CID Department
-
మార్గదర్శి మోసాల కేసు మూత?
-
‘మార్గదర్శి’ మోసాల కేసును మూసివేసే దిశగా అడుగులు... చంద్రబాబు డైరెక్షన్లో ప్లేటు ఫిరాయించిన ఆంధ్రప్రదేశ్ సీఐడీ
-
‘మార్గదర్శి’ మోసాల కేసు మూత
ఆర్బీఐ సెక్షన్ 45 (ఎస్)కి విరుద్ధంగా మార్గదర్శి ఫైనాన్షియర్స్ అక్రమ డిపాజిట్లను సేకరించిన వ్యవహారంలో రామోజీ, ఆయన కుటుంబ సభ్యులను రక్షించేందుకు ఎంత చేయాలో అంత చేస్తూ వస్తున్న చంద్రబాబు ప్రభుత్వం.. ఇప్పుడు రామోజీ కుటుంబానికి ఆర్థికంగా అత్యంత కీలకమైన మార్గదర్శి చిట్ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ విషయంలోనూ అదే రీతిలో వ్యవహరించింది. మార్గదర్శి చిట్ఫండ్స్ అక్రమాలపై దాఖలు చేసిన అప్పీళ్లను సీఐడీ ద్వారా ఇప్పటికే ఉపసంహరింప చేసిన చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు మరింత బరి తెగించి మార్గదర్శి చిట్ఫండ్పై అసలు కేసు నమోదు చేయడమే ‘పొరపాటు..’ అంటూ దర్యాప్తు సంస్థతో చెప్పించింది.సాక్షి, అమరావతి: మార్గదర్శి చిట్ఫండ్ అక్రమాలు, ఆర్థిక అవకతవకలకు కీలక ఆధారాలున్నాయని గతంలో బల్లగుద్ది గట్టిగా వాదించిన సీఐడీ.. చంద్రబాబు ప్రభుత్వం ఒత్తిడితో ఒక్కసారిగా ప్లేటు ఫిరాయించింది. తాము సేకరించిన మౌఖిక, రాతపూర్వక ఆధారాలేవీ మార్గదర్శి చిట్ఫండ్ అక్రమాలను రుజువు చేసేవి కావంటూ నిస్సహాయంగా చేతులెత్తేసింది. ఈమేరకు మార్గదర్శి చిట్ఫండ్ విషయంలో కేసు నమోదు చేయడం పొరపాటు అంటూ సంబంధిత కోర్టులో ఫైనల్ రిపోర్ట్ దాఖలు చేయనున్నట్లు దర్యాప్తు సంస్థ హైకోర్టుకు నివేదించింది. మార్గదర్శి అక్రమాలను నిరూపించేందుకు అన్ని ఆధారాలున్నాయని గతంలో తేల్చి చెప్పిన సీఐడీ హఠాత్తుగా స్వరం మార్చడం వెనుక సీఎం చంద్రబాబు ఒత్తిళ్లు తీవ్ర స్థాయిలో ఉన్నట్లు తెలుస్తోంది. బాబు డైరెక్షన్లో.. ఆయన ఆదేశాల మేరకు దర్యాప్తు సంస్థ నడుచుకుంటున్నట్లు స్పష్టమవుతోంది. రాజగురువు రామోజీ లేనప్పటికీ ఆయన కుటుంబం పట్ల చంద్రబాబు సర్కారు రాజభక్తిని చాటుకుంటూనే ఉంది! రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా నిబంధనలకు విరుద్ధంగా... ఆర్బీఐ సెక్షన్ 45 (ఎస్) తమకు వర్తించదంటూ మార్గదర్శి ఫైనాన్షియర్స్ చట్ట విరుద్ధంగా అక్రమ డిపాజిట్లను సేకరించిన వ్యవహారంలో రామోజీరావు, ఆయన కుటుంబ సభ్యులను రక్షించేందుకు ఎంత చేయాలో అంత చేస్తూ వస్తున్న చంద్రబాబు ప్రభుత్వం.. ఇప్పుడు రామోజీ కుటుంబానికి ఆర్థికంగా అత్యంత కీలకమైన మార్గదర్శి చిట్ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ విషయంలోనూ అదే రీతిలో వ్యవహరించింది. మార్గదర్శి చిట్ఫండ్స్ అక్రమాల విషయంలో దాఖలు చేసిన అప్పీళ్లను సీఐడీ ద్వారా ఇప్పటికే ఉపసంహరింప చేసిన చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు మరింత బరి తెగించింది. ఏకంగా మార్గదర్శి చిట్ఫండ్పై కేసు నమోదే ‘పొరపాటు..’ అంటూ సీఐడీ చేత చెప్పించింది. అంతేకాక ఇప్పటి వరకు సాగించిన దర్యాప్తులో సేకరించిన మౌఖిక, రాతపూర్వక ఆధారాలు ఏవీ కూడా మార్గదర్శి చిట్ఫండ్పై పెట్టిన కేసును నిరూపించేవిగా లేవంటూ సీఐడీతో ఏకంగా హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయించింది. మార్గదర్శి చిట్పై కేసు నమోదు ‘పొరపాటు..’ (మిస్టేట్ ఆఫ్ ఫ్యాక్ట్) అంటూ సంబంధిత కోర్టులో ఫైనల్ రిపోర్ట్ దాఖలు చేసేందుకు రంగం సిద్ధం చేయించింది. ఇక ఫైనల్ రిపోర్ట్ దాఖలు చేసేందుకు సీఐడీ అదనపు డీజీ డాక్టర్ రవిశంకర్ అయ్యన్నార్ అనుమతి మంజూరు చేయడమే తరువాయి. తద్వారా మార్గదర్శి చిట్ఫండ్స్ అక్రమాలు ఎప్పటికీ బహిర్గతం కాకుండా శాశ్వతంగా సమాధి కట్టాలని బాబు సర్కారు నిర్ణయించింది. ఒకవైపు తెలంగాణ హైకోర్టులో మార్గదర్శి ఫైనాన్షియర్స్ అక్రమ డిపాజిట్ల కేసులో రామోజీరావు చట్టవిరుద్ధంగా వ్యవహరించారని ఆర్బీఐ బహిర్గతం చేయగా.. మరోవైపు చంద్రబాబు ప్రభుత్వం మార్గదర్శి చిట్ఫండ్స్ అక్రమాలకు ఆధారాల్లేవని ఏపీ హైకోర్టులో సీఐడీ చేత చెప్పించడం గమనార్హం. మరో కీలక విషయం ఏమిటంటే.. తెలంగాణ హైకోర్టులో మార్గదర్శి ఫైనాన్షియర్స్ అక్రమాల కేసు విచారణకు వచ్చిన రోజే.. ఏపీ హైకోర్టులో మార్గదర్శి చిట్ఫండ్స్కు అనుకూలంగా సీఐడీ కౌంటర్ దాఖలు చేయడం. చట్ట ఉల్లంఘనలకు పాల్పడినందుకు మార్గదర్శి చిట్ఫండ్స్కి చెందిన రూ.1,050 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులకు సంబంధించి హైకోర్టులో సీఐడీ దాఖలు చేసిన అప్పీళ్లను ఆ సంస్థ చేత చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉపసంహరింప చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఏకంగా మార్గదర్శిపై కేసు నమోదు చేయడం ‘పొరపాటు’ అంటూ సీఐడీ దాఖలు చేసే తుది నివేదికను సంబంధిత కోర్టు ఆమోదిస్తే చంద్రబాబు ప్రభుత్వం విజయం సాధించినట్లే! మార్గదర్శి చిట్ఫండ్స్పై కేసు క్లోజ్ అయినట్లే!!చిట్స్ రిజిస్ట్రార్ ఫిర్యాదుతో రంగంలోకి సీఐడీ...మార్గదర్శి చిట్ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్లో ఆర్థిక అవకతవకలు, తప్పుడు రికార్డుల నిర్వహణ, నిధుల మళ్లింపు, ఇతర చట్ట ఉల్లంఘనలపై చిట్స్ అసిస్టెంట్ రిజిస్ట్రార్ 2023 మార్చి 10న సీఐడీకి ఫిర్యాదు చేయడం తెలిసిందే. ఈ ఫిర్యాదు ఆధారంగా అదే రోజు రామోజీరావు, శైలజా కిరణ్, మార్గదర్శి చిట్స్ ఆడిటర్ కుదరవల్లి శ్రవణ్లతో పాటు మొత్తం 15 మందిపై ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ), ఏపీ డిపాజిటర్ల పరిరక్షణ చట్టం, చిట్ఫండ్ చట్ట నిబంధనల కింద సీఐడీ కేసులు నమోదు చేసింది. అనంతరం మార్గదర్శి చిట్స్ కార్యాలయాల్లో సోదాలు నిర్వహించి కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుంది. పలువురు ఖాతాదారుల నుంచి ఫిర్యాదులు స్వీకరించింది. వారు ఇచ్చిన వాంగ్మూలాలను రికార్డ్ చేసింది. గడువు ముగిసి ష్యూరిటీలు సమర్పించిన తరువాత కూడా బ్రాంచ్ మేనేజర్లు సకాలంలో చెల్లింపులు చేయడం లేదని పలువురు చందాదారులు దర్యాప్తు సంస్థకు వాంగ్మూలం ఇచ్చారు. సాకులు చెబుతూ ష్యూరిటీలను తిరస్కరించడం, అదనపు ష్యూరిటీలు సమర్పించాలని కోరడంతో పాటు ప్రైజ్ మొత్తాలను చెల్లించకుండా మార్గదర్శి ఇబ్బంది పెడుతోందని చందాదారులు స్పష్టంగా చెప్పారు. సకాలంలో చెల్లింపులు చేయకపోవడం, చెల్లించాల్సిన ప్రైజ్ మొత్తాన్ని డిపాజిట్గా తమ వద్దే అట్టిపెట్టుకోవడం, తక్కువ వడ్డీ చెల్లించడం, చెల్లింపులు ఎగవేయడం లాంటి ఉల్లంఘనలకు మార్గదర్శి చిట్స్ పాల్పడినట్లు సీఐడీ దర్యాప్తులో తేలింది. అనంతరం ఆ సంస్థ ఆడిటర్ కుదరవల్లి శ్రవణ్ను 2023 మార్చి 29న అరెస్ట్ చేసింది. అనంతరం సంబంధిత కోర్టు ఆయనకు రిమాండ్ విధించింది.అప్పట్లో మార్గదర్శికి వ్యతిరేకంగా తీవ్రంగా పోరాడిన సీఐడీశ్రవణ్ కుమార్ అరెస్ట్ను, రిమాండ్ను ప్రశ్నిస్తూ ఆయన భార్య నర్మదతో పాటు శ్రవణ్ కుమార్ కూడా ఆశ్చర్యకరంగా ‘హెబియస్ కార్పస్’ రూపంలో పిటిషన్ దాఖలు చేశారు. కీలక స్థానాల్లో ‘అనుకూల’ వ్యక్తులు ఉండటంతోనే అసాధారణ రీతిలో వీరు హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారన్న ప్రచారం అప్పట్లో గట్టిగా సాగింది. ఈ పిటిషన్ను అప్పట్లో తీవ్రంగా వ్యతిరేకించిన సీఐడీ చాలా గట్టిగా వాదనలు వినిపించింది.ఆధారాల్లేవంటూ తాజాగా కౌంటర్మార్గదర్శి చిట్ఫండ్ విషయంలో కేసు నమోదు చేయడం పొరపాటు అని సంబంధిత కోర్టులో ఫైనల్ రిపోర్ట్ దాఖలు చేయనున్నామంటూ హైకోర్టులో దాఖలు చేసిన తాజా కౌంటర్లో నివేదించింది. సంబంధిత కోర్టులో ఫైనల్ రిపోర్ట్ దాఖలు చేసేందుకు సీఐడీ అదనపు డీజీని అనుమతి కోరినట్లు సీఐడీ విజయవాడ ప్రాంతీయ కార్యాలయం అదనపు ఎస్పీ డి.ప్రసాద్ తన కౌంటర్లో హైకోర్టుకు తెలిపారు. ఆధారాలు చాలకపోవడంతో మార్గదర్శిపై నమోదు చేసిన కేసును మూసివేసేందుకు అనుమతి కోరుతూ అప్పటి దర్యాప్తు అధికారి రాజశేఖరరావు సీఐడీ అదనపు డీజీకి గత ఏడాది ఆగస్టు 12న లేఖ రాశారని, ఆ లేఖను పరిశీలించిన అదనపు డీజీ మార్గదర్శి చిట్ఫండ్పై కేసు మూసివేతకు ఆగస్టు 16న అనుమతినిచ్చారని పేర్కొన్నారు. దీంతో తుది నివేదిక సిద్ధం చేసి కోర్టులో దాఖలు చేసేందుకు అనుమతినివ్వాలని అదనపు డీజీని కోరామన్నారు.నాడు కీలక ఆధారాలు ఉన్నాయన్న సీఐడీ..వాస్తవానికి మార్గదర్శి చిట్ఫండ్స్ అవకతవకలపై దర్యాప్తు జరిపిన సీఐడీ పకడ్బందీగా అన్ని ఆధారాలను సేకరించింది. ఇదే విషయాన్ని గతంలోనే హైకోర్టుకు నివేదించింది. మార్గదర్శి చిట్ఫండ్ అక్రమాల కేసులో సంస్థ యజమాని శైలజా కిరణ్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను వ్యతిరేకిస్తూ వినిపించిన వాదనల సందర్భంగా ఈ విషయాన్ని చెప్పింది. మార్గదర్శి చిట్ఫండ్కు వ్యతిరేకంగా కీలక ఆధారాలున్నాయని, అందువల్ల బెయిల్ ఇవ్వొద్దంటూ గట్టిగా వాదనలు వినిపించింది. సీఐడీ సేకరించిన ఆధారాలను పరిగణనలోకి తీసుకున్న అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఖాతాదారుల ప్రయోజనాలను పరిరక్షించే నిమిత్తం చట్ట ప్రకారం మార్గదర్శి చిట్ఫండ్స్కు చెందిన దాదాపు రూ.1,050 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసింది. మార్గదర్శి చిట్ఫండ్ అక్రమాలు, అవకతవకలకు కీలక ఆధారాలున్నాయని అప్పుడు తేల్చి చెప్పిన సీఐడీ ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం రాగానే ఒక్కసారిగా ప్లేటు ఫిరాయించింది. తాము సేకరించిన మౌఖిక, రాతపూర్వక ఆధారాలేవీ కూడా మార్గదర్శి చిట్ఫండ్ అక్రమాలను రుజువు చేసేవిగా లేవంటూ నిస్సిగ్గుగా, నిస్సహాయంగా చేతులెత్తేసింది.మార్గదర్శి చిట్ఫండ్స్ అక్రమాల్లో మచ్చుకు..సకాలంలో చందాదారులకు చెల్లింపులు చేయకపోవడం.. చెల్లించాల్సిన ప్రైజ్ మొత్తాన్ని డిపాజిట్గా తమ వద్దే అట్టిపెట్టుకోవడం.. తక్కువ వడ్డీ చెల్లించడం.. చెల్లింపులు ఎగవేయడం.. మార్గదర్శి చిట్ఫండ్స్ అక్రమాల్లో మచ్చుకు కొన్ని! చందాదారులకు చెల్లించాల్సిన ప్రైజ్మనీని చెల్లించకుండా వడ్డీ చెల్లింపు పేరుతో తమ వద్దే అట్టిపెట్టుకోవడానికి ప్రధాన కారణం ఏమిటంటే... చెల్లింపులు చేయడానికి మార్గదర్శి చిట్ఫండ్స్ వద్ద సరిపడినంత డబ్బు లేకపోవడమే. తన వద్ద డబ్బు లేదు కాబట్టి చందాదారులకు చెల్లించాల్సిన డబ్బునే భవిష్యత్తులో చెల్లించాల్సిన చందాగా మార్గదర్శి చిట్ఫండ్స్ తమ వద్దే అట్టిపెట్టుకుంది. అలా అట్టి పెట్టుకున్న మొత్తాలను మార్గదర్శి రొటేషన్ చేస్తూ వస్తోంది. చట్ట ప్రకారం చందాదారుల డబ్బును ప్రత్యేక ఖాతాల్లో ఉంచడం తప్పనిసరి. కానీ మార్గదర్శిలో అలా ఉంచకుండా దాన్ని ఇతర అవసరాలకు మళ్లించేశారు. ఈ ఉల్లంఘనలన్నీ డిపాజిటర్ల పరిరక్షణ చట్టం పరిధిలోకి వస్తాయి. -
బాబుతో సీఐడీ దోస్తీ
-
ఏపీ సీఎం చంద్రబాబుతో సీఐడీ బంధం... ‘కరకట్ట బంగ్లా’ కేసులో అటాచ్మెంట్ పొడిగింపు కోరని దర్యాప్తు సంస్థ
-
కుట్ర బెడిసికొట్టింది
-
సీఐడీకి హైదరాబాద్ కిడ్నీ రాకెట్ కేసు..
సాక్షి, హైదరాబాద్: కిడ్నీ రాకెట్ కేసును తెలంగాణ ప్రభుత్వం సీఐడీకి అప్పగించింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాలు జారీ చేశారు. ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలన్నారు. కేసు పూర్వపరాలను సమీక్షించిన మంత్రి.. తమిళనాడు, కేరళ, కర్ణాటక ప్రభుత్వాలకు సమాచారం ఇవ్వాలని సూచించారు.హైదరాబాద్లోని అలకనంద ఆసుపత్రిలో జరిగిన కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ వ్యవహారంపై ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ శుక్రవారం తన నివాసంలో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. డాక్టర్ల కమిటీ ఇచ్చిన ప్రిలిమినరీ రిపోర్ట్ను మంత్రి పరిశీలించారు. అలకనంద హాస్పిటల్లో ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీలకు ఎటువంటి అనుమతి లేదని, నిబంధనలకు విరుద్ధంగా సర్జరీలు జరిగాయని అధికారులు మంత్రికి వివరించారు.మన రాష్ట్రంతో పాటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన వ్యక్తులకు ఈ అక్రమ వ్యవహారంతో సంబంధం ఉందన్నారు. అమాయకులు, అత్యంత నిరుపేదల ఆర్థిక దుస్థితిని ఆసరాగా తీసుకుని, వారిని మభ్యపెట్టి కిడ్నీల డొనేషన్కు ఒప్పిస్తున్నారన్నారు. అలకనంద హాస్పిటల్లో తమిళనాడుకు చెందిన ఇద్దరు మహిళల నుంచి కిడ్నీలు తీసుకుని, కర్ణాటకకు చెందిన వారికి అమర్చారని అధికారులు తెలిపారు. అలకనంద ఆసుపత్రిని సీజ్ చేశామని, ఆసుపత్రి ఓనర్ను పోలీసులు అరెస్ట్ చేశారని మంత్రికి తెలిపారు. ఈ కేసులో లోతైన విచారణ చేయాల్సిన అవసరం ఉందన్నారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఇలాంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలను సహించేది లేదన్నారు. ఈ వ్యవహారాన్ని చాలా సీరియస్గా పరిగణిస్తున్నామని తెలిపారు. కేసుతో సంబంధం ఉన్నవాళ్లందరిని కఠినంగా శిక్షించాలని, ఇందుకు అవసరమైన అన్ని ఆధారాలను సేకరించాలన్నారు. పూర్తిస్థాయి విచారణ కోసం కేసును సీఐడీకి అప్పగించాలని ఆదేశించారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను వెంటనే విడుదల చేయాలని హెల్త్ సెక్రటరీకి మంత్రి సూచించారు.ఇదీ చదవండి: మీర్పేట్ హత్య కేసులో సంచలన విషయాలు.. రెండు ఎవిడెన్స్ లభ్యం?కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళ రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ వ్యవహారం గురించి సమాచారం ఇవ్వాలని ఆదేశించారు. గతంలో ఇలాంటి కేసు కేరళలో నమోదైన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. గతంలో జరిగిన వ్యవహారాలకు, ప్రస్తుత కేసుకు ఏమైనా సంబంధం ఉందా? అనే దానిపై ఆరా తీయాలన్నారు. ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ అక్రమాలలో ప్రైవేట్ అంబులెన్స్ డ్రైవర్ల పాత్ర ఉన్నట్టు గతంలో వచ్చిన ఆరోపణలను గుర్తు చేసిన మంత్రి, ఆ దిశగా కూడా ఎంక్వైరీ జరిపించాలని ఆదేశించారు.ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రిల్లో జరుగుతున్న శస్త్ర చికిత్సలపై నిఘా ఉంచాలన్నారు. గర్భిణుల వివరాలను నమోదు చేస్తున్నట్టుగానే, ఇతర సర్జరీలకు సంబంధించిన వివరాలను నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆసుపత్రులకు అనుమతులు ఇచ్చేటప్పుడు, రిజిస్ట్రేషన్ రెన్యువల్ చేసేటప్పుడు అన్ని వివరాలను పూర్తి స్థాయిలో పరిశీలించాలని సూచించారు. అనుమతుల జారీలో నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై కఠిన చర్యలు ఉంటాయని ఆదేశించారు. ప్రైవేట్ ఆసుపత్రిలో జరుగుతున్న ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్లపై ఆడిట్ నిర్వహించాలని గతంలో మంత్రి ఆదేశాలు జారీ చేశారు. -
కేసుల మాఫీకి బాబు కుట్రలు
-
బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్ను కొట్టేసిన సుప్రీంకోర్టు
-
చంద్రబాబే సుప్రీం.. రెడ్బుక్కే రాజ్యాంగం!
సాక్షి, అమరావతి: భారత రాజ్యాంగమే ప్రామాణికం.. సుప్రీంకోర్టు తీర్పులే మార్గ నిర్దేశం.. అన్నది దేశంలో పరిపాలన వ్యవస్థకు దిక్సూచి. పాలకులు, అఖిల భారత సర్వీసు అధికారులతోపాటు అందరూ పాటించాల్సిన విధివిధానాలవి. కానీ రాష్ట్ర సీఐడీ విభాగం అందుకు పూర్తి విరుద్ధంగా బరితెగిస్తోంది. ‘చంద్రబాబే మాకు సుప్రీం.. టీడీపీ రెడ్బుక్కే మాకు రాజ్యాంగం.. చంద్రబాబు అవినీతి కేసులు నీరుగార్చడమే ఏకైక లక్ష్యం’ అని చెలరేగిపోతోంది. అందుకోసం ఏకంగా న్యాయస్థానాల్లో సీఆర్పీసీ 164 కింద నమోదు చేసిన వాంగ్మూలం పవిత్రత, ప్రమాణికతనే దెబ్బ తీసేలా కుట్రలకు పదును పెడుతోంది. ఓసారి సీఆర్పీసీ 164 కింద ఇచ్చిన వాంగ్మూలాన్ని మార్చేందుకు వీల్లేదన్న సుప్రీంకోర్టు మార్గదర్శకాలను బరితెగించి మరీ ఉల్లంఘిస్తోంది. చంద్రబాబు సూత్రధారి, పాత్రధారిగా సాగిన కుంభకోణాల గురించి గతంలో పలువురు ఐఏఎస్ అధికారులు న్యాయస్థానంలో ఇచ్చిన వాంగ్మూలాలకు భిన్నంగా తప్పుడు వాంగ్మూలాలు నమోదు చేయించేందుకు సీఐడీ సన్నాహాలు వేగవంతం చేస్తోంది. డీజీపీ పోస్టు ఇస్తానని ముఖ్య నేత ఎర వేయగానే సుప్రీంకోర్టు మార్గరద్శకాలను కూడా తోసిరాజంటూ సీఐడీ ఉన్నతాధికారి చెలరేగిపోతుండటం విస్మయ పరుస్తోంది. ఈ వ్యవహారం యావత్ దేశాన్ని విస్మయానికి గురి చేస్తోంది.కుంభకోణాల కుట్రదారు చంద్రబాబే..2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో యథేచ్ఛగా అవినీతికి పాల్పడ్డారు. రాజధాని అమరావతిలో అసైన్డ్ భూముల కుంభకోణం, ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్లో అక్రమాల కుంభకోణం, ఫైబర్నెట్ కుంభకోణం, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణం, మద్యం కుంభకోణం, ఇసుక కుంభకోణం.. ఇలా వివిధ కుంభకోణాలతో వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టారు. వాటిపై సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) కేసు నమోదు చేసి పూర్తి ఆధారాలతోసహా ఆ భారీ దోపిడీని బట్టబయలు చేసింది. ఆ వ్యవహారాల్లో కీలక పాత్రధారులగా ఉన్న ఐఏఎస్ అధికారులను విచారించింది. నిబంధనలకు విరద్ధమని తాము అభ్యంతరం తెలిపినప్పటికీ అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఏమాత్రం పట్టించుకోలేదని వారు చెప్పారు. చంద్రబాబు ఒత్తిడితోనే నిబంధనలకు విరుద్ధంగా అసైన్డ్ భూముల బదలాయింపు, ఇన్నర్ రింగ్రోడ్డు అలైన్మెంట్లో మార్పులు, కాంట్రాక్టుల కేటాయింపు, నిధుల విడుదల.. ఇలా అన్ని వ్యవహారాలు సాగాయని వెల్లడించారు. టీడీపీ ప్రభుత్వంలో సీఆర్డీఏ కమిషనర్గా వ్యవహరించిన చెరుకూరి శ్రీధర్, ఫైబర్నెట్ ఎండీగా వ్యవహరించిన అజయ్ జైన్, గుంటూరు కలెక్టర్గా చేసిన కాంతిలాల్ దండే తదితరులు ఆ వాస్తవాలను ‘సిట్’కు తెలిపారు. అంతే కాకుండా ఆ విషయాలను న్యాయస్థానంలోనూ వెల్లడించడం ప్రాధాన్యత సంతరించుకుంది. సీఆర్పీసీ 164 కింద వారు ఇచ్చిన వాంగ్మూలాలను న్యాయస్థానం నమోదు చేసింది. అందుకే ఆ కేసుల్లో చంద్రబాబును ప్రధాన నిందితుడు(ఏ1)గా పేర్కొంటూ సిట్ కేసులు నమోదు చేసింది. స్కిల్ స్కామ్లో చంద్రబాబును అరెస్ట్ చేయగా, ఆయన రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో 52 రోజులు రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే.తప్పుడు వాంగ్మూలాల నమోదుకు ప్రభుత్వ కుట్రగత ఏడాది రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం చంద్రబాబు అవినీతి కేసులను నీరుగార్చేందుకు కుట్రకు తెరతీసింది. అందుకోసం డీజీపీ, సీఐడీ అధికారులు ఆ కేసుల దర్యాప్తు వివరాలను చంద్రబాబుకు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. అంటే ప్రధాన నిందితుడే ఆ కేసులను సమీక్షించారు. ఆ కేసులను ఎలా నీరుగార్చాలనే కుట్రకు అప్పుడే బీజం పడింది. అనంతరం చంద్రబాబు తరఫున గతంలో వాదించిన ఢిల్లీ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా రంగ ప్రవేశం చేశారు. డీజీపీ, సీఐడీ అధికారులతో సమావేశమై చంద్రబాబుపై కేసులను నీరుగార్చే కుట్రకు కార్యాచరణ రూపొందించారు. గతంలో చంద్రబాబే కుట్రదారు.. కుంభకోణాలకు ఆయనే సూత్రధారి.. అని న్యాయస్థానంలో వాంగ్మూలాలు ఇచ్చిన వారితో తాజాగా తప్పుడు వాంగ్మూలాలు ఇప్పించాలని పన్నాగం పన్నారు. ఆ బాధ్యతను సీఐడీకి అప్పగించారు. గతంలో సిట్లో సభ్యులుగా ఉన్న కింది స్థాయి అధికారులను డీజీపీ, సీఐడీ చీఫ్ పిలిపించుకుని మరీ తప్పుడు వాంగ్మూలాలు నమోదు చేసే ప్రక్రియను వివరించారు. బాధిత రైతులు, సాధారణ సాక్షులను కింది స్థాయి అధికారులు బెదిరిస్తుండగా, ఐఏఎస్ అధికారులతో తప్పుడు వాంగ్మూలాలు ఇప్పించే బాధ్యతను సీఐడీ చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్ భుజానికెత్తుకున్నారు.బెదిరించి.. భయపెట్టి..కుట్రలో భాగంగా ఐఏఎస్ అధికారులు చెరుకూరి శ్రీధర్, అజయ్ జైన్లతో తప్పుడు వాంగ్మూలాలు ఇప్పించేందుకు సీఐడీ బరితెగించింది. గతంలో న్యాయస్థానంలో 164 సీఆర్పీసీ కింద తాము ఇచ్చిన వాంగ్మూలానికి విరద్ధుంగా వాంగ్మూలం ఇవ్వాలని వారిపై సీఐడి తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెచ్చింది. బెదిరింపులకు పాల్పడింది. తప్పుడు వాంగ్మూలం ఇవ్వకపోతే సంగతి తేలుస్తామని హెచ్చరించింది. గతంలో ఇచ్చిన వాంగ్మూలానికి విరుద్ధంగా తప్పుడు వాంగ్మూలం ఇవ్వడం సాధ్యం కాదని, అది నేరమని కూడా ఆ అధికారులు, న్యాయ నిపుణులు చెప్పినా సరే సీఐడీ చీఫ్ రవి శంకర్ అయ్యన్నార్ ఏమాత్రం వినిపించుకోలేదని సమాచారం. ఇలా సీఐడీ సామ, దాన, బేధ, దండోపాయాలను ప్రయోగించి చెరుకూరి శ్రీధర్, అజయ్ జైన్లను బెంబేలెత్తించారు. దాంతో వారు తప్పుడు వాంగ్మూలాలు ఇచ్చేందుకు సమ్మతించినట్టుగా సీఐడీ వర్గాలు చెబుతున్నాయి. వారిద్దరితో గుంటూరులోని న్యాయస్థానంలో శుక్రవారం తప్పుడు వాంగ్మూలం నమోదు చేయించేందుకు సీఐడీ అధికారులు తీసుకువచ్చేందుకు సిద్ధపడ్డారు. అయితే న్యాయాధికారి సెలవులో ఉండటంతో ఆ ప్రయత్నాన్ని శనివారానికి వాయిదా వేశారు. తీరా శనివారం చెరుకూరి శ్రీధర్ ఒక్కరినే తీసుకెళ్లారు. కోర్టు బయట కొద్ది సేపు హైడ్రామా నడిచింది. ఆ తర్వాత కోర్టు హాలు లోపలికి వెళ్లకుండానే శ్రీధర్ వెనుదిరిగారు. మళ్లీ ఈ నెల 8వ తేదీన ఆయన్ను న్యాయస్థానానికి తీసుకొచ్చి వాంగ్మూలం నమోదు చేయించాలని సీఐడీ నిర్ణయించినట్లు తెలిసింది.నాడు గూండాల బెదిరింపులు.. నేడు సర్కారు వేధింపులు చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రాజధానిలో అసైన్డ్ భూములు, ఇన్నర్ రింగ్ రోడ్డు కుంభకోణాల గురించి న్యాయస్థానంలో వాంగ్మూలం ఇచ్చిన ఐఏఎస్ అధికారి చెరుకూరి శ్రీధర్.. తనను ఆ కేసుల్లో సాక్షిగా పరిగణించాలని కోరారు. దాంతో ఆయన అంతు చూస్తామని టీడీపీ గూండాలు బెదిరించారు. తీవ్ర ఆందోళన చెందిన ఆయన అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యాదర్శికి ఫిర్యాదు చేశారు. టీడీపీ గూండాల నుంచి తనకు ప్రాణహాని ఉందని, భద్రత కల్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ద్వారా పోలీసు శాఖను కోరారు. దాంతో ఆయనకు పోలీసు శాఖ ప్రత్యేకంగా గన్మెన్ను కేటాయించింది. అప్పటి నుంచి ఆయనకు గన్మెన్ భద్రత కొనసాగుతోంది. అప్పట్లో టీడీపీ గుండాలు బెదిరింపులకు పాల్పడగా, ప్రస్తుతం టీడీపీ కూటమి ప్రభుత్వమే అధికారికంగా ఆయన్ను బెదిరిస్తోంది. తప్పుడు వాంగ్మూలం ఇవ్వకపోతే అంతు తేలుస్తామని సీఐడీ ద్వారా వేధిస్తోంది. కాగా, రాష్ట్ర ప్రభుత్వం, సీఐడీ తీరుపై న్యాయ నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. సీఆర్సీపీ 164 వాంగ్మూలాల గురించి సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పుతోపాటు గతంలో ఇచ్చిన తీర్పులను ఉటంకిస్తున్నారు.మొదటి వాంగ్మూలానికి విరుద్ధంగా ఉండకూడదు సీఆర్సీపీ 164 కింద ఓసారి న్యాయస్థానంలో నమోదు చేసిన వాంగ్మూలం అత్యంత విశ్వసనీయమైనదిగా పరిగణిస్తాం. ఎందుకంటే న్యాయమూర్తి ఎదుట ప్రమాణ పూర్వకంగా నమోదు చేసిన వాంగ్మూలమది. ఆ వాంగ్మూలాన్ని మార్చేందుకు వీల్లేదు. గతంలో ఇచ్చిన వాంగ్మూలానికి విరుద్ధంగా వాంగ్మూలం ఇచ్చేందుకు సాక్షులు ప్రయత్నిస్తే వారిని సంబంధిత న్యాయస్థానం ప్రశ్నించాలి. మొదట ఇచ్చిన వాంగ్మూలాన్నే సాక్షంగా పరిగణలోకి తీసుకోవాలి.– 2024 నవంబరు 25న ఇచ్చిన తీర్పులో సుప్రీంకోర్టు. ఈ మేరకు ఉత్తరాఖండ్ రాష్ట్రానికి చెందిన ఓ కేసులో జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ సతీష్చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం విస్పష్టమైన తీర్పునిచ్చింది.విరుద్ధంగా ఇస్తే కఠిన చర్యలు ఓసారి సీఆర్సీపీ 164 కింద ఇచ్చిన వాంగ్మూలానికి విరుద్ధంగా మరోసారి వాంగ్మూలం ఇస్తే అది నేరంగా పరిగణిస్తాం. ఎందుకంటే ప్రమాణ పూర్వకంగా ఇచ్చిన వాంగ్మూలాన్ని న్యాయమూర్తి చదవి వినిపించిన తర్వాత సమ్మతించి, మరీ సంతకం చేసి ఇచ్చిన వాంగ్మూలమది. మొదటిసారి ఇచ్చిన వాంగ్మూలానికి విరుద్ధంగా మరో వాంగ్మూలం ఇవ్వడమంటే.. మొదట ఇచ్చింది తప్పుడు వాంగ్మూలమని అంగీకరించినట్టే. అత్యంత విశ్వసనీయమైన న్యాయస్థానంలో న్యాయమూర్తి ఎదుట ప్రమాణం చేసి మరీ తప్పుడు వాంగ్మూలం ఇచ్చినట్టు అవుతుంది. అంటే అబద్ధపు వాంగ్మూలం ఇచ్చినందుకు నేరంగా పరిగణిస్తాం. ఆ విధంగా అబద్ధపు వాంగ్మూలం ఇచ్చిన వారిపై ఐపీసీ 193, సీఆర్సీపీ 340 కింద కఠిన చర్యలు తీసుకుంటాం. – వినోద కుమారి వర్సస్ మధ్యప్రదేశ్ కేసులో సుప్రీంకోర్టు తీర్పుఎదుర్కోవాల్సిన పరిణామాలను న్యాయమూర్తి వివరించాలి సీఆర్పీసీ 164 కింద ఓసారి ఇచ్చిన వాంగ్మూలానికి విరుద్ధంగా మరో వాంగ్మూలం ఇచ్చేందుకు సాక్షి ప్రయత్నిస్తే.. దాని వల్ల ఉత్పన్నమయ్యే పరిస్థితులు, ఎదుర్కోవాల్సి వచ్చే పరిణామాల గురించి న్యాయమూర్తి ఆ సాక్షికి వివరించాలి.– అలహాబాద్ హైకోర్టు తీర్పుఏడేళ్ల వరకూ జైలు శిక్ష న్యాయస్థానాల్లో కేసుల విచారణ ప్రక్రియలో ఏ సందర్భంలో అయినా అబద్ధపు వాంగ్మూలం ఇవ్వడం తీవ్రమైన నేరం అని సెక్షన్ 229 (1) స్పష్టం చేస్తోంది. అటువంటి అబద్ధపు వాంగ్మూలం ఇచ్చిన వ్యక్తికి ఏడేళ్ల వరకు జైలు శిక్ష విధించేందుకు అవకాశం కల్పిస్తోంది. అంటే సీఆర్పీసీ 164 కింద న్యాయమూర్తి ఎదుట ప్రమాణ పూర్వకంగా రెండు విరుద్ధ వాంగ్మూలాలు ఇస్తే అందులో ఒకటి అబద్ధపు వాంగ్మూలమే అవుతుంది. మొదటి వాంగ్మూలం గానీ రెండో వాంగ్మూలం గానీ ఏది అబద్ధపు వాంగ్మూలం అయినా శిక్షార్హమే. దాన్ని నేరంగా పరిగణించి ఏడేళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు. -
సీఎం సమోసాలు ఎవరు తిన్నారు? సీఐడీ దర్యాప్తు..
