి వెళ్లాడు. అక్కడి నుంచి ధర్మవరం చేరుకుని డ్రైవర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఊహించని విధంగా మృత్యువాత పడటంతో ఇతని భార్య, ఇద్దరు పిల్లల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ఇతని సోదరుడు హైదర్వలి కూడా లారీడ్రైవర్గా వెళ్తూ 16 క్రితం ముదిగుబ్బ వద్ద రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. (చదవండి: లోయలో పడ్డ బస్సు.. ప్రమాదానికి కారణాలివే..!) -
నలుగురు కలికిరి బ్యాంకు ఉద్యోగుల సస్పెన్షన్
-
ఏంటా వింత వస్తువు?!
కూరపర్తివారిపల్లె పంచాయతీ లచ్చాయకుంట సమీపంలో బ్యాటరీ, సిగ్నల్ డిటెక్టర్, గొడుగు, బెలూన్లతో కూడిన ఎలక్ట్రానిక్ పరికరం శుక్రవారం కలకలం రేపింది. సమాచారం అందుకున్న ఎస్ఐ వెంకటమోహన్ అక్కడకు చేరుకుని దాన్ని స్వాధీనం చేసుకున్నారు. వాతావరణ అధ్యయనానికి పరిశోధకులు గాల్లోకి బెలూన్ సాయంతో దీన్ని పంపి ఉండొచ్చని ప్రాథమికంగా నిర్థారణకొచ్చారు. దీనిగురించి ఎలాంటి ఆందోళన అవసరం లేదన్నారు. – ఎర్రావారిపాళెం(చిత్తూరు జిల్లా) -
మహిళకు నడిరోడ్డు మీద కాన్పు : చిత్తూరు
-
చిత్తూరు : ఫోన్ మాట్లాడుతూ బావిలో పడ్డ వ్యక్తి ని కాపాడిన ఫైర్ సిబ్బందీ
-
తిరుపతి వివాహిత హత్యకేసు : భర్త హత్య చేసినట్లు పోలీసుల నిర్ధారణ
-
చిత్తూరు : పలమనేరు ప్రాంతంలో ఏనుగుల సంచారం
-
అగ్గిపెట్టె మచ్చా పేరిట అరుదైన ఘనత!
‘నమస్తే అన్నా..’ అంటూ ఆప్యాయంగా సంభాషణ మొదలుపెట్టే అగ్గిపెట్టె మచ్చా, అవతలి వాళ్లు రెచ్చగొట్టడం, అటుపై తనదైన స్టైల్లో వాళ్లపై తిట్ల పురాణం అందుకోవడం ద్వారా ఫేమస్ అయ్యాడని తెలిసిందే. చిత్తూరుకు చెందిన కిరణ్ కుమార్ అలియాస్ అగ్గిపెట్టె మచ్చా.. ఇప్పుడు అరుదైన ఘనతను దక్కించుకున్నాడు. ప్లేస్టోర్లో అతని పేరిట రిలీజ్ అయిన ఓ గేమ్.. లక్షకు పైగా డౌన్లోడ్లు సాధించడం విశేషం. ఒక మీమ్ క్యారెక్టర్.. అందునా తెలుగు మీమ్ క్యారెక్టర్ మీద వీడియో గేమ్ ఈ ఘనత సాధించడం ఇదే మొదటిసారి. ప్లే స్టోర్లో Game on Aggipettimacha అనే ఈ గేమ్.. ‘గేమ్ ఆన్ మీమ్’ తరపున డెవలప్ అయ్యింది. లక్షకు పైగా డౌన్ లోడ్స్, 4.4 రేటింగ్(మచ్చా ఫ్యాన్సే అయి ఉండొచ్చు) దక్కించుకోగా, 20 ఎంబీ సైజ్ ఉన్న ఈ గేమ్ను ఆదరిస్తుండడం విశేషం. ఇందులో కోపధారి మనిషి, జాంబీరెడ్డి, తమిళ మీమ్ క్యారెక్టర్ ఎంజీఆర్ నగర్ బిజిలీ కూడా ఉండగా.. తెలుగు నుంచి మచ్చానే టాప్ డౌన్లోడ్లతో నిలిచాడు. సాధారణంగా సెలబ్రిటీలు, సినిమాల విషయంలో ఇలాంటి గేమ్స్ ఆదరణ దక్కించుకుంటున్నప్పటికీ.. ఒక తెలుగు ఇంటర్నెట్ సెలబ్రిటీ, అది కూడా మచ్చా ఖాతాలో ఈ ఘనత చేరడం విశేషం. చిరు సాయం కాగా, మానసిక స్థితి సరిగా లేని కిరణ్ అలియాస్ అగ్గిపెట్టె మచ్చా.. తన చేష్టలతో అవతలివాళ్లకు హాస్యాన్ని పంచుతున్న విషయం తెలిసిందే. అయితే అతన్ని క్యాష్ చేసుకోవాలని యూట్యూబ్ ఛానెల్స్, కొన్ని టీవీ ఛానెల్స్ కూడా అతన్ని జనాల ముందుకు తీసుకొచ్చాయి. అయినప్పటికీ ఎంతో కొంత ఆర్థిక సాయం ద్వారా అతను ఊరట చెందుతుండగా.. మరోవైపు తనదైన చేష్టలతో, ఇంటర్వ్యూలతో పాపులారిటీ పెంచుకుంటున్నాడు. ఇక ఈ గేమ్ నిర్వాహకులు కూడా మచ్చాకు ఎంతో కొంత సాయం చేయడం మంచిదేమోనన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. కొన్ని మార్చండి మచ్చాకి ఉన్న ఫేమ్తో ఈ గేమ్ బాగుందని కొందరు అంటున్నప్పటికీ.. సాంకేతికంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఫ్రెండ్లీ ఫీచర్లను ఇంకా డెవలప్ చేయాల్సి ఉందని రివ్యూలు ఇస్తున్నారు. ఇక ఈ గేమ్లో నమస్తే అన్నా.. అంటూ మొదలుపెట్టే మచ్చా, తన స్టైల్ పాట పాడడం, ‘ఎగిరి తంతా’.., ‘పోతే పోయిందని గానీ యెధవ ప్రాణం’ లాంటి డైలాగులు ఆకట్టుకుంటున్నాయి. లెవెల్స్ను పెంచడంతో పాటు ఖతర్ పాప లాంటి కొన్ని మీమ్ క్యారెక్టర్లను కూడా ఇంట్రడ్యూస్ చేసి అప్డేట్ చేయాలని పలువురు రివ్యూల ద్వారా రిక్వెస్ట్ చేస్తుండడం విశేషం. చదవండి: సుఖం కోసం కష్టమెందుకు! -
మైనర్ బాలిక కుటుంబం పై కాల్పులు జరిపిన యువకుడు
-
వీళ్లు అసలు మనుషులేనా: సీఎం జగన్
సాక్షి, చిత్తూరు: పోలీసుల పనితీరు, ఆలోచన తీరును మార్చేందుకు డ్యూటీ మీట్ ఉపయోగపడుతుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ఇక నుంచి ప్రతి ఏటా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాలని పేర్కొన్నారు. తద్వారా సైబర్ క్రైమ్, మహిళల రక్షణ వంటి అనేక అంశాలపై చర్చ జరుగుతుందన్నారు. టెక్నాలజీ మెరుగుపరిచేందుకు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నట్లు తెలిపారు. రాష్ట్ర విభజన అనంతరం తొలిసారిగా తిరుపతిలో ఏపీ పోలీస్ డ్యూటీ మీట్ను సీఎం జగన్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గత ఆరేళ్లుగా పోలీస్ డ్యూటీ మీట్ జరగలేదని పేర్కొన్నారు. గత కొన్ని రోజులుగా పోలీసులకు చెడ్డపేరు తెచ్చేవిధంగా కొంతమంది ఉద్దేశపూర్వకంగానే దుశ్చర్యలకు పాల్పడుతున్నారన్న ఆయన.. ప్రతిపక్షాల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. (చదవండి: స్థలం + ఇల్లు.. రెట్టింపు ఆనందం) తప్పు చేసింది ఎవరైనా వదలొద్దు ‘‘గత ప్రభుత్వం తమ వాళ్లు ఏం చేసినా చూసీ చూడనట్లు వ్యవహరించాలని చెప్పింది. కలెక్టర్ల కాన్ఫరెన్స్లోనే ఇలాంటి వ్యాఖ్యలు చేసింది. కానీ మా ప్రభుత్వం అన్యాయం ఎవరు చేసినా శిక్షించాలని స్పష్టం చేసింది. ఎవరు చేసినా తప్పు తప్పే. మా వాళ్లు తప్పు చేసినా సరే.. ఎవరినీ వదలొద్దని మరోసారి చెబుతున్నా. గత 18 నెలల పాలన ప్రతిపక్షంలో ఉన్నవారికి గుబులు పుట్టిస్తోంది. కులం,మతం, ప్రాంతం, పార్టీలు చూడకుండా పథకాలు ఇస్తున్నాం. అర్హతను మాత్రమే ప్రామాణికంగా తీసుకుంటున్నాం. అవినీతికి తావులేకుండా సంక్షేమ పథకాలు నేరుగా ప్రజలకు అందుతున్నాయి ప్రజలు ఆనందంగా ఉంటే ప్రతిపక్షాలు తట్టుకోలేకపోతున్నాయి. ఇంత మంచి చేసిన ప్రభుత్వాన్ని ఎదుర్కోవడం కష్టమని గుర్తించి నాయకులు కుట్రలు చేస్తున్నారు సోషల్ మీడియా ద్వారా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు’’ అని టీడీపీ తీరుపై సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వీళ్లు అసలు మనుషులేనా? ‘‘కొంతమందికి దేవుడు అంటే భయంలేదు, భక్తి లేదు. దేవుడిపై రాజకీయం చేస్తున్నారు. దేవుడి విగ్రహాలతో చెలగాటమాడుతున్నారు. విగ్రహాలు ధ్వంసం చేసి పచ్చ మీడియా ద్వారా దుష్ప్రచారం చేస్తున్నారు. వీళ్లు అసలు మనుషులేనా.. కులాలు, మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. ఇలాంటి కేసులను విచారించే పరిస్థితిలోకి మనం వచ్చాం. దేవుడి విగ్రహాలను పగులగొడితే ఎవరికీ లాభం? ఆలయాల్లో అరాచకం చేస్తే ఎవరికీ లాభం? ప్రజల విశ్వాసాలను దెబ్బతీసి తప్పుడు, విష ప్రచారం చేస్తే ఎవరికి లాభం? ఎవరిని టార్గెట్ చేసి ఇలాంటి దుర్మార్గాలు చేస్తున్నారు?’’ ప్రతిపక్షాల తీరును సీఎం జగన్ ఎండగట్టారు. ఇలాంటి వాటిని ప్రజలు నిశితంగా గమనించాలని విజ్ఞప్తి చేశారు. మంచి కార్యక్రమం మొదలుపెట్టిన ప్రతిసారీ.. ‘‘ప్రభుత్వం నుంచి ఏదైనా మంచి కార్యక్రమం జరుగుతున్నప్పుడు.. ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వ పథకాల నుంచి దృష్టి మరల్చేందుకు కుట్రలు చేస్తున్నారు’’ అని సీఎం జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. మతాలు, కులాల మధ్య చిచ్చు పెట్టే కుట్రలు జరుగుతున్నాయని, రాజకీయంగా జరుగుతున్న గొరిల్లా యుద్ధతంత్రాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని పోలీసులకు దిశానిర్దేశం చేశారు. పోలీసులకు చెడ్డపేరు తెచ్చే ప్రయత్నాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. జన సంచారం లేని చోట, టీడీపీ నేతల పర్యవేక్షణలో ఉన్న ఆలయాల్లోనే ఇలాంటి ఘటనలు జరగుతున్నాయని, 20వేల ఆలయాల్లో గతంలో ఎన్నడూలేని విధంగా సీసీ కెమెరాలు పెట్టామన్నారు. కొన్ని మీడియా సంస్థలను ప్రజలను రెచ్చగొడుతున్నాయని, పథకం ప్రకారమే కుట్రలు పన్నుతున్నారన్నారు. ► 2019 నవంబర్ 14న ఒంగోలులో మనబడి నాడు నేడు ప్రారంభించాం. ఆ సమయంలో గుడిని కూల్చారని అసత్య ప్రచారం చేశారు. ► 2020 జనవరి 21న పిఠాపురంలో 23 విగ్రహాలు ధ్వంసం చేశారని ప్రచారం చేశారు. ► అదే రోజు దేశంలోనే తొలిసారిగా రైతుల కోసం ధరల స్థిరీకరణ పథకం ప్రారంభించాం. రొంపిచర్లలో వేణుగోపాల స్వామి ఆలయాన్ని ధ్వంసం చేశారని ప్రచారం చేశారు. ► ఫిబ్రవరి 14న తూర్పు గోదావరి జిల్లాలో ఆలయ రథాన్ని దగ్ధం చేశారు. ► రాజమండ్రిలో దిశ పోలీస్ స్టేషన్ ప్రారంభించారని, దానికి ప్రచారం రాకూడదని ఇలాంటి పని చేశారు. ఒక్క దిశ పోలీస్స్టేషన్ ప్రారంభిస్తే మూడు ఘటనలకు పాల్పడ్డారు. ► ఆసరా కార్యక్రమాన్ని ప్రారంభించే సమయంలో దుర్గ గుడి వెండి సింహాలను మాయం చేశారు. ► రైతన్నల కోసం బోర్లు వేయించే కార్యక్రమాన్ని ప్రారంభించే సమయంలో అక్టోబర్ 8న విద్యా కానుకను ప్రారంభించేందుకు సిద్ధమయ్యాం. మూడు రోజుల ముందు ఆలయాల ధ్వంసాలకు కుట్ర పన్నారు ►విజయనగరంలో సీఎం జగన్ వస్తున్నారని తెలిసి రామాలయంలో విగ్రహం ధ్వంసం చేశారు. ఇందులో చాలా ఆలయాలులో దేవాదాయ శాఖ పరిధిలోని కావు. ఇవన్నీ మారుమూల ప్రాంతాల్లో, జన సంచారం లేని ప్రాంతాల్లో జరిగిన ఘటనలు. చాలా ఆలయాలో టీడీపీ నాయకుల పర్యవేక్షణలో ఉన్నాయి. -
ఎంపీలు రెడ్డప్ప, మాధవిలకు పాజిటివ్
సాక్షి,న్యూఢిల్లీ : చిత్తూరు వైఎస్సార్సీపీ ఎంపీ రెడ్డప్ప కరోనా వైరస్ బారినపడ్డారు. పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొనేందుకు ఢిల్లీ వచ్చిన ఎంపీకి పార్లమెంట్ సచివాలయంలో నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్గా తేలింది. ఎటువంటి లక్షణాలు లేకుండానే కోవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఐసోలేషన్లో ఉండాలని అధికారులు సూచించారు. అరకు ఎంపీ మాధవికి కూడా కరోనా సోకింది. గత రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతున్న ఎంపీ.. పార్లమెంటు సమావేశాల్లో పాల్గొనేందుకు ఢిల్లీ వచ్చారు. అక్కడ నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్గా తేలింది. దీంతో రెండు వారాల పాటు ఢిల్లీలోనే చికిత్స తీసుకోనున్నారు. కాకినాడ ఎంపీ వంగ గీతా సైతం ఇదివరకే వైరస్ బారినపడిన విషయం తెలిసిందే. గత శనివారం ఆమెకు నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్గా తేలింది. కాగా దేశంలో కరోనా వైరస్ విజృంభణ కారణంగానే ప్రత్యేక పరిస్థితుల నడుమ పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. మరోవైపు దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 24 మంది ఎంపీలకు, 8 మంది కేంద్రమంత్రులకు కరోనా పాజిటవ్గా తేలింది. ఇక స్వల్ప లక్షణాలు ఉన్నా.. సభలోకి అనుమతి లేదని స్పీకర్ ఇదివరకే ప్రకటించారు. (పార్లమెంట్లో కరోనా కలకలం..!) -
హార్సిలీహిల్స్కు కోవిడ్ ముప్పు!
