DMart
-
డీమార్ట్ క్యూ3 లాభం రూ.723 కోట్లు
న్యూఢిల్లీ: డీమార్ట్ పేరుతో స్టోర్లను నిర్వహిస్తున్న అవెన్యూ సూపర్మార్ట్స్ డిసెంబర్ త్రైమాసికంలో రూ.723.50 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గతేడాది ఇదే క్వార్టర్లో నమోదైన లాభం రూ.690.41 కోట్లతో పోలిస్తే ఇది 4.8 శాతం అధికంగా ఉంది. టర్నోవర్ 17.68% పెరిగి రూ.15,972.55 కోట్లకు చేరింది. గతేడాది ఇదే క్యూ3లో రూ.13,572.47 కోట్లుగా ఉంది. వార్షిక ప్రాతిపదికన పీఏటీ మార్జిన్ 4.5% నుంచి 5.1 శాతానికి చేరింది. మొత్తం వ్యయాలు 18.52 శాతం ఎగసి రూ.15,002 కోట్లకు చేరాయి. ఆన్లైన్ ఆర్డరింగ్ సర్వీసెస్ తొలి 9 నెలల్లో 21.5% వృద్ధి సాధించింది. ఎఫ్ఎంసీజీ విభాగంలో అధిక డిస్కౌంట్లు టర్నోవర్పై ప్రభావాన్ని చూపాయని అవెన్యూ సూపర్మార్ట్స్ సీఈవో నెవీల్ నోరాన్హా తెలిపారు. కంపెనీకి దేశవ్యాప్తంగా మొత్తంగా 2024 డిసెంబర్ 31 నాటికి 387 స్టోర్లను కలిగి ఉంది.డీమార్ట్కు కొత్త సీఈవో అన్షుల్ అసావాడీమార్ట్ తన ఉన్నత స్థాయి యాజమాన్య పదవుల్లో మార్పులు చేపట్టింది. కొత్త సీఈవోగా అన్షుల్ అసావాను ఎంపిక చేసుకుంది. ఈ ఏడాది మార్చిలో డీమార్ట్లో చేరతారు. 2026 ఫిబ్రవరి 1న ఆయన కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. అంత వరకు అన్షుల్కు ప్రస్తుత ఎండీ, సీఈవో నెవీల్ నోరాన్హా సహకారం అందిస్తారు. అన్షుల్కు యూనిలీవర్లో 30 ఏళ్ల సుధీర్ఘ అనుభవం ఉంది. ప్రస్తుతం థాయిలాండ్ యూనిలీవర్ అధిపతిగా, గ్రేటర్ ఆసియా గృహ సంరక్షణ వ్యాపార విభాగానికి జనరల్ మేనేజర్గా పనిచేస్తున్నారు. రెండు దశాబ్దాలుగా డీమార్ట్కు సేవలు అందిస్తున్న నెవీల్ నోరాన్హా పదవీ కాలం 2026 జనవరితో ముగియనుంది. -
స్వయం కృషికి నిదర్శనం.. డీమార్ట్, జొమాటో, స్విగ్గీ
ముంబై: స్వయం కృషితో అవతరించిన దిగ్గజ పారిశ్రామికవేత్తగా ఈ ఏడాదీ ‘డీమార్ట్’ రాధాకిషన్ దమానీ అగ్రస్థానం దక్కించుకున్నారు. ‘డీమార్ట్’ పేరుతో ఆయన ఏర్పాటు చేసిన రిటైల్ చైన్ చక్కని ఆదరణ పొందుతుండడం తెలిసిందే. డీమార్ట్ మాతృ సంస్థ అవెన్యూ సూపర్మార్ట్స్ విలువ రూ.3.4 లక్షల కోట్లుగా ఉంది. ఏడాది కాలంలో 44 శాతం పెరిగింది. జొమాటో వ్యవస్థాపకుడు దీపిందర్ గోయల్ రెండో స్థానం దక్కించుకున్నారు. ఆయన ఏర్పాటు చేసిన జొమాటో విలువ ఏడాది కాలంలో 190 శాతం వృద్ధి చెంది రూ.2,51,900 కోట్లకు చేరింది. శ్రీహర్ష మాజేటి, నందన్ రెడ్డి నెలకొల్పిన స్విగ్గీకి మూడో స్థానం దక్కింది. కంపెనీ విలువ ఏడాది కాలంలో 52 శాతం పెరిగి రూ.1,01,300 కోట్లుగా ఉంది. 2,000 సంవత్సరం తర్వాత స్వయం కృషితో ఎదిగిన పారిశ్రామికవేత్తలు, వారు ఏర్పాటు చేసిన 200 కంపెనీలతో ఐడీఎఫ్సీ ఫస్ట్ ప్రైవేట్, హరూన్ ఇండియా ఒక నివేదికను విడుదల చేశాయి. గతేడాది హరూన్ జాబితాలోనూ డీమార్ట్ మొదటి స్థానంలో ఉండగా, ఫ్లిప్కార్ట్, జొమాటో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. గతేడాది జాబితాలో టాప్–10లో ఉన్న ఫ్లిప్కార్ట్, పేటీఎం, క్రెడ్ ఈ సారి టాప్–10లో చోటు కోల్పోయాయి. ముఖ్యంగా స్వయంకృషితో ఎదిగిన మహిళా అగ్రగామి పారిశ్రామికవేత్తగా ఫాల్గుణి నాయర్కు పదో స్థానం దక్కడం గమనార్హం. స్వయం కృషితో ఎదిగిన పారిశ్రామికవేత్తలు ఏర్పాటు చేసిన టాప్–200లో 66 కంపెనీలు బెంగళూరు కేంద్రంగా ఉంటే, 36 కంపెనీలకు ముంబై, 31 కంపెనీలకు గురుగ్రామ్ చిరునామాగా ఉన్నాయి. -
ప్రముఖ మార్ట్లో 450 లీటర్ల కల్తీ నెయ్యి
వినియోగదారులు ఎక్కువగా ఆదరించే డీమార్ట్ స్టోర్లో భారీగా కల్తీ నెయ్యిని ఫుడ్ సేఫ్టీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రోవేదిక్ నెయ్యి నాణ్యతపై ఓ కస్టమర్ ఫిర్యాదు చేయడంతో జైపూర్ లోని డీమార్ట్ స్టోర్ లో 450 లీటర్ల కల్తీ నెయ్యిని రాజస్థాన్ ఫుడ్ సేఫ్టీ విభాగం స్వాధీనం చేసుకుంది.జైపూర్ లోని అన్ని దుకాణాలు, గోదాముల్లో ఉంచిన ప్రోవేదిక్ నెయ్యి, సరస్ నెయ్యి నిల్వలను నివేదించాలని, తదుపరి ఆదేశాలు వచ్చే వరకు వాటిని విక్రయించవద్దని డీమార్ట్ ఏరియా సేల్స్ మేనేజర్ను ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆదేశించినట్లు ఎన్డీటీవీ నివేదిక పేర్కొంది.ప్రాథమిక విచారణలో మాలవీయ నగర్ లోని సూపర్ మార్కెట్ లో నిల్వ ఉంచిన సుమారు 450 లీటర్ల నెయ్యి కల్తీ అని తేలింది. సరస్ నెయ్యి క్వాలిటీ కంట్రోల్ మేనేజర్, అనలిస్ట్ నుంచి కల్తీ నాణ్యతను నిర్ధారించిన అధికారులు సుమారు 40 లీటర్ల నకిలీ సరస్ నెయ్యిని స్వాధీనం చేసుకున్నారు. నకిలీ నెయ్యిలో ఒకే బ్యాచ్ నంబర్, సిరీస్ ఉన్నట్లు గుర్తించారు. విశ్వకర్మ ఇండస్ట్రియల్ ఏరియాలోని కంపెనీ డిస్ట్రిబ్యూటర్ వద్ద కూడా నకిలీ సరస్ నెయ్యి ప్యాకెట్లు లభ్యమయ్యాయి. -
HYD: డీమార్ట్లో ఫ్రీగా చాకెట్లు తింటూ ఇన్స్టా రీల్.. ఇలా బుక్కయ్యాడు
సాక్షి, హైదరాబాద్: డీమార్ట్.. ఈ పేరు తెలియని వారు ఎవరూ ఉండరు. ప్రజల్లో ఎంతో ఆదరణ పొందిన రిటైల్ సూపర్మార్కెట్ ఇది. దాదాపు అన్ని నగరాల్లో దీని బ్రాంచ్లు ఉన్నాయి. ఎక్కువగా మధ్యతరగతి కుటుంబాలు నెలవారి సరకులు ఇక్కడే కొంటుంటారు. ఇందులో ఉప్పు, పప్పూ నుంచి అన్ని రకాల వంట సామగ్రి, చాక్లెట్లు, బిస్కెట్లు, ఫర్నీచర్, స్టీల్ సామాను, దుస్తులు ఇలా ఏ వస్తువులైనా అందుబాటు ధరలకే లభిస్తాయి. అన్నీ ఒకేచోట ఉండటం వల్ల నిత్యం జనం తాకిడి ఎక్కువగానే ఉంటుంది. కొంతమంది డీమార్ట్లో చెయ్యకూడని పనులు చేస్తుంటారు. తమను ఎవరూ చూడటం లేదనుకొని అమ్మడానికి ఉంచిన వస్తువులను దొంగిలించడం, లేదా చాక్లెట్లను తినడం వంటివి చేస్తుంటారు. కానీ సీసీటీవీ ఫుటేజీలో మన ప్రవర్తన మొత్తం రికార్డవుతోంది. తాజాగా ఓ వ్యక్తి డీమార్ట్లో చేసిన దొంగతనం విచిత్రంగా బయటపడింది. ఇటీవల హనుమంతనాయక్ అనే యువకుడు స్నేహితులతో కలిసి షేక్పేట ప్రధాన రహదారిపై ఉన్న డీమార్ట్ సూపర్ మార్కెట్లోకి వెళ్లాడు. అక్క అమ్మడానికి పెట్టిన కొన్ని చాక్లెట్లను డబ్బులు చెల్లించకుండా తిన్నాడు. అంతేగాకుండా ‘బిల్లు చెల్లించకుండా ఫ్రీగా చాక్లెట్లు ఎలా తినాలో తెలుసా? అంటూ వీడియో తీశాడు. దీనిని ఇన్స్టాగ్రామ్తోపాటు ఇతర సోషల్మీడియాల్లో పోస్టు చేశాడు. మంగళవారం ఈ వీడియోలను గుర్తించిన డీమార్ట్ షేక్పేట బ్రాంచ్ మేనేజర్ అర్జున్సింగ్ బుధవారం ఫిలింనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. చాక్లెట్లను దొంగిలించిన వహనుమంత్నాయక్తోపాటు అతడి స్నేహితులపై ఐపీసీ 420, 379 సెక్షన్లతోపాటు ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
డీమార్ట్ లాభం అప్ క్యూ3లో రూ. 690 కోట్లు
న్యూఢిల్లీ: డీమార్ట్ స్టోర్ల రిటైల్ చైన్ ఎవెన్యూ సూపర్మార్ట్స్ ఈ ఆర్థిక సంవత్సరం(2023–24) మూడో త్రైమాసికం(క్యూ3)లో పటిష్ట ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్ (క్యూ3)లో నికర లాభం 17 శాతం బలపడి రూ. 690 కోట్లను తాకింది. గతేడాది(2022–23) ఇదే కాలంలో రూ. 590 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 17 శాతంపైగా పుంజుకుని రూ. 13,572 కోట్లను అధిగమించింది. గత క్యూ3లో రూ. 11,569 కోట్ల టర్నోవర్ సాధించింది. అయితే మొత్తం వ్యయాలు 17 శాతం పెరిగి రూ. 12,656 కోట్లను తాకాయి. డిసెంబర్ చివరికల్లా మొత్తం స్టోర్ల సంఖ్య 341కు చేరినట్లు కంపెనీ వెల్లడించింది. హరీష్చంద్ర ఎం.భారుకాను స్వతంత్ర డైరెక్టర్గా బోర్డు ఎంపిక చేసినట్లు కంపెనీ తాజాగా పేర్కొంది. -
సెల్ఫ్మేడ్ ఎంట్రప్రెన్యూర్స్ 2023 లిస్ట్ విడుదల.. ఆయనే టాప్..
ధనవంతులుగా ఎదగాలంటే తాతలు, తండ్రులు సంపాదించిన ఆస్తులు ఉండాలనేది ఒకప్పటి విధానం. కానీ ప్రస్తుతం ప్రజలకు ఉపయోగపడే ఆలోచన ఉండి దాన్ని కార్యరూపం దాల్చేలా చేసి వారి మన్ననలు పొందితే అదే డబ్బు సంపాదిస్తోందని చాలా మంది నిరూపిస్తున్నారు. తామకు తాము ఎలాంటి ‘గాడ్ఫాదర్’ లేకుండా కుబేరులుగా ఎదుగుతున్నారు. తాజాగా దేశంలో ధనవంతులైన ‘సెల్ఫ్మేడ్ ఎంట్రప్రెన్యూర్స్’ లిస్ట్ విడుదలైంది. అందులో డీమార్ట్ అధినేత రాధాకిషన్ దమానీ అగ్రస్థానంలో నిలిచారు. పేటీఎం, బొమాటో, క్రెడ్, జెరోధా, స్విగ్గీ, ఫ్లిప్కార్ట్, రాజొర్పే వంటి స్టార్ట్అప్లు స్థాపించిన యువ వ్యాపారవేత్తలు ఈ జాబితాలో చోటు సంపాదించారు. ఐడీఎఫ్సీ ఫస్ట్ సంస్థ ‘ఐడీఎఫ్సీ ఫస్ట్ ప్రైవేట్ హురున్ ఇండియా టాప్ 200 సెల్ఫ్-మేడ్ ఎంట్రప్రెన్యూర్స్ ఆఫ్ ది మిలీనియం 2023' లిస్ట్ను విడుదల చేసింది. అందులో డీమార్ట్ కంపెనీ అవెన్యూ సూపర్మార్ట్స్తో కలిసి రూ.2,38,188 కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్తో దమానీ మొదటిస్థానంలో నిలిచారు. ఫ్లిప్కార్ట్(రూ.1,19,472 కోట్లు)కు చెందిన బిన్నీ-సచిన్ బన్సాల్, జొమాటో(రూ.86,835 కోట్లు) దీపిందర్ గోయల్, డ్రీమ్ 11(రూ. 66,542 కోట్లు)కు చెందిన భవిత్ షేత్ వరుసగా తరువాతి స్థానాల్లో ఉన్నారు. రోజర్పే వ్యవస్థాపకులు హర్షిల్ మాథుర్ & శశాంక్ కుమార్, మాక్స్ హెల్త్కేర్ ఇన్స్టిట్యూట్-అభయ్ సోయి, పేటీఎం-విజయ్ శేఖర్ శర్మ, క్రెడ్-కునాల్ షా, జెరోధా-నితిన్ కామత్ & నిఖిల్ కామత్లు ఈ లిస్ట్లో చోటు సంపాదించారు. ఈ లిస్ట్లో వయసు పైబడినవారిలో వరుసగా అశోక్ సూత(80)-హ్యాపీయెస్ట్ మైండ్స్, నరేష్ ట్రెహాన్-మెదంటా(77), అశ్విన్ దేశాయ్ (72)-ఏథర్స్, జైతీర్థరావు (71)-హోమ్ఫస్ట్ ఉన్నారు. ఇదీ చదవండి: ‘చైనాను చూసి నేర్చుకోండి’.. మరోసారి ఇన్ఫోసిస్ మూర్తి షాకింగ్ కామెంట్స్ మరోవైపు ధనవంతుల జాబితాలో అత్యంత పిన్న వయసు కలిగినవారిలో జెప్టోకు చెందిన కైవల్య వోహ్రా(21), భారత్పే-నక్రానీ (25), జు పీ-దిల్షేర్ మల్హి(27), సిద్ధాంత్ సౌరభ్(28), ఓయో-రితేష్ అగర్వాల్(29) ఉన్నారు. ఈ జాబితాలో చోటుసాధించిన మహిళల్లో అతి పిన్న వయస్కుల జాబితాలో మామఎర్త్కు చెందిన గజల్ అలఘ్ (35), విన్జో-సౌమ్య సింగ్ రాథోడ్ (36), ప్రిస్టిన్ కేర్-గరిమా సాహ్నీ(37) మొదటి మూడు స్థానాల్లో నిలిచారు. -
డీమార్ట్ ఉన్న ఏకైక మాల్ మాదే... ప్రతి వీకెండ్ ఈవెంట్స్ ఉంటాయి
-
డీమార్ట్ నికర లాభం హైజంప్
న్యూఢిల్లీ: రెండో త్రైమాసికంలో డీమార్ట్ స్టోర్ల నిర్వాహక కంపెనీ ఎవెన్యూ సూపర్మార్ట్స్ ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ నికర లాభం 64 శాతంపైగా జంప్చేసి రూ. 686 కోట్లకు చేరింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 418 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం దాదాపు 37 శాతం ఎగసి రూ. 10,638 కోట్లను అధిగమించింది. గత క్యూ2లో రూ. 7,789 కోట్ల టర్నోవర్ నమోదైంది. అయితే మొత్తం వ్యయాలు 37 శాతం పెరిగి రూ. 9,926 కోట్లను తాకాయి. స్టోర్ల సందర్శకుల సంఖ్య తగ్గినప్పటికీ సరుకు కొనుగోళ్ల(బాస్కెట్) విలువ పుంజుకున్నట్లు సంస్థ సీఈవో, ఎండీ నెవిల్లే నొరోన్హా పేర్కొన్నారు. చదవండి: ఆ కారు క్రేజ్ వేరబ్బా, రెండేళ్లు వెయిటింగ్.. అయినా అదే కావాలంటున్న కస్టమర్లు! -
డేట్స్ ప్యాకెట్లో పురుగులు.. కుషాయిగూడ డీ మార్ట్లో ఘటన
సాక్షి, హైదరాబాద్: డేట్స్ (కర్జూర) ప్యాకెట్లో పురుగులు రావడంతో అవాక్కైన వినియోగదారుడు అధికారులకు ఫిర్యాదు చేయడంతో తనిఖీలు చేపట్టిన అధికారులు నిర్వాహకులకు జరిమాన విధించిన సంఘటన శుక్రవారం కుషాయిగూడ డీ మార్ట్లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెలితే.. న్యూ వాసవి శివనగర్ కాలనీకి చెందిన చంద్రశేఖర్ శుక్రవారం డీ మార్ట్లో డేట్స్ ప్యాకెట్ను కొనుగోలు చేశారు. సరుకుల కొనుగోలు పూర్తి చేసుకుని ఇంటికి వెళ్తుండగా అతడి కుమారుడు డీ మార్ట్ ఆవరణలోనే తినేందుకు డేట్స్ ప్యాకెట్ ఓపెన్ చేసి నోట్లో పెట్టుకోగా మూతిపై పురుగులు పారడాన్ని తండ్రి గమనించాడు. వెంటనే అప్రమత్తమైన అతను ప్యాకెట్ను చూడగా కుళ్లిపోయి ఉంది. దీంతో అవాకైన చంద్రశేఖర్ డీ మార్ట్ సిబ్బందిని నిలదీయడమేగాక అధికారులకు ఫిర్యాదు చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఏఎంహెచ్ఓ డాక్టర్ స్వప్నారెడ్డి తన సిబ్బందితో కలిసి సరుకులను తనిఖీ చేశారు. పూర్తిగా కుల్లిపోయి, దుర్వాసన వెదజల్లుతున్న డేట్స్ ఫ్యాకెట్ను గుర్తించిన అధికారులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. గతంలో హెచ్చరికలు జారీ చేసినా తీరు మార్చుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసిన ఏఎంహెచ్ఓ డీ మార్ట్ నిర్వాహకులకు రూ.30 వేలు జరిమానా విధించారు. చదవండి: ఎంసెట్ స్టేట్ ర్యాంకర్ ప్రాణం తీసిన లోన్ యాప్ వేధింపులు -
డీమార్ట్ రాధాకిషన్ దమానీ హవా, సంపద ఎంత పెరిగిందో తెలిస్తే!