-
ఐసీఐసీఐ బ్యాంకులో భారీ స్కామ్.. సీఐడీ విచారణ
-
ఈనాడుకు బాబు గిఫ్ట్
పరస్పర ఆర్థిక, రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను ఎలా పణంగా పెడతారో సీఎం చంద్రబాబు, ఈనాడు రామోజీ కుటుంబం మరోసారి రుజువు చేసింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై ఈనాడు పత్రిక ఐదేళ్లపాటు సాగించిన విష ప్రచారానికి గానూ బాబు ప్రభుత్వం నుంచి భారీ ప్రతిఫలాన్ని పొందింది. మార్గదర్శి విషయంలో అక్రమాలు జరిగినట్లు సీఐడీ గతంలో పక్కా ఆధారాలతో చార్జిషిట్లు వేసింది.దీంతో తేడా వస్తే తమ ఆస్తులు జప్తు అయ్యే అవకాశం ఉండటంతో బయట పడేందుకు మార్గదర్శి వ్యూహాలను అమలు చేస్తోంది. ఇందుకు చంద్రబాబు సర్కారు, కీలక దర్యాప్తు సంస్థలు తమ వంతు సహకారాన్ని అందిస్తున్నాయి. సాక్షి, అమరావతి: ‘కుమ్మక్కు బంధం’ రాష్ట్ర ప్రయోజనాలకు ఎంతటి విఘాతమో మరోసారి తేటతెల్లమైంది. పరస్పర ఆర్ధిక, రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను ఎలా పణంగా పెడతారో సీఎం చంద్రబాబు, ఈనాడు రామోజీ కుటుంబం మరోసారి రుజువు చేసింది. వైఎస్సార్సీపీ సర్కారుపై ఐదేళ్ల పాటు దుష్ప్రచారం చేసిన రామోజీ కుటుంబానికి టీడీపీ కూటమి ప్రభుత్వం కృతజ్ఞతాపూర్వకంగా ‘కానుక’ సమర్పించింది. అదీ రాష్ట్రంలో వేలాదిమంది మార్గదర్శి చిట్ఫండ్స్ చందాదారుల ప్రయోజనాలను కాలరాసి మరీ!! మార్గదర్శి చిట్ఫండ్స్కు ఆంధ్రప్రదేశ్ డిపాజిటర్ల పరిరక్షణ చట్టంలోని సెక్షన్ 5 వర్తించదంటూ ప్రత్యేక కోర్టులు ఇచ్చిన ఉత్తర్వులను, అలాగే మార్గదర్శి చిట్ఫండ్స్కు చెందిన దాదాపు రూ.1,050 కోట్ల విలువైన ఆస్తుల జప్తును ఖరారు చేసేందుకు నిరాకరిస్తూ గుంటూరు కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ హైకోర్టులో దాఖలు చేసిన అప్పీళ్లను సీఐడీ ద్వారా ఉపసంహరింప చేశారు. ఈమేరకు సీఐడీ అదనపు డీజీ గురువారం హైకోర్టుకు నివేదించారు. దీంతో అప్పీళ్ల ఉపసంహరణకు హైకోర్టు అనుమతినిచ్చింది. ఈ వ్యాజ్యాలు తాజాగా జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప ముందు విచారణకు వచ్చాయి. ఈ సందర్భంగా రాష్ట్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్ లక్ష్మీనారాయణ స్పందిస్తూ.. సీఐడీ కేసులన్నింటినీ తనకు అప్పగిస్తూ అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ (ఈ అప్పీళ్లలో శైలజా కిరణ్ తరఫున వాదనలు వినిపించారు) ప్రొసీడింగ్స్ ఇచ్చారని నివేదించారు. అందువల్ల సీఐడీ తరఫున తాను హాజరవుతున్నట్లు తెలిపారు. ఈ అప్పీళ్లను ఉపసంహరించుకోవాలంటూ సీఐడీ అదనపు డీజీ లేఖ రాశారన్నారు. దీంతో తాము తమ అప్పీళ్లను ఉపసంహరించుకుంటున్నట్లు అదనపు డీజీ రాసిన లేఖను కోర్టుకు సమర్పించారు. ఆ లేఖను పరిశీలించిన న్యాయస్థానం పీపీ లక్ష్మీనారాయణ చెప్పిన వివరాలను పరిగణనలోకి తీసుకుని నమోదు చేసింది. అప్పీళ్లను ఉపసంహరించుకున్న నేపథ్యంలో వాటిని పరిష్కరిస్తున్నట్లు న్యాయమూర్తి జస్టిస్ జ్యోతిర్మయి అనంతరం ఉత్తర్వులు జారీ చేశారు. చిట్స్ రిజిస్ట్రార్ల ఫిర్యాదుతో రంగంలోకి సీఐడీ.. మార్గదర్శి చిట్ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ ఆర్ధిక అవకతవకలు, తప్పుడు రికార్డుల నిర్వహణ, నిధుల మళ్లింపు, ఇతర చట్ట ఉల్లంఘనలపై చిట్స్ అసిస్టెంట్ రిజిష్ట్రార్లు గతంలో సీఐడీకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ ఫిర్యాదు ఆధారంగా రామోజీరావు, శైలజా కిరణ్లతో పాటు మొత్తం 15 మందిపై ఐపీసీ, డిపాజిటర్ల పరిరక్షణ చట్టం, చిట్ఫండ్ చట్ట నిబంధనల కింద సీఐడీ కేసులు నమోదు చేసింది. మార్గదర్శి చిట్స్ కార్యాలయాల్లో సోదాలు నిర్వహించి కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుంది. పలువురు ఖాతాదారుల నుంచి ఫిర్యాదులు స్వీకరించింది. వారి వాంగ్మూలాలను రికార్డ్ చేసింది. గడువు ముగిసినా, ష్యూరిటీలు సమర్పించిన తరువాత కూడా బ్రాంచ్ మేనేజర్లు సకాలంలో చెల్లింపులు చేయలేదని పలువురు చందాదారులు దర్యాప్తు సంస్థకు వాంగ్మూలం ఇచ్చారు. సాకులు చెబుతూ ష్యూరిటీలను తిరస్కరించడం, అదనపు ష్యూరిటీలు సమర్పించాలని కోరడంతో పాటు ప్రైజ్ మొత్తాలను చెల్లించకుండా మార్గదర్శి ఇబ్బంది పెడుతోందంటూ చందాదారులు స్పష్టంగా ఫిర్యాదు చేశారు. పకడ్బందీ ఆధారాలతో చార్జిషీట్లు... మార్గదర్శి చిట్ఫండ్స్ అవకతవకలపై పకడ్బందీగా అన్ని ఆధారాలను సేకరించిన సీఐడీ ప్రత్యేక కోర్టుల్లో చార్జిషిట్లు దాఖలు చేసింది. ఇదే సమయంలో ఖాతాదారుల ప్రయోజనాలను పరిరక్షించే నిమిత్తం చట్ట ప్రకారం మార్గదర్శి చిట్ఫండ్స్కు చెందిన దాదాపు రూ.1,050 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేస్తూ గత ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను ఖరారు చేయాలని కోరుతూ సీఐడీ పిటిషన్లు దాఖలు చేసింది. అయితే సీఐడీ దాఖలు చేసిన చార్జిషిట్లను పరిశీలించిన గుంటూరు, విశాఖపట్నంలోని ప్రత్యేక కోర్టులు వాటిని రిటర్న్ చేశాయి. ఆస్తుల జప్తు ఖరారు కోసం సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ను గుంటూరు కోర్టు కొట్టివేసింది. మార్గదర్శి, శైలజా కిరణ్ వాదనలను గతంలో తీవ్రంగా వ్యతిరేకించిన సీఐడీఈ అప్పీళ్లపై హైకోర్టు గత ఏడాది డిసెంబర్ నుంచి విచారణ జరుపుతూ వస్తోంది. ఈ అప్పీళ్ల విచారణార్హతపై రామోజీ, శైలజా కిరణ్, మార్గదర్శి చిట్ఫండ్స్ తరఫున నాడు దమ్మాలపాటి శ్రీనివాస్, పోసాని వెంకటేశ్వర్లు అభ్యంతరం చెప్పారు. మొదట విచారణార్హతపై తేల్చాలని పట్టుబట్టారు. దీనిపై సీఐడీ తీవ్ర అభ్యంతరం తెలిపింది. తమ అప్పీళ్ల విచారణార్హతపై అభ్యంతరం ఉంటే ఆ విషయాన్ని అనుబంధ పిటిషన్ లేదా కౌంటర్ రూపంలో తెలియచేయాలే తప్ప మౌఖికంగా కాదంది. అనుబంధ పిటిషన్ లేదా కౌంటర్ దాఖలు చేసినప్పుడే అందుకు తగిన సమాధానం ఇచ్చేందుకు తమ అవకాశం ఉంటుందని తెలిపింది. దీంతో మార్గదర్శి, శైలజా కిరణ్ తదితరులు ఓ అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. ఇదే సమయంలో జప్తు ఆస్తుల విషయంలో యథాతథస్థితి (స్టేటస్ కో) కొనసాగిస్తామని మార్గదర్శి తరఫున న్యాయవాది పోసాని కోర్టుకు హామీ ఇచ్చారు. దీనిని పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు ఆ మేర మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అటు తరువాత ఈ అప్పీళ్లపై ఇప్పటిదాకా విచారణ జరుగుతూ వస్తోంది.అప్పీళ్ల ఉపసంహరణతో జరిగేదిది..తాజాగా అప్పీళ్లను సీఐడీ ఉపసంహరించుకోవడంతో మార్గదర్శి చిట్ఫండ్స్కు భారీ ఊరట లభించినట్లయింది. తద్వారా నామమాత్రమైన ఐపీసీ సెక్షన్ల కింద విచారణకు ఆస్కారం ఉంటుంది. దీని వల్ల మార్గదర్శి యాజమాన్యానికి వచ్చే నష్టం ఏమీ లేదు. ప్రత్యేక కోర్టులో విచారణ జరిగి మార్గదర్శి డిపాజిటర్ల పరిరక్షణ చట్టంలోని సెక్షన్ 5 కింద ఉల్లంఘనలకు పాల్పడినట్లు తేలే పరిస్థితి ఉంటే దాని యాజమాన్యానికి, మేనేజర్లకు పదేళ్ల జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా, అలాగే ఆ సంస్థకు రూ 5 లక్షల జరిమానా విధించే పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఈ పరిస్థితి నుంచి మార్గదర్శి, దాని యాజమాన్యం బయటపడినట్లే. అదే రీతిలో రూ.1050 కోట్ల ఆస్తుల జప్తు కూడా ఉండదు. ఎందుకంటే ఆ జప్తును ఖరారు చేసేందుకు గుంటూరు కోర్టు తిరస్కరిస్తూ ఇచ్చిన ఉత్తర్వులు అమల్లో ఉంటాయి. ఇలా ఈ మొత్తం కేసును నీరుగార్చి దాన్ని కొట్టేసేందుకు సీఐడీ ఆస్కారం కలిగించింది.భారీ గురు దక్షిణ..వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై ఈనాడు పత్రిక ఐదేళ్లపాటు సాగించిన విష ప్రచారానికిగానూ చంద్రబాబు ప్రభుత్వం నుంచి భారీ ప్రతిఫలాన్ని పొందింది. ప్రజలకిచ్చిన ఎన్నికల హామీలను, కీలక ప్రాజెక్టులను అటకెక్కించేసిన సీఎం చంద్రబాబు.. రామోజీ కుటుంబం కోసం మాత్రం రంగంలోకి దిగారు. సీఐడీ దాఖలు చేసిన అప్పీళ్లపై హైకోర్టు పూర్తిస్థాయిలో విచారణ జరిపి కింది కోర్టు ఉత్తర్వులను కొట్టివేస్తే మార్గదర్శి ఫైనాన్షియర్స్ మాదిరిగా మార్గదర్శి చిట్ఫండ్స్ కూడా ఇరుక్కుపోవడం ఖాయమని పసిగట్టి ఆ పరిస్థితి తలెత్తకుండా సీఐడీని రంగంలోకి దించి అనుకున్న విధంగా పనికానిచ్చేశారు. అంతేకాదు.. మార్గదర్శి చిట్ఫండ్స్ ఆర్ధిక మోసాలపై ప్రస్తుతం దర్యాప్తు దశలో ఉన్న కేసులను క్రమంగా ఎత్తివేసే దిశగా పావులు కదులుతున్నాయి. మార్గదర్శి విషయంలో రామోజీ కుటుంబం అక్రమాలకు పాల్పడినట్లు సీఐడీ గతంలో పూర్తి ఆధారాలతో సీఐడీ కేసు నమోదు చేసింది. మార్గదర్శి చిట్ఫండ్స్ బాధితులు సంఘం ఏర్పాటు చేసుకుని మరీ ఆందోళనలను నిర్వహిస్తున్నారు. తెలంగాణతో పాటుఇతర రాష్ట్రాల్లోనూ బాధితులున్నారు. మార్గదర్శి చిట్ఫండ్స్ మోసాలు నాలుగు రాష్ట్రాలకు విస్తరించడం, మనీ ల్యాండరింగ్కు పాల్పడినందున ఈ వ్యవహారంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దృష్టి సారించాలని సీఐడీ అధికారులు గతంలో కోరడం గమనార్హం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) చట్ట నిబంధనలకు విరుద్ధంగా ప్రజల నుంచి రూ.4,600 కోట్ల మేర డిపాజిట్లు వసూలు చేసి చట్టపరంగా పీకల్లోతుల్లో కూరుకుపోయిన మార్గదర్శి ఫైనాన్షియర్స్ యాజమాన్యం ఇప్పుడు మార్గదర్శి చిట్ఫండ్స్ వ్యవహారంలో ఇరుక్కోకుండా జాగ్రత్త పడుతోంది. తేడా వస్తే దాదాపు రూ.1,050 కోట్ల ఆస్తులు జప్తు అయ్యే అవకాశం ఉండటంతో బయట పడేందుకు వ్యూహాలను అమలు చేస్తోంది. ఇందుకు చంద్రబాబు సర్కారు, కీలక దర్యాప్తు సంస్థలు తమ వంతు సహకారాన్ని అందిస్తున్నాయి. అందులో భాగంగా రామోజీరావు (ఇటీవల మృతి చెందారు) డైరెక్టర్గా, ఆయన కోడలు శైలజా కిరణ్ మేనేజింగ్ డైరెక్టర్ ఉన్న మార్గదర్శి చిట్ఫండ్స్పై ఆర్ధిక అవకతవకలు, తప్పుడు రికార్డుల నిర్వహణ, నిధుల మళ్లింపు, ఇతర చట్ట ఉల్లంఘనలకు పాల్పడినట్లు పెద్ద ఎత్తున ఉన్న ఆరోపణలను నీరుగారుస్తోంది.మార్గదర్శి చిట్ఫండ్స్ అక్రమాలలో కొన్ని..సకాలంలో చందాదారులకు చెల్లింపులు చేయకపోవడం, చెల్లించాల్సిన ప్రైజ్ మొత్తాన్ని డిపాజిట్గా తమ వద్దే అట్టిపెట్టుకోవడం, తక్కువ వడ్డీ చెల్లించడం, చెల్లింపులు ఎగవేయడం. చందాదారులకు చెల్లించాల్సిన ప్రైజ్మనీని చెల్లించకుండా వడ్డీ చెల్లింపు పేరుతో తమ వద్దే అట్టిపెట్టుకోవడానికి ప్రధాన కారణం చెల్లింపులు చేయడానికి మార్గదర్శి చిట్ఫండ్స్ వద్ద సరిపడినంత డబ్బు లేకపోవడమే. తమ వద్ద డబ్బు లేదు కాబట్టి చందాదారులకు చెల్లించాల్సిన డబ్బునే భవిష్యత్తులో చెల్లించాల్సిన చందాగా మార్గదర్శి చిట్ఫండ్స్ తమ వద్దే అట్టిపెట్టుకుంది. అలా అట్టిపెట్టుకున్న మొత్తాలను రొటేషన్ చేస్తూ వస్తోంది. చట్ట నిబంధనల ప్రకారం చందాదారుల డబ్బును ప్రత్యేక ఖాతాల్లో ఉంచడం తప్పనిసరి. అయితే అలా ఉంచకుండా దానిని ఇతర అవసరాలకు మళ్లించేశారు. ఈ ఉల్లంఘనలన్నీ డిపాజిటర్ల పరిరక్షణ చట్టంలోని సెక్షన్ 5 కిందకే వస్తాయి. నాడు సీఐడీ అభ్యంతరం.. అప్పీళ్లు దాఖలుఉల్లంఘనలు స్పష్టంగా కనిపిస్తున్నా వాటిని పట్టించుకోకుండా, ప్రైజ్ మొత్తాల ఎగవేత జరిగినట్లు కనిపించడం లేదంటూ గుంటూరు, విశాఖపట్నం కోర్టులు ఇచ్చిన ఉత్తర్వులపై గతంలో సీఐడీ అభ్యంతరం తెలిపింది. ఆ ఉత్తర్వులను సవాలు చేస్తూ గత ఏడాది డిసెంబర్లో హైకోర్టులో వేర్వేరుగా అప్పీళ్లు దాఖలు చేసింది. మరికొన్ని అప్పీళ్లను ఈ ఏడాది జనవరిలో దాఖలు చేసింది. మార్గదర్శి చిట్ఫండ్స్ అక్రమాలు, ఆర్ధిక అవకతవకలు, చట్ట ఉల్లంఘనలపై పూర్తిస్థాయి ఆధారాలను చార్జిషీట్ రూపంలో ప్రత్యేక కోర్టుల ముందు ఉంచినా, వాటిని పట్టించుకోకపోవడం ఎంత మాత్రం సరికాదని సీఐడీ తన అప్పీళ్లలో పేర్కొంది. స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినకుండానే అలా నిర్ధారించడం చట్ట విరుద్ధమంది. చార్జిషిట్లోని అంశాలపై మినీ ట్రయల్ నిర్వహించడానికి వీల్లేదని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పిన విషయాన్ని తన అప్పీళ్లలో హైకోర్టుకు వివరించింది. డిపాజిటర్ల పరిరక్షణ చట్టంలోని సెక్షన్ 5కు ప్రత్యేక కోర్టులు భాష్యం చెప్పాయని, అలా చెప్పి ఉండకూడదంది. చార్జిషిట్లను రిటర్న్ చేస్తూ ప్రత్యేక కోర్టులు జారీ చేసిన ఉత్తర్వులను, జప్తును ఖరారు చేసేందుకు నిరాకరిస్తూ గుంటూరు కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని హైకోర్టును కోరింది. -
AP: మన కేసులు ఎత్తేద్దాం!
ఓ ఘరానా దొంగ భారీ దోపిడీకి పాల్పడ్డాడు. దానిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తదనంతర పరిణామాల్లో ఆ దొంగే.. పోలీసుగా ఉద్యోగంలోకి వచ్చాడు! మరి దోపిడీపై అప్పటికే నమోదైన కేసు విచారణ ఏమవుతుంది? సహజంగానే కేసును ఆ పోలీసు మూసివేస్తాడు! సక్రమంగా దర్యాప్తు జరిగితే తానే దొంగ అన్నది రుజువై శిక్ష పడుతుంది కాబట్టి! ఈ ఉదాహరణ ఊహాజనితమే కావచ్చు. కానీ రాష్ట్రంలో అదే వాస్తవ రూపం దాల్చి కళ్ల ముందు ఆవిష్కృతమవుతోంది. 2014–19 మధ్య ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు యథేచ్ఛగా సాగించిన అవినీతి దందాపై సీఐడీ ఇప్పటికే కేసులు నమోదు చేయగా.. ప్రస్తుతం సీఎంగా ఉన్న అదే చంద్రబాబు ఆ కేసులను నీరుగార్చే కుతంత్రానికి తెర తీశారు!– సాక్షి, అమరావతి పక్కా ఆధారాలతోనే కేసులు నమోదు..నాటి టీడీపీ ప్రభుత్వంలో అవినీతి దందాపై సీఐడీ ప్రత్యేక దర్యాప్తు విభాగం (సిట్) చంద్రబాబుపై పలు కేసులు నమోదు చేసింది. రూ.241 కోట్లు కొల్లగొట్టిన స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో ఆయన్ను అరెస్ట్ చేయడంతో 52 రోజుల పాటు రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇక అమరావతిలో దాదాపు రూ.5 వేల కోట్ల అసైన్డ్, ప్రభుత్వ భూముల దోపిడీ.. రూ.2 వేల కోట్ల మేర ఇన్నర్ రింగ్రోడ్డు అలైన్మెంట్లో అక్రమాలు.. రూ.333 కోట్లు కొల్లగొట్టిన ఫైబర్నెట్ స్కామ్పై సిట్ పూర్తి ఆధారాలతో కేసులు నమోదు చేసి న్యాయస్థానంలో విచారణ ప్రక్రియ దిశగా చర్యలు చేపట్టింది. 2015లో ప్రవేశపెట్టిన మద్యం విధానం ద్వారా టీడీపీ లిక్కర్ సిండికేట్ ఏటా రూ.2.50 లక్షల కోట్లు చొప్పున కొల్లగొట్టడంతోపాటు ప్రభుత్వ ఖజానాకు ఏటా రూ.1,300 కోట్ల పన్ను రాబడికి గండి కొట్టింది. ఇక ఉచిత ఇసుక ముసుగులో రూ.10 వేల కోట్ల దోపిడీ వెలుగులోకి వచ్చింది. ఈ కేసుల్లో సీఐడీ గతంలోనే ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. ఆయా కేసుల్లో ప్రధాన నిందితులుగా చంద్రబాబు, లోకేశ్తోపాటు పి.నారాయణ, దేవినేని ఉమా, కొల్లు రవీంద్ర, చింతమనేని ప్రభాకర్, పీతల సుజాత, లింగమనేని రమేష్ కుటుంబ సభ్యులు, చంద్రబాబు బినామీలు, సన్నిహితులను నిందితులుగా చేర్చి సీఐడీ కేసులు నమోదు చేసింది. అయితే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తనపై గతంలో సీఐడీ నమోదు చేసిన కేసుల దర్యాప్తును తొలుత నీరుగార్చి అనంతరం విచారణను ఉపసంహరిస్తూ మంత్రి మండలి ద్వారా నిర్ణయం తీసుకోవాలనే పన్నాగాన్ని చంద్రబాబు అమలు చేస్తున్నారు. అందుకోసం ఏకంగా పోలీసు వ్యవస్థను భ్రష్టు పట్టిస్తూ డీజీపీ, సీఐడీ చీఫ్ల ద్వారా కుట్ర కథను నడిపిస్తున్నారు. అటకెక్కిన దర్యాప్తుజూన్ 4న ఎన్నికల ఫలితాలు వెలువడగానే చంద్రబాబు తనపై ఉన్న సీఐడీ కేసులను నీరు గార్చే కుట్రకు తెర తీశారు. ముఖ్యమంత్రిగా ఆయన జూన్ 12న ప్రమాణ స్వీకారం చేయగా ఫలితాలు వెలువడిన రోజు నుంచే సీఐడీ కేసులను తొక్కిపెట్టే ఆపరేషన్ చేపట్టారు. చంద్రబాబుపై అవినీతి కేసులను విచారిస్తున్న సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) కార్యాలయాన్ని పోలీసులు జప్తు చేశారు. తద్వారా ఆ కేసుల దర్యాప్తును అటకెక్కిస్తున్నట్లు స్పష్టమైన సంకేతాలిచ్చారు.సిట్ కేసులు క్లోజ్ చేయాలనే షరతులతో డీజీపీ, సీఐడీ చీఫ్లకు పోస్టింగ్లుచంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత తనపై సిట్ కేసులను పక్కదారి పట్టించడమే లక్ష్యంగా పావులు కదిపారు. అందుకోసం పోలీసు వ్యవస్థను పూర్తి స్థాయిలో దుర్వినియోగం చేసేందుకు తెగించారు. ప్రధానంగా డీజీపీ, సీఐడీ చీఫ్ల నియామకాన్ని తన రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకున్నారు. తనపై ‘సిట్’ గతంలో నమోదు చేసిన స్కిల్ స్కామ్, అసైన్డ్ భూముల కుంభకోణం, ఇన్నర్రింగ్ రోడ్ కుంభకోణం, ఫైబర్ నెట్ కేసులను నీరు గార్చేసి అనంతరం విచారణను పూర్తిగా నిలిపివేయాలని షరతు విధించారు. దీనికి లోబడే డీజీపీ, సీఐడీ అదనపు డీజీలకు పోస్టింగ్లు ఇచ్చినట్లు పోలీసువర్గాలు అప్పట్లోనే వ్యాఖ్యానించాయి. తదనంతర పరిణామాలు అదే విషయాన్ని రుజువు చేస్తున్నాయి.నిందితులపై లుక్ అవుట్ నోటీసుల ఉపసంహరణ!2014–19 మధ్య చంద్రబాబు అవినీతి కార్యకలాపాల్లో పలువురు షెల్ కంపెనీల ప్రతినిధులు, ప్రైవేటు వ్యక్తులు కీలక పాత్రధారులుగా వ్యవహరించారు. సీమెన్స్కు తెలియకుండా ఆ కంపెనీ పేరుతో స్కిక్ల్ డెవలప్మెంట్ ప్రాజెక్టు ముసుగులో నిధులు కొల్లగొట్టడం.. అసైన్డ్ భూములను కాజేసేందుకు షెల్ కంపెనీల ద్వారా నిధుల తరలింపు.. ఇన్నర్రింగ్ రోడ్డు అలైన్మెంట్ అక్రమాల్లో షెల్ కంపెనీల ప్రతినిధుల పాత్ర... ఫైబర్నెట్ స్కామ్ ద్వారా నిధుల అక్రమ తరలింపులో చంద్రబాబు సన్నిహితులు, బినామీల బాగోతం.. ఇలా ఈ కుంభకోణాల్లో కీలకంగా వ్యవహరించిన వారిని సీఐడీ అధికారులు గతంలోనే గుర్తించారు. నిందితులు విదేశాలకు పరారు కాకుండా లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ కేసులను నీరుగార్చేందుకు ముందుగా లుక్ అవుట్ నోటీసులను లక్ష్యంగా చేసుకున్నారు. చంద్రబాబుపై నమోదైన కేసులను విచారిస్తున్న దర్యాప్తు అధికారులను డీజీపీ, సీఐడీ అదనపు డీజీ తమ కార్యాలయానికి పిలిపించారు. ఆ కేసుల్లో జారీ చేసిన లుక్ అవుట్ నోటీసులను ఉపసంహరించాలని దర్యాప్తు అధికారులను ఆదేశించారు. అంటే ఆ కేసుల దర్యాప్తును ఇక పట్టించుకోవద్దని స్పష్టం చేశారు. అందులో మొదటి అడుగుగా ఆ కేసుల్లో కొందరు నిందితులపై జారీ చేసిన లుక్ అవుట్ నోటీసులను ఉపసంహరింపజేశారు.నీరుగార్చుదాం... ఉపసంహరిద్దాంఇదీ చంద్రబాబు పన్నాగంచంద్రబాబుపై అవినీతి కేసుల్లో విచారణ ప్రక్రియను పూర్తిగా ఉపసంహరించే దిశగా కూటమి ప్రభుత్వం పథకం ప్రకారం వ్యవహరిస్తోంది. ఆ కేసుల్లో సిట్ అధికారులు ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతోపాటు న్యాయస్థానాల్లో చార్జిషీట్లను కూడా దాఖలు చేశారు. దీంతో న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా చంద్రబాబు పూర్తిస్థాయిలో కుతంత్రానికి తెరతీశారు. ముందుగా ఆ కేసుల్లో సీఐడీ వాదన వీగిపోవాలి..! విచారణ ప్రక్రియ సందర్భంగా సీఐడీ న్యాయవాదులు చేతులెత్తేయాలి...! న్యాయస్థానం లేవనెత్తే ప్రశ్నలకు దర్యాప్తు అధికారులు ఉద్దేశపూర్వకంగా సమాధానం చెప్పకుండా ఉండిపోవాలి...! అవసరమైతే న్యాయస్థానం ఆగ్రహానికి కూడా గురి కావాలి...! కేసుల విచారణలో డిఫెన్స్ న్యాయవాదుల వాదనకు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు ఏమాత్రం ఎదురు చెప్పకూడదు...! కేసుల విచారణ ప్రక్రియ సందర్భంగా అన్ని పరిణామాలు సీఐడీకి వ్యతిరేకంగా సాగాలనే లక్ష్యంతో వ్యవహరిస్తున్నారు. ఇది మొదటి వ్యూహం కాగా అదే అదనుగా చంద్రబాబుపై నమోదైన కేసులను ఉపసంహరిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలన్నది చంద్రబాబు రెండో వ్యూహం. సీఐడీ అభియోగాలకు తగిన ఆధారాలు లేవని, ఆ కేసులను ఉపసంహరించుకోవడమే సరైన చర్యని న్యాయ శాఖ అభిప్రాయపడినట్టుగా ఓ నోట్ తయారు చేయించి అనంతరం ఈమేరకు రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ఆమోద ముద్ర వేయించుకోవాలన్నది చంద్రబాబు అంతిమ లక్ష్యం. ఆ మేరకు ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసి కేసులను పూర్తిగా మూసివేయడం ద్వారా తన అవినీతి దందాకు ప్రభుత్వ పరంగా రక్షణ కల్పించాలని చంద్రబాబు పకడ్బందీగా కుట్రను వేగంగా అమలు చేస్తున్నారు. -
ఫోన్ తీయనందుకే అంజలి హత్య
హుబ్లీ: నగరంలోని వీరాపుర ఓణిలో ఈ నెల 14వ తేదీ తెల్లవారు జామున జరిగిన అంజలి అంబిగేర హత్య కేసు దర్యాప్తు చేపట్టిన సీఐడీ బృందం ఎదుట నిందితుడు నిజాలను చెప్పినట్లుగా తెలుస్తోంది. నిందితుడు గిరీష్ తాను మొదట అంజలిని మైసూరుకు రమ్మని పిలిచాను. అయితే ఆమె రాలేదు. హత్య చేయడానికి ముందు రోజు అంజలికి రూ.1000 ఫోన్ పే చేశాను. డబ్బులు పంపాక ఆమె తన ఫోన్ నెంబర్ను బ్లాక్ చేసింది. ఈ కారణంతోనే కోపం తట్టుకోలేక హత్య చేసినట్లుగా నిందితుడు గిరీష్ అలియాస్ విశ్వ సీఐడీ అధికారుల వద్ద విచారణ సందర్భంగా నోరు విప్పాడు. కాగా గత ఏప్రిల్ 18న విద్యార్థిని నేహా హిరేమఠ హత్య చేసిన మాదిరిగానే అంజలి హత్య కూడా జరిగిన సంగతి తెలిసిందే. కాగా అంతకు ముందు నిందితుడు అంజలిని నేహా మాదిరిగానే చంపుతానని బెదిరించేవాడని అంజలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. -
సైలెంట్ మోడ్లో సీబీఐ.!
సాక్షి, విశాఖపట్నం: ప్రత్యేక విమానంలో విశాఖ వచ్చి.. భారీగా డ్రగ్స్ పట్టుకున్న సీబీఐ దాని వెనుక ఉన్న పాత్రధారులు, సూత్రధారులను కనిపెట్టే విషయంలో మాత్రం నిర్లిప్తత వహిస్తోంది. మూలాలు శోధించేందుకు బ్రెజిల్ వెళ్లిన బృందాలు కొండని తవ్వి కనీసం ఎలుక జాడ కూడా కనిపెట్టలేకపోయాయి. ప్రధాన పాత్రధారులుగా ఉన్న సంధ్యా ఆక్వా ప్రతినిధులు కళ్లెదుటే ఉన్నా కనీసం సమగ్రంగా విచారించకుండా వదిలేయడంపైనా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డ్రగ్స్ తీసుకొచ్చిన సంస్థపై చర్యలు తీసుకోకుండా గాలికొదిలేయడంపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.మార్చి 19న విశాఖపట్నం కంటైనర్ టెర్మినల్ (వీసీటీపీఎల్)లో 25 వేల కిలోల డ్రైఈస్ట్తో పాటు పెద్ద ఎత్తున డ్రగ్స్ దిగుమతి రాకెట్ని సీబీఐ బట్టబయలు చేసింది. బ్రెజిల్లోని శాంటోస్ పోర్టు నుంచి బయలుదేరిన షిప్లోని కంటైనర్లో డ్రైఈస్ట్ని తీసుకొచ్చిన సంధ్యా ఆక్వా సంస్థ.. అందులో డ్రగ్స్ ఎలా వచ్చాయో తమకు తెలీదంటూ బుకాయిస్తోంది. డ్రగ్స్ దొరికిన తొలి రోజున సంస్థ ప్రతినిధులను రెండు గంటల సేపు మాత్రమే సీబీఐ అధికారులు విచారించారు. తమకేమీ తెలీదని చెప్పడంతో వదిలేశారు. తర్వాత ఇంత వరకూ సంధ్యా ఆక్వా ప్రతినిధుల జోలికి సీబీఐ వెళ్లకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ప్రాథమికంగా సంధ్య ఆక్వా ప్రతినిధుల నుంచి కీలక సమాచారం రాబట్టే అవకాశాలున్నా కనీసం ఆ దిశగా సీబీఐ విచారించకపోవడం గమనార్హం. మొత్తం కంటైనర్లో వచ్చిన వెయ్యి బ్యాగుల్లో 70 శాతం బ్యాగ్స్లో ఉన్న డ్రైఈస్ట్లో కొకై న్, హెరాయిన్, ఓపియం, కొడైన్, మెథలాక్విన్ తదితర డ్రగ్స్ అవశేషాలున్నాయి. ఈ పరిణామాలు చూస్తుంటే 30 శాతం బ్యాగుల్లో పూర్తిస్థాయిలో డ్రైఈస్ట్ లోడ్ చేసి ఒకవేళ పరీక్షలు నిర్వహించినా దొరకవనే ఉద్దేశంతో పక్కా ప్రణాళికలతోనే డ్రగ్స్ తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. అయితే సీబీఐకి ఇంటర్పోల్ నుంచి సమాచారం రావడంతో ఈ రాకెట్ గుట్టురట్లు అయింది. పక్కాగా డ్రగ్స్ అక్రమంగా రవాణా చేసినట్లు ఆధారాలున్నా సంధ్యా ఆక్వాపై ఇంతవరకూ సీబీఐ ఎలాంటి చర్యలకు ఉపక్రమించకపోవడం మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.రిపోర్టులూ మరింత ఆలస్యం.?తమ దగ్గర ఉన్న కిట్స్ సాయంతో నిర్వహించిన ప్రాథమిక పరీక్షల్లో డ్రగ్స్ అవశేషాలున్నట్లు సీబీఐ గుర్తించింది. అయితే ఒక్కో బ్యాగ్లో ఎంత మొత్తం డ్రగ్స్ ఉన్నాయి.. ఏఏ డ్రగ్స్ ఎంత మేర ఉన్నాయన్న అంశంపై సమగ్ర నివేదిక కోసం ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (ఎఫ్ఎస్ఎల్)కి పంపించారు. అయితే ఇంతవరకూ దీనికి సంబంధించిన రిపోర్టులు రాలేదని సీబీఐ చెబుతోంది. సాధారణంగా ఎఫ్ఎస్ఎల్ నుంచి 10 నుంచి 15 రోజుల్లో నివేదిక వస్తుందని సంధ్యా డ్రగ్స్కు సంబంధించిన రిపోర్టు దాదాపు రెండు నెలలు కావస్తున్నా బయటికి రాకపోవడంపైనా సీబీఐ తీరుపై విమర్శలు వినిపిస్తున్నాయి.బ్రెజిల్ వెళ్లి ఏం చేశారు..?మరోవైపు డ్రగ్స్ మూలాలు ఎక్కడ ఉన్నాయనే కోణంలో దర్యాప్తు చేస్తామంటూ సీబీఐకి చెందిన బృందం బ్రెజిల్ పయనమయ్యాయి. శాంటోస్ పోర్టుకు డ్రైఈస్ట్ తరలించిన ఓషన్ నెట్వర్క్ ఎక్స్ప్రెస్ సంస్థతో పాటు కార్గో షిప్ వచ్చిన మార్గంతో పాటు షిప్ ఆగిన పోర్టుల్లో సీసీటీవీ పుటేజ్ సేకరించాలని సీబీఐ బృందం బ్రెజిల్ వెళ్లినట్లు తెలిసింది. అయితే దాదాపు 2 నెలలు కావస్తున్నా ఇంతవరకూ ఎలాంటి ఆధారాలు సేకరించకపోవడంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. అయితే బ్రెజిల్ నుంచి సీబీఐ బృందం తిరిగి వచ్చేసినట్లు తెలుస్తోంది. కానీ అసలు దర్యాప్తు ఎంతవరకూ వచ్చిందో కూడా సీబీఐ వెల్లడించకపోవడంపై అనుమానాలు రేకెత్తుతున్నాయి.ఎక్కడ కంటైనర్ అక్కడే..రూ.వేల కోట్ల విలువైన డ్రగ్స్ విషయంలోనూ సీబీఐ నిర్లక్ష్యం వహిస్తోంది. ఎక్కడైతే తనిఖీలు నిర్వహించారో ఆ ప్రాంతమైన వీసీటీపీఎల్లోనే డ్రగ్స్ దొరికిన కంటైనర్ని సీబీఐ సీజ్ చేసి విడిచి పెట్టేసింది. కంటైనర్ టెర్మినల్లో కస్టమ్స్ తనిఖీల్లో పట్టుబడిన కంటైనర్లతో పాటు ఈ డ్రగ్స్ కంటైనర్ కూడా విడిచిపెట్టేశారు. ఎర్రచందనం, నిషేధిత వస్తువులతో వచ్చిన కంటైనర్లను వీసీటీపీఎల్లోని ఓ ప్రాంతంలో ఉంచేస్తారు. దాదాపు 10 నుంచి 15 ఏళ్లుగా ఈ కంటైనర్లు ఇక్కడే ఉన్నాయి. వాటితో పాటుగా.. డ్రగ్స్ కంటైనర్ని కూడా సీబీఐ విడిచి పెట్టేసింది. కస్టమ్స్, వీసీటీపీఎల్ ప్రతినిధుల్ని ఆ కంటైనర్ భద్రపరచాలని సీబీఐ సూచించిందే తప్ప.. తమ తరఫున ఒక భద్రతా సిబ్బందిని కూడా కంటైనర్ వద్ద ఉంచకుండా నిర్లిప్తంగా వ్యవహరిస్తోంది. వీలైనంత త్వరగా డ్రగ్స్ దోషులను బయటకి లాగాలని దర్యాప్తును సీబీఐ త్వరగా పూర్తి చేయాలన్న డిమాండ్ వినిపిస్తోంది. -
బాబు, లోకేష్ కు నోటీసులు..?
-
భూములపై ప్రజలను భయపెట్టే కుట్ర..అడ్డంగా బుక్కైన అబ్బా కొడుకులు
-
చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు
-
తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..
-
రాజధాని కేసుల్లో..బాబుకు జైలే..