ఆంధ్రా ఊటీ హార్సిలీ హిల్స్. ఇది ప్రఖ్యాత వేసవి విడది కేంద్రం. వేసవిలో సేద తీరడానికి ఇక్కడికి పలు రాష్ట్రాలతోపాటు విదేశాల నుంచి పర్యాటకులు వచ్చి వెళుతున్నారు. వేసవి ప్రారంభమైన నేపథ్యంలో ఇటీవల కాలంలో కర్ణాటక పర్యాటకులతోపాటు విదేశీయులూ వచ్చి వెళుతున్నారు. ఆయా ప్రాంతాల్లో కోవిడ్ ఉన్న నేపథ్యంలో ఇక్కడి స్థానికులు, ఉద్యోగులకూ కోవిడ్ సోకే ప్రమాదం ఉంది. సాక్షి, చిత్తూరు: మండలంలోని హార్సిలీహిల్స్పై కోవిడ్ ముప్పు పొంచివుంది. ఇక్కడి పరిస్థితులు, వాతావరణం నేపథ్యంలో వ్యాధి ఉధృతమయ్యే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. హార్సిలీహిల్స్కు వస్తున్న సందర్శకుల్లో అత్యధికులు సరిహద్దులోని కర్ణాటకకు చెందినవారే. ఆ రాష్ట్రంలో కోవిడ్ అధికమైన పరిస్థితుల్లో హార్సిలీహిల్స్పై తీవ్ర ప్రభావం ఉంటుంది. బెంగళూరుకు చెందిన సందర్శకులు అత్యధికులు ఇక్కడికి వస్తున్నారు. ముందుగానే గదులను ఆన్లైన్లో నమోదు చేసుకుని ఇక్కడికి వస్తారు. విడిది చేసి తిరిగి వెళ్తారు. ఈ పరిస్థితుల్లో వ్యాధి సోకిన వారు గదులను తీసుకుని విడిది చేసి వెళ్లే ప్రమాదం ఉంది. అలాంటి వారితో వ్యాధి ఒకసారిగా విజృంభించే అవకాశాలు అధికంగా ఉన్నాయి. దీనికితోడు ఇటీవల కొండకు వస్తున్న సందర్శకుల్లో విదేశీయులు ఎక్కువగా ఉంటున్నారు. గతనెల రోజుల్లో ఇటలీ, బ్రిటన్ దేశాలకు చెందిన సందర్శకులు వచ్చి వెళ్లారు. అంతకుముందు కూడా కొందరు సందర్శకులు నాలుగైదురోజులు గడిపి వెళ్లారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ప్రస్తుతం విదేశీ పర్యాటకుల సంఖ్య పెరిగిన నేపథ్యంలో వ్యాధి వారి ద్వారా కూడా ప్రబలే ప్రమాదం ఉంది. ఇక్కడికి వచ్చే సందర్శకులను పరీక్షించేందుకు ఎలాంటి పరికరాలు ఏర్పాటు కాలేదు. ఆన్లైన్ మూసేయాలి హార్సిలీహిల్స్లో టూరిజంశాఖ 54కు పైగా అతిథిగృహాలను బార్, రెస్టారెంట్ను నిర్వహిస్తోంది. ప్రైవేటుగా మరో ముగ్గురు అతిథిగృçహాలను నిర్వహించుకుంటున్నారు. వీటిని తక్షణమే నిలిపివేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడికి వచ్చి వెళ్లే వారి వివరాలు టూరిజంశాఖ వద్ద ఉంటా యి. టూరిజంశాఖ గదుల కేటాయింపును తాత్కాలికంగా నిలిపివేయడమేకాక, ప్రైవేటు అతిథిగృహలను మూసివేస్తే ప్రయోజనం ఉంటుంది. కొంతకాలం సందర్శకులను నిషేధించడం లేదా పరీక్షలు నిర్వహించాక అనుమతించడం చేయాల్సివుంది. -
సైరన్ మోగింది..దొంగ దొరికాడు
సాక్షి, రేణిగుంట: దుండగులు పట్టపగలే దోపిడీకి యత్నించిన ఘటన రేణిగుంట రైల్వేస్టేషన్లో జరిగింది. దొంగతనం బెడసి కొట్టడంతో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రేణిగుంట రైల్వేస్టేషన్ ప్రాంగణంలో ఓ వ్యక్తి బరోడా బ్యాంక్ ఏటీఎంను పగుల గొట్టేందుకు ప్రయత్నించగా సైరన్ మోగింది. దీంతో అప్రమత్తమైన రైల్వే పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొన్నారు. విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడు మని కుమార్గా పొలీసుల గుర్తించారు. మనికుమార్ 2017 సంవత్సరం తిరుపతిలోని ఇండియన్ బ్యాంక్ ఏటీఎంలో దోపిడీకి ప్రయత్నించాడని పోలీసులు పేర్కొన్నారు. -
కోట్లు దండుకుని బోర్డు తిప్పేశారు!
సాక్షి, పలమనేరు : ప్రజల నుంచి డిపాజిట్ల రూపేణా కోట్లాది రూపాయలు వసూలు చేసి ఓ ప్రైవేటు ఫైనాన్స్ సంస్థ బోర్డు తిప్పేసింది. పలమనేరులో మంగళవారం ఇది వెలుగుచూసింది. స్థానిక ఏజెంట్ల మాయమాటలతో మోసపోయామని తమకు న్యాయం చేయాలంటూ పలువురు బాధితులు స్థానిక పోలీసులను ఆశ్రయించారు. బాధితుల కథనం...హెచ్బీఎన్, అసూర్ అనే ప్రైవేటు సంస్థల పేరిట పలమనేరుతోపాటు జిల్లాలోని పలుచోట్ల కార్యాలయాలను రెండేళ్ల క్రితం నిర్వాహకులు ప్రారంభించారు. ఆయా మండలాల్లో ఏజెంట్లను నియమించారు. తమ వద్ద రూ.500 నుంచి ఎంత మొత్తమైనా డిపాజిట్ కడితే ఆపై రుణాలిస్తామంటూ ప్రచారం చేయించారు. దీంతో స్థానిక ఏజెంట్లు తమకు తెలిసిన వారి నుంచి లక్షలాది రూపాయలను డిపాజిట్లుగా కట్టించారు. అయితే హెచ్బీఎన్లో కంటే అసూర్ కంపెనీలో బాగా లాభాలున్నాయంటూ ఇందుకు సంబందించిన ముఖ్య ఏజెంట్లు హరినాథ్రెడ్డి, దేవరాజులు స్థానిక ఏజెంట్లను నమ్మించారు. అయితే ఆ తర్వాత ఆ కార్యాలయాలు బోర్డు తిప్పేశాయి. దీంతో డబ్బులు కట్టిన జనం ఏజెంట్లను నిలదీశారు. వారు తమకేమీ సంబంధం లేదని చెప్పడంతో బాధితులు, ఏజెంట్లు కలసి డీఎస్పీ ఆరీఫుల్లా, సీఐ శ్రీధర్కు ఫిర్యాదు చేశారు. జిల్లాలో ఇలా డిపాజిట్ల రూపంలో ఇలా వసూలు చేసిన డబ్బు రూ.3కోట్లకుపైగా ఉంటుందని ఏజెంట్లు చెబు తున్నారు. ఈ వ్యవహారంపై పోలీసులు విచారణ చేస్తున్నారు. ప్రైవేటు ఫైనాన్స్ సంస్థ మాటలు నమ్మి, లక్షలు కట్టించి, మోసపోయామని జరావారిపల్లెకు చెందిన ఏజెంట్ కళావతి వాపోయింది. తాను రూ.50లక్షలు డిపాజిట్ల రూపేణా కట్టించానని, నిర్వాహకులు అదృశ్యం కావడంతో అందరూ తనను నిలదీస్తుండడంతో తనకు దిక్కుతోచడం లేదని తొరిడి గ్రామానికి చెందిన ఏజెంట్ రుక్మిణి కన్నీటిపర్యంతమైంది. తాను ఏజెంట్గా వీ.కోట మండలంలో రూ.20లక్షల వరకూ కట్టించానని, మమ్మల్ని నమ్మించి మోసం చేశారంటూ దొడ్డిపల్లెకు చెందిన మోహన్ ఆక్రోశించాడు. -
వెలుగు చూసిన పురాతన ఆలయం
బి.కొత్తకోట మండలం ఒకప్పుడు వైడుంబ సామంత రాజ్యంలో ఉండేదా..? తర్వాత పల్లవులు, విజయనగర రాజుల పాలనలో సాగిందా..? శీలంవారిపల్లె సమీపంలోని కోనాపురం ప్రాంతంలో సోమవారం వెలుగులోకి వచ్చిన ఆలయ శిథిలాలు చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. బి.కొత్తకోట మండలంలో చారిత్రక కట్టడాలకు కొదువలేదు. అందులో శిథిలమైన ఈ ఆలయం తాజాగా వెలుగుచూసింది. పొలం పనులు చేస్తుండగా బయటపడిన ఆలయ శిథిలాలు, అక్కడ కనిపించే శిలలు, స్తంభాలు, శిలాశాసనం, శిల్పకళ, చారిత్రక ఆధారాలను పరిశీలిస్తే ఈ ప్రాంతంలో మూడు రాజ్యాల పాలన సాగిందని కన్పిస్తోంది. శిథిలాలను పూర్తిగా తొలగిస్తే మరిన్ని విగ్రహాలు, ఆధారాలు వెలుగుచూసే అవకాశం ఉందని పురావస్తు శాఖ అధికారులు భావిస్తున్నారు. సాక్షి, బి.కొత్తకోట(చిత్తూరు) : మండలంలోని శీలంవారిపల్లె సమీపంలోని పొలంలో ఆలయ శిథిలాలు లభ్యమైన ప్రాంతం ఒకప్పుడు కోనాపురం గ్రామంగా విరాజిల్లింది. ఇప్పటికీ ఇక్కడి వారు ఈ ప్రాంతంగా కోనాపురంగానే పిలుచుకుంటున్నారు. ఆలయం, దాని పరిసరాల్లో నివాసాలతో నిండి ఉండేదని తెలుస్తోంది. దీనికి దగ్గర్లోని చిటికివారిపల్లె ఆలయం శిథిలం తర్వాత ఏర్పడినట్టుగా చెబుతున్నారు. నివాసాలకు సంబం ధించిన ఆధారాలు కనిపిస్తున్నాయి. తొమ్మిది నుంచి 13వ శతాబ్దం వరకు చిత్తూరు జిల్లా వైడుంబి సామంతరాజుల పాలనలో ఉండేదని శాసనాల ద్వారా తెలుస్తోంది. వీరు పశ్చిమ చాణుక్యులకు సామంతులుగా కూడా పనిచేశారు. వీరికి రాష్ట్ర కూటులు, బాణులు, నలంబ పల్లవులు సమకాలికులు. వీరు పీలేరు నియోజకవర్గంలోని కలకడ, కర్ణా్ణటకలోని కోలా రును రాజధానులుగా చేసుకుని పాలన సాగించారు. వీరి కాలంలో వేసిన శిలా శాసనం ఒకటి ఆల య శిథిలాలకు సమీపంలోని పొలంలో ఉం డడం వెలుగులోకి వచ్చింది. దీనిపై ఒక వీరుడు స్వర్గస్తుడై స్వర్గానికి చేరినట్టుగా చెక్కారు. అతనే కుడిచేతిలో కత్తి, ఎడమచేతిలో విల్లు కలిగి ఉన్నాడు. ఇతను సాహసవంతుడు అని తెలిపేలా కింద గుర్రం, దానిపైన రెండు నాగుపాము పడగలు ఉన్నాయి. అతని విల్లుకు ఎదురుగా ముగ్గరు ఉన్నట్టు శిల్పం చెక్కారు. వీటిపైన తెలుగు–కన్నడ భాషలా కనిపించే అక్షరాలు లిఖించి ఉన్నాయి. ఈ శాసనాన్ని వీరగల్ శాసనంగా పేర్కొంటున్నారు. ఇతను శత్రువులను తదముట్టించి వారి చేతిలో చనిపోగా, అతన్ని వీరుడిగా చిత్రీకరిస్తూ వేసిన శిలాశాసనాన్ని బట్టి అది వైడుంబ రాజులు వేయించినట్టుగా నిర్ధారణ అవుతోంది. వైడుంబి పాలనలోనే వీరులు ఎక్కువగా ఉండేవారు కావడంతో వీరి శిలాశాసనం ద్వారా నిర్ధారణ అయ్యింది. వీరి సామంత పాలనకు సాక్ష్యంగా పురాతన సున్నం తో తయారైన శిలకు చెందిన శిరస్సు లభ్యమైం ది. సున్నంతో శిలల తయారీ వీరి కాలం నాటిదే అని పురావస్తు అధికారులు స్పష్టం చేస్తున్నారు. పల్లవ, విజయనగర రాజ్యాల్లో.. ఈ ప్రాంతాన్ని క్రీ.శ 6వ శతాబ్దం నుంచి 9వ శతాబ్దం వరకు పల్లవులు, క్రీ.