న్యూఢిల్లీ: పెట్టుబడిదారుడి నుండి వ్యాపారవేత్త వరకు ఎదిగిన డీమార్ట్ అధినేత రాధాకిషన్ దమానీ మరోసారి తన హవాను చాటుకున్నారు. ఐఎఫ్ఎల్ వెల్త్ భాగస్వామ్యంతో పరిశోధనా సంస్థ హురున్ ఇండియా విడుదల చేసిన ర్యాంకింగ్లో 12 మంది వ్యాపారవేత్తలు ట్రిలియనీర్లుగా అవతరించారు. ముఖ్యంగా ప్రముఖ పెట్టుబడిదారుడు అవెన్యూ సూపర్మార్కెట్ (డీమార్ట్) వ్యవస్థాపకుడు రాధాకిషన్ దమానీ సంపద ఏకంగా 280 శాతం లేదా 1,28,800 కోట్లు రూపాయలు పెరిగింది. ఇదీ చదవండి: Hurun India Rich List 2022: అదానీ రోజు సంపాదన ఎంతో తెలుసా? గత ఐదేళ్లలో డీమార్ట్ లాభాలతో దమానీ సంపద 1.75 లక్షల కోట్లకు పెరిగింది. తద్వారా హురున్ ఇండియా రిచెస్ట్ జాబితాలో ఐదో ప్లేస్లో నిలిచారు. గత ఏడాదితో పోలిస్తే రెండు స్థానాలు పైకి ఎగబాగారు. దమానీ రోజువారీ సంపాదన 57 కోట్ల రూపాయలని ఈ నివేదిక తేల్చింది. అంటే గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే 13 శాతం జంప్ చేసింది. ఈ జాబితాలో అదానీ గ్రూపు అధినేత గౌతమ్ అదానీ టాప్లోఉండగా, రెండో ప్లేస్లో రిలయన్స్అధినేత ముఖేశ్ అంబానీ, మూడు, నాలుగు స్థానాల్లో సీరం అధినేత సైరస్ పూనావల్లా, శివ్ నాడార్ నిలిచారు. కిరాణామొదలు ఆహారం, దుస్తుల విక్రయంతో భారతదేశం అంతటా 200కు పైగా డీమార్ట్ స్టోర్లతో వినియోగదారులను బాగా ఆకట్టుకుంటోంది. డీమార్ట్ రిటైల్ స్టోర్ల విస్తరణ నేపథ్యంలో దమానీ సంపద వేగంగా వృద్ధి చెందుతూ వచ్చింది. స్టాక్మార్కెట్ పెట్టుబడులతో వందల మిలియన్ల డాలర్లు సంపాదించిన దమానీ 2002లో డీమార్ట్ స్టోర్లను ప్రారంభించడం ద్వారా వ్యాపారవేత్తగా అవతరించిన సంగతి తెలిసిందే. -
DMart: డీమార్ట్ ఆకర్షణీయ ఫలితాలు.. మరింత పెరిగిన లాభాలు
న్యూఢిల్లీ: డీమార్ట్ స్టోర్ల నిర్వాహక దిగ్గజం ఎవెన్యూ సూపర్మార్ట్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) తొలి త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర లాభం పలు రెట్లు ఎగసి రూ. 643 కోట్లకు చేరింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో కేవలం రూ. 95 కోట్లు ఆర్జించింది. ఇందుకు భారీ రికవరీ, గతంలో అతి తక్కువగా నమోదైన లాభాలు కారణమయ్యాయి. మొత్తం ఆదాయం సైతం 94 శాతం జంప్చేసి రూ. 10,038 కోట్లను అధిగమించింది. గతేడాది క్యూ1లో రూ. 5,183 కోట్ల అమ్మకాలు మాత్రమే సాధించింది. అమ్మకాలలో భారీ రికవరీ నమోదైనప్పటికీ గత క్యూ1లో కోవిడ్–19 రెండో దశ ప్రభావంచూపడంతో ఫలితాలను పోల్చిచూడతగదని ఎవెన్యూ సూపర్మార్ట్స్ సీఈవో, ఎండీ నెవిల్లే నొరోనా తెలియజేశారు. కాగా.. ప్రస్తుత సమీక్షా కాలంలో మొత్తం వ్యయాలు 81 శాతం పెరిగి రూ. 9,192 కోట్లకు చేరాయి. మూడేళ్లలో 110 స్టోర్లు గత మూడేళ్లలో కంపెనీ 110 స్టోర్లను కొత్తగా ఏర్పాటు చేసినట్లు నెవిల్లే ప్రస్తావించారు. ఈ ఏడాది క్యూ1లో 10 స్టోర్లను తెరిచినట్లు వెల్లడించారు. కరోనా మహమ్మారి తదుపరి తొలిసారి ఎలాంటి అవాంతరాలూ ఎదురుకాని తొలి త్రైమాసికంగా క్యూ1ను పేర్కొన్నారు. ఈకామర్స్ బిజినెస్ 12 నగరాలకు విస్తరించినట్లు తెలియజేశారు. ఇకపై మరిన్ని నగరాలలో ఈకామర్స్ సేవలు విస్తరించనున్నట్లు తెలియజేశారు. -
డీ మార్ట్కి షాక్! ఇకపై అలా చేయొద్దంటూ హెచ్చరిక
కస్టమర్లతో వ్యవహరించే తీరులో డీ మార్ట్ యాజమాన్యం వైఖరి సరిగా లేదంటూ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ కన్నెర్ర చేసింది. నిబంధనలకు విరుద్ధంగా కస్టమర్ల నుంచి డబ్బులు వసూలు చేసినందుకు పరిహారం చెల్లించాలంటూ తేల్చి చెప్పింది. నలభై ఐదు రోజుల్లోగా ఈ పరిహారం అందివ్వకపోతే ఆలస్యానికి వడ్డీతో సహా చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించింది. దేశంలోనే నంబర్ వన్ రిటైల్ స్టోర్గా డీ మార్ట్ కస్టమర్లతో కిటకిటలాడుతూ ఉంటుంది. వస్తువులు కొనడం కంటే బిల్లింగ్ కౌంటర్ దగ్గరే ఎక్కువగా వేచి చూడాల్సినంత బిజీగా డీ మార్ట్ స్టోర్లు ఉంటాయి. అయితే బిల్లింగ్ పూర్తయిన తర్వాత సంచి లేకపోతే డీమార్ట్ వాళ్లే అక్కడ క్యారీ బ్యాగ్ను అందిస్తారు. ఇలా క్యారీ బ్యాగ్ అందించే విషయంలో చెలరేగిన వివాదంపై తాజాగా తీర్పును ప్రకటించింది వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్. నగరంలోని హైదర్గూడలో ఉన్న డీమార్ట్ స్టోరులో 2019 నర్సింహ మూర్తి అనే వ్యక్తి రూ.479 విలువైన వస్తువులు కొనుగోలు చేశారు. బిల్లింగ్ సమయంలో ఆ సామన్లు పట్టుకెళ్లేందుకు డీమార్ట్ లోగో ముద్రించి ఉన్న క్యారీ బ్యాగ్ను అందించారు. అయితే డీమార్ట్ లోగోతో ఉన్న క్యారీ బ్యాగుకు రూ.3.50 ఛార్జ్ చేస్తూ బిల్లులో దాన్ని చేర్చారు. క్యారీబ్యాగుకి రూ.3.50 ఛార్జ్ చేయడాన్ని వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ ఎదుటకు తీసుకెళ్లాడు నర్సింహ మూర్తి. ఇరు వర్గాల వాదనలు విన్న వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ డీమార్ట్ను తప్పు పట్టింది. కస్టమర్లకు అందించే బ్యాగులకు ఛార్జ్ వసూలు చేయడం నిబంధనలకు విరుద్ధమని పేర్కొంది. కస్టమర్లకు బ్యాగులు అందించినందుకు ఛార్జ్ వసూలు చేయొద్దంటూ తేల్చి చెప్పింది. బాధితుడికి పరిహారంగా రూ.10,000 ఇవ్వాలంటూ ఆదేశాలు జారీ చేసింది. నలభై ఐదు రోజుల్లోగా పరిహాం ఇవ్వకపోతే ఆలస్యం జరిగిన కాలానికి 18 శాతం వడ్డీతో కలిపి చెల్లించాల్సి ఉంటుందని వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ తీర్పు చెప్పింది. చదవండి: 'వాణిజ్య భవన్'ను ప్రారంభించిన ప్రధాని మోదీ! -
డీమార్ట్.. అదిరిపోయే లాభాలు
డీమార్ట్ స్టోర్ల రిటైల్ దిగ్గజం ఎవెన్యూ సూపర్మార్ట్స్ గత ఆర్థిక సంవత్సరం(2021–22) చివరి త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ4(జనవరి–మార్చి)లో నికర లాభం స్వల్పంగా 3 శాతం బలపడి రూ. 427 కోట్లకు చేరింది. అంతక్రితం ఏడా ది(2020–21) ఇదే కాలంలో రూ. 414 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం మరింత అధికం గా 19 శాతం వృద్ధితో రూ. 8,786 కోట్లను అధిగమించింది. మొత్తం వ్యయాలు 19 శాతం పెరిగి రూ. 8,210 కోట్లయ్యాయి. పూర్తి ఏడాదికి మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి డీమార్ట్ నికర లాభం 36 శాతం జంప్చేసి రూ. 1,492 కోట్లను అధిగమించింది. 2020 –21లో రూ. 1,099 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 28 శాతం ఎగసి రూ. 30,976 కోట్లను తాకింది. కరోనా సవాళ్ల లోనూ క్యూ4లో పటిష్ట ఫలితాలు సాధించగలిగినట్లు కంపెనీ సీఈవో, ఎండీ నెవెల్లీ నోరోన్హా పేర్కొన్నారు. ఒడిదొడుకులను సమర్థవంతంగా ఎదుర్కోవడంతోపాటు స్వల్ప కాలానికి రికవరీ సాధించగలమన్న విశ్వాసం పెరిగినట్లు తెలియజేశారు. గతేడాది 50 అదనపు స్టోర్లను ఏర్పాటు చేయడం ద్వారా వీటి సంఖ్య 284కు చేరినట్లు వెల్లడించారు. చదవండి: స్టాక్ మార్కెట్లో హర్షద్ మెహతాని ఢీ కొట్టిన దమ్ము డీమార్ట్ దమానీదే -
సామాన్యుడినే కాదు..! డీమార్ట్నుకూడా వదల్లేదు..!
అధిక ద్రవ్యోల్భణ రేటుతో సామాన్యులే కాకుండా డీమార్ట్ కూడా కాస్త సతమతమైంది. డీమార్ట్ జోరుకు ద్రవ్యోల్భణం స్పీడ్ బ్రేకర్గా నిలిచింది. 2021 క్యూ3లో కంపెనీ తక్కువ లాభాలను గడించింది. ఆశించిన దాని కంటే..! రిటైల్ చైన్ డీమార్ట్ ఆపరేటర్ అవెన్యూ సూపర్మార్ట్స్ లిమిటెడ్ (అక్టోబర్-డిసెంబర్) 2021 త్రైమాసికంలో ఊహించిన దాని కంటే తక్కువ లాభాలను నమోదు చేసింది. స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్ ప్రకారం.. డిసెంబర్తో ముగిసిన క్యూ3లో కంపెనీ నికర లాభం వరుసగా 32శాతం పెరిగి రూ.552.53 కోట్లకు చేరుకుంది. క్యూ3లో డీమార్ట్ సుమారు రూ. 603 కోట్ల లాభాలను బ్లూమ్బర్గ్ అంచనా వేసింది. ఈ త్రైమాసికంలో ద్రవ్యోల్బణం వ్యాపారాన్ని దెబ్బతీసిందని డీమార్ట్ యాజమాన్యం వెల్లడించింది. అయినప్పటీకి కంపెనీ మార్జిన్లకు అనుగుణంగా అంచనాలు కాస్త అటుఇటుగా ఉన్నాయని పేర్కొంది. గత ఏడాదితో పోలిస్తే..! 2020-21లో ఇదే కాలంలో లాభం రూ.446.05 కోట్లతో పోలిస్తే ఈసారి 23.62 శాతం పెరిగింది. ఇదే సమయంలో నిర్వహణ ఆదాయం రూ. 7542 కోట్ల నుంచి 22.22 శాతం పెరిగి రూ.9,217.76 కోట్లకు చేరింది. మొత్తం వ్యయాలు రూ.6977.88 కోట్ల నుంచి 21.72 శాతం పెరిగి రూ.8,493.55 కోట్లకు చేరాయి.ఇదే సమయంలో నికర లాభం కూడా రూ.686 కోట్ల నుంచి రూ.1086 కోట్లకు పెరిగిందని కంపెనీ తెలిపింది. అధిక ద్రవ్యోల్భణ ప్రభావాలు..! ద్రవ్యోల్భణం కంపెనీ అమ్మకాలపై ప్రభావం చూపినట్లు అవెన్యూ సూపర్మార్ట్స్ లిమిటెడ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, మేనేజింగ్ డైరెక్టర్ నెవిల్లే నొరోన్హా అన్నారు. సాధారణ వస్తువులు, దుస్తుల వ్యాపారం స్థిరంగా ఉన్నాయని, అయితే నిత్యావసర వస్తువులు (ఎఫ్ఎమ్సీజీ) అమ్మకాలు నెమ్మదించాయని తెలిపారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంతో కొనుగోలుదారులు ఆయా వస్తువులను పొదుపుగా వాడుతున్నట్లు అభిప్రాయపడ్డారు. చదవండి: అప్పట్లో అందరి రాతలు ఆయన పెన్నులతోనే! ప్చ్.. ఆయన రాతే బాగోలేదు! -
నిబంధనలను ఉల్లంఘించినందుకు డీమార్ట్కు జరిమానా
హైదరాబాద్: నగరంలోని హైదర్నగర్లో గల డిమార్ట్ అవుట్ లెట్కు క్యారీ బ్యాగుల కోసం వినియోగదారుల నుంచి డబ్బులు వసూలు చేసినందుకు వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్(సీడీఆర్సీ) జరిమానా విధించింది. మే 2019లో 602 రూపాయల విలువైన కొనుగోళ్లు చేసిన తర్వాత క్యారీ బ్యాగ్ కోసం డిమార్ట్ తన నుంచి 3.50 రూపాయలు వసూలు చేసిందని ఆకాశ్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్లో పేర్కొన్నారు. అయితే నిబందనల ప్రకారం.. క్యారీ బ్యాగులకు డబ్బులు వసూలు చేస్తే.. అలాంటి బ్యాగ్లపై కంపెనీకి చెందిన లోగోలు ఉండరాదు. లోగోలు ఉంటే ఆ బ్యాగులను ఉచితంగానే కస్టమర్లకు అందించాలి. అయితే, డిమార్ట్ లోగో ఉన్న క్యారీ బ్యాగ్కు రూ.3.50 వసూలు చేసింది. ఆకాశ్ కుమార్ పిటిషన్ విషయమలో ఇరు పక్షాల వాదనలను విన్న కమిషన్ ఆకాశ్ కుమార్ కి అనుకూలంగా తీర్పునిచ్చింది. క్యారీ బ్యాగ్పై లోగో ఉన్నందున డిమార్ట్ ఆ బ్యాగ్ను ఉచితంగానే ఇవ్వాల్సి ఉందని, కానీ వారు రూ.3.50 వసూలు చేశారు కాబట్టి ఆ మొత్తాన్ని వినియోగదారుడికి చెల్లించాలని కమిషన్ తీర్పు ఇచ్చింది. అలాగే ఆకాష్కు రూ.1,000 నష్టపరిహారం చెల్లించాలని సూచించింది. ఈ మొత్తాన్ని 45 రోజుల సమయం లోపల చెల్లించకపోతే 18 శాతం వడ్డీని చెల్లించాల్సి ఉంటుంది అని పేర్కొంది. అయితే డిమార్ట్కు ఇలా ఫైన్ పడడం ఇదేమీ కొత్త కాదు. గతంలో హైదర్గూడలోని అవుట్ లెట్కు కూడా ఇలాగే రూ.50వేల జరిమానా విధించారు. (చదవండి: రైతులకు ఎస్బీఐ తీపికబురు.. తక్కువ వడ్డీకే రుణాలు!) -
డీమార్ట్ దెబ్బకు బిలియనీర్ అయిపోయాడే...!