సాక్షి, అమరావతి: చట్టాల్ని ఏమార్చి పదుల కేసుల్లో స్టేలు తెచ్చుకొని.. సచ్చిలుడని విర్రవీగిన చంద్రబాబు అవినీతి పుట్ట పగిలింది. మేకవన్నె పులికి మారుపేరైన ఆయన అసలు రూపం కోర్టుల సాక్షిగా సాక్షాత్కారమైంది. ఎంతో నేర్పుగా చేసిన స్కిల్ స్కామ్.. అమరావతి అసైన్డ్ భూ దోపిడీ.. ఇన్నర్ రింగ్ రోడ్డు కుంభకోణం.. ఇలా అవినీతి దందాలతో చంద్రబాబు అడ్డంగా దొరికిపోయాడు. అవినీతి చేశాను.. అయితే నాకు చట్టాలు వర్తించవనే జిత్తులమారి తెలివితేటలతో సెక్షన్ 17–ఏను అడ్డం పెట్టుకొని తప్పించుకుందామన్న పన్నాగం బెడిసికొట్టింది. చంద్రబాబుపై కేసుల్లో నేరం నిరూపితమైతే రాజధాని కుంభకోణం కేసుల్లో యావజ్జీవ ఖైదు తప్పదని న్యాయ నిపుణులు అంటున్నారు. ఒక్కో కేసులో భారీ అవినీతి స్కిల్ స్కామ్: జర్మనీకి చెందిన సీమెన్స్ కంపెనీ పేరిట ఆ కంపెనీకే తెలియకుండా ప్రాజెక్ట్ను సృష్టించి స్కిల్ స్కామ్కు పాల్పడ్డారు. ఈ కేసులోనే చంద్రబాబును సీఐడీ అరెస్ట్ చేయడంతోపాటు న్యాయస్థానం రిమాండ్ విధించగా.. రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో 52 రోజలపాటు ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అసైన్డ్ భూదోపిడీ:అమరావతిలో ఏకంగా రూ.5 వేల కోట్ల భూదోపిడీకి పాల్పడ్డారు. ఇన్నర్ రింగ్రోడ్డు స్కామ్: అలైన్మెంట్లో అక్రమాల ద్వారా క్విడ్ ప్రోకోతో రూ.2,500 కోట్ల మేర అవినీతి.. అందుకోసం కేబినెట్ ఆమోదం లేకుండానే జీవోలు జారీ. నోట్ ఫైళ్లపై స్వయంగా చంద్రబాబే సంతకాలు చేసి అక్రమాల కథ నడిపించారు. అనంతరం నోట్ ఫైళ్లను గల్లంతు చేశారు. సీఐడీ ఆ అవినీతిని వెలికి తీయడంతో అతని బాగోతం బట్టబయలైంది. ఈ కుంభకోణాలన్నిటికీ సూత్రధారి చంద్రబాబే అని కీలక సాక్షులు వాంగ్మూలం ఇచ్చారు. 164 సీఆర్పీసీ కింద న్యాయస్థానంలో వాంగ్మూలాలు నమోదు చేశారు. ఈ కుంభకోణాల్లో చంద్రబాబు ప్రధాన కుట్రదారు, ప్రధాన లబ్ధిదారుడిగా ఉన్నారని డాక్యుమెంటరీ ఆధారాలు, కీలక సాక్షుల వాంగ్మూలాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ కేసుల నుంచి చంద్రబాబు తప్పించుకోవడం ఇక అసాధ్యమని న్యాయ నిపుణుల అభిప్రాయం. కేబినెట్కు తెలియకుండా చీకటి జీవోలు చంద్రబాబు అవినీతి విశ్వరూపాన్ని ఛేదించడం అంత తేలిక కాదు. కొన్ని సార్లు తప్పించుకోవచ్చు.. అన్నిసార్లూ తప్పించుకోలేరు.. చివరకు పక్కా ఆధారాలతో దొంగ దొరికాడు. ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు సర్వం తానై కుంభకోణాలకు పాల్పడ్డారు. 2014 నుంచి 2019 వరకు బరితెగించి సాగించిన అన్ని కుంభకోణాల్లోనూ కర్త, కర్మ, క్రియ చంద్రబాబేనని సీఐడీ పూర్తి ఆధారాలతో నిగ్గు తేలి్చంది. కేబినెట్కు తెలియకుండా చీకటి జీవోలు జారీ చేసి ఏకపక్షంగా టెండర్లు కట్టబెట్టేశారు. ప్రభుత్వ నిధులు అస్మదీయులకు మళ్లించి.. షెల్ కంపెనీల ద్వారా అక్రమంగా ఆ డబ్బును విదేశాలకు తరలించారు. అవి హవాలా మార్గంలో తన బంగ్లాకే చేరేలా పక్కా వ్యూహం అమలుచేశారు. చంద్రబాబుకు 17ఏ వర్తించదు: సుప్రీంకోర్టు స్కిల్ స్కామ్లో సీఐడీ దర్యాప్తు చేసి చంద్రబాబును అరెస్ట్ చేశాక విజయవాడ ఏసీబీ న్యాయ స్థానంలో హాజరుపర్చింది. దాదాపు 10 గంటలు ఇరుపక్షాల వాదనల అనంతరం ఆయనకు న్యాయమూర్తిజ్యుడిíÙయల్ రిమాండ్ విధించారు. సీఐడీ అభియోగాలు, అందులో పేర్కొన్న సెక్షన్లతో న్యాయమూర్తి ఏకీభవిస్తూ ఈ నిర్ణయం ప్రకటించారు. చంద్రబాబు 52 రోజులపాటు రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అనంతరం అనారోగ్య కారణాలతో బెయిల్ మంజూరైంది. సెక్షన్ 17–ఏను వక్రీకరిస్తూ కేసుల నుంచి తప్పించుకునేందుకు చంద్రబాబు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. 17–ఏ వర్తించదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సర్వం తానై.. కుట్రదారు, లబ్ధిదారుగా సర్వం తానై చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని సీఐడీ ఆధారాలతో నిగ్గు తేల్చింది. సిŠక్ల్, అసైన్డ్ భూములు, ఐఆర్ఆర్ అలైన్మెంట్ కుంభకోణాల్లో చంద్రబాబును ఏ1గా చేరుస్తూ కేసు నమోదు చేయడంతోపాటు న్యాయస్థానాల్లో చార్జిïÙట్లు దాఖలు చేసింది. ఐపీసీ సెక్షన్లు 120(బి), 166, 167, 418, 420, 465, 468, 471, 477(ఎ), 409, 201, 109 రెడ్విత్ 34, 37తోపాటు అవినీతి నిరోధక చట్టం 13(2) రెడ్విత్ 13(1), (సి), (డి) కింద అభియోగాలు నమోదు చేసింది. ఇప్పటికే చంద్రబాబుకు 74 ఏళ్లు. నేరం నిరూపితమై శిక్షలు పడితే యావజ్జీవం తప్పదు. ఇన్నర్ రింగ్ రోడ్, అసైన్డ్ భూముల కేసుల్లో లోకేశ్ నిందితుడిగా ఉన్నారు. నారాయణతోపాటు టీడీపీ ప్రభుత్వంలో మంత్రులుగా పని చేసిన వారు ఈ కేసుల్లో ఉన్నారు. వారంతా శిక్ష అనుభవించాల్సిందేనని న్యాయ నిపుణులు అంటున్నారు. ముఖ్యమంత్రిగా ఉంటూ అవినీతికి పాల్పడిన కేసుల్లో హరియాణా మాజీ సీఎం ఓం ప్రకాశ్ చౌతాలాకు 16 ఏళ్ల తర్వాత జైలు శిక్ష పడింది. తాజాగా తమిళనాడులో మంత్రిగా చేసిన సెంథిల్ బాలాజీ, మద్యం కేసుల్లో ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు ఇప్పటికీ బెయిల్ రాకపోవడాన్ని ప్రస్తావిస్తున్నారు. వేర్వేరుగా శిక్షలు అనుభవించాల్సిందే అత్యంత కీలకమైన సెక్షన్ 409 కింద నేరం నిరూపితమైతే యావజ్జీవం విధిస్తారు. అవినీతి నిరోధక చట్టంలోని 13(2) రెడ్విత్ 13(1), (సి), (డి) కింద నేరం నిరూపితమైతే గరిష్టంగా పదేళ్ల వరకు జైలు శిక్ష.. ఒక్కో కేసులో గరిష్టంగా పదేళ్ల జైలు శిక్ష పడే అవకాశముంది. ఇతర సెక్షన్ల కేసుల్లో తీర్పులు వేర్వేరుగా వస్తాయి. నేరం నిరూపితమై శిక్ష పడితే చంద్రబాబు వేర్వేరుగా శిక్షలు అనుభవించాలి. -
సీఐడీ కేసుల్లో దోషులకు శిక్ష ఖాయం
సిట్ దర్యాప్తు చేస్తున్న కేసులకు సంబంధించిన పత్రాలన్నీ న్యాయస్థానాల్లో ఉన్నాయి. ఆ కేసుల్లో దోషులకు శిక్షలు పడటం ఖాయం. – సిట్కు నేతృత్వం వహిస్తున్న ఐజీ కొల్లి రఘురామరెడ్డి సాక్షి, అమరావతి: టీడీపీ ప్రభుత్వ హయాంలో అవినీతి, కుంభకోణాలపై సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నమోదు చేసిన కేసుల్లో దోషులకు శిక్ష ఖాయమని తేలడంతో ఎల్లో గ్యాంగ్ బెంబేలెత్తుతోంది. దాంతో సిట్పై దుష్ప్రచారం చేసేందుకు యత్నించి బోర్లా పడింది. చంద్రబాబు కేసుల పత్రాలను సిట్ కార్యాలయం ప్రాంగణంలో కాల్చివేస్తున్నారంటూ ఎల్లో చానళ్లు సోమవారం హడావుడి చేశాయి. ఈ ఎన్నికల తరువాత వచ్చేది టీడీపీ ప్రభుత్వమేనని భావించే సిట్ అధికారులు ఇలా పత్రాలను కాల్చివేస్తున్నారంటూ వక్రీకరించిన కథనాలతో ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు యత్నించాయి. కానీ తాము దర్యాప్తు చేస్తున్న అయిదు కేసుల్లో పూర్తి ఆధారాలతో న్యాయస్థానాల్లో చార్జ్షీట్లు దాఖలు చేశామని, అంతకు ముందే కీలక కేస్ డైరీలు, ఆధారాలుగా ఉన్నఒరిజినల్ పత్రాలను కూడా న్యాయస్థానాలకు సమర్పించామని సిట్ స్పష్టం చేసింది. ఆ సందర్భంగా తీసిన లక్షలాది ఫొటోస్టాట్ కాపీల్లో సరిగా రాని వాటిని చిత్తుగా పరిగణించి కాల్చివేశామని వెల్లడించడంతో ఎల్లో మీడియా నోళ్లు మూతపడ్డాయి. అసలు కేసులకు సంబంధించిన పత్రాలను రహస్యంగా కాల్చివేసే ఉద్దేశమే ఉంటే ఎక్కడో రహస్యంగా చేస్తారు. అది పెద్ద కష్టమేమీ కాదు. కానీ, సిట్ కార్యాలయ ప్రాంగణంలో.. అదీ పట్టపగలు అందరూ చూస్తుండగా ఎందుకు చేస్తారు? ఈ చిన్న లాజిక్ను మర్చిపోయిన ఎల్లో మీడియా బోల్తా పడింది. అదిగో తోక.. ఇదిగో పులి తాడేపల్లిలోని సిట్ కార్యాలయం ఉన్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాంగణం సమీపంలో కొన్ని చిత్తుకాగితాలను సిబ్బంది సోమవారం ఉదయం కాల్చివేశారు. అది చూసి టీడీపీ నేతలు, ఆ పారీ్టకి కొమ్ముకాసే ఎల్లో మీడియా చానళ్లు హడావుడి మొదలుపెట్టాయి. చంద్రబాబుపై నమోదు చేసిన కేసుల కీలక పత్రాలను సిట్ అధికారులు రహస్యంగా దహనం చేసేస్తున్నారని, వాటిలో హెరిటేజ్ ఫుడ్స్కు సంబంధించిన పత్రాలు ఉన్నాయంటూ ప్రచారం ప్రారంభించాయి. అనుమతి లేకుండా సిట్ అధికారులు తీసుకున్న హెరిటేజ్ ఫుడ్స్, నారా భువనేశ్వరిల ఆదాయ పన్ను రిటర్న్ కాపీలు వీటిలో ఉన్నాయని ఊదరగొట్టాయి. చంద్రబాబుపై అక్రమంగా కేసులు నమోదు చేశారని, లోకేశ్ను అక్రమంగా విచారించారని, అందుకే ఆ కేసుల కాపీలను దహనం చేసేస్తున్నారని కూడా చెప్పుకొచ్చాయి. అంతే కాదు.. ఈ ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే బండారం బయటపడుతుందనే ఆందోళనతోనే సిట్ అధికారులు ఇలా పత్రాలను రహస్యంగా దహనం చేసేస్తున్నారని కూడా ఇష్టానుసారం వక్రీకరణలతో కూడిన కథనాలను ప్రసారం చేశాయి. ఎన్నికల వేళ ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు పడరాని పాట్లు పడ్డాయి. దుష్ప్రచారాన్ని తిప్పికొట్టిన సిట్ టీడీపీ నేతలు, ఎల్లో మీడియా దుష్ప్రచారాన్ని సిట్ ఓ ప్రకటనలో సమర్థంగా తిప్పికొట్టింది. ‘సిట్ కార్యాలయం సమీపంలో దహనం చేసినవి చిత్తు ప్రతులే. మేము దర్యాప్తు చేస్తున్న 5 కేసుల్లో పూర్తి ఆధారాలతో ఇప్పటికే విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో చార్జిషిట్లు దాఖలు చేశాం. ఈ కేసుల కేస్ డైరీలు, ఇతర కీలక ఆధారాలను న్యాయస్థానానికి ఎప్పటికప్పుడు సమర్పించాం. ఆధారాల్లో వేటినీ ధ్వంసం చేయలేదు. ఆధారాలన్నీ భద్రంగా ఉన్నాయి. పూర్తి ఆధారాలతో నమోదు చేసిన ఈ కేసుల్లో దోషులకు శిక్షలు పడటం ఖాయం. ప్రతి కేసులో 40 మంది వరకు నిందితులు ఉన్నారు. ఒక్కో కేసులో ఒక్కో నిందితునికి సంబంధించి దాదాపు 10 వేల పేజీలను ఫొటోస్టాట్ కాపీలు తీయాల్సి వచ్చింది. లక్షలాది పేజీలు కాపీలు తీసే క్రమంలో మెషిన్లు వేడెక్కడం కాగితాలు వాటిలో ఇరుక్కుపోవడం, ఇంకు తగ్గిపోవడం వంటి కారణాలతో చాలా కాపీలు ఫేడ్ అవుట్ అయ్యాయి. వీటిని పక్కనపెట్టేసి కొత్తగా మళ్లీ కాపీలు తీయాల్సి వచ్చింది. ఫేడ్ అవుట్ అయిన వాటిని చిత్తుగా పరిగణించి కాల్చివేశాం. ఇది అన్ని దర్యాప్తు సంస్థల్లో, సాధారణ ఆఫీసుల్లో కూడా పాటించే ప్రక్రియే’ అని సిట్ అధికారులు పేర్కొన్నారు. నిబంధనల ప్రకారమే హెరిటేజ్ ఐటీ రిటర్న్లు తీసుకున్నాం హెరిటేజ్ ఫుడ్స్ కంపెనీ, చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యుల ఆదాయ పన్ను రిటర్న్ కాపీలను అక్రమంగా తీసుకున్నారని, అందుకే వాటిని దహనం చేశారన్న ఎల్లో మీడియా దుష్ప్రచారాన్ని కూడా సిట్ తిప్పికొట్టింది. తాము నిబంధనల ప్రకారమే హెరిటేజ్ ఫుడ్స్, ఇతర నిందితుల ఆదాయ పన్ను రిటర్న్ కాపీలను తీసుకున్నామని తెలిపింది. ఆదాయ పన్ను శాఖకు అధికారికంగా లిఖిత పూర్వకంగా కోరి వారి నుంచి ఆ కాపీలను తీసుకున్నామని చెప్పింది. హెరిటేజ్ ఫుడ్స్ కంపెనీ నుంచి కూడా అధికారికంగానే లేఖ రాసి మరీ చాలా పత్రాలను తీసుకున్నామంది. ఆ ఐటీ రిటర్న్లు, హెరిటేజ్ ఫుడ్స్ నుంచి తీసుకున్న పత్రాల ఆధారంగానే ఈ కేసులో లోకేశ్, ఇతర నిందితులను విచారించామని సిట్ తెలిపింది. ఆ దర్యాప్తు నివేదికను కూడా న్యాయస్థానానికి సమర్పించామని చెప్పింది. ఓ వర్గం మీడియా ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేయడాన్ని సిట్ తీవ్రంగా ఖండించింది. ఆ మీడియా చానళ్లు దుష్ప్రచారాన్ని మాని వాస్తవాలను తెలుసుకోవాలని హితవు చెప్పింది. ‘హెరిటేజ్’కు దీటైన జవాబు ఇచ్చిన సిట్ చంద్రబాబుపై నమోదైన కేసులకు సంబంధించిన తమ కంపెనీ పత్రాల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ హెరిటేజ్ ఫుడ్స్ రాసిన లేఖకు సీఐడీ దీటైన సమాధానం ఇచ్చింది. హెరిటేజ్ ఫుడ్స్కు సంబంధించిన పత్రాలపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని, అవన్నీ న్యాయస్థానానికి తాము ఎప్పుడో సమర్పించామని, అన్ని పత్రాలు భద్రంగా ఉన్నాయని స్పష్టం చేసింది. ఈమేరకు సిట్ అధికారులు హెరిటేజ్ ఫుడ్స్ కంపెనీ సెక్రటరీ ఉమాకాంత బారిక్కు సోమవారం ఓ లేఖ రాళారు. తాము హెరిటేజ్ ఫుడ్స్కు అధికారికంగా లేఖ ద్వారా కోరి 2022 సెప్టెంబర్ 12 నుంచి 2023 అక్టోబరు 4 వరకు ఏడుసార్లు పొందిన ఆ కంపెనీ పత్రాల వివరాలను వెల్లడించారు. ఆ ఒరిజినల్ పత్రాలను న్యాయస్థానానికి సమర్పించిన వివరాలను సీఎఫ్ఆర్ నంబర్లతో సహా తెలిపారు. ఓ వర్గం మీడియా ఉద్దేశపూర్వకంగా చేసిన దుష్ప్రచారాన్ని ఖండిస్తూ తాము జారీ చేసిన ప్రెస్ నోట్ను కూడా ఈ లేఖకు జతపరిచారు. ఆ వర్గం మీడియా రాజకీయ దురుద్దేశాలతో సిట్పై చేస్తున్న దుష్ప్రచారంపై ఎన్నికల కమిషన్కు చేసిన ఫిర్యాదు కాపీని కూడా హెరిటేజ్ ఫుడ్స్కు అందించారు. -
ఫైబర్ నెట్ స్కామ్ లో ఆస్తుల అటాచ్..సీఐడీకి అనుమతి
-
‘మార్గదర్శి’ షట్టర్ క్లోజ్!
సాక్షి, అమరావతి : అక్రమ పునాదులపై ఈనాడు రామోజీరావు నిర్మించుకున్న ఆర్థిక సామ్రాజ్యానికి చట్ట విరుద్ధంగా నిధులు అందించే కామథేనువు ‘మార్గదర్శి’ ఒట్టిపోయింది. చందాదారుల సొమ్మును నిబంధనలకు విరుద్ధంగా ఆయన తమ సొంత పెట్టుబడులుగా మళ్లించడంతో ‘మార్గదర్శి’ పాపాల పుట్ట బద్దలైంది. కేంద్ర చిట్ఫండ్ చట్టాన్ని కచ్చితంగా అమలుచేయాలని చిట్ రిజిస్ట్రార్ స్పష్టంచేయడంతో ఆ సంస్థలోని ఆర్థిక కార్యకలాపాలు దాదాపు 16 నెలలుగా స్తంభించిపోయాయి. దీంతో లక్షలాది మంది చందాదారుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. నిర్ణీత కాలంలో చందాదారులకు చిట్టీపాటల ప్రైజ్మనీ చెల్లించలేక మార్గదర్శి ముఖం చాటేస్తోంది. ష్యూరిటీలపై కొర్రీలు వేస్తూ కాలహరణం చేస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే.. ‘మార్గదర్శి’ ఇక ప్యాకప్ చెప్పడమే తరువాయి అన్నట్లుగా ఉంది పరిస్థితి. రూ.4,880 కోట్లకు పైగా బకాయిలు కేంద్ర చిట్ఫండ్స్ చట్టం–1982కు విరుద్ధంగా చందాదారుల సొమ్మును రామోజీరావు తమ సొంత వ్యాపార సంస్థలైన ఉషాకిరణ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, ఉషోదయ ఎంటర్ప్రైజెస్లతోపాటు మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులుగా మళ్లించారు. రాష్ట్ర స్టాంపులు–రిజిస్ట్రేషన్ల శాఖ తనిఖీల్లో ఈ వ్యవహారం బయటపడింది. నిబంధనల ప్రకారం కొత్త చిట్టీలు ప్రారంభించాలంటే జిల్లా చిట్ రిజిస్ట్రార్ అనుమతి తీసుకోవాలి. అలాగే, కేంద్ర చిట్ఫండ్ చట్టాన్ని అమలుచేస్తున్నట్లుగా ఆధారాలు చూపాలని చిట్ రిజిస్ట్రార్లు మార్గదర్శి చిట్ఫండ్స్ బ్రాంచి మేనేజర్లను ఆదేశించారు. అందుకు రామోజీరావు ససేమిరా అన్నారు. మరోవైపు.. మార్గదర్శి చిట్ఫండ్స్ ఆర్థిక అక్రమాలపై సీఐడీ విభాగం 2022, నవంబరులో కేసు నమోదు చేసింది. సొమ్మును రామోజీరావు అక్రమంగా మళ్లిస్తున్నారని తెలియడంతో కొత్త చందాదారులు చిట్టీ గ్రూపుల్లో సభ్యులుగా చేరడంలేదు. అప్పటి నుంచి మార్గదర్శి చిట్ఫండ్స్లో కొత్త చిట్టీలు నిలిచిపోయాయి. దశాబ్దాలుగా మనీ సర్క్యులేషన్ (గొలుసుకట్టు మోసాలు) తరహాలో వ్యాపారం నిర్వహిస్తున్న రామోజీరావు అక్రమాలకు అడ్డుకట్ట పడింది. ఆ సంస్థలో మనీ టర్నోవర్ నిలిచిపోయింది. దాంతో ఇప్పటికే కొనసాగుతున్న చిట్టీ గ్రూపుల చిట్టీపాటల మొత్తం (ప్రైజ్మనీ) చెల్లించడం రామోజీకి తలకు మించిన భారంగా మారింది. మార్గదర్శి చిట్ఫండ్స్ రాష్ట్రంలో దాదాపు 16 నెలలుగా తమ చందాదారులకు ప్రైజ్మనీ సక్రమంగా చెల్లించలేకపోతోంది. ► ఇక రాష్ట్రంలో 37 బ్రాంచీల ద్వారా మార్గదర్శి చిట్ఫండ్స్కు నెలనెలా రూ.260 కోట్ల టర్నోవర్ ఉంది. అందులో రూ.80 కోట్లు డివిడెండ్లుగా చెల్లించాల్సి ఉండగా.. రూ.180 కోట్లు వరకు చిట్టీ పాటల ప్రైజ్మనీగా చెల్లించాల్సి ఉంది. 2022 నవంబరు నుంచి ఆ ప్రైజ్మనీ మొత్తం సక్రమంగా చెల్లించకుండా బకాయిలు పేరుకుపోయాయి. ఆ ప్రకారం 16 నెలలకు రూ.2,880 కోట్ల వరకు బకాయిలు పేరుకుపోయాయని స్టాంపులు–రిజిస్ట్రేషన్లు, సీఐడీ అధికారులు గుర్తించినట్లు సమాచారం. ► అలాగే, మార్గదర్శి చిట్ఫండ్స్ రశీదు రూపంలో సేకరించిన అక్రమ డిపాజిట్లు కాలపరిమితి ముగుస్తున్నా చెల్లించలేకపోతోంది. 4 శాతం నుంచి 5 శాతం వడ్డీ చొప్పున ఆరునెలల నుంచి రెండేళ్ల కాలపరిమితితో అక్రమంగా ఆ డిపాజిట్లను సేకరించింది. కాల పరిమితి ముగిసిన ఆ రశీదు డిపాజిట్లను కూడా మార్గదర్శి చిట్ఫండ్స్ 16 నెలలుగా చెల్లించలేకపోతోంది. ఈ బకాయిలు కూడా కలిపితే మొత్తం మీద దాదాపు రూ.2వేల కోట్ల వరకు ఉంటుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. వెరసి మార్గదర్శి చిట్ఫండ్స్ దాదాపు రూ.4,880 కోట్ల వరకు చందాదారులకు చెల్లించాల్సి ఉంటుందని సీఐడీ అధికారులు అంచనా వేశారు. కొర్రీలతో చందాదారులకు ముప్పుతిప్పలు ఇదిలా ఉంటే.. చిట్టీ పాటల ప్రైజ్మనీ, కాలపరిమితి ముగిసిన డిపాజిట్ల సొమ్ము కోసం చందాదారులు మార్గదర్శి చిట్ఫండ్స్ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారు. కానీ, తమ గల్లాపెట్టే ఖాళీ కావడంతో మార్గదర్శి చిట్ఫండ్స్ కొర్రీలు వేస్తూ చందాదారులను మొండిచేయి చూపిస్తోంది. నిబంధనల ప్రకారం మూడు ష్యూరిటీలు చూపించినా.. వారు ప్రభుత్వ ఉద్యోగులు అయినా సరే ఏవేవో కొర్రీలు వేస్తూ తిరస్కరిస్తోంది. పైగా.. చందాదారులకు చెల్లించాల్సిన మొత్తాన్ని మళ్లీ రశీదు డిపాజిట్గానే తమ డిపాజిట్ చేయాలని సూచిస్తోంది. ప్రస్తుతం తాము ఆ మొత్తాన్ని చెల్లించలేమని చెబుతుండటం గమనార్హం. ఇలా అక్రమంగా రశీదు డిపాజిట్ల దందాను కొనసాగించాలని రామోజీరావు భావిస్తున్నారు. ఎందుకంటే ఆయన అక్రమ వ్యాపార సామ్రాజ్యానికి ఇంధనం ఆ అక్రమ డిపాజిట్లే కాబట్టి. కానీ, సీఐడీ అధికారులు నిశితంగా కేసు దర్యాప్తు చేస్తుండడంతో అక్రమ డిపాజిట్ల దందాకు చెక్ పడింది. చందాదారులకు సీఐడీ రక్షణ.. మరోవైపు.. ఈ వ్యవహారాన్ని ఇప్పటికే రిజర్వ్ బ్యాంక్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లకు కూడా సీఐడీ నివేదించింది. దాంతో రామోజీ ఆర్థిక అక్రమాల ఆట కట్టింది. మార్గదర్శి చిట్ఫండ్స్ చందాదారులు మోసపోకుండా, వారి చిట్టీల మొత్తం, డిపాజిట్లకు న్యాయస్థానాల ద్వారా రక్షణ కల్పించేందుకు సీఐడీ ఉద్యుక్తమైంది. తద్వారా అగ్రిగోల్డ్ తరహాలో రామోజీరావు మార్గదర్శి చిట్ఫండ్స్ చందాదారులను ముంచేయకుండా సీఐడీ కార్యాచరణను చేపట్టింది. -
అయినా రామోజీ మారలేదు... అక్రమ డిపాజిట్లు ఆగలేదు
సాక్షి, అమరావతి : ఈనాడు పత్రికాధిపతిగా శ్రీరంగ నీతులు వల్లించే చెరుకూరి రామోజీరావు.. ‘మార్గదర్శి’ అధినేతగా యథేచ్ఛగా ఆర్థిక దోపిడీకి పాల్పడుతుంటారు. చట్టాలను ఎడాపెడా ఉల్లంఘిస్తూ ఆయన సాగించే ఆర్థిక దోపిడీకి ఈనాడు పత్రికను రక్షా కవచంగానే వాడుకుంటున్నారన్నది నగ్న సత్యం. మరోవైపు చంద్రబాబుకు రాజగురువు కాబట్టి తాను చట్టాలకు అతీతమని భావిస్తూ ఉంటారు. పత్రికాధిపతి కాబట్టి ఆయన అక్రమాలను ఎవరూ ప్రశ్నించకూడదని వాదిస్తూ ఉంటారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం చేపట్టిన కఠిన కార్యాచరణతో ‘మార్గదర్శి ఫైనాన్సియర్స్’ను మూసివేసుకోవాల్సి వచ్చినా, అక్రమ డిపాజిట్ల దందాను మాత్రం విడిచిపెట్టలేదు. ‘మార్గదర్శి చిట్ఫండ్స్’ పేరిట డిపాజిట్లు యథేచ్చగా వసూలు చేస్తూ భారీగా ఆర్థిక అక్రమాలను కొనసాగించారు. కేంద్ర చిట్ఫండ్స్ చట్టం, రాష్ట్ర డిపాజిట్దారుల హక్కుల పరిరక్షణ చట్టాలను దర్జాగా ఉల్లంఘిస్తూ అక్రమ డిపాజిట్లు వసూలు చేసి ఆ నిధులను సొంత ప్రయోజనాల కోసం దారి మళ్లించారు. గత ఏడాది స్టాంపులు, రిజిస్ట్రేషన్లు శాఖ, సీఐడీ అధికారులు రాష్ట్రంలోని 38 మార్గదర్శి చిట్ఫండ్స్ కార్యాలయాల్లో చేసిన సోదాలతో ఈ ఆర్థిక దోపిడీ ఆధారాలతో సహా బట్టబయలైంది. దాంతో మార్గదర్శి చిట్ఫండ్స్ చైర్మన్ చెరుకూరి రామోజీరావు ఏ–1గా, ఆయన పెద్ద కోడలు, మార్గదర్శి చిట్ఫండ్స్ ఎండీ చెరుకూరి శైలజ ఏ–2గా, మార్గదర్శి చిట్ఫండ్స్ బ్రాంచి మేనేజర్లను ఏ–3గా సీఐడీ కేసు నమోదు చేసింది. వారిపై సెక్షన్లు 120 (బి), 409, 420, 477 (ఎ) రెడ్విత్ 34 సీఆర్సీపీ కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఇప్పటికే మార్గదర్శి చిట్ఫండ్స్ మేనేజర్లను సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. రామోజీరావు, శైలజ కిరణ్ను విచారించి కీలక సమాచారాన్ని రాబట్టారు. మార్గదర్శి చిట్ఫండ్స్ ముసుగులో రామోజీరావు సాగించిన ఆర్థిక దోపిడీ తీరు ఇదిగో ఇలా ఉంది... భారీగా అక్రమ డిపాజిట్ల సేకరణ కేంద్ర చిట్ఫండ్స్ చట్టం–1982, బ్యానింగ్ ఆఫ్ నాన్ రెగ్యులేటెడ్ డిపాజిట్ స్కీమ్స్( బీఎన్డీఎస్)–1999 చట్టాలను ఉల్లంఘిస్తూ మార్గదర్శి చిట్ఫండ్స్ ముసుగులో రామోజీరావు యథేచ్ఛగా అక్రమంగా డిపాజిట్లను సేకరించారు. ఆ రెండు చట్టాల ప్రకారం చిట్ఫండ్ కంపెనీలు వాటి ఖాతాదారులు, ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించకూడదు. కానీ ఈ చట్టాన్ని రామోజీరావు ఏమాత్రం పట్టించుకోకుండా యథేచ్ఛగా అక్రమ డిపాజిట్లు సేకరించారు. రశీదు రూపంలో డిపాజిట్లు సేకరించారు. యాజమాన్య కోటా టికెట్ల పేరుతో అక్రమాలకు పాల్పడ్డారు. చందాదారుల సొమ్మును నిబంధనలకు విరుద్ధంగా రామోజీ సొంత కంపెనీలు, మ్యూచువల్ ఫండ్స్లో అక్రమ పెట్టుబడులుగా పెట్టి భారీగా సొంత ఆస్తులు పెంచుకున్నారు. రశీదుల ముసుగులో అక్రమ డిపాజిట్లే రశీదులు, భవిష్యత్ చిట్టీలకు ష్యూరిటీల పేరుతో రామోజీరావు అక్రమ డిపాజిట్ల దందా కొనసాగిస్తున్నారు. మార్గదర్శి చిట్ఫండ్స్ సంస్థలో చిట్టీ పాడిన చందాదారులకు వారికి రావాల్సిన సొమ్ములో మొత్తం చెల్లించడంలేదు. అందులో కొంత సొమ్మును సంస్థ వద్ద డిపాజిట్గా ఉంచుకుంటోంది. ఆమేరకు ఓ రశీదు ఇస్తోంది. అలా రూ.50 వేల నుంచి రూ.10 లక్షల వరకు చందాదారుల నుంచి రశీదు రూపంలో డిపాజిట్లు సేకరిస్తోంది. ఆ డిపాజిట్లపై 4 శాతం, 5 శాతం వడ్డీ చెల్లిస్తామని చెబుతోంది. ఏదైనా ఆర్థిక సంస్థ ఖాతాదారుల నగదును దాని వద్ద అట్టిపెట్టుకుని దానిపై వడ్డీ చెల్లిస్తామని లిఖితపూర్వకంగా తెలిపితే దానిని డిపాజిట్గానే పరిగణిస్తారు. అలా డిపాజిట్లు సేకరించాలంటే ఆర్బీఐ నిబంధనలను అనుసరించాలి. ఆర్బీఐ నిబంధన ప్రకారం చిట్ఫండ్స్ సంస్థలు డిపాజిట్లు వసూలు చేయకూడదు. మార్గదర్శి చిట్ఫండ్స్ రశీదు ముసుగులో డిపాజిట్లు సేకరిస్తోంది. ఇక చందాదారుల నుంచి ష్యూరిటీ తీసుకోవడానికి కేంద్ర చిట్ఫండ్స్ చట్టం నిర్దేశించిన విధానాలకు విరుద్ధంగా మార్గదర్శి చిట్ఫండ్స్ వ్యవహరిస్తోంది. జాతీయ/షెడ్యూల్డ్ బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ల పత్రాలు, బంగారు ఆభరణాలు, లైఫ్ ఇన్సూ్యరెన్స్ పత్రాలు, స్థిరాస్తి పత్రాలు గానీ ముగ్గురు వ్యక్తుల హామీ గానీ ష్యూరిటీగా తీసుకోవాలని చట్టం నిర్దేశించింది. అంతే కానీ, చిట్టీ పాట కింద చెల్లించాల్సిన మొత్తంలోనే కొంత ష్యూరిటీగా అట్టిపెట్టుకోడానికి అవకాశం లేదు. కానీ రామోజీరావు తమ చందాదారుల చిట్టీ పాట మొత్తం నుంచి కొంత భాగాన్ని ష్యూరిటీ పేరుతో అట్టిపెట్టుకుంటున్నారు. ఆ పేరుతో అక్రమంగా డిపాజిట్లు వసూలు చేస్తున్నారు. యాజమాన్య టికెట్ల పేరుతో దందా యాజమాన్య కోటా పేరుతో చిట్టీ గ్రూపుల్లోని టికెట్ల ముసుగులో రామోజీరావు ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారు. చిట్ఫండ్ కంపెనీలు వేసే చిట్టీలలో నిర్ణీత చందాదారుల సంఖ్య (వీటిని టికెట్స్ అని వ్యవహరిస్తారు)లో కొన్ని ఖాళీగా ఉండిపోతాయి. అలా ఖాళీగా ఉండిపోయే టికెట్స్ను ఆ కంపెనీ తీసుకోవాలి. ఆ టికెట్స్పై చందాను కంపెనీయే చెల్లించాలి. తరువాత కొత్త చందాదారులు వస్తే వాటితో ఆ టికెట్స్ను భర్తీ చేయవచ్చు. చిట్ఫండ్ చట్టంలోని సెక్షన్లు 27, 32లలో స్పష్టంగా నిర్దేశించిన ఈ నిబంధనలను రామోజీరావు ఏనాడూ పట్టించుకోలేదు. మార్గదర్శి చిట్ఫండ్స్ ఏర్పాటు చేసినప్పుడు ప్రతి చిట్టీలోనూ కనీసం ఒకటి నుంచి 50శాతం టికెట్లను సొంతంగా కలిగి ఉంటామని పేర్కొంది. కానీ, తమ పేరుతో ఉన్న టికెట్లపై చందాను ఏనాడూ చెల్లించలేదు. కేవలం ఒక చిట్టీలోని తమ పేరుతో ఉన్న టికెట్లకు చెల్లించాల్సిన మొత్తాన్ని మరో చిట్టీలోని టికెట్లపై డిస్కౌంట్ మొత్తం నుంచి.., మళ్లీ ఆ చిట్టీలోని తమ టికెట్లను మరో చిట్టీలోని డిస్కౌంట్ మొత్తం నుంచి మళ్లించినట్టు రికార్డుల్లో కనికట్టు చేసింది. అంటే సంస్థ పేరిట ఉన్న టికెట్లపై మార్గదర్శి చిట్ఫండ్స్ చందా ఏనాడూ చెల్లించలేదు. కేవలం రికార్డుల్లో జంబ్లింగ్ అంటే బుక్ అడ్జస్ట్మెంట్స్ ద్వారా చూపించి చందాదారులను మోసం చేసింది. మళ్లీ తమ టికెట్లపై చందా పాట మొత్తాన్ని మాత్రం వసూలు చేసుకుంటోంది. ఆ విధంగా మార్గదర్శి చిట్ఫండ్స్ ఒక్క రూపాయి కూడా చందాగా పెట్టకుండానే భారీగా చందాదారుల సొమ్మును దాని ఖాతాల్లోకి మళ్లించుకుంటోంది. ఆ ఒక్క బ్యాంకు ఖాతా... రామోజీ దోపిడీకి కేంద్ర బిందువు బ్యాంకు ఖాతాల నిర్వహణలోనూ రామోజీరావు నిబంధనలను ఉల్లంఘిస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారు. చిట్ఫండ్ సంస్థలు ప్రతి చిట్టీకి ఓ ప్రత్యేక బ్యాంకు ఖాతా నిర్వహించాలి. ఆ చిట్టీకి సంబంధించిన చందాల వసూళ్లు, చెల్లింపులు దాని ద్వారానే జరగాలి. ఇలా ఏ ఏ బ్యాంకు ఖాతాల ద్వారా చిట్టీలు నిర్వహిస్తారో వెల్లడించాలి. ఈ నిబంధనలను మార్గదర్శి చిట్ఫండ్స్ ఉల్లంఘిస్తోంది. అన్ని చిట్టీల చందా మొత్తాలను ఒకే బ్యాంకు ఖాతాలో జమ చేస్తోంది. చిట్టీల ఒప్పందాల్లో కేవలం బ్యాంకు పేరునే పేర్కొంటోంది గానీ, బ్యాంకు ఖాతాల నంబర్లు, ఇతర వివరాలను ఉద్దేశపూర్వకంగానే విస్మరిస్తోంది. తద్వారా ఒక బ్యాంకు ఖాతాలో భారీ మొత్తాన్ని పోగేస్తోంది. రామోజీరావు ఇలా చేయడం వెనుక అతి పెద్ద ఆర్థిక కుతంత్రం దాగుంది. నిబంధనల ప్రకారం చిట్టీల బ్యాంకు ఖాతాలపై చిట్çœండ్ సంస్థ బ్రాంచి మేనేజర్ (ఫోర్మేన్)కు చెక్ పవర్ ఉండాలి. ఆ మేనేజరే చందాదారులకు చిట్టీ మొత్తాన్ని చెల్లించడంతోపాటు ఆన్లైన్ వ్యవహారాలు నిర్వహించాలి. కానీ మార్గదర్శి చిట్ఫండ్స్ సంస్థలో ఏ బ్రాంచి మేనేజర్కూ చెక్ పవర్ ఇవ్వలేదు. చెక్ పవర్ అంతా ప్రధాన కార్యాలయం వద్దే అట్టిపెట్టారు. రామోజీరావు, శైలజ కిరణ్తోపాటు ప్రధాన కార్యాలయంలో ఉన్న కొద్దిమందికే చెక్ పవర్ కల్పించారు. సొమ్ము చందాదారులది.. సోకు రామోజీది కేంద్ర చట్టం ప్రకారం చిట్ఫండ్ కంపెనీలు చందాదారుల సొమ్మును ఇతర కంపెనీల్లో పెట్టుబడిగా పెట్టకూడదు. కానీ రామోజీరావు మాత్రం చందాదారుల సొమ్మును సొంత ఆర్థిక ప్రయోజనాల కోసం అక్రమ పెట్టుబడులుగా మళ్లిస్తున్నారు. తమ కుటుంబ సభ్యులే డైరెక్టర్లుగా ఉన్న ఉషా కిరణ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, ఉషోదయ ఎంటర్ప్రైజస్, మార్గదర్శి చిట్స్ ప్రైవేట్ లిమిటెడ్–చెన్నై, మార్గదర్శి చిట్స్ (కర్ణాటక) ప్రైవేట్ లిమిటెడ్–బెంగళూరులో అక్రమ పెట్టుబడులుగా తరలించారు. ఆ కంపెనీల్లో ఏకంగా 88.5% వాటా పెట్టుబడిగా పెట్టడం గమనార్హం. దాంతోపాటు ముంబయిలోని పలు మ్యూచువల్ ఫండ్స్లో అక్రమ పెట్టుబడులు పెట్టారు. రామోజీరావు సొంతంగా ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టకుండా చందాదారుల సొమ్మును అక్రమంగా పెట్టుబడులుగా మళ్లిస్తూ భారీగా అక్రమ ఆదాయాన్ని పొందుతున్నారు. -
చంద్రబాబు లూటీ...కీలక ఆధారాలను సేకరించిన సీఐడీ
-
ఎల్లో మీడియా దుష్ప్రచారంపై సీఐడీ సీరియస్