శ 1336 నుం చి 1646 వరకు విజయనగర రాజులు పాలిం చారని తెలుస్తోంది. ఆలయ శిథిలాల్లోని శిల్పాలు, వాటిపై చెక్కిన శిల్పకళ, వన్యప్రాణులు, దేవతా విగ్రహాలు, నామాలు పరిశీలిస్తే పల్లవులు, విజయనగర రాజుల పాలనలో ఈ ఆల యం విరాజల్లినట్టుగా కనిపిస్తుంది. స్తంభాలపై సింహాల చిత్రాల శైలి పల్లవుల కాలం నుంచి ఉంది. కానీ విజయనగర పాలనలోనూ ఇలాగే కనిపిస్తాయి. స్తంభాలను మోస్తున్న భారవాహకుడు, యక్షుడు ఈ రాతి స్తంభాలకు పునాదులు గా కనిపిస్తారు. మకరం (మొసలి), సింహాల గుర్తులు పల్లవుల రాజ్య శైలి అయినప్పటికీ విజయనగర పాలనలో మకరం గుర్తులు కనిపిస్తాయి. ఇలాంటి గుర్తులే ములకలచెరువు మం డలంలోని సొంపాళ్యంలోని చెన్నకేశవాలయంలో కనిపిస్తాయి. వాటి పోలికలు శిథిలాల్లోని శిల్ప కళలో కనిపిస్తుండగా, ఆలయం విజయనగర పాలనకు ముందే నిర్మాణమైనట్టుగా ఆధారాలు వెల్లడిస్తున్నాయి. ఆధారాలను బట్టి విష్ణు ఆలయమే శీలంవారిపల్లె సమీప పొలాల్లో లభ్యమైన శిథిలాలు, మహలక్ష్మి విగ్రహాన్ని పరిశీలిస్తే ఇది కచ్చితంగా విష్ణు ఆలయమే అన్న అభిప్రాయం ఉంది. పురావస్తుశాఖలో పనిచేసిన ఉన్నతాధికారులు కూడా అంగీకరిస్తున్నారు. లభించిన పానవట్టం, శిథిలాల్లో కనిపిస్తున్న నిర్మాణ ఆకా రాలు, స్తంభాల ఆధారం, వాటిపై చెక్కిన శం ఖు, చక్రాలతో విష్ణు ఆలయంగా నిర్ధారణ అవుతోంది. పేరు ఏదైనా వైష్ణవ ఆలయం కచ్చితమని స్పష్టంగా తెలుస్తోంది. కాగా శిథిలాల్లో విష్ణువు, గరుడుడు తదితర విగ్రహాలు ఉండే అవకాశాలు ఉన్నాయని చరిత్రకారులు చెబుతున్నారు. కాగా ఆలయాన్ని మూడెంచెల పద్ధతిలో నిర్మించినట్టు కనిపిస్తుంది. ఆలయం చుట్టూ కోటలాంటి కట్టడం కనిపిస్తుంది. తర్వాత రెండో అంచెలో మైదానం, మూడో అంచెలో గర్భగుడి నిర్మాణం జరిగినట్టుంది. ఇప్పడు కనిపిస్తున్న శిథిలాలే గర్భగుడిగా నిర్ధారణ అయ్యింది. మహాలక్ష్మి విగ్రహానికి విశిష్ట ప్రత్యేకలు లభ్యమైన మహాలక్ష్మి విగ్రహానికి ఎన్నో విశిష్ట ప్రత్యేకతలు కనిపిస్తున్నాయి. ఈ విగ్రహం అరుదైనదిని భావిస్తున్నారు. విగ్రహానికి నాలుగు చేతులున్నాయి. పైనున్న రెండు చేతుల్లో తామర పూలు ఉండగా, ఎడమ చేయి వరద హస్తం, కుడిచేయి అభయహస్తం కలిగి ఉన్నా యి. నుదుట మూడు నామాలు, శరీరంపై జం ద్యం ఉన్నాయి. అరచేతులు, కాళ్లకు రేఖలు కనిపిస్తున్నాయి. సుఖ ఆసనంలో ఉన్నట్టు కనిపిస్తున్న విగ్రహం మెడలో గొలుసు, ఇరువైపులా చెవులకు చక్రాలు, తలపై విష్ణువు ధరించే కిరీ టం కనిపిస్తాయి. అన్నింటికంటే ప్రధానంగా శిల్పం చెక్కిన తీరు అద్భుతం. సాధారణంగా శిల్పం ముందుభాగంలోనే విగ్రహం తయారవుతుంది. ఈ విగ్రహానికి ముందు, వెనుక రెండు వైపులా శిల్పాన్ని తయారు చేశారు. ఒకవైపే కాకుండా ముందు, వెనుక వైపు శరీర ఆకృతి ఉండడం విశేషం. పోలీస్స్టేషన్లో శ్రీమహాలక్ష్మి పాపం దేవుళ్లకు పోలీస్స్టేషన్కు వెళ్లక తప్పలేదు. శీలంవారిపల్లె సమీపంలోని కోనాపు రం పొలంలో సోమవారం శ్రీమహాలక్ష్మి విగ్రహం బయల్పడ్డ విషయం తెలిసిందే. గ్రామస్తులు అధికారులకు సమాచారం ఇవ్వడంతో తహసీల్దార్ సుబ్బన్న, ఎస్ఐ సుమన్ పరిశీలిం చి వివరాలు నమోదు చేశారు. శ్రీమహాలక్ష్మి విగ్రహాన్ని ఎస్ఐకి తహసీల్దార్ అప్పగించారు. ఎస్ఐ సోమవారం రాత్రి పోలీస్స్టేషన్కు తీసుకొచ్చారు. గదిలో నేలపై వస్త్రాన్ని పరచి విగ్రహాన్ని పడుకోబెట్టారు. ఆలయంలో ఉండాల్సిన శ్రీమహాలక్ష్మి ఇలా పోలీస్స్టేషన్ చేరుకుంది. విగ్రహాన్ని తమకు అప్పగించాలని పలు గ్రామాలకు చెందిన ప్రజలు అధికారులను కోరారు. నిబంధనల ప్రకారం ఇవ్వడానికి కుదరదని స్పష్టంచేసి తీసుకొచ్చారు. మంగళవారం మళ్లీ అధికారుల వద్దకు వెళ్లిన గ్రామస్తులు రాతి విగ్రహం ఇస్తే పూజలు చేసుకుంటామని, తమ సంరక్షణలో ఆలయంలో ఉంచుతామని పట్టుబట్టారు. దీనిపై విగ్రహం అప్పగించేందుకు తహసీల్దార్ సుబ్బన్న అంగీకరించారు. విగ్రహాన్ని అప్పగించనున్నట్టు ఆయన తెలిపారు. లిపిని శోధించాలి వీరగల్ శిలాశాసనంలోని లిపిని శోధిస్తే ఆలయ చారి త్రక ఆధారాలు లభ్యమవుతాయి. ఈ లిపి తెలుగు–కన్నడ భాష కనిపిస్తోంది. ఆలయ ప్రాం గణం, లభించిన మహాలక్ష్మి విగ్రహాన్ని పరి శీలిస్తే అది కచ్చితంగా విష్టు ఆలయమే. అయితే చెన్నకేశవ, నరసింహ, వేణుగోపాలస్వామి ఆలయాల్లో ఒకటి కావొచ్చు. ఇది శిలలు, వాటిపై చెక్కిన బొమ్మలను పరి శీలిస్తే పల్లవరాజుల శైలి, విజయనగర రాజు ల చిహ్నలు ఉన్నాయి. దీన్నిబట్టి శిథిలాల్లో ఇంకా శాసనాలు లభ్యమయ్యే అవకాశాలు ఉన్నాయి. విగ్రహాలు కూడా లభించవచ్చు. ఆలయ చరిత్ర వెలుగులోకి తీసుకురావడానికి కృషిజరగాలి. – విజయకుమార్, రిటైర్డ్ డెప్యూటీ డైరెక్టర్, పురావస్తుశాఖ ఆలయ విగ్రహాల తరలింపు శిథిలాలున్న ప్రాంతంలో కోనాపురం గ్రామంగా ఉండేదని మా పూర్వీకులు చెప్పేవారు. ఆలయానికి చెందిన ధ్వజస్తంభం, బలిపీఠాన్ని బి.కొత్తకోట మండలంలోని కాండ్లమడుగు అమరనారాయణపురం ఆలయంలో ప్రతి ష్ఠించారు. కొన్నింటిని తిరుమల, తెట్టు వేణుగోపాలస్వామి, గట్టులోని ప్రసన్న వెంకటరమణస్వామి ఆలయాలకు తరలించినట్టు చెప్పేవారు. ఆలయ నిర్వహణకు సంబంధించిన కొన్నిపేర్లు వాడుకలో ఉన్నాయి. వాయిద్యాకారులకు ఇచ్చిన భూమి ప్రాం తాన్ని మేళ్లచెరువుగా, పూలను తెచ్చేవారి కోసం నిర్మించిన ప్రాంతాన్ని పూలచెట్ల బావిగా, ఉత్సవాల కోసం పేరుమాళ్లబండ పేర్లతో పిలుచుకునే ప్రాంతాలు ఇప్పటికీ ఉన్నాయి. – శీలం వేణుగోపాల్రెడ్డి, మాజీ సర్పంచ్, శీలంవారిపల్లె -
విద్యార్థి దారుణ హత్య
సాక్షి, తిరుపతి : నగరంలోని ఓ ప్రైవేటు కళాశాల విద్యార్థిని దారుణంగా హత్యచేసిన ఘటన సోమవారం తిరుపతిలో చోటుచేసుకుంది. అలిపిరి పోలీస్స్టేషన్ ఎస్ఐ షేక్షావలి తెలిపిన వివరాల మేరకు.. కడప జిల్లా కోడూరుకు చెందిన ద్వారకానాథ్(20) తిరుపతి–రేణిగుంట రోడ్డులోని ఓ ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో బీబీఏ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. స్థానిక శెట్టిపల్లెలో స్నేహితుడు సాయితో కలిసి అద్దెకు గదిలో ఉంటున్నాడు. విద్యార్థి తలిదండ్రులు కువైట్æలో ఉంటున్నారు. ఇలా ఉండగా కొంతకాలంగా బయట విద్యార్థులతో గొడవలు పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం ఎంఆర్. పల్లిలోని కొందరు వ్యక్తులతో ద్వారకానాథ్ గొడవ పడినట్లు సమాచారం. అనంతరం ఆ యువకులు విద్యార్థిన్ని శెట్టిపల్లి గేటు సమీపంలోకి పిలిపించారు. అక్కడికి వచ్చిన ద్వారకనాథ్పై బీరుబాటిళ్లతో దాడి చేసి కత్తులతో మెడపై పొడిచారు. తీవ్రంగా గాయపడిన యువకుడిని గుర్తించిన కొందరు రుయా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ యువకుడు మృతి చెందాడు. సమాచారం అందుకున్న అలిపిరి పోలీసులు ఆస్పత్రికి చేరుకుని విచారిస్తున్నారు. హత్యకు పాల్పడిన వారి కోసం గాలిస్తున్నారు. కేసు నమోదు చేనసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎస్వీ కళాశాలకు తరలించారు. -
తిరుమల శ్రీవారికి భారీగా విరాళాలు..
సాక్షి, తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు పరిధిలోని వివిధ ట్రస్తులకు శుక్రవారం రూ.4.5 కోట్ల విరాళాలు అందాయి. ఇందులో ఓ అజ్ఞాత భక్తుడు టీటీడీలోని వివిధ ట్రస్టులకు రూ.2.4 కోట్లను విరాళంగా అందించాడు. శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి ఆ దాత డీడీని అందజేశాడు. అయితే మరి కొందరు దాతలు 2.1 కోట్లను విరాళంగా ఇవ్వగా వీటిలో అన్నప్రసాదానికి రూ.కోటి, గోసంరక్షణ ట్రస్టుకు రూ.10లక్షలు, శ్రీనివాస శంకరనేత్రాలయ ట్రస్టుకు రూ.10 లక్షలు, బర్డ్ ఆసుపత్రి ట్రస్టుకు రూ.40లక్షలు, శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకానికి రూ.20లక్షలు, ప్రాణ దాన ట్రస్టుకు రూ.30లక్షల విరాళాలను భక్తులు టీటీడీ అధికారులను కలసి అందజేశారు. -
వేళకురాని వైద్యులు..రోగుల ఎదురుచూపులు
వైద్యో నారాయణో హరి అన్నారు పెద్దలు. వైద్యులు దేవుడితో సమానమని దీని అర్థం. అంతటి ప్రాధాన్యత ఉన్న డాక్టర్లు సమయ పాలన పాటించకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. సరైన సమయంలో వైద్యం అందక పలువురు మృత్యు ఒడికి చేరుకోవాల్సిన పరిస్థితి వస్తోంది. వరదయ్యపాళెం మండలం చిన్న పాండూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఈ దుస్థితి కనిపిస్తోంది. సాక్షి, వరదయ్యపాళెం : 24గంటలు స్థాయి కలిగిన మండలంలోని చిన్న పాండూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పనితీరు రోజురోజుకూ అధ్వానంగా మారుతోంది. వైద్యుల నిర్లక్ష్యం వల్ల సామాన్యులకు వైద్యసేవలు దూరమవుతున్నాయి. ముగ్గురు వైద్యులున్న ఈ ఆస్పత్రిలో సోమవారం ఉదయం 11గంటలు కావస్తున్నా ఏ ఒక్కరూ హాజరుకాలేదు. వైద్యం కోసం వచ్చిన రోగులు డాక్టర్ల కోసం నిరీక్షించాల్సిన పరిస్థితి. నిరీక్షించలేని రోగులు ఆస్పత్రిలో ఉన్న నర్సు ద్వారా తాత్కాలిక వైద్యం చేయించుకుని వెనుదిరిగారు. 11 గంటలు దాటిన తర్వాత ఓ వైద్యాధికారి వచ్చారు. మరో వైద్యాధికారిణి 11.40గంటలకు వచ్చారు. సరిగ్గా ఒంటిగంటకు వీరు తిరుగుపయనమయ్యారు. ఆస్పత్రికి వైద్యం కోసం ప్రతిరోజూ 100మందికి వస్తుంటారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఆ సంఖ్య క్రమేణా తగ్గుతోంది. మండు వేసవి కారణంగా గ్రామాల్లో వడదెబ్బ బాధితులు అధికంగా ఉన్నారు. విషజ్వరాలు కూడా ప్రబలమవుతున్నాయి. ఇటీవల చిన్న పాండూరు ఆరోగ్య కేంద్రం పరిధిలోని ఎంజీనగర్ గిరిజనకాలనీలో ఊరంతా విషజ్వరాలు ప్రబలి నలుగురు మృతి చెందారు. అయినా ఇక్కడి వైద్యుల పనితీరులో మాత్రం మార్పు కనిపిం చడం లేదు. ప్రభుత్వ నిబంధనలకు తూట్లు వేసవి కాలం దృష్ట్యా ఉదయం 10 గంటలపైబడి ప్రభుత్వ కార్యాలయాల వద్దకు సామాన్య ప్రజలను రప్పించద్దంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే చిన్న పాండూరు ఆస్పత్రిలో పది గంటల వరకు డాక్టర్లు విధులకు హాజరుకాకపోవడం గమనార్హం. ఆస్పత్రి పనితీరు రోజురోజుకూ దిగజారుతోంది. 24 గంటలు స్థాయి కలిగిన ఈ ఆరోగ్య కేంద్రంలో ముగ్గురు వైద్యులను ప్రభుత్వం నియమించింది. అయితే వీరు ముగ్గురు ఒక్క రోజు కూడా హాజరుకావడం లేదు. రోజు మార్చి రోజు విధులకు హాజరవుతూ హాజరు పట్టికలో మాత్రం నెలంతా హాజరైనట్లు నమోదు చేసుకోవడం గమనార్హం. ప్రభుత్వం తప్పనిసరిగా బయోమెట్రిక్ ఏర్పాటు చేయాలని ఆదేశించినప్పటికీ అక్కడ నెట్ పనిచేయలేదన్న సాకుతో బయోమెట్రిక్ విధానం అమలుకు నోచుకోలేదు. రోజులో విధులకు హాజరయ్యే ఆ ఒక్క వైద్యుడు సైతం 2గంటలు మాత్రమే విధులు నిర్వహించడం గమనార్హం. లక్షలకు లక్షలు జీతాలు తీసుకుంటూ మొక్కుబడి విధులు నిర్వహించడమేమిటంటూ పరిసర ప్రాంత ప్రజలు ప్రశ్నిస్తున్నారు. -
రైతే రాజయ్యేలా..