డీమార్ట్ ఆకాశమే హద్దుగా రాకెట్లా దూసుకుపోతుంది. కొద్ది రోజుల క్రితమే డీమార్ట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ రూ. 3 ట్రిలియన్ క్లబ్లోకి జాయిన్ విషయం తెలిసిందే. డీమార్ట్ దూకుడుతో కంపెనీ వ్యవస్థాపకుడు రాధాకిషన్ దమానీ వరల్డ్ రిచెస్ట్ -100 బిలియనీర్ క్లబ్లోకి చేరారు. తాజాగా డీమార్ట్ సీఈవో ఇగ్నేషియస్ నావిల్ నోరోన్హా బిలియనీర్గా అవతారమెత్తారు. కంపెనీ షేర్లు సోమవారం రోజున 10 శాతం పైగా పుంజుకోవడంతో నోరోన్హా బిలియనీర్గా మారారు. చదవండి: గూగుల్ బ్రౌజర్ వార్నింగ్.. కోట్ల మంది దూరం? గూగుల్కే కోలుకోలేని నష్టం! డీమార్ట్లో నోరోన్హా 2.02 శాతం వాటాను కల్గి ఉన్నారు. వాటి విలువ ఇప్పుడు రూ. 7,720 కోట్లకు చేరింది. ఇటీవలి కాలంలో ఐఐఎఫ్ఎల్ వెల్త్ హురున్ ఇండియా రిచ్ లిస్ట్ ప్రకారం...ఇగ్నేషియస్ నావిల్ నోరోన్హా భారత్లో అత్యంత ధనవంతులైన ప్రొఫెషనల్ మేనేజర్గా నిలిచారు. డీమార్ట్లో చేరడానికి ముందు, నోరోన్హా ఫాస్ట్మూవింగ్ కన్యూసమర్ గూడ్స్(ఎఫ్ఎమ్సీజీ)దిగ్గజం హిందుస్తాన్ యూనిలీవర్తో కలిసి పనిచేశారు. అవెన్యూ సూపర్మార్ట్స్ స్థాపించిన వెంటనే రాధాకిష్ణన్ దమాని 2004 లో నోరోన్హాను డీమార్ట్ సీఈవోగా నియమించారు. క్యూ-2 లో భారీ లాభాలు..! ఈ ఏడాది రెండో త్రైమాసికంలో డీమార్ట్ తన స్వతంత్ర ఆదాయంలో 46శాతం వార్షిక వృద్ధిని నమోదు చేసి ₹ 7,649.64 కోట్లకు చేరుకుంది. గోల్డ్మన్ సాచ్స్ నివేదిక ప్రకారం..డీమార్ట్ వృద్ధి నివేదిక అంచనాల కంటే 5శాతం ఎక్కువ మేర లాభాలను గడించింది. చదవండి: స్మార్ట్ఫోన్ ఆధిపత్యానికి చెక్! చైనాను ఇరకాటంలో నెట్టేలా భారత్ నిర్ణయం -
డీమార్ట్ లాభం రెట్టింపు
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సర(2021–22) రెండో త్రైమాసికంలో డీమార్ట్ స్టోర్ల నిర్వాహక కంపెనీ ఎవెన్యూ సూపర్మార్ట్స్ ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ2(జులై–సెపె్టంబర్)లో నికర లాభం రెట్టింపై దాదాపు రూ. 418 కోట్లకు చేరింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 196 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 47 శాతం ఎగసి రూ.7,789 కోట్లను తాకింది. అయితే మొత్తం వ్యయాలు 44 శాతం పెరిగి రూ. 7,249 కోట్లయ్యాయి. స్టాండెలోన్ పద్ధతిన డీమార్ట్ ఆదాయం 47 శాతం జంప్చేసి రూ. 7,650 కోట్లకు చేరింది. ఈ ఏడాది తొలి అర్ధభాగం(ఏప్రిల్–సెపె్టంబర్)లో మొత్తం ఆదాయం రూ. 9,189 కోట్ల నుంచి రూ. 12,972 కోట్లకు పురోగమించింది. -
డీమార్ట్ జోరు..! లాభాల్లో హోరు...!
దేశంలోని అతిపెద్ద రిటైల్ చైన్లలో ఒకటైన డీమార్ట్ 2021-22 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో అదరగొట్టింది. క్యూ2లో డీమార్ట్ రూ. 7,650 కోట్ల ఆదాయాన్ని గడించింది . గత ఏడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే 46 శాతం అధిక లాభాలను ఆర్జించింది. గత ఏడాది క్యూ2లో రూ. 5,218 కోట్ల డీమార్ట్ సొంతం చేసుకుంది. డీమార్ట్ క్యూ 2 నికరలాభాల్లో కూడా అదే జోరును ప్రదర్శించింది. డీమార్ట్ సుమారు 113.2 శాతం మేర స్వతంత్ర నికర లాభాలను పొందింది. క్యూ 2లో సుమారు 448.90 కోట్లను ఆర్జించింది. గత ఏడాది రెండో త్రైమాసికంలో సుమారు 210.20 కోట్ల లాభాలను గడించింది. చదవండి: ఈ కంపెనీలు 60సెకన్లకు ఎంత సంపాదిస్తున్నాయో తెలుసా? FY22 ఆర్థిక సంవత్సర తొలి అర్ధభాగంలో డీమార్ట్ మొత్తం ఆదాయం రూ. 12,681 కోట్లుగా నమోదైంది. గత ఏడాది 9,051 కోట్ల ఆదాయాన్ని నమోదుచేసింది. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో కరోనావైరస్ ప్రభావం బాగా కన్పించింది. సెకండ్వేవ్ను దృష్టిలో ఉంచుకొని అనేక రాష్ట్ర ప్రభుత్వాలు ఆంక్షలను విధించాయి. ఏదేమైనా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు క్రమంగా లాక్డౌన్లను ఎత్తివేయడం, టీకా వేగాన్ని పెంచడంతో, రిటైల్ మార్కెట్లు వృద్ధిలో సానుకూల వేగాన్ని చూస్తున్నాయి. దేశ వ్యాప్తంగా 2021 సెప్టెంబర్ 30 నాటికి మొత్తం డీమార్ట్ స్టోర్స్ సంఖ్య 246కు పెరిగాయి. చదవండి: మహీంద్రా థార్కు పోటీగా మారుతి నుంచి అదిరిపోయే కార్...! -
ఆకాశమే హద్దుగా డీమార్ట్ దూకుడు...!
ముంబై: రిటైల్ చైన్ సూపర్ మార్కెట్స్ డీ-మార్ట్స్ను నిర్వహిస్తోన్న అవెన్యూ సూపర్మార్ట్స్ లిమిటెడ్ సోమవారం రోజున సరికొత్త రికార్డును నమోదుచేసింది. డీమార్ట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ ఏకంగా రూ. 3 ట్రిలియన్లకు (3 లక్షల కోట్లు) చేరుకుంది. ఈ అరుదైన ఘనతను సాధించిన 17 ఇండియన్ స్టాక్స్ లిస్టెడ్ కంపెనీగా నిలిచింది. ఈ ఏడాదిలో డీమార్ట్ షేర్లు ఇప్పటివరకు సుమారు షేర్లు 70% పైగా పెరిగాయి. చదవండి: ఒక్కసారి ఛార్జ్తో 1360 కిలోమీటర్ల ప్రయాణం..! బీఎస్ఈ స్టాక్ మార్కెట్లో సోమవారం రోజున డీమార్ట్ షేర్ విలువ రికార్డు స్థాయిలో గరిష్టంగా రూ. 4,837ను తాకింది. దీంతో డీ మార్ట్ మార్కెట్ క్యాప్ విలువ రూ. 3.11 ట్రిలియన్లకు చేరుకుంది. ట్రేడింగ్ ముగిసే సమయానికి డీ మార్ట్ షేర్ విలువ 7 శాతం వృద్ధి చెంది రూ. 4716.50 వద్ద నిలిచింది. రిలయన్స్ ఇతర కంపెనీల సరసన..! రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఇన్ఫోసిస్, హిందుస్థాన్ యూనిలీవర్, హెచ్డిఎఫ్సి లిమిటెడ్, ఐసిఐసిఐ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, ఐటిసి, కోటక్ మహీంద్రా బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఒఎన్జిసి, విప్రో, హెచ్సిఎల్ టెక్నాలజీస్ ఏషియన్ పెయింట్స్ కంపెనీల మార్కెట్ క్యాప్ మూడు ట్రిలియన్ డాలర్లకు చేరుకున్న క్లబ్లో ఇప్పుడు డీమార్ట్ కూడా చేరింది. క్యూ-2 లో భారీ లాభాలు..! ఈ ఏడాది రెండో త్రైమాసికంలో డీమార్ట్ తన స్వతంత్ర ఆదాయంలో 46శాతం వార్షిక వృద్ధిని నమోదు చేసి ₹ 7,649.64 కోట్లకు చేరుకుంది. గోల్డ్మన్ సాచ్స్ నివేదిక ప్రకారం..డీమార్ట్ వృద్ధి నివేదిక అంచనాల కంటే 5శాతం ఎక్కువ మేర లాభాలను గడించింది. చదవండి: తొలి భారత ప్లేయర్గా రికార్డు సృష్టించనున్న దినేష్ కార్తీక్...! -
డీమార్ట్ దూకుడు..!
దేశంలోని అతిపెద్ద రిటైల్ చైన్లలో ఒకటైన డీమార్ట్ 2021-22 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో అదరగొడుతుంది. క్యూ2లో డీమార్ట్ రూ. 7,650 కోట్ల ఆదాయాన్ని గడించింది . గత ఏడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే 46 శాతం అధికంగా లాభాలను ఆర్జించింది. గత ఏడాది క్యూ2లో రూ. 5,218 కోట్ల డీమార్ట్ సొంతం చేసుకుంది. రెండో త్రైమాసికంలో కార్యకలాపాల నుంచి వచ్చే సంపూర్ణ ఆదాయం కంపెనీ చట్టబద్ధమైన ఆడిటర్ల పరిమిత సమీక్షకు లోబడి ఉంటుందని డీమార్ట్ ఒక ఫైలింగ్లో తెలిపింది. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో కరోనావైరస్ ప్రభావం బాగా కన్పించింది. సెకండ్వేవ్ను దృష్టిలో ఉంచుకొని అనేక రాష్ట్ర ప్రభుత్వాలు ఆంక్షలను విధించాయి. ఏదేమైనా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు క్రమంగా లాక్డౌన్లను ఎత్తివేయడం, టీకా వేగాన్ని పెంచడంతో, రిటైల్ మార్కెట్లు వృద్ధిలో సానుకూల వేగాన్ని చూస్తున్నాయి. చదవండి: అతి తక్కువ ధరలోనే..భారత మార్కెట్లలోకి అమెరికన్ బ్రాండ్ టీవీలు..! దేశ వ్యాప్తంగా 2021 సెప్టెంబర్ 30 నాటికి మొత్తం డీమార్ట్ స్టోర్స్ సంఖ్య 246కు పెరిగింది. డీమార్ట్ షేర్లు రూ. 4242 వద్ద ముగిశాయి. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటివరకు డీమార్ట్ షేర్లు 50శాతం పైగా పెరిగాయి. స్టాక్ మార్కెట్లో అద్బుతర్యాలీను డీమార్ట్ నమోదుచేస్తోంది. డీమార్ట్ యాజమాని రాధాకిషన్ ఎస్ దమాని ఇటీవలే టాప్ -100 ప్రపంచ బిలియనీర్స్ ఎలైట్ క్లబ్లో ప్రవేశించారు. బ్లూమ్బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం దమాని నికర ఆస్తుల విలువ 22.5 బిలియన్ డాలర్లతో బ్లూమ్బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్లో 70 వ స్థానంలో కొనసాగుతున్నారు. చదవండి: ఇంధన ధరల పెంపుపై 9 నెలల్లో కేంద్రం చెప్పిన 9 కారణాలు..! -
డిగ్రీలో ఫెయిల్, నెమ్మదస్తుడు.. కానీ లక్ష కోట్లకు అధిపతి