సాక్షి, విజయవాడ: ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ఎల్లో మీడియా దుష్ప్రచారంపై సీఐడీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఛార్జ్షీట్ను ఏసీబీ కోర్టు తిరస్కరించిందన్న వార్తలను సీఐడీ ఖండించింది. ఛార్జ్షీట్కు దాఖలు చేయబడిన అనుబంధ పత్రాలను పరిశీలించడానికి కొంత సమయం పడుతుందని సీఐడీ అధికారులు పేర్కొన్నారు. ఎల్లో మీడియాపై న్యాయపరమైన చర్యలకు సీఐడీ సిద్ధమవుతుంది. కాగా, టీడీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు యథేచ్ఛగా సాగించిన కుంభకోణాలపై సీఐడీ దూకుడు పెంచింది. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో గురువారం చార్జ్షీట్ దాఖలు చేసింది. ఈ కేసులో ఏ–1గా చంద్రబాబు, ఏ–2గా పొంగూరి నారాయణలను పేర్కొంది. లింగమనేని కుటుంబంతో కలిసి సాగించిన ఈ క్విడ్ ప్రో కో కుంభకోణంలో హెరిటేజ్ ఫుడ్స్ డైరెక్టర్గా వ్యవహరించిన నారా లోకేశ్ను ఏ–14గా, లింగమనేని రమేశ్ తదితరులను కూడా నిందితులుగా పేర్కొంది. వారిపై ఐపీసీ 120(బి), 409, 420, 34, 35, 37.. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 13(2), రెడ్విత్ 13(1)(సి),(డి)ల ప్రకారం వారిపై కేసు నమోదు చేసినట్టు ఆ చార్జ్షీట్లో వెల్లడించింది. తద్వారా ఈ భారీ భూ కుంభకోణంపై న్యాయ విచారణ ప్రక్రియకు రంగం సిద్ధమైంది. కాగితాల మీదే ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్లో ఇష్టానుసారం మార్పులు చేసి, వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టిన చంద్రబాబు ముఠా అవినీతి బాగోతం విభ్రాంతి పరుస్తోంది. టీడీపీ ప్రభుత్వంలో సీఆర్డీఏ చైర్మన్గా అప్పటి సీఎం చంద్రబాబు, వైస్ చైర్మన్గా అప్పటి మంత్రి పొంగూరు నారాయణ బరితెగించి ఇలా అవినీతికి పాల్పడ్డారు. ఇందుకోసం లింగమనేని రమేశ్తో క్విడ్ ప్రో కో కు తెరలేపారు. ఈ తతంగంలో నారా లోకేష్ కూడా ప్రధాన పాత్ర పోషించారు. చంద్రబాబు బినామీ, సన్నిహితుడు లింగమనేని భూముల మార్కెట్ విలువ రూ.177.50 కోట్ల నుంచి రూ.877.50 కోట్లకు.. రాజధాని నిర్మాణం అనంతరం ఏకంగా రూ.2,130 కోట్లకు చేరేలా ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ను ఖరారు చేయడం భారీ దోపిడీకి నిదర్శనం. ఈ అవినీతి పాపంలో చంద్రబాబు దత్తపుత్రుడు పవన్ కల్యాణ్కు కూడా వాటా ఇవ్వడం గమనార్హం. ఇదీ చదవండి: 'దొరికారు దొంగలు' ఏ–1 చంద్రబాబు, ఏ–2 నారాయణ -
దొరికారు దొంగలు..ఇన్నర్ రింగ్ రోడ్ స్కాం కేసులో సీఐడీ ఛార్జ్ షీట్
-
HYD: పాస్పోర్టు కేసు దర్యాప్తు.. 15కి చేరిన అరెస్ట్ల సంఖ్య
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో సంచలనం సృష్టించిన పాస్పోర్టుల కుంభకోణం కేసులో తెలంగాణ సీఐడీ దర్యాప్తు వేగంగా సాగుతోంది. నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి అనర్హులకు పాస్ పోర్టులు జారీ చేసిన వ్యవహారంలో మరో ముగ్గురిని సీఐడీ అరెస్ట్ చేసింది. ఆదిలాబాద్ పాస్పోర్ట్ సేవా కేంద్రంలో పని చేసే ప్రణబ్, ఎస్బీ ఏఎస్ఐ లక్ష్మణ్తో పాటు మరొకరు అరెస్టయ్యారు. మరో పాస్పోర్టు ఏజెంట్ను ముంబైలో సీఐడీ అదుపులోకి తీసుకుంది. ఇప్పటి వరకు శ్రీలంక వాసులకు 95 పాస్పోర్టులు జారీ అయినట్లుగా సీఐడీ గుర్తించింది. 95 మంది వివరాలను పాస్పోర్ట్ అధికారులతో పాటు ఇమీగ్రేషన్ అధికారులకు సీఐడీ సమాచారం ఇచ్చింది. ఈ కేసులో ఇప్పటివరకు 15 మందిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో అరెస్టయిన ఐదు మందిని కస్టడీకి తరలించి సీఐడీ విచారణ చేపట్టింది. ఇంకా అరెస్ట్లు పెరిగే అవకాశం ఉంది. ఇదీ చదవండి: సాంబశివరావుపై చీటింగ్ కేసు నమోదు -
'స్కిల్' దొంగ బాబే
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్డీసీ) కుంభకోణంలో చంద్రబాబే అవినీతి తిమింగళం అని మరోసారి నిగ్గు తేలింది. యువతకు నైపుణ్య శిక్షణ పేరిట ఆయన గారు సాగించిన బాగోతం చూసి యావత్ దేశం అవాక్కయ్యింది. అసలు జర్మనీకి చెందిన సీమెన్స్ కంపెనీకి తెలియకుండానే ఆ కంపెనీ పేరుతో ప్రాజెక్ట్ను కాగితాలపై సృష్టించడం.. రూ.370 కోట్ల ప్రాజెక్ట్ వ్యయాన్ని ఏకంగా రూ.3,300 కోట్లకు పెంచడం.. సీమెన్స్ కంపెనీ పేరున జీవో జారీ చేసి, తన బినామీ కంపెనీ డిజైన్ టెక్ కంపెనీతో ఒప్పందం చేసుకోవడం.. ఉన్నతాధికారుల ఆదేశాలను బేఖాతరు చేస్తూ నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ నిధులు రూ.271 కోట్లు విడుదల చేయడం.. షెల్ కంపెనీల ద్వారా అక్రమ నిధులు తన నివాసానికే చేర్చడం.. పైగా అంతా పద్దతి ప్రకారం చేశామంటూ అడ్డగోలుగా వాదించడం.. మరోమారు చర్చకు వచ్చింది. సాక్షి, అమరావతి: స్కిల్ స్కామ్ వంటి ఎన్నో కుంభకోణాల ద్వారా కొల్లగొట్టిన అక్రమ నిధుల తరలింపు కోసం ఏర్పాటు చేసుకున్న అవినీతి నెట్వర్క్ గుట్టును సీఐడీ ఛేదించడం.. స్కిల్ స్కామ్లో ఏసీబీ కోర్టు బాబుకు రిమాండ్ విధించడం.. సాక్ష్యాధారాలన్నీ బలంగా ఉండటంతో ఏసీబీ కోర్టు తీర్పులో, విచారణలో జోక్యం చేసుకోమని సుప్రీంకోర్టు చెప్పడం చూస్తుంటే చంద్రబాబే అసలు దొంగ అని మరోసారి ఎలుగెత్తి చాటినట్లయింది. సీమెన్స్ కంపెనీకి తెలియకుండా ప్రాజెక్ట్ను రూపొందించిందీ ఆయనేనని, అక్రమంగా మళ్లించిన నిధులు చేరింది ఆయన నివాసానికే అన్నది సీఐడీ నిగ్గు తేల్చిన విషయం తెలిసిందే. దాంతో సీఐడీ ఆయనపై కేసు నమోదు చేసింది. కీలక ఆధారాలతో ఈ కేసులో చంద్రబాబును ఏ–1గా పేర్కొంటూ చార్జ్షీట్ నమోదు చేసింది. ఆయనపై ఐపీసీ సెక్షన్లు 120(బి), 166, 167, 418, 420, 465, 468, 471, 477(ఏ), 409, 201, 109 రెడ్విత్ 34, 37లతోపాటు అవినీతి నిరోధక చట్టం సెక్షన్లు 13(2) రెడ్విత్ 13(1) (సి), (డి) కింద అభియోగాలు నమోదు చేశారు. టీడీపీ ప్రభుత్వంలో కార్మీక శాఖ మంత్రిగా వ్యవహరించిన కింజరాపు అచ్చెన్నాయుడు ఏ–2గా, మరో 38 మందిని నిందితులుగా పేర్కొంటూ సిట్ కేసు నమోదు చేసింది. గత ఏడాది సెప్టెంబరు 9న చంద్రబాబును అరెస్ట్ చేసి విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో హాజరు పరిచింది. ఈ స్కామ్లో చంద్రబాబు పాత్రను నిర్ధారిస్తూ సీఐడీ అధికారులు సమర్పించిన నివేదికతో సంతృప్తి చెందిన న్యాయమూర్తి ఆయనకు జ్యుడిíÙయల్ రిమాండ్ విధించారు. దాంతో పోలీసులు ఆయన్ను రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించారు. ఖైదీ నంబర్ 7691గా ఆయన అక్కడ 52 రోజులు జ్యుడిíÙయల్ రిమాండ్లో ఉన్నారు. పలుమార్లు బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురైన తర్వాత అనారోగ్య కారణాలను చూపిస్తూ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్తో హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. విజనరీగా వేసుకున్న ముసుగు తొలగి చంద్రబాబు ఏ–1 అన్న నిజం ప్రపంచానికి తెలిసింది. స్కిల్ స్కామ్ ఎలా సాగిందంటే.. సీమెన్స్ పేరిట ఉత్తుత్తి ప్రాజెక్టు ► డిజైన్ టెక్ కంపెనీకి చెందిన సంజయ్ దంగాను పిలిపించుకుని యువతకు నైపుణ్యాల శిక్షణ పేరిట ఉత్తుత్తి ప్రాజెక్టును తెరపైకి తెచ్చారు. జర్మనీకి చెందిన సీమెన్స్ కంపెనీ ముసుగులో ఆ కంపెనీకి ఏమాత్రం తెలియకుండానే ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. భారత్లో ఆ కంపెనీ ఎండీగా ఉన్న సుమన్ బోస్, డిజైన్టెక్ ఎంపీ వికాస్ వినాయక్ కని్వల్కర్ సహకారంతో చంద్రబాబు అక్రమాలకు తెర తీశారు. ► విద్యా శాఖ ద్వారా సీమెన్స్ కంపెనీ పేరుతో 2014 ఆగస్టులో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ మేరకు జీవో జారీ చేశారు. కేబినెట్ ఆమోదం కూడా లేకుండానే ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్(ఏపీఎస్ఎస్డీసీ) ఏర్పాటు చేశారు. తద్వారా సీమెన్స్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నట్టు మభ్యపుచ్చారు. ► ఈ ప్రాజెక్ట్లో చంద్రబాబు బినామీలు, సన్నిహితులే అంతా తామై వ్యవహరించారు. ఏపీఎస్ఎస్డీసీకి అప్పట్లో డైరెక్టర్గా ఉన్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, చంద్రబాబు సన్నిహితుడు కే లక్ష్మీనారాయణ, ఎండీగా ఉన్న గంటా సుబ్బారావు కీలకంగా వ్యవహరించారు. గంటా సుబ్బారావును ఏకంగా ఏపీఎస్ఎస్డీసీ ఎండీ–సీఈవో పోస్టుతోపాటు ఉన్నత విద్యా శాఖ ఎక్స్ అఫీషియో కార్యదర్శి, డిపార్ట్మెంట్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ – ఇన్నోవేటివ్ కార్పొరేషన్ కార్యదర్శి, ముఖ్యమంత్రికి ఎక్స్ అఫీషియో కార్యదర్శిగా ఏకంగా నాలుగు పోస్టులు కట్టబెట్టారు. ► ఉన్నత విద్య శాఖ ముఖ్య కార్యదర్శికి ఎలాంటి పాత్ర లేకుండా గంటా సుబ్బారావుతో నేరుగా నిధులు మంజూరు ప్రక్రియ కొనసాగించడానికి కుతంత్రం పన్నారు. అనంతరం సీమెన్స్ కంపెనీ సీనియర్ డైరెక్టర్ జీవీఎస్భాస్కర్ సతీమణి, యూపీ క్యాడర్ ఐఏఎస్ అధికారి అపర్ణను ఏపీఎస్ఎస్డీసీ డిప్యూటీ సీఈవోగా నియమించారు. ఇది పరస్పర ప్రయోజనాల విరుద్ధ చట్టానికి వ్యతిరేకమైనా సరే చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదు. ► సాఫ్ట్వేర్, హార్డ్వేర్, ఇతర అంశాలకు సంబంధించిన ఇన్వాయిస్లు, ప్రాథమిక నివేదిక ప్రకారం ఈ ప్రాజెక్టు విలువ రూ.370 కోట్లు మాత్రమే. చంద్రబాబు దీన్ని అమాంతం రూ.3,300 కోట్లకు పెంచేసి ఆ మేరకు నివేదిక రూపొందించాలని ఆదేశించారు. ప్రభుత్వం పది శాతం నిధులు సమకూరిస్తే సీమెన్స్, డిజైన్టెక్ 90 శాతం పెట్టుబడి పెట్టేలా ఒప్పందం కుదుర్చుకున్నట్టు 2015 జూన్ 30న ఉత్తర్వులు జారీ చేశారు. షెల్ కంపెనీల ద్వారా డబ్బులు ► డిజైన్ టెక్కు చెల్లించిన రూ.371 కోట్లను షెల్ కంపెనీల ద్వారా బోగస్ ఇన్వాయిస్లు సమర్పించి వివిధ దశల్లో అక్రమంగా తరలించారు. ప్రతి దశలోనూ షెల్ కంపెనీల సృష్టికర్తలు, దళారుల కమీషన్లు పోనూ చంద్రబాబుకు రూ.241 కోట్లు చేర్చారు. టీడీపీ ప్రభుత్వం పుణేకు చెందిన డిజైన్ టెక్ కంపెనీకి రూ.371 కోట్లు చెల్లించింది. ► డిజైన్ టెక్ కంపెనీ నుంచి పుణెలోని పీవీఎస్పీ అనే షెల్ కంపెనీకి రూ.238.29 కోట్లు, ఢిల్లీలోని ఏసీఐ కంపెనీకి రూ.2.71 కోట్లు అంటే మొత్తం రూ.241 కోట్లు తరలించారు. ► మొత్తం రూ.140.53 కోట్లను ఆ కంపెనీల బ్యాంకు ఖాతాల నుంచి యోగేశ్ గుప్తా డ్రా చేసి మనోజ్ వాసుదేవ్ పార్థసానికి అందించారు. మనోజ్ పార్ధసాని ఆ నగదు మొత్తాన్ని చంద్రబాబు పీఎస్ పెండ్యాల శ్రీనివాస్కు హైదరాబాద్లో ముట్టజెప్పారు. అంటే ఆ రూ.140.53 కోట్లను చంద్రబాబు బంగ్లాకు చేర్చారు. ► మిగిలిన రూ.100.47 కోట్లను పీవీఎస్పీ కంపెనీ దుబాయి, సింగపూర్లోని కంపెనీలకు మళ్లించింది. ఆ నిధులను మళ్లీ హవాలా మార్గంలో హైదరాబాద్కు తరలించారు. అక్కడ మనోజ్ పార్థసాని ద్వారా చంద్రబాబు పీఎస్ పెండ్యాల శ్రీనివాస్కు అందించారు. అనంతరం చంద్రబాబు బంగ్లాకు చేర్చారు. ఏపీఎస్ఎస్డీసీకి చెందిన రూ.241 కోట్లు అవినీతి నెట్వర్క్ ద్వారా ఇలా గుట్టు చప్పుడు కాకుండా చంద్రబాబు బంగ్లాకు వచ్చి చేరాయి. అమెరికాకు శ్రీనివాస్.. దుబాయ్కి మనోజ్ ► అక్రమ నిధుల తరలింపు పాత్రధారులు చంద్రబాబు ఆదేశాలతో విదేశాలకు పరారయ్యారు. విచారణకు రావాలని నోటీసులు జారీ చేయగానే చంద్రబాబు పీఎస్ పెండ్యాల శ్రీనివాస్ అమెరికాకు, షాపూర్జీ–పల్లోంజీ కంపెనీ ప్రతినిధి మనోజ్ పార్థసాని దుబాయ్కు ఉడాయించారు. టీడీపీ హయాంలోనే 2017లోనే ఏపీఎస్ఎస్డీసీ కుంభకోణం గుట్టు రట్టైంది. ► కేంద్ర జీఎస్టీ అధికారులు పుణెలోని పలు షెల్ కంపెనీల్లో సోదాలు చేసి భారీగా నకిలీ ఇన్వాయిస్లను గుర్తించారు. వాటిలో ఏపీఎస్ఎస్డీసీకి సరఫరా చేసిన నకిలీ ఇన్వాయిస్లను గుర్తించడంతో ఏపీ ఏసీబీ అధికారులకు సమాచారమిచ్చారు. అయితే దీనిపై విచారణ చేయకుండా ఏసీబీని చంద్రబాబు అడ్డుకున్నారు. ఆ వెంటనే ఏపీఎస్ఎస్డీసీ ఆఫీసులో ఈ ప్రాజెక్ట్కు సంబంధించిన ఫైళ్లను మాయం చేశారు. ప్రాజెక్ట్ గురించి తెలియదన్న సీమెన్స్ ► సీఐడీ అధికారులు జర్మనీలోని సీమెన్స్ కంపెనీ ప్రధాన కార్యాలయాన్ని సంప్రదించగా అసలు తమకు ఆ ప్రాజెక్టు గురించే తెలియదని స్పష్టం చేసింది. ఆ వెంటనే సీమెన్స్ కంపెనీ భారత్లోని తమ ఎండీ సుమన్ బోస్ను పదవి నుంచి తొలగించింది. ఈ కేసులో కీలక సాక్షులైన ఐవైఆర్ కృష్ణారావు, పీవీ రమేశ్, సునీత తదితరులు చంద్రబాబు ఆదేశాలతోనే నిబంధనలకు విరుద్ధంగా నిధులను విడుదల చేసినట్లు వాంగ్మూలం ఇచ్చారు. స్కిల్ స్కామ్లో కీలక పాత్రధారిగా ఉన్న ఏసీఐ కంపెనీ ఎండీ చంద్రకాంత్ షా మొత్తం అవినీతి నెట్వర్క్ను వెల్లడిస్తూ వాంగ్మూలం ఇచ్చారు. ఏపీఎస్ఎస్డీసీ కుంభకోణానికి కర్త కర్మ క్రియ అంతా చంద్రబాబే అన్నది నిర్ధారణ అయింది. ► తాము ఇచ్చింది మూడో పార్టీ నివేదికే కాదని.. కేవలం ఏపీఎస్ఎస్డీసీ ఇచ్చిన పత్రాల పరిశీలన మాత్రమేనని సెంటర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ (సీఐటీడీ) స్పష్టం చేసింది. సీఐటీడీ నివేదిక ఇవ్వక మునుపే డిజైన్ టెక్కు టీడీపీ సర్కారు నిధులు విడుదల చేసేసింది. ► ఈ కుంభకోణంపై కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా దర్యాప్తు చేపట్టింది. షెల్ కంపెనీల లావాదేవీల విషయాన్ని గుర్తించింది. ఇప్పటికే రూ.70 కోట్లు హవాలా మార్గంలో తరలించినట్టు నిర్ధారించింది. డిజైన్ టెక్కు చెందిన రూ.31.20 కోట్ల విలువైన ఫిక్స్డ్ డిపాజిట్లను ఈడీ శుక్రవారం జప్తు చేసింది. మొత్తం 26 మందికి నోటీసులు జారీ చేసి పలువురిని ఇప్పటికే విచారించింది. పలువురిని అరెస్టు చేసింది. ఈ ప్రాజెక్టులో రూ.355 కోట్ల మేర ఖజానాకు గండి పడిందని కాగ్ కూడా నిగ్గు తేలి్చంది. ఈ వాస్తవాల కారణంగానే.. ఈ కేసు 2017లో నమోదైనందున చంద్రబాబుకు 17ఏ వర్తించదని సుప్రీంకోర్టు కూడా చెప్పడం గమనార్హం. న్యాయ నిపుణులు కూడా పాత కేసులకు పాత చట్టమే వర్తిస్తుందని తేల్చి చెబుతున్నారు. నో రూల్స్.. రూ.371 కోట్లు ఇచ్చేయండి ► సీమెన్స్ కంపెనీకి తెలియకుండా సుమన్ బోస్ నడిపిన ఉత్తర ప్రత్యుత్తరాల్లో (నేరుగా ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబుకు లేఖలు రాశారు) గ్రాంట్ ఇన్ ఎయిడ్ అనే పదం ఎక్కడా లేదు. ఆ స్థానంలో ‘గ్రాంట్ ఇన్ కైండ్’ అని పేర్కొన్నారు. ప్రాజెక్టు వ్యయంగా చెప్పుకున్న రూ.3,300 కోట్లలో 90 శాతం కాదు కదా కనీసం ఒక్క రూపాయి విలువైన ఆర్థిక సహకారంగానీ, వస్తు సహాయాన్ని గానీ అందించ లేదు. అయినా ఏపీఎస్ఎస్డీసీ తన వాటా కింద జీఎస్టీ కలిపి డిజైన్ టెక్ కంపెనీకి రూ.371 కోట్లు చెల్లించేశారు. ► అప్పటి ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీవీ రమేశ్, ప్రత్యేక కార్యదర్శిగా ఉన్న సునీత అభ్యంతరం తెలిపినా పట్టించుకోలేదు. ఈ విషయాన్ని పీవీ రమేశ్ తన నోట్ ఫైల్లో పొందుపరిచారు. అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు కూడా ఒప్పుకోలేదు. అయినప్పటికీ చంద్రబాబు.. గంటా సుబ్బారావు చెప్పినట్లుగా నిధులు విడుదల చేయాలని ఐవైఆర్ కృష్ణారావును ఆదేశించారు. ► దీంతో నోట్ ఫైళ్లలో సీఎం కాలమ్లో ‘ఏఐ’ (ఆఫ్టర్ ఇష్యూ..) అని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నోట్ చేశారు. అప్పటి సీఎం ఆదేశాల మేరకు నిబంధనలకు విరుద్ధంగా ఏపీఎస్ఎస్డీసీ ద్వారా డిజైన్ టెక్ కంపెనీకి రూ.371 కోట్లు మంజూరు చేశారు. ఇందుకు సంబంధించి మొత్తం 13 నోట్ ఫైళ్లలో అప్పటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు సంతకాలు చేశారు. అప్పటి మంత్రి అచ్చెన్నాయుడు 5 చోట్ల సంతకాలు చేశారు. -
పూచికత్తు సమర్పణ..లొంగిపోనున్న చంద్రబాబు
-
నేడు సీఐడీ ఆఫీస్ కి చంద్రబాబు
-
నేడు సీఐడీ విచారణకు టీడీపీ నేత కొలికపూడి శ్రీనివాసరావు
-
కొలికపూడి శ్రీనివాసరావు, యాంకర్ సాంబశివరావుకు సీఐడీ నోటీసులు
-
స్కిల్ కుంభకోణం కేసులో కీలక పరిణామం
సాక్షి, విజయవాడ: టీడీపీ ప్రభుత్వ హయాంలో పెద్దఎత్తున ప్రజాధనాన్ని కొల్లగొట్టిన ‘స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్’ కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏ13 నిందితుడు చంద్రకాంత్ షాని ఏసీబీ కోర్టు ముందు సీఐడీ అధికారులు హాజరుపర్చారు. అప్రూవర్గా మారుతున్నట్లు కోర్టు ఎదుట చంద్రకాంత్ షా తెలిపారు. తదుపరి విచారణను ఏసీబీ కోర్టు జనవరి5కి వాయిదా వేసింది. చంద్రకాంత్ షా స్టేట్మెంట్ని జనవరి 5న ఏసీబీ కోర్టు రికార్డు చేయనుంది. షెల్ కంపెనీలు, బోగస్ ఇన్వాయిస్ల ద్వారా చంద్రబాబు ముఠా అడ్డగోలుగా నిధులను అక్రమంగా తరలించారన్నది స్పష్టమైన సంగతి తెలిసిందే. ఈ బాగోతంలో కీలక పాత్రధారిగా ఉన్న ఏసీఐ కంపెనీ ఎండీ చంద్రకాంత్ షా అప్రూవర్గా మారారు. స్కిల్ స్కాం కేసులో నిందితుడు (ఏ–13)గా ఉన్న ఆయన తాను అప్రూవర్గా మారేందుకు అనుమతించాలని న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ స్కాంలో బోగస్ ఇన్వాయిస్ల ద్వారా నిధులను ఎలా కొల్లగొట్టిందీ వివరిస్తూ ఆయన గతంలోనే గుంటూరులోని న్యాయస్థానంలో 2022, జులై 23న 164 సీఆర్పీసీ కింద వాంగ్మూలం ఇచ్చారు. ఈ కేసులో తాను అప్రూవర్గా మారి స్కిల్ స్కాంలో సూత్రధారులు, పాత్రధారులు, తెరవెనుక కుట్రను వెల్లడించేందుకు ఆయన స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. అందుకోసం తాను అప్రూవర్గా మారేందుకు అనుమతించి తనను ఈ కేసులో సాక్షిగా పరిగణించాలని కోరుతూ విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో గత నెలలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో చంద్రకాంత్ షాను సీఐడీ గతంలో అరెస్టుచేయగా ఆయన బెయిల్పై విడుదలయ్యారు. చదవండి: స్కిల్ స్కాంలో చంద్రబాబు పాత్రకు ఆధారాలున్నాయి -
Dec 2nd: చంద్రబాబు కేసు అప్డేట్స్
TDP Chandrababu Cases Petitions And Political Updates.. 3:25 PM, Dec 2, 2023 మాట మీద నిలబడలేదు.. సారీ : పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టినప్పుడు మాటమీద నిలబడలేదు దాని వల్ల అవమానాలు ఎదుర్కొన్నాం వ్యవస్థాపక సభ్యుడిగా ఆ విషయంలో ప్రజలకు క్షమాపణ చెప్తున్నా తెలుగు ప్రజల ఐక్యతకు కట్టుబడి ఉన్నాను 2014 ఎన్నికల్లో రాష్ట్ర క్షేమం కోసమే పోటీ చేయలేదు నా దృష్టిలో పడాలని బ్యానర్లు కట్టిన వ్యక్తి 2014లో మంత్రి అయ్యారు అధికారంలో ఉన్నవాళ్లు ప్రజల బాగోగులను పట్టించుకోలేదు నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు జనసేన కోసం పని చేస్తా, జెండా ఎగురవేస్తా నా ప్రాణం పోతే భావితరాలు పార్టీని ముందుకు తీసుకెళ్లాలి : పవన్ కళ్యాణ్ 2:27 PM, Dec 2, 2023 ఓట్లతో తెలుగుదేశం రాజకీయాలు తెలంగాణ ఎన్నికలు ముగియగానే పాలిట్రిక్స్ మొదలుపెట్టిన తెలుగుదేశం ఇప్పటివరకు ఏపీలో నకిలీ ఓటర్లంటూ ప్రచారం ఇప్పుడు ఏకంగా తెలంగాణలో కౌంటర్లు ఏర్పాటు చేసిన తెలుగుదేశం మీకు ఏపీలో ఓటు కావాలా? మీ ఓటు చెక్ చేసుకోవాలా? నిజాంపేట విజ్ఞాన్ స్కూల్లో ఏకంగా కౌంటర్ ప్రారంభించిన తెలుగుదేశం దాంతో పాటు పలు కాలనీల్లో తెలుగుదేశం పార్టీ ఓటర్ కౌంటర్లు జిహెచ్ఎంసి పరిధిలోని నిజాంపేట్, కుత్బుల్లాపూర్ పరిధిలో ఓటు నమోదు కేంద్రాలు తమకు అనుకూలంగా ఉండే వారందరిని ఏపీలో ఓటర్లుగా చేర్పించే ప్రయత్నం తెలంగాణలో ఓటేసిన వారిని కూడా ఏపీలో ఓటర్లుగా చేర్పించే కుట్ర ప్రతీ నియోజకవర్గంలో కనీసం 5వేల మందిని కొత్తగా చేర్పించే ప్రయత్నం ఎన్నికల రోజు వీరందరిని తరలించి టిడిపికి ఓటేయించే కుట్ర 1:07 PM, Dec 2, 2023 దోచుకోవడానికే పొత్తు : తోపుదుర్తి అనంతపురం : రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఈనెల 4న రాప్తాడులో సామాజిక సాధికార బస్సు యాత్ర ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు వైసీపీ ప్రభుత్వం ఏం చేసిందో తెలియజేసేందుకు బస్సు యాత్ర దేశంలో ఏ సీఎం ఆచరణలో చేయలేని పనులను సీఎం జగన్ చేశారు సీఎం జగన్ రాష్ట్రంలో 80శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు పదవులు ఇచ్చారు టీడీపీ అన్ని వర్గాల ప్రజలను మోసం చేసింది అధికారం కోసమే టీడీపీ, జనసేన కలిసి వస్తున్నారు జగన్ ప్రజల ముందుకే ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు పారిశ్రామిక వేత్తలకు దోచి పెట్టే విధంగా చంద్రబాబు విధానాలు ఉన్నాయి చంద్రబాబుకు దేశ, విదేశీ మాఫియాతో సంబంధాలు ఉన్నాయి 1:07 PM, Dec 2, 2023 సమయం లేదు.. నేను వస్తే తప్ప పార్టీ బాగుపడదు జైలుకెళ్లిన తర్వాత చంద్రబాబుకు జ్ఞానోదయం రిపేర్ చేయలేనంత దారుణంగా పార్టీ దెబ్బతిందని అర్థం చేసుకున్న చంద్రబాబు కొడుకు మీద పెట్టుకున్న ఆశలన్నీ అడియాసలు కావడంతో చంద్రబాబులో ఆవేదన తాను జైలుకెళ్తే పార్టీని పట్టించుకున్న నాథుడే లేకుండా పోయాడని సీనియర్లపై ఇటీవల ఆగ్రహం తానే పార్టీని మళ్లీ పట్టాలెక్కిస్తానని చెబుతోన్న చంద్రబాబు వారం రోజుల్లో పార్టీ కార్యకలాపాలో నిమగ్నం కానున్న చంద్రబాబు ఈనెల 10 నుంచి జిల్లాల పర్యటనలకు వెళ్లేలా ప్రణాళికలు ఏపీ పంచాయతీరాజ్ ఛాంబర్, ఏపీ సర్పంచ్ ల సంఘం నిర్వహించే సమావేశాల్లో పాల్గొనున్న చంద్రబాబు ఈనెల 10న శ్రీకాకుళం, 11న కాకినాడ, 14న నరసరావుపేట, 15న కడప సమావేశాలకు చంద్రబాబు రాష్ట్రంలో ఓట్ల గురించి కేంద్ర ఎన్నికల కమిషనర్ను కలవాలని చంద్రబాబు నిర్ణయం పార్లమెంట్ సమావేశాలు జరిగే సమయంలోనే ఢిల్లీ వెళ్లేలని చంద్రబాబు యోచన తమకు సమయం కేటాయించాలని సీఈసీకి లేఖ రాయనున్న చంద్రబాబు ఈ నెల 6 నుంచి 8వ తేదీ లోపు సమయం ఇవ్వాలని లేఖ రాయనున్న చంద్రబాబు 12:42 PM, Dec 2, 2023 కాపులెవరూ హర్షించరు : ఆమంచి వైఎస్ఆర్ సీపీ అంటే దివంగత వైఎస్ఆర్ పాలనకు కొనసాగింపు జనసేన పార్టీ టీడీపీని అధికారంలోకి తేవాలని యత్నిస్తోంది పవన్ టీడీపీకి మద్దతివ్వడాన్ని కాపు సామాజికవర్గం హర్షించదు ప్రభుత్వాన్ని విధానపరంగా విమర్శిస్తే సరిచేసుకుంటాం టీడీపీకి మేలు చేసేందుకే పవన్ అసత్యాలు మాట్లాడుతున్నారు పవన్కు ప్రజలే బుద్ధి చెబుతారు : ఆమంచి కృష్ణమోహన్ 12:30 PM, Dec 2, 2023 దండుపాళ్యం బ్యాచ్ చంద్రబాబుదే : టీజేఆర్ దొంగలకు దోచిపెట్టిన దండుపాళ్యం ముఠా చంద్రబాబుదే: ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు రుణాలు మాఫీ చేస్తానని రైతులకు ద్రోహం చేసింది చంద్రబాబే వాస్తవాలు తెలుసుకోకుండా లోకేష్ అడ్డగోలుగా మాట్లాడుతున్నారు సీఎం జగన్ రైతులకు అన్ని విధాలు అండగా ఉంటున్నారు ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవలేని లోకేష్ అసత్యాలు మాట్లాడుతున్నారు 12:02 PM, Dec 2, 2023 చంద్రబాబు ఆధ్యాత్మిక యాత్రలు విజయవాడ: ఇంద్రకీలాద్రికి చంద్రబాబు, భువనేశ్వరి కనకదుర్గమ్మను దర్శించుకున్న చంద్రబాబు దంపతులు సాయంత్రం విశాఖకు వెళ్లనున్న చంద్రబాబు దంపతులు రేపు సింహాచలం అప్పన్నను దర్శించుకోనున్న చంద్రబాబు ఈనెల 5న శ్రీశైలం మల్లన్నను దర్శించుకోనున్న చంద్రబాబు అనంతరం కడప దర్గా, గుణదల మేరీమాత ఆలయాలకు చంద్రబాబు ఆధ్యాత్మిక యాత్రల అనంతరం భవిష్యత్ కార్యాచరణ : చంద్రబాబు ఈ నాలుగు రోజులు రాజకీయాలు మాట్లాడను : చంద్రబాబు 11:32 AM, Dec 2, 2023 పవన్కు పార్టీ కార్యకర్తలపైనే ఎందుకు కోపం? : YSRCP జనసేన పొత్తులకు.. పవన్ కల్యాణ్ మాటలకు అర్ధాలే వేరులే..!!! రాజకీయ ప్రయోజనాలే కానీ.. రాజకీయ సిద్దాంతాల్లేవా? ఏపీలో టీడీపీతో.. తెలంగాణలో బీజేపీతో..ఏ రోటికాడ ఆ పాట పవన్ ఎవరితో పొత్తు పెట్టుకున్నా.. పార్టీ కార్యకర్తలెవరూ విమర్శలు చేయకూడదట...!! పైగా తన ప్రయోజనాల కోసం కాకుండా ప్రజల ప్రయోజనాల కోసం నిర్ణయాలు తీసుకుంటాడట..!!! చెప్పేవాడు పవన్కళ్యాణ్ అయితే.. వినేవాడు..? టీడీపీ వెనుక జనసేన వెళ్లడం లేదట..!!! టీడీపీ కలిసి వెళ్తుందట..!!! రెండింటికీ తేడా ఏంటో.. పవన్ కల్యాణ్ చెబితే బాగుండేది. ఆయన్ను మోదీ..అమిత్ షా..చంద్రబాబు అర్ధం చేసుకున్నారట..!! కానీ.. జనసైనికులే అర్ధం చేసుకోలేదట..!! ఇంతకంటే జనసైనికులకు .. అవమానం ఉంటుందా..? జనసేన పుట్టినప్పటి నుంచి..జెండా పట్టింది, ఫ్లెక్సీ కట్టింది.. రోడ్డెక్కి డబ్బులు ఖర్చు పెట్టింది జనసైనికులు. జనసేన జెండా పట్టని.. మోదీ, అమిత్ షా, చంద్రబాబులు.. తనను అర్థం చేసుకున్నారని చెప్పడం.. జనసైనికులు అర్థం చేసుకోలేదని.. పవన్ చెప్పడంలో అంతర్యమేంటీ? తనను విమర్శించేవారిని.. కోవర్టులుగా పరిగణిస్తామనడం దేనికి సంకేతం? అసలు జనసేన పార్టీలో చంద్రబాబు కోవర్ట్ పవన్ కల్యాణ్ కాదా? రేపు ముఖ్యమంత్రి ఎవరు అనేది ప్రశ్నిస్తున్నారు.. నన్ను గెలిపించేలేని వారు.. ఆ ప్రశ్న అడగకూడదని పవన్ అనడం.. ఎమ్మెల్యేగా గెలిపించలేరు కాబట్టి.. ఎప్పటికీ సీఎం కాలేనని చెప్పడం చాతకానితనం కాదా? ఇప్పుడు పవన్ కల్యాణ్ గురించి ఆలోచించి.. నడవాల్సింది కాపులే... పవన్ వెంట నడిచే కాపులకు ఎప్పటికైనా వెన్నుపోటు తప్పదు 11:16 AM, Dec 2, 2023 వాట్ ఐ యామ్ సేయింగ్.. కాదని చెప్పలేరు.! అవునని చెప్పలేరు..! చంద్రబాబుకు ఇరకాటంగా మారిన ఓటుకు కోట్లు కేసు ప్రస్తుతం సుప్రీంకోర్టులో కేసు, విచారణ జనవరి రెండోవారానికి వాయిదా ఈ కేసులో చంద్రబాబు నాయుడిని నిందితుడిగా చేర్చాలని వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్ కేసు దర్యాప్తును CBIకి బదిలీ చేయాలని మరొక పిటిషన్ విచారణ జరిపిన జస్టిస్ MM సుందరేష్, జస్టిస్ అరవింద్ కుమార్ ధర్మాసనం ఓటుకు కోట్లు కేసు తెలంగాణ ఏసీబీ రిపోర్టులోనూ చంద్రబాబు పేరును 22 సార్లు ప్రస్తావన "మనోళ్లు బ్రీఫ్డ్ మీ" వాయిస్ చంద్రబాబుదే అని ఇదివరకే నిర్ధారించిన ఫోరెన్సిక్ ఇప్పటివరకు ఈ వాదనను ఖండించని చంద్రబాబు "నేను నిప్పు" అంటారు తప్ప "వాట్ ఐ యామ్ సేయింగ్" గురించి చెప్పని చంద్రబాబు "మా నాన్న తప్పు చేయలేదు, మా మీద రాజకీయ కక్ష" అని లోకేష్ అంటారు కానీ, ఓటుకు కోట్లు కేసును జాగ్రత్తగా ప్రస్తావించకుండా పక్కకు తప్పుకుంటోన్న లోకేష్ ఇప్పటివరకు ఒక్క బహిరంగసభలోనూ ఈ విషయంపై మాట్లాడని తండ్రీ కొడుకులు చంద్రబాబు, లోకేష్ బాలకృష్ణ చేసిన "అన్స్టాపబుల్ బాలయ్య" ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ వెన్నుపోటు గురించి చర్చించారు కానీ, ఓటుకు కోట్లును దాచిపెట్టిన బావ, బావమరుదులు అసలు నిజాలు దాచి పెట్టి "నేను నిప్పు" అంటే ఎలా? జనమంతా మిమ్మల్ని "మీరు తుప్పు" అని ప్రశ్నిస్తున్నప్పుడు మీ దగ్గర చెప్పుకోడానికి ఏమి లేదా? 08:54 AM, Dec 2, 2023 ఆ సలహా ఇచ్చింది ఎవర్రా? తెలుగుదేశంలో చర్చనీయాంశంగా మారిన లోకేష్ అంశం లోకేష్కు ఎవరు సలహాలు ఇస్తున్నరన్నదానిపై చర్చ 40% ఓటు బ్యాంకు ఉందని చెప్పుకుంటున్న మనం పక్కచూపులెందుకు చూడాలి? పవన్ కళ్యాణ్కు జై కొట్టమని లోకేష్కు సలహా ఇచ్చింది ఎవరు? తనకు తానే గొయ్యి తీసుకుంటున్న విషయం లోకేష్కు అర్థమవుతోందా? తన కెరియర్తో పాటు పార్టీని కూడా భూస్థాపితం చేయాలనుకుంటున్నాడా? ఇప్పుడు కాపుల కోసం పవన్కు జై కొడితే రేపు కోస్తా, సీమల్లో ఏం చెబుతాం? అసలు పవన్కళ్యాణ్కే క్రెడిబిలిటీ లేనప్పుడు లోకేష్కు ఏం లాభం? పైగా పవన్ను దూరం చేసే ప్లాన్ జరుగుతుందని బహిరంగ సభల్లో చెప్పుకునే దౌర్భాగ్యమెందుకు? 