సాక్షి, శ్రీకాళహస్తి : రుణమాఫీ మాయాజాలంతో అంతు చిక్కని మోసం..విత్తన, ఎరువుల పంపిణీలో అవినీతి జాడ్యం..ధీమా ఇవ్వని పంటల బీమా, వాతావరణ బీమా పథకాలు..పంట రుణాల మంజూరులో తిరకాసులు..సంక్షేమ పథకాల లబ్ధిలో పైరవీలు...వెరసి ఐదేళ్ల టీడీపీ పాలనలో దగాపడ్డ అన్నదాతలు. తమను ఆదుకునే నాథుడే లేరా అంటూ ఎదురుచూస్తున్న తరుణంలో ప్రతిపక్షనేత వైఎస్.జగన్మోహన్రెడ్డి రూపంలో చిరుదివ్వెలా కనిపించిన వెలుగు.. మహాజ్వాలగా మారి అంధకారం నిండుకున్న రైతుల జీవితాల్లో వెలుగులు ప్రసరించ సాగింది. నవరత్నాల పథకాలతో సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేకూరేలా వరాలు ప్రకటించిన జననేత అన్నదాతలపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రజాసంకల్పయాత్రలో ప్రకటించిన హామీలపై అన్నదాతల్లో హర్షం వ్యక్తంమవుతోంది. ‘సహాయనిధి’ చాలా సంతోషం 2015లో అతివృష్టి కారణంగా రైతులు పూర్తిగా నష్టపోయినా ప్రభుత్వం ఆదుకోలేదు. ఈ ఏడాది అనావృష్టి కారణంగా రైతులు పూర్తిగా నష్టపోయినా ప్రభుత్వం పట్టించుకోలేదు. ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయిన రైతులకు రూ.4 వేల కోట్లు సహాయనిధి ఏర్పాటు చేస్తామని జగన్ హామీ ఇవ్వడం హర్షణీయం – కలివేలయ్య, పాపనపల్లి వడ్డీ రాయితీతో ఎంతో మేలు బ్యాంకుల్లో తీసుకునే పంట రుణాలకు ప్రభుత్వమే వడ్డీ చెల్లించి రైతులకు పూర్తిగా రాయి తీ కల్పించడం ఎంతో మేలు. టీడీపీ ప్రభుత్వం విధానాలతో పంట రుణాలపై వడ్డీలు విపరీతంగా పెరిగిపోయాయి. జగన్ ఇచ్చిన హామీ పేద రైతులకు ఎంతో మేలు. – ప్రసాద్నాయుడు,, సూరావారిపల్లి -
ప్రియుడు మోసం చేశాడని ఆత్మహత్యాయత్నం
-
రైతుల భూములపై మంత్రి కన్ను
-
వేధింపులతో వివాహిత ఆత్మహత్య
ఐరాల: అత్తమామలు, భర్త వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో శనివారం జరిగింది. ఎస్ఐ ప్రసాద్రావు కథనం మేరకు.. నాగవాండ్లపల్లె పంచాయతీ వీఎస్ అగ్రహారానికి చెందిన బావాజాన్కు రెండేళ్ల క్రితం పలమనేరుకు చెందిన జాస్మిన్(23)తో వివాహమైంది. వారికి ఇంకా సంతానం కలుగలేదు. దీంతో అత్తమామలు, భర్త వేధిస్తున్నారు. ఈ క్రమంలో మనస్తాపం చెందిన జాస్మిన్ శుక్రవారం రాత్రి ఇంటిలో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగింది. కొన ఊపిరితో కొట్టుమిట్టూడుతున్న ఆమెను కుటుంబ సభ్యులు హుటాహుటిన చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ శనివారం వేకువజామున మృతి చెందింది. సమాచారం అందుకున్న తహసీల్దార్ ప్రసాద్ బాబు అక్కడికి చేరుకుని పంచనామా చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
ధ్యానం గోడౌన్లో అగ్నిప్రమాదం
-
అదే తీరు.. 9తోనే సరి
సాక్షి, చిత్తూరుఎడ్యుకేషన్ : ప్రజాసమస్యల పరిష్కారానికి ప్రతి మూడు నెలలకొకసారి జరిగే జెడ్పీ సర్వ సభ్య సమావేశం నిర్వహణలో తీరు మారలేదు. ఎప్పటి లాగే ప్రధాన అంశాలు చర్చకు రాలేదు. శనివారం స్థానిక అంబేడ్కర్ భవనంలో జెడ్పీ చైర్పర్సన్ గీర్వాణి అధ్యక్షతన జరిగిన జిల్లా పరి షత్ సర్వసభ్య సమావేశంలో చిన్న చిన్న సమస్యలపైనే చర్చించి, మమ అనిపించారు. సమావేశానికి పరిశ్రమలశాఖ మంత్రి అమరనాథరెడ్డి హాజరయ్యారు. ఎంపీ, టీడీపీ ఎమ్మెల్యేలు ఒక్కరు కూ డా సమావేశానికి కాకపోవడం గమనార్హం. ఇక జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు మాత్రం సమావేశానికి యథావిధిగా హాజరయ్యారు. ఈ సమావేశంలో జేసీ గిరీషా, జెడ్పీ సీఈఓ రవికుమార్నాయుడు, ఏఓలు ప్రభాకర్రెడ్డి, వెంకటరత్నం, అధికారులు పాండురంగస్వామి, విజయకుమార్, రవిప్రకాష్రెడ్డి, కుర్మానాథ్, ఎమ్మెల్సీ గౌని వారి శ్రీనివాసులు, దొరబాబు, జిల్లా గ్రంథా లయ చైర్మన్ కన్నయ్యనాయుడు పాల్గొన్నారు. టీడీపీ జెడ్పీటీసీ సభ్యురాలి బైఠాయింపు జెడ్పీ పాలకవర్గం తమకు అనుకూలంగా ఉన్న వారికే నిధులు కేటాయిస్తోందని నాగలాపురం టీడీపీ జెడ్పీటీసీ సభ్యురాలు సుజాత సమావేశంలో స్టేజీ ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. తాను బీసీ మహిళనని తనకు న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సీసీ రోడ్లు, తదితర పనులను తమ మండలానికి కేటాయించడం లేదని తెలిపారు. తొమ్మిదింటితో సరిపెట్టేశారు జెడ్పీ సమావేశం ఉదయం 11.10 గం టలకు ప్రారంభమైంది. మధ్యాహ్నం 2 గంటల వరకు జరిగిన ఈ సమావేశంలో టీడీపీ జెడ్పీటీసీ సభ్యుల కాంట్రాక్టులకు సంబంధించిన జీఎస్టీపై 45 నిమిషాలు గడిపేశారు. అనంతరం రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు దేశాయ్ తిప్పారెడ్డి, సునీల్కుమార్, పుంగనూరు జెడ్పీటీసీ సభ్యుడు, వైఎస్సార్ సీపీ ఫ్లోర్లీడర్ వెంకటరెడ్డి యాదవ్ గళం విప్పారు. అజెండాలో 42 అంశాలు ఉండగా కేవలం 9 అం శాలపై మాత్రమే చర్చలు జరిపి తూతూ మం త్రంగా సభను ముగించేశారు. సాక్షరభారత్ రద్దుపై వాడివేడి చర్చ రాష్ట్ర ప్రభుత్వం సాక్షరభారత్పై కుట్రపన్ని ఆ కార్యక్రమాన్ని రద్దు చేసిందని పుంగనూరు జెడ్పీటీసీ సభ్యుడు వెంకటరెడ్డియాదవ్ ఆరోపించారు. దీనిపై మంత్రి అమరనాథరెడ్డి జోక్యం చేసుకుని ఆ నిర్ణయం తమది కాదని కేంద్రప్రభుత్వం రద్దు చేసిందని సమాధానమిచ్చారు. ఏ ఇతర రాష్ట్రాల్లో లేని రద్దు రాష్ట్రంలో మాత్రమే ఎందుకు విధించారని సభ్యులు ప్రశ్నించారు. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరుకాకుండా ఇక్కడ మాట్లాడితే ఏం లాభముంటుందని మంత్రి అన్నారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే దేశాయ్ తిప్పారెడ్డి మాట్లాడుతూ ‘నువ్వు వైఎస్సార్ సీపీ గుర్తుపై ఎమ్మెల్యేగా గెలిచి.. పార్టీ మారావు. నీవు మాకు నీతులు చెప్పడం ఏమిటి?.’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వైఎస్సార్ సీపీ, టీడీపీ జెడ్పీటీసీ సభ్యుల మధ్యవాదోపవాదాలు జరిగాయి. విద్యాశాఖపై సుదీర్ఘచర్చ అజెండాలో రెండో అంశమైన విద్యాశాఖపై సుదీర్ఘ చర్చ జరిగింది. ఎమ్మెల్సీ యండపల్లి శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ మధ్యాహ్నభోజన నిధులు విడుదల కావడం లేదని, విద్యాసంవత్సరం ప్రారంభమైనా విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్ అందించలేకపోయారన్నారు. ప్రభుత్వ సొమ్మును ఖర్చుపెట్టి ఇషా విద్యను నడపడం సబబు కాదన్నారు. రామసముద్రం జెడ్పీటీసీ రామచంద్రారెడ్డి మాట్లాడుతూ జెడ్పీ పాఠశాల స్థలాలను ఎందుకు కాపాడుకోలేకపోతున్నారని ప్రశ్నించారు. ఎమ్మెల్యే సునీల్కుమార్ మా ట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయకనే దాన్ని టీడీపీ నాయకుల ఘనతగా పాఠ్యపుస్తకాల్లో ముద్రించాలనడం సరైన పద్ధతి కాదన్నారు. రైతులకు జిప్సం అందడంలేదు ఐరాల, పూతలపట్టు ప్రాంతాల్లో చాలా మంది రైతులకు జిప్సం అందడం లేదు. జిల్లా పరిషత్ సమావేశంలో ప్రజాసమస్యలపై మాట్లాడుతుంటే టీడీపీ నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేయడం బాధాకరం. ప్రజా సమస్యలపై వారు చర్చించరు... మేము చర్చిస్తే విరుద్ధంగా అడ్డుకునేందుకు ప్రయత్నిస్తారు. పాఠశాలల్లో కంప్యూటర్లు ఉన్నాయే గాని బోధించేందుకు టీచర్లు లేకపోవడం దారుణం. – సునీల్కుమార్, పూతలపట్టు ఎమ్మెల్యే మోడల్ స్కూళ్లలో అడ్మిషన్లు జరపడం లేదు మోడల్ స్కూళ్లల్లో పేద విద్యార్థులు చేరడానికి వెళుతుంటే అడ్మిషన్లు లేవని ప్రిన్సిపాళ్లు తిప్పి పంపుతున్నారు. 20 శాతం అధికంగా విద్యార్థులను చేర్చుకోవచ్చనన్న నిబంధన ఉన్నప్పటికీ అడ్మిషన్లు చేయడం లేదు. ఈ విషయంపై డీఈఓ మోడల్ స్కూల్ ప్రిన్సిపాళ్లకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాల్సిఉంది. ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ల కొరత ఉండడంతో పేద విద్యార్థులకు అన్యాయం జరుగుతోంది. – దేశాయ్ తిప్పారెడ్డి, మదనపల్లె ఎమ్మెల్యే ఫలితం దక్కడం లేదు ప్రతిసారీ సర్వసభ్య సమావేశానికి, స్థాయి సంఘ సమావేశాలకు హాజరవుతూనే ఉన్నాం. జెడ్పీకి ఎన్ని నిధులు వచ్చా యి... ఏఏ పనులకు ఖర్చు పె ట్టారు... అన్న వివరాలను చెప్పడం లేదు. పాఠశాలలో అదనపు తరగతులు అవసరమున్న చోట కట్టకుండా ప్రభుత్వ నిధులను వృథా చేస్తున్నారు. సర్వసభ్య సమావేశంలో ప్రజా సమస్యలపై చర్చిస్తున్నా ఫలితం దక్కడం లేదు. – వెంకటరెడ్డి యాదవ్, జెడ్పీటీసీ సభ్యుడు, పుంగనూరు -
జిల్లా జడ్జిగా మౌలాన్ జునైద్ అహ్మద్
సాక్షి, చిత్తూరు అర్బన్ : జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా మౌలాన్ జునైద్ అహ్మద్ను నియమిస్తూ తెలుగు రాష్ట్రాల ఉమ్మడి ఉన్నత న్యాయస్థానం శనివారం ఆదేశాలు జారీ చేసింది. చిత్తూరులో పనిచేస్తున్న సిహెచ్.కనకదుర్గారావు ఈనెల 30న పదవీ విరమణ చేయనున్నారు. నెల్లూరులో పనిచేస్తున్న మౌలాన్ జునైద్ అహ్మద్ను చిత్తూరుకు బదిలీ చేశారు. -
వైఎస్ జగన్తో కలిసి పండుగ జరుపుకోవడం మా అదృష్టం
-
రామచంద్రపురం చేరుకున్న వైఎస్ జగన్ పాదయాత్ర
-
59వ రోజు పాదయాత్ర డైరీ
-
59వ రోజు పాదయాత్ర డైరీ
