health workers
-
అనర్హులను ఎలా నియమిస్తారు?
సాక్షి, హైదరాబాద్: సుప్రీంకోర్టు, హైకోర్టు ఉత్తర్వులతో తొలగింపునకు గురైన 1,200 మందిని కాంట్రాక్టు పద్ధతిలో బహుళ ప్రయోజన ఆరోగ్య కార్యకర్తలుగా విధుల్లోకి తీసుకోవడం చట్టవిరుద్ధమని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2013లో జారీ చేసిన జీవో 1207ను కొట్టివేసింది. బహుళ ప్రయోజన ఆరోగ్య కార్యకర్తల నియామకంపై 2002లో అర్హతల వివాదం నెలకొనగా, నిబంధనలకు విరుద్ధంగా సర్కార్ జీవోలు జారీ చేసి, నియామకాలు చేపట్టడం సరికాదని పేర్కొంది. ఈ అంశాన్ని ఉన్నత, అత్యున్నత న్యాయస్థానాలు తప్పుబట్టిన విషయాన్ని గుర్తు చేసింది. అర్హతలకు సంబంధించి న్యాయస్థానాలు తీర్పులు వెలువరించిన తర్వాత వాటికి విరుద్ధంగా మళ్లీ జీవో తీసుకురావడాన్ని తప్పుబట్టింది. ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించలేమని, వారి తప్పును కొనసాగించలేమని వ్యాఖ్యానిస్తూ.. ఈ ఉత్తర్వులు వెలువడిన 90 రోజుల్లోగా అర్హులతో జాబితా రూపొందించి చర్యలు చేపట్టాలని తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలకు తేల్చిచెప్పింది. అర్హులైన వారిని కొనసాగించవచ్చని పేర్కొంది. బహుళ ప్రయోజన ఆరోగ్య కార్యకర్తల నియామకానికి సంబంధించి 2002లో ఇచి్చన నోటిఫికేషన్ వివాదాస్పదమైంది. దీనిపై కొందరు హైకోర్టును ఆశ్రయించారు. గుర్తింపు పొందిన సంస్థ నుంచి హెల్త్ అసిస్టెంట్లుగా డిప్లొమా చేసిన వారినే అర్హులుగా పరిగణించాలని స్పష్టం చేసింది. ఆ మేరకే మెరిట్ జాబితా రూపొందించాలని ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు కూడా ఇదే తీర్పును సమర్థించింది. దీంతో ప్రభుత్వం సరైన అర్హతలు లేని 1,200 మందిని తొలగిస్తూ జీవో జారీ చేసింది. అయితే ఇంత మందిని ఒకేసారి తొలగించాల్సి రావడంతో ప్రభుత్వం వీరందరినీ కాంట్రాక్టు విధానంలో తీసుకుంటూ జీవో 1207 జారీ చేసింది. దీనిపై కొందరు నాడు ఏపీ పరిపాలన ట్రిబ్యునల్లో పిటిషన్లు దాఖలు చేయగా, సర్కార్ నిర్ణయం సబబేనని చెప్పింది. ట్రిబ్యునల్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ కొందరు హైకోర్టులో పిటిషన్లు వేశారు. ఖాళీలుంటే నిబంధనల మేరకు భర్తీ.. ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన జస్టిస్ సుజోయ్పాల్, జస్టిస్ నామవరపు రాజేశ్వర్రావు ధర్మాసనం తీర్పు వెలువరించింది. ‘కేవలం 9 ఏళ్లు (2002 నుంచి) సర్వీస్ చేశారన్న కారణంగా సుప్రీంకోర్టు, హైకోర్టు నిర్ధారించిన అర్హతలు లేని వారిని కాంట్రాక్టు విధానంలో తీసుకోవడం సరికాదు. రెగ్యులర్, కాంట్రాక్టు విధానం.. ఏ నియామకమైనా అర్హతలు పాటించాల్సిందే. ఒకసారి తొలగించిన వారిని తిరిగి విధుల్లోకి తీసుకోవడం చెల్లదు.ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తే.. గతంలో హైకోర్టు, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులకు విరుద్ధంగా ఉత్తర్వులిచ్చినట్లే అవుతుంది. 1,200 మందిని కాంట్రాక్టు పద్ధతిలో తీసుకోవడం తప్పుబట్టాల్సిందే. 90 రోజుల్లో అర్హులతో జాబితా రూపొందించాలని తెలంగాణ, ఏపీ సర్కార్లను ఆదేశిస్తున్నాం. అర్హులను కొనసాగింపుపై చర్యలు తీసుకోవచ్చు. ఒకవేళ ఇంకా ఖాళీలు ఉంటే చట్టప్రకారం నిబంధనలు పాటిస్తూ నియామకాలు చేపట్టవచ్చు’అని తీర్పులో స్పష్టం చేసింది. -
హెల్త్ వర్కర్తో అనుచిత ప్రవర్తన.. ఒక్కసారిగా షాకైన మహిళ!
ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న ఓ హెల్త్ వర్కర్ను గుర్తు తెలియని యువకుడు వేధింపులకు గురిచేశాడు. ఆసుపత్రిలో ఫోన్ మాట్లాడుతున్న మహిళను వెనుక వచ్చి బలవంతంగా కౌగిలించుకుని, ముద్దుపెట్టుకుని వేధించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక, బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టు తెలిపారు. వివరాల ప్రకారం.. బీహార్లోని జముయ్ జిల్లాలో బాధితురాలు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో ఆరోగ్య కార్యకర్తగా విధులు నిర్వహిస్తోంది. కాగా, ఈనెల 10వ తేదీన ఆమె విధుల్లో ఉన్న సమయంలో ఫోన్ మాట్లాడుతున్న క్రమంలో ఓ యువకుడు అనుచితంగా ప్రవర్తించాడు. వెనుక నుంచి వచ్చి ఆమెను బలవంతంగా ముద్దుపెట్టి, కౌగిలించికున్నాడు. ఈ క్రమంలో బాధితురాలు విడిపించుకునే ప్రయత్నం చేసింది. దీంతో, వెంటనే నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. అనంతరం, ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ సందర్బంగా బాధితురాలు మాట్లాడుతూ.. అతనెవరో నాకు తెలియదు. నన్ను మానసికంగా హింసించాడు. ఆసుపత్రి కాంపౌండ్ గోడ దూకి ఎందుకు వచ్చాడు. అతడు నాతో తప్పుగా ప్రవర్తించినప్పుడు నేను ప్రతిఘటించాను. వెంటనే నా చేతిలో నుంచి తప్పించుకున్నాడు. ఇంతలో ఆసుపత్రి సిబ్బందిని పిలిచాను. కానీ, గోడ దూకి అతను పారిపోయాడు. దీనికి కారణమైన అతడిని పట్టుకుని కఠినంగా శిక్షించాలి. సరిహద్దు గోడ చాలా చిన్నదిగా ఉంది. ముళ్ల కంచె వేసి ఆసుపత్రికి తరచుగా వచ్చే మహిళలను రక్షించాలని అధికారులను అభ్యర్థిస్తున్నాను అని తెలిపారు. ఇక, బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్టు స్థానిక పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీ టీవీ ఫుటేజీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. -
రూ.500 కోసం జుట్టు జుట్టు పట్టుకుని....చెప్పులతో కొట్టుకున్నారు: వైరల్ వీడియో
ప్రభుత్వ ఆపీస్లో పై అధికారి తలబిరుసుతనంతో తన కింద పనిచేసిన వాళ్లపై చేయిచేసుకోవడం వంటి పలు ఘటనలు గురించి విన్నాం. ఇటీవలే ఒక నర్సు ఆలస్యంగా వచ్చినందుకు ఒక ఆరోగ్యాధికారి దాడి చేసేందుకు ప్రయత్నించిన వీడియోలను చూశాం. లక్షల్లోనూ లేదా కోట్ల ఆస్తి గురించి దెబ్బలాడుకున్నా ఓ అర్థం ఉంటుంది. కానీ కేవలం రూ 500 కోసం కొట్టుకోవడం గురించి విన్నారా. పైగా ఆపేందుకు ప్రయత్నించిన కూడా తగ్గేదే లే అన్నట్టుగా ఘోరంగా కొట్టుకున్నారు. ఈ ఘటన బీహార్లో చోటుచేసుకుంది. అసలు విషయంలోకెళ్తే....బీహార్లో జాముయ్ జిల్లాలోని లక్ష్మీపూర్ బ్లాక్లో ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ఇద్దరు ఆరోగ్య కార్యకర్తలు ఒకరినోకరు జుట్టుపట్టుకుని లాక్కుంటూ దారుణంగా కొట్టుకున్నారు. ఆఖరికి ఒక వ్యక్తి జోక్యం చేసుకుని ఆపేందుకు ప్రయత్నించాడు. అయినప్పటికీ ఆ ఇద్దరూ చేతులతోనూ, చెప్పులతోను ఘోరంగా కొట్టుకున్నారు. అయితే ఆశా వర్కర్ రింటూ కుమారి బీసీజీ వ్యాక్సిన్ షాట్ కోసం ఆక్సిలరీ నర్సు మిడ్వైఫ్(ఏఎన్ఎం) రంజన కుమారి వద్దకు నవజాత శిశువును తీసుకెళ్లినప్పుడే ఈ వివాదం తలెత్తింది. అయితే వ్యాక్సిన్ వేసేందుకు ఆ ఆక్సిలరీ నర్సు రూ 500 డిమాండ్ చేయడంతో ఈ గోడవ జరిగింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం ఆన్లైన్ వైరల్గా మారింది. దీంతో ఆస్పత్రి ఉన్నతాధికారులు విచారణ ప్రారంభించారు. అయితే ఇప్పటి వరకు ఆ కార్యకర్తలపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని అధికారులు తెలిపారు. ये दृश्य @NitishKumar के स्वास्थ्य विभाग की असलियत की कहानी बयान कर रहा हैं जहां एक टीका के बदले 500 घूस की माँग पर एएनएम और आशा सेविका ऐसे उलझ गयी @ndtvindia @Anurag_Dwary @mangalpandeybjp @PratyayaIAS pic.twitter.com/98JrknbpMk — manish (@manishndtv) January 24, 2022 (చదవండి: లావుగా ఉన్నాడని ఉద్యోగంలోంచి తీసేశారు!) -
తెలంగాణలోని టీచింగ్ ఆస్పత్రులపై కోవిడ్ పంజా
-
షాకింగ్ వీడియో: డ్యూటీకి డుమ్మా కొట్టిన నర్సు.. మరునాడు ఆస్పత్రికి వెళ్లగా