దేశంలో అత్యంత సంపన్నమైన వ్యక్తి ఎవరి అడిగితే ముఖేశ్ అంబాని అని ఠక్కున చెప్పేస్తాం. మరి రెండో వ్యక్తి ఎవరని అడిగితే టాటా,బిర్లా, మహీంద్రా, అజీం, శివనాడర్, బజాజ్ ఇలా పేర్లు వెతుకుతాం. కానీ వీళ్లెవరు కాదు .ఈ రెండో సంపన్నుడి పేరు రాధకిషన్ దమాని. ఏ మాత్రం పబ్లిసిటీని ఇష్టపడని ఈ మనిషి, కనీసం డిగ్రీ కూడా పూర్తి చేయలేదు. కేవలం కామన్ సెన్స్ని పెట్టుబడిగా పెట్టి సుమారు లక్షా యాభై వేల కోట్ల రూపాయలకు అధిపతి అయ్యాడు. D Mart Founder Radhakishan Damani: రాధా కిషన్ దమానీ వ్యాపారమే జీవన విధానంగా బతికే మర్వాడీ కుటుంబంలో 1954న జన్మించాడు. రాజస్థాన్లోని బికనేర్లోనే ఆయన విద్యాభ్యాసం జరిగింది. ఆ తర్వాత ఆయన తండ్రి శివ కిషన్ దమానీ ముంబై స్టాక్ ఎక్సేంజీలో బ్రోకర్గా పని చేయడానికి కుదరడంతో ఆ కుటుంబం ముంబైకి మకాం మార్చింది. రాధా కిషన్కి గోపి కిషన్ అనే సోదరుడు కూడా ఉన్నాడు. అత్తెసరు మార్కులతోనే చదువు నెట్టుకొస్తూ.... ఎలాగొలా ముంబై యూనివర్సిటీలో బీకాంలో సీటు సాధించినా మొదటి ఏడాది తర్వాత కాలేజీకి వెళ్లనంటూ భీష్మించుకుని కూర్చున్నాడు. దీంతో ఇంట్లో వాళ్లు అతని చేత బాల్ బేరింగ్ బిజినెస్ పెట్టించారు. తండ్రితో కలిసి సోదరుడు గోపి దమానీ స్టాక్ మార్కెట్ బ్రోకరేజీ పనులు చూసుకునే వాళ్లు. ఆ ఘటనతో... ఇటు పెద్దగా చదువు కోకుండా అటు బిజినెస్లో చురుగ్గా వ్యవహరించని రాధా కిషన్పై తండ్రికి ఎప్పుడూ అనుమానమే. అయితే రాధా కిషన్కి 32 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు అకస్మాత్తుగా శివ్ దమానీ మరణించాడు. దీంతో తండ్రి స్థానంలో అయిష్టంగానే స్టాక్ మార్కెట్లోకి వచ్చాడు దమానీ కదలడు మెదలడు స్టాక్ మార్కెట్ అంటేనే గందరగోళం.. కొనేవాళ్లు, అమ్మేవాళ్లలతో హడావుడిగా ఉంటుంది. కానీ రాధకిషన్ దమానీ ఇందుకు విరుద్ధంగా నెమ్మదిగా ఉండేవాడు. అతని పేరేంటో కూడా తోటి బ్రోకర్లకి తెలిసేది కాదు. మార్కెట్లో అతను ప్రాతినిథ్యం వహించే జీఎస్ అనే బ్యాడ్జ్ అతని షర్ట్పై ఉంటే అదే పేరుతో జీఎస్ అనే ఎక్కువ మంది పిలిచేవారు. హడావుడి చేయకపోయినా అక్కడున్న వాళ్లని గమనిస్తూ మార్కెట్ పల్స్ని మాత్రం బాగా గమనించే వాడు. హర్షద్ మెహతాకు పోటీగా రాధ కిషన్ దమానీ స్టాక్ మార్కెట్లో కెరీర్ ప్రారంభించినప్పుడే మరో బిగ్బుల్, స్టాక్ మార్కెట్ స్కామర్ హర్షద్ మెహతా కూడా స్కాక్ మార్కెట్లో అడుగు పెట్టాడు. తెర వెనుక మంత్రాంగం నడుపుతూ మార్కెట్ను పైకి లేపడంలో హర్షద్కి పెట్టింది పేరు. అతనికి పోటీగా మార్కెట్లో నిలిచింది ట్రిపుల్ ఆర్లో రాధాకిషన్ దమానీ మూల స్థంభం. ఆ రోజుల్లో హర్షద్కి పోటీగా రాధా కిషన్, రాకేశ్ ఝున్ఝున్వాలా, రాజ్ అనే ముగ్గురు ట్రిపుల్ ఆర్గా పోటీ ఇచ్చారు. అయితే వీళ్లపై ఎక్కువ సార్లు హర్షద్దే పై చేయి అయ్యింది. అయినా సరే పట్టు వదలకుండా పోటీలో నిలిచారంటే దానికి కారణం దమానీనే. అదే జరిగి ఉంటే ఓ కంపెనీ టైర్స్ షేర్ల విషయంలో హర్షద్ మెహెతా, ట్రిపుల్ ఆర్ల మధ్య పోటీ నెలకొంది. ఆ కంపెనీ షేర్లు పెరుగుతాయంటూ హర్షద్ బుల్ జోరు కొనసాగిస్తే, ఆ షేర్లు పడిపోతాయంటూ ట్రిపుల్ ఆర్ బేర్ వైపు నిల్చుంది. హర్షద్ ఎత్తులతో చాలా రోజుల పాటు ఆ కంపెనీ షేర్లు పడిపోలేదు. మరో వారం గడిస్తే ఇల్లు, వాకిలి అమ్మేసి నడి రోడ్డు మీద పడాల్సిన పరిస్థితి ట్రిపుల్ ఆర్ బృందానికి ఎదురైంది. అయితే హర్షద్ పాచికలు పారక కృత్రిమంగా పెంచిన ఆ కంపెనీ టైర్ల ధరలు పడిపోవడంతో దమానీ బృందం అప్పుల ఊబి నుంచి బయటపడ్డారు. ఆ తర్వాతి కొద్ది రోజులకే హర్షద్ స్కాం వెలుగు చూడటంతో పరిస్థితి మారిపోయింది. హడావుడి చేయకుండా నిదానంగా ఆలోచిస్తూ మార్కెట్ ఎత్తులు వేసే రాధా కిషన్ దమానీ వైఖరి ఆయన్ని మార్కెట్లో మరో ఎత్తుకి తీసుకెళ్లింది. పట్టిందల్లా బంగారమే 1992 నుంచి 1998 వరకు రాధి కిషన దమానీ కొనుగోలు చేసిన కంపెనీ షేర్ల విలువ బాగా పెరిగింది. వీఎస్టీ, హెచ్డీఎఫ్సీ, సుందరం ఫైనాన్స్ ఇలా అన్ని కంపెనీలు లాభాలను కళ్ల చూశాయి. బేర్ మార్కెట్ను అంచనా వేసి తక్కువ ధర షేర్లు కొన్ని లాంగ్టర్మ్లో భారీ లాభాలను పొందే వ్యూహం అమలు చేశాడు. పదేళ్లు తిరిగే సరికి వందల కోట్ల ఆస్తికి అధిపతి అయ్యాడు. అప్నా బజార్ తక్కువ ధరకే వస్తువులను భారతీయులు కొనుగోలు చేయాలనుకుంటారని, అందుక తగ్గట్టుగా తక్కువ ధరకే కిరాణా సామన్లు అందించే స్టోర్లుగా అప్నా బజార్ పేరుతో కోపరేటివ్ సూపర్ మార్కెట్ వ్యవస్థను 1998లో నెలకొల్పారు. అయితే ఇటు స్టాక్ మార్కెట్, అటు సూపర్ మార్కెట్ల మధ్య సమతూకం లేక అప్నా బజార్ నష్టాల పాలైంది. స్టాక్మార్కెట్కి గుడ్బై తొలి సారి బాల్బేరింగ్ వ్యాపారంలో వచ్చిన నష్టం దమానీని వేధిస్తూనే ఉంది. ఇప్పుడు కొత్తగా అప్నా బజార్లో నడవలేని స్థితికి చేరుకుంది. దీంతో దమానీలో పట్టుదల పెరిగింది. కోట్ల రూపాయల సంపద అందించిన స్టాక్ మార్కెట్కి 2000లో గుడ్బై చెప్పాడు. డీ మార్ట్ ముంబై నగర శివార్లలో పువై ప్రాంతంలో చవగ్గా స్థలం కొని ఏర్పాటు చేసి కిరాణ వస్తువుల నుంచి బట్టలు, ఎలక్ట్రానిక్స్, గ్రూమింగ్ వరకు అన్ని వస్తువులు ఓకే చోట దొరికేలా డీ మార్ట్ హైపర్ మార్కెట్ని ఏర్పాటు చేశాడు. ప్రతీ వస్తువుని ఎంఆర్పీ కంటే తక్కువ ధరకే అమ్మడం ప్రారంభించాడు. నెమ్మదిగా డీ మార్ట్ విజయ పరంపర మొదలైంది. ధనవంతుల జాబితాలో డీ మార్ట్ ప్రారంభించిన తర్వాత పదేళ్లు గడిచే సరికి స్టోర్ల సంఖ్య 1 నుంచి పదికి పెరిగింది. అయితే మా సిటీలో కూడా డీమార్ట్ ఉంటే బాగుండు అనుకునే వారి సంఖ్య లక్షల్లోకి చేరింది. అందుకు తగ్గట్టే మరో పదేళ్లు గడిచే సరికి డీమార్ట్ స్టోర్ల సంఖ్య దేశ వ్యాప్తంగా 220కి చేరుకుంది. డీ మార్ట్ పబ్లిక్ ఇష్యూకి 2017లో వెళ్లగా 145 శాతం అధిక ధర నమోదై రికార్డు సృష్టించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు వెనక్కి తిరిగి చూసుకున్నదే లేదు. ఆగస్టు 19న ఆయన పోర్ట్ఫోలియోలో ఉన్న ఐదు కంపెనీలు విపరీతమైన ఆదాయాన్ని సంపాదించి పెట్టాయి. దీంతో ఒక్కసారిగా ఆయన ఆదాయం 19.3 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇందులో 4.1 బిలియన్ డాలర్లు ఈ ఒక్క ఏడాదిలోనే ఆయన ఖాతాలో వచ్చి చేరింది. దీంతో ప్రపంచ కుబేరుల్లో ఆయన 97వ స్థానంలో నిలిచినట్టు బ్లూమ్బెర్గ్ బిలియనీర్ ఇండెక్స్ ప్రకటించింది. ఇండియాలో ముకేశ్ అంబానీ 57.9 బిలియన్ డాలర్లతో ప్రథమ స్థానంలో ఉంటే దమానీ 19.30 బిలియన్ డాలర్ల సంపద కలిగి ఉన్నారు. విలువలే ఆధారంగా స్టాక్ మార్కెట్లో అడుగు పెట్టినప్పటి నుంచి తెల్ల అంగీ తెల్ల ప్యాంటు మాత్రమే ఆయన ధరిస్తారు.దీంతో ఆయన్ని మిస్టర్ వైట్ అండ్ వైట్గా పిలుచుకుంటారు. 80వ దశకంలో స్టాక్ మార్కెట్లో హర్షద్మెహతా ఎత్తులకు మిగిలిన ఇన్వెస్టర్లు చిత్తైపోతుంటే తెగువతో నిలిచారు దమానీ. ఆ పోరులో సర్వం కోల్పేయే వరకు వచ్చినా ధైర్యం కోల్పోలేదు. అందువల్లే స్కాములు చేసిన హర్షద్ ఎలా పైకి ఎదిగాడో అలాగే నేలకరిస్తే.. నెమ్మదస్తుడిగా పేరున్న దమానీ టాటా బిర్లాలనే వెనక్కి నెట్టి అత్యంత ధనవంతుల జాబితాలో చోటు సంపాదించారు. ఇప్పటికీ అదే తీరు ముంబై స్టాక్ మార్కెట్లో బ్రోకర్గా అగుడు పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు అదే లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్నారు దమానీ. మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వడం కానీ, బయట పార్టీలకు వెళ్లడం, ఆఖరికి మార్కెట్ మీద సైతం కామెంట్ చేసేందుకు ఆయన ముందుకు రారు. ఎక్కడైనా విరాళాలు, సాయం అందించిన తనే పేరు రాయించడు, కనీసం మాట వరసకి కూడా చెప్పొదంటూ సాయం, విరాళం పొందిన వారిని రిక్వెస్ట్ చేస్తారు. ఇండియాలో రెండో అత్యంత ధనవంతుడిగా గుర్తింపు వచ్చిన సందర్భంలో ఆయన లేటెస్ట్ ఫోటోలు సైతం మీడియాకి లభించలేదంటే ఎంత లో ఫ్రొఫైల్ మెయింటైన్ చేస్తారో అర్థం చేసుకోవచ్చు. - సాక్షి, వెబ్డెస్క్ ప్రత్యేకం చదవండి : BigBull: పెట్టుబడి ఐదు వేలు.. సంపాదన 34 వేల కోట్లు! -
డీమార్ట్, ప్యారడైజ్కు భారీ జరిమానా
సాక్షి,హైదరాబాద్: హైదరాబాద్ లోని డీమార్ట్ షాపింగ్ మాల్, ప్యారడైజ్ రెస్టారెంట్లకు ఊహించని షాక్ తగిలింది. వినియోగ దారుల నుంచి క్యారీ బ్యాగుల కోసం ఆదనంగా చార్జీలు వసూలు చేస్తున్నందుకు తాజాగా వినియోగదారుల పోరమ్ జరిమానా విధించింది. హైదర్గూడ డీమార్ట్ బ్రాంచ్కు, సికింద్రాబాద్, బేగంపేట ప్యారడైజ్ రెస్టారెంట్లకు వినియోగదారుల ఫోరమ్ కోర్టు రూ.50 వేల చొప్పున జరిమానా విధిస్తున్నట్లు ప్రకటించింది. అంతే కాదు.. ఈ ఫిర్యాదు చేసిన వ్యక్తికి రూ. 4 వేల నష్ట పరిహారం, కోర్టు ఖర్చులు చెల్లించాలని వినియోగదారుల పోరమ్ తీర్పు చెప్పింది. కాగా, విజయ్ గోపాల్ అనే వ్యక్తి 2019లో సికింద్రాబాద్ ప్యారడైజ్ నుంచి ఆహారాన్ని కొనుగోలు చేయగా క్యారీ బ్యాగ్స్ కోసం రూ.4.76 చార్జ్ చేశారు. 2019 జూన్లో హైదరాగూడ డీమార్ట్ నుంచి సామాగ్రి కోనుగొలు చేయగా అక్కడ కూడా క్యారీ బ్యాగ్ కోసం రూ. 3.75 వసూలు చేశారు. దీనిపై వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ను ఆశ్రయించాడు. దీంతో కమిషన్ తాజా తీర్పునిచ్చింది. చదవండి: Tokyo Paralympics 2021: భళా భవీనా: పారా ఒలింపిక్స్లో భారత్కు పతకం ఖాయం -
డీమార్ట్ పేరిట ఘరానా మోసం, లింక్ ఓపెన్ చేశారో అంతే!