59వ రోజు 11–01–2018, గురువారం, బీరమాకుల గండ్రిక, చిత్తూరు జిల్లా. ఈరోజు ఉదయం వెదురుకుప్పంలో శారదమ్మ అనే అక్క.. తన కుమారుడి ఫొటో చేతిలో పట్టుకుని, కళ్ల నిండా నీళ్లు పెట్టుకుని ‘అన్నా.. నేను అంగన్వాడీ టీచర్గా పనిచేస్తున్నాను. ఏడు నెలల కిందట నా కొడుకు రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. అంతకు సంవత్సరం మునుపే నా కుమారుడి పేరును చంద్రన్న బీమా పథకంలో నమోదు చేయించాను. అయినా నాకు ఇంతవరకూ పరిహారం అందలేదు’ అంటూ కన్నీటిపర్యంతమైంది. చేతికి అందివచ్చిన ఒక్కగానొక్క కొడుకు మరణించి పుట్టెడు శోకంలో ఉన్న ఆ తల్లికి ప్రభుత్వ సాయం అందకపోవడం చాలా బాధనిపించింది. మధ్యాహ్నం భోజన విరామం తర్వాత యాత్ర చంద్రగిరి నియోజకవర్గంలోకి ప్రవేశించింది. పార్టీ పతాకాల తోరణాల పందిళ్ల కింద.. వేలాది మంది వెంటరాగా కోలాహలంగా సాగింది. నెమలిగుంటపల్లె జరిగిన రైతన్నల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నాను. అక్కడ మునుస్వామి అనే రైతు ‘అన్నా.. నాకు పొలం ఉంది. నీళ్లూ ఉన్నాయి. అయినా బీడుపెట్టుకున్నాను’ అన్నాడు. ఆశ్చర్యంతో ‘ఎందుకన్నా?..’ అని అడిగాను. ‘ఈ ప్రభుత్వం మీద నమ్మకం లేదు. కష్టపడి పంట వేసినా.. గిట్టుబాటు ధరలేక పెట్టుబడులు కూడా వస్తాయో లేదోనన్న భయంతో సాగుచేసుకోలేదు’ అన్నాడు. మాట్లాడిన మిగతా రైతులు కూడా తమ ఆవేదనను, అభద్రతాభావాన్ని వ్యక్తపరిచారు. రోజురోజుకూ దిగజారుతున్న రైతన్నల పరిస్థితి ఆందోళన కలిగించింది. సంక్రాంతి పండగ దగ్గరపడుతోంది. కానీ రైతన్నలలో ఆ కళ ఏమాత్రం కనిపించడంలేదు. సంక్రాంతి అంటేనే భోగభాగ్యాలతో, సిరిసంపదలతో, సుఖసంతోషాలతో చేసుకునే పర్వదినం. తొలి పంట ఇంటికి వచ్చి ఆనందంగా జరుపుకొనే రైతుల పండగ. జనావళికి అన్నం పెట్టే అన్నదాత ఆనందానికి మించిన పండగ ఇంకేముంటుంది? అందుకే శ్రమకు, సంపదకు గొప్ప స్థానం ఇచ్చే ఈ సంక్రాంతి పండగను సంక్రాంతి లక్ష్మి అని కూడా పిలుచుకుంటాం. కానీ ఇప్పుడు ఆ ‘ఊరంతా సంక్రాంతి.. జగమంతా క్రాంతి’ ఏమైపోతోంది? ప్రస్తుత ప్రభుత్వ వైఖరితో.. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ క్రమక్రమంగా దెబ్బతింటున్న నేపథ్యంలో ‘అమ్మబోతే అడవి.. కొనబోతే కొరివి’ చందంగా పరిస్థితులు నెలకొన్నాయి. ఆరుగాలం కష్టపడి రైతన్న పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదు. మార్కెట్లో మాత్రం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. మన రాష్ట్రంలో దాదాపు 65 శాతం వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. దేశానికే అన్నం పెట్టే అన్నపూర్ణగా మన రాష్ట్రం ప్రసిద్ధి. పాలకుల దృక్పథం, వైఖరి రైతన్నల నుదిటి రాతను మార్చగలవు. వ్యవసాయాన్ని ప్రజల జీవన విధానంగా గుర్తించి ప్రోత్సహిస్తే వ్యవసాయం నిజంగా పండగే. రైతన్నలందరూ పదే పదే నాన్నగారి హయాంను స్మరించుకోవడానికి కారణం అదే. ఏం జరిగినా పాలకుడు తోడున్నాడనే ధైర్యం, వ్యవసాయం లాభసాటి వ్యాపకమన్న నమ్మకం కలిగించగలగాలి. రైతులు బాగుండాలని బలంగా కోరుకోవాలి. అంతేగానీ.. కేవలం తన స్వార్థం కోసం కొద్దిమంది తన అనుయాయుల, బినామీల బాగోగుల కోసం ఆలోచించి రైతులను బలిపీఠం ఎక్కిస్తే.. వ్యవసాయం దండగ కాక మరేమవుతుంది? ఒక్కసారి చంద్రబాబు గారు ఆత్మావలోకనం చేసుకోవాలి. మీ హయాంలోనే సాగు విస్తీర్ణం దారుణంగా ఎందుకు తగ్గిపోతోంది? మీరు అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే సహకార కర్మాగారాలు ఎందుకు మూతపడుతున్నాయి? మీ పాలనలోనే బ్యాంకులు నిర్దేశిత లక్ష్యాలకన్నా తక్కువ రుణాలను ఎందుకు మంజూరు చేస్తున్నాయి? మీ ప్రభుత్వంలోనే వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు లక్షల సంఖ్యలో ఎందుకు పెండింగ్లో ఉంటాయి? మీ ఏలుబడిలోనే రైతుల ఆత్మహత్యలు ఎందుకు పెరిగిపోతుంటాయి? కాపు మొండివెంగనపల్లెలో వృద్ధురాలిని పలకరిస్తున్న వైఎస్ జగన్ -
57వ రోజు పాదయాత్ర డైరీ
57వ రోజు 09–01–2018, మంగళవారం చిప్పారపల్లి శివారు, చిత్తూరు జిల్లా. అసలే చలికాలం.. ఆపై ఉదయం నుంచి ఆకాశమంతా మబ్బులు పట్టినట్టే ఉంది.. భానుడి జాడే లేదు.. ఆ చలిగాలిలోనే పూతలపట్టు నియోజకవర్గం నుంచి గంగాధర నెల్లూరు నియోజకవర్గంలోకి అడుగుపెట్టాను. జిల్లాలోని వెనుకబడిన నియోజకవర్గాల్లో ఇదొకటి. సమస్యలు ఎన్నెన్నో. ఉన్న సమస్యలు చాలక, ఈ నాలుగేళ్లలో ఒక్క పనీ జరగక.. ప్రజలు చాలా కష్టాలు పడుతున్నారు. దారికి ఇరువైపులా చెరకు, జామ, పూల తోటలు కనిపించాయి. కానీ పండించిన రైతన్నలకు మాత్రం కష్టాలు తప్పడంలేదు. పంటను సరైన ధరకు అమ్ముకునే వీలు లేదు, నిల్వ చేసుకునే వెసులుబాటూ లేదు. పంట చేతికొచ్చాక చచ్చినట్టు దళారులు చెప్పిన రేటుకు అమ్ముకోవాల్సిందే. అందుకే ఆరుగాలం కష్టపడి పండించిన రైతుల బతుకులు అంతలా నీరసించి కనిపిస్తున్నాయి. చెరకు అంటేనే తీపికి ప్రతీక. ఆ రైతులది మాత్రం.. నష్టాల కష్టాల చేదును దిగమింగుతూ మనకు తీపిని పంచే తాపత్రయం. భోజన విరామానికి ముందు మాణిక్యరాయపల్లి వద్ద కాలికి కట్టు కట్టుకుని కుంటుతూ.. చేతిలో చెరకు రసం, నల్లని బెల్లంతో ఓ రైతన్న వచ్చాడు. ఏమైందీ.. అని అడిగాను. ‘అన్నా.. పొలంలో పనిచేసుకుంటుంటే కాలికి గాయమైంది. దాంతో జ్వరం వస్తోంది. అయినా నీకు నా కష్టం చెప్పుకోవాలని వచ్చాను’ అన్నాడు. ఆ రైతన్న చెప్పిన కష్టానికి, ఆరోగ్యం సహకరించకున్నా నాతో చెప్పుకోవాలన్న తపనకు, నాపై ఉంచిన నమ్మకానికి గుండె బరువెక్కింది. వారి కుటుంబ సభ్యులంతా సంవత్సర కాలం కష్టపడి.. బెల్లం తయారు చేసి.. అమ్ముకుందామనుకుంటే గిట్టుబాటు ధర లేదట. అమ్మినా ఆ వచ్చే డబ్బు.. తెచ్చిన అప్పులకు, వడ్డీలకే సరిపోదట. పోనీ చక్కెర ఫ్యాక్టరీలకు చెరకు అమ్ముదామంటే.. అది మరింత దారుణం. అన్నీ ప్రైవేటు చక్కెర కర్మాగారాలే. వారు విదిలించే రేటుకే పంటను కట్టబెట్టాలి. దానికన్నా బెల్లం తయారీయే నయం. కానీ చంద్రబాబు ఇక్కడ పండే బెల్లంపై నల్ల బెల్లం అనే ముద్ర వేసి, ఆంక్షలు విధించి, గత్యంతరం లేని పరిస్థితుల్లో ప్రైవేటు చక్కెర ఫ్యాక్టరీలకే అమ్ముకోవాల్సిన పరిస్థితిని కల్పిస్తున్నాడు. ప్రభుత్వం సహకార చక్కెర ఫ్యాక్టరీలను మూసివేయించి, చెరకు రైతుల వెన్ను విరుస్తోంది. ఈ జిల్లాలో ఉన్న గ్రానైట్ పరిశ్రమదారులదీ దాదాపు ఇలాంటి వ్యథే. బాబు గారు ముఖ్యమంత్రి కాగానే గ్రానైట్పై రాయల్టీని, కరెంటు చార్జీలను విపరీతంగా పెంచాడు. దాంతో ఈ పరిశ్రమలన్నీ నష్టాల బాట పట్టాయి. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కుప్పంలో మాత్రం రాయల్టీని వెయ్యి రూపాయలు తగ్గించాడు. దీంతో అక్కడ ఆయన బినామీలు, అనుయాయులైన గ్రానైట్ వ్యాపారులు బాగా లబ్ధి పొందుతున్నారు. మిగతా ప్రాంతాల్లోని గ్రానైట్ వ్యాపారులు అదే రేటుకు అమ్ముకుంటే వారికి గిట్టుబాటు కాదు. పోనీ రేటు పెంచుదామనుకుంటే మార్కెట్ ఉండదు.. విధిలేక పరిశ్రమలను మూసివేసుకోవాల్సిన గత్యంతరం లేని పరిస్థితి. ఎంత దారుణం! చివరిగా, ముఖ్యమంత్రి గారికి నాదో ప్రశ్న.. కుప్పం నియోజకవర్గంలోని గ్రానైట్ ఫ్యాక్టరీలకు అనూహ్యంగా రాయితీలు, సడలింపులు ఇవ్వడం సబబేనా? మిగతా ప్రాంతాల్లోని ఫ్యాక్టరీలు ఏం పాపం చేశాయి? ఎందుకీ వివక్ష? అధికారం ఉందికదా అని ప్రభుత్వ వ్యవస్థలను మీ అనుయాయులకు, మీ బినామీలకు లబ్ధి చేకూర్చేలా మలచుకోవడం ఎంత వరకు సమంజసం? ఇదేనా మీ పారదర్శకమైన సుపరిపాలన? పెనుమూరులో ప్రజలకు అభివాదం చేస్తున్న వైఎస్.జగన్ -
తలుపులపల్లి చేరుకున్న వైఎస్ జగన్
-
55వ రోజు పాదయాత్ర డైరీ
-
55వ రోజు పాదయాత్ర డైరీ
55వ రోజు 07–01–2018, ఆదివారం చౌడేపల్లి క్రాస్, చిత్తూరు జిల్లా. తప్పెట్లు, మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, వేదపండితులు, హారతులతో బారులు తీరిన అక్కాచెల్లెమ్మలు, నాన్నగారి ప్రతిమలను తలపై ఉంచుకుని నడుస్తున్న అభిమానులు, పార్టీ పతాకాలను చేతబట్టిన కార్యకర్తలు, పలు రకాల వేషధారులు, పౌరాణిక పాత్రధారులతో ఉత్సాహభరితంగా చంద్రగిరి నియోజకవర్గంలో యాత్ర సాగింది. పండుగ వాతావరణాన్ని తలపించింది. ఇక్కడి ప్రజల ఇబ్బందులు, ఈ ప్రాంతంలో నెలకొన్న అనేకానేక సమస్యలు వింటుంటే ముఖ్యమంత్రి సొంత ప్రాంతంలోనే ఇన్ని సమస్యలా.. అని విస్మయం కలిగింది. ‘జననీ జన్మభూమిశ్చ.. స్వర్గాదపీ గరీయసి’ అన్నారు. అంతేకాదు, పుట్టిన ప్రాంతం కన్నతల్లితో సమానం అంటారు. ఎక్కడెక్కడో ఉన్న ఎన్నారైలు, ఇతర ప్రాంతాల్లో స్థిరపడిన వారు సైతం పుట్టిన ప్రాంతానికి ఏదో ఒకటి చేయాలని తాపత్రయపడుతూ ఉంటారు. సొంత ప్రాంతానికి మంచి చేసే అవకాశం రావడమే అదృష్టం. అటువంటి అవకాశం ఉండి కూడా ఏమీ చేయకపోవడాన్ని ఏమనుకోవాలి? ఈ నియోజకవర్గంలో తాగునీరు, రోడ్లు, హాస్పిటల్, చంద్రబాబు చదువుకున్న స్కూలు, మామిడి మార్కెట్టు.. ఇలా చెప్పుకుంటూపోతే అన్నింట్లోనూ సమస్యలే. ముఖ్యమంత్రిగా ఉండి సొంత ప్రాంతానికి ఏమీ చేయని వ్యక్తి రాష్ట్రాన్ని సింగపూర్ చేస్తానంటాడు. ఏ దేశానికి పోతే ఆదేశంలాగా చేస్తానంటాడు. దీన్ని చూస్తుంటే చంద్రబాబుగారి గురించి నాన్నగారు తరచూ చెప్పే సామెత.. ‘అమ్మకు అన్నం పెట్టనోడు.. పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తానన్నాడట’ గుర్తొచ్చింది. దామలచెరువులో జరిగిన రచ్చబండ కార్యక్రమంలో చొక్కా లేకుండా వచ్చిన తాత మాట్లాడాడు. ఆయన పేరు వెంకటాచలంనాయుడు. వేలాది మంది రైతులకు, ఎంతో మంది కార్మికులకు జీవనాధారమైన చిత్తూరులోని విజయా డెయిరీ ఒకప్పటి ప్రాభవాన్ని, సొంత కంపెనీ హెరిటేజ్ ఎదుగుదల కోసం దాన్ని మూత వేయించడానికి చంద్రబాబు పన్నిన కుట్రలను, అది మూతపడటంతో నష్టపోయిన రైతాంగం గురించి, రోడ్డున పడ్డ కార్మిక కుటుంబాల గురించి కళ్లకు కట్టినట్టు వివరించాడు. అంతేకాదు, చంద్రబాబు నిర్వాకంతో రెండు సహకార చక్కెర ఫ్యాక్టరీలు మూతపడ్డాయని, అదే సమయంలో ప్రయివేటు చక్కెర ఫ్యాక్టరీలు మాత్రం లాభాలతో విలసిల్లాయని తెలిపాడు. చంద్రబాబుగారి మోసాన్ని, చేసిన అన్యాయాన్ని నిరసిస్తూ.. విజయా డెయిరీ తిరిగి ప్రారంభమయ్యే దాకా చొక్కా, చెప్పులు ధరించనని శపథం చేశాడట. చంద్రబాబు మోసాలకు వ్యతిరేకంగా సొంత ప్రాంతానికి చెందిన వ్యక్తే గాంధేయ మార్గంలో ఏళ్ల తరబడి పోరాటం చేస్తున్నాడంటేనే అది చంద్రబాబుకు సిగ్గుచేటయిన విషయం. దాన్ని ఏమాత్రం పట్టించుకోకపోవడం మరింత దారుణం. మధ్యాహ్నం గుండ్లపల్లి దగ్గర కూడా విజయా డెయిరీ కార్మికులు కలిసి ‘అన్నా.. మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే డెయిరీని తెరిపించండి.. మమ్మల్ని, రైతుల్ని ఆదుకోండి’ అని విన్నవించారు. మనసుకు చాలా బాధేసింది. కేవలం తన ఒక్కడి స్వార్థం కోసం ఇంతమంది రైతుల, కార్మికుల జీవితాలను బలిచేయడం ఎంత దారుణం. వారందరి ఉసురు పోసుకుని ఏం సాధించాలని! ఎంతకాలం బతికామన్నది కాదు.. ఎంతమంది గుండెల్లో బతికామన్నది ముఖ్యం. చివరిగా, ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. పుట్టిన ఊరు, చదువుకున్న స్కూలు బాగోగులు పట్టించుకోని మీరు.. రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా చేస్తాననడం హాస్యాస్పదం కాదా? పుదిపట్లబైలు వద్ద వేదవిద్యార్థితో మాట్లాడుతున్న వైఎస్ జగన్ -
ముగిసిన 49వ రోజు వైఎస్ జగన్ పాదయాత్ర
-
వైఎస్ జగన్ను కలిసిన కాంట్రాక్ట్ ఉద్యోగులు
-
9లో ప్రేమ విఫలం.. బలవన్మరణం
ములకలచెరువు: పట్టుమని 15 ఏళ్లు కూడా నిండకనే ప్రేమలో పడ్డాడు. ఇష్టపడిన బాలికకు తాను పంపిన బహుమతి నిరాకరించిందని మనస్తాపానికి గురయ్యాడు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన ములకలచెరువు హాస్టల్లో చోటు చేసుకుంది. వివరాలు.. నల్లగుట్టకు చెందిన బాలుడు జెడ్పీ హైస్కూల్లో 9వ తరగతి చదువుతూ హాస్టల్లో ఉంటున్నాడు. అదే పాఠశాలకు చెందిన ఒక బాలికను ప్రేమించాడు. బాలిక అతడి ప్రేమను తిరస్కరించడంతో మంగళవారం అర్ధరాత్రి హాస్టల్లో గుళికల మందు తిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. హాస్టల్ సిబ్బంది గమనించి అతడిని 108లో మదనపల్లె ఏరియా ఆస్పత్రికి తరలించారు. సంఘటనపై హాస్టల్ ఇన్చార్జ్ వార్డెన్ హరిబాబు వివరణ కోరగా.. ఆత్మహత్యకు యత్నించిన బాలుడు హాస్టల్లో ఉండడానికి దరఖాస్తు మాత్రమే చేసుకున్నాడని, అనుమతి ఇవ్వనప్పటికీ హాస్టల్లో ఉంటున్నాడని పేర్కొన్నారు. సంఘటనపై ఉన్నతస్థాయి అధికారులు సమాచారం చేరవేశామని వార్డెన్ చెప్పకొచ్చారు. -