Hospital staff member attacking the woman: బీహార్లోని జాముయి జిల్లాలోని గ్రాస్రూట్లో ఒక మహిళా నర్సు ఒకరోజు విధులకు హాజరుకానందుకు సదరు ఆసుపత్రి సిబ్బంది మందలించారు. అంతేకాదు విధులకు హాజరు కానట్లయితే తొలగిస్తామని కూడా హెచ్చరించారు. అయితే ఇంతలో ఒక వ్యక్తి సదరు నర్సు పై అరవడం మొదలు పెట్టాడు. దీంతో ఇద్దరూ ఒకరిపై ఒకరు అరుచుకున్నారు. కోపంతో ఊగిపోయిన ఆ వ్యక్తి నర్సుపై దాడికి దిగాడు. (చదవండి: చిప్స్ ప్యాకెట్లతో నులి వెచ్చటి దుప్పట్లు!) దీంతో పక్కనే ఉన్న సహోద్యోగులు జోక్యం చేసుకోవడంతో గోడవ కాస్త సద్దుమణిగింది. అయితే ఈ ఘటనకు సంబంధించిన వీడియోని ఆస్పత్రి సిబ్బంది ఒకరు రికార్డు చేసి సోషల్ మీడియోలో పోస్ట్ చేయడంతో వైరల్గా మారింది. అయితే ఆ వీడియోలో సదరు వ్యక్తి గొడవ పెద్దదవుతుందంటూ అధికారికి తెలియజేశాడు. ఇక ఊహించని పరిణామంతో కంగుతిన్న ఆ నర్సు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అయితే గ్రామీణ ప్రాంతాల్లో కూడా కోవిడ్ విజృంభిస్తున్న తరుణంలో వ్యాక్సినేషన్ డ్రైవ్లో ఆరోగ్య సిబ్బంది పాత్ర పాత్ర చాలా కీలకం. (చదవండి: ఒమిక్రాన్ ప్రమాదకారి కాదని అనుకోవద్దు, ఆస్పత్రుల్లో చేరుతున్నారు.. ప్రాణాలు పోతున్నాయ్) वैक्सिनेशन के काम में लगे एक एएनएम के साथ जमुई ज़िले के चकाई रेफ़रल अस्पताल के वरीय स्टाफ़ कैसे मारपीट कर रहे हैं देखिए इसका एक विडीओ @ndtvindia @Anurag_Dwary @Suparna_Singh pic.twitter.com/HMPnQmJU9X — manish (@manishndtv) January 7, 2022 -
సీపీసీహెచ్ లేకున్నా.. దరఖాస్తు చేసుకోవచ్చు
సాక్షి, అమరావతి: మిడ్ లెవల్ హెల్త్ వర్కర్స్ పోస్టులకు బీఎస్సీ (నర్సింగ్) కోర్సులో సర్టిఫికెట్ ప్రోగ్రాం ఫర్ కమ్యూనిటీ హెల్త్ (సీపీసీహెచ్) పూర్తి చేయని వారిని సైతం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునేందుకు హైకోర్టు అనుమతినిచ్చింది. దరఖాస్తుల సమర్పణకు శనివారం (6వ తేదీ) చివరి రోజు అయిన నేపథ్యంలో హైకోర్టు ఈ ఆదేశాలిచ్చింది. సీపీసీహెచ్ లేని వారికి సంబంధించిన మెరిట్ జాబితాను మాత్రం తమ ఆదేశాల తరువాతే ప్రకటించాలని అధికారులకు స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఈ నెల 8కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ అసనుద్దీన్ అమానుల్లా, జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్తో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులిచ్చింది. బీఎస్సీ (నర్సింగ్) కోర్సులో సర్టిఫికెట్ ప్రోగ్రాం ఫర్ కమ్యూనిటీ హెల్త్ (సీపీసీహెచ్) పూర్తి చేసిన వారు మాత్రమే మిడ్ లెవల్ హెల్త్ వర్కర్స్ పోస్టుల భర్తీకి దరఖాస్తు చేసుకోవాలన్న వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ ప్రకటనను సవాలు చేస్తూ ఏపీ నర్సింగ్ సంక్షేమ సంఘం హైకోర్టులో శుక్రవారం అత్యవసరంగా లంచ్మోషన్ రూపంలో పిల్ దాఖలు చేసింది. ఈ వ్యాజ్యంపై జస్టిస్ అసనుద్దీన్ ధర్మాసనం విచారణ జరిపింది. బీఎస్సీ (నర్సింగ్) కోర్సులో సీపీసీహెచ్ను 2019 ఫిబ్రవరిలో ప్రారంభించారని పిటిషనర్ సంఘం తరఫు న్యాయవాది తెలిపారు. 2019కి ముందు ఈ ప్రోగ్రాం లేదని, ప్రోగ్రాం తీసుకొచ్చిన తరువాత జరుగుతున్న మొదటి రిక్రూట్మెంట్ ఇదేనని వివరించారు. 2019కి ముందు బీఎస్సీ నర్సింగ్ కోర్సు చేసిన వారు మిడ్ లెవల్ హెల్త్ వర్కర్స్ పోస్టుల భర్తీకి అనర్హులవుతారని, ఇది ఏకపక్ష నిర్ణయమని, అందువల్ల ఇందులో జోక్యం చేసుకుని, సీపీసీహెచ్ లేని వారు సైతం దరఖాస్తు చేసుకునే అనుమతినివ్వాలని కోరారు. ఈ నెల 6వ తేదీనే దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ అని, ఇప్పుడు దరఖాస్తుల సమర్పణకు అనుమతివ్వకపోతే తమ ఈ వ్యాజ్యం నిరర్థకం అవుతుందని చెప్పారు. పూర్తి వివరాల సమర్పణకు గడువు కావాలని సహాయ ప్రభుత్వ న్యాయవాది కోర్టును కోరారు. వాదనలు విన్న ధర్మాసనం, మిడ్ లెవల్ హెల్త్ వర్కర్స్ పోస్టుల భర్తీకి సంబంధించి సీపీసీహెచ్ లేని వారు సైతం దరఖాస్తు చేసుకునేందుకు అనుమతినివ్వాలని అధికారులను ఆదేశించింది. తదుపరి విచారణ ఈ నెల 8కి వాయిదా వేసింది. -
వ్యాక్సిన్ వేసుకోలేదు.. 3000 మంది ఆరోగ్య కార్యకర్తలు సస్పెండ్
పారిస్: కరోనా కట్టడికి వ్యాక్సినేషన్ కీలకమని వైద్యులు చెప్తున్నా కొందరు మాత్రం సోషల్మీడియాలో చక్కర్లు కొడుతున్న అవాస్తవాలను నమ్మి టీకా వేసుకోవడానికి ముందుకు రావడం లేదు. దీంతో కొన్ని ప్రభుత్వాలు వ్యాక్సిన్ వేసుకోవడం కంపల్సరీ అంటూ అల్టీమేటం జారీ చేస్తున్నాయి. ఫ్రాన్స్లో అయితే ఏకంగా కరోనా టీకా తీసుకోనందుకు 3,000 మంది ఆరోగ్య కార్యకర్తలను సస్పెండ్ చేసింది అక్కడ ప్రభుత్వం. వ్యాక్సిన్ వేసుకోవాలంటూ హెల్త్ వర్కర్స్కు డెడ్లైన్ విధించామని, అలా ఆచరించకపోతే జీతం కూడా చెల్లించకుండా సస్పెండ్ చేస్తామని ముందే వారికి తెలిపినట్లు, తాజాగా వాటినే అమలు చేస్తున్నామని ఆ దేశ ఆరోగ్య మంత్రి తెలిపారు. కాగా దేశ వ్యాప్తంగా ఉన్న ఆరోగ్య కేంద్రాలు, ఆస్పత్రిలో పని చేసే సిబ్బందిలో టీకా తీసుకోని వారికి ఈ మేరకు బుధవారం నోటీసులు పంపినట్లు ఆయన చెప్పారు. అయితే కొంత మంది సిబ్బంది వ్యాక్సిన్ తీసుకోవడానికి ముందుకు రాకపోగా తమ ఉద్యోగాలకు కూడా రాజీనామా చేశారు. దీని బట్టి స్పష్టమౌతోంది ఆ దేశంలో టీకాపై ఎన్ని అపోహలు ఉన్నాయో. ఇక భారీ సంఖ్యలో ఆరోగ్య సిబ్బంది సస్పెండైనప్పటికీ ప్రజల ఆరోగ్య సంరక్షణకు భరోసా కల్పిస్తామని మంత్రి తెలిపారు. చదవండి: మోదీకి నిద్రలేకుండా చేస్తాం.. ఎస్ఎఫ్జే గ్రూప్ హెచ్చరిక -