08:30 AM, Dec 2, 2023 కాపులకు అన్యాయం చేశారా.? అంతే సంగతులు ఏలూరు : పవన్ కల్యాణ్ కు హరిరామ జోగయ్య లేఖ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాపులకు సముచిత స్థానం కల్పించాలని విజ్ఞప్తి 60 అసెంబ్లీ స్థానాలు, 6 పార్లమెంట్ స్థానాలు కేటాయించాలి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 7 అసెంబ్లీ స్థానాలను కాపులకు కేటాయించాలి : హరిరామజోగయ్య కాపులకు అన్యాయం జరక్కుండా జనసేన చూసుకోవాలని సూచన 07:04 AM, Dec 2, 2023 నారా చంద్రబాబు నాయుడు.. కొన్ని అసలు సిసలు వాస్తవాలు మా బాబు చాలా మంచోడు, రాజకీయ కక్షతో కేసులు పెట్టారు : ఎల్లో మీడియా ►మరి చంద్రబాబు నిజంగా మంచోడేనా? చంద్రబాబుపై ఎలాంటి కేసులు లేవా? ►వేర్వేరు సందర్భాల్లో చంద్రబాబు గురించి బాగా తెలిసిన వాళ్లు ఇప్పటివరకు ఏమన్నారు? ►చంద్రబాబు కీలకమైన/వివాదస్పదమైన అంశాల గురించి ఏమన్నాడు? ఆ తర్వాత ఏం జరిగింది? తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు ►మొదటి నుంచి చంద్రబాబుది నేరప్రవృత్తే ►ధర్నాలప్పుడు ప్రభుత్వ బస్సులు తగలబెట్టాలని చంద్రబాబు చెప్పేవాడు టీడీపీ సీనియర్ నాయకులు, మాజీ వ్యవసాయశాఖ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు ►అమరావతిలో భూములు ఇవ్వడానికి ఇష్టపడని రైతుల పొలాలను చంద్రబాబు తగలబెట్టించారని అక్కడి స్థానిక అధికారులు నాకు చెప్పారు ఆనాటి స్పీకర్ కోడెల చౌదరి చంద్రబాబు కట్టిన తాత్కాలిక భవనాల్లో ఒకటైన అసెంబ్లీలో వర్షం వచ్చినప్పుడు నీళ్లు కారితే ... ►"ఇది విపక్షాలు చేయించిన పనే అని సీసీటీవీ ఫుటేజి ఉంది, రెండు రోజుల్లో ఆధారాలు బయటపెడతా" అని మీడియా ముందు ప్రకటనలు చేశారు. ఆ తరువాత మూడేళ్లు స్పీకర్గా ఉండికూడా చూపలేదు. ►నిజంగా కుట్రే అయితే.. ఎందుకు బయటపెట్టలేదు? ►అంటే చేయించింది చంద్రబాబు, తెలుగుదేశం నేతలా? కాపు ఉద్యమ సమయంలో తునిలో రత్నాచల్ రైలు తగలబడినప్పుడు చంద్రబాబు వెంటనే ప్రెస్మీట్ పెట్టారు ►"రైలు తగలబెట్టింది రాయలసీమ రౌడీలు, పులివెందుల రౌడీలు" అని చెప్పాడు, కానీ అరెస్ట్ చేసింది మాత్రం కోస్తా జిల్లాకు చెందిన కాపులను.? ►ముందు చంద్రబాబు ఎందుకు ప్రకటన చేశాడు? ఆ తర్వాత పోలీసులెందుకు అరెస్ట్లు చేశారు? ►అంటే రైలు తగలబెట్టే విషయం ముందే చంద్రబాబుకు తెలిసిందా? ఓట్ల కోసం మాట మడతేశారా? చిత్తూరు జంట హత్యల కేసులో మరీ విడ్డూరం ►నవంబర్ 17 , 2015న చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చిత్తూరు మేయర్ దంపతుల హత్య జరిగింది. వారిద్దరు తెలుగుదేశం పార్టీకి చెందినవారు. ►ఆ వెంటనే చంద్రబాబు ఆదేశాల మేరకు వెంటనే విజయవాడలో టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ ప్రెస్మీట్ పెట్టాడు. ఇది `బలిజల మీద రెడ్ల దాడి.. విపక్షనేతలే ఈ హత్య చేయించారు` అని ఆరోపణలు చేశారు. సీన్ కట్ చేస్తే .. ►మేయర్ దంపతుల హత్య ఆస్థి తగాదాల కోసం జరిగిందని, అది చేసింది మేయర్ మేనల్లుడు చింటూ అని చిత్తూరు జిల్లా ఎస్పీ స్వయంగా ప్రకటించారు. మొత్తమ్మీద అన్ని పరిశీలన చేసి చెప్పే విషయం ఏంటంటే.. ►ఏం జరిగినా.. దాన్ని స్వప్రయోజనాల కోసం, తన సామాజిక ప్రయోజనాల కోసం వాడుకునే అలవాటు చంద్రబాబుదే ►బట్టకాల్చి ఇతరుల ముఖాన వేసి మసి తుడుచుకోండి అనడం బాబుకు వెన్నతో పెట్టిన విద్యే ఇక చంద్రబాబుపై కేసుల గురించి వ్యాఖ్యలు చేసే వారు ఒకసారి ఆయన చరిత్ర చూడండి. ►15 సార్లు వేర్వేరు కేసుల్లో దర్యాప్తు జరగకుండా స్టే తెచ్చుకున్న చరిత్ర చంద్రబాబుది ►తన కోసం, తన వాళ్ల కోసం ఖజానాను దోచిన కేసులో అనూహ్యంగా అరెస్టయ్యారు ►ఇది అనూహ్యం అని ఎందుకు అంటారంటే.. ఏ పని చేసినా సాక్ష్యాలు లేకుండా చేస్తారన్నది చంద్రబాబుకు ఉన్న పేరు ►అందుకే మా బాబుకు ఎలా అరెస్ట్ చేస్తారంటూ ఎల్లో మీడియా ఎగిరెగిరి పడేది.! 06:56 AM, Dec 2, 2023 జనసేన పొత్తులకు అర్థాలు వేరులే ఏపీలో తెలుగుదేశంతో, తెలంగాణలో బీజేపీతో జనసేన పొత్తులపై పవన్ కళ్యాణ్ ప్రకటన ఏపీలో టీడీపీ, తెలంగాణ లో బీజేపీ జనసేన కలవటంపై YSRCP విమర్శలు చేస్తోంది నేను ప్రజల మంచి కోసమే నిర్ణయాలు తీసుకుంటాను దీని వెనుక వ్యూహాలు ఉంటాయి టీడీపీ వెనుక జన సేన వెళ్ళటం లేదు టీడీపీతో కలిసి జన సేన నడుస్తోంది ఎన్నికలకు 100 రోజుల సమయం ముందు అయోమయం వద్దు నన్ను సంపూర్ణంగా నమ్మండి అప్పుడు ఏ గొడవలు జరగవు నన్ను మోడీ , అమిత్ షా, చంద్రబాబు అర్థం చేసుకున్నారు కానీ నా దగ్గర ఉన్న కొందరు మాత్రం అర్థం చేసుకోలేదు ఇలా ఆలోచన చేసే వారు YSRCP లోకి వెళ్లి పోవచ్చు టీడీపీ జన సేన పొత్తు పై విమర్శలు చేసే వారిని YSRCP కోవర్ట్ లుగా పరిగణిస్తాం వీరిపై కఠిన చర్యలు తీసుకుంటాం కేంద్రం, బీజేపీ, మోడీ జనసేనకి అండగా ఉంటారు రేపు ముఖ్యమంత్రి పదవి ఎవరిది అని ప్రశ్నిస్తున్నారు.! నన్ను ఎమ్మెల్యేగానే గెలిపించలేదు నాకు ఓటు వేసిన వారు ఈ ప్రశ్న అడిగితే గౌరవంగా ఉంటుంది కానీ ఓటు వేయని వారు ఇప్పుడు నన్ను సీఎం చేస్తామంటున్నారు.! 06:48 AM, Dec 2, 2023 ఫైబర్గ్రిడ్ కేసు జనవరి 5కి వాయిదా ఫైబర్ నెట్ కేసులో సీఐడీ వేసిన పీటీ వారెంట్ పై ఏసీబీ కోర్టులో విచారణ తదుపరి విచారణ వచ్చే నెల 5కు వాయిదా వేసిన ఏసీబీ కోర్టు ‘ఫైబర్గ్రిడ్’ కుంభకోణం దర్యాప్తులో CID కీలక అంశాలు టెరాసాఫ్ట్ పేరుతో రూ.284 కోట్లు కొట్టేసిన లోకేశ్ సన్నిహితులు కేంద్ర ప్రభుత్వ నిధులతో ఏపీలో చేపట్టిన ఫైబర్నెట్ ప్రాజెక్టు రూ.333 కోట్ల విలువైన ఈ ప్రాజెక్టు మొదటి దశ పనులను నిబంధనలకు విరుద్ధంగా లోకేశ్ సన్నిహితుడైన వేమూరి హరికృష్ణకు చెందిన టెరాసాఫ్ట్కు అప్పగింత కనుమూరి కోటేశ్వరరావు సహకారాన్ని తీసుకున్న వేమూరి వేమూరికి చెందిన కాఫీ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, ఫ్యూచర్ స్పేస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీల్లో కనుమూరి కోటేశ్వరరావును భాగస్వామిగా చేరిక వేమూరి హరికృష్ణ, తుమ్మల గోపీచంద్, రామ్కుమార్ రామ్మూర్తిలతో కలిసి విజయవాడ కేంద్రంగా నెటాప్స్ ఫైబర్ సొల్యూషన్స్ LLP అనే మ్యాన్పవర్ సప్లై కంపెనీ పేరిట ఓ షెల్ కంపెనీ సృష్టి ఈ ప్రాజెక్టుతో సంబంధం ఉన్న టెరాసాఫ్ట్ కంపెనీ, ఇతర కంపెనీలకు రూ.284 కోట్లు విడుదల చేసిన చంద్రబాబు ప్రభుత్వం నెటాప్స్ పేరుతో డొల్ల కంపెనీ సృష్టించి నిధులు మళ్లించిన వేమూరి హరికృష్ణ నెటాప్స్ కంపెనీకి చెల్లించిన రూ.8.35 కోట్లను వేమూరి హరికృష్ణకు చెందిన ఫ్యూచర్ స్పేస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్కు మళ్లించారు. నెటాప్స్ కంపెనీ నుంచి రూ.1.49 కోట్లను వేమూరి హరికృష్ణ కుమార్తె వేమూరి అభిజ్ఞ ఖాతాకు మళ్లించారు. విదేశాల్లో ఉన్న ఆమె ఇక్కడ తమ కంపెనీలో పనిచేస్తున్నట్లు చూపించి జీతం కింద నెలకు రూ.1.35 లక్షలు చెల్లింపు వేమూరి హరికృష్ణ భార్య వేమూరి నీలిమ ఫ్లాట్ కొనుగోలు చేసేందుకు అడ్వాన్స్గా రూ.39.74 లక్షలు నెటాప్స్ కంపెనీ బదిలీ నెటాప్స్ కంపెనీ 2017 జూన్ నుంచి 2020 జూన్ మధ్య ఎలాంటి సేవలు, పరికరాల సరఫరా లేకుండానే వేమూరి హరికృష్ణకు రూ.95.90 లక్షలు బదిలీ నెటాప్స్ కంపెనీ 2017 జనవరి నుంచి 2019 మార్చి మధ్యలో సేవలు, పరికరాల సరఫరా లేకుండా స్ఫూర్తి ఇన్నోవేషన్స్కు రూ.76 లక్షలు బదిలీ టెరాసాఫ్ట్ లావాదేవీలను ఆడిటింగ్ చేసిన స్వతంత్ర సంస్థ ఐబీఐ గ్రూప్ ఇప్పటికే ఈ కేసులో నలుగురు సూత్రధారుల అరెస్టు -
ఐటెం నెంబర్ 64..సుప్రీంకోర్టు నిర్ణయంపై ఉత్కంఠ
-
Nov 26th: చంద్రబాబు కేసు అప్డేట్స్
TDP Chandrababu Cases Petitions And Political Updates.. 07:16PM, Nov 26, 2023 స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్ పై ఈ నెల 28న సుప్రీంకోర్టులో విచారణ జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ సతీష్ చంద్ర ధర్మాసనం ముందు విచారణ స్కిల్ కేసులో బాబుకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు ఏపీ హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాల్ చేసిన సీఐడీ బెయిల్ మంజూరులో హైకోర్టు పరిధి దాటిందని ఏపీ సీఐడీ పిటిషన్ మంగళవారం చంద్రబాబు పిటిషన్పై సుప్రీంలో విచారణ 07:15PM, Nov 26, 2023 తెలంగాణ రాజకీయాలు ఏపీపై ప్రభావం ఉండదు : అంబటి అక్కడ ఏ ప్రభుత్వం వచ్చినా మాతో సత్సంబంధాలే ఉంటాయి వారాహికి తెలంగాణలో లైసెన్స్ లేదనుకుంటా? బాబు చెబితేనే వారాహి.. ఆయన డైరెక్షన్ లోనే వెళ్తుంది 07:00PM, Nov 26, 2023 విశాఖలో రూ.50 వేల చెక్కు ఇచ్చి సీఎం జగన్ను దూషించాడు : మంత్రి అంబటి పవన్ గడ్డం పెరిగినా.. ఫ్లైట్ లేటైనా జగనే కారణమంటాడు ప్యాకేజీ తీసుకుని పవన్ మాట్లాడుతున్నాడు చంద్రబాబు కాంగ్రెస్ కి, పవన్ బీజేపీకి.. ఏంటయ్యా మీ నీచ రాజకీయాలు పవన్ కి ఈ రాష్ట్రంతో ఏం సంబంధం... నీకు ఊరు, ఇల్లు, ఓటు ఇక్కడ లేవు ఎక్కడ పోటీ చేస్తాడో కూడా పవన్ కు తెలియదు పవన్ పీకే కాదు... కేకే... కిరాయి కల్యాణ్ రాజశేఖర్ రెడ్డి గురించి మాట్లాడే అర్హత పిల్ల పవన్ కు ఉందా? ఆగిపోయిన హాస్యకథా చిత్రం రేపటి నుంచి మళ్లీ మొదలవుతుంది అసలు పుత్రుడు చేసే కామెడీ రేపటి నుంచి చూడొచ్చు 04:05PM, Nov 26, 2023 చంద్రబాబు, లోకేష్, పవన్కు వెల్లంపల్లి ఛాలెంజ్ ఆర్యవైశ్యులకు నేనేమి చేశానో చర్చకు సిద్ధంగా ఉన్నా టీడీపీ ఆఫీస్కు రమ్మన్నా వచ్చేందుకు నేను సిద్ధమే ఆర్యవైశ్య సంఘాల ముసుగులో నన్ను ఇబ్బంది పెట్టాలని కొన్ని రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి చంద్రబాబు ఎప్పుడూ ఆర్యవైశ్యులకు ప్రాధాన్యత ఇవ్వలేదు వైఎస్ జగన్ సీఎం అయ్యాక ఆర్యవైశ్యులకు అనేక రాజకీయ, నామినేటెడ్ పదవులిచ్చారు చంద్రబాబు, పవన్, బీజేపీ హిందూ ద్రోహులు టీడీపీ హయాంలో ఆలయాలు కూల్చివేస్తే బీజేపీ పట్టించుకోలేదు విజయవాడ పశ్చిమ టికెట్ వైశ్యులకు ఇచ్చే దమ్ము లోకేష్కు ఉందా? పోతిన మహేష్ సిగ్గులేకుండా చంద్రబాబుకి చెంచాగిరి చేస్తున్నాడు నియోజకవర్గానికి ఇన్ఛార్జిని పెట్టలేని దద్దమ్మలు నాకు చెప్తున్నారు 04:02PM, Nov 26, 2023 పవన్ కల్యాణ్పై అడపా శేషు ఫైర్ కాపులను చంద్రబాబుకు పవన్ తాకట్టు పెట్టారు కులాల మధ్య చిచ్చుపెట్టేలా పవన్ వ్యాఖ్యలు పవన్కు ఏపీకి వచ్చినప్పుడు వచ్చే పూనకం తెలంగాణలో ఎందుకు రావడం లేదు ఏపీలో బాబు, పవన్కు ప్రజలే బుద్ధి చెబుతారు 04:00PM, Nov 26, 2023 రేపు నారా లోకేష్ యువగళం పాదయాత్ర పునఃప్రారంభం పొదలాడ వద్ద రేపు(సోమవారం) ఉ.10.19కి పాదయాత్రను ప్రారంభించనున్న లోకేష్ ఉ.11.20 గంటలకు తాటిపాకలో నారా లోకేష్ బహిరంగ సభ 03:05 PM, Nov 26, 2023 మీ పొత్తుకో దండం! మా సీట్లకే సరి పెడతారా? జనసేనకు 30 సీట్లు ఇవ్వాలని టీడీపీ నేతల యోచన పొత్తులపై చంద్రబాబు నిర్ణయానికి టీడీపీ శ్రేణులు కట్టుబడి ఉంటాయి : బుద్ధ వెంకన్న లోకేష్ పాదయాత్రలో తెదేపా, జనసేన శ్రేణులు పాల్గొంటాయి: బుద్దా వెంకన్న పొత్తులపై సొంత పక్షంలోనే అనుమానాలు సందేహాలు ఉన్నాయా? జనసేన కి ఎన్ని సీట్లు ఇస్తారన్నదానిపై పార్టీలో అంతర్గతంగా అసమ్మతి తలెత్తుతోందా? లోకేష్ పాదయాత్రకి కచ్చితంగా రావాలని జనసేన కార్యకర్తలను తెలుగుదేశం ఎందుకు పట్టు బట్టుతోంది? రాయలసీమ కోస్తా ఉత్తరాంధ్ర మూడు ప్రాంతాల్లో ఒక్కోచోట పది చొప్పున జనసేనకు సీట్లు కేటాయిన్చడం ఖాయమేనా? 01:58 PM, Nov 26, 2023 ఫైబర్నెట్ కేసు.. చంద్రబాబు ముఠాకు ఎదురుదెబ్బ ఫైబర్నెట్ కేసులో నిందితుల ఆస్తుల అటాచ్మెంట్ ఏడు స్థిరాస్తుల అటాచ్మెంట్కు న్యాయస్థానం అనుమతి ఈ కేసులో నిందితులుగా ఉన్నచంద్రబాబు సన్నిహితుల ఆస్తుల అటాచ్మెంట్కు ఏసీబీ న్యాయస్థానం అనుమతి సీఐడీ దాఖలు చేసిన అటాచ్మెంట్ పిటిషన్ను ఆమోదిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు ఫైబర్నెట్ కేసులో చంద్రబాబు సహా పలువురిపై సీఐడీ కేసు నమోదు ఇందులో చంద్రబాబు ఏ–25, ఏ–1 వేమూరి హరికృష్ణకు చెందిన టెరాసాఫ్ట్ కంపెనీ, ఏ–13 టెరాసాఫ్ట్ కంపెనీ ఎండీ తుమ్మల గోపీచంద్ 12:34 PM, Nov 26, 2023 విలువలు లేని రాజకీయాలకిది నిదర్శనం.. ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్.. ప్రియాంక వాద్రా ర్యాలీల్లో టీడీపీ వాళ్లు జెండాలు పట్టుకుని పాల్గొనడానికి సిగ్గుండాలి. చంద్రబాబు గారి, పురంధేశ్వరి గారి విలువలు లేని రాజకీయాలకిది నిదర్శనం బీజేపీలో ఉంటూ టీడీపీ బాకా ఊదుతున్న పురందేశ్వరి గారు తమ బావ పార్టీ తెలంగాణలో కాంగ్రెస్తో జత కట్టడంపై ఏమంటారో మరి! ప్రియాంక వాద్రా ర్యాలీల్లో టీడీపీ వాళ్ళు జెండాలు పట్టుకుని పాల్గొనడానికి సిగ్గుండాలి. చంద్రబాబు గారి , పురంధేశ్వరి గారి విలువలు లేని రాజకీయాలకిది నిదర్శనం. బీజేపీలో ఉంటూ టీడీపీ బాకా ఊదుతున్న పురంధేశ్వరి గారు తమ బావ పార్టీ తెలంగాణలో కాంగ్రెస్ తో జత కట్టడంపై ఏమంటారో మరి! pic.twitter.com/ZbZHvJbj8D — Vijayasai Reddy V (@VSReddy_MP) November 26, 2023 11:34 AM, Nov 26, 2023 ఈ నెల 28న సుప్రీంకోర్టులో చంద్రబాబు బెయిల్ రద్దు కేసు.. ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై విచారణ విచారణ చేయనున్న జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ధర్మాసనం పిటీషన్లో కీలక అంశాలు: బెయిల్ మంజూరు విషయంలో సుప్రీంకోర్టు పదేపదే ఇచ్చిన ఆదేశాల పరిధిని హైకోర్టు అతిక్రమించింది: ఏపీ ప్రభుత్వం పిటిషనర్లు వాదించని, వారు కోరని అంశాల్లోకి కూడా హైకోర్టు వెళ్లేందుకు ప్రయత్నించింది హైకోర్టు తన అధికారపరిధిని అతిక్రమిస్తూ తీర్పులో వ్యాఖ్యానాలు చేసింది కేసు మెరిట్స్ గురించి, ఔచిత్యం గురించి, ఆధారాలదర్యాప్తులో లోపాలుగురించి బెయిల్ పిటిషన్ సమయంలోనే వ్యాఖ్యానించింది దర్యాప్తుపై ఇప్పటికే టీడీపీ పార్టీ నాయకులు, ప్రతినిధులు నిరంతరం రాళ్లు వేస్తూనే ఉన్నారు ఇలాంటి సమయంలో బెయిల్ సందర్భంగా కోర్టు చేసిన వ్యాఖ్యానాలను వారు సానుకూలంగా మలుచుకునే అవకాశం ఉంది సీడీఐ కోరిన సమాచారాన్ని ఇప్పటివరకూ టీడీపీ ఇవ్వనే లేదు కేసుల మూలాల గురించి హైకోర్టు తీర్పులో పేర్కొనడం ట్రయల్ కోర్టు అధికారాలను హరించడమే ఇది చాలా ఆందోళనకరమైన విషయం, బెయిల్ దశలోనే న్యాయ పరిధిని మీరడమే అవుతుంది బెయిల్ సందర్భంగా సీఐడీ అభ్యంతరాలపై తిరిగి పిటిషనర్ ఎలాంటి వాదనలు చేయలేదు దర్యాప్తు సమయంలో బెయిల్ పిటిషన్ సందర్భంగా హైకోర్టు తీరు అనూహ్యమైనది 10:51 AM, Nov 26, 2023 స్కిల్ స్కాంలో ఇప్పటివరకు ఏం జరిగింది? టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన స్కిల్ స్కాం నిరుద్యోగులకు శిక్షణ పేరిట తెరపైకి ఓ ఒప్పందం జర్మనీ కేంద్రంగా ఉన్న ప్రఖ్యాత టెక్నాలజీ కంపెనీ సీమెన్స్తో ఒప్పందం అంటూ ప్రచారం సీమెన్స్ 90% ఇస్తుందని, తాము కేవలం 10% మాత్రమే చెల్లించాలని అప్పటి టీడీపీ ప్రభుత్వం ప్రచారం ఆఘామేఘాల మీద 10% వాటా కింద రూ.371 కోట్లు మధ్యవర్తి కంపెనీలకు చెల్లింపు అధికారులు అంగీకరించకపోయినా బలవంతం చేసిన చంద్రబాబు, స్వయంగా 13 చోట్ల సంతకాలు, ఇదే విషయాన్ని ఫైళ్లలో రాసిన అధికారులు షెల్ కంపెనీల ద్వారా రూ 241 కోట్ల పక్కదారి విచారణలో అసలు తమకు ఒప్పందంతో సంబంధమే లేదని లిఖిత పూర్వకంగా తెలిపిన సీమెన్స్ పన్ను చెల్లించకపోవడంతో కుట్రను గమనించిన డైరెక్టరేట్ జనరల్ (GST ఇంటెలిజెన్స్) ఆధారాలు సేకరించి నాటి చంద్రబాబు ప్రభుత్వానికి కుంభకోణం జరిగిందని తెలిపిన GST విషయం బయటకు రావడంతో తేలు కుట్టిన దొంగలా చంద్రబాబు స్వయంగా దర్యాప్తు చేయడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసిన GST శాఖ నిధులన్నీ సూట్కేస్ కంపెనీల ద్వారా పక్కదారి పట్టాయని గుర్తించిన ఇన్కమ్టాక్స్ శాఖ కొల్లగొట్టిన సొమ్ములో రూ. 27 కోట్లు నేరుగా టీడీపీ బ్యాంకు ఖాతాకు చేరినట్టు బ్యాంకు స్టేట్మెంట్లను గుర్తించిన CID రికార్డులను ఏసీబీ కోర్టుకు సమర్పించిన సీఐడి ఈ కుంభకోణంపై జాతీయ దర్యాప్తు సంస్థ ఈడీ విచారణ చేపట్టి పలువురి అరెస్ట్ చంద్రబాబుపై 120(బి), 166, 167,418, 420, 465, 468, 201, 109, రెడ్ విత్ 34 and 37 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు సీఆర్పీసీ సెక్షన్ 50(1) కింద నోటీస్ ఇచ్చిన సీఐడీ 1988 ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్ చట్టం కింద సెప్టెంబర్ 9వ తేదీన నంద్యాలలో చంద్రబాబును అరెస్ట్ చేసిన సీఐడీ పోలీసులు సెప్టెంబర్ 10న రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలింపు ఐదు పర్యాయాలు జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు రిమాండ్ ఖైదీగా 7691 నెంబర్తో 52 రోజులపాటు చంద్రబాబు కంటికి శస్త్ర చికిత్స అభ్యర్థన మేరకు మానవతా దృక్ఫథంతో అక్టోబర్ 31వ తేదీన నాలుగు వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు నవంబర్ 20న రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు 9:38 AM, Nov 26, 2023 నవంబర్ 29 కోసం చంద్రబాబు ఎదురుచూపులు నవంబర్ 29తో కోర్టు ఆంక్షలు, నవంబర్ 30తో తెలంగాణ ఎన్నికలు సైకిల్ రిపేర్కు సమయం ఆసన్నమయిందన్న ఆలోచనలో చంద్రబాబు ఏం చేద్దాం? ఎలా చేద్దాం? పార్టీ శ్రేణులను ఎలా చైతన్యపరచాలి? ఇచ్ఛాపురం వరకు నడవమంటే లోకేష్ వినడాయే? రెగ్యులర్గా ఏపీలో ఉండి వారాహి యాత్ర చేయమంటే పవన్ వినడాయే? నియోజకవర్గాల్లో డబ్బులు ఖర్చు పెట్టమంటే సీనియర్లు పట్టించుకోరాయే? కనీసం సింగిల్గా తెలుగుదేశం పోటీ చేద్దామంటే గెలుస్తుందన్న నమ్మకం లేదాయే? పవన్ కళ్యాణ్ను నమ్ముకుని తెలుగుదేశం ముందుకెళ్లగలదా? ఇన్నాళ్లు తిరిగిన చక్రం ఇప్పుడు రాష్ట్రంలో అసలే తిరగడం లేదెందుకు? ఢిల్లీలో మన మాటకు ఈ స్థాయిలో విలువెందుకు తగ్గిపోయింది? కార్యకర్తలను ఏమని చెప్పి ఒప్పించాలి? జనసేనకు కేటాయించే సీట్లపై టీడీపీ క్యాడర్కు ఏమని చెప్పాలి? 8:01 AM, Nov 26, 2023 సంతకం సాక్షిగా.. మద్యంలో ముడుపులు! మద్యం కేసులో సుస్పష్టంగా బయటపడుతున్న ఆధారాలు నోట్ ఫైళ్లపై చంద్రబాబు, కొల్లు రవీంద్ర సంతకాలు అడ్డగోలుగా మద్యం దుకాణాలు, బార్ల ప్రివిలేజ్ ఫీజులు రద్దు ప్రభుత్వ ఖజానాకు రూ.1,299.64 కోట్లు నష్టం వాటిల్లేలా పావులు కదిపిన చంద్రబాబు ఆర్ధిక శాఖ అనుమతి, ఆమోదం లేకుండా తతంగం కేబినెట్ భేటీ ముగిశాక గుట్టుగా చీకటి జీవోలు జారీ టీడీపీ సర్కారు తీరును తప్పు బట్టిన ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ ఇన్నాళ్లూ మా బాబుకు ఏమీ తెలియదంటూ బుకాయించిన ఎల్లో గ్యాంగ్ మద్యం కుంభకోణానికి కర్త, కర్మ, క్రియ అంతా చంద్రబాబేనని నిరూపించే కీలక ఆధారాలు లభ్యం. నాడు ఆర్థిక శాఖ ఆమోదం లేకుండా, కేబినెట్కు తెలియకుండా అస్మదీయులకు చెందిన బెవరేజీలు, మద్యం దుకాణాలు, బార్లకు చంద్రబాబు అడ్డగోలుగా ప్రయోజనం కల్పించాడు.#TDPScams#TDPLiquorScam#CorruptBabuNaidu… pic.twitter.com/yWx66CgCwo — YSR Congress Party (@YSRCParty) November 25, 2023 7:54 AM, Nov 26, 2023 తెలంగాణాలో ఒకలా, ఆంధ్రాలో మరోలా రాజకీయం.. పేర్ని నాని ఫైర్ పవన్ శ్వాస బాబు కోసమే చంద్రబాబును అధికారంలో చూడాలన్నదే ఆయన కాంక్ష మీ హయాంలో ఒక్క ఫిషింగ్ హార్బర్ జెట్టీ అయినా కట్టారా? సీఎం జగన్ సంక్షేమ కార్యక్రమాలతో మత్స్యకారులకు ఎంతో మేలు చంద్రబాబు కార్యాలయాలకు వందల కోట్లు దుబారా వావి వరుసల్లేకుండా పవన్, చంద్రబాబుల రాజకీయం తెలంగాణాలో ఒకలా, ఆంధ్రాలో మరోలా రాజకీయం పవన్ కళ్యాణ్ విశాఖలో మత్స్యకారులకు చేసిన సాయం కంటే.. ఆయన వచ్చి వెళ్లిన చార్టెడ్ ఫ్లైట్ ఛార్జీలకే ఎక్కువ ఖర్చు అయ్యింది. బాధితులకు సహాయం చేసి వెళ్లకుండా... తక్షణమే సాయం చేసిన ప్రభుత్వంపైనా, సీఎం వైయస్ జగన్పై నోటికొచ్చినట్టు మాట్లాడడం సమంజసమా? - మాజీ మంత్రి పేర్ని నాని… pic.twitter.com/P8nAbbADAJ — YSR Congress Party (@YSRCParty) November 25, 2023 7:20 AM, Nov 26, 2023 టీడీపీ నిర్వాకం.. లండన్లో ఏపీ ప్రజల వ్యక్తిగత డేటా ఇళ్లలోకి చొరబడి వివరాలు సేకరిస్తున్న టీడీపీ కార్యకర్తలు టీడీపీ మేనిఫెస్టో వెబ్సైట్కి ఆ వివరాలు అనుసంధానం ఆ సమాచారం అంతా లండన్లోని సర్వర్లో నిక్షిప్తం ఇందుకోసం ప్రజల ఫోన్ నంబర్లు, వారి ఓటీపీ నంబర్ల కోసం ఒత్తిడి రాజకీయ అవసరాల కోసం ప్రజల భద్రతను పణంగా పెట్టిన చంద్రబాబు 7:15 AM, Nov 26, 2023 ఈనెల 28న సుప్రీంలో చంద్రబాబు బెయిల్ రద్దు కేసు స్కిల్ స్కాం కేసులో హైకోర్టు బెయిల్ మంజూరు హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంలో పిటిషన్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన ఏపీ ప్రభుత్వం 7:10 AM, Nov 26, 2023 నిన్న రాజంపేట.. నేడు నెల్లూరు.. పచ్చమూకల డేటా చౌర్యం నెల్లూరులో ప్రజల సున్నిత వ్యక్తిగత సమాచారం సేకరిస్తున్న టీడీపీ దొంగల ముఠా ఆధార్, ఓటర్ కార్డులు, మొబైల్ నెంబర్, ఓటీపీ వివరాల సేకరణ ఓటర్ల తనిఖీ పేరుతో బరితెగింపు ఇంటింటికీ టీడీపీ మాజీ మంత్రి నారాయణ అనుచరులు మహిళలు, యువతుల ఫొటోలను కూడా వదలని వైనం ప్రజలు నిలదీయడంతో పరారు ఒకరిని చితకబాది పోలీసులకు అప్పగించిన స్థానికులు ఓటర్ల పరిశీలన పేరుతో వివరాలు సేకరిస్తున్న @JaiTDP నేతలపై ప్రజలు తిరగబడుతున్నారు. మొన్న రాజంపేటలో అడ్డంగా దొరికిన పచ్చ బ్యాచ్.. ఇవాళ నెల్లూరులోని మూలపేటలో ఇంటింటికి తిరుగుతూ పట్టుబడ్డారు. సెల్ఫోన్లో ఓటీపీ వస్తుందని అడిగి.. తమ వ్యక్తిగత సమాచారాన్ని దొంగలిస్తున్నారంటూ స్థానికులు… pic.twitter.com/w9RXjFjlrY — YSR Congress Party (@YSRCParty) November 25, 2023 7:08 AM, Nov 26, 2023 రేపటి నుంచే లోకేష్ యువగళం పాదయాత్ర పునః ప్రారంభం యువగళం పాదయాత్ర ఆగిన చోటు నుంచే తిరిగి ప్రారంభం కోనసీమ జిల్లాలో నారా లోకేష్ పాదయాత్ర షెడ్యూల్ రిలీజ్ రేపు ఉ. 10.19 గంటలకు యువగళం పాదయాత్ర ప్రారంభం మొదటి రోజు తాటిపాకలో నారా లోకేష్ బహిరంగ సభ ఇచ్చాపురం వరకు చేయాలన్న చంద్రబాబు, విశాఖ తో సరిపెడతానన్న చిన్నబాబు 7:06 AM, Nov 26, 2023 ఈ నెల 27న ఢిల్లీకి చంద్రబాబు సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా కుమారుడి పెళ్లి రిసెప్షన్ కు హాజరుకానున్న చంద్రబాబు నేడు సిద్ధార్థ్ లూథ్రా కుమారుడి వివాహం ఈనెల 28 వరకు ఢిల్లీలోనే చంద్రబాబు బస -
Nov 25th: చంద్రబాబు కేసు అప్డేట్స్
TDP Chandrababu Cases Petitions And Political Updates.. 04:10PM, Nov 25, 2023 పురందేశ్వరికి విజయసాయిరెడ్డి ప్రశ్నల వర్షం విశాఖలో మత్స్యకారుల బోట్లు అగ్నికి అహుతైన ఘటన మీ దృష్టికి రాలేదా పురంధేశ్వరి గారూ? గతంలో అక్కడి నుంచి ఎంపీగా గెలిచారు. వాళ్లంతా మీకు ఓట్లు వేసిన వారే. వ్యక్తిగతంగానైనా, పార్టీ పరంగానైనా గంగపుత్రులను ఆదుకోవాలన్న ఆలోచన మీకు రాకపోవడం దురదృష్టం. బాధితులకు బోటు విలువలో 80 శాతం ఆర్థిక సాయం అందించి ఆదుకుంది రాష్ట్ర ప్రభుత్వం. విశాఖలో మత్స్యకారుల బోట్లు అగ్నికి అహుతైన ఘటన మీ దృష్టికి రాలేదా పురంధేశ్వరి గారూ? గతంలో అక్కడి నుంచి ఎంపీగా గెలిచారు. వాళ్లంతా మీకు ఓట్లు వేసిన వారే. వ్యక్తిగతంగానైనా, పార్టీ పరంగానైనా గంగపుత్రులను ఆదుకోవాలన్న ఆలోచన మీకు రాకపోవడం దురదృష్టం. బాధితులకు బోటు విలువలో 80 శాతం ఆర్థిక… — Vijayasai Reddy V (@VSReddy_MP) November 25, 2023 1:25 PM, Nov 25, 2023 మాది ప్రజల పార్టీ, పవన్ది ప్యాకేజీ పార్టీ అనకాపల్లి : పవన్ పై వైఎస్ఆర్ సీపీ రీజనల్ కో ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి ఫైర్ పవన్ లా మాది ప్యాకేజీ పార్టీ కాదు పేదల పక్షాన నిలిచే పార్టీ వైఎస్ఆర్ సీపీ షూటింగ్ లేనప్పుడు రాష్ట్రానికి వచ్చే పవన్ కు ప్రజల కోసం పోరాటం చేసే వైఎస్ఆర్ సీపీకి చాలా తేడా ఉంది రాష్ట్రంలో ఉంటేనే కదా పవన్ కు అభివృద్ధి గురించి తెలుస్తుంది బీసీలను పావులుగా వాడుకున్న టీడీపీకి పుస్తకాలు వేసే అర్హత లేదు బీసీల్లో ఎన్ని కులాలు ఉన్నాయో చంద్రబాబుకు తెలుసా బీసీలకు మేలు చేసేవారైతే మాలా ధైర్యంగా యాత్రలు చేయగలరా? పవన్ వ్యాఖ్యలు సినిమా డైలాగుల్లా ఉన్నాయి హైదరాబద్లో హెలికాప్టర్ మిస్సైతే ఏపీకి ఏం సంబంధం వైఎస్సార్సీపీతో జనసేనకు పోలికేంటి? మరో 15,20 ఏళ్లు జగనే సీఎం అధికారంలోకి వస్తానని పవన్ పగటి కలలు కంటున్నారు : వైవీ సుబ్బారెడ్డి 12:45 PM, Nov 25, 2023 ప్రభుత్వంపై పసలేని పవన్ విమర్శలు ఎప్పుడు వైజాగ్ కి వద్దామనుకున్నా ఈ ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తుంది : పవన్ కళ్యాణ్ అయ్యా పవన్ కళ్యాణ్.. మీరు లోకలా? నాన్ లోకలా? అసలు నెలకు ఎన్ని రోజులు ఆంధ్రప్రదేశ్లో ఉంటున్నారు? సినిమా షూటింగ్కు షూటింగ్కు మధ్య గ్యాప్లో ఏపీలో వాలి విమర్శలెందుకు చేస్తున్నారు? మీరు ఏ రాష్ట్రంలో రాజకీయాలు చేస్తున్నారు? ఏ ఎన్నికల్లో మీరు పోటీ చేస్తున్నారు? నెలలో రెండు రోజులు కనిపిస్తారు, మళ్లీ దరిదాపుల్లోకి రాకుండా వెళ్లిపోతారు? మీకేమైనా చిత్తశుద్ధి ఉంటే.. నిజాయతీగా ఏదైనా సమస్యపై పోరాడారా? వారాహి యాత్ర అంటారు.. రోజుల కొద్ది షెడ్డులో వ్యాన్ పెడతారు..! మీదొక పార్టీయేనా? లేక తెలుగుదేశం పార్టీకి బీ టీమా? మీకు, మీ పార్టీకి ఏమైనా సిద్ధాంతాలున్నాయా? మీరు విశాఖ రావడానికి ప్రభుత్వం అడ్డంకులు సృష్టించాల్సిన అవసరం ఏముంది? మీరు ఇలాగే ప్రవర్తిస్తే.. ప్రజలే మిమ్మల్ని తరిమే పరిస్థితి వస్తుందేమో.! : YSRCP (ఫైల్ ఫోటో : చంద్రబాబు అరెస్ట్ అవగానే రోడ్డు మీద పడుకుని నిరసన తెలుపుతున్న పవన్ కళ్యాణ్) 12:33 PM, Nov 25, 2023 నవంబర్ 29 కోసం చంద్రబాబు ఎదురుచూపులు నవంబర్ 29తో కోర్టు ఆంక్షలు, నవంబర్ 30తో తెలంగాణ ఎన్నికలు సైకిల్ రిపేర్కు సమయం ఆసన్నమయిందన్న ఆలోచనలో చంద్రబాబు ఏం చేద్దాం? ఎలా చేద్దాం? పార్టీ శ్రేణులను ఎలా చైతన్యపరచాలి? ఇచ్ఛాపురం వరకు నడవమంటే లోకేష్ వినడాయే? రెగ్యులర్గా ఏపీలో ఉండి వారాహి యాత్ర చేయమంటే పవన్ వినడాయే? నియోజకవర్గాల్లో డబ్బులు ఖర్చు పెట్టమంటే సీనియర్లు పట్టించుకోరాయే? కనీసం సింగిల్గా తెలుగుదేశం పోటీ చేద్దామంటే గెలుస్తుందన్న నమ్మకం లేదాయే? పవన్ కళ్యాణ్ను నమ్ముకుని తెలుగుదేశం ముందుకెళ్లగలదా? ఇన్నాళ్లు తిరిగిన చక్రం ఇప్పుడు రాష్ట్రంలో అసలే తిరగడం లేదెందుకు? ఢిల్లీలో మన మాటకు ఈ స్థాయిలో విలువెందుకు తగ్గిపోయింది? కార్యకర్తలను ఏమని చెప్పి ఒప్పించాలి? జనసేనకు కేటాయించే సీట్లపై టిడిపి క్యాడర్కు ఏమని చెప్పాలి? 