ముగ్గురి ఆత్మహత్య
∙అమలాపురంలో తిరుపతికి చెందిన వైద్య విద్యార్థి ∙కాణిపాకంలో యువకుడు ∙పలమనేరు మండలంలో వివాహిత ∙ఉరి వేసుకుని మృతి వేర్వేరు కారణాలతో జిల్లా వాసులు ముగ్గురు ఉరి వేసుకుని బలవన్మరణం చెందారు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో చదువుతున్న తిరుపతికి చెందిన వైద్య విద్యార్థి, ఐరాలలో ఓ యువకుడు, పలమనేరు మండలంలో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్నారు. మానసిక ఒత్తిడితో వైద్య విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం అక్కడి విద్యార్థులను దిగ్భ్రాంతికి గురిచేసింది. తల్లిదండ్రులకు తీరని దుఃఖాన్ని మిగిల్చింది. అమలాపురం రూరల్: తూర్పు గోదావరి జిల్లా అమలాపురం కిమ్స్ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ నాలుగో సంవత్సరం చదువుతున్న తిరుపతికి చెందిన బండారం వివేక్ (23) కళాశాల హాస్టల్ గదిలో ఉరి వేసుకుని బుధవారం మధ్యాహ్నం ఆత్మహత్య చేసుకున్నాడు. మానసిక ఒత్తిడి వల్లే ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉండవచ్చని తోటి విద్యార్థులు, పోలీసులు అనుమానిస్తున్నారు. మానసిక ఒత్తిడి తగ్గటానికి వివేక్ మందులు వాడుతున్నట్లు తోటి విద్యార్థులు తెలిపారు. క్రమశిక్షణతో ఉండే వివేక్ చదువులో చురుగ్గానే ఉంటాడని, మితభాషి అని స్నేహితులు చెప్పారు. వివేక్ బుధవారం కళాశాలకు వెళ్లకుండా హాస్టల్ గదిలోనే ఉండిపోయాడు. మధ్యాహ్నం కళాశాల నుంచి హాస్టల్కు వచ్చిన రూమ్మేట్స్ సాయికృష్ణ, శ్రీకాంత్ తలుపు గడియ వేసి ఉండటంతో ఎంత పిలిచినా స్పందించకపోవటంతో తలుపులు పగులగొట్టారు. వివేక్ ఫ్యాన్కు ఉరివేసుకుని వేలాడుతుండటం చూసి దిగ్భ్రాంతి చెందారు. వివేక్ను కిందికి దింపి కిమ్స్ హాస్పిటల్కు తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. డీఎస్పీ ఏవీఎల్ ప్రసన్నకుమార్, తాలూకా ఎస్సై ఎం.గజేంద్రకుమార్ వివేక్ మృతదేహాన్ని, హాస్టల్ గదిని పరిశీలించారు. ఈనెల 21 నుంచి నాలుగో సంవత్సరం పరీక్షలు రాయాల్సి ఉండడంతో ఎక్కువగా చదువుతున్నాడని స్నేహితులు చెబుతున్నారు. వివేక్ తండ్రి భాస్కరరెడ్డి తిరుపతిలోని ఎస్బీఐలో అధికారిగా పనిచేస్తున్నారు. డీఎస్పీ విలేకరులతో మాట్లాడుతూ, వివేక్ మానసిక సమస్యలతో ఆత్మహత్య చేసుకున్నట్లు దర్యాప్తులో తేలిందని చెప్పారు. వివేక్ ఆత్మహత్యకు ముందు తన వ్యక్తిగత ట్యాబ్లో ఉరి వేసుకోవడానికి సంబంధించిన వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేసినట్లు ఆధారాలు కనిపించాయన్నారు. కిమ్స్ వైస్ చైర్మన్ మోహనరాజు వివేక్ మృతదేహాన్ని పరిశీలించారు. తల్లిదండ్రులకు ఫోన్ చేసి విచారం వ్యక్తం చేశారు. లాడ్జిలో ఉరి వేసుకుని యువకుడి మృతి కాణిపాకం: స్థానికంగా ఒక లాడ్జిలో యువకుడు ఉరి వేసుకుని మృతి చెందిన సంఘటన బుధవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. ఏఎస్ఐ యతిరాజులు కథనం మేరకు.. తిరుపతిలోని రైల్వే కాలనీకి చెందిన చంద్రారెడ్డి (29) మంగళవారం రాత్రి ఇక్కడ లాడ్జిలో రూము తీసుకున్నారు. బుధవారం మధ్యాహ్నం వరకు రూము తలుపులు తెరవకపోవడంతో లాడ్జి సిబ్బంది అనుమానించారు. కిటికీలోంచి రూములోకి చూడగా ఉరి వేసుకుని ఉన్న యువకుడు కనిపించాడు. అనంతరం పోలీసులకు సమాచారమివ్వడంతో వారు కుటుంబ సభ్యులకు తెలియజేశారు. మృతుడు ఐరాల మండలం ఎం.జంగాలపల్లెకు చెందినవాడని, ప్రస్తుతం తిరుపతిలో నివాసం ఉంటున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారని పోలీసులు చెప్పారు. ఏ కారణాల చేత ఆత్మహత్య చేసుకున్నాడో దర్యాప్తులో తేలాల్సి ఉంది. పలమనేరు మండలంలో వివాహిత.. గంగవరం: వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన పలమనేరు మండలం తొప్పనపల్లెలో బుధవారం సాయంత్రం వెలుగుచూసింది. వివరాలు..గ్రామానికి చెందిన సుబ్రమణ్యం, ఆయన భార్య పద్మ(35) తరచూ గొడవ పడేవారు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం ఆమె పొలం పనులకు వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చి వంటచేసింది. కిటికీకి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆలస్యంగా గమనించిన ఇరుగుపొరుగు వారు పోలీసులకు, 108కు సమాచారం చేరవేశారు. అయితే మృతికి కారణాలేమిటో పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. -
భార్య, అత్తమామలే కారణం..
► ఉరివేసుకుని యువకుడి ఆత్మహత్య ► తన చావుకు భార్య, అత్తమామలే కారణమంటూ సూసైడ్ నోట్ ► నలుగురిపై కేసు నమోదు వారిద్దరూ నాలుగేళ్లుగా గాఢంగా ప్రేమించుకున్నారు. నువ్వులేకనేను లేనని బాసలు చేసుకున్నారు. పెద్దలను ఎదిరించి మతాంతర వివాహం చేసుకున్నారు. సజావుగా సాగుతున్న వీరి సంసారంలో భార్య వివాహేతర సంబంధం చిచ్చు పెట్టింది. ఏడాది క్రితం విడిపోయారు. పుట్టినింటికి చేరుకున్న భార్య తల్లిదండ్రులు, ప్రియుడితో కలిసి భర్తపై ప్రతీకార చర్యలకు పాల్పడింది. దీంతో జీవితంపై విరక్తిచెందిన అతను తన చావుకు భార్య, ఆమె ప్రియుడు, అత్తామామలు, బావమరిది కారణమంటూ సూసైడ్ నోట్ రాసి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద సంఘటన శుక్రవారం రాత్రి మదనపల్లె మండలంలో చోటు చేసుకుంది. మదనపల్లె క్రైం: కొత్తవారిపల్లె పంచాయతీ యనమలవారిపల్లెలో నివాసముంటున్న డేనియల్ కుమారుడు కె.స్వరాజ్కుమార్ (26) మదనపల్లెలో డిగ్రీ వరకు చదువుకున్నాడు. కళాశాలకు వచ్చి వెళ్లే సమయంలో పట్టణంలోని ఇందిరానగర్లోని షేక్ హుస్సేన్, బషీరున్నీషా దంపతుల కుమార్తె యాస్మిన్తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారిది. నాలుగేళ్ల తర్వాత పెద్దలను ఎదిరించి మతాంతర వివాహం చేసుకున్నారు. వీరి కాపురం మూడేళ్లుసజావుగా సాగింది. ఎలక్ట్రీషియన్గా పనిచేస్తూ భార్యను పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో భర్త అంగీకారంతో యాస్మిన్ మదనపల్లెలోని ఓ నర్సింగ్ హోమ్లో పనిచేస్తోంది. ఈ క్రమంలో అక్కడ పనిచేసే శ్రీనివాసులుతో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ విషయం భర్తకు తెలియడంతో తరచూ గొడవలు పడేవారు. ఆమె పుట్టినింటికి చేరుకుని తల్లిదండ్రులు, ప్రియుడి సాయంతో భర్త స్వరాజ్కుమార్పై స్థానిక టూటౌన్లో కేసులు పెట్టింది. వీరి వేధింపులు తాళలేక స్వరాజ్కుమార్ జీవితంపై విరక్తి చెంది సూసైడ్ నోట్ రాసి నివాసం ఉంటున్న ఇంటి పైకప్పుకు సర్వీస్ వైర్తో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. స్వరాజ్కుమార్ మృతికి కారకులైన వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ రవిప్రకాష్రెడ్డి తెలిపారు. -
పెళ్లయిన రెండు రోజులకే..
ఆ యువకుడు కోరుకున్న యువతినే పెళ్లి చేసుకున్నాడు. జీవిత భాగస్వామితో జీవితాన్ని సంతోషంగా గడపాలని కలలుగన్నాడు. ఈడూజోడు చక్కగా ఉన్న ఆ జంటను చూసి అందరూ సంతోషించారు. ఆ సంతోషం ఎంతోసేపు నిలవలేదు. పసుపు దుస్తులు కూడా విప్పకుండానే మృత్యువు విద్యుత్ రూపంలో అతన్ని పొట్టన పెట్టుకుంది. కాళ్లపారాణి ఆరకనే, ఇంటిముందు వేసిన పందిరి తీయకనే వైధవ్యానికి గురికావడంతో ఆ యువతి చేస్తున్న రోదనలు అన్నీ ఇన్నీ కావు. నీతోపాటే నన్ను కూడా తీసుకుపోకూడదా సామీ.. అంటూ ఆమె ఆర్తనాదాలను చూసి స్థానికులు కంటతడి పెట్టారు. ఈ సంఘటన ములకలచెరువు మండలంలో శనివారం చోటుచేసుకుంది. ► మొబైల్ ఫోన్కు చార్జింగ్ పెడుతుండగా విద్యుత్ షాక్ ► నవ వరుడు మృతి ► మృతుడు కర్ణాటక వాసి ► కనుగొండవారిపల్లెలో విషాదఛాయలు ములకలచెరువు /మదనపల్లె క్రైం: మొబైల్ చార్జింగ్ పెడుతుండగా విద్యుత్ షాక్ గురై నవ వరుడు దుర్మరణం చెందిన సంఘటన ములకలచెరువు మండలంలో జరిగింది. స్థానికులు, కుటుంబ సభ్యుల కథనం మేరకు.. కర్ణాటక రాష్ట్రం బాగేపల్లె మండలం పరగోడుకు చెందిన మిద్ది నరసింహప్ప, నరసమ్మ దంపతుల కుమారుడు నరసింహులు(24) కర్ణాటక ఆర్టీసీలో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఇతనికి ఈ నెల 23న ములకలచెరువు మండలం గూడుపల్లి పంచాయతీ కనుగొండవారిపల్లె ఎస్సీ కాలనీకి చెందిన యాట వెంకటరమణ, రెడ్డెమ్మ దంపతుల కుమార్తె ప్రమీల(20)తో పెళ్లి జరిగింది. శుక్రవారం నవ దంపతులు కనుగొండవారిపల్లెకు మరువులకు వచ్చారు. రాత్రి 10 గంటల ప్రాంతంలో ఇద్దరూ నిద్రించారు. శనివారం తెల్లవారుజామున నరసింహులు తన మొబైల్కు చార్జింగ్ పెట్టేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఓవర్లోడు రావడంతో షాక్కు గురయ్యాడు. నరసింహులు గట్టిగా కేకలు వేస్తూ కింద పడిపోయాడు. వెంటనే నిద్ర నుంచి మేల్కొన్న ప్రమీల తీవ్రంగా గాయపడిన భర్తను కుటుంబ సభ్యుల సహకారంతో 108లో మదనపల్లి ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అతను మృతిచెందాడు. పెళ్లయి మూడు రోజులు కూడా కాకుండానే భర్త మృతిచెందడంతో ప్రమీల గుండెలు పగిలేలా రోదించింది. ఇక నాకు దిక్కెవరు, నన్ను కూడా నీతోపాటు తీసుకెళ్లిపోరాదా అంటూ తలను నేలకేసి బాదుకుంది. ఆమెను ఓదార్చడం ఎవరి వల్లా కాలేదు. నరసింహులు మరణవార్త తెలుసుకున్న తల్లిదండ్రులు, వారి బంధువులు, ప్రమీల కుటుంబ సభ్యులు ప్రభుత్వాస్పత్రికి పెద్ద సంఖ్యలో చేరుకుని బోరున విలపించారు. కనుగొండవారిపల్లెలో విషాదఛాయలు అలుముకున్నాయి. ములకలచెరువు ఎస్ఐ ఈశ్వరయ్య కేసు దర్యాప్తు చేస్తున్నారు. ట్రాన్స్ కో నిర్లక్ష్యమే ప్రాణాలు తీసిందా కొత్తమీటర్లు బిగించేందుకు ట్రాన్స్ కో అధికారులు ఇటీవల కనుగొండవారిపల్లె దళితవాడకు విద్యుత్ పాత మీటర్ల ను తొలగించారు. వారు తిరిగి కొత్తమీటర్లు బిగించకపోగా ఇళ్లకు డైరెక్ట్గా కరెంట్ సర్వీసులు ఇచ్చి వెళ్లిపోయారు. 2 నెలలుగా అధికారులు మీటర్లు అమర్చకుండా కాలయాపన చేయడం వల్ల విద్యుత్ ఓవర్ లోడు వస్తోంది. గ్రామంలోని భాస్కర్, అనిల్ విద్యుత్ షాక్కు గురైనట్టు గ్రామస్తులు తెలిపారు. నరసింహులు చావుకు అధికారుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. -
ప్రభుత్వాస్పత్రిలో కింగ్ కోబ్రా పిల్లలు!