ఆరోగ్య కార్యకర్తలకు భద్రత కల్పించండి
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కట్టడిలో కీలకంగా పని చేస్తున్న ఆరోగ్య కార్యకర్తల భద్రత, సంక్షేమం కోసం అన్ని చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆరోగ్య శాఖ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచించింది. అంటువ్యాధుల చట్టాన్ని(సవరణ) కఠినంగా అమలు చేయాలని పేర్కొంది. కరోనా కాలంలో ప్రజారోగ్య పరిరక్షణలో హెల్త్కేర్ వర్కర్స్ పాత్ర విస్మరించలేనిదని కేంద్ర ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రెటరీ లవ్ అగర్వాల్ ప్రశంసించారు. వారి భద్రత, సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని కోరుతూ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల అదనపు చీఫ్ సెక్రెటరీలకు, ప్రిన్సిపల్ సెక్రెటరీలకు, హెల్త్ సెక్రెటరీలకు లేఖ రాశారు. కొన్ని ప్రాంతాల్లో ఆరోగ్య కార్యకర్తలపై దాడులు జరుగుతున్నట్లు తెలుస్తోందని, ఇది చాలా బాధాకరమని అన్నారు. పనిచేసే చోట, నివాసం ఉండే చోట వారికి పూర్తి భద్రత కల్పించాలని కోరారు. అస్సాం, పశ్చిమ బెంగాల్, కర్ణాటకలో ఇటీవల వైద్యులు, నర్సులపై భౌతిక దాడులు జరిగాయని ఆయన తన లేఖలో ప్రస్తావించారు. ఇలాంటి పరిణామాలు ఆరోగ్య కార్యకర్తల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీస్తాయని తెలిపారు. ఆరోగ్య కార్యకర్తలపై దాడికి దిగేవారిపై నాన్ బెయిలబుల్ కేసు పెట్టాలంటూ అంటువ్యాధుల చట్టం–1897లో సవరణ చేస్తూ గత ఏడాది ఏప్రిల్ 22న ఆర్డినెన్స్ తీసుకొచ్చామని, దీన్ని ఒక చట్టంగా సెప్టెంబర్ 29న నోటిఫై చేశామని లవ్ అగర్వాల్ గుర్తుచేశారు. ఈ చట్టం కింద హెల్త్ కేర్ సిబ్బందికి, వారి ఆస్తులకు రక్షణ కల్పించాల్సి ఉంటుందన్నారు. చట్టాన్ని ఉల్లంఘించిన వారికి జైలుశిక్షతోపాటు జరిమానా విధిస్తారని పేర్కొన్నారు. చదవండి: సీఎం కుమారుడిపై చర్యలు తీసుకోండి -
కరోనా పేషెంట్ మృతి.. హెల్త్ వర్కర్లపై దాడి
ఇంఫాల్: కరోనా మహమ్మారిపై ప్రాణాలకు తెగించి పోరాడుతున్న హెల్త్ వర్కర్లపై భౌతిక దాడులు జరుగుతున్నాయి. మొన్న అస్సాంలో హెల్త్ వర్కర్లపై దాడి ఘటన మరువకముందే తాజాగా మణిపూర్లోని జవహర్లాల్ నెహ్రూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(జెన్ఐఎమ్ఎస్)లో కరోనా పేషెంట్ బంధువులు హెల్త్ వర్కర్లపై దాడికి దిగారు. దీంతో పాటు ఐసీయూ వార్డులోనూ మెడికల్ ఎక్విప్మెంట్ను నాశనం చేశారు. ఇవన్నీ అక్కడి ఆసుపత్రి సీసీటీవీలో రికార్డు అయ్యాయి. కాగా 33 ఏళ్ల మహిళ కరోనాతో బాధపడుతూ ఆదివారం కన్నుమూయడంతో ఆమె బంధువులు ఆగ్రహంతో ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు సమాచారం. ఆసుపత్రి వర్గాలు అందించిన సమాచారం మేరకు.. మూడ్రోజుల క్రితం కరోనాతో సదరు మహిళ మా ఆసుపత్రిలో చేరింది. అప్పటికే ఆమెకు ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందిగా మారడంతో ఐసీయూకు షిఫ్ట్ చేయాలని మహిళ బంధువులకు ఆసుపత్రి వర్గం తెలిపింది. కానీ వారు అందుకు ఒప్పుకోలేదు.. అయితే ఆదివారం ఆమె పరిస్థితి విషమించడంతో ఐసీయూలోకి షిఫ్ట్ చేసిన కాసేపటికే మృతి చెందింది. విషయం తెలుసుకున్న బంధువులు ఆసుపత్రికి వచ్చి హెల్త్ వర్కర్లపై దాడికి దిగారు. అంతేగాకుండా ఐసీయూలోని మెడికల్ ఎక్విప్మెంట్ను నాశనం చేశారు. కాగా హెల్త్ వర్కర్లపై దాడిని జెన్ఐఎమ్ఎస్ మెడికల్ సూపరిండెంట్ డాక్టర్ కేహెచ్ లోకేశ్వర్సింగ్ ఖండించారు. కరోనా మహమ్మారి కష్టకాలంలో పగలు, రాత్రి తేడా లేకుండా పనిచేస్తున్న వారిపై దాడికి దిగడం అవమానీయం. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. అని పేర్కొన్నారు. చదవండి: డాక్టర్పై భయానక దాడి.. వెంటాడి.. వేటాడి -
వైద్య సిబ్బంది సాహసం: వ్యాక్సిన్ కోసం నది దాటి