సాక్షి, హైదరాబాద్: కరోనా మహమ్మారి సమయంలో సైబర్ మోసాలు గణనీయంగా పెరిగాయి. నకిలీ యాప్స్, క్లోన్ వెబ్సైట్ల పేరుతో సైబర్ నేరస్థులు అమాయక ప్రజలకు కుచ్చుటోపీ పెడుతున్నారు. వాట్సాప్లో కూడా నకిలీ వెబ్సైట్ల లింకుల బెడద ఎక్కువగానే ఉంది. సైబర్ నేరస్థులు ఎప్పటికప్పుడు కొత్త పుంతలు తొక్కుతూ అమాయక ప్రజలను మోసం చేస్తూనే ఉన్నారు. ఈ సారి రిటైల్ సూపర్ మార్కెట్ల దిగ్గజం డీమార్ట్ రూపంలో సైబర్ నేరస్థులు విరుచుకుపడుతున్నారు. చదవండి: Ola Electric: మరో సంచలనానికి తెర తీయనున్న ఓలా ఎలక్ట్రిక్...! డీమార్ట్ సూపర్ మార్కెట్ తన 20 వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఉచితంగా బహుమతులు పంపిణీ చేస్తోందని పేర్కొంటూ ఒక లింక్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఈ లింక్ పట్ల జాగ్రత్తగా ఉండాలని ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ సైబరాబాద్ ట్విట్ తన ట్విట్లో పేర్కొంది. నకిలీ లింక్పై క్లిక్ చేసినప్పుడు, స్పిన్ వీల్ ఉన్న థర్డ్ పార్టీ వెబ్సైట్కు ప్రజలు మళ్లీంచబడతారు. మీరు సుమారు రూ. 10,000 వరకు బహుమతి కార్డులను గెలుచుకోవడానికి స్పీన్ వీల్ తిప్పమని అడుగుతుంది. మీరు వీల్ను స్పిన్ చేసిన వెంటనే'ఉచిత బహుమతి'తో మరొక లింక్ ఓపెన్ అవుతోంది. గిఫ్ట్ను క్లెయిమ్ చేయడానికి 'ఉచిత బహుమతి' పోటీని ఇతర స్నేహితులతో పంచుకోవాలని మిమ్మల్ని అడుగుతుంది.ఆయా లింక్లను ఓపెన్ చేస్తే సైబర్నేరస్తులు ప్రజల బ్యాంక్ ఖాతాల నుంచి డబ్బులు దోచేస్తున్నారని హైదరాబాద్ పోలీసులు హెచ్చరించారు. బీ అలర్ట్.. ఈ లింక్ ఓపెన్ చేయవద్దు.#DMart pic.twitter.com/x9XmqHzWqO — Economic Offences Wing Cyberabad (@EOWCyberabad) August 21, 2021 (చదవండి: Elon Musk-Jeff Bezos: ఎలన్ మస్క్కు పెద్ద దెబ్బే కొట్టిన జెఫ్బెజోస్...!) -
ప్రపంచ కుబేరులలో డీమార్ట్ బాస్
ముంబై: కరోనా టైంలో అన్నివర్గాలను ఆకర్షించి.. విపరీతంగా లాభాలు ఆర్జించింది డీమార్ట్ బ్రాండ్ సూపర్ మార్కెట్. తాజాగా ఈ స్టోర్ల ప్రమోటర్ రాధాకృష్ణన్ ఎస్.దమానీ తాజాగా ప్రపంచ సంపన్నుల జాబితాలో చేరారు. 19.2 బిలియన్ డాలర్ల(సుమారు రూ. 1.42 లక్షల కోట్లు) నెట్వర్త్ను సాధించడం ద్వారా బ్లూమ్బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్లో 98వ ర్యాంకులో నిలిచారు. వెరసి టాప్–100 గ్లోబల్ కుబేరుల్లో ఒకరిగా తొలిసారి ఆవిర్భవించారు. ప్రపంచ సంపన్నులపై రోజువారీ ర్యాంకింగ్లను ఈ ఇండెక్స్ ప్రకటిస్తుంటుంది. డీమార్ట్ రిటైల్ చైన్ నిర్వాహక సంస్థ ఎవెన్యూ సూపర్మార్ట్స్కు ప్రమోటర్ అయిన దమానీ.. స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ కూడా. దేశీ కుబేరులు: టాప్–100 గ్లోబల్ జాబితాలో దమానీ కంటే ముందు వరుసలో దేశీ దిగ్గజాలు.. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ, అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ, విప్రో వ్యవస్థాపకులు అజీమ్ ప్రేమ్జీ, హెచ్సీఎల్ టెక్నాలజీస్ గౌరవ చైర్మన్ శివ నాడార్, స్టీల్ టైకూన్ లక్ష్మీ మిట్టల్ సైతం నిలిచారు. కాగా.. డీమార్ట్ రిటైల్ స్టోర్ల విస్తరణ నేపథ్యంలో దమానీ సంపద వేగంగా వృద్ధి చెందుతూ వచ్చింది. ముఖ్యంగా దాదాపు ప్రతీ ప్రొడక్టులు.. వాటిపై రీజనబుల్ డిస్కౌంట్ల ప్రకటన, ఎక్కువ ప్రొడక్టులతో వినియోగదారుల్ని ఆకర్షించడం, టౌన్లకు సైతం విస్తరించిన మార్ట్లు, ముఖ్యంగా కరోనా టైం నుంచి అన్ని వర్గాలను మార్ట్లకు రప్పించుకోవడం ద్వారా డీమార్ట్ వాల్యూను విపరీతంగా పెంచుకోగలిగారాయన. తద్వారా స్టాక్ మార్కెట్లలో మధ్య, చిన్నతరహా కంపెనీలలో అత్యధికంగా ఇన్వెస్ట్ చేసే దమానీ.. వేల్యూ ఇన్వెస్టర్గా గుర్తింపు పొందారు. పెట్టుబడులను దీర్ఘకాలంపాటు కొనసాగిస్తుంటారు. అయితే సంపద వృద్ధికి ప్రధానంగా ఎవెన్యూ సూపర్మార్ట్స్ దోహదం చేసింది. దమానీకి అధిక వాటాలున్న లిస్టెడ్ కంపెనీలలో వీఎస్టీ ఇండస్ట్రీస్, ఇండియా సిమెంట్స్, సుందరం ఫైనాన్స్, ట్రెంట్లను పేర్కొనవచ్చు. డీమార్ట్ దూకుడు ఐపీవో ద్వారా 2017 మార్చిలో స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టయిన ఎవెన్యూ సూపర్మార్ట్స్ షేరు రేసుగుర్రంలా పరుగు తీసింది. దీంతో రూ. 39,813 కోట్ల నుంచి ప్రారంభమైన కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ (విలువ) తాజాగా రూ. 2.36 లక్షల కోట్లకు దూసుకెళ్లింది. ఇది ఆరు రెట్ల వృద్ధికాగా.. దమానీ, ఆయన కుటుంబ వాటా విలువ రూ. 32,870 కోట్ల నుంచి రూ. 1.77 లక్షల కోట్లకు జంప్ చేసింది. గత ఏడాది కాలంలోనే డీమార్ట్ షేరు 62 శాతం పురోగమించడం గమనించదగ్గ అంశం!. -
World Top 100 Billionaires: బిలియనీర్ల క్లబ్లో మరో భారతీయుడు
సాక్షి, వెబ్డెస్క్: ఇండియాలో వ్యాపారం పుంజుకుంటోంది. మన వ్యాపారవేత్తలు వందల కోట్ల ఆస్తులు సంపాదిస్తున్నారు. ప్రపంచ కుబేరుల సరసన నిలుస్తున్నారు. తాజాగా ఇండియా నుంచి మరోకరు ప్రపంచంలోనే అత్యంత ధనవంతులైన వంద మంది బిలియనీర్ల జాబితాలో చేరారు. 97వ స్థానం ఇండియల్ బిగ్బుల్గా పేరొందిన రాకేశ్ ఝున్ఝున్వాలాకు గురులాంటి వ్యక్తి రాధకిషన్ దమానీ. ఏన్నె ఏళ్లుగా ఆయన స్టాక్మార్కెట్లో పెట్టుబడులు పెడుతున్నారు. ఇటీవల ఆయన పోర్ట్ఫోలియోలో ఉన్న ఐదు కంపెనీలు విపరీతమైన ఆదాయాన్ని సంపాదించి పెట్టాయి. దీంతో ఒక్కసారిగా ఆయన ఆదాయం 19.3 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇందులో 4.1 బిలియన్ డాలర్లు ఈ ఒక్క ఏడాదిలోనే ఆయన ఖాతాలో వచ్చి పడింది. దీంతో ప్రపంచ కుబేరుల్లో ఆయన 97వ స్థానంలో నిలిచినట్టు బ్లూమ్బెర్గ్ బిలియనీర్ ఇండెక్స్ ప్రకటించింది. డీమార్ట్ నుంచే రాధాకిషన్ దమానీకి అత్యధిక సంపద తెచ్చిపెట్టిన వ్యాపారంలో ప్రథమ స్థానంలో నిలిచింది డీమార్ట్. దమానీ ప్రధాన ప్రమోటర్గా ఉన్న డిమార్ట్ షేర్ల విలువ ఇటీవల కాలంలో విపరీతంగా పెరిగిపోయింది. డీమార్ట్లో రాధాకిషన్ దమానీకి 65.20 శాతం వాటా కలిగిని ఉన్నారు. డీమార్ట్ షేర్ వాల్యూ జనవరి 1న రూ.2,789 ఉండగా ఆగస్టు 17న ఏకంగా ఒక షేరు విలువ రూ.3,649కి చేరుకుంది. కేవలం ఎనిమిది నెలల్లో షేరు విలువ 31 శాతం పెరిగింది. దీంతో డీమార్ట్ ద్వారా దమానీ ఖాతాలో 1.54 లక్షల కోట్ల సంపద చేరింది. మిగిలినవి దమానీ సంపదలో డీమార్ట్ తర్వాత సుందర్ ఫైనాన్స్ నుంచి రూ.634 కోట్లు, ట్రెంట్గ్రూపు ద్వారా రూ.488 కోట్లు, బ్లూడార్ట్ ఎక్స్ప్రెస్ నుంచి రూ.230 కోట్లు, మెట్రో పోలిస్ హెల్త్కేర్ ద్వారా రూ. 229 కోట్ల సంపదను ఆయన కలిగి ఉన్నారు. చదవండి: ఏడుగురు మహిళలు..రూ.80 పెట్టుబడి కట్ చేస్తే రూ.1600 కోట్ల టర్నోవర్ -
మదనపల్లి ఇండస్ట్రియల్ పార్క్లో పేలుళ్ల కలకలం
సాక్షి, చిత్తూరు: మదనపల్లిలోని ఇండస్ట్రియల్ పార్కులో పేలుళ్ళు కలకలం సృష్టించాయి. భవన నిర్మాణం కోసం డీమార్ట్ సంస్థ నిర్వాహకులు డిటోనేటర్లను పేల్చారు. భారీగా పేలుడు సంభవించడమే గాక బండరాళ్లు ఆ పరిసరాల్లోని నివాస గృహాలపై పడ్డాయి. దీంతో పలు ఇళ్లు దెబ్బతినడంతో పాటు ఐదుగురికి గాయాలుకాగా, వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. డీమార్ట్ సంస్థపై స్థానికుల మండిపడుతున్నారు. ఈ ఘటనపై ఫిర్యాదు స్వీకరించిన పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు. -
డిస్కౌంట్ల డీమార్ట్... లాభాలు ఎంతో తెలుసా ?
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) తొలి త్రైమాసికంలో డీమార్ట్ స్టోర్ల నిర్వాహక సంస్థ ఎవెన్యూ సూపర్మార్ట్స్ ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ1(ఏప్రిల్–జూన్)లో నికర లాభం రెట్టింపునకుపైగా ఎగసి రూ. 95 కోట్లను అధిగమించింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 40 కోట్లు మాత్రమే ఆర్జించింది. గతేడాది క్యూ1లో దేశవ్యాప్త లాక్డౌన్ కారణంగా అమ్మకాలు ప్రభావితమైన విషయాన్ని ఈ సందర్భంగా కంపెనీ ప్రస్తావించింది. కాగా.. మొత్తం ఆదాయం సైతం రూ. 3,883 కోట్ల నుంచి రూ. 5,183 కోట్లకు జంప్చేసింది. మొత్తం వ్యయాలు రూ. 3,875 కోట్ల నుంచి రూ. 5,077 కోట్లకు పెరిగాయి. ఈ క్యూ1 ప్రారంభంలోనూ స్థానికంగా కఠిన లాక్డౌన్లు అమలైనప్పటికీ మూడు, నాలుగు వారాల తదుపరి ఆంక్షలు తొలగుతూ వచ్చినట్లు కంపెనీ తెలియజేసింది. -
డీమార్ట్ లాభాలు ఎంత పెరిగాయో తెలుసా?
సాక్షి, ముంబై: డీమార్ట్ సూపర్మార్కెట్ చెయిన్ అవెన్యూ సూపర్మార్ట్స్ లాభాలతో అదరగొట్టింది. మార్చితో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.413.87 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ఆర్జించింది. గత ఏడాది(2020) ఇదే కాలంలో వచ్చిన రూ.271.28 కోట్ల లాభంతో పోలిస్తే ఇది 52.56 శాతం అధికం. అవెన్యూ సూపర్మార్ట్ లిమిటెడ్కు చెందిన డీ-మార్ట్కు గత త్రైమాసికానికిగాను రూ.7,411.68 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. 2019-20 ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో ఆర్జించిన రూ.6,255. 93 కోట్ల ఆదాయంతో పోలిస్తే 18.47 శాతం అధికమైంది. వార్షికంగా మార్జిన్ ఆధాయం 8.3 శాతం పెరిగి రూ.613 కోట్లకు చేరుకున్నాయి. చదవండి: వాట్సాప్లో ఆర్డర్ చేస్తే ఇంటి వద్దకే ఫుడ్ డెలివరీ! -
రూ.1000 కోట్లు పెట్టి ఇల్లు కొన్న డీమార్ట్ ఓనర్
సాక్షి, ముంబై: వ్యాపారవేత్త, బిలియనీర్, డీమార్ట్ సంస్థ యజమాని రాధాకిషన్ దమాని సుమారు 1,000 కోట్ల రూపాయలకు పైగా వెచ్చించి ఇంటిని కొనుగోలు చేశారు. దక్షిణ ముంబైలోని సంపన్న ప్రాంతాల్లో ఒకటైన మలబార్ హిల్లో ఆయన ఈ ఇంటిని తన సోదరుడు గోపీకిషన్ దమానితో కలిసి కొనుగోలు చేశారు. 5,752.22 చదరపు అడుగుల విస్తీర్ణం గల ఈ ఇంటి ఖరీదు1,001 కోట్ల రూపాయలు. దీని కొనుగోలు నిమిత్తం స్టాంప్ డ్యూటీ కోసం దమాని మహారాష్ట్ర రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖకు ఇప్పటికే రూ.30 కోట్లు చెల్లించారు. ఇక దీని మార్కెట్ విలువ 724 కోట్ల రూపాయలుగా అంచాన వేస్తున్నారు. ఈ ఇంటిని దమాని సౌరభ్ మెహతా, వర్షా మెహతా, జయేశ షా వద్ద నుంచి కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం దమాని ముంబైలోని ఆల్టమౌంట్ రోడ్లోని పృథ్వి అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నారు. ఈ ఇంటిని దమాని పురచంద్ రాయ్చంద్ అండ్ సన్స్ ఎల్ఎల్పీ, పరేష్చంద్ రాయ్చంద్ అండ్ సన్స్ ఎల్ఎల్పీ, ప్రేమ్చంద్ రాయ్చంద్ అండ్ సన్స్ ఎల్ఎల్పీ భాగస్వాముల నుంచి కొనుగోలు చేశారు. హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2021 ప్రకారం, రాధాకిషన్ దమాని 14.5 బిలియన్ డాలర్ల ఆస్తితో భారతీయ సంపన్నుల జాబితాలో ఎనిమిదవ స్థానంలో ఉన్నారు. భారతదేశంలో 209 మంది బిలియనీర్లు ఉండగా, వారిలో 177 మంది ప్రస్తుతం దేశంలో నివసిస్తున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్కు చెందిన ముకేష్ అంబానీ 85 బిలియన్ డాలర్ల ఆస్తులతో భారతీయ సంపన్నుల జాబితాలో ప్రథమ స్థానంలో నిలిచారు. చదవండి: కరోనా వల్ల లాభపడింది ఆ ఒక్కరే -
డీమార్ట్ లాభాలు ఎంత పెరిగాయో తెలుసా?