చిత్తూరు: జిల్లాలోని ప్రధాన వైద్యశాలలోకి శనివారం తాచుపాములు రావడం తీవ్ర కలకలం రేపింది. ఆసుపత్రిలోని మెడికల్ వార్డులో గత మూడు రోజులుగా నల్లతాచుపాము(కింగ్ కోబ్రా) తిరుగుతోందని రోగులు సిబ్బంది దృష్టికి తీసుకెళ్లారు. వారు ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోకుండా వదిలేశారు. అయితే శనివారం మధ్యహ్నాం సమయంలో ఆసుపత్రిలోని టాయిలెట్ నుంచి తాచుపాము పిల్లలు బయటికివచ్చాయి. దీంతో ఒక్కసారిగా హడలిపోయిన రోగులు భయాందోళనలకు గురయ్యారు. అప్రమత్తమయిన ఆసుపత్రి సిబ్బంది పాము పిల్లల్ని చంపేశారు. మరికొద్దిసేపటి తర్వాత మరో నాలుగు తాచుపాము పిల్లలు వార్డులోకి వచ్చాయి. దాంతో అక్కడే పడకలపై ఉన్న వాళ్లంతా వార్డు నుంచి బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న సిబ్బంది మళ్లీ పాము పిల్లల్ని చంపి, దహన సంస్కారాలు నిర్వహించారు. కాగా, ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పాములు, ఎలుకలు కారణంగా రోగులు ఇబ్బందులు పడిన విషయం తెలిసిందే. -
జ్ఞాన సముపార్జన కోసమే విద్య
ఎస్వీయూ స్నాతకోత్సవంలో కేంద్రమంత్రి వెంకయ్య యూనివర్సిటీ క్యాంపస్ (తిరుపతి): ‘చదువు.. డిగ్రీల కోసమో, సంపాదనకో, ఉద్యోగం సాధించడానికో కాదు. జ్ఞాన సముపార్జన కోస మే. ఈ విషయాన్ని విద్యార్థులు గుర్తించాలి.’ అని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఉద్బోధించారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం 54వ స్నాతకోత్సవాన్ని సోమవారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజ రైన వెంకయ్య మాట్లాడుతూ దేశాభివృద్ధి గురించి రాజకీయాలకతీతంగా ఆలోచించాలని యువతకు పిలుపునిచ్చారు. ఏపీ, తెలంగాణ ల్లో ఇంజనీరింగ్ పూర్తిచేసిన వారు ఉపాధి పొం దలేక పోవడం ఆందోళన కలిగిస్తోందన్నారు. ‘మనం శాస్త్ర, పరిశోధనల్లో వెనుకంజలో ఉన్నాం. మంచి ఆలోచనలు, క్రమశిక్షణతో శ్రమపడితే విజయం తథ్యం.’ అని చెప్పారు. విద్యలో నాణ్యత పెరగాలి: గవర్నర్ ఉన్నతవిద్యలో నాణ్యత పెరగాల్సిన అవసరం ఉందని గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ అన్నారు. ఇష్టారాజ్యంగా కళాశాలలకు అనుమతివ్వడం వల్ల ఉన్నత విద్యలో నాణ్యత పడిపోయిందని వ్యాఖ్యానించారు. కాగా, కేంద్ర మంత్రి వెంకయ్య ప్రసంగిస్తున్నప్పుడు రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం నాయకులు ఆందోళన చేశారు. -
ఎస్వీయూలో వెంకయ్యకు చేదు అనుభవం
తిరుపతి: శ్రీ వేంకటేశ్వర యూనివర్శిటీ (ఎస్వీయూ) స్నాతకోత్సవంలో పాల్గొనడానికి వచ్చిన కేంద్రమంత్రి వెంకయ్య నాయుడుకు చేదు అనుభవం ఎదురైంది. తొలుత పలువురు విద్యార్థులకు పట్టాలు అందజేసిన వెంకయ్య నాయుడు అనంతరం ప్రసంగించేందుకు సిద్ధమైయ్యారు. ఆ సమయంలో కొంతమంది విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రత్యేక హోదాపై నిరసన కార్యక్రమం చేపట్టారు. వెంకయ్య ప్రసంగం ఆరంభం కాగానే ప్లకార్డులతో విద్యార్థులు నిరసన చేపట్టారు. ఏపీకీ ప్రత్యేక హోదా ఏమైందంటూ ఆందోళన చేపట్టారు. దీంతో అక్కడ పరిస్థితులు అదుపుతప్పడంతో ఆందోళనకు దిగిన విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. -
చంద్రబాబుకు సొంత జిల్లాలో షాక్
వైఎస్సార్ సీపీలో చేరిన చిత్తూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు జంగాలపల్లి అదే బాటలో ఖమ్మం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు వనమా వెంకటేశ్వరరావు పార్టీలోకి ఆహ్వానించిన జగన్మోహన్రెడ్డి విశ్వసనీయత కలిగిన జగన్తోనే వైఎస్ ఆశయాలు సాకారమవుతాయన్న నేతలు హెదరాబాద్: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఆయన సొంత జిల్లాలోనే రాజకీయ షాక్ తగిలింది. చిత్తూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు జంగాలపల్లి శ్రీనివాసులు ఆ పార్టీకి గుడ్బై చెప్పి మంగళవారం వైఎస్సార్ కాంగ్రెస్లో చేరారు. అలాగే తెలంగాణలోని ఖమ్మం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా పద్నాలుగేళ్ల పాటు సేవలందించిన వనమా వెంకటేశ్వరరావు కూడా పార్టీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్లో చేరారు. జంగాలపల్లి, వనమా ఇద్దరూ మంగళవారం వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఆయన నివాసంలో విడివిడిగా కలుసుకున్నారు. తమ అనుచరులతో వచ్చిన వీరిని జగన్ సాదరంగా ఆహ్వానించి పార్టీ కండువాలను వేసి పార్టీలోకి ఆహ్వానించారు. జంగాలపల్లి శ్రీనివాసులు చేరిక సందర్భంగా రాజంపేట లోక్సభా నియోజకవర్గం వైఎస్సార్ సీపీ సమన్వయకర్త పి.మిథున్రెడ్డి కూడా ఉన్నారు. బాబుకు విశ్వసనీయత లేదు: జంగాలపల్లి చంద్రబాబు ఏ మాత్రం విశ్వసనీయత లేని నాయకుడని, అసలు ఆయనకు మనుషులంటే అభిమానం లేదని, ఎవరినీ ఆదరించే రకం కాదని జంగాలపల్లి శ్రీనివాసులు విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశ్వసనీయతకు వారసత్వంగా ఉన్న నాయకుడు జగన్ ఒక్కరేనని, అందుకే ఆయన నాయకత్వంలో పని చేయాలని టీడీపీ అధ్యక్ష పదవిని వదులుకుని వైఎస్సార్ సీపీలో చేరానని మీడియాకు తెలిపారు. చిత్తూరు జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో చంద్రబాబు అనుసరిస్తున్న అస్తవ్యస్త విధానాలను పార్టీ నేతలు, కార్యకర్తలందరూ ముక్త కంఠంతో ఖండిస్తున్నామని, ఆయన చేసిన తప్పులను, అన్యాయాలను తప్పకుండా ప్రజలకు చాటి చెబుతామని అన్నారు. చంద్రబాబులో విశ్వసనీయత లేదని, జగన్లో విశ్వసనీయత ఉందని, ఇదొక్కటే తాను వైఎస్సార్ సీపీలో చేరడానికి కారణమని చెప్పారు. ‘ఇకపై జగన్ ఏం చెబితే జిల్లాలో అది చేస్తాం. ఆయన ముఖ్యమంత్రి అయ్యేందుకు అన్ని విధాలా గట్టిగా కృషి చేస్తాం’ అని శ్రీనివాసులు స్పష్టం చేశారు. వైఎస్ పథకాల వల్ల బడుగులకు మేలు: వనమా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాల వల్ల రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాల వారికి ఎంతో మేలు జరిగిందని, ఆయన వల్ల లబ్ధి పొందిన వారు తెలంగాణలో కూడా లక్షల సంఖ్యలో ఉన్నారని వనమా వెంకటేశ్వరరావు తెలిపారు. పార్టీలో చేరిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్సార్ ఆశయాల అమలుకు కృషి చేసే నాయకుడు జగన్ మాత్రమేనన్న నమ్మకంతో వైఎస్సార్ కాంగ్రెస్లో చేరానన్నారు. పద్నాలుగేళ్లు నిబద్ధతతో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా పని చేసిన తనను కాంగ్రెస్ పార్టీ చివరి దశలో మోసం చేసిందన్నారు. కాంగ్రెస్, సీపీఐ రెండూ నిబద్ధత లేని పార్టీలని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఖమ్మం లోక్సభా స్థానం పార్టీ సమన్వయకర్త పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ వనమా పార్టీలో చేరినందుకు తమకు ఆనందంగా ఉందని, ఆయన చేరిక తెలంగాణలో వైఎస్సార్సీపీ ప్రభంజనం సృష్టిస్తుందనడానికి సంకేతమని అన్నారు. తెలంగాణ పునర్నిర్మాణంలో మిగిలిపోయిన సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేసేందుకు తమ పార్టీ కృషి చేస్తుందని చెప్పారు. -
దప్పిక తీర్చుకునేందుకు వచ్చి...
చిత్తూరు జిల్లా పలమనేరు మండలంలోని కౌండిన్యా అభయారణ్యంలో దాహం తీర్చుకోవడానికి వచ్చిన గున్నఏనుగు నీటి దొనలో పడిపోయింది. ఒకరోజు రాత్రంతా అక్కడే ఉన్న దాన్ని అటవీసిబ్బంది మరుసటి రోజు ఉదయం దాదాపు మూడు గంటలసేపు శ్రమించి వెలికితీశారు. ఆదివారం రాత్రి నీళ్లు తాగడానికి అభయూరణ్యంలో కాలువపల్లె బీట్లోని నిచ్చెనదొన వద్దకు గున్నఏనుగు వచ్చింది. నీళ్ల కోసం వంగి ఎనిమిది అడుగుల లోతువున్న దొనలోకి పడిపోరుుంది. సోమవారం ఉదయం అటవీశాఖ అధికారులు వచ్చి అక్కడే ఉన్న ఏనుగుల గుంపును టపాసులు పేలుస్తూ కొంతదూరం వెళ్లగొట్టారు. దాదాపు మూడు గంటలపాటు శ్రమించి తాళ్ల సాయంతో దొనలో నుంచి ఏడాది వయసున్న ఆ మగ గున్నఏనుగును బయటకు తీశారు. అడవిలోకి వదిలిపెట్టే ప్రయత్నం చేశారు. కానీ రాత్రంతా ఆహారం లేక నీరసించిన అది ముందుకు కదలేకపోయింది. సోమవారం బాగా పొద్దుపోయేవరకు కూడా ఏనుగుల గుంపు మాత్రం ఘీంకారాలు చేస్తూ అక్కడికి దగ్గరలోనే మకాం వేశాయి. - న్యూస్లైన్, పలమనేరు -
జిల్లాలో ఓటర్లు 22 లక్షల మంది
మండలాలవారిగా జాబితా విడుదల మహిళలే ఎక్కువ చిత్తూరు (అర్బన్), న్యూస్లైన్: జిల్లాలో 22 లక్షల మంది ఓటర్లు ఉన్నారని జిల్లా పంచాయతీ అధికారి కేఎల్ ప్రభాకరరావు తెలిపారు.గురువారం ఆయన స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఓటర్ల జాబితాను మండలాలవారిగా విడుదల చేశారు. ఇందులో మొత్తం ఓటర్లు 22,02,621 మంది ఉన్నారు. వీరిలో 11,12,767 మంది మహిళా ఓటర్లు, 10,89,840 మంది పురుషులు ఉన్నారు. 14 మంది హిజ్రాలు ఉన్నారు. -
చిత్తూరు కాంగ్రెస్ నాయకులతో పెద్దిరెడ్డి మంతనాలు
మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంగళవారం చిత్తూరు నగరంలోని పలువురు కాంగ్రెస్ నాయకులతో కలిసి మంతనాలు సాగించారు. నగరంలోని పీసీసీ మాజీ సభ్యుడు ఎస్.సుధాకరరెడ్డిని ఆయన నివాసంలో కలుసుకున్నారు. ఆయనతోపాటు కాంగ్రెస్ నా యకులు, చిత్తూరు మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ పురుషోత్తంరెడ్డి, ఐరాల మాజీ ఎంపీపీ పొలకల ప్రభాస్కుమార్రెడ్డి(చిట్టిరెడ్డి)తో పెద్దిరెడ్డి దాదాపు గంటసేపు మంతనాలు జరిపారు. చిత్తూరులో వైఎస్ఆర్ సీపీని మరింత బలోపేతం చేసే దిశగా ఆయన చర్చించారు. చర్చల అనంతరం పలువురు నాయకులు పెద్దిరెడ్డి సమక్షంలో తమ అనుచరులతో కలిసి పార్టీలోకి చేరేందుకు సూత్రప్రాయంగా అంగీకరించినట్లు తెలిసింది. వీరంతా రెండు, మూడురోజుల్లో పెద్దిరెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ .జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ సీపీలో చేరనున్నట్లు సమాచారం. ఈ చర్చల్లో వైఎస్ఆర్ సీపీ చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త ఏఎస్ మనోహర్, జిల్లా స్టీరింగ్ కమిటీ మెంబర్ అమర్నాథ్, నగర కన్వీనర్ పూల రఘునాథరెడ్డి, నాయకులు క ట్టమంచి ప్రతాప్రెడ్డి, బాలసుబ్రమణ్యంరెడ్డి, కట్టమంచి మనోహర్రెడ్డి, ఆర్ చంద్ర, త్రిమూర్తి, శ్రీధర్రెడ్డి, సయ్యద్, మాజీ కౌన్సిలర్ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. -
కోడ్ ఉల్లంఘిస్తే ఉపేక్షించకండి
ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను అనంతపురం రేంజ్ డీఐజీ బాలకృష్ణ ఆదేశించారు. చిత్తూరు కలెక్టరేట్లో జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలతో ఎన్నికల నిర్వహణపై ఆయన మంగళవారం సమీక్షించారు. డీఐజీ మాట్లాడుతూ ఈ నెల 30న జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయన్నారు. వీటి తర్వాత అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత పోలీసులపై ఉందన్నారు. డీఎస్పీ, సీఐ, ఎస్ఐ స్థాయి అధికారులు ఇప్పటి నుంచే మారుమూల గ్రామాల్లో సైతం పర్యటించాలని సూచించారు. ఒత్తిళ్లకు తలొగ్గకండి ఎన్నికల సందర్భంగా రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గకుండా నిష్పక్షపాతంగా వ్యవహరించాలని డీఐజీ బాలకృష్ణ పోలీసులకు సూచించారు. ఓటర్లను ప్రలోభపెట్టే వారిపై కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. రాజకీయ నాయకులను పోలీసులెవరైనా కలిసినట్లు తెలిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలోని రౌడీషీటర్లకు ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించాలన్నారు. వారి కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచి, తనిఖీలు ముమ్మరం చేయాలన్నారు. ప్రత్యేక చెక్పోస్టులు ఏర్పాటు చేసి అక్రమ రవాణాను అడ్డుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో ఎస్పీ రామకృష్ణ, ఏఎస్పీ అన్నపూర్ణారెడ్డి, ఏఆర్ ఏఎస్పీ శేఖర్, డీఎస్పీలు కమలాకర్రెడ్డి, హరినాథరెడ్డి, రాఘవరెడ్డి, ఏఆర్ డీఎస్పీ దేవదాస్, డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు, ఏఆర్ అధికారులు పాల్గొన్నారు. -
ముక్కంటి సేవలో శ్రీనివాసన్
శ్రీకాళహస్తి, న్యూస్లైన్: చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తి దేవస్థానానికి మంగళవారం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు శ్రీనివాసన్ విచ్చేశారు. స్వామి, అమ్మవార్లను ప్రత్యేకంగా దర్శించుకున్నారు. అనంతరం గురుదక్షిణామూర్తి వద్ద వేదపండితుల నుంచి ఆశీర్వచనం పొందారు. ఆలయాధికారులు ఆయనను శాలువాతో సత్కరించి, స్వామి, అమ్మవార్ల చిత్రపటాన్ని, తీర్థప్రసాదాలను అందజేశారు. బీసీసీఐది ద్వంద్వ వైఖరి: సుబ్రతో రాయ్ ముంబై: ఐపీఎల్ ఫ్రాంచైజీల విషయంలో బీసీసీఐ ద్వంద్వ వైఖరి అవలంభిస్తోందని సహారా ఇండియా చైర్మన్ సుబ్రతో రాయ్ ధ్వజమెత్తారు. లీగ్ నుంచి తమ పుణే వారియర్స్ జట్టును తొలగించడంతో తాను దగా పడ్డానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. -
‘అవుట్ సోర్సింగ్’లో అవినీతి ఎంత?