12:17 PM, Nov 25, 2023 సంతకం సాక్షిగా.. మద్యంలో ముడుపులు! మద్యం కేసులో సుస్పష్టంగా బయటపడుతున్న ఆధారాలు నోట్ ఫైళ్లపై చంద్రబాబు, కొల్లు రవీంద్ర సంతకాలు అడ్డగోలుగా మద్యం దుకాణాలు, బార్ల ప్రివిలేజ్ ఫీజులు రద్దు ప్రభుత్వ ఖజానాకు రూ.1,299.64 కోట్లు నష్టం వాటిల్లేలా పావులు కదిపిన చంద్రబాబు ఆర్ధిక శాఖ అనుమతి, ఆమోదం లేకుండా తతంగం కేబినెట్ భేటీ ముగిశాక గుట్టుగా చీకటి జీవోలు జారీ టీడీపీ సర్కారు తీరును తప్పు బట్టిన ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ ఇన్నాళ్లూ మా బాబుకు ఏమీ తెలియదంటూ బుకాయించిన ఎల్లో గ్యాంగ్ 12:05 PM, Nov 25, 2023 ఇదీ పవన్ కల్యాణ్ అసలు రంగు : CPM విజయవాడ : పవన్ కళ్యాణ్ గురించి CPM నేత శ్రీనివాసరావు వ్యాఖ్యలు జనసైనికులను పవన్ మోసం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ డబుల్ ఇంజన్ సర్కారు కావాలంటున్నారు పవన్ కు బుల్డోజర్ పాలన కావాలా? ప్రశ్నిస్తానన్న పవన్ బీజేపీని ఏనాడైనా ప్రశ్నించారా? బీజేపీ ఇస్తున్నవి పాచిపోయిన లడ్డూలు అని విమర్శించలేదా? ఇప్పుడు మళ్లీ బీజేపీకి పవన్ వంత పాడుతున్నారు : శ్రీనివాసరావు 12:03 PM, Nov 25, 2023 విశాఖలోనే పవన్ కల్యాణ్ విశాఖలోనే ఉండిపోయిన పవన్ కళ్యాణ్ తెలంగాణ ఎన్నికల ప్రచారం కోసం సాయంత్రం తాండూరు వెళ్లనున్న పవన్ నిన్న బోటు ఘటన కోసం వచ్చిన పవన్ కళ్యాణ్ ఇవ్వాళ పార్టీ ఉత్తరాంధ్ర ముఖ్య నేతలతో పవన్ సమావేశం సమన్వయ కమిటీ సమావేశాల గురించి పార్టీ నేతలతో పవన్ చర్చలు ఉత్తరాంధ్రలో ఎన్ని చోట్ల పార్టీకి అవకాశాలున్నాయన్న దానిపై ఆరా తెలుగుదేశం ఎన్ని చోట్ల పోటీ చేయాలి? జనసేనకు అవకాశమెక్కడుంది? పవన్ గాజువాక నుంచి పోటీ చేయాలా? లేదా అన్నదానిపై నిర్ణయం గత ఎన్నికల్లో గాజువాక అని ఊరించి దెబ్బ తీశారన్న యోచనలో పవన్ ఉత్తరాంధ్రలో కచ్చితంగా గెలుస్తావని పవన్కు నాడు చెప్పిన పార్టీ నేతలు గత ఎన్నికలతో పోలిస్తే ఇప్పుడు పార్టీ పరిస్థితి ఎలా ఉందన్నదానిపై ఆరా 11:33 AM, Nov 25, 2023 విశాఖ మిలీనియం టవర్స్పై పచ్చ మీడియా విష ప్రచారం ఈనాడు ఏం రాసింది? ఐటీ సంస్థల కోసం చంద్రబాబు మిలీనియం టవర్స్ నిర్మిస్తే దాన్ని వేరే అవసరాలకు ప్రభుత్వం వాడుకుంటోందని, ఇది ఐటీ అభివృద్ధికి అడ్డంకి అని, క్యాండ్యూయెంట్కు నోటీసులంటూ, HSBC వెళ్ళిపోయింది అని వాపోయింది. ఇందులో నిజమెంత? వాస్తవాలు ఒక సారి పరిశీలిద్దాం విశాఖలో నిర్మించిన వాటిలో రెండు టవర్లు ఉన్నాయి. టవర్–A, టవర్–B పేరిట ఉన్న రెండింటినీ మిలీనియం టవర్స్ పేరుతో పిలుస్తున్నారు. దీన్లో ఒక్కదాన్ని కూడా చంద్రబాబు పూర్తి చేయలేకపోయారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రూ.60 కోట్లకుపైగా నిధులు ఖర్చు పెట్టి అసంపూర్తిగా ఉన్న టవర్–Aను పూర్తి చేయటమే కాక, కొత్తగా టవర్–Bని నిర్మించింది టవర్–B ఈ ఏడాదే పూర్తయింది. ప్రస్తుతం ఖాళీగా ఉంది. మరి దాన్ని ప్రభుత్వం తాత్కాలికంగా తన అవసరాల కోసం వాడుకుంటే తప్పా? ప్రభుత్వ విభాగానికైనా, ప్రభుత్వ విద్యా సంస్థలకైనా ప్రత్యేక భవనాలు నిర్మించే పరిస్థితి లేకుంటే అందుబాటులో ఉన్న భవనాలు వినియోగంలోకి తీసుకురావడం తప్పెలా అవుతుంది? చంద్రబాబు మాదిరి ప్రభుత్వ విభాగాలను ఫైవ్స్టార్ హోటళ్లలో లేదా బాబు అనుకూల బిల్డింగ్స్ లో పెట్టి పెట్టి భారీ అద్దెలు చెల్లించాలా? క్యాండ్యూయెంట్కు నోటీసులంటూ పచ్చి అబద్ధాలు.. ‘టవర్–ఏ’లో ఐటీ సంస్థ కాండ్యుయెంట్ తప్ప వేరే కంపెనీలేవీ కార్యకలాపాలు కొనసాగించడం లేదు . కాండ్యుయెంట్కు విస్తరణ కోసం అదనపు స్థలం అడిగినా ఇవ్వలేదని, పైపెచ్చు ఖాళీ చేయమంటూ నోటీసులు జారీ చేశారని ఈనాడు దుష్ప్రచారం చేస్తోంది. మరి క్యాండ్యూయెంట్ ఏం చెబుతోంది? ప్రభుత్వం మాకు ఎలాంటి నోటీసులూ ఇవ్వలేదు. కొన్ని పత్రికలు ప్రచారం చేస్తున్నట్టు మాకు హైదరాబాద్కు షిప్ట్ అయ్యే ఆలోచన లేనే లేదు. దీనిపై ఇప్పటికే పలు మార్లు ప్రకటనలిచ్చాం. అయినా ఈ విషప్రచారానికి మాత్రం తెరపడటం లేదు. HSBC వెళ్లిపోయిందెప్పుడో తెలియదా? చైనాకు చెందిన HSBC తన విధానపరమైన నిర్ణయంలో భాగంగా భారతదేశ కార్యకలాపాల నుంచి వైదొలుగుతున్నట్లు 2016లో ప్రకటించింది. అందులో భాగంగా విశాఖ, హైదరాబాద్, ఢిల్లీల్లోని తన కార్యకలాపాలను ఉపసంహరించుకుంది. అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్నది చంద్రబాబే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఐటీ కంపెనీలను ఆకర్షించడం కోసం ప్రభుత్వం ఐటీ ఇన్ఫ్రాను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తోంది. అదానీ గ్రూప్ డేటా సెంటర్తో పాటు భారీ ఐటీ టవర్ను నిర్మిస్తోంది. రహేజా గ్రూపు ఇనార్బిట్ మాల్ నిర్మాణంతో పాటు ఐటీ టవర్ను కడుతోంది. ఏపీఐసీసీ రూ.2,300 కోట్ల వ్యయంతో మధురవాడలో 19 ఎకరాల విస్తీర్ణంలో ‘i Space’ పేరిట ఐటీ టవర్ను నిర్మిస్తోంది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్లలో విశాఖకు చెప్పుకోదగ్గ పేరున్న ఒక్క కంపెనీ కూడా రాలేదు. కానీ సీఎం జగన్ ప్రభుత్వం బీచ్ డెస్టినీ పేరిట ఐటీ కంపెనీలను విశాఖకు రప్పించే ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఇన్ఫోసిస్ ఇప్పటికే డేటా సెంటర్ను ప్రారంభించగా, విప్రో డేటాసెంటర్ను ప్రారంభించడానికి వీలుగా విశాఖలో పనిచేయడానికి ఆసక్తి ఉన్న ఉద్యోగుల సమాచారాన్ని సేకరిస్తోంది. ఇక అమెజాన్, బీఈఎల్ , రాండ్స్టాడ్ వంటి సంస్థలు ఇప్పటికే కార్యకలాపాలు ప్రారంభించాయి. మరికొన్ని సంస్థలు రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నాయి. చంద్రబాబు హయాంలో రాష్ట్రంలో 24,,350 మంది ఐటీ ఉద్యోగులుండగా ఇపుడా సంఖ్య 53,850 దాటింది. 11:04 AM, Nov 25, 2023 చంద్రబాబు హయాంలో మద్యం అక్రమాలపై ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ మద్యం ప్రివిలేజి ఫీజు తొలగించి చంద్రబాబు, కొల్లు రవీంద్ర 1300 కోట్లు కొల్లగొట్టారు రూ.1500 కోట్ల ప్రభుత్వ ఆదాయానికి గండి పడింది కళ్లద్దాల వల్ల పురంధేశ్వరి గారికి ఇలాంటివి కనిపించవు పున్నమ్మా.. దాన్ని ఇప్పటి ప్రభుత్వానికి అంటగట్టేయత్నం చేయడం అన్యాయం అనిపించడం లేదా? మద్యం ప్రివిలేజి ఫీజు తొలగించి చంద్రబాబు గారు, కొల్లు రవీంద్ర 1300 కోట్లు కొల్లగొట్టారు. 1500 కోట్ల ప్రభుత్వ ఆదాయానికి గండి పడింది. పచ్చ కళ్లద్దాల వల్ల పురంధేశ్వరి గారికి ఇలాంటివి కనిపించవు. పున్నమ్మా! దాన్ని ఇప్పటి ప్రభుత్వానికి అంటగట్టేయత్నం చేయడం అన్యాయం అనిపించడం లేదా? — Vijayasai Reddy V (@VSReddy_MP) November 25, 2023 10:15 AM, Nov 25, 2023 విశాఖపై విష ప్రచారం విశాఖ : మిలినియం టవర్స్పై పచ్చమీడియా, టీడీపీ సోషల్ మీడియా తప్పుడు ప్రచారం కంపెనీలు వెళ్లిపోతున్నాయంటూ దుష్ప్రచారం మిలినియం టవర్స్లో ఉన్న కంపెనీలకు ఎలాంటి నోటీసులూ ఇవ్వని ప్రభుత్వం టవర్ - ఏలో కొనసాగుతున్న కాండియట్ బిజినెస్ సర్వీసెస్ ఇండియా కంపెనీ మాకు ఎలాంటి నోటీసులు రాలేదని, స్పష్టంచేసిన కాండియట్ బిజినెస్ సర్వీసెస్ మా ఉద్యోగులు చక్కగా పనిచేస్తున్నారని వెల్లడించిన కాండియట్ ప్రస్తుతం టవర్ -బిలో ఎలాంటి కంపెనీలూ లేవు ఈ మధ్యే ప్రభుత్వానికి అప్పగింత ఖాళీ ఉన్న కార్యాలయాలనే పరిపాలన కోసం వినియోగించాలని నిర్ణయం విశాఖలో పరిపాలన అనగానే తెగబడి తప్పుడు ప్రచారం చేస్తున్న ఎల్లో మీడియా 09:08 AM, Nov 25, 2023 'బావ’సారూప్యం అంటే ఇదేనేమో!.. ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ చంద్రబాబు.. బీజేపీలోకి పంపించిన కోవర్టులంతా ఆ పార్టీని గాలికొదిలి టీడీపీ భజన చేస్తున్నారు క్రిమినల్ కేసుల్లో అరెస్టయి కడప జైలులో టీడీపీ జిల్లా నాయకులను.. పురందేశ్వరి సలహా మేరకు రాష్ట్ర బీజేపీ నాయకులు పరామర్శించి.. సానుభూతి ఒలకబోయడం ఢిల్లీ పెద్దల దృష్టికి వెళ్లింది. 'బావ’సారూప్యం అంటే ఇదేనేమో! చంద్రబాబు గారు బిజెపిలోకి పంపించిన కోవర్టులంతా ఆ పార్టీని గాలికొదిలి టిడిపి భజన చేస్తున్నారు. క్రిమినల్ కేసుల్లో అరెస్టయి కడప జైలులో ఉన్న టిడిపి జిల్లా నాయకులను పురందేశ్వరి గారి సలహా మేరకు రాష్ట్ర బిజెపి నాయకులు పరామర్శించి సానుభూతి ఒలకబోయడం ఢిల్లీ పెద్దల దృష్టికి వెళ్లింది.… — Vijayasai Reddy V (@VSReddy_MP) November 25, 2023 07:53 AM, Nov 25, 2023 చంద్రబాబు, పవన్లు పొలిటికల్ టూరిస్ట్లు: మంత్రి గుడివాడ అమర్నాథ్ ఉత్తరాంధ్రపై ఎందుకంత అక్కసు? సీఎం ఎక్కడి నుంచైనా పాలించవచ్చు విశాఖకు కార్యాలయాలు తరలింపుపై విషం కక్కుతున్నారు ఈ ప్రాంతం ఏపీలో లేదా? విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ను ప్రజలు హర్షిస్తున్నారు వికేంద్రీకరణలో భాగంగా విశాఖ నుంచి పరిపాలన సాగాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని చంద్రబాబు, ఎల్లో మీడియా జీర్ణించుకోలేక పోతున్నాయి. చంద్రబాబు ఆయన బినామీల కోసం సృష్టించిన గ్రాఫిక్స్ మాయాజాలం అమరావతి. అక్కడ భూముల విలువ తగ్గిపోతుందన్నదే వారి బాధ. - మంత్రి గుడివాడ అమర్నాథ్… pic.twitter.com/EENcVHR2nZ — YSR Congress Party (@YSRCParty) November 24, 2023 07:45 AM, Nov 25, 2023 చంద్రబాబు ముఠాకు ఎదురుదెబ్బ ఫైబర్నెట్ కేసులో నిందితుల ఆస్తుల అటాచ్మెంట్ ఏడు స్థిరాస్తుల అటాచ్మెంట్కు న్యాయస్థానం అనుమతి ఈ కేసులో నిందితులుగా ఉన్నచంద్రబాబు సన్నిహితుల ఆస్తుల అటాచ్మెంట్కు ఏసీబీ న్యాయస్థానం అనుమతి సీఐడీ దాఖలు చేసిన అటాచ్మెంట్ పిటిషన్ను ఆమోదిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు ఫైబర్నెట్ కేసులో చంద్రబాబు సహా పలువురిపై సీఐడీ కేసు నమోదు ఇందులో చంద్రబాబు ఏ–25, ఏ–1 వేమూరి హరికృష్ణకు చెందిన టెరాసాఫ్ట్ కంపెనీ, ఏ–13 టెరాసాఫ్ట్ కంపెనీ ఎండీ తుమ్మల గోపీచంద్ 07:27 AM, Nov 25, 2023 నోట్ ఫైళ్లపై చంద్రబాబు, కొల్లు రవీంద్ర సంతకాలు వెలుగులోకి అడ్డగోలుగా మద్యం దుకాణాలు, బార్ల ప్రివిలేజ్ ఫీజులు రద్దు ప్రభుత్వ ఖజానాకు రూ.1,299.64 కోట్లు నష్టం ఆర్థిక శాఖ అనుమతి, ఆమోదం లేకుండా తతంగం కేబినెట్ భేటీ ముగిశాక గుట్టుగా చీకటి జీవోలు జారీ టీడీపీ సర్కారు తీరును తప్పుబట్టిన ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ ఇన్నాళ్లూ మా బాబుకు ఏమీ తెలియదంటూ బుకాయించిన ఎల్లో గ్యాంగ్ 07:21 AM, Nov 25, 2023 స్కిల్ స్కాంలో ఇప్పటివరకు ఏం జరిగింది? టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన స్కిల్ స్కాం నిరుద్యోగులకు శిక్షణ పేరిట తెరపైకి ఓ ఒప్పందం జర్మనీ కేంద్రంగా ఉన్న ప్రఖ్యాత టెక్నాలజీ కంపెనీ సీమెన్స్తో ఒప్పందం అంటూ ప్రచారం సీమెన్స్ 90% ఇస్తుందని, తాము కేవలం 10% మాత్రమే చెల్లించాలని అప్పటి టిడిపి ప్రభుత్వం ప్రచారం ఆఘామేఘాల మీద 10% వాటా కింద రూ.371 కోట్లు మధ్యవర్తి కంపెనీలకు చెల్లింపు అధికారులు అంగీకరించకపోయినా బలవంతం చేసిన చంద్రబాబు, స్వయంగా 13 చోట్ల సంతకాలు, ఇదే విషయాన్ని ఫైళ్లలో రాసిన అధికారులు షెల్ కంపెనీల ద్వారా రూ 241 కోట్ల పక్కదారి విచారణలో అసలు తమకు ఒప్పందంతో సంబంధమే లేదని లిఖిత పూర్వకంగా తెలిపిన సీమెన్స్ పన్ను చెల్లించకపోవడంతో కుట్రను గమనించిన డైరెక్టరేట్ జనరల్ (GST ఇంటెలిజెన్స్) ఆధారాలు సేకరించి నాటి చంద్రబాబు ప్రభుత్వానికి కుంభకోణం జరిగిందని తెలిపిన GST విషయం బయటకు రావడంతో తేలు కుట్టిన దొంగలా చంద్రబాబు స్వయంగా దర్యాప్తు చేయడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసిన GST శాఖ నిధులన్నీ సూట్కేస్ కంపెనీల ద్వారా పక్కదారి పట్టాయని గుర్తించిన ఇన్కమ్టాక్స్ శాఖ కొల్లగొట్టిన సొమ్ములో రూ. 27 కోట్లు నేరుగా టీడీపీ బ్యాంకు ఖాతాకు చేరినట్టు బ్యాంకు స్టేట్మెంట్లను గుర్తించిన CID రికార్డులను ఏసీబీ కోర్టుకు సమర్పించిన సీఐడి ఈ కుంభకోణంపై జాతీయ దర్యాప్తు సంస్థ ఈడీ విచారణ చేపట్టి పలువురి అరెస్ట్ చంద్రబాబుపై 120(బి), 166, 167,418, 420, 465, 468, 201, 109, రెడ్ విత్ 34 and 37 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు సీఆర్పీసీ సెక్షన్ 50(1) కింద నోటీస్ ఇచ్చిన సీఐడీ 1988 ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్ చట్టం కింద సెప్టెంబర్ 9వ తేదీన నంద్యాలలో చంద్రబాబును అరెస్ట్ చేసిన సీఐడీ పోలీసులు సెప్టెంబర్ 10న రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలింపు ఐదు పర్యాయాలు జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు రిమాండ్ ఖైదీగా 7691 నెంబర్తో 52 రోజులపాటు చంద్రబాబు కంటికి శస్త్ర చికిత్స అభ్యర్థన మేరకు మానవతా దృక్ఫథంతో అక్టోబర్ 31వ తేదీన నాలుగు వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు నవంబర్ 20న రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు 07:12 AM, Nov 25, 2023 పొత్తుల్లో నాది అంతులేని కథ : పవన్ కళ్యాణ్ రాజకీయ పొత్తులపై ముసుగు తీసిన పవన్ కళ్యాణ్ ఏ పార్టీతోనైనా కలుస్తాను చాలా మంది నాది ఏ ఇజం, ఒక్కోసారి ఒక్కోలా ఉంటాను అంటారు.., కమ్యూనిస్ట్ తో కలుస్తాడు, బీజేపీ వాళ్ళతో ఉంటారు అంటారు.. నాది హ్యుమనిజం : పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తెలంగాణలో బీజేపీతో పొత్తు, ఏపీలో టీడీపీతో పొత్తు గతంలో బీఎస్పీతో పొత్తు, అంతకు ముందు కమ్యూనిస్టులతో పొత్తు పొత్తుల్లో కొత్త రికార్డు దిశగా పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన -
Nov 24th: చంద్రబాబు కేసు అప్డేట్స్
TDP Chandrababu Cases Petitions And Political Updates.. 3:56 PM, Nov 24, 2023 పొత్తుల్లో నాది అంతులేని కథ : పవన్ కళ్యాణ్ రాజకీయ పొత్తులపై ముసుగు తీసిన పవన్ కళ్యాణ్ ఏ పార్టీతోనైనా కలుస్తాను చాలా మంది నాది ఏ ఇజం, ఒక్కోసారి ఒక్కోలా ఉంటాను అంటారు.., కమ్యూనిస్ట్ తో కలుస్తాడు, బీజేపీ వాళ్ళతో ఉంటారు అంటారు.. నాది హ్యుమనిజం : పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తెలంగాణలో బీజేపీతో పొత్తు, ఏపీలో టీడీపీతో పొత్తు గతంలో బీఎస్పీతో పొత్తు, అంతకు ముందు కమ్యూనిస్టులతో పొత్తు పొత్తుల్లో కొత్త రికార్డు దిశగా పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన చాలా మంది నాది ఏ ఇజం, ఒక్కోసారి ఒక్కోలా ఉంటాను అంటారు, కమ్యూనిస్ట్ తో కలుస్తాడు, బీజేపీ వాళ్ళతో ఉంటారు అంటారు..నాది హ్యుమనిజం. నాకు తెలంగాణ నేల సనాతన ధర్మం నేర్పింది. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని కీర్తించిన దాశరథి కృష్ణమాచార్య గారు ఒకవైపు ఎర్ర జెండా పట్టి మరోవైపు వేదాలను… pic.twitter.com/UXzhqhkfD1— JanaSena Party (@JanaSenaParty) November 23, 2023 3:25 PM, Nov 24, 2023 విమానం ఆగిపోయినా.. ప్రభుత్వంపై ఏడుపా? పవన్ కళ్యాణ్ విశాఖ పర్యటనపై జనసేన రాజకీయం బేగంపేట నుంచి విశాఖకు రావాల్సిన ప్రత్యేక విమానంలో సాంకేతిక లోపం లోపం ఉందని తెలియడంతో ప్రత్యేక విమానాన్ని రద్దు చేసిన ఎయిర్పోర్టు అధికారులు విశాఖలో పవన్ పర్యటనను ప్రభుత్వం అడ్డుకుంది : జనసేన కేవీఎస్ఎన్ రాజు ఎయిర్ పోర్టు అధికారులు రద్దు చేసేలా కొందరు సమాచారం ఇచ్చారు : రాజు జనసేన ఆరోపణలు హస్యాస్పదం : YSRCP ఒక విమానాన్ని అనుమతించాలా? లేదా? అన్నది ఎయిర్పోర్ట్ అధికారుల నిర్ణయం అయినా పవన్ కళ్యాణ్ విశాఖకు వస్తే ఎవరికి అభ్యంతరం? ప్రభుత్వంపై బురద జల్లి పవన్ కళ్యాణ్ గ్రాఫ్ పెంచుకోవాలన్న మీ కక్కుర్తికి ఇదే నిదర్శనం 2:55 PM, Nov 24, 2023 విశాఖపై విష ప్రచారం విశాఖ : మిలినియం టవర్స్పై పచ్చమీడియా, టీడీపీ సోషల్ మీడియా తప్పుడు ప్రచారం కంపెనీలు వెళ్లిపోతున్నాయంటూ దుష్ప్రచారం మిలినియం టవర్స్లో ఉన్న కంపెనీలకు ఎలాంటి నోటీసులూ ఇవ్వని ప్రభుత్వం టవర్ - ఏలో కొనసాగుతున్న కాండియట్ బిజినెస్ సర్వీసెస్ ఇండియా కంపెనీ మాకు ఎలాంటి నోటీసులు రాలేదని, స్పష్టంచేసిన కాండియట్ బిజినెస్ సర్వీసెస్ మా ఉద్యోగులు చక్కగా పనిచేస్తున్నారని వెల్లడించిన కాండియట్ ప్రస్తుతం టవర్ -బిలో ఎలాంటి కంపెనీలూ లేవు ఈ మధ్యే ప్రభుత్వానికి అప్పగింత ఖాళీ ఉన్న కార్యాలయాలనే పరిపాలన కోసం వినియోగించాలని నిర్ణయం విశాఖలో పరిపాలన అనగానే తెగబడి తప్పుడు ప్రచారం చేస్తున్న ఎల్లో మీడియా 2:35 PM, Nov 24, 2023 విశాఖను ఆశీర్వదించాలే తప్ప.. విష ప్రచారం వద్దు : సీదిరి శ్రీకాకుళం జిల్లాలో మంత్రి సీదిరి అప్పలరాజు విశాఖ రాజధాని ఉత్తరాంధ్ర వాసుల చిరకాల కల. గతం లో ప్రజల ఆకాంక్ష తీరక సాయుధ పోరాటం చేసిన చరిత్ర వుంది. సీఎం జగన్ ప్రజల ఆకాంక్ష తీర్చారు. విశాఖ రాజధానిలో పరిపాలన శాఖల కార్యాలయాల కోసం భవనాలు సమకూర్చితే పచ్చ మీడియా సిగ్గులేకుండా కబ్జా అని రాస్తోంది చంద్రబాబు, లోకేష్, రామోజీ రావు, పవన్ కళ్యాణ్ హైదరాబాద్లో ఉండి ఏపీలో ప్రజల్ని నిర్దేశిస్తారా.? ఉత్తరాంధ్ర తెలుగుదేశం నాయకులు బానిస బ్రతుకులు బ్రతకడం అవసరమా.? ఏపీలో ఆధార్ కార్డ్ లేని వాళ్లు మనకు రాజధాని వద్దు అంటుంటే టీడీపీ లో ఉండటానికి సిగ్గు లేదా.? ఇక్కడ వలసలు నివారించాలి అంటే గొప్ప రాజకీయ నిర్ణయం జరగాలి. ఇతర ప్రాంతాలతో సరి తూగాలంటే విశాఖ రాజధాని అవ్వాల్సిందే.! ఈ ప్రాంత అభివృద్ధికి కావాల్సిన పనులు సీఎం జగన్ చేస్తుంటే ఎందుకు అడ్డుపడతారు.? విశాఖ లో ఐటీ ఇండస్ట్రీ దివంగత ముఖ్యమంత్రి డా.YSR వలన వచ్చింది. వైజాగ్కు దేశంలోనే పెద్ద పారిశ్రామిక వేత్తలు అంబానీ, అదానీ లాంటి వాళ్లను సీఎం జగన్ తీసుకొచ్చారు 1:30 PM, Nov 24, 2023 కోర్టులతో ఆటలా.? ఇది సరికాదు.! ఎస్సై నియామకాల వివాదంపై ఏపీ హైకోర్టులో తెలుగుదేశం మద్ధతుదారు న్యాయవాది జడ శ్రావణ్ పిటిషన్ మాన్యువల్గా చేసిన కొలతల ప్రక్రియను తప్పుబట్టిన న్యాయవాది జడ శ్రావణ్ పిటిషన్ వేయడంతో మరోసారి ఎస్సై అభ్యర్థులకు కొలతల ప్రక్రియ చేపట్టాలని సూచించిన హైకోర్టు హైకోర్టు సూచనలతో ఎస్సై అభ్యర్థులకు మరోసారి కొలతల ప్రక్రియ, వీడియోను కోర్టుకు సమర్పించిన ప్రభుత్వం అభ్యర్ధులకు ఎత్తు అంశంలో అన్యాయం జరగలేదన్న ఏపీ ప్రభుత్వం 45 వేల మంది యువత భవిష్యత్ కు సంబంధించిన అంశమని, స్టే ఎత్తివేయాలని హైకోర్టును అభ్యర్ధించిన ఏపీ ప్రభుత్వం హైకోర్టు సమక్షంలో అభ్యర్ధులకు తిరిగి ఎత్తు కొలుస్తామన్న జడ్జి అభ్యర్ధులు తప్పుడు ఆరోపణలు చేసినట్లు నిరూపితమైతే ఒక్కో అభ్యర్ధికి రూ.లక్ష జరిమానా విధిస్తామన్న హైకోర్టు ఈ నెల 29న ఎంతమంది హాజరవుతారో లేఖ పూర్వకంగా తెలపాలని పిటిషనర్ తరపు న్యాయవాది జడ శ్రావణ్ కు హైకోర్టు ఆదేశాలు తదుపరి విచారణను ఈ నెల 29కి వాయిదా వేసిన ఏపీ హైకోర్టు 12:00 PM, Nov 24, 2023 విశాఖపై విషం చిమ్ముతోన్న ఈనాడు, రామోజీ నిజాలు మీరే గమనించండి ఈనాడు రాసిందేంటీ? విధ్వంసక విధానాలతో ఇప్పటికే HSBC వంటి ఐటీ సంస్థలు విశాఖను వదిలి వెళ్లిపోయాయి. ఒకసారి నిజాలేంటో పరిశీలిస్తే.. 2016లో ఇండియాలో 24 బ్రాంచ్లను మూసేయాలని HSBC నిర్ణయం తీసుకుంది : ది హిందూ దిన పత్రిక (HSBC India to shut down 24 branches -The Hindu May 20, 2016 ) ఏడాదిన్నర కింద కంపెనీలో చోటు చేసుకున్న మార్పుల మూలంగా ప్రపంచవ్యాప్తంగా బ్రాంచీలను కుదించాలని బోర్డు నిర్ణయం తీసుకుంది. మన దేశంలో చెన్నై, కోల్కతాతో పాటు విశాఖ శాఖనూ మూసేయాలని నిర్ణయించింది. (News 18, Dec 16 2021) ఇందులో సీఎం జగన్కు సంబధం ఏంటీ? విశాఖలో HSBC బ్రాంచ్కు ప్రభుత్వానికి ఎలా ముడిపెడతారు? 11:50 AM, Nov 24, 2023 ఇసుక కుంభకోణం కేసు 30వ తేదికి వాయిదా ఇసుక కుంభకోణంలో చంద్రబాబు బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా ఈనెల 30వ తేదీకి విచారణ వాయిదా వేసిన ఏపీ హైకోర్టు 11:49 AM, Nov 24, 2023 ఇన్నర్ రింగ్ రోడ్ కేసు 29కి వాయిదా ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పై విచారణ వాయిదా విచారణను ఈనెల 29కి వాయిదా వేసిన హైకోర్టు చంద్రబాబుపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశం కేసులో తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశం 11:45 AM, Nov 24, 2023 అసలు సంగతి ఇదా.. నారాయణ ఏపీలో మేము టీడీపీ కలవాలనుకుంటున్నాం : సీపీఐ నారాయణ కానీ టీడీపీ పక్క చూపులు చూస్తుంది బీజేపీతో టీడీపీని కలిపేందుకు మధ్యవర్తిత్వం చేస్తున్నారు బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తే ఏపీలో మళ్లీ సీఎం జగనే అధికారంలోకి వస్తారు : నారాయణ 11:40 AM, Nov 24, 2023 సుప్రీంకోర్టులో చంద్రబాబు బెయిల్ రద్దు సవాల్ పిటిషన్ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్ను సుప్రీంకోర్టులో మెన్షన్ చేసిన ఏపీ సీఐడీ తమ పిటిషన్ను త్వరగా విచారించాలని లేఖ ద్వారా సీజేఐని కోరిన ఏపీ సీఐడీ తరపు న్యాయవాదులు చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్ సుప్రీంకోర్టులో మంగళవారం విచారణకు వస్తుందని భావిస్తున్న ఏపీ సీఐడీ ఈ కేసులో ఇప్పటికే చంద్రబాబుకు బెయిల్ ఇచ్చిన ఏపీ హైకోర్టు హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో సీఐడీ పిటిషన్ 10:40 AM, Nov 24, 2023 470 పేజీల అఫిడవిట్ దాఖలు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ కుంభకోణంలో చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టులో నేడు విచారణ ఐఆర్ఆర్ కేసులో చంద్రబాబుకు ముందస్తు బెయిల్ ఇవ్వొద్దని కోరిన సీఐడీ ఏపీ హైకోర్టులో అడిషనల్ అఫిడవిట్ దాఖలు 470 పేజీలతో అడిషినల్ అఫిడవిట్ దాఖలు చేసిన ఏపీ సీఐడీ 09:56 AM, Nov 24, 2023 సిక్కోలు కాదు.. వైజాగ్కే స్టాప్ పాదయాత్ర విషయంలో కొడుక్కు సర్ది చెప్పలేక తలపట్టుకుంటోన్న చంద్రబాబు శ్రీకాకుళంలోని ఇచ్ఛాపురం వరకు యువగళం పాదయాత్ర నిర్వహించాలన్న చంద్రబాబు అంతదూరం నడవలేను, వైజాగ్తో సరిపెడతానంటోన్న లోకేష్ బాబు ఇప్పటికే చాలా దూరం నడిచాను, ఇక నా వల్ల కాదంటున్న లోకేష్ పైగా గతంలో చంద్రబాబు కూడా వైజాగ్ వరకే యాత్రను చుట్టేసిన వైనాన్ని గుర్తు చేస్తోన్న లోకేష్ మధ్యలో వదిలేశానన్న అపకీర్తి లేకుండా యువగళాన్ని విశాఖలో వైండ్ అప్ చేయాలన్న యోచనలో లోకేష్ ఎంత నడిచినా, ఏం చేసినా డిసెంబర్ వరకేనంటోన్న చినబాబు 08:59 AM, Nov 24, 2023 నేడు చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్లపై హైకోర్టులో విచారణ ఇసుక కేటాయింపులు, ఐఆర్ఆర్ కేసుల్లో విచారించనున్న ఏపీ హైకోర్టు నేడు హైకోర్టులో అడిషనల్ అఫిడవిట్ ఫైల్ చేయనున్న ఏపీ సీఐడీ ఐఆర్ఆర్ కేసులో చంద్రబాబుకు ముందస్తు బెయిల్ ఇవ్వొద్దని కోరనున్న సీఐడీ 08:52 AM, Nov 24, 2023 తెలంగాణలో పవన్ కళ్యాణ్ కొత్త సమీకరణాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పవన్ కళ్యాణ్ వింత విచిత్ర ప్రసంగం తెలంగాణలో, కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావాలన్న పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల ఊసెత్తని పవన్ కళ్యాణ్ కేసీఆర్, కేటీఆర్, రేవంత్ రెడ్డి, హనుమంత రావుతో నాకు పరిచయాలున్నాయి : పవన్ పరిచయాలు వేరు రాజకీయాలు వేరు : పవన్ నేను మోదీ నాయకత్వంలోనే పని చేస్తా : పవన్ నీను కెసిఆర్ను, BRSను తిట్టడం లేదు : పవన్ ఎందుకంటే.. ఏపీలో లాగా బాగా తిరిగితే తప్ప BRS గురించి నాకు అర్థం కాదు: పవన్ తెలంగాణ లో కూడా ఇక నుంచి పూర్తి స్థాయి లో తిరుగుతా ఇవాళ నుంచే మొదలు పెడుతున్నా ఇక కాస్కోండి : పవన్ ఆంధ్రప్రదేశ్ రాజకీయంపై వచ్చిన వారి కేకలు ఇబ్బందికర పరిస్థితి తప్పించేందుకు జనసేన కార్యకర్తల పోటీ నినాదాలు ఆంధ్రప్రదేశ్కు కాబోయే సీఎం పవన్ అంటూ జనసేన నేతల నినాదాలు 08:46 AM, Nov 24, 2023 తమ్ముడు గారు... మన దారి తెలంగాణలో ఎటు.? ఏపీలో ఎటు.? పవన్ వ్యాఖ్యలపై పార్టీలో, కార్యకర్తల్లో అయోమయం వారం రోజుల్లో తెలంగాణ ఎన్నికలు ముగిసిపోతాయి జనసేన అభ్యర్థులు పోటీ చేసిందే ఎనిమిది స్థానాల్లో పవన్ కళ్యాణ్ ప్రచారానికి వచ్చిందే అత్యంత ఆలస్యంగా పవన్ కళ్యాణ్ ఆలస్యంగా ఇప్పుడొచ్చి తొడలు కొట్టడమెందుకు? తెలంగాణలో ఎన్నికలు ముగిసాకా పవన్ కళ్యాణ్ తిరిగితే ఏమొస్తుంది? పైగా కాస్కోండి అని పవన్ సవాల్ విసిరితే ఎవరు పట్టించుకుంటారు? నేను నమ్ముకున్న సిద్ధాంతానికి వెనుకడుగు వేసే వాడిని కాదని స్టేట్మెంట్ ఇస్తే జనం విశ్వసిస్తారా? ఇప్పటివరకు జనసేన సిద్ధాంతమేంటీ? పవన్ సిద్ధాంతమేంటీ? ఏ పార్టీతో మనం పొత్తులో ఉన్నాం? ఎవరి వెంట తిరుగుతున్నాం? 2014లో ఎందుకు పోటీ చేయలేదు? 2019లో ఒంటరిగా ఎందుకు దిగాం? ఇప్పుడు ఏం కారణం చెప్పి 2023లో పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో పొత్తు అని ప్రకటించాడు? సిద్ధాంతం పక్కనబెట్టి పవన్కళ్యాణ్లోనయినా స్పష్టత ఉందా? తెలంగాణలో ఎవరికి ఓటేయమంటున్నాం? ఏపీలో ఏం కావాలని అడుగుతాం? ఆలస్యంగా రావడమే కాకుండా.. మిగతా నియోజకవర్గాల్లో డిటో అనుకోవాలంటూ మెసెజ్లేంటీ? పార్ట్టైం పొలిటిషియన్ అని చాటుకోవడమెందుకు? మద్ధతు ఇవ్వాలి అంటున్నారు కానీ, ఓటేయమని ఎందుకు అడగడం లేదు? నోరు తెరిస్తే గద్దర్ ఆశయాన్ని గెలిపించమంటున్నారు.. గద్దర్ బిడ్డ కాంగ్రెస్ అభ్యర్థి అన్న విషయం మరిచిపోతున్నారా? అసలు మద్ధతు ఇవ్వాల్సింది బీజేపీకా? లేక చంద్రబాబు సూచనల మేరకు గద్దర్ పార్టీ అయిన కాంగ్రెస్కా? 07:33 AM, Nov 24, 2023 నేడు సీజేఐ ముందు చంద్రబాబు బెయిలు రద్దు పిటిషన్ ప్రస్తావన స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో హైకోర్టు ఇచ్చిన బెయిలు రద్దు చేయాలన్న పిటిషన్ త్వరగా విచారించాలని సుప్రీంకోర్టును కోరనున్న ఏపీ సీఐడీ ఇటీవల దాఖలు చేసిన పిటిషన్ను సీజేఐ ధర్మాసనం ముందు ప్రస్తావించనున్న సీఐడీ ఈ మేరకు మెన్షనింగ్ జాబితాలో చేర్చాలని గురువారం రిజిస్ట్రీకి సీఐడీ తరఫు న్యాయవాది విజ్ఞప్తి 07:30 AM, Nov 24, 2023 ప్రివిలేజ్ ఫీజు తొలగింపుతో టీడీపీ నేతలు లబ్ధి పొందారు చంద్రబాబు ఆదేశాల మేరకే ఫీజు తొలగింపు ఫైల్ సిద్ధమైంది ఫీజు తొలగింపు వల్ల ఖజానాకు రూ.1,299 కోట్ల మేర నష్టం వాటిల్లింది ఇది పూర్తిగా రాజకీయ నిర్ణయం దర్యాప్తు అధికారులను టీడీపీ నేతలు బెదిరిస్తున్నారు చంద్రబాబు, రవీంద్రకు బెయిల్ ఇస్తే దర్యాప్తు ముందుకెళ్లదు వారి ముందస్తు బెయిల్ పిటిషన్లు కొట్టేయండి హైకోర్టుకు నివేదించిన అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ విచారణ సోమవారానికి వాయిదా ప్రపంచంలో అతిపెద్ద డీప్ఫేక్ చంద్రబాబే. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసింది చెప్పుకోవడానికి ఏమీ లేదు కాబట్టి అధికారం కోసం అడ్డదారులు వెతుక్కుంటున్నాడు. ఈ సవాలక్ష రోగాల బాబుని ప్రజలు నమ్మే స్థితిలో లేరు.#CorruptBabuNaidu #GajaDongaChandrababu#EndofTDP pic.twitter.com/OtAOUxJNtc — YSR Congress Party (@YSRCParty) November 23, 2023 07:28 AM, Nov 24, 2023 స్కిల్ స్కాంలో ఇప్పటివరకు ఏం జరిగింది? టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన స్కిల్ స్కాం నిరుద్యోగులకు శిక్షణ పేరిట తెరపైకి ఓ ఒప్పందం జర్మనీ కేంద్రంగా ఉన్న ప్రఖ్యాత టెక్నాలజీ కంపెనీ సీమెన్స్తో ఒప్పందం అంటూ ప్రచారం సీమెన్స్ 90% ఇస్తుందని, తాము కేవలం 10% మాత్రమే చెల్లించాలని అప్పటి టిడిపి ప్రభుత్వం ప్రచారం ఆఘామేఘాల మీద 10% వాటా కింద రూ.371 కోట్లు మధ్యవర్తి కంపెనీలకు చెల్లింపు అధికారులు అంగీకరించకపోయినా బలవంతం చేసిన చంద్రబాబు, స్వయంగా 13 చోట్ల సంతకాలు, ఇదే విషయాన్ని ఫైళ్లలో రాసిన అధికారులు షెల్ కంపెనీల ద్వారా రూ 241 కోట్ల పక్కదారి విచారణలో అసలు తమకు ఒప్పందంతో సంబంధమే లేదని లిఖిత పూర్వకంగా తెలిపిన సీమెన్స్ పన్ను చెల్లించకపోవడంతో కుట్రను గమనించిన డైరెక్టరేట్ జనరల్ (GST ఇంటెలిజెన్స్) ఆధారాలు సేకరించి నాటి చంద్రబాబు ప్రభుత్వానికి కుంభకోణం జరిగిందని తెలిపిన GST విషయం బయటకు రావడంతో తేలు కుట్టిన దొంగలా చంద్రబాబు స్వయంగా దర్యాప్తు చేయడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసిన GST శాఖ నిధులన్నీ సూట్కేస్ కంపెనీల ద్వారా పక్కదారి పట్టాయని గుర్తించిన ఇన్కమ్టాక్స్ శాఖ కొల్లగొట్టిన సొమ్ములో రూ. 27 కోట్లు నేరుగా టీడీపీ బ్యాంకు ఖాతాకు చేరినట్టు బ్యాంకు స్టేట్మెంట్లను గుర్తించిన CID రికార్డులను ఏసీబీ కోర్టుకు సమర్పించిన సీఐడి ఈ కుంభకోణంపై జాతీయ దర్యాప్తు సంస్థ ఈడీ విచారణ చేపట్టి పలువురి అరెస్ట్ చంద్రబాబుపై 120(బి), 166, 167,418, 420, 465, 468, 201, 109, రెడ్ విత్ 34 and 37 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు సీఆర్పీసీ సెక్షన్ 50(1) కింద నోటీస్ ఇచ్చిన సీఐడీ 1988 ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్ చట్టం కింద సెప్టెంబర్ 9వ తేదీన నంద్యాలలో చంద్రబాబును అరెస్ట్ చేసిన సీఐడీ పోలీసులు సెప్టెంబర్ 10న రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలింపు ఐదు పర్యాయాలు జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు రిమాండ్ ఖైదీగా 7691 నెంబర్తో 52 రోజులపాటు చంద్రబాబు కంటికి శస్త్ర చికిత్స అభ్యర్థన మేరకు మానవతా దృక్ఫథంతో అక్టోబర్ 31వ తేదీన నాలుగు వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు నవంబర్ 20న రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు 07:12 AM, Nov 24, 2023 చంద్రబాబు ముఠాకు ఎదురుదెబ్బ ఫైబర్నెట్ కేసులో నిందితుల ఆస్తుల అటాచ్మెంట్ ఏడు స్థిరాస్తుల అటాచ్మెంట్కు న్యాయస్థానం అనుమతి ఈ కేసులో నిందితులుగా ఉన్నచంద్రబాబు సన్నిహితుల ఆస్తుల అటాచ్మెంట్కు ఏసీబీ న్యాయస్థానం అనుమతి సీఐడీ దాఖలు చేసిన అటాచ్మెంట్ పిటిషన్ను ఆమోదిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు ఫైబర్నెట్ కేసులో చంద్రబాబు సహా పలువురిపై సీఐడీ కేసు నమోదు ఇందులో చంద్రబాబు ఏ–25, ఏ–1 వేమూరి హరికృష్ణకు చెందిన టెరాసాఫ్ట్ కంపెనీ, ఏ–13 టెరాసాఫ్ట్ కంపెనీ ఎండీ తుమ్మల గోపీచంద్ -
స్కిల్ స్కామ్ సూత్రదారి చంద్రబాబే అనడానికి పక్కా ఆధారాలు.. పరారీలో కీలక సాక్ష్యులు... రెగ్యులర్ బెయిల్ మీద చంద్రబాబు...