సాక్షి, ముంబై: డీమార్ట్ సూపర్మార్కెట్ చెయిన్ అవెన్యూ సూపర్మార్ట్స్ లాభాల్లో అదరగొట్టింది. వార్షికంగా తన లాభాలను 16 శాతం మేర పెంచుకుంది. 2020 డిసెంబర్ తో ముగిసిన త్రైమాసికంలో ఆదాయం 11 శాతం పెరిగిందని శనివారం విడుదల చేసిన ఫలితాల్లో వె ల్లడించింది. ఏకీకృత లాభంలో సంవత్సరానికి 16.4 శాతం వృద్ధితో రూ .446.97 కోట్లకు పెరిగింది. గత ఏడాది ఇదే కాలంలో 384.04 కోట్ల రూపాయలను ఆర్జించింది. కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం సంవత్సరానికి 10.8 శాతం పెరిగి 7,542 కోట్ల రూపాయలకు చేరుకోగా, క్వార్టర్ ఆన్ క్వార్టర్ ఆన్ వృద్ధి 42.1 శాతంగా ఉంది. ఆపరేటింగ్ మార్జిన్లు కూడా ఈ త్రైమాసికంలో మెరుగ్గానే ఉన్నాయి. ఇబిఐటిడిఎ ముందు ఆదాయాలు సంవత్సరానికి 15.5 శాతం పెరిగి రూ .689.12 కోట్లకు చేరుకున్నాయి. వార్షికంగా మార్జిన్ విస్తరణ 9.14 శాతంగా ఉంది. పండుగ షాపింగ్ డిమాండ్ మునుపటి రెండు త్రైమాసికాల కంటే మెరుగైన త్రైమాసిక లాభాలును అందించిందని సంస్థసీఎండీ నెవిల్లే నోరోన్హా చెప్పారు. ఎఫ్ఎంసిజియేతర రంగం నుండి సప్లయ్ కొరత, ముడిసరుకు ధరలు కూడా పెరుగుతున్నాయన్నారు. అయితే పరిస్థితిలో కొంత మెరుగుదల ఉన్నా , సమీప కాలంలో అమ్మకాలు మిశ్రమంగా ఉంటాయని, ఇది మార్జిన్లపై ప్రభావం చూపుతుందని ఆయన చెప్పారు. -
యాంబర్ - స్పెన్సర్స్.. జూమ్
హుషారుగా ప్రారంభమైన దేశీ స్టాక్ మార్కెట్లు మరింత జోరందుకున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 347 పాయింట్లు జంప్చేసి 40,330ను తాకింది. నిఫ్టీ 86 పాయింట్లు ఎగసి 11,848 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో డీమార్ట్ స్టోర్ల ప్రమోటర్ రాధాకిషన్ దమానీ కంపెనీలో వాటా కొనుగోలు చేసినట్లు వెల్లడికావడంతో రిటైల్ రంగ కంపెనీ స్పెన్సర్స్ రిటైల్ వెలుగులోకి వచ్చింది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఏసీ దిగుమతులపై నిషేధాన్ని ప్రకటించడంతో కాంట్రాక్ట్ మాన్యుఫాక్చరింగ్ దిగ్గజం యాంబర్ ఎంటర్ప్రైజెస్ కౌంటర్కు డిమాండ్ పెరిగింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఈ రెండు షేర్లూ భారీ లాభాలతో కళకళలాడుతున్నాయి. వివరాలు చూద్దాం.. యాంబర్ ఎంటర్ప్రైజెస్ రిఫ్రిజిరేంట్స్సహా ఎయిర్ కండిషనర్ల(ఏసీ) దిగుమతులపై విదేశీ వాణిజ్య డైరెక్టరేట్ జనరల్(డీజీఎఫ్టీ) నిషేధం విధించిన వార్తలతో రెండు రోజులుగా యాంబర్ ఎంటర్ప్రైజెస్ కౌంటర్ వెలుగులో నిలుస్తోంది. తాజాగా ఎన్ఎస్ఈలో ఈ షేరు 10 శాతం దూసుకెళ్లింది. రూ. 2,410 వద్ద 52 వారాల గరిష్టాన్ని తాకింది. ప్రస్తుతం 7.3 శాతం లాభంతో రూ. 2,340 వద్ద ట్రేడవుతోంది. గత రెండు రోజుల్లో ఈ కౌంటర్ 18 శాతం జంప్చేసింది. స్పెన్సర్స్ రిటైల్ డీమార్ట్ స్టోర్ల మాతృ సంస్థ ఎవెన్యూ సూపర్మార్ట్స్ ప్రమోటర్ రాధాకిషన్ దమానీ క్యూ2లో (జులై-సెప్టెంబర్) స్పెన్సర్స్ రిటైల్లో అదనపు వాటాను కొనుగోలు చేశారు. ఈ ఏడాది జూన్ చివరికల్లా స్పెన్సర్స్ రిటైల్లో రాధాకిషన్ దమానీ 2.09 శాతం వాటాను కలిగి ఉన్నారు. స్పెన్సర్స్ రిటైల్ బీఎస్ఈకి అందించిన వివరాల ప్రకారం సెప్టెంబర్కల్లా దమానీ వాటా 2.20 శాతానికి పెరిగింది. వెరసి 3.25 లక్షల స్పెన్సర్స్ షేర్లను దమానీ క్యూ2లో కొనుగోలు చేసినట్లు వెల్లడైంది. ఈ నేపథ్యంలో స్పెన్సర్స్ రిటైల్ షేరు ఎన్ఎస్ఈలో తొలుత 7 శాతం వరకూ ఎగసింది. రూ. 78 సమీపంలో ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. ప్రస్తుతం 3 శాతం బలపడి రూ. 75 వద్ద ట్రేడవుతోంది. -
డీమార్ట్- 4 రోజుల్లో 15 శాతం డౌన్
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించడంతో కొద్ది రోజులుగా నేలచూపులతో కదులుతున్న ఎవెన్యూ సూపర్మార్ట్స్ షేరు మరోసారి అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు విముఖత చూపుతుండటంతో ప్రస్తుతం ఎన్ఎస్ఈలో 6.3 శాతం పతనమై రూ. 2012 వద్ద ట్రేడవుతోంది. తొలుత 8 శాతం కుప్పకూలి రూ. 1980కు చేరింది. ఇది మూడు నెలల కనిష్టంకాగా.. ఇంతక్రితం మార్చి 25న ఈ స్థాయిలో ట్రేడయ్యింది. ఫలితాలు నిరాశపరచడంతో గత 4 రోజుల్లోనే 15 శాతం తిరోగమించింది. వెరసి ఇటీవల చేపట్టిన క్విప్ ధర(రూ. 2049) కంటే దిగువకు చేరింది. వెనకడుగులో డీమార్ట్ రిటైల్ స్టోర్ల ప్రమోటర్ సంస్థ ఎవెన్యూ సూపర్మార్ట్స్ ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్-జూన్)లో నికర లాభం 88 శాతం పడిపోయి రూ. 40 కోట్లకు పరిమితమైంది. మొత్తం ఆదాయం 34 శాతం క్షీణించి రూ. 33,883 కోట్లను తాకింది. ఇబిటా మార్జిన్లు 7.4 శాతం బలహీనపడి 2.9 శాతానికి చేరాయి. కంపెనీ ఈ నెల 11న ఫలితాలు వెల్లడించిన విషయం విదితమే. కాగా.. కరోనా వైరస్ ఉధృతి నేపథ్యంలో తిరిగి దాదాపు 20 శాతం స్టోర్లను మూసివేసినట్లు తెలుస్తోంది. నిత్యావసరాలకు డిమాండ్ కొనసాగుతున్నప్పటికీ కన్జూమర్ డ్యురబుల్స్ తదితర ప్రొడక్టుల విక్రయాలు మందగించినట్లు రీసెర్చ్ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ తెలియజేసింది. -
డీమార్ట్కు కోవిడ్-19 షాక్
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి త్రైమాసికంలో డీమార్ట్ స్టోర్ల నిర్వాహక సంస్థ ఎవెన్యూ సూపర్మార్ట్స్ నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ1(ఏప్రిల్-జూన్)లో డీమార్ట్ నికర లాభం ఏకంగా 88 శాతం పడిపోయింది. రూ. 40 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2019-20) క్యూ1లో రూ. 323 కోట్ల నికర లాభం ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 33 శాతంపైగా వెనడుగుతో రూ. 3,883 కోట్లను తాకింది. కోవిడ్-19 కట్టడికి ప్రభుత్వం లాక్డవున్ అమలు చేయడం, డిమాండ్ క్షీణించడం వంటి అంశాలు పనితీరును దెబ్బతీసినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. మార్జిన్లు 4.5 శాతం క్షీణించి 1 శాతానికి చేరాయి. గత క్యూ1లో ఇవి 5.5 శాతంగా నమోదయ్యాయి. ఎన్ఎస్ఈలో శుక్రవారం ఈ షేరు 0.5 శాతం బలపడి రూ. 2330 వద్ద ముగిసింది. 80 శాతం రికవరీ వైరస్ విస్తృతి, లాక్డవున్ కారణంగా క్యూ1లో అమ్మకాలు నీరసించినప్పటికీ తిరిగి డిమాండ్ రికవరీ బాట పట్టినట్లు డీమార్ట్ పేర్కొంది. లాక్డవున్ నియంత్రణల ఎత్తివేత తదితర అంశాల నేపథ్యంలో ప్రస్తుతం కోవిడ్ ముందు నమోదైన అమ్మకాల్లో 80 శాతానికి చేరువైనట్లు తెలియజేసింది. అయితే స్టోర్లను అనుమతిస్తున్న సమయం, ఇతర ఆంక్షల కారణంగా నిత్యావసరాల విక్రయాలు మాత్రమే జోరందుకున్నట్లు వివరించింది. ఇతర (నాన్ఎఫ్ఎంసీజీ) ప్రొడక్టులకు డిమాండ్ తగ్గినట్లు వెల్లడించింది. దీంతో ఇకపై కంపెనీ పనితీరుపై అనిశ్చితి ప్రభావం చూపనున్నట్లు తెలియజేసింది. -
ఇండియా సిమెంట్స్పై డీమార్ట్ కన్ను!
దక్షిణాది దిగ్గజం ఇండియా సిమెంట్స్పై రాధాకిషన్ ఎస్ దమానీ కన్నేసినట్లు తెలుస్తోంది. డీమార్ట్ స్టోర్ల నిర్వాహక సంస్థ ఎవెన్యూ సూపర్మార్ట్స్ అధినేత రాధాకిషన్ దమానీ ఇటీవల ఇండియా సిమెంట్స్లో వాటాలు కొంటూ వస్తున్నారు. తాజాగా దమానీ కుటుంబ సభ్యుల వాటా ఇండియా సిమెంట్స్లో 19.89 శాతానికి చేరింది. ఈ ఏడాది(2020) మార్చికల్లా ఇండియా సిమెంట్స్లో దమానీ కుటింబీకుల వాటా 19.89 శాతంగా నమోదైంది. ఈ నేపథ్యంలో ఇండియా సిమెంట్స్ కౌంటర్కు డిమాండ్ పెరిగింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో తొలుత ఎన్ఎస్ఈలో 10 శాతం దూసుకెళ్లింది. రూ. 140 వరకూ ఎగసింది. వెరసి 52 వారాల గరిష్టానికి చేరింది. తదుపరి కొంతమేర వెనకడుగు వేసింది. ప్రస్తుతం 4 శాతం జంప్చేసి రూ. 131 వద్ద ట్రేడవుతోంది. కాగా.. ఎవెన్యూ సూపర్మార్ట్స్ షేరు 1 శాతం క్షీణించి రూ. 2384 వద్ద కదులుతోంది. 5 శాతం నుంచి నిజానికి రాధాకిషన్ దమానీ 2019 డిసెంబర్కల్లా ఇండియా సిమెంట్స్లో 4.73 శాతం వాటాను పొందారు. తదుపరి మరింత వాటాను కొనుగోలు చేయడంతో ప్రస్తుతం 10.29 శాతానికి ఎగసింది. మరోవైపు సోదరుడు గోపీకిషన్ దమానీ సైతం ఇండియా సిమెంట్స్లో 8.26 శాతం వాటాను సొంతం చేసుకున్నారు. కాగా.. ఇండియా సిమెంట్స్ కంపెనీలో నియంత్రిత వాటాను సొంతం చేసుకునే యోచనలో డీమార్ట్ అధినేత రాధాకిషన్ దమానీ ఉన్నట్లు ఆంగ్ల మీడియా పేర్కొంది. గతేడాది(2019-20) క్యూ3లో ఇండియా సిమెంట్స్ స్టాండెలోన్ ప్రాతిపదికన రూ. 5.4 కోట్ల నికర నష్టం ప్రకటించింది. అమ్మకాలు రూ. 1316 కోట్ల నుంచి రూ. 1191 కోట్లకు తగ్గాయి. క్యూ4(జనవరి-మార్చి) ఫలితాలు ప్రకటించవలసి ఉంది. ఈ నెల 24న నిర్వహించనున్న బోర్డు సమావేశంలో క్యూ4 ఫలితాలు వెల్లడించనున్నట్లు కంపెనీ బీఎస్ఈకి తెలియజేసింది. 72 శాతం ర్యాలీ ఇండియా సిమెంట్స్ షేరు 2019 ఆగస్ట్ 23న రూ. 68 వద్ద 52 వారాల కనిష్టాన్ని తాకింది. తదుపరి ఇటీవల దమానీ వాటా కొనుగోలు వార్తలతో ర్యాలీ బాట పట్టింది. ఫలితంగా ఇప్పటివరకూ 72 శాతం ర్యాలీ చేసింది. ఇండియా సిమెంట్స్ను స్నేహపూర్వకంగా టేకోవర్ చేసే బాటలో కంపెనీ చైర్మన్ ఎన్ శ్రీనివాసన్తో రాధాకిషన్ దమానీ చర్చలు కొనసాగిస్తున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే డీమార్ట్ ప్రతినిధి ఒకరు ఈ అంశంపై స్పందించేందుకు నిరాకరించగా.. ఇండియా సిమెంట్స్ ప్రతినిధి తోసిపుచ్చినట్లు మీడియా పేర్కొంది. కాగా.. నేటి ట్రేడింగ్లో ఇండియా సిమెంట్స్ కౌంటర్లో ఇప్పటివరకూ 8.52 లక్షల షేర్లు చేతులు మారాయి. ఇది రెండు వారాల సగటు పరిమాణంకంటే రెండు రెట్లు అధికంకావడం గమనార్హం! -
లాభాల మార్కెట్లో డీమార్ట్ బేజార్
యూరోపియన్, ఆసియా మార్కెట్ల నుంచి అందిన సానుకూల సంకేతాలతో గ్యాపప్తో ప్రారంభమైన దేశీ స్టాక్ మార్కెట్లు హుషారుగా కదులుతున్నాయి. ఉదయం 10.20 ప్రాంతంలో సెన్సెక్స్ ట్రిపుల్ సెంచరీ చేసింది. 315 పాయింట్లు జంప్చేసి 30,988కు చేరింది. ట్రేడింగ్ ప్రారంభంలోనే 31,000 మార్క్ను అధిగమించింది. ఇక నిఫ్టీ సైతం 90 పాయింట్లు ఎగసి 9129 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలోనూ డీమార్ట్ స్టోర్ల నిర్వాహక కంపెనీ ఎవెన్యూ సూపర్మార్ట్స్ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. వెరసి లాభాల మార్కెట్లోనూ నష్టాలతో నేలచూపులకు పరిమితమై కదులుతోంది. వివరాలు చూద్దాం.. నేలచూపులతో డీమార్ట్ స్టోర్ల మాతృ సంస్థ ఎవెన్యూ సూపర్మార్ట్స్ షేరు ప్రస్తుతం ఎన్ఎస్ఈలో 5 శాతం పతనమైంది. రూ. 2284 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 2278 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. దేశవ్యాప్తంగా వణుకు పుట్టిస్తున్న కోవిడ్-19 కట్టడికి లాక్డవున్తోపాటు.. సామాజిక దూరాన్ని అమలు చేస్తుండటంతో రెండు నెలలుగా రిటైల్ స్టోర్లలో అమ్మకాలు క్షీణించినట్లు పరిశ్రమవర్గాలు పేర్కొన్నాయి. స్టోర్ల నిర్వహణ, బిజినెస్ నిర్వహణపై ఆంక్షలు తదితర సవాళ్లు ఇందుకు కారణమవుతున్నట్లు తెలియజేశాయి. దీంతో ఇప్పటికే గతేడాది(2019-20) చివరి త్రైమాసికం(జనవరి-మార్చి)లో డీమార్ట్ ఫలితాలు అంచనాల దిగువన వెలువడినట్లు నిపుణులు పేర్కొంటున్నారు. 2017 మార్చిలో లిస్టయ్యాక కంపెనీ తొలిసారి ఒక త్రైమాసికంలో అంచనాలను అందుకోలేకపోయినట్లు వివరించారు. కాగా.. లాక్డవున్ కొనసాగింపు, అత్యవసరంకాని సరుకుల అమ్మకాలపై ఆంక్షలు, ఈకామర్స్ బిజినెస్కు పెరుగుతున్న డిమాండ్ వంటి అంశాల నేపథ్యంలో పలు బ్రోకింగ్ సంస్థలు ఎవెన్యూ సూపర్మార్ట్స్ ఆర్జనపై అంచనాలు తగ్గిస్తున్నాయి. వెరసి రెండేళ్ల కాలంలో ఈపీఎస్ అంచనాలలో కోతలు పెట్టాయి. ఈపీఎస్ అంచనాల తగ్గింపు ఈ ఆర్థిక సంవత్సరం(2020-21)లో డీమార్ట్ ఈపీఎస్ అంచనాలను 16.8 శాతం తగ్గిస్తున్నట్లు ప్రభుదాస్ లీలాధర్ పేర్కొంది. ఇక వచ్చే ఏడాది(2021-22) ఈపీఎస్లో 8.1 శాతం కోత పెడుతున్నట్లు తెలియజేసింది. ఈ బాటలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నిర్వహణ లాభాలు 17 శాతంమేర తగ్గవచ్చంటూ మోతీలాల్ ఓస్వాల్ అభిప్రాయపడింది. అయితే పటిష్ట బ్యాలన్స్ షీట్, బిజినెస్ మోడల్ కారణంగా ప్రస్తుత సవాళ్ల నుంచి కంపెనీ రికవర్కాగలదని పేర్కొంది. వెరసి వచ్చే ఏడాది నుంచి డీమార్ట్ పుంజుకోగలదని అభిప్రాయపడింది. ఇక డీమార్ట్ కౌంటర్కు ఇటీవల క్రెడిట్ స్వీస్, జేపీ మోర్గాన్ న్యూట్రల్ రేటింగ్ను ప్రకటించగా.. ప్రభుదాస్ లీలాధర్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్, ఐడీబీఐ కేపిటల్ పొజిషన్లను తగ్గించుకోమంటూ సిఫారసు చేశాయి. ఎడిల్వీజ్, జేఎం ఫైనాన్షియల్ ఈ షేరుని హోల్డ్ చేయమంటూ సూచించిన సంగతి తెలిసిందే. -
డీమార్ట్లో ధరలు ఎందుకు పెరిగాయంటే..