సాధారణంగా ప్రభుత్వం ద్వారా చిన్న పనిచేయాలన్నా ముందుగా టెండర్లు పిలవాలి. నిబంధనల ప్రకారం పత్రికలకు ప్రకటనలు ఇచ్చి, పనులు అప్పగించాలి. అయితే చిత్తూరు ప్రభుత్వాస్పత్రి సిబ్బంది, అధికారులకు ఇవేవీ పట్టడం లేదు. దాదాపు రూ.30 లక్షల విలువచేసే అవుట్ సోర్సింగ్ పనులకు టెండర్లు పిలవకుండానే తమకు కావాల్సిన వారిని కూర్చోబెట్టేశారు. ఇందులో అవినీతి, అక్రమాలు భారీగానే చోటు చేసుకున్నట్టు విమర్శలు గుప్పుమంటున్నాయి. చిత్తూరు (అర్బన్/క్రైమ్), న్యూస్లైన్: చిత్తూరు ప్రభుత్వాస్పత్రిలో కాంట్రాక్టు పద్ధతిన పనిచేయడానికి ప్రతి ఏటా అవుట్ సోర్సింగ్ ఏజెన్సీల ద్వారా టెండర్లు పిలవాలి. అయితే పదేళ్లుగా ఆ ఆస్పత్రి లో ఒకటే ఏజెన్సీ ఉండడంతో గతంలో పనిచేసిన కలెక్టర్ సాల్మన్ ఆరోగ్యరాజ్ గుర్తించి, సంబంధిత అధికారులను ప్రశ్నించారు. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఆ ఏజెన్సీకి పనులు రద్దుచేసి, కొత్తగా టెండర్లు పిలవాలని ఆదేశిం చారు. ఈ నేపథ్యంలో చిత్తూరు ప్రభుత్వాస్పత్రిలో సెక్యూరిటీ గార్డుకు ఆరు పోస్టులు, ఎలక్ట్రీషియన్-1, ఫార్మాసిస్ట్ (గ్రేడ్-2)-2, అటెండర్-1, ఆపరేషన్ థియేటర్ అటెం డరు-2, ఈసీజీ అసిస్టెంట్-1, జూనియర్ శానిటరీ వర్క ర్లు -9, జూనియర్ అసిస్టెంట్-1, దోబీ-2, ఫిజియోసిస్ట్-1, ల్యాబ్ అసిస్టెంట్-3, సీటీ స్కానర్ టెక్నీషియన్-1, ఓపీ టికెట్ రైటర్-2 పోస్టులకు అవుట్ సోర్సింగ్ ద్వారా భర్తీ చేయాల్సి ఉంది. అయితే అధికారులు టెండరు నోటీసులు పిలవకుండానే పనులు కట్టబెట్టేశారు. అవినీతికి ఆజ్యం ఇలా.. అవుట్ సోర్సింగ్ ఏజెన్సీల నుంచి నిరుద్యోగులను తీసుకోవడానికి రెండు వార్తా పత్రికలకు టెండరు నోటీసు ప్రకటన ఇవ్వాలి. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోని నోటీసు బోర్డుల్లో సంబంధిత టెండరు నోటీసులను ప్రచురించాలి. కానీ ఏజెన్సీ నియామకానికి టెండరు పిలుస్తున్నట్లు మూడో కంటికీ తెలియకుండా తమకు కావాల్సిన వారికి పనులు కట్టబెట్టేశారు. జిల్లా ఉపాధి కార్యాలయంలో పేర్లు నమోదు చేసుకున్న ఎనిమిది ఏజెన్సీలకు నామమాత్రంగా ఆస్పత్రి టెండర్లకు దరఖాస్తు చేయాలని రిజిస్టర్ పోస్టులు పంపారు. వీటికి ఐదు ఏజెన్సీలు స్పందించాయి. అందులో ఒక ఏజెన్సీ అభ్యర్థులకు నిర్ణయించిన వేతనాల్లో 0.38 శాతం తక్కువ కమీషన్కు కోడ్ చేయడంతో వారికి పనులు కట్టబెట్టారు. జూన్1 నుంచి టెండర్ అమలయ్యేలా వర్క్ ఆర్డర్లను అందజేశారు. అంతటితో ఆగక పారిశుద్ధ్య కార్మికుడి నుంచి జూనియర్ అసిస్టెంట్ పోస్టు వరకు 20 పోస్టుల్లో తాము సూచించిన అభ్యర్థులనే పనుల్లో పెట్టుకోవాలని ఆ ఏజెన్సీ నిర్వాహకుడికి కొందరు అధికారులు హుకుం జారీ చేశారు. ఈ పోస్టులకు రూ.30 వేల నుంచి రూ.60 వేల వరకు ఆ అధికారులు దండుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇదిలావుండగా చంద్రగిరి, తిరుపతికి చెందిన ఇద్దరు అభ్యర్థులు చెప్పిన సమాచారం ఈ ఆరోపణలకు మరింత ఆజ్యం పోస్తోంది. వారిద్దరూ ఆస్పత్రిలో సూపర్వైజర్ పోస్టుల కోసం ఓ మధ్యవర్తిని ఆశ్రయించి, రూ.1.5 లక్షలు సమర్పించుకున్నారు. తీరా పారిశుద్ధ్య పనులు అప్పగించడంతో వారు తిరగబడి తమ నగదు ఇచ్చేయాలని పట్టుబట్టారు. ఇచ్చిన మొత్తంలో సదరు మధ్యవర్తి రూ.30 వేలు మాత్రమే ఇచ్చాడు. మిగిలిన మొత్తాన్ని ఆస్పత్రిలో పనిచేసే ఓ అధికారికి ఇచ్చినట్టు చెప్పడంతో అసలు విషయం బయటపడింది. ఈ తతంగంపై కలెక్టర్ పూర్తి స్థాయిలో విచారణకు ఆదేశిస్తే అసలు విషయాలు వెలుగుచూసే అవకాశం ఉంది. మాకు సంబంధం లేదు ఏజెన్సీ ఎంపిక వ్యవహారంలో మాకు సంబంధంలేదు. ఇది పూర్తిగా జిల్లా అభివృద్ధి కమిటీ చూసుకుంటుంది. ఏయే పోస్టులు అవసరమనే విషయాలు మాత్రమే కలెక్టర్కు నివేదించాం. అభ్యర్థుల నుంచి నగదు ఎవరు తీసుకున్నారనే విషయాలూ మాకు తెలియవు. నేను ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. ఎవరైతే ఆస్పత్రిలో అవుట్ సోర్సింగ్పై చేరారో వారినే అడిగి చూడండి. ఇదంతా కావాలనే ఎవరో నాపై పుకార్లు చేస్తున్నారు. ఇదే విషయంపై కలెక్టర్ను వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఆయన అందుబాటులో లేరు. -సరళమ్మ, డీసీహెచ్ఎస్, చిత్తూరు పద్నాలుగేళ్లు పనిచేశా ఆస్పత్రిలో ఓపీ టికెట్లు రాస్తూ దాదాపు 14 ఏళ్లకుపైగా పనిచేశా. ఇప్పుడేమో నన్ను పనిలో నుంచి తీసేసి, వేరే వాళ్లను తెచ్చి పెట్టుకున్నారు. పిల్లాపాపలు ఉన్న మాలాంటి వారి కడుపులు కొడితే మేం ఎక్కడకెళ్లి బతకాలి. -సుజాత, కాంట్రాక్ట్ పని పోగొట్టుకున్న బాధితురాలు -
‘గృహ’ అక్రమాల పై విచారణ
సాక్షి, చిత్తూరు: గృహనిర్మాణ శాఖ పరిధిలో చోటుచేసుకున్న అక్రమాలు, అవకతవకలపై ఆ శాఖ ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. గృహనిర్మాణాల్లో చోటుచేసుకున్న అవతవకలు, వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపేందుకు జిల్లా ప్రత్యేక అధికారి ప్రసాద్ దృష్టిసారించారు. ప్రస్తుతం రచ్చబండలో వచ్చిన ఇంటి నిర్మాణ అర్జీలు 20వేల వరకు పెండింగ్లో ఉన్నాయి. అలాగే ఇందిరమ్మ ఫేజ్-3 ఇళ్ల నిర్మాణం సాగుతోంది. ఈ క్రమంలో మండల స్థాయిల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి, ఇల్లు కట్టకనే బిల్లు శాంక్షన్ చేసుకుని స్వాహా చేసినట్లు ఫిర్యాదులు వచ్చాయి. వీటన్నింటిపైనా విచారణ జరగనుంది. ప్రధానంగా తిరుపతి కార్పొరేషన్లో దామినేడు గృహనిర్మాణశాఖ కాలనీ నిర్మాణం, కేటాయింపుల్లో జరిగిన అవినీతిపై దృష్టిపెట్టారు. ఈ వ్యవహారంలో లోతుగా విచారణ జరపాలని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ ఎండీ ఆదేశాలు జారీచేయటంతో ఈ వ్యవహారంలో మరోసారి విచారణ ప్రారంభం కానుంది. దామినేడు అక్రమాలపై .. తిరుపతి రూరల్మండలం దామినేడులో మున్సిపల్ కార్పొరేషన్లోని ప్రజల కోసం 288కి పైగా ఇళ్లను తొమ్మిది బ్లాక్లుగా నిర్మించారు. ఇందుకోసం కోట్ల రూపాయలు వెచ్చిం చారు. ఈ గృహనిర్మాణాలలో అనర్హులకు ఇళ్ల కేటాయింపు,ఇళ్లు అనధికారికంగా అమ్మేసినవి, రెండవ ఫేజ్లో గృహ కేటాయింపుల్లో కింది స్థాయి సిబ్బంది చేతి వాటం చూపారనే ఆరోపణలు వచ్చాయి. దీనికి సంబంధించి ఇది వరకే ఒక కార్పొరేషన్ క్లర్కును సస్పెండ్ చేశారు. దీనిపై కమిషనర్ ఉత్తర్వుల మేరకు అప్పట్లో అదనపు కమిషనర్ ఈశ్వరయ్య విచారణ జరిపి నివేదిక తయారు చేశారు. అప్పట్లో వీటికి సంబంధించిన రికార్డులను విజిలెన్స్ ఎన్ఫోర్స్మెం ట్ అధికారులు పరిశీలించారు. ఈ క్రమంలో దీనిపై మరోసారి విచారణ జరపాలంటూ గృహనిర్మాణ శాఖ ఎండీ నుంచి జిల్లా ప్రత్యేక అధికారి ప్రసాద్కు ఆదేశాలు అందాయి. ఇప్పటికే దీనిపై విచారణ జరిపి కార్పొరేషన్ కమిషనర్ నివేదిక సమర్పించి ఉన్నం దున, ఆ విచారణలో తేలిన అంశాలు ఏమిటి, ఏఏ వివరాలు అధికారులు అప్పట్లో సేకరించారనేది అధ్యయనం చేసి దాన్ని గృహానిర్మాణ శాఖ ఎండీకి పంపనున్నారు. 1985 నాటి ఇళ్ల నిర్మాణంపైలోకాయుక్త ఆదేశం పీలేరు నియోజకవర్గంలోని కలికిరి మండలం పల్లవోలు గ్రామంలో 1985లో ఎన్టీఆర్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన గృహనిర్మాణ కాలనీ నిర్మాణంలో అవతవకలు జరిగాయనే దానిపై వేసిన పిటి షన్పై విచారణ జరిపి వివరాలు సమర్పించాలని రాష్ట్ర లోకాయుక్త ఆదేశించింది. దీనికి సంబంధించిన వివరాలు కూడా ఇవ్వాలని ప్రత్యేక అధికారి సంబంధిత డీఈ, ఏఈలను ఆదేశించారు. 1985 నాటి ఇళ్ల నిర్మాణాల అవకతవకలపై ఇప్పుడు లోకాయుక్త వి చారణకు ఆదేశించడం ఒక రకంగా చర్చనీ యాంశంగా మారింది. ఇల్లు కట్టకనే బిల్లులు కుప్పం నియోజకవర్గం రామకుప్పంలో ఇల్లు కట్టకనే బిల్లులు శాంక్షన్ చేయించుకుని స్వాహా చేసినట్లు అధికారులకు ఫిర్యాదులు అందాయి. దీనిపై రెండు, మూడు రోజుల్లో విచారణ జరపనున్నారు. సంబంధిత ఏఈ, వర్క్ ఇన్స్పెక్టర్లతో పాటు, ఫిర్యాదు చేసిన వారు, ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని పిలి పించాల్సిందిగా డీఈకి ఉన్నతాధికారులు ఆదేశాలు ఇచ్చారు. ఇందిరమ్మ స్థలాల గొడవ పుత్తూరు మండలంలో ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపునకు సంబంధించి లబ్ధిదారుల మధ్య వివాదం తలెత్తింది. ఇక్కడ ఫేజ్-2 ఇందిర్మ ఇళ్ల నిర్మాణం కోసం కేటాయించిన స్థలాన్నే తిరిగి ఫేజ్-3 ఇందిరమ్మ ఇళ్ల లబ్ధ్దిదారులకు కూడా కేటాయించినట్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు అందింది. దీనిపైన పూర్తి వివరాలు సమర్పించాల్సిందిగా సంబంధిత ఏఈ, డీఈలను ప్రత్యేక అధికారి ఆదేశించారు.