-
Nov 23rd: చంద్రబాబు కేసు అప్డేట్స్
TDP Chandrababu Cases Petitions And Political Updates.. 4:50 PM, Nov 23, 2023 హైకోర్టులో మద్యం కేసు మద్యం కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ సోమవారానికి వాయిదా మద్యం కేసులో ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన ఏజీ చంద్రబాబు తరపున సీనియర్ న్యాయవాది నాగముత్తు వాదనలు ప్రివిలేజ్ ఫీజు రద్దు చేయాలని ఎక్సైజ్ కమిషనర్ ప్రతిపాదన పంపారు ఎక్సైజ్ కమిషనర్ ప్రతిపాదనను క్యాబినెట్ ఆమోదించింది ఫైల్ పై అప్పటి రెవెన్యూ స్పెషల్ సీఎస్ సంతకాలు చేశారు ప్రివిలేజ్ ఫీజు రద్దు చంద్రబాబు వ్యక్తిగత నిర్ణయం కాదు: నాగముత్తు 03:56 PM, Nov 23, 2023 హైకోర్టులో మద్యం కేసు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన మద్యం కుంభకోణం ఇష్టానుసారంగా మద్యం కంపెనీలకు అనుమతి ఇచ్చిన చంద్రబాబు ఈ కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ బాబు, కొల్లు రవీంద్ర పిటిషన్లు బాబు, కొల్లు రవీంద్ర ముందస్తు బెయిల్ పిటిషన్లపై హైకోర్టులో విచారణ చంద్రబాబు నిర్ణయాల వల్ల రాష్ట్ర ఖజనాకు రూ.1500 కోట్ల నష్టం వాటిల్లిందని తేల్చిన కాగ్ టిడిపి నేతల బార్లు, డిస్టిల్లరీలకు అనుకూలంగా చంద్రబాబు నిర్ణయాలు (చదవండి : చంద్రబాబు సృష్టించిన మద్యం కంపెనీలు) 03:33 PM, Nov 23, 2023 రింగ్ రోడ్డు అక్రమ మలుపుల కేసు హైకోర్టులో విచారణ ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ చంద్రబాబు తరపున హైకోర్టులో టిడిపి లీగల్ టీం వాదనలు విచారణను రేపటికి వాయిదా వేసిన హైకోర్టు 03:06 PM, Nov 23, 2023 మీకో దండం పవన్ బాబు.. మా దారి మేం చూసుకుంటాం పవన్ కళ్యాణ్ తీరుతో పార్టీకి జనసైనికుల గుడ్బై కృష్ణా జిల్లా గుడివాడ జనసేన పార్టీకి బిగ్ షాక్ జనసేన పార్టీకి గుడ్ బై చెప్పిన జనసైనికులు తన అనుచర గణంతో కలిసి జనసేన పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన డాక్టర్ మాచర్ల రామకృష్ణ డాక్టర్ మాచర్ల రామకృష్ణ (జనసేన ఆర్కే) పదిమందికి మేలు చేసే వ్యక్తులకు మద్దతు ఇస్తాను గుడివాడ ప్రజలకు మంచి జరగడమే మా అంతిమ లక్ష్యం కృష్ణాజిల్లాలో కార్యకర్తలను పట్టించుకునే నాయకుడు లేడు గుడివాడలో జనసేన నేతలు గ్రూపులుగా విడిపోయి వ్యక్తిగత ప్రయోజనాలకే ప్రాధాన్యమిస్తున్నారు పార్టీ నేతల వ్యవహారశైలి మారకుంటే జనసేనలో నాయకులే మిగులుతారు పదేళ్లుగా పవన్ పేరు జపించాం,జనసేన జెండా భుజాల పై మోశాం పార్టీ పేరు మీద యువత అంతా కలిసి వేలాది సేవా కార్యక్రమాలు నిర్వహించాం జిల్లాలో కార్యకర్తకు భరోసా ఇచ్చే నాయకుడేడి? జిల్లా కమిటీలు కూడా వేయలేని స్థితిలో జనసేన పార్టీ ఉంది.! జిల్లా నేతల వ్యవహార శైలి నచ్చకే పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాం 02:56 PM, Nov 23, 2023 తమ్ముడు గారు... మన దారి తెలంగాణలో ఎటు.? ఏపీలో ఎటు.? పవన్ వ్యాఖ్యలపై పార్టీలో, కార్యకర్తల్లో అయోమయం వారం రోజుల్లో తెలంగాణ ఎన్నికలు ముగిసిపోతాయి జనసేన అభ్యర్థులు పోటీ చేసిందే ఎనిమిది స్థానాల్లో పవన్ కళ్యాణ్ ప్రచారానికి వచ్చిందే అత్యంత ఆలస్యంగా పవన్ కళ్యాణ్ ఆలస్యంగా ఇప్పుడొచ్చి తొడలు కొట్టడమెందుకు? తెలంగాణలో ఎన్నికలు ముగిసాకా పవన్ కళ్యాణ్ తిరిగితే ఏమొస్తుంది? పైగా కాస్కోండి అని పవన్ సవాల్ విసిరితే ఎవరు పట్టించుకుంటారు? నేను నమ్ముకున్న సిద్ధాంతానికి వెనుకడుగు వేసే వాడిని కాదని స్టేట్మెంట్ ఇస్తే జనం విశ్వసిస్తారా? ఇప్పటివరకు జనసేన సిద్ధాంతమేంటీ? పవన్ సిద్ధాంతమేంటీ? ఏ పార్టీతో మనం పొత్తులో ఉన్నాం? ఎవరి వెంట తిరుగుతున్నాం? 2014లో ఎందుకు పోటీ చేయలేదు? 2019లో ఒంటరిగా ఎందుకు దిగాం? ఇప్పుడు ఏం కారణం చెప్పి 2023లో పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో పొత్తు అని ప్రకటించాడు? సిద్ధాంతం పక్కనబెట్టి పవన్కళ్యాణ్లోనయినా స్పష్టత ఉందా? తెలంగాణలో ఎవరికి ఓటేయమంటున్నాం? ఏపీలో ఏం కావాలని అడుగుతాం? ఆలస్యంగా రావడమే కాకుండా.. మిగతా నియోజకవర్గాల్లో డిటో అనుకోవాలంటూ మెసెజ్లేంటీ? పార్ట్టైం పొలిటిషియన్ అని చాటుకోవడమెందుకు? మద్ధతు ఇవ్వాలి అంటున్నారు కానీ, ఓటేయమని ఎందుకు అడగడం లేదు? నోరు తెరిస్తే గద్దర్ ఆశయాన్ని గెలిపించమంటున్నారు.. గద్దర్ బిడ్డ కాంగ్రెస్ అభ్యర్థి అన్న విషయం మరిచిపోతున్నారా? అసలు మద్ధతు ఇవ్వాల్సింది బీజేపీకా? లేక చంద్రబాబు సూచనల మేరకు గద్దర్ పార్టీ అయిన కాంగ్రెస్కా? సమయాభావం వలన ఎక్కువ నియోజకవర్గాలు తిరగలేకపోతున్నాను. ఎక్కడైతే బీజేపి అభ్యర్థులు ఉన్నారో అక్కడ జనసేన శ్రేణులు, జనసేన పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తున్న చోట బీజేపీ శ్రేణులు మద్దతుగా నిలబడాలి అని పిలుపునిస్తున్నాను - వరంగల్ సభలో జనసేన పార్టీ అధినేత శ్రీ @PawanKalyan గారు.… pic.twitter.com/0nw4Fw2AGn — JanaSena Party (@JanaSenaParty) November 22, 2023 02:36 PM, Nov 23, 2023 తెలంగాణలో పవన్ కళ్యాణ్ కొత్త సమీకరణాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పవన్ కళ్యాణ్ వింత విచిత్ర ప్రసంగం తెలంగాణలో, కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావాలన్న పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల ఊసెత్తని పవన్ కళ్యాణ్ కేసీఆర్, కేటీఆర్, రేవంత్ రెడ్డి, హనుమంత రావుతో నాకు పరిచయాలున్నాయి : పవన్ పరిచయాలు వేరు రాజకీయాలు వేరు : పవన్ నేను మోదీ నాయకత్వంలోనే పని చేస్తా : పవన్ నీను కెసిఆర్ను, BRSను తిట్టడం లేదు : పవన్ ఎందుకంటే.. ఏపీలో లాగా బాగా తిరిగితే తప్ప BRS గురించి నాకు అర్థం కాదు: పవన్ తెలంగాణ లో కూడా ఇక నుంచి పూర్తి స్థాయి లో తిరుగుతా ఇవాళ నుంచే మొదలు పెడుతున్నా ఇక కాస్కోండి : పవన్ ఆంధ్రప్రదేశ్ రాజకీయంపై వచ్చిన వారి కేకలు ఇబ్బందికర పరిస్థితి తప్పించేందుకు జనసేన కార్యకర్తల పోటీ నినాదాలు ఆంధ్రప్రదేశ్కు కాబోయే సీఎం పవన్ అంటూ జనసేన నేతల నినాదాలు 02:25 PM, Nov 23, 2023 ఏపీ హైకోర్టులో మద్యం కేసు ఏపీ హైకోర్టు: గత ప్రభుత్వంలో జరిగిన మద్యం కుంభకోణం ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ చంద్రబాబు నాయుడు, కొల్లు రవీంద్ర పిటిషన్లు హైకోర్టులో సిఐడి తరఫున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు 01:45 PM, Nov 23, 2023 చంద్రబాబు శిష్యులకు పవన్ శిష్యుల అల్టిమేటం.! ఏపీ ఎన్నికలకు ముందే తెలుగుదేశం, జనసేనల మధ్య కుల చిచ్చు కూకట్పల్లిలో తేడా వస్తే.. ఏపీలో రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం కమ్మ సెటిలర్లకు కాపు సెటిలర్ల బహిరంగ లేఖ కూకట్పల్లిలో జనసేన తరపున బరిలో కాపు నాయకుడు ప్రేమ్కుమార్ కూకట్పల్లిలో కమ్మ సామాజిక వర్గం ఓట్లకు ఇప్పటికే చంద్రబాబు బ్రీఫింగ్ కమ్మలంతా కాంగ్రెస్కు ఓటేయాలంటూ సూచించిన చంద్రబాబు భగ్గుమంటోన్న కాపులు, జనసేనను బలిపశువు చేయొద్దని వార్నింగ్ మీరు మమ్మల్ని ఇక్కడ ఓడిస్తే.. మీకు అదే గతి పడుతుందని హెచ్చరిక నిన్నటి నుంచి కూకట్పల్లి వాట్సాప్ గ్రూప్లో సర్క్యులేట్ అవుతోన్న లేఖ లేఖను ఇప్పటివరకు ఖండించని కమ్మ, కాపు సామాజిక నేతలు 01:03 PM, Nov 23, 2023 సిక్కోలు కాదు.. వైజాగ్కే స్టాప్ పాదయాత్ర విషయంలో కొడుక్కు సర్ది చెప్పలేక తలపట్టుకుంటోన్న చంద్రబాబు శ్రీకాకుళంలోని ఇచ్ఛాపురం వరకు యువగళం పాదయాత్ర నిర్వహించాలన్న చంద్రబాబు అంతదూరం నడవలేను, వైజాగ్తో సరిపెడతానంటోన్న లోకేష్ బాబు ఇప్పటికే చాలా దూరం నడిచాను, ఇక నా వల్ల కాదంటున్న లోకేష్ పైగా గతంలో చంద్రబాబు కూడా వైజాగ్ వరకే యాత్రను చుట్టేసిన వైనాన్ని గుర్తు చేస్తోన్న లోకేష్ మధ్యలో వదిలేశానన్న అపకీర్తి లేకుండా యువగళాన్ని విశాఖలో వైండ్ అప్ చేయాలన్న యోచనలో లోకేష్ ఎంత నడిచినా, ఏం చేసినా డిసెంబర్ వరకేనంటోన్న చినబాబు 01:03 PM, Nov 23, 2023 ఇన్నర్ రింగ్రోడ్ అలైన్మెంట్ కేసు.. విచారణ రేపటికి వాయిదా ఇన్నర్ రింగ్రోడ్ అలైన్మెంట్ స్కాంలో బాబు ముందస్తు బెయిల్ పిటిషన్ ముందస్తు బెయిల్ పిటిషన్పై పూర్తయిన బాబు తరపు లాయర్ వాదనలు తదుపరి విచారణ రేపటికి వాయిదా వేసిన హైకోర్టు 10:43 AM, Nov 23, 2023 స్కిల్ డెవలప్మెంట్లో రూ.241 కోట్లు దోచుకుందెవరు?: మంత్రి బుగ్గన మేఘా సంస్థకు ప్రభుత్వ గ్యారెంటీ పచ్చి అబద్ధం రుణానికి సంబంధించిన పూర్తి బాధ్యత మేఘా సంస్థదే, ప్రభుత్వానికి సంబంధం లేదు ఆరోగ్యశ్రీపై టీడీపీ వెచ్చించింది రూ.5,177 కోట్లు మాత్రమే వైఎస్సార్సీపీ ప్రభుత్వం పెట్టిన ఖర్చు రూ.9,514.84 కోట్లు చంద్రబాబు కళ్లల్లో పడటం కోసం ఓ వ్యక్తి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు మేఘా కంపెనీ ప్రభుత్వ గ్యారెంటీతో రూ. 2000 కోట్లు అప్పు తెచ్చుకుందని అర్థం లేని ఆరోపణలు గ్యారంటీ లెటర్ అంటే ఏంటో మీకు కనీస అవగాహన లేదు ఈ విషయం తప్పు కాదనే ఆర్థిక అంశాలలో అవగాహన ఉన్న మాజీ ఆర్థిక శాఖ మంత్రి యనమల ఎందుకు మాట్లాడటం లేదు.? ఏ పనీ చేయకుండా ఏదో చేస్తున్నామనేలా హైప్ చేసి స్కిల్ డెవలప్ మెంట్లో రూ.241 కోట్లు దోచుకుందెవరు? రాజధాని అమరావతి పేరుతో వేల కోట్లు సంపాదించిందెవరు? ఇన్నర్ రింగ్ రోడ్డుని మెలికలు తిప్పి అక్రమాలకు పాల్పడిందెవరు? సామాన్య ప్రజల్లో మా ప్రభుత్వ సంక్షేమ విధానాలు, పరిపాలనపై ఉన్న అభిమానాన్ని, నమ్మకాన్ని దెబ్బతీయాలనే కుట్ర అందుకే ప్రైవేట్ సంస్థకు ప్రభుత్వ గ్యారంటీ అంటూ మా మీద బురద చల్లుతున్నారని ప్రజలకు అర్థమయ్యింది. 07:52 AM, Nov 23, 2023 టీడీపీని బతికించడమే అజెండాగా అడుగులు పోలీసులను కొట్టిన కేసులో టీడీపీ నేత బీటెక్ రవి అరెస్ట్ రెండు గంటల్లోనే మేజిస్ట్రేట్ ఎదుట హాజరు పోలీసులు కొట్టి ఉంటే మేజిస్ట్రేట్కు ఎందుకు చెప్పలేదు? టీడీపీ నేతను అరెస్ట్ చేస్తే బీజేపీ నేత సీఎం రమేశ్ పరామర్శా! రవిని కొట్టారని, బెదిరించారని దుష్ప్రచారం ఎవరి కోసం? వైఎస్సార్ జిల్లాలో టీడీపీకి పెద్ద దిక్కుగా మారిన సీఎం రమేశ్ చంద్రబాబు పన్నాగంతోనే మ్యాచ్ ఫిక్సింగ్ రాజకీయం 07:33 AM, Nov 23, 2023 ఇన్నర్ రింగ్రోడ్ అలైన్మెంట్ స్కాంలో బాబు ముందస్తు బెయిల్ పిటిషన్ బాబు ముందస్తు బెయిల్ పిటిషన్పై ఇవాళ హైకోర్టులో విచారణ గత ప్రభుత్వంలో జరిగిన మద్యం కుంభకోణంలో తమకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ బాబు, కొల్లు రవీంద్ర పిటిషన్ బాబు, కొల్లు రవీంద్ర ముందస్తు బెయిల్ పిటిషన్పై ఇవాళ హైకోర్టులో విచారణ 07:19 AM, Nov 23, 2023 చంద్రబాబు మోసాలకు అడ్డుకట్ట వేయాల్సిందే చంద్రబాబు మోసాల నుంచి ఉత్తరాంధ్ర ప్రజలు మేలుకోవాలి : మంత్రి సీదిరి అప్పలరాజు విశాఖను రాజధానిగా చేస్తే చంద్రబాబు అడ్డుకుంటున్నారు విశాఖ రాజధాని అయితే యువతకు ఇక్కడే ఉపాధి లభిస్తుంది ఉత్తరాంధ్ర నుంచి వలసలు ఆగుతాయి విశాఖ రాజధాని అయితే ఇక్కడ భూములకు రేట్లు పెరుగుతాయి ఒక కులం కోసం అమరావతిని రాజధాని చేశారు వైజాగ్ లో రాజధాని వద్దని చంద్రబాబుకు ఎవరైనా చెప్పారా? సిగ్గులేకుండా రామోజీరావు అబద్ధాలు రాస్తున్నారు వెనుకబడిన కులాలు అంటే చంద్రబాబుకు ద్వేషం చంద్రబాబును ఓడించేది ఒక మత్స్యకారుడే మత్స్యకారులను అణగదొక్కాలని చూసిన వ్యక్తి చంద్రబాబు 07:17 AM, Nov 23, 2023 స్కిల్ స్కాంలో ఇప్పటివరకు ఏం జరిగింది? టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన స్కిల్ స్కాం నిరుద్యోగులకు శిక్షణ పేరిట తెరపైకి ఓ ఒప్పందం జర్మనీ కేంద్రంగా ఉన్న ప్రఖ్యాత టెక్నాలజీ కంపెనీ సీమెన్స్తో ఒప్పందం అంటూ ప్రచారం సీమెన్స్ 90% ఇస్తుందని, తాము కేవలం 10% మాత్రమే చెల్లించాలని అప్పటి టిడిపి ప్రభుత్వం ప్రచారం ఆఘామేఘాల మీద 10% వాటా కింద రూ.371 కోట్లు మధ్యవర్తి కంపెనీలకు చెల్లింపు అధికారులు అంగీకరించకపోయినా బలవంతం చేసిన చంద్రబాబు, స్వయంగా 13 చోట్ల సంతకాలు, ఇదే విషయాన్ని ఫైళ్లలో రాసిన అధికారులు షెల్ కంపెనీల ద్వారా రూ 241 కోట్ల పక్కదారి విచారణలో అసలు తమకు ఒప్పందంతో సంబంధమే లేదని లిఖిత పూర్వకంగా తెలిపిన సీమెన్స్ పన్ను చెల్లించకపోవడంతో కుట్రను గమనించిన డైరెక్టరేట్ జనరల్ (GST ఇంటెలిజెన్స్) ఆధారాలు సేకరించి నాటి చంద్రబాబు ప్రభుత్వానికి కుంభకోణం జరిగిందని తెలిపిన GST విషయం బయటకు రావడంతో తేలు కుట్టిన దొంగలా చంద్రబాబు స్వయంగా దర్యాప్తు చేయడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసిన GST శాఖ నిధులన్నీ సూట్కేస్ కంపెనీల ద్వారా పక్కదారి పట్టాయని గుర్తించిన ఇన్కమ్టాక్స్ శాఖ కొల్లగొట్టిన సొమ్ములో రూ. 27 కోట్లు నేరుగా టీడీపీ బ్యాంకు ఖాతాకు చేరినట్టు బ్యాంకు స్టేట్మెంట్లను గుర్తించిన CID రికార్డులను ఏసీబీ కోర్టుకు సమర్పించిన సీఐడి ఈ కుంభకోణంపై జాతీయ దర్యాప్తు సంస్థ ఈడీ విచారణ చేపట్టి పలువురి అరెస్ట్ చంద్రబాబుపై 120(బి), 166, 167,418, 420, 465, 468, 201, 109, రెడ్ విత్ 34 and 37 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు సీఆర్పీసీ సెక్షన్ 50(1) కింద నోటీస్ ఇచ్చిన సీఐడీ 1988 ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్ చట్టం కింద సెప్టెంబర్ 9వ తేదీన నంద్యాలలో చంద్రబాబును అరెస్ట్ చేసిన సీఐడీ పోలీసులు సెప్టెంబర్ 10న రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలింపు ఐదు పర్యాయాలు జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు రిమాండ్ ఖైదీగా 7691 నెంబర్తో 52 రోజులపాటు చంద్రబాబు కంటికి శస్త్ర చికిత్స అభ్యర్థన మేరకు మానవతా దృక్ఫథంతో అక్టోబర్ 31వ తేదీన నాలుగు వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు నవంబర్ 20న రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు 07:12 AM, Nov 23, 2023 చంద్రబాబు ముఠాకు ఎదురుదెబ్బ ఫైబర్నెట్ కేసులో నిందితుల ఆస్తుల అటాచ్మెంట్ ఏడు స్థిరాస్తుల అటాచ్మెంట్కు న్యాయస్థానం అనుమతి ఈ కేసులో నిందితులుగా ఉన్నచంద్రబాబు సన్నిహితుల ఆస్తుల అటాచ్మెంట్కు ఏసీబీ న్యాయస్థానం అనుమతి సీఐడీ దాఖలు చేసిన అటాచ్మెంట్ పిటిషన్ను ఆమోదిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు ఫైబర్నెట్ కేసులో చంద్రబాబు సహా పలువురిపై సీఐడీ కేసు నమోదు ఇందులో చంద్రబాబు ఏ–25, ఏ–1 వేమూరి హరికృష్ణకు చెందిన టెరాసాఫ్ట్ కంపెనీ, ఏ–13 టెరాసాఫ్ట్ కంపెనీ ఎండీ తుమ్మల గోపీచంద్ -
Nov 22nd: చంద్రబాబు కేసు అప్డేట్స్
TDP Chandrababu Cases Petitions And Political Updates.. 7:25 PM, Nov 22, 2023 లోన బాధ.. పైన ప్రచారం ఎట్టకేలకు ప్రచారానికి వచ్చిన పార్ట్టైం పొలిటిషియన్ తప్పనిసరి పరిస్థితుల్లో తెలంగాణ ఎన్నికల్లో పోటికి దిగిన జనసేన కాంగ్రెస్కు మద్ధతివ్వాలని పవన్పై లోన తెలుగుదేశం ఒత్తిడి ఇన్నాళ్లు ప్రచారానికి దూరంగా ఉన్న పవన్ కళ్యాణ్ బీజేపీ నుంచి ఒత్తిడి పెరగడంతో చివరికి ప్రచారానికి వచ్చిన పవన్ వరంగల్ లో పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం తెలంగాణలో బీసీని ముఖ్యమంత్రిగా చూడాలన్న పవన్ కల్యాణ్ On the campaign trail in Telangana with Senani ! pic.twitter.com/AyDcQCmIrw— Manohar Nadendla (@mnadendla) November 22, 2023 7:25 PM, Nov 22, 2023 టిడిపి, జనసేన పిటిషన్ల పర్వం స్మార్ట్ మీటర్ల ఏర్పాటుపై పిల్ దాఖలు చేసిన మాజీమంత్రి సోమిరెడ్డి సోమిరెడ్డి పిటిషన్పై ఏపీ హైకోర్టులో విచారణ కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశం విచారణ నాలుగు వారాలకు వాయిదా 7:05 PM, Nov 22, 2023 కాపు రిజర్వేషన్లపై హరిరామ పిటిషన్ కాపులకు 5 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని జోగయ్య పిటిషన్ మాజీ మంత్రి హరిరామ జోగయ్య పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ కౌంటర్ దాఖలు చేసిన ప్రభుత్వం తమకు కౌంటర్ కాపీ అందలేదని పేర్కొన్న పిటిషనర్ అడ్వకేట్ కౌంటర్ కోసం రిప్లై అఫిడవిట్ వేయాలని పిటిషనర్ కు కోర్టు ఆదేశం తదుపరి విచారణ జనవరి 4కి వాయిదా వేసిన కోర్టు 6:45 PM, Nov 22, 2023 చంద్రబాబు మోసాలకు అడ్డుకట్ట వేయాల్సిందే చంద్రబాబు మోసాల నుంచి ఉత్తరాంధ్ర ప్రజలు మేలుకోవాలి : మంత్రి సీదిరి అప్పలరాజు విశాఖను రాజధానిగా చేస్తే చంద్రబాబు అడ్డుకుంటున్నారు విశాఖ రాజధాని అయితే యువతకు ఇక్కడే ఉపాధి లభిస్తుంది ఉత్తరాంధ్ర నుంచి వలసలు ఆగుతాయి విశాఖ రాజధాని అయితే ఇక్కడ భూములకు రేట్లు పెరుగుతాయి ఒక కులం కోసం అమరావతిని రాజధాని చేశారు వైజాగ్ లో రాజధాని వద్దని చంద్రబాబుకు ఎవరైనా చెప్పారా? సిగ్గులేకుండా రామోజీరావు అబద్ధాలు రాస్తున్నారు వెనుకబడిన కులాలు అంటే చంద్రబాబుకు ద్వేషం చంద్రబాబును ఓడించేది ఒక మత్స్యకారుడే మత్స్యకారులను అణగదొక్కాలని చూసిన వ్యక్తి చంద్రబాబు 6:15 PM, Nov 22, 2023 చంద్రబాబుకు ఎంత సేపు స్వార్థ ప్రయోజనాలే చంద్రబాబు డైరిలో సామాజిక వర్గం అంటే సొంతకులం కులగణన చేసే ధైర్యం మాకే ఉంది:మంత్రి చెల్లుబోయిన కులగణన ద్వారా 139 సామాజిక వర్గాలకు లాభం:స్పీకర్ తమ్మినేని ఏపి కులగణన దేశానికి ఆదర్శంగా నిలిచింది పేదల జీవన ప్రమాణాలు పెంచడమే అభివృద్ధి: స్పీకర్ తమ్మినేని 5:10 PM, Nov 22, 2023 రేపు హైకోర్టులో విచారణ చంద్రబాబు, కొల్లు రవీంద్ర ముందస్తు బెయిల్ పిటిషన్లపై విచారణ రేపటికి వాయిదా గత ప్రభుత్వంలో జరిగిన ఇసుక కుంభకోణంలో ముందస్తు బెయిల్ పిటిషన్ మద్యం కేసులోనూ చంద్రబాబు,కొల్లు రవీంద్ర ముందస్తు బెయిల్ పిటిషన్లు తదుపరి విచారణను ఎల్లుండికి వాయిదా వేసిన ఏపీ హైకోర్టు రేపు మధ్యాహ్నం బెంచ్ ముందుకు పిటిషన్ వచ్చే అవకాశం. 5:00 PM, Nov 22, 2023 ఎవరికి ష్యూరిటీ? ఎవరికి గ్యారంటీ? బాబు ష్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారంటీపై జనసేనలో అంతర్గతంగా చర్చ తెలుగుదేశం ప్రోగ్రాంను మనకు ఎందుకు అంటగడుతున్నారు? అసలే చంద్రబాబు ట్రాక్ రికార్డు సరిగా లేదు..! గతంలో మ్యానిఫెస్టోలు మాయం చేసిన చరిత్ర చంద్రబాబుది.! ఇప్పుడు భవిష్యత్తుకు గ్యారంటీ అంటే ఎవరు నమ్ముతారు? జనసేనను కలుపుకుని ఉమ్మడిగా ప్రచారం చేద్దామని టిడిపి వాళ్లంటున్నారు ఉమ్మడిగా వెళ్లాలనుకుంటే.. ఉమ్మడి ఎజెండా ఉండాలి కదా..! బాబు ష్యూరిటీ అని జనసేన వాళ్లెలా చెబుతాం? నినాదంలో పవన్ కళ్యాణ్ పేరు ఉండొద్దా? 4:30 PM, Nov 22, 2023 పవన్, నాదెండ్ల ఏం చేస్తున్నారంటే.? వైఎస్ఆర్సీపీలో చేరిన జనసేన కేంద్ర కార్యాలయ ఇంఛార్జ్ సందీప్, జనసేన పార్టీ రాయలసీమ రీజియన్ ఇంఛార్జ్ పద్మావతి పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల పసుపులేటి సందీప్, జనసేనకు గుడ్బై చెప్పిన నేత పవన్ కల్యాణ్ యువతను మభ్యపెడతాడు తన స్వార్థం కోసం పవన్ ఎంతో మందిని బలి చేశారు టీడీపీ కోసమే పవన్ కల్యాణ్ పనిచేస్తున్నాడు పార్టీ ఆఫీసుకు వచ్చే హవాలా డబ్బును నాదెండ్ల మారుస్తుంటాడు 4:00 PM, Nov 22, 2023 ఢిల్లీలో సిఐడి అనగానే ఏపీలో టిడిపికి వణుకెందుకు? చంద్రబాబు బెయిల్పై టిడిపి ఇష్టాసారంగా వ్యాఖ్యలు చంద్రబాబు బెయిల్ను CID ఎలా సవాల్ చేస్తుంది? : టిడిపి హైకోర్టు ఇచ్చిన బెయిల్పై సుప్రీంకోర్టుకు ఎలా వెళ్తారు? : టిడిపి సుప్రీంకోర్టుకు వెళ్లడమంటే ప్రజాధనం దుర్వినియోగం అయినట్టే : టిడిపి టిడిపి తీరుపై YSRCP విమర్శలు అవినీతి చేసింది కాకుండా.. వ్యవస్థలపై విమర్శలా? : YSRCP తప్పు చేయలేదని ఏ కోర్టు ముందయినా మీరు చెప్పారా? : YSRCP అనారోగ్యం పేరు చెప్పి బెయిల్ తెచ్చుకోలేదా? : YSRCP ఇప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్లారనగానే అంత వణుకెందుకు? : YSRCP 2:30 PM, Nov 22, 2023 మద్యం కేసు పిటిషన్లపై మొదలైన విచారణ మద్యం కేసులో చంద్రబాబు, కొల్లు రవీంద్ర ముందస్తు బెయిల్ పిటిషన్లు పిటిషన్లపై ఏపీ హైకోర్టులో విచారణ చంద్రబాబు తరఫున వాదనలు వినిపిస్తున్న సుప్రీంకోర్టు లాయర్ నాగముత్తు సీఐడీ తరఫున వాదనలు వినిపిస్తున్న అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ 1:18 PM, Nov 22, 2023 బాబు లాయర్ల వాదనలు ఇవి ఇసుక స్కాం కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా విచారణను మధ్యాహ్నానికి వాయిదా వేసిన ఏపీ హైకోర్టు వాదనలు వినిపించిన చంద్రబాబు న్యాయవాదులు 2016 లో కేబినెట్ ఆమోదంతో అప్పటి ప్రభుత్వం ఉచిత ఇసుక పాలసీని అమల్లోకి తెచ్చింది 2019 లో సీఎం గా చంద్రబాబు పదవీ కాలం ముగిసింది 2023 లో APMDC ఫిర్యాదు చేసింది ఉచిత ఇసుక పాలసీ పై ప్రస్తుత ప్రభుత్వం 2019 సెప్టెంబర్ లో సమీక్ష జరిపి మార్పులు చేర్పులు చేసింది ఇసుక వ్యవహారం పై NGT, సుప్రీం కోర్టుకు పలు అఫిడవిట్లు సమర్పించారు అన్నీ తన చేతిలో ఉన్న APMDC మూడేళ్ల తర్వాత 2023 లో ఫిర్యాదు చేసింది చంద్రబాబుకు ముందస్తు బెయిల్ ఇస్తే.. విచారణకు సహకరిస్తారు 12:58 PM, Nov 22, 2023 విచారణకు చంద్రబాబు సహకరిస్తారు ఇసుక స్కాం కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్పై వాదనలు వినిపించిన చంద్రబాబు లాయర్లు విచారణకు చంద్రబాబు సహకరిస్తారు ముందస్తు బెయిల్ ఇవ్వండి 2016లో కేబినెట్ ఆమోదంతోనే అప్పటి ప్రభుత్వం ఉచిత ఇసుక పాలసీ తెచ్చింది 2019లో సీఎంగా చంద్రబాబు పదవీకాలం ముగిసింది 2023లో ఏపీ ఎండీసీ ఫిర్యాదు చేసింది ప్రస్తుత ప్రభుత్వం ఇసుక పాలసీపై 2019 సెప్టెంబర్లో సమీక్ష జరిపి మార్పులు చేసేఇంది ఎన్జీటీ, సుప్రీం కోర్టుకు పలు అఫిడవిట్లు సమర్పించారు అన్నీ తన చేతిలో ఉన్న ఏపీ ఎండీసీ.. మూడేళ్ల తర్వాత సీఐడీకి ఫిర్యాదు చేసింది అక్రమాలు జరిగాయన్నప్పుడు మూడేళ్ల తర్వాతే ఎందుకు కేసు పెట్టారు? నెలరోజులుగా చంద్రబాబుపై వరుస కేసులు నమోదు చేస్తున్నారు ఇదీ చదవండి: అమ్మ చంద్రబాబూ.. ఇసుక స్కాంలో ఇంత జరిగిందా? 12:40 PM, Nov 22, 2023 ఇసుక స్కాం కేసు పిటిషన్ విచారణ లంచ్ తర్వాత ఇసుక స్కాం కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ వాదనలు వినిపించిన చంద్రబాబు తరఫు లాయర్లు విచారణ మధ్యాహ్నానికి వాయిదా వేసిన ఏపీ హైకోర్టు లంచ్ తర్వాత పిటిషన్పై వాదనలు విననున్న బెంచ్ 11:56 AM, Nov 22, 2023 హైకోర్టులో మధ్యాహ్నం మద్యం కేసు నేడు మద్యం కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పై విచారణ మధ్యాహ్నం 2.15 గంటలకు విచారించనున్న హైకోర్టు మద్యం కంపెనీలకు ఇష్టానుసారంగా అనుమతులు ఇచ్చారని అభియోగాలు చంద్రబాబు, కొల్లు రవీంద్ర ముందస్తు బెయిల్ పిటిషన్లపై విచారణ ఇవ్వాళ కోర్టులో సీఐడీ తరపు న్యాయవాది వాదనలు నిన్ననే చంద్రబాబు తరపున వాదనలు వినిపించిన న్యాయవాది నాగముత్తు 11:36 AM, Nov 22, 2023 బీటెక్ రవి కేసు విచారణ బీటెక్ రవి బెయిల్ పిటిషన్ పై కడప కోర్టులో విచారణ ఈ నెల 14న బీటెక్ రవిని అరెస్ట్ చేసిన వల్లూరు పోలీసులు 11:25 AM, Nov 22, 2023 ఇసుక కేసు అక్రమాలపై హైకోర్టులో విచారణ టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన ఇసుక కుంభకోణం ఉచిత ఇసుక కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్పై ఇవాళ హైకోర్టులో విచారణ 2014లో రాష్ట్ర విభజనకు ముందు రీచ్ల వారీగా వేలం పాటలు చంద్రబాబు వచ్చాక పలు మార్పులు తొలుత డ్వాక్రా మహిళా సంఘాలకు రీచ్లు అప్పగిస్తున్నామని ప్రకటన మహిళా సంఘాల ముసుగులో ఇసుకపై పూర్తి నియంత్రణ టీడీపీ నేతలదే మంత్రివర్గ ఆమోదం లేకుండానే ఇసుకపై చంద్రబాబు నిర్ణయాలు ఎమ్మెల్యేలు, మంత్రులు, పలుకుబడి ఉన్న టీడీపీ నేతల ఇష్టారాజ్యం చంద్రబాబు ఇంటికి కిలోమీటర్ దూరంలో ఉన్న కృష్ణా నదిలో కూడా భారీ ఎత్తున ఇసుక అక్రమ తవ్వకాలు ఏపీలో 2014-19 మధ్య జరిగిన ఇసుక అక్రమాలపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సీరియస్ చంద్రబాబు ప్రభుత్వానికి వంద కోట్ల రూపాయల జరిమానా విధించిన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇప్పుడు టీడీపీకి మద్దతు ఇస్తున్న న్యాయవాది శ్రవణ్ కుమార్ ఆ రోజుల్లో టీడీపీ ప్రభుత్వంపై ఫిర్యాదు కేవలం ఇసుకలోనే పదివేల కోట్ల దోపిడీ జరిగిందని ఎన్.జి.టి.కి ఫిర్యాదు CID నమోదు చేసిన కేసులో చంద్రబాబు మధ్యంతర, ముందస్తు బెయిల్ పై విచారణ ఇసుక అక్రమాల కేసులో ఏ2గా ఉన్న చంద్రబాబు APMDC ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన సీఐడీ 10:55 AM, Nov 22, 2023 స్కిల్ స్కాంలో ఇప్పటివరకు ఏం జరిగింది? టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన స్కిల్ స్కాం నిరుద్యోగులకు శిక్షణ పేరిట తెరపైకి ఓ ఒప్పందం జర్మనీ కేంద్రంగా ఉన్న ప్రఖ్యాత టెక్నాలజీ కంపెనీ సీమెన్స్తో ఒప్పందం అంటూ ప్రచారం సీమెన్స్ 90% ఇస్తుందని, తాము కేవలం 10% మాత్రమే చెల్లించాలని అప్పటి టిడిపి ప్రభుత్వం ప్రచారం ఆఘామేఘాల మీద 10% వాటా కింద రూ.371 కోట్లు మధ్యవర్తి కంపెనీలకు చెల్లింపు అధికారులు అంగీకరించకపోయినా బలవంతం చేసిన చంద్రబాబు, స్వయంగా 13 చోట్ల సంతకాలు, ఇదే విషయాన్ని ఫైళ్లలో రాసిన అధికారులు షెల్ కంపెనీల ద్వారా రూ 241 కోట్ల పక్కదారి విచారణలో అసలు తమకు ఒప్పందంతో సంబంధమే లేదని లిఖిత పూర్వకంగా తెలిపిన సీమెన్స్ పన్ను చెల్లించకపోవడంతో కుట్రను గమనించిన డైరెక్టరేట్ జనరల్ (GST ఇంటెలిజెన్స్) ఆధారాలు సేకరించి నాటి చంద్రబాబు ప్రభుత్వానికి కుంభకోణం జరిగిందని తెలిపిన GST విషయం బయటకు రావడంతో తేలు కుట్టిన దొంగలా చంద్రబాబు స్వయంగా దర్యాప్తు చేయడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసిన GST శాఖ నిధులన్నీ సూట్కేస్ కంపెనీల ద్వారా పక్కదారి పట్టాయని గుర్తించిన ఇన్కమ్టాక్స్ శాఖ కొల్లగొట్టిన సొమ్ములో రూ. 