ముంబై: దేశంలోని వినియోగదారులను విశేషంగా ఆకర్శించిన సూపర్ మార్ట్స్ రిటైల్ బ్రాండ్ డీమార్ట్ ప్రస్తుతం కరోనా ఉదృతి కారణంగా డీలా పడింది. కరోనా నియంత్రణకు ప్రభుత్వం నిర్దేశించిన అన్ని నియమాలను పాటిస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. ముఖ్యంగా స్టోర్లను శుభ్రంగా ఉంచేందుకు సంస్థకు చాలా ఖర్చు అవుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కారణంగానే వస్తువుల ధరలు కూడా పెంచామని తెలిపారు. వినియోగదారులు ప్రస్తుత పరిస్థితిని అర్థం చేసుకొని సానుకూలంగా ఆలోచించాలని సంస్థ కోరింది. కరోనా నేపథ్యంలో మార్చి నుంచి సంస్థ అమ్మకాల వృద్ధి 11 శాతం తగ్గగా ఏప్రిల్ నెలలో ఏకంగా 45శాతం ఆదాయం కోల్పోయిందని కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు. ఏప్రిల్లో అమ్మకాల వృద్ధి గణనీయంగా తగ్గడానికి లాక్డౌన్ కారణమని సంస్థ సీనియర్ ఉద్యోగులు అభిపప్రాయపడ్ఢారు. ఈ సంక్షోభ సమయంలో సంస్థ ఆదాయాలను పెంచుకోవడానికి హోం డెలివరీని సమర్థవంతంగా వినియోగిస్తామని తెలిపారు. కాగా ఖర్చులను హేతుబద్దీకరించి ప్రణాళికబద్దంగా వ్యవహరిస్తే లాభాల బాట పట్టడం ఖాయమని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ సంవత్సరంలో 38 నూతన స్టోర్లనను తెరవనున్నామని.. తమ సంస్థకు రూ.3500కోట్లు మూలధనం ఉందని, ఎలాంటి సంక్షోభానైనా ఎదుర్కొనే సత్తా డీమార్ట్కు ఉందని సంస్థ ప్రతినిధులు స్పష్టం చేశారు. చదవండి: ఎల్బీ నగర్ డీమార్ట్ను సీజ్ చేసిన అధికారులు -
నిన్న డీమార్ట్.... ఇవాళ రత్నదీప్
సాక్షి, హైదరాబాద్ : కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో తగిన జాగ్రత్తలు పాటించాలంటూ అధికారుల సూచనలు, హెచ్చరికలను పలు సూపర్మార్కెట్లు పట్టించుకోవడం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సూచించిన భౌతిక దూరం నిబంధనలను యాజమాన్యం పాటించకపోవడంతో ఎల్బీ నగర్ డీమార్ట్కు జీహెచ్ఎంసీ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఝలక్ ఇచ్చిన విషయం తెలిసిందే. దాంతో డీమార్ట్ను సీజ్ చేశారు. తాజాగా శ్రీనగర్ కాలనీలోని రత్నదీప్ సూపర్మార్కెట్ను గురువారం అధికారులు సీజ్ చేశారు. (కరోనా కట్టడికి ఇదే మార్గం! భౌతిక దూరం అంటే ఇదీ!) సూపర్ మార్కెట్లో సామాజిక దూరంతో పాటు, వ్యక్తిగత శుభ్రత పాటించకపోవడంతో అధికారులు ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. కాగా నిబంధనల ప్రకారం భౌతిక దూరంతో పాటు ...సూపర్ మార్కెట్కు వచ్చేవారికి శానిటైజర్లు కూడా యాజమాన్యం ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అయితే అధికారుల తనిఖీల్లో రత్నదీప్ సూపర్ మార్కెట్ అలాంటి చర్యలు తీసుకోకపోవడంతో సీజ్చేసి నోటీసులు అంటించారు. (కోవిడ్-19: ఇలా చేస్తే కరోనా రాదు!) -
హైదరాబాద్లో డీమార్ట్ సీజ్
సాక్షి, హైదరాబాద్ : కరోనా విజృంభిస్తున్న వేళ నిబంధనలు పాటించని ఎల్బీ నగర్ డీమార్ట్కు జీహెచ్ఎంసీ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు షాకిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సూచించిన భౌతిక దూరం నిబంధనలను యాజమాన్యం పాటించకపోవడంతో.. అధికారులు సూపర్ మార్కెట్ను సీజ్ చేశారు. మంగళవారం ఎల్బీ నగర్ ప్రాంతంలోని డీమార్ట్లో ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీ చేయగా.. పెద్ద ఎత్తున వినియోగదారులు కనిపించారు. అయితే వినియోగదారలు సూపర్ మార్కెట్లో భౌతిక దూరం పాటించేలా యాజమాన్యం కనీస చర్యలు తీసుకోకపోవడంతో అదికారులు సదరు డీమార్ట్ను సీజ్ చేసి నోటీసులు అంటించారు. డీమార్ట్లో కనీసం కస్టమర్ల కోసం శానిటైజర్స్ కూడా యాజమాన్యం ఏర్పాటు చేయనట్టుగా తెలుస్తోంది. కాగా, కరోనా కట్టడిలో భాగంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతుడటంతో.. పలు షరతులతో సూపర్ మార్కెట్స్కు నిత్యావసరాల విక్రయానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. సరకుల విక్రయానికి కొన్ని గంటలే అనుమతులిచ్చారు. అయితే ఈ సమయంలో భౌతిక దూరంతోపాటు.. ఇతర కరోనా నియంత్రణ చర్యలు పాటించాలని సూపర్ మార్కెట్స్ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. -
రూ.100 కోట్ల సాయం.. మోదీ ప్రశంస!
న్యూఢిల్లీ: కలిసి కట్టుగా పోరాడి భారత్ మహమ్మారి కరోనాను తరిమికొడుతుందని ప్రధానమంత్రి మోదీ ట్విటర్ వేదికగా పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజలు కరోనాపై పోరును మరింత బలోపేతం చేసే విధానం ప్రశంసనీయమన్నారు. ఈ సందర్భంగా బ్రైట్ స్టార్ ఇన్వెస్ట్మెంట్స్ తరపున రూ.100 కోట్లు విరాళం అందించిన అవెన్యూ సూపర్ మార్ట్స్ రిటైల్ బ్రాండ్ డీమార్ట్ ప్రమోటర్ రాధాకిషన్ దామనిని ప్రధాని ప్రశంసించారు. కాగా, బ్రైట్ స్టార్ ఇన్వెస్ట్మెంట్స్ కంపెనీ పీఎం కేర్స్తోపాటు రూ.55 కోట్లను ఆయా రాష్ట్రాలకు విరాళంగా ఇచ్చిన సంగతి తెలిసిందే. (చదవండి: కరోనా అతన్ని బిలియనీర్ చేసింది) మహారాష్ట్ర, గుజరాత్కు రూ.10 కోట్లు చొప్పున, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, రాజస్తాన్, పంజాబ్ రాష్ట్రాలకు రూ.5 కోట్లు, తమిళనాడు, ఛత్తీస్గర్, మధ్య ప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు రెండున్నర కోట్ల చొప్పున సాయం చేసింది. కోవిడ్ కట్టడికి త్వరితగతిన చర్యలు తీసుకుంటున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మద్దతునిస్తున్నామని ప్రకటించింది. కాగా, లాక్డౌన్ భయాల్లో జనం భారీగా కొనుగోళ్లు సాగించడంతో బ్రైట్ స్టార్ ఇన్వెస్ట్మెంట్స్ సంస్థల్లో ఒకటైన డీమార్ట్కు అమ్మకాలు వెల్లువెత్తాయి. దేశవ్యాప్తంగా 206 డీమార్ట్ సూపర్మార్కెట్లు ఉన్నాయి. (చదవండి: కరోనాతో ఫైట్కు డీమార్ట్ రూ.155 కోట్ల విరాళం) Together, India will certainly overcome the COVID-19 menace. The manner in which people from all walks of life are making the fight stronger is commendable. The contribution to PM-CARES by Bright Star Investments is appreciable. https://t.co/BIfCCT9Zup — Narendra Modi (@narendramodi) April 14, 2020 -
కరోనా వల్ల లాభపడింది ఆ ఒక్కరే
ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోన్న కరోనా మహమ్మారి మరణ మృదంగం మోగిస్తోంది. వైరస్కు జన్మస్థానమైన చైనాలోని వూహాన్లో పరిస్థితి చక్కబడ్డప్పటికీ మిగతా దేశాల్లో మాత్రం దీని విజృంభణ ఎంతకూ తగ్గడం లేదు. దీంతో దీని వ్యాప్తిని నివారించేందుకు పలు దేశాలు లాక్డౌన్ బాటలో నడిచాయి. మన దేశంలోనూ ప్రభుత్వం 21 రోజులపాటు లాక్డౌన్ను విధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు దాన్ని పొడిగించే ప్రయత్నంలోనూ ఉంది. ఇదిలా ఉండగా దేశంలో కరోనా వల్ల ఆర్థిక సంక్షోభం రెట్టింపవడంతోపాటు కేంద్ర, రాష్ట్ర ఖజానాలు ఖాళీ అవుతున్నాయి. ఇంతటి విపత్కర పరిస్థితిలోనూ ఆదాయాన్ని వృద్ధి చేసుకున్న ఏకైక వ్యక్తి అవెన్యూ సూపర్ మార్ట్ రిటైల్ బ్రాండ్ డీమార్ట్ అధినేత రాధాకిషన్ దామాని. (రిటైల్లో 80వేల ఉద్యోగాలకు గండం..) ధరలు కాస్త తక్కువగా ఉంటాయన్న పేరుతో హైదరాబాద్ వంటి నగరాల్లో జనం ఎక్కువగా డీమార్ట్లో షాపింగ్ చేసేందుకు ఆసక్తి చూపుతారు. పైగా లాక్డౌన్ వల్ల నిత్యావసరాలకు కొరత వస్తుందనే భయంతో పెద్ద ఎత్తున జనాలు డీమార్ట్ ముందు క్యూ కట్టారు. వారి భయాందోళనలే అతనికి వ్యాపారం బాగా జరిగేందుకు లాభపడ్డాయి. ఒక్కసారిగా కొనుగోళ్లు పెరగడంతో ఆయన సంపద 5 శాతం పెరిగి 10.2 బిలియన్ డాలర్లకు చేరుకుందని బ్లూంబెర్గ్ సంస్థ వెల్లడించింది. దీంతో భారత్లోని టాప్ 12 శ్రీమంతుల్లో ఆయన ఒకరుగా నిలిచారు. అంతేకాక డీమార్ట్ షేర్ విలువ సైతం ఏకంగా 18 శాతం పెరిగింది. కరోనాతో పోరాటానికి ఆయన రూ.155 కోట్లు విరాళంగా ప్రకటించిన సంగతి తెలిసిందే (కరోనాతో ఫైట్కు డీమార్ట్ రూ.155 కోట్ల విరాళం) -
కరోనా: డీమార్ట్ రూ.155 కోట్ల విరాళం
న్యూఢిల్లీ: ప్రపంచాన్ని గడగడలాడిస్తోన్న కరోనాను ఎదుర్కొనేందుకు పారిశ్రామికవేత్తలు, సెలబ్రిటీలు, క్రీడాకారులు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు పెద్ద మొత్తంలో విరాళాలను ప్రకటిస్తూ తమవంతు సాయం చేస్తున్నారు. ఈ క్రమంలో అవెన్యూ సూపర్ మార్ట్స్ రిటైల్ బ్రాండ్ డీమార్ట్ ఆర్థిక సాయం అందించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు పీఎం కేర్స్ ఫండ్కు రూ.155 కోట్లను విరాళంగా ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే ఇందులో పీఎం కేర్స్ ఫండ్కు రూ.100 కోట్లు, కరోనా ప్రభావిత రాష్ట్రాలకు రూ.55 కోట్లు ఇస్తున్నట్లు వెల్లడించింది. (ఆందోళన వద్దు) దీని గురించి డీమార్ట్ ప్రమోటర్ రాధాకృష్ణన్ డామని మాట్లాడుతూ.. "భారత్తోపాటు ప్రపంచ దేశాలు ఇంతకుముందెన్నడూ లేని గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. ప్రజలను సంరక్షించేందుకు కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాలు తీసుకునే చర్యలకు మేము పూర్తిగా మద్దతిస్తున్నాం. మన సమాజాన్ని రక్షించుకునేందుకు ప్రతి ఒక్కరు కూడా తమవంతు కృషి చేయాల"ని పిలుపునిచ్చారు. కాగా డీమార్ట్ పీఎం కేర్స్ ఫండ్కు రూ.100 కోట్లు ప్రకటించగా.. మహారాష్ట్ర, గుజరాత్లకు రూ.10 కోట్లు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, రాజస్థాన్, పంజాబ్ రాష్ట్రాలకు రూ.5 కోట్లు, తమిళనాడు, ఛత్తీస్ఘడ్, మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్లకు రూ.2.5 కోట్లు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. (జనం చస్తుంటే ఈ వంటావార్పులేంటి: సానియా) -
ఫుల్గా తాగేసి.. కరెంట్ పోల్ ఎక్కేశాడు!
-
క్వార్టర్ మందు ఇస్తేనే పోల్ దిగుతా!
సాక్షి,హైదరాబాద్: సికింద్రాబాద్లో మందుబాబు హల్చల్ చేశాడు. మద్యం మత్తులో సంగీత్ డీమార్ట్ సమీపంలోని ఓ వీధి స్తంభం ఎక్కి కిందకు దూకుతానని బెదిరించాడు. అతన్ని ఇలియాజ్గా స్థానికులు గుర్తించారు. కిందకు దిగాలని స్థానికులు, పోలీసులు అతనికి సర్దిచెప్పే యత్నం చేసినా వినిపించుకోలేదు. తనకు క్వార్టర్ మద్యం ఇస్తేనే స్తంభం దిగుతానని, లేదంటే పైనుంచి దూకుతానంటూ బేరానికి వచ్చాడు. చివరికి అతని ‘డిమాండ్’ మేరకు మద్యం సీసా తీసుకొచ్చి చూపించడంతో పోల్ దిగేందుకు అంగీకరించాడు. స్ట్రీట్ లైట్స్ బిగించేందుకు ఉపయోగించే క్రేన్ సాయంతో జీహెచ్ఎంసీ సిబ్బంది అతన్ని కిందకు దించారు. -
ప్రాణం మీదకు తెచ్చిన ‘చాక్లెట్ గొడవ’
హస్తినాపురం: నోరూరించే చాక్లెట్ ఓ ఇంటర్ విద్యార్థి ప్రాణాలు పోవడానికి కారణమైంది. డీమార్ట్లో చాక్లెట్ తీసుకొని డబ్బులు చెల్లించలేదని, సెక్యూరిటీ సిబ్బంది అడగడంతో ఆదివారం సాయంత్రం షాపింగ్ వచ్చిన సతీష్ (18) భయంతో కుప్పకూలాడని ఆ సంస్థ చెబుతోంది. సెక్యూరిటీ సిబ్బంది దాడివల్లనే తమ కుమారుడు మృతి చెందాడని అతని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. హయత్నగర్ పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా ఇది హత్యా?.. లేక ఆకస్మిక మరణమా అనేది తేలనుంది. డీమార్ట్లో షాపింగ్ చేసి బయటకు వచ్చేంత వరకు సీసీటీవీ కెమెరాల్లో రికార్డుకాగా, బయటకొచ్చాక అతడు కింద పడిపోయిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాకు చిక్కకపోవడం అనుమానాలకు తావిస్తోంది. డీమార్ట్ ఎంట్రెన్స్కు 40 మీటర్ల దూరంలో పడిపోయిన సతీష్ను ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా చనిపోయినట్లుగా రాత్రి 10 గంటల ప్రాంతంలో నిర్ధారించారు. ఘటనాస్థలిని ఎల్బీనగర్ డీసీపీ సన్ప్రీత్సింగ్ సందర్శించారు. అసలేం జరిగిందంటే..: సూర్యాపేట జిల్లా జగ్గు తండాకు చెందిన లౌడ్య బాలాజీకి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు సతీష్(18) హయత్నగర్లోని శ్రీచైతన్య కళాశాలలో ఇంటర్ ఎంపీసీ రెండో సంవత్సరం చదువుతూ అదే హాస్టల్లో ఉంటున్నాడు. 10 మంది విద్యార్థులు ఆదివారం సాయంత్రం ఔటింగ్కు వెళ్లారు. సతీష్ తన ఇద్దరు స్నేహితులతో కలసి రాత్రి 8.10కి వనస్థలిపురం డీమార్ట్లోనికి వెళ్లాడు. ఈ క్రమంలో సతీష్ డైరీ మిల్క్ చాక్లెట్ జేబులో వేసుకున్నట్లు సీసీటీవీ కెమెరాల ద్వారా గుర్తించిన సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమైంది. అప్పటికే ఎగ్జిట్ గేట్ దాటి బయటకు వచ్చిన సతీష్ను సెక్యూరిటీ సిబ్బం ది పిలవడంతో చాక్లెట్ను జేబులో నుంచి కిందపడేశాడు. అప్పటికే చెమటలు పట్టిన సతీష్ ఒక్కసారిగా కుప్పకూలడంతో మిగతా ఇద్దరు స్నేహితులు అక్కడి నుంచి పారి పోయారు. మరణవార్త తెలుసుకొని వచ్చిన సతీష్ తల్లిదండ్రులు మాత్రం కాలేజీ యజమాన్యం నిర్లక్ష్యం, డీమార్ట్ సెక్యూరిటీ సిబ్బంది దాడివల్లనే తమ కుమారుడు చనిపోయాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, వి ద్యార్థి సతీష్ను బంధువుల అనుమతితోనే ఔటింగ్కు పం పామని కళాశాల ప్రిన్సిపల్ స్నేహలత తెలిపారు. ఇంటర్ విద్యార్థిని దొంగతనం నెపంతో కొట్టి హతమార్చిన డీమా ర్ట్ యాజమాన్యంపై ఎస్టీ, ఎస్టీ అట్రాసిటీతో పాటు హత్య కేసు నమోదు చేయాలని లంబాడ ఐక్యవేదిక డిమాండ్ చేసింది. ఆ సంస్థ ఎదుట సోమవారం ధర్నా నిర్వహించా రు. డీమార్ట్ను మూసివేసి వారిపై హత్య కేసు నమోదు చేయాలని బాలల హక్కుల సంఘం డిమాండ్ చేసింది. -