కశ్మీర్: హిమాలయ రాష్ట్రం జమ్మూకశ్మీర్లో వ్యాక్సినేషన్ ప్రక్రియకు ప్రతిబంధకాలు ఏర్పడుతున్నాయి. కొండలు.. లోయలు.. నదులు దాటుకుంటూ వెళ్లేందుకు సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. మారుమూల గ్రామాల్లో టీకాలు వేసేందుకు వైద్య సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతూ వెళ్తున్నారు. నది దాటుతూ ఆరోగ్య సిబ్బంది వెళ్తున్న వీడియో వైరల్గా మారింది. వారి పనితీరుకు సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. ఈ ఘటన రాజౌరి జిల్లాలో జరిగింది. రాజౌరి జిల్లాలోని కంది బ్లాక్ ప్రాంతంలోని మారుమూల ప్రాంతాలకు వ్యాక్సిన్ వేసేందుకు ఆరోగ్య సిబ్బంది నలుగురు బయల్దేరారు. అయితే మార్గమధ్యలో తావి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. అయినా కూడా ఆ సిబ్బంది నదిలో నడుస్తూ వెళ్లారు. మోకాలి లోతు నీరు చేరగా ఓ వ్యక్తి సహాయంతో వ్యాక్సిన్ డబ్బాలు పట్టుకుని అతి జాగ్రత్తగా నది దాటారు. వారిలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. ఓ వ్యక్తి సహాయంతో మహిళలు అతి కష్టంగా నది దాటుతున్న వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయడమే లక్ష్యంగా వ్యాక్సినేషన్ను ముమ్మరం చేసినట్లు కంది ప్రాంత బ్లాక్ వైద్యాధికారి డాక్టర్ ఇక్బాల్ మాలిక్ తెలిపారు. తమ పరిధిలోని ప్రాంతాలు వెనకబడి ఉన్నాయని, ఆ ప్రాంతాల్లో కరోనా నివారణకు వ్యాక్సిన్ ప్రక్రియను వంద శాతం పూర్తి చేయడమే లక్ష్యంగా పని చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆ వైద్య సిబ్బందిని అభినందించారు. జమ్మూకశ్మీర్వ్యాప్తంగా 33,98,095 డోసుల వ్యాక్సిన్ వేశారు. -
వైద్య సిబ్బందిని కిడ్నాప్ చేసిన మావోయిస్టులు
సాక్షి, చర్ల: సరిహద్దు ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు ముగ్గురు వైద్య సిబ్బందిని కిడ్నాప్ చేశారు. గంగుళూరు పోలీస్స్టేషన్ పరిధిలోని కామకనార్ గ్రామంలో గర్భిణులు, బాలింతలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించేందుకు మాస్టర్ ట్రైనర్ శారద వచ్చారు. ఈ క్రమంలో గురువారం రాత్రి హెల్త్ వర్కర్ ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో మావోయిస్టులు అక్కడికి వచ్చారు. శారద, మరో ఇద్దరు హెల్త్ వర్కర్లను కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. ఈ విషయాన్ని ఎస్పీ కమలోచన్ కాశ్యప్ ధ్రువీకరించారు. కాగా, వైద్య సిబ్బంది కిడ్నాప్తో బీజాపూర్లో కలకలం రేగింది. మావోయిస్టులను అరెస్టు చేయలేదు చర్ల: మావోయిస్టులను అరెస్టు చేసినట్లు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవమని బస్తర్ రేంజ్ ఐజీ సౌందర్రాజ్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఎదురుకాల్పుల తర్వాత కొందరు గ్రామస్తులు పోలీసులతో కలసి బేస్ క్యాంపు వరకు వచ్చారని, ఆ తర్వాత వారందరినీ వెంటనే తిరిగి వారి ఇళ్లకు పంపించామని తెలిపారు. ఎటువంటి ఆధారం లేకుండా ఇటువంటి తప్పుడు ప్రచారం చేయడం సరైంది కాదన్నారు. చదవండి: రాకేశ్వర్ సింగ్ విడుదల అంత ఆషామాషీగా జరగలేదు -
వరంగల్: టీకా తీసుకున్న హెల్త్కేర్ వర్కర్ మృతి
సాక్షి, హైదరాబాద్: కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వరంగల్ అర్బన్ జిల్లా న్యూ శాయంపేట యూపీహెచ్సీ పరిధిలోని దీన్దయాళ్ నగర్కు చెందిన అంగన్వాడీ టీచర్ (హెల్త్కేర్ వర్కర్) గన్నారపు వనిత (45) ఆదివారం రాత్రి ఛాతీనొప్పితో మృతి చెందింది. వ్యాక్సిన్ తీసుకున్నప్పటి నుంచి వనిత కొద్దిపాటి అనారోగ్యంగా ఉందని కాలనీవాసులు చెబుతున్నారు. ఈ నెల 19న మధ్యాహ్నం 12 గంటలకు న్యూ శాయంపేట పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కరోనా టీకా తీసుకున్న 45 ఏళ్ల మహిళా ఆరోగ్య కార్యకర్త ఆదివారం తెల్లవారుజామున మరణించినట్లు తమ దృష్టికి వచ్చిందని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విషయమై జిల్లా సైడ్ ఎఫెక్ట్స్ పర్యవేక్షణ కమిటీ నుంచి రాష్ట్ర సైడ్ ఎఫెక్ట్స్ కమిటీకి నివేదిక పంపాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు. రాష్ట్ర స్థాయి కమిటీ పరిశీలన అనంతరం ఆ నివేదికను కేంద్ర సైడ్ ఎఫెక్ట్స్ కమిటీకి పంపుతామన్నారు. చదవండి: (వికటించిన వ్యాక్సిన్.. ఆశ కార్యకర్త బ్రెయిన్ డెడ్!) -
టీకాపై అపోహలు తొలగిద్దాం
లక్నో: కరోనా వ్యాక్సిన్కు హడావుడిగా ఇచ్చిన అనుమతులపై రాజకీయాలు చేయడం తగదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హితవు పలికారు. రాజకీయ నాయకులు అక్కడా, ఇక్కడా ఏవేవో మాట్లాడుతూ ఉంటారని, కానీ శాస్త్రవేత్తల నిర్ణయం మేరకే తాను ముందుకి అడుగులు వేశానని అన్నారు. సాధారణ ప్రజల్లో వ్యాక్సిన్ పట్ల నెలకొన్న భయాందోళనలను తొలగించాల్సిన అవసరం ఉందన్నారు. ఉత్తరప్రదేశ్లోని తన సొంత నియోజకవర్గం వారణాసిలో కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వైద్య సిబ్బందితో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముచ్చటించారు. ‘‘కరోనా టీకా భద్రత, సామర్థ్యంపై ప్రజల్లో ఎన్నో అపోహలున్నాయి. టీకా తీసుకున్న ఆరోగ్య సిబ్బంది వ్యాక్సిన్కు క్లీన్ చిట్ ఇస్తే ప్రజల్లో గట్టి సందేశం వెళుతుంది’’అని ప్రధాని