27 కోట్లు నేరుగా టీడీపీ బ్యాంకు ఖాతాకు చేరినట్టు బ్యాంకు స్టేట్మెంట్లను గుర్తించిన CID రికార్డులను ఏసీబీ కోర్టుకు సమర్పించిన సీఐడి ఈ కుంభకోణంపై జాతీయ దర్యాప్తు సంస్థ ఈడీ విచారణ చేపట్టి పలువురి అరెస్ట్ చంద్రబాబుపై 120(బి), 166, 167,418, 420, 465, 468, 201, 109, రెడ్ విత్ 34 and 37 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు సీఆర్పీసీ సెక్షన్ 50(1) కింద నోటీస్ ఇచ్చిన సీఐడీ 1988 ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్ చట్టం కింద సెప్టెంబర్ 9వ తేదీన నంద్యాలలో చంద్రబాబును అరెస్ట్ చేసిన సీఐడీ పోలీసులు సెప్టెంబర్ 10న రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలింపు ఐదు పర్యాయాలు జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు రిమాండ్ ఖైదీగా 7691 నెంబర్తో 52 రోజులపాటు చంద్రబాబు కంటికి శస్త్ర చికిత్స అభ్యర్థన మేరకు మానవతా దృక్ఫథంతో అక్టోబర్ 31వ తేదీన నాలుగు వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు నవంబర్ 20న రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు 09:39 AM, Nov 22, 2023 బాబు, కొల్లు రవీంద్ర ముందస్తు బెయిల్ పిటిషన్పై ఇవాళ హైకోర్టులో విచారణ లిక్కర్ స్కాంలో చంద్రబాబు, కొల్లు రవీంద్ర ముందస్తు బెయిల్ పిటిషన్ బాబు, కొల్లు రవీంద్ర ముందస్తు బెయిల్ పిటిషన్పై ఇవాళ హైకోర్టులో విచారణ ఇసుక స్కాంలో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ బాబు ముందస్తు బెయిల్ పిటిషన్పై ఇవాళ హైకోర్టులో విచారణ 09:10 AM, Nov 22, 2023 బాబుకు శిక్ష తప్పదు: ఎంపీ మోపిదేవి వెంకటరమణ అధికారంలో ఉండగా రాష్టాన్ని నిలువు దోపిడీ చేశాడు పలు అవినీతి కేసుల్లో అడ్డంగా దొరికిపోయి.. బెయిల్పై బయటకొచ్చిన చంద్రబాబుకు జైలుశిక్ష పడడం తథ్యం లేని వ్యాధులు తెచ్చుకుని చంద్రబాబు బెయిల్ తెచ్చుకున్నాడు ఈ విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు వ్యవస్థలను మేనేజ్ చేయడం, ఉన్నదాన్ని లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా చెప్పడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య 08:14 AM, Nov 22, 2023 జైలు ఎపిసోడ్ నేర్పిన పాఠాలేంటీ? చంద్రబాబుకు ఎన్నో విషయాలపై స్పష్టత ఇచ్చిన జైలు జీవితం పార్టీలో ద్వితీయ శ్రేణి నాయకత్వం విషయంలో ఉన్నదంతా డొల్లే ఎన్టీఆర్కు చంద్రబాబు ఉన్నట్టు, చంద్రబాబుకు మరొకరు లేరన్న విషయంపై స్పష్టత లోకేష్పై, చినబాబు నాయకత్వంపై ఇప్పటివరకు పెట్టుకున్నవన్ని భ్రమలే పార్టీలో ఉన్న సీనియర్ల వల్ల ఫలితం శూన్యం అచ్చెన్న, యనమల, గోరంట్ల, సోమిరెడ్డి, పయ్యావుల, కోట్ల.. పేరుకే సీనియర్లు కష్టకాలంలో ఏ సీనియర్ కూడా పార్టీని నడిపించే సత్తా లేదని సుస్పష్టం పార్టీ సీనియర్లలో కొరవడిన సబ్జెక్ట్ నాలెడ్జ్ పవన్ కళ్యాణ్ను నమ్ముకోవడం పార్టీ దౌర్భాగ్యం అని తేలినా.. ఏమి చేయలేని వైనం పార్టీ ఆందోళన కార్యక్రమాల్లో ఎవరూ రుపాయి ఖర్చు పెట్టలేదని క్లారిటీ మీడియాలో కనిపించే మై"కింగ్"లు వేరు, క్షేత్రస్థాయిలో పని చేసే వారు వేరు అన్నదానిపై స్పష్టత కిం.. కర్తవ్యం.? ఏం చేస్తే పార్టీ పట్టాలెక్కుతుంది? చంద్రబాబు మంత్రాంగాలు 07:36 AM, Nov 22, 2023 ‘మద్యం’ కేసులో బాబు ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ నేటికి వాయిదా వాదనలు వినిపించిన చంద్రబాబు, కొల్లు రవీంద్ర న్యాయవాదులు శాసన సభ ఆమోదంతోనే ప్రివిలేజ్ ఫీజు తొలగించినట్లు తెలిపిన బాబు గవర్నర్ సైతం ఆమోదముద్ర వేశారని వెల్లడి సీఐడీ వాదనల నిమిత్తం విచారణ నేటికి వాయిదా 07:02 AM, Nov 22, 2023 చంద్రబాబు ముఠాకు ఎదురుదెబ్బ ఫైబర్నెట్ కేసులో నిందితుల ఆస్తుల అటాచ్మెంట్ ఏడు స్థిరాస్తుల అటాచ్మెంట్కు న్యాయస్థానం అనుమతి ఈ కేసులో నిందితులుగా ఉన్నచంద్రబాబు సన్నిహితుల ఆస్తుల అటాచ్మెంట్కు ఏసీబీ న్యాయస్థానం అనుమతి సీఐడీ దాఖలు చేసిన అటాచ్మెంట్ పిటిషన్ను ఆమోదిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు ఫైబర్నెట్ కేసులో చంద్రబాబు సహా పలువురిపై సీఐడీ కేసు నమోదు ఇందులో చంద్రబాబు ఏ–25, ఏ–1 వేమూరి హరికృష్ణకు చెందిన టెరాసాఫ్ట్ కంపెనీ, ఏ–13 టెరాసాఫ్ట్ కంపెనీ ఎండీ తుమ్మల గోపీచంద్ 07:01 AM, Nov 22, 2023 నారా చంద్రబాబు నాయుడు.. ఏ కేసు.? స్టేటస్ ఏంటీ? కేసు : స్కిల్ స్కాం @ హైకోర్టు స్టేటస్ : నవంబర్ 20న బెయిల్ ఇచ్చిన హైకోర్టు వివరణ : నవంబర్ 28వరకు చంద్రబాబుపై ఆంక్షలు, చికిత్స చేయించుకున్న వివరాలు సమర్పించాలని ఆదేశం కేసు : స్కిల్ స్కాం @ సుప్రీంకోర్టు అంశం : క్వాష్ పిటిషన్ స్టేటస్ : సుప్రీంకోర్టులో పెండింగ్ వివరణ : ఈ నెలాఖరుకు తీర్పు వచ్చే అవకాశం కేసు : ఇసుక కుంభకోణం @ హైకోర్టు అంశం : ముందస్తు బెయిల్ పిటిషన్ స్టేటస్ : హైకోర్టులో జరుగుతున్న విచారణ వివరణ : నవంబర్ 22కి తదుపరి విచారణ వాయిదా కేసు : ఫైబర్ నెట్ పేరిట నిధుల దోపిడి అంశం : ముందస్తు బెయిల్ పిటిషన్ స్టేటస్ : సుప్రీంకోర్టులో పెండింగ్ వివరణ : నవంబర్ 30కి తదుపరి విచారణ వాయిదా కేసు : అంగళ్లులో అల్లర్లు రెచ్చగొట్టిన కేసు అంశం : ముందస్తు బెయిల్ పిటిషన్ స్టేటస్ : మంజూరు చేసిన హైకోర్టు వివరణ : ఏ1గా ఉన్న చంద్రబాబు, మరో 170 మంది ఇతర నిందితులు కేసు : ఇన్నర్ రింగ్ రోడ్డులో అక్రమాల కేసు అంశం : ముందస్తు బెయిల్ పిటిషన్ స్టేటస్ : హైకోర్టులో జరుగుతున్న విచారణ వివరణ : నవంబర్ 22కి వాయిదా పడ్డ కేసు కేసు : మద్యం విధానాల్లో అక్రమాలకు పాల్పడి నిధులు కొట్టేసిన కేసు అంశం : ముందస్తు బెయిల్ పిటిషన్ స్టేటస్ : హైకోర్టులో జరుగుతున్న విచారణ వివరణ : నవంబర్ 24కి వాయిదా పడ్డ విచారణ 06:59 AM, Nov 22, 2023 హైకోర్టు తీర్పును రద్దు చేయండి చంద్రబాబుకు బెయిల్ విషయంలో పరిధి దాటింది సుప్రీంకోర్టులో ఎస్సెల్పీ దాఖలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు నిర్దేశించిన కొలమానాలను హైకోర్టు అతిక్రమించింది కేసు లోతుల్లోకి వెళ్లి క్లీన్ చిట్ ఇచ్చే ప్రయత్నం చేసింది ట్రయల్ కోర్టును ప్రభావితం చేసేలా ఆ తీర్పు ఉంది మినీ ట్రయల్ నిర్వహణ.. 39 పేజీల తీర్పే ఇందుకు నిదర్శనం దుర్వినియోగం చేసిన నిధులు టీడీపీ ఖాతాల్లోకి వెళ్లాయి అందుకు పూర్తి ఆధారాలున్నా ఏ మాత్రం పట్టించుకోలేదు చంద్రబాబుకు రాజకీయ పలుకుబడి ఉంది.. సాక్షులను బెదిరించడం ద్వారా దర్యాప్తును ప్రభావితం చేస్తారు హైకోర్టు తేల్చిన అంశాలు వాస్తవ విరుద్ధం -
ఆస్తులను అటాచ్మెంట్ చేయాలన్న సీఐడి ప్రతిపాదనకు హోంశాఖ ఆమోదం
-
సీఐడీ కోరిన సమాచారాన్ని ఇప్పటివరకు టీడీపీ ఇవ్వలేదు: ప్రభుత్వం
-
ఫైబర్ గ్రిడ్ స్కాంలో నిందితుల ఆస్తుల అటాచ్ మెంట్ కోరుతూ సీఐడీ పిటిషన్
-
స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ రేపటికి వాయిదా
-
స్కిల్ స్కామ్ కేసులో వెలుగు చూసిన మరిన్ని వాస్తవాలు
-
చంద్రబాబు మధ్యంతర బెయిల్ షరతులు పెంచాలంటూ సీఐడీ పిటిషన్
-
ఇసుక దందాపై కొరడా
ఎంత ఇసుక అందుబాటులో ఉంది.. ఎంత ఇసుక తవ్వుతున్నాం.. ఎంతకు అమ్ముతున్నాం.. అనే సమాచారం ఏదీ రికార్డుల్లో చూపించాల్సిన అవసరం లేకుండా నాడు సీఎంగా ఉన్న చంద్రబాబు భారీ దోపిడీకి స్కెచ్ వేశారు. ఇందులో భాగంగా తెరపైకి తీసుకువచ్చిందే ‘ఉచిత ఇసుక విధానం’. రాష్ట్రంలో ఇసుక తవ్వకాలు ఉచితం అని భ్రమ కల్పించారు. కానీ వాస్తవంగా జరిగింది వేరు. ఈ విధానం ముసుగులో రాష్ట్రంలో ఇసుక రీచ్లు అన్నింటినీ చంద్ర బాబు తనతోపాటు మంత్రివర్గ సభ్యులు, టీడీపీ ఎమ్మెల్యేల ఆధీనంలోకి తీసుకొచ్చారు. తద్వారా వారి దోపిడీకి అంతేలేకుండా పోయింది. తక్కువలో తక్కువ బాబు అండ్ కో రూ.10 వేల కోట్లు కొల్లగొట్టింది. సాక్షి, అమరావతి: టీడీపీ ప్రభుత్వ హయాంలో యథేచ్ఛగా సాగిన ఇసుక దోపిడీపై సీఐడీ కొరఢా ఝళిపించింది. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు కర్త, కర్మ, క్రియగా వ్యవహరించి, సాగించిన ఇసుక కుంభకోణంపై కేసు నమోదు చేసింది. ‘ఉచిత ఇసుక విధానం’ ముసుగులో పచ్చ ముఠా బరితెగించి సాగించిన ఇసుక దోపిడీ గుట్టు రట్టు చేసింది. కేంద్ర ప్రభుత్వ చట్టం, గ్రీన్ ట్రిబ్యునల్ విధివిధానాలను ఉల్లంఘించి, కేబినెట్ ఆమోదం కూడా లేకుండా ‘ప్రత్యేక మెమో’ ద్వారా చంద్రబాబు పన్నిన పన్నాగం ఆధారాలతోసహా బట్టబయలు అయ్యింది. 2016 నుంచి 2019 వరకు ప్రభుత్వ ఖజానాకు రూ.వెయ్యి కోట్ల ఆదాయానికి గండి కొట్టడమే కాక, చంద్రబాబు ముఠా ఏకంగా రూ.10 వేల కోట్ల విలువైన ఇసుక దోపిడీకి పాల్పడిందన్నది విభ్రాంతి పరుస్తోంది. ఈ మేరకు రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) డైరెక్టర్ వీజీ వెంకటరెడ్డి ఫిర్యాదుతో సీఐడీ కేసు నమోదు చేసింది. ఏ–1గా పీతల సుజాత (టీడీపీ ప్రభుత్వంలో గనుల శాఖ మంత్రి), ఏ–2గా చంద్రబాబు (అప్పటి ముఖ్యమంత్రి), ఏ–3గా చింతమనేని ప్రభాకర్ (టీడీపీ మాజీ ఎమ్మెల్యే), ఏ–4గా దేవినేని ఉమామహేశ్వరరావు (టీడీపీ ప్రభుత్వంలో జల వనరుల శాఖ మంత్రి)తోపాటు మరికొందరిని ఏ–5గా పేర్కొంటూ ఎఫ్ఐఆర్ నమోదు చేసిన విషయాన్ని విజయవాడలోని ఏసీబీ న్యాయస్థానానికి తెలుపుతూ గురువారం పిటిషన్ దాఖలు చేసింది. వీరిపై ఐపీసీ సెక్షన్లు 120 బి, 409 రెడ్ విత్ 34, అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 13 (1) (డి) రెడ్విత్ 13 (2) ప్రకారం అభియోగం నమోదు చేశారు. అంతులేని బాబు ధన దాహం పదేళ్ల తర్వాత 2014లో రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు యథేచ్ఛగా అవినీతికి బరితెగించారు. ఆ క్రమంలో ఆయన కన్ను రాష్ట్రంలో ఇసుక రీచ్లపై పడింది. యథేచ్ఛగా ఇసుక దోపిడీకి పాల్పడాలని పన్నాగం రచించారు. అందుకోసం 2014 నుంచి 2016 వరకు ఓ విధానాన్ని తీసుకువచ్చి, అడ్డూ అదుపు లేకుండా అక్రమంగా ఇసుక తవ్వకాలకు పాల్పడ్డారు. అంతటితో ఆయన ధన దాహం తీరలేదు. దాంతో మరింతగా బరితెగించి ఇసుక దోపిడీ సాగించేలా వ్యూహం పన్నారు. అందుకోసం ప్రభుత్వ ఇసుక విధానాన్ని పునఃసమీక్షించాలని కేబినెట్ సబ్ కమిటీని నియమించారు. అనంతరం కొత్త ఇసుక విధానాన్ని నిర్ణయిస్తూ 2016 జనవరి 15న రెండు జీవోలు (జీవో నంబర్లు 19, 20) జారీ చేశారు. అయినప్పటికీ చంద్రబాబు ఇసుక దాహం తీరలేదు. బరితెగించి ఇసుక దోపిడీకి పాల్పడేందుకు మరో విధానాన్ని తీసుకురావాలని చంద్రబాబు భావించారు. ‘ఇసుకను ప్రభుత్వం అమ్మదు.. ఇసుక తవ్వకాలకు ఎలాంటి అనుమతులు అవసరం లేదు.. ఎవరికి వారు ఇసుక రీచ్లకు వెళ్లి ఇసుక తవ్వుకోవచ్చు.. అమ్ముకోవచ్చు.. ప్రభుత్వం ఎలాంటి నిబంధనలుగానీ, ఆంక్షలు గానీ విధించదు’ అని చెప్పారు. ఈ మేరకు 2016 మార్చి 4న ఉచిత ఇసుక విధానాన్ని తీసుకొచ్చి దొరికిన చోట దొరికినట్లు దోచుకున్నారు. ఇసుక రీచ్లు అన్నింటినీ చంద్రబాబు తన చేతిలోకి, మంత్రివర్గ సభ్యులు, టీడీపీ ఎమ్మెల్యేల ఆధీనంలోకి తీసుకువచ్చారు. మెమో 3066తో కనికట్టు ► ‘ఉచిత ఇసుక విధానం’ ముసుగులో గత ప్రభుత్వ పెద్దలు మాయాజాలం చేసి, భారీ అవినీతికి పాల్పడ్డారు. కొత్త ఇసుక విధానాన్ని తీసుకువస్తూ టీడీపీ ప్రభుత్వం 2016 మార్చి 4న ప్రత్యేకంగా ‘మెమో నంబరు 3066’ను జారీ చేసింది. దీని ద్వారా రాష్ట్రంలోని ఇసుక రీచ్లన్నీ చంద్రబాబు, ఆయన మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు హస్తగతం చేసుకున్నారు. ► రాష్ట్రంలో సహజ వనరులకు సంబంధించి, అందులో రాష్ట్ర ఖజానాకు కీలకమైన ఆర్థిక వనరుకు సంబంధించి కేబినెట్ ఆమోదం లేకుండా కేవలం ఒక మెమో ద్వారా కథ నడిపించడం చంద్రబాబు అవినీతికి పరాకాష్టగా నిలిచింది. ఈ మెమో ద్వారా 2016 నుంచి 2019 వరకు అడ్డూ అదుపు లేకుండా ఇసుకను కొల్లగొట్టారు. జిల్లాల వారీగా ఇసుక రీచ్లలో ఎవరెవరు తవ్వుకోవాలో చంద్రబాబు స్వయంగా తన బినామీలు, సన్నిహితులు, టీడీపీ ఎమ్మెల్యేలకు అప్పగించారు. ► అప్పటి వరకు కూలీలతో ఇసుక తవ్వకాలు సాగుతుండగా.. ఒక్కసారిగా భారీ యంత్రాలను ఇసుక తవ్వకాల కోసం తీసుకువచ్చారు. ఇతరులు ఎవరూ ఆ ఇసుక రీచ్ల వైపు కన్నెత్తి కూడా చూడకుండా కట్టడి చేశారు. చంద్రబాబు ముఠా రోజూ వేల లారీల్లో లక్షల టన్నుల ఇసుకను తవ్వేసి.. అమ్ముకోసాగింది. రాష్ట్రంలో నదుల్లో అందుబాటులో ఉన్న ఇసుక ఎంత.. రోజుకు ఎంత ఇసుక తవ్వుతున్నారు.. ఎంతకు అమ్ముతున్నారు.. ఎన్ని వేల లారీల ఇసుక రోజూ రాష్ట్రం దాటుతోందన్న లెక్కలకు అంతూపొంతూ లేకుండా పోయింది. ► శ్రీకాకుళం జిల్లా నుంచి అనంతపురం జిల్లా వరకు అంతటా యథేచ్ఛగా ఇసుక దోపిడీకి పాల్పడ్డారు. ఇసుకదోపిడీ కుట్రకు చంద్రబాబు సూత్రధారి కాగా, ఈ కుట్రలో అప్పటి గనుల శాఖ మంత్రి పీతల సుజాత, నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్తోపాటు మరికొందరు ప్రధాన పాత్రధారులుగా వ్యవహరించారు. ► అక్రమ ఇసుక తవ్వకాలను ప్రశ్నించినందుకు తహశీల్దార్ వనజాక్షిని టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ జుట్టు పట్టుకుని మరీ దాడికి పాల్పడటం అప్పట్లో తీవ్రంగా చర్చనీయాంశమైంది. ఇది పచ్చ ముఠాల బరితెగింపునకు నిదర్శనం. అంతగా తహశీల్దార్పై దాడికి పాల్పడిన తన ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ను అప్పటి సీఎం చంద్రబాబు సమర్థించడం విస్మయ పరిచింది. తమ ఇసుక దోపిడీకి అడ్డు వస్తే ఎవరికైనా అదే గతి పడుతుందని స్పష్టమైన సందేశం ఇచ్చేందుకే చంద్రబాబు అలా వ్యవహరించారు. టీడీపీ పెద్దల జేబులోకి రూ.10 వేల కోట్లు 2016 నుంచి 2019 వరకు టీడీపీ ప్రభుత్వ పెద్దలు సాగించిన ఇసుక దోపిడీ విలువ ఎంతన్నది నిగ్గు తేల్చడం గనుల శాఖ అధికారులకే అంతుపట్టడం లేదు. గ్రీన్ ట్రిబ్యునల్ మార్గదర్శకాల ప్రకారం ఇసుక తవ్వకాల ద్వారా ఖజానాకు నాలుగు రకాల ఆదాయం రావాలి. సీనరేజీ, కన్సిడరేషన్ చార్జీలు, డిస్ట్రిక్ట్ మైన్స్ ఫండ్, మెరిట్ ఫీజు చెల్లించాలి. 2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రీన్ ట్రిబ్యునల్మార్గదర్శకాలను పాటిస్తూ కొత్త ఇసుక విధానాన్ని తీసుకువచ్చింది. ఆ ప్రకారం 2020 నుంచి 2022 వరకు రాష్ట్ర ఖజానాకు రూ.766 కోట్ల ఆదాయం వచ్చింది. ఆ ప్రకారం టీడీపీ ప్రభుత్వ హయాంలో 2016 నుంచి 2019 వరకు కనీసం రూ.వెయ్యి కోట్ల ఆదాయం రాష్ట్ర ఖజానాకు రావల్సి ఉంటుందని గనుల శాఖ అంచనా వేసింది. అంటే చంద్రబాబు ‘ఉచిత ఇసుక’ అనే మోసపూరిత విధానంతో ప్రభుత్వ ఖజానాకు రూ.వెయ్యి కోట్ల గండిపడింది. ఇక రాష్ట్రంలో యథేచ్ఛగా తవ్విన ఇసుక ఎంతన్న అంచనాలు చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే. 2016 నుంచి 2019 వరకు చంద్రబాబు ముఠా రాష్ట్రంలో దాదాపు రూ.10 వేల కోట్ల విలువైన ఇసుకను తవ్వి అమ్మేసుకుందన్నది విస్మయం కలిగిస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో పక్కా ఆధారాలతో సీఐడీ కేసు నమోదు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో సీఐడీ తదుపరి చర్యలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. నిర్భీతిగా నిబంధనలు బేఖాతరు వేల కోట్ల రూపాయల ఇసుక దందా కోసం చంద్రబాబు అన్ని నిబంధనలను నిర్భీతిగా ఉల్లంఘించారు. కేవలం ఒక ‘మెమో’తో ఇసుక దోపిడీకి పాల్పడటం ఆయన కుతంత్రానికి నిదర్శనం. కేంద్ర ప్రభుత్వ చట్టానికి లోబడే రాష్ట్రాల్లో ఇసుక తవ్వకాల కోసం విధానాలు రూపొందించాలి. ఆ మేరకు జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలి. దాంతోపాటు మరో రెండు విధానాలు అందుబాటులో ఉన్నాయి. మొత్తంగా ఈ మూడింటిలో ఏదైనా ఒకటి కచ్చితంగా పాటించాలి. ► ఇసుక తవ్వకాల కోసం జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ రూపొందించిన బిజినెస్ రూల్స్ (మార్గదర్శకాలు) అనుసరించాలి. ► అంతకంటే మెరుగైన విధానం రూపొందించామని రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తే ఆమేరకు ఆర్థిక శాఖ ఆమోదం పొందాలి. ► ఓ విధానాన్ని రూపొందించి అందుకు కేబినెట్ ఆమోదం పొందాలి. కానీ చంద్రబాబు ప్రభుత్వం మోసపూరితంగా తీసుకువచ్చిన ‘ఇసుక విధానం’ కోసం ఈ మూడు విధానాల్లో ఏ ఒక్కటీ పాటించ లేదు. అంటే జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ మార్గదర్శకాలను పాటించ లేదు. కొత్త విధానం కోసం ఆర్థిక శాఖ ఆమోదం తీసుకోలేదు. అప్పటి కేబినెట్లో కూడా బిల్లు ప్రవేశపెట్టి చర్చించి ఆమోదించ లేదు. -
చంద్రబాబు హయాంలో ఇసుక అక్రమాలపై ఏపీ సీఐడీ విచారణ
-
చంద్రబాబుకు బిగ్ షాక్..ఆస్తులు అటాచ్ మెంట్
-
సీఐడీ కీలక నిర్ణయం..చంద్రబాబు సన్నిహితుల ఆస్తులు జప్తు..
-
ఫైబర్ నెట్ కేసులో వేగం పెంచిన సీఐడీ
-
ఫైబర్నెట్ కేసులో వేగం పెంచిన సీఐడీ
సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో జరిగిన ఫైబర్నెట్ కుంభకోణం కేసు దర్యాప్తులో సీఐడీ వేగం పెంచింది. నిబంధనలకు విరుద్ధంగా టెరాసాఫ్ట్ కంపెనీకి ఫైబర్ నెట్ టెండర్లను కట్టబెట్టిన ఆ కేసులో తదుపరి చర్యలకు ఉపక్రమించింది. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సన్నిహితుడు వేమూరి హరికృష్ణకు చెందిన టెరాసాఫ్ట్ కంపెనీతోపాటు ఈ కేసులో కీలకపాత్ర పోషించిన చంద్రబాబు సన్నిహితుల ఆస్తులను అటాచ్ చేయాలని నిర్ణయించింది. టెరాసాఫ్ట్ కంపెనీ, చంద్రబాబు సన్నిహితులకు చెందిన ఏడు స్థిరాస్తులను అటాచ్ చేయాలన్న సీఐడీ ప్రతిపాదనకు రాష్ట్ర హోంశాఖ ఆమోదిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అటాచ్ ఆస్తుల్లో గుంటూరులో ఇంటి స్థలం, విశాఖపట్నంలో ఓ ఫ్లాట్, హైదరాబాద్లోని నాలుగు ఫ్లాట్లు, తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో వ్యవసాయ భూమి ఉన్నాయి. హోంశాఖ ఉత్తర్వుల నేపథ్యంలో ఆ స్థిరాస్తుల అటాచ్మెంట్కు అనుమతించాలని కోరుతూ సీఐడీ విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో పిటిషన్ను దాఖలు చేయనుంది. కోర్టు అనుమతి అనంతరం ఆ ఆస్తుల అటాచ్మెంట్ ప్రక్రియను చేపడుతుంది. రూ. 330 కోట్లతో చేపట్టిన ఫైబర్నెట్ మొదటి దశ ప్రాజెక్ట్ కాంట్రాక్టును టెరాసాఫ్ట్ కంపెనీకి చంద్రబాబు అడ్డగోలుగా కట్టబెట్టేసిన విషయం తెలిసిందే. బ్లాక్ లిస్టులో ఉన్న ఆ కంపెనీపై నిషేధం తొలగించి ఏకపక్షంగా టెండరు ఖరారు చేశారు. ఏపీ గవర్నింగ్ కౌన్సిల్లో సభ్యుడిగా ఉన్న వేమూరి హరికృష్ణను ఈ టెండర్ల మదింపు కమిటీలో సభ్యుడిగా నియమించారు. ఆయనకు చెందిన టెరాసాఫ్ట్ కంపెనీయే టెండర్లలో పాల్గొంది. అంటే పరస్పర ప్రయోజనాల నిరోధక చట్టాన్ని ఉల్లంఘించి మరీ కథ నడిపించారు. ఈ వ్యవహారంలో రూ. 144.53 కోట్లు ముడుపుల రూపంలో కొల్లగొట్టినట్టు సీఐడీ దర్యాప్తులో వెల్లడైంది. ఫైబర్నెట్ కేసులో అటాచ్కు నిర్ణయించిన ఆస్తులు – ఈ కేసులో నిందితుడు కనుమూరి కోటేశ్వరరావు పేరిట గుంటూరులో ఉన్న 797 చ.అడుగుల విస్తీర్ణం గల ఇంటి స్థలం – నిందితుడు కనుమూరి కోటేశ్వరరావు డైరెక్టర్గా ఉన్న నెప్టాప్స్ ఫైబర్ సొల్యూషన్స్కు చెందిన విశాఖపట్నం కిర్లంపూడి లేఅవుట్లోని ఓ ఫ్లాట్ – టెరాసాఫ్ట్ కంపెనీ ఎండీ టి.గోపీచంద్ పేరిట హైదరాబాద్ జూబ్లీహిల్స్లో ఉన్న ఫ్లాట్ – టెరాసాఫ్ట్ కంపెనీ ఎండీ టి.గోపీచంద్ పేరిట హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలో ఉన్న ఫ్లాట్ – టెరాసాఫ్ట్ కంపెనీ ఎండీ టి.గోపీచంద్ పేరిట హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలో ఉన్న మరో ఫ్లాట్ – ఈ కేసులో నిందితుడు తుమ్మల గోపీచంద్ పేరిట హైదరాబాద్ యూసఫ్గూడలో ఉన్న ఫ్లాట్ – తుమ్మల గోపీచంద్ భార్య పవనదేవి పేరిట తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లో ఉన్న వ్యవసాయ భూమి -
షరతులను ఉల్లంఘించిన బాబు.. వీడియోలను కోర్టుకు ఇచ్చిన సీఐడీ న్యాయవాదులు!
-
నవంబర్ 28 సాయంత్రం 5 లోపు లొంగిపోవాలి.. లేదంటే..
-
సీఐడీ అధికారుల కేసుపై లంచ్ మోషన్ పిటిషన్
-
షరతులు ఉల్లంఘిస్తే బెయిల్ రద్దవుతుంది: న్యాయవాదులు
-
కంటి సర్జరీ కోసం మాత్రమే చంద్రబాబుకు మధ్యంతర బెయిల్: న్యాయవాది
-
టీడీపీ అడ్డగోలు మద్యం వ్యవహారంపై మరో కేసు
-
చంద్రబాబుపై మరో కేసు నమోదు చేసిన సీఐడీ
-
నారా వారి లిక్కరు స్కాం
సాక్షి, అమరావతి: టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడిని కేసులు వెంటాడుతున్నాయి. తాజాగా ఆయనపై సీఐడీ మరో కేసు నమోదు చేసింది. గత ప్రభుత్వ హయాంలో చోటుచేసుకున్న మద్యం కుంభకోణానికి సంబంధించి నమోదైన ఈ ఎఫ్ఐఆర్లో ఏ–3గా చంద్రబాబు పేరును చేర్చింది. ఈ మేరకు ఏసీబీ కోర్టులో పిటిషన్ను కూడా వేసింది. న్యాయస్థానం కూడా విచారణకు అనుమతించింది. ఐపీసీ, ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్ (పీసీ) యాక్ట్–1988ల ప్రకారం 166, 167, 409, 120 (బి), రెడ్విత్ 34, 13(1)(డి), రెడ్ విత్ 13(2) సెక్షన్లతో సీఐడీ ఆయనపై ఈ కేసు నమోదు చేసింది. ఇందులో ఏ–1గా అప్పటి ఎక్సైజ్ కమిషనర్ ఐఎస్ శ్రీనరేష్, ఏ–2గా నాటి ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్రపై కూడా ఎఫ్ఐఆర్ నమోదైంది. డిస్టిలరీస్, బేవరేజెస్ కమిషనర్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ డి. వాసుదేవ రెడ్డి ఫిర్యాదు మేరకు వీరిపై కేసు నమోదైంది. అయినవారి కోసం అడ్డదారులు..: నంద్యాల మాజీ ఎంపీ ఎస్పీవై రెడ్డికి చెందిన ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్కి, మాజీమంత్రి అయ్యన్నపాత్రుడుకి చెందిన విశాఖ డిస్టిలరీకి, మాజీమంత్రి యనమల రామకృష్ణుడు వియ్యంకుడు పుట్టా సుధాకర్ యాదవ్కి చెందిన పీఎంకే డిస్టిలరీకి అప్పట్లో అడ్డగోలుగా మేలు చేకూర్చడానికి చంద్రబాబు ప్రభుత్వం అడ్డదారులు తొక్కింది. ఇందుకోసం ఏకంగా 2012 ఎక్సైజ్ పాలసీని మార్చేసింది. 2012 నుంచి 2015 వరకు ప్రభుత్వానికి రూ.2,984 కోట్లు పన్నులు రాగా, 2015లో కొత్త పాలసీ తీసుకువచ్చి ప్రభుత్వానికి ఈ పన్నులు రాకుండా చేసింది. టర్నోవర్పై 8 శాతం వ్యాట్తో పాటు అదనంగా 6 శాతం పన్నులను తీసేసింది. 6 నుంచి 10 శాతానికి పన్నులు పెంచాలని త్రిసభ్య కమిటీ చేసిన సిఫార్సులనూ బేఖాతరు చేసింది. ఈ విధంగా రెండు బేవరేజ్లు, మూడు డిస్టిలరీలకు లబ్ధిచేకూర్చడానికి చంద్రబాబు ప్రభుత్వం క్విడ్ ప్రో కోకి పాల్పడినట్లు సీఐడీ తన ఎఫ్ఐఆర్లో వెల్లడించింది. టీడీపీ ప్రభుత్వంలో జరిగిన ఈ కుంభకోణం ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఏటా రూ.1,300 కోట్ల నష్టం వాటిల్లుతోందని కోర్టుకు వివరించింది. కొన్ని డిస్టిలరీలకు అనుకూలంగా నిర్ణయాలు.. నిజానికి.. ఎక్సైజ్ పాలసీ సమస్యలు, ఆదాయ వివరాలను ప్రభుత్వానికి సూచించడానికి గత ఫైళ్లను తిరగేయడంతో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. రాష్ట్రానికి ఆదాయాన్ని తగ్గించి, లైసెన్సులకు ప్రయోజనం చేకూర్చేలా క్రిడ్ ప్రో కో జరిగినట్లు అధికారులు గుర్తించారు. అంతటితో ఆగక.. అందుకు సంబంధించిన వాస్తవాలపై లోతుగా అధ్యయనం చేశారు. అలాగే, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన కమిటీ సిఫార్సులకు విరుద్ధంగా, ఎల్ఓఐ ఇవ్వడం ద్వారా కొన్ని డిస్టిలరీలకు అనుకూలంగా వ్యవహరించినట్లు గుర్తించారు. డీటీ నోటిఫికేషన్ తర్వాత కొత్త బ్రాండ్లను అనుమతించారని అధికారులు తెలుసుకున్నారు. సరఫరాదారులు కుట్రపూరితంగా, లైసెన్స్లతో కుమ్మక్కై, కొన్ని ఉత్పత్తులకు మార్కెట్లో డిమాండ్ లేకపోయినా కృత్రిమంగా డిమాండ్ పెంచారు. తద్వారా కార్పొరేషన్కు తప్పుడు అంచనాలు ఇచ్చారు. అలాగే, 2015–2019 కాలానికి సంబంధించిన వాస్తవ డిమాండ్, సరఫరాల డేటా, పరిమాణాల వెరిఫికేషన్ కోసం ఎలాంటి యంత్రాంగం లేదు. 2019 ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కొన్ని కంపెనీలకు ప్రాధాన్యత ఇస్తూ, వారి ఉత్పత్తులకు, వారి మార్కెట్ వాటాకు అనుకూలంగా హడావిడిగా ఆర్డర్లు ఇచ్చేశారు. అంతేకాక.. అవసరానికి మించి లిక్కర్ కంపెనీలకు నిబంధనలకు విరుద్ధంగా అనుమతులిచ్చి కొందరి నుంచే 70 శాతం బ్రాండ్లు కొనుగోలు చేశారు. పక్కా ప్లాన్తో, కొందరు అధికారుల సహకారంలో కొన్ని సంస్థలకు చట్టవిరుద్ధంగా ఆర్థిక ప్రయోజన చేకూర్చినట్లు స్పష్టమైంది. అకౌంటెంట్ జనరల్ (ఆడిట్) ఉల్లంఘన ఫలితంగా ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లిందనే విషయం తేటతెల్లమైంది. దీంతో తగిన ఆధారాలతో కేసు నమోదు చేసినట్లు సీఐడీ వివరించింది. కేబినెట్ ఆమోదం లేకుండా నచ్చినట్లు పాలసీ..: 2015–2017 ఎక్సైజ్ సంవత్సరాలకు సంబంధించి నిర్ణయం తీసుకోవడానికి ముందు, కొనుగోళ్ల వార్షిక లైసెన్సు రుసుం కంటే పది రెట్లు మించి ఉంటే మాత్రమే ప్రివిలేజ్ రుసుం విధించే థ్రెషోల్డ్ టెండర్ పరిమితిని పెంచాలని మొదట ప్రతిపాదించారు. కానీ, అది అమల్లోకి రాలేదు. తెలంగాణలో అమలులో ఉన్న ఈ ఫీజులు ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం తొలగించింది. షాపుల కోసం పాలసీని కూడా తమకు నచ్చినట్లు ఎటువంటి చర్చలు లేకుండా, ఆర్థిక చిక్కుల గురించి ఆలోచించకుండా కేబినెట్ ఆమోదం కూడా లేకుండా ఖరారు చేసేశారు. ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్కు అనుకూలంగా నిర్ణయాలు.. ఇక ఎస్పీవై రెడ్డికి చెందిన ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్కు చంద్రబాబు ప్రభుత్వం భారీగా లబ్ధిచేకూర్చింది. వాయిదా పద్ధతిలో లైసెన్స్ ఫీజు చెల్లించడానికి అనుమతించింది. ఈ ఫీజులో బకాయిలపై వడ్డీని కేవలం 18 శాతం (రూ.15 కోట్లు) మాత్రమే వసూలుచేయడానికి అనుమతించింది. హైకోర్టు తీర్పునకు విరుద్ధంగా, లైసెన్స్ ఫీజు బకాయిలపై అంతకుముందు కాలానికి చెల్లించాల్సిన వడ్డీని కూడా సడలించింది. నిజానికి ఇలా వడ్డీని వదిలేయడానికి, పరోక్షంగా మాఫీ చేయడానికి, తర్వాత చెల్లించేలా అనుమతించడానికి నిబంధనలు అంగీకరించవు. డిస్టిలరీ మంజూరుకు అనుమతి.. ఇక 2014 నవంబర్లో జీఓ నెంబర్ 993 ప్రకారం.. రెవెన్యూ (ఎక్సైజ్–2) డిపార్ట్మెంట్ ఏర్పాటుచేసిన కమిటీ సిఫార్సులకు విరుద్ధంగా, కమిటీ సూచించిన వాటి కంటే ఎక్కువ డిస్టిలరీల స్థాపనకు టీడీపీ ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. పీఎంకే డిస్టిలరీస్, విశాఖ డిస్టిలరీస్, మరో మూడు ప్రైవేటు డిస్టిలరీస్కు ఆర్థిక ప్రయోజనం చేకూర్చడానికే ఈ నిర్ణయం తీసుకుంది. కొంతమంది సరఫరాదారులు..డిస్టిలరీలపై ప్రేమ.. కుట్రలో భాగంగా కొంతమంది సరఫరాదారులు, డిస్టిలరీలపై టీడీపీ ప్రభుత్వం అప్పట్లో అమితమైన ప్రేమ కనబర్చింది. వారితో కుమ్మక్కై కొన్ని ఉత్పత్తులకు కృత్రిమ డిమాండ్ను సృష్టించింది. వాటికి మార్కెట్ డిమాండ్ లేకపోయినా ఉన్నట్లుగా చూపించింది. వాస్తవ డిమాండ్, సరఫరాల డేటా ధ్రువీకరణకు ఎలాంటి యంత్రాంగం కూడా లేదు. దీనివల్ల 2015–2019 మధ్య ఇలా నాలుగైదు కంపెనీలకు భారీగా లబ్ధి చేకూరింది. వీరి నుంచే 70 శాతం కొనుగోళ్లు జరిగాయి. బ్రాండ్లకు అడ్డగోలు అనుమతులు.. మరోవైపు.. 2019లో సాధారణ ఎన్నికల నోటిఫికేషన్ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం హడావుడిగా, ఎలాంటి ప్రజా ప్రయోజనం లేకపోయినా సరే అనేక బ్రాండ్లకు ఆమోదం తెలిపి తద్వారా వాటి సరఫరాదారులకు ఎక్కడలేని ప్రయోజనం చేకూర్చింది. వ్యక్తులు, సంస్థలకు ప్రయోజనాలను అందించడంవల్ల రాష్ట్ర ఖజానాకు పెద్దఎత్తున నష్టం వాటిల్లింది. లోతుగా విచారణ జరపాలి : సీఐడీ ఈ నేపథ్యంలో.. రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు నష్టం, లైసెన్సీలకు చట్టవిరుద్ధంగా ఆర్ధిక లాభం చేకూర్చడంపై విచారణ జరగాల్సి ఉందని సీఐడీ ఏసీబీ కోర్టుకు తెలిపింది. ఈ మేరకు ఎఫ్ఐఆర్ కాపీని న్యాయస్థానానికి సమర్పించింది. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఈ కుంభకోణంపై లోతుగా విచారణ జరపాలని, బాధ్యులైన వ్యక్తులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని న్యాయస్థానాన్ని సీఐడీ కోరింది. -
సిఐడీ విచారణకు ఏ మాత్రం సహకరించని రాజేష్
-
సీఐడీ విచారణకు హాజరుకాని కిలారు రాజేష్
-
స్కిల్ స్కాంలో నిన్న కిలారు రాజేష్ ను 25 ప్రశ్నలు అడిగిన సీఐడీ
-
చంద్రబాబుకు మరో షాక్ కోర్టుకు ఆడియో ఆధారాలు అందజేసిన సీఐడీ !
-
చంద్రబాబు కేసులో తిరుగులేని సాక్ష్యాన్ని సాధించిన సీఐడీ
-
అమరావతి అసైన్డ్ భూముల కేసులో కొత్త ట్విస్ట్
-
బాబు లాయర్లు రౌడీయిజం...ఏసీబీ జడ్జి సీరియస్..!
-
కవర్ చేశాడు.. అడ్డంగా దొరికిపోయాడు..
-
రేపు మళ్లీ విచారణకు రావాలని పునీత్ కు సీఐడీ నోటీసులు
-
2వ రోజు లోకేష్ కు సీఐడీ ప్రశ్నలు
-
లోకేష్ రెండో రోజు విచారణ...డోస్ పెంచిన సీఐడీ
-
నాకు తెలియదు..గుర్తు లేదు..బాబులానే తనయుడు
-
హెరిటేజ్ నిర్ణయాలు తనకు తెలియదన్న లోకేశ్
-
CID విచారణకు లోకేష్.. అరెస్ట్ చేస్తారా?
-
ఇన్నర్ రింగ్ రోడ్ కేసు...సీఐడీ కార్యాలయంలో నారా లోకేష్
-
నారా లోకేష్కు సీఐడీ ప్రశ్నలు.. IRR అలైన్మెంట్ మార్పు సమాచారం మీకు ముందే ఎలా తెలుసు?
-
బాబుకు బెయిల్ ఇవ్వొద్దని సీఐడీ తరుపు లాయర్లు వాదనలు