డీమార్ట్లో విద్యార్థి మృతి.. కీలక విషయాలు
-
డీమార్ట్లో విద్యార్థి మృతి.. కీలక విషయాలు
సాక్షి, హైదరాబాద్ : హయత్ నగర్ శ్రీ చైతన్య కళాశాల విద్యార్థి సతీష్ మృతి కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. వనస్థలిపురం డిమార్ట్ వద్ద ఆదివారం రాత్రి శ్రీచైతన్య కాలేజీ విద్యార్థి సతీష్ అనుమానాస్పదంగా మృతి చెందిన విషయం తెలిసిందే. డిమార్ట్ సెక్యూరిటీ సిబ్బంది కొట్టడం వల్లే తమ కూమారుడు మృతి చెందాడని సతీష్ తల్లిదండ్రులు ఆరోపిస్తుండగా, డిమార్ట్ సెక్యూరిటీ సతీష్ను కొట్టలేదని, చాక్లెట్ దొంగిలించాడనే భయంతో అతను కిందపడిపోయి మృతి చెందాడని తోటి విద్యార్థులు చెబుతున్నారు. (చదవండి : చాక్లెట్ నేరం; విద్యార్థిపై డీమార్ట్ సిబ్బంది దాడి) ‘షాపింగ్ చేస్తుండగా సతీష్ చాక్లెట్ను జేబులో వేసుకున్నాడు. సెక్యూరిటీ గార్డ్ తనిఖీలు చేస్తున్న సమయంలో సతీష్ దానిని కిందపడేశాడు. అయినప్పటికీ ఇంకో మహిళా సెక్యూరిటీ చాక్లెట్ను తీసుకొని సతీష్ను పట్టుకున్నారు. దీంతో సతీష్ సొమ్మసిల్లి సెక్యూరిటీ గార్డ్ మీద పడిపోయాడు. సెక్యూరిటీ గార్డ్ ఇదంతా యాక్టింగ్ అని, ఇలాంటి వాళ్లను చాలామందిని చూశానని అన్నారు. అప్పటికే మేమంతా సతీష్ దగ్గరకు వచ్చి కాళ్లు, చేతులు రఫ్ చేశాం. వెంటనే దగ్గరలో ఉన్న ఆస్పత్రికి తీసుకెళ్లగా, అప్పటికే సతీష్ చనిపోయాడని డాక్టర్లు చెప్పారు. డీ మార్ట్ సెక్యూరిటీ సతీష్ను కొట్టలేదు. చాక్లెట్ దొంగిలించినందుకు సతీష్ భయంతో పడిపోయాడు. ఈ విషయాన్ని వెంటనే ప్రిన్సిపల్కు తెలియాజేశాం’ అని సతీష్ తోటి విద్యార్థులు పేర్కొన్నారు. తప్పు చేశారని తేలితే ఉపేక్షించం : ఎల్బీనగర్ డీసీపీ సతీష్ మరణం దురదృష్టకరమని ఎల్బీనగర్ డీసీపీ సన్ ప్రీత్ సింగ్ అన్నారు. ఈ ఘటనపై సతీష్ తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టామని పేర్కొన్నారు. డీమార్ట్ సెక్యూరిటీ గార్డ్ ఘర్షణకు దిగి దాడి చేయడం వల్లే తమ కుమారుడు మృతి చెందాడని సతీష్ తండ్రి ఆరోపిస్తున్నారని, ఒకవేళ అదే నిజమైతే చర్యలు తీసుకుంటామని చెప్పారు. డీమార్ట్లో ఉన్న సీసీటీవీ కెమెరాలను, సైంటిఫిక్ ఎవిడెన్స్ను కలెక్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. తప్పు చేశారని తేలితే ఉపేక్షించేది లేదని డీసీపీ పేర్కొన్నారు. డీమార్ట్ సిబ్బంది దాడి వల్లే మృతి డీమార్ట్ సెక్యూరిటీ సిబ్బంది దాడి చేయడం వల్లే తమ కుమారుడు మృతి చెందాడని సతీష్ తల్లిదండ్రులు, బంధువులు ఆరోపించారు. 25 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలంటూ సతీష్ బంధువులు డీమార్ట్ ఎదుట ఆందోళనకు దిగారు. శ్రీచైతన్య కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యంగానే సతీష్ మృతి చెందారని, ఆ కాలేజీ గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఔటింగ్ పంపించే సమయంతో కాలేజీ యాజమాన్యం తమ అనుమతి తీసుకోలేదని ఆరోపించారు. అనుమతి తీసుకున్నాం కాలేజీ నుంచి విద్యార్థులను ఔటింగ్ పంపడానికి తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరిగా తీసుకుంటామని హయత్ నగర్ శ్రీచైతన్య కాలేజీ ప్రిన్సిపల్ పేర్కొన్నారు. సతీష్ని బయటకు పంపేముందు తల్లిదండ్రులకు ఫోన్ చేశామని, వారు లిఫ్ట్ చేయలేదన్నారు. దీంతో సతీష్ నాయక్ బావ అనుమతి తీసుకొని ఔటింగ్కు పంపించామని చెప్పారు. గంట పాటు ఔటింగ్కు అనుమతి కోరుతూ సతీష్ లెటర్ కూడా ఇచ్చారని తెలిపారు. సతీష్ మృతి పట్ల కళాశాల యాజమాన్యం తప్పులేదన్నారు. సతీష్ చనిపోవడం బాధాకరమని, ఇలాంటి ఘటనలు జరగకుండా భవిష్యత్తులో మరిన్ని చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. -
విద్యార్థిపై డీమార్ట్ సిబ్బంది దాడి
-
చాక్లెట్ చోరీ.. విద్యార్థిపై డీమార్ట్ సిబ్బంది దాడి
సాక్షి, హైదరాబాద్ : నగరంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఇంటర్ చదువుతున్న విద్యార్థి ఎల్. సతీష్(17) వనస్థలిపురంలో అనుమానాస్పదంగా మృతి చెందాడు. వనస్థలిపురంలోని డీమార్ట్లో షాపింగ్ చేయడానికి ఆదివారం తన స్నేహితులతో వెళ్లిన సతీష్కు సెక్యూరిటీతో గొడవ ఏర్పడింది. డీమార్టులో చాక్లెట్ దొంగిలించాడని విద్యార్థిపై సిబ్బంది దాడికి దిగారు. కాసేపటికి సతీష్ మృత్యువాత పడ్డాడు. దీంతో సెక్యూరిటీ వారు దాడి చేయడం వల్లే తన కొడుకు మరణించాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కాగా హయత్నగర్లోని శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో సతీష్ ఇంటర్ సెంకడ్ ఇయర్ చదువుతున్నాడు. ఈ క్రమంలో తల్లిదండ్రుల అనుమతి లేకుండానే సతీష్ను కళాశాల యాజమాన్యం బయటకు పంపినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. -
డీమార్ట్ వద్ద ఉత్కంఠ
ఒంగోలు: స్థానిక రిమ్స్ వద్ద ఉన్న డీమార్ట్ షోరూంలో సోమవారం మధ్యాహ్నం డేంజర్ అలారం మోగింది. దీనికి తోడు స్టోర్ గదిలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుందని, వినియోగదారులు ఇన్గేటు, ఎగ్జిట్ గేటు ద్వారా సురక్షితంగా బయటకు చేరుకోవాలని అక్కడి సిబ్బంది మైక్లో ప్రచారం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ లిఫ్టు వినియోగించొద్దంటూ సిబ్బంది సూచనలు చేశారు. కొనుగోలుదారుల్లో తీవ్ర అలజడి రేగింది. ప్రమాదం ముంచుకొస్తుందనే భయంతో వారంతా మెట్ల మార్గం వైపు పరుగులు తీశారు. అంతా ఒకేసారి మెట్ల వైపునకు రావడంతో స్వల్ప తొక్కిసలాట జరిగింది. మరో వైపు బయట ఉన్న జనానికి ఏం జరుగుతుందో అర్థంగాక మరింత ఆందోళనకు గురయ్యారు. ఈ క్రమంలో మాల్ నుంచి బయటకు చేరుకున్న జనం మాల్ మేనేజర్ను నిలదీశారు. ఏమిటిదంతా అని ప్రశ్నించడంతో ప్రతి మూడు నెలలకోసారి తమ షోరూంలో ఫైర్ సేఫ్టీ కార్యక్రమంలో భాగంగా నిర్వహించే మాక్ డ్రిల్గా చెప్పుకొచ్చారు. ప్రమాదం ఏమీ లేదని, ఒక వేళ ఫైర్ ఘటన వంటివి ఏవైనా జరిగితే వాటి నుంచి వినియోగదారులను సురక్షితంగా బయటకు పంపడం ఎలా అనే అంశంపై అవగాహన కార్యక్రమమని చెప్పకొచ్చారు. మీ ఇష్టం వచ్చినట్లు మీరు మాక్ డ్రిల్ అంటూ చెప్పుకుంటే సరిపోదని, ఏదైనా జరగరానిది జరిగితే బాధ్యత ఎవరంటూ వినియోగదారులు నిలదీశారు. అక్కడకు చేరుకున్న ఒంగోలు ఫైర్ ఆఫీసర్ ప్రజలకు సర్ది చెప్పారు. అనంతరం ఫైర్ ఆఫీసర్ వై.వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడుతూ పెద్ద పెద్ద సంస్థల్లో ఫైర్ సేఫ్టీ మాక్ డ్రిల్ తప్పనిసరన్నారు. అందులో భాగంగా సోమవారం మాక్డ్రిల్ నిర్వహించాలని నిర్ణయించామని, అందులో భాగంగా డీమార్ట్ షోరూం ఫైర్ ఆఫీసర్.. జిల్లా ఫైర్ ఆఫీసర్కు సమాచారం అందించారన్నారు. -
మరోసారి అదరగొట్టిన డీమార్ట్
సాక్షి, ముంబై: లిస్టింగ్లోనే అదరగొట్టి సత్తా చాటిన డీమార్ట్ వరుసగా తన హవా చాటుతోంది. డీమార్ట్ పేరుతో, భారతదేశంలో దుకాణాలు నడుపుతున్న అవెన్యూ సూపర్ మార్ట్స్ మరోసారి దుమ్ము రేపింది. అద్భుతమైన త్రైమాసిక ఫలితాలతో దూసుకుపోయింది. ఫలితాల్లో ఎనలిస్టుల అంచనాలను సైతం అధిగమించి ఇన్వెస్టర్లను అబ్బురపర్చింది. గత ఏడాదితో పోలిస్తే డీమార్ట్ లాభం దాదాపు 100కోట్ల మేర పుంజుకుంది. ఈ త్రైమాసికంలో నికరలాభం 43శాతం పెరిగి రూ.250 కోట్లకు చేరింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలోరూ.174 కోట్ల లాభాన్ని నమోదు చేయడం గమనార్హం. అలాగే ఈ ఏడాది తొలి క్వార్టర్లో కంపెనీ రెవెన్యూ 27శాతం పుంజుకుని రూ.4559 కోట్ల ఆదాయాన్ని సంస్థ ఆర్జించింది. గతేడాది ఇది రూ. 3,598గా ఉంది. ఇది సుమారు రూ.251 కోట్ల నెట్ ప్రాఫిట్ను సంస్థ ఆర్జించింది. రూ.423 కోట్లుగా నమోదైంది. ఎబిటా మార్జిన్లు కూడా గత ఏడాది 8.4 శాతం నుంచి కూడా 9.3 శాతానికి పుంజుకున్నాయి. పన్నులు, తరుగుదల, రుణ విమోచన (ఈబీఐటీడీఏ) కంపెనీలు గత ఏడాది 303 కోట్ల రూపాయల నుంచి 39.4 శాతం పుంజుకుని రూ .423 కోట్లకు చేరింది. కాగా డీ మార్ట్ షేరు స్వల్ప లాభాలతో ముగిసింది. -
మార్కెట్ క్యాప్లో డీమార్ట్ దూకుడు
సాక్షి, ముంబై: డీ-మార్ట్ సూపర్ మార్కెట్ చెయిన్ను నిర్వహించే అవెన్యూ సూపర్మార్ట్స్ లాభాలతో దూసుకుపోతోంది. దీంతో సంస్థ మార్కెట్ క్యాపిటలైజేషన్ లక్ష కోట్ల రూపాయలను తాకింది. సోమవారం డీమార్ట్ షేర్ ధర 1619 వద్ద 52 వారాల గరిష్టాన్ని తాకింది. ఈ దూకుడుతో ప్రస్తుత మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 100,440.16 కోట్లకు చేరింది. ఈ ఏడాది ఏప్రిల్మాసంలోనే తొలిసారి సంస్థ మార్కెట్ క్యాపిటలైజేషన్ 900 బిలియన్ రూపాయల(రూ.90వేల కోట్ల) మార్కును క్రాస్ చేసింది. తాజాగా మరో మైలురాయిని అధిగమించింది. కేవలం రెండు నెలలకాలంలోనే మరో 10వేల కోట్లను మార్కెట్ క్యాప్లో జత చేసుకోవడం విశేషం. డీమార్ట్లను నిర్వహించే అవెన్యూ సూపర్మార్ట్స్ స్టాక్మార్కెట్లో లిస్టు అయిన తొలిరోజునుంచీ దుమ్మురేపుతున్న సంగతి తెలిసిందే. భారీ లాభాలతో సంస్థ అధినేత రాధాకృష్ణ దమానీని అపరకుబేరుడిని చేసింది. అలాగే రికార్డు స్థాయిలో దూసుకెళ్లిన అవెన్యూ సూపర్మార్ట్స్ మార్చి త్రైమాసికం ఫలితాల్లో అదరగొట్టింది. 65.8 శాతం పుంజుకున్న సంస్థ నికర లాభాలు రూ.251. 8 కోట్లగా రికార్డయ్యాయి. గత ఏడాది ఇదే కాలంలో రూ .151.9 కోట్లు నమోదయింది. కంపెనీ ఆదాయం 23 శాతం పెరిగి రూ .4,094.8 కోట్లకు చేరింది. ఆపరేటింగ్ మార్జిన్ 10.3 శాతంతో 8.63 శాతంగా నమోదైంది. -
పండుగ కోసం ఊరెళ్దామనుకుంది అంతలోనే..
-
అదరగొట్టిన డీమార్ట్
న్యూఢిల్లీ : డీమార్ట్లను నిర్వహించే అవెన్యూ సూపర్మార్ట్స్ స్టాక్మార్కెట్లో లిస్టు అయిన తొలిరోజే దుమ్మురేపి, అనంతరం కొన్ని రోజుల్లోనే ఆ సంస్థ అధినేత రాధాకృష్ణ దమానీని అపరకుబేరుడిని చేసిన సంగతి తెలిసిందే. రికార్డు స్థాయిలో దూసుకెళ్లిన అవెన్యూ సూపర్మార్ట్స్, లాభాల్లోనూ అదరగొట్టింది. శనివారం ప్రకటించిన లాభాల్లో ఏడాది ఏడాదికి 47.60 శాతం పెరుగుదలను నమోదుచేసింది. దీంతో కంపెనీ లాభాలు 2017-18 తొలి త్రైమాసికంలో రూ.174.77 కోట్లగా రికార్డయ్యాయి. గతేడాది ఇదే క్వార్టర్లో ఈ సంస్థ లాభాలు రూ.118.44 కోట్లగా ఉన్నాయి. మొత్తం ఆదాయాలు కూడా రూ.3,620.95 కోట్లకు పెరిగినట్టు కంపెనీ నేడు బీఎస్ఈకి సమర్పించిన ఫైలింగ్లో పేర్కొంది. ఇది ఏడాది ఏడాదికి 36.3 శాతం పెరుగుదల. ఈబీఐటీడీఏలు కూడా ఈ క్వార్టర్లో 36 శాతం పెరిగాయని, అవి రూ.326 కోట్లగా నమోదైనట్టు కంపెనీ చెప్పింది. గతేడాది ఇదే క్వార్టర్లో ఈబీఐటీడీఏలు రూ.239.70 కోట్లగా మాత్రమే ఉన్నట్టు కంపెనీ తన రిపోర్టులో తెలిపింది. అయితే ఈబీఐటీడీఏ మార్జిన్లు మాత్రం ఫ్లాట్గా 9 శాతం మాత్రమే నమోదయ్యాయి. కాగ, అవెన్యూ సూపర్మార్ట్స్ షేర్లు ఏప్రిల్లో రికార్డు వర్షం కురిపించడంతో దమానీ, అత్యంత ధనవంతులైన భారతీయుల్లో ఒకరిగా నిలిచారు. ప్రపంచంలోని 500 మంది కుబేరుల్లో కూడా ఆయనకు చోటు దక్కింది. బ్లూంబర్గ్ బిలినీయర్ గణాంకాల ప్రకారం అప్పుడు దమానీ సంపద 4.10 బిలియన్ డాలర్లుగా నమోదైంది. 2002లో దమానీ అవెన్యూ సూపర్మార్ట్స్ని స్థాపించారు. దేశంలోనే అత్యంత లాభాల్లో ఉన్న ఫుడ్ అండ్ గ్రోసరీ రిటైలర్ డీమార్ట్ బ్రాండ్ కింద అవెన్యూ సూపర్మార్ట్స్ కంపెనీ పనిచేస్తుంది. మొత్తం 9 రాష్ట్రాలు సహా మరో కేంద్ర పాలిత ప్రాంతంలో కలిపి కంపెనీకి 118 స్టోర్లు ఉన్నాయి.