అన్నారు. కరోనా వ్యాక్సిన్ తీసుకున్న ఆస్పత్రి మాట్రన్, నర్సు, ల్యాబ్ టెక్నీషియన్, డాక్టర్లతో ప్రధాని 30 నిముషాల సేపు మాట్లాడారు. మోదీతో మాట్లాడిన వారందరూ తమకు వ్యాక్సిన్ వల్ల ఎలాంటి సైడ్ అఫెక్ట్లు రాలేదని వెల్లడించారు. వారణాసి జిల్లా మహిళా ఆస్పత్రి మాట్రాన్ పుష్ప దేవితో తొలుత మోదీ మాట్లాడారు. కరోనా వ్యాక్సిన్ సురక్షితమైనదన్న నమ్మకం మీకుందా అని ప్రశ్నించారు. దానికి ఆమె టీకా తీసుకోవడం తన అదృష్టంగా భావిస్తున్నట్టు తెలిపారు. ‘‘వ్యాక్సిన్ అంటే ఒక ఇంజక్షన్ తీసుకోవడం లాంటిదే. దీని వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు లేవు. అందరినీ టీకా తీసుకోవాలని నేను చెబుతున్నాను’’అని ఆమె వెల్లడించారు. డీడీయూ ఆస్పత్రి చీఫ్ డాక్టర్ వి శుక్లాతో మాట్లాడిన ప్రధాని కరోనా సంక్షోభ సమయంలో వైద్య సిబ్బంది చేసిన కృషిని ప్రశంసించారు. డాక్టర్ శుక్లా కూడా వ్యాక్సిన్తో మేలే జరుగుతుందని అన్నారు. ఎవరికైనా సైడ్ అఫెక్ట్లు వచ్చినా దానికి వారి అనారోగ్య సమస్యలే కారణమని చెప్పారు. టీకా ఇవ్వడంలో ఆస్పత్రుల మధ్య పోటీ ఉంటే రెండో విడతని త్వరగా ప్రారంభించవచ్చునని ప్రధాని సూచించారు. శాస్త్రవేత్తలు చెప్పిందే చేశాం హైదరాబాద్లోని భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతులు ఇవ్వడంపై చెలరేగిన విమర్శల్ని ఈ సందర్భంగా ప్రధాని పరోక్షంగా ప్రస్తావించారు. టీకా విషయంలో రాజకీయాలు చేయడం ఎంత మాత్రమూ తగదని అన్నారు.‘‘వ్యాక్సిన్కి అనుమతులివ్వడంపై నేను ఒక్కటే చెబుతాను. శాస్త్రవేత్తలు చెప్పినట్టే చేశాను. ఇది రాజకీయ నాయకుల పని కాదు’’అని అన్నారు. వ్యాక్సిన్ త్వరగా అందుబాటులోకి రాకపోవడంతో తాను ఎంతో ఒత్తిడిని ఎదుర్కొన్నట్టు మోదీ చెప్పారు. మోదీకి హసీనా ధన్యవాదాలు కరోనా వ్యాక్సిన్ కోవిషీల్డ్ 20 లక్షల డోసుల్ని భారత్ కానుకగా పంపించడంపై బంగ్లా ప్రధాని షేక్ హసీనా హర్షం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపారు. బంగ్లాదేశ్లో కరోనా కేసులు పెరిగిపోతున్న సంక్షోభ సమయంలో టీకా డోసులు అందడం ఆనందంగా ఉందన్నారు. టీకా పంపిణీకి ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేశామని వెల్లడించారు. -
దేశమంతటా టీకా పండుగ
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అతి పెద్దదయిన కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం భారత్లో శనివారం ప్రారంభమైంది. తొలి దశలో దేశవ్యాప్తంగా వేలాది మంది ఆరోగ్య సంరక్షణ సిబ్బందికి, ఫ్రంట్లైన్ యోధులకు టీకా ఇచ్చారు. మెడికల్ సెంటర్లలో కోవిషీల్డ్, కోవాగ్జిన్ టీకాలను అందజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఆసుపత్రులు, ఆరోగ్య కేంద్రాల్లో పండుగ వాతావరణం కనిపించింది. రంగురంగుల పూలు, బెలూన్లతో అందంగా అలంకరించారు. టీకా తీసుకునేందుకు వచ్చిన లబ్ధిదారులకు సాదర స్వాగతం పలికారు. కొన్నిచోట్ల ప్రార్థనలు సైతం చేశారు. మిఠాయిలు పంచారు. వ్యాక్సిన్ బాక్సులకు పూలదండ చేసి, హారతి ఇచ్చిన దృశ్యాలు కూడా కనిపించాయి. మనీశ్ కుమార్ ఫస్ట్ దేశంలో కరోనా వ్యాక్సిన్ తీసుకున్న మొట్టమొదటి వ్యక్తిగా పారిశుధ్య కార్మికుడు మనీశ్ కుమార్(34) గుర్తింపు పొందాడు. ఢిల్లీలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ(ఎయిమ్స్)లో అతడికి వ్యాక్సిన్ ఇచ్చినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈ కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్దన్ పాల్గొన్నారు. మనీశ్ కుమార్కు హైదరాబాద్లోని భారత్ బయోటెక్ సంస్థ దేశీయంగా అభివృద్ధి చేసిన కోవాగ్జిన్ ఇచ్చారు. తాను గత రాత్రి కంటినిండా నిద్రపోయానని, శనివారం ఉదయమే ఎయిమ్స్కు చేరుకున్నానని, తోటి పారిశుధ్య కార్మికులతో మాట్లాడానని, ఆ తర్వాత టీకా తీసుకున్నానని మనీశ్ కుమార్ చెప్పాడు. టీకా తీసుకోవడానికి చాలామంది భయపడ్డారని, అందుకే అధికారుల వద్దకు వెళ్లి తానే తొలి టీకా తీసుకుంటానని కోరానని అన్నాడు. భయపడాల్సిన అవసరం లేదని అందరికీ తెలియజేయడమే తన ఉద్దేశమని స్పష్టం చేశారు. టీకా తీసుకోవడం పట్ల గర్వంగా ఉందన్నాడు. కరోనా టీకా విషయంలో తన తల్లి, భార్య భయపడ్డారని, వారికి ధైర్యం చెప్పానని పేర్కొన్నాడు. థాంక్యూ మనీశ్ కుమార్ దేశంలో కరోనా టీకా తీసుకున్న మొదటి వ్యక్తి మనీశ్ కుమార్కు ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా కృతజ్ఞతలు తెలిపారు. అతడు తొలి టీకా తీసుకొని కరోనా ఫ్రంట్లైన్ వర్కర్లకు బలమైన సందేశం ఇచ్చాడని ప్రశంసించారు. అతడు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు అనేదానిపై సంబంధం లేకుండా కరోనాపై పోరాటంలో అతడు అందించిన సేవలు మరువలేనివని కొనియాడారు. ఢిల్లీలో పారిశుధ్య కార్మికుడైన మనీశ్ కుమార్ కోవిడ్–19 జోన్లలోనూ నిర్భయంగా విధులు నిర్వర్తించాడు. టీకా తీసుకున్న ప్రముఖులు కరోనా టీకా విషయంలో ప్రజల్లో నెలకొన్న అపోహలను దూరం చేసేందుకు చాలా మంది ప్రముఖులు తొలిరోజు ఈ టీకా పొందారు. ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా, నీతి ఆయోగ్ సభ్యుడు వి.కె.పాల్, సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్ఐఐ) సీఈవో అదార్ పూనావాలా, పశ్చిమ బెంగాల్ మంత్రి నిర్మల్ మజీ తదితరులు కరోనా టీకా తొలి డోసు తీసుకున్నారు. తొలిరోజు 1,91,181 మందికి.. దేశవ్యాప్తంగా శనివారం 3,352 సెషన్లలో 1.90 లక్షల మందికిపైగా లబ్ధిదారులకు కరోనా వ్యాక్సిన్ తొలి డోసు ఇచ్చినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఈ టీకా వల్ల దుష్ప్రభావాలు తలెత్తి ఆసుపత్రిలో చేరినట్లు ఇప్పటిదాకా ఒక్క ఫిర్యాదు కూడా రాలేదని వెల్లడించింది. వ్యాక్సినేషన్ కార్యక్రమం తొలిరోజు పూర్తిస్థాయిలో విజయవంతమైందని ఆరోగ్య శాఖ అదనపు కార్యదర్శి మనోహర్ అగ్నానీ తెలిపారు. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం 1,91,181 మందికి టీకా మొదటి డోసు ఇచ్చామన్నారు. ఈ కార్యక్రమంలో 16,755 మంది సిబ్బంది పాల్గొన్నారని చెప్పారు. కొన్ని రాష్ట్రాల్లో కోవిషీల్డ్ మాత్రమే ఇవ్వగా, 11 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కోవిషీల్డ్తోపాటు కోవాగ్జిన్ కూడా అందజేశారు. -
నేడే వ్యాక్సినేషన్ డ్రైవ్
న్యూఢిల్లీ: ఎప్పుడెప్పుడా అని ప్రజలు ఎదురు చూస్తున్న కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. కోవిడ్ మహమ్మారిని కట్టడి చేసే, ప్రపంచం లోనే అతి పెద్దదైన వ్యాక్సినేషన్ కార్యక్రమా నికి ప్రధాని మోదీ శనివారం శ్రీకారం చుట్టనున్నారు. ఉదయం 10 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి, లబ్ధిదారులైన ఆరోగ్య కార్యకర్తలతో కూడా ఆయన మాట్లాడతారు. వ్యాక్సినేషన్లో వాడే దేశీయంగా తయారైన కోవిషీల్డ్, కోవాగ్జిన్ల టీకా డోసులను ఇప్పటికే అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు పంపినట్లు ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంవో) తెలిపింది. ప్రజాభాగస్వామ్యంలో భాగంగా ప్రభుత్వం చేపట్టే ఈ బృహత్తర కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని పీఎంవో పేర్కొంది. 3,006 సెషన్ సైట్లు వ్యాక్సినేషన్ ప్రారంభం సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న 3,006 సెషన్ సైట్లను ఆన్లైన్ ద్వారా అనుసంధానం చేసినట్లు పీఎంవో తెలిపింది. మొదటి రోజు ప్రతి సెషన్ సైట్లో కనీసం 100 మందికి టీకా ఇస్తారని పేర్కొంది. మొదటి రోజు టీకా తీసుకునే కొందరు ఆరోగ్య కార్యకర్తలతో ప్రధాని మోదీ సంభాషించనున్నారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు ఈ జాబితాలో ఉన్న ఢిల్లీలోని ఎయిమ్స్, సఫ్దర్జంగ్ ఆస్పత్రుల అధికారులు తెలిపారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ శుక్రవారం శాఖకు చెందిన నిర్మాణ్ భవన్లోని కోవిడ్ కంట్రోల్ రూంను సందర్శించారు. కేటాయింపుల్లో వివక్ష ఉండదు టీకా కేటాయింపులపై కేంద్ర ఆరోగ్య శాఖ పూర్తి స్పష్టతనిచ్చింది. ‘వ్యాక్సినేషన్ డోసుల కేటాయింపుల్లో ఏ రాష్ట్రంపైనా వివక్ష చూపే ప్రశ్నే లేదు. ఇది ముందుగా సరఫరా చేస్తున్న వ్యాక్సిన్ డోసులు, రానున్న వారాల్లో డోసుల సరఫరా కొనసాగిస్తాం. టీకా సరఫరాలో లోటు జరుగుతుందనే ప్రశ్నే ఉత్పన్నం కాదు’అని పేర్కొంది. 31న పల్స్ పోలియో 16న జరిగే కోవిడ్ వ్యాక్సినేషన్ నేపథ్యంలో పోలియో టీకా కార్యక్రమం పల్స్ పోలియో జనవరి 31వ తేదీకి వాయిదా పడిందని ఆరోగ్య శాఖ తెలిపింది. రాష్ట్రపతి కార్యాలయం అధికారులతో సంప్రదింపుల అనంతరం పల్స్ పోలియోను రీ షెడ్యూల్ చేసినట్లు వివరించింది. గర్భవతులకు వ్యాక్సిన్ ఇవ్వవద్దు గర్భవతులు, పాలిచ్చే తల్లులకు వ్యాక్సిన్ ఇవ్వవద్దంటూ కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. ఎవరికి వ్యాక్సిన్ ఇవ్వకూడదో చెబుతూ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖలు రాసింది. కేవలం 18 ఏళ్లు దాటిన వారికి మాత్రమే వ్యాక్సిన్ ఇవ్వాలని పేర్కొంది. గర్భవతులు, పాలిచ్చే తల్లుల మీద వ్యాక్సిన్ ప్రయోగాలు జరగనందున వారికి వ్యాక్సిన్ ఇవ్వవద్దని స్పష్టం చేసింది. మొదటగా ఇచ్చిన డోసుకు సంబంధించిన వ్యాక్సిన్నే 14 రోజుల వ్యవధితో ఇచ్చే రెండో డోసులోనూ ఇవ్వాలని స్పష్టం చేసింది. 15 వేల కొత్త కేసులు దేశంలో 24 గంటల్లో 15,590 కొత్త కరోనా కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,05,27,683 కు చేరుకుందని ఆరోగ్య శాఖ వెల్లడించింది. 24 గంటల్లో కరోనా కారణంగా 191 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 1,51,918కు చేరుకుందని పేర్కొంది. -
తొలి దశలో.. టీకా ఖర్చు కేంద్రానిదే
న్యూఢిల్లీ: కరోనా టీకాను తొలిదశలో 3 కోట్ల మందికిపైగా ఆరోగ్య సంరక్షణ సిబ్బంది, ఫ్రంట్లైన్ వర్కర్లకు అందజేస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఇందుకయ్యే ఖర్చును కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని స్పష్టం చేశారు. ఈ నెల 16వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రారంభం కానుందని, ఈ కార్యక్రమం ప్రారంభ దశలో రాజకీయ నేతలు, ప్రజాప్రతినిధులు పాల్గొనవద్దని సూచించారు. ప్రధాని మోదీ సోమవారం రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు. కరోనా తాజా పరిస్థితి, వ్యాక్సినేషన్ ఏర్పాట్లపై చర్చించారు. భారత్లో కొన్ని నెలల్లోనే 30 కోట్ల మందికిపైగా ప్రజలకు ఈ టీకా ఇస్తామని వెల్లడించారు. సైంటిస్టుల మాటే ఆఖరి మాట ఇప్పటికే అనుమతి లభించిన కోవిషీల్డ్, కోవాగ్జిన్తోపాటు మరో నాలుగు కరోనా వ్యాక్సిన్లు అనుమతుల కోసం ఎదురుచూస్తున్నాయని మోదీ వివరించారు. ప్రజలకు సమర్థవంతమైన వ్యాక్సిన్ ఇచ్చేందుకు సైంటిస్టులు అన్ని చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. వ్యాక్సిన్ అంశంలో సైంటిస్టుల మాటే ఆఖరి మాట అని తాను మొదటినుంచీ చెబుతూనే ఉన్నానని గుర్తుచేశారు. మీ వంతు వచ్చేదాకా వేచి చూడండి తొలి దశలో హెల్త్కేర్, ఫ్రంట్లైన్ వర్కర్లకే కరోనా టీకా అందుతుందని, వారు మినహా ఇతరులు ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవద్దని నరేంద్రమోదీ కోరారు. ప్రామాణికమైన ప్రొటోకాల్ ప్రకారం అందరికీ టీకా ఇస్తారని, తమ వంతు వచ్చేవరకు వేచి చూడాలని విజ్ఞప్తి చేశారు. మహమ్మారిపై పోరాటంలో మనం ముందంజలో ఉన్నప్పటికీ అజాగ్రత్త పనికిరాదని హెచ్చరించారు. కరోనా వ్యాక్సినేషన్పై వదంతులు వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు సూచించారు. బూత్లెవల్ వ్యూహం సైంటిస్టులు, నిపుణుల సూచనల ప్రకారం కరోనా టీకా ఇవ్వాల్సిన ప్రాధాన్యతా జాబితాను రూపొందిస్తామని చెప్పారు. తొలి దశలో ఆరోగ్య సంరక్షణ సిబ్బందితోపాటు పారిశుధ్య కార్మికులు, పోలీసులు, పారామిలటరీ సిబ్బంది, హోంగార్డులు, విపత్తు నిర్వహణ స్వచ్ఛంద కార్యకర్తలు, సైనిక జవాన్లు, సంబంధ రెవెన్యూ సిబ్బందికి టీకా అందుతుందని, వీరంతా కలిపి 3 కోట్ల మందికిపైగా ఉంటారని తెలిపారు. బూత్ లెవెల్ వ్యూహాన్ని అమలు చేస్తామన్నారు. కో–విన్ అనే డిజిటల్ వేదిక ఏర్పాటు చేశామన్నారు. టీకా తొలిడోస్ తీసకున్నాక వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ను జారీ చేస్తుందని, రెండో డోసు ఎప్పుడు తీసుకోవాలో ఈ సర్టిఫికెట్ అప్రమత్తం చేస్తుందని వివరించారు. ఓటర్ జాబితాతో.. హెల్త్కేర్, ఫ్రంట్లైన్ సిబ్బందికి కరోనా టీకా ఇచ్చిన తర్వాత 50 ఏళ్ల వయసు దాటిన వారికి, 50 ఏళ్లలోపు వయసుండి వివిధ రకాల వ్యాధులతో బాధపడుతున్న వారికి టీకా ఇవ్వనున్నట్లు కేంద్ర ప్రభుత్వం గతంలోనే ప్రకటించింది. 50 ఏళ్లు దాటిన వారిని గుర్తించడానికి చివరిసారిగా జరిగిన లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల ఓటర్ జాబితాను ఉపయోగించుకోనున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. -
కరోనా టీకా: మొదట వారికే ఇస్తాం
న్యూఢిల్లీ: మరో మూడు నాలుగు నెలల్లో కరోనా వ్యాక్సిన్ సిద్ధమవుతుందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రాధాన్యతల వారీగా వ్యాక్సిన్ పంపిణీ చేసేందుకు ప్రణాళిక రూపొందించామని తెలిపారు. తొలుత ఆరోగ్య కార్యకర్తలకు, 65 ఏళ్ల వయసు పైబడిన వృద్ధులకు కరోనా టీకా అందజేస్తామన్నారు. కరోనా నేపథ్యంలో ఆరోగ్య రంగంలో వచ్చిన మార్పులపై ‘ఫిక్కి’ గురువారం నిర్వహించిన నేషనల్ వెబినార్లో ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ మాట్లాడారు. వచ్చే ఏడాది జూలై–ఆగస్టు నాటికి 40 కోట్ల నుంచి 50 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందన్నారు. వీటిని 25 కోట్ల నుంచి 30 కోట్ల మందికి అందించవచ్చని చెప్పారు. మరో మూడు నాలుగు నెలల్లోనే వ్యాక్సిన్ వస్తుందన్న నమ్మకం తనకు ఉందని పేర్కొన్నారు. ప్రాధాన్యతల వారీగానే వ్యాక్సిన్ సరఫరా చేయాల్సి ఉంటుందని వెల్లడించారు. దీని ప్రకారం.. ముందుగా ఆరోగ్య కార్యకర్తలకు, 65 ఏళ్లు దాటిన వృద్ధులకు, అనంతరం 50–65 ఏళ్ల వయసున్న వారికి ఇస్తామని ఉద్ఘాటించారు. ఆ తర్వాత 50 ఏళ్ల లోపు వయసున్న వారికి వ్యాక్సిన్ అందుతుందన్నారు. కరోనా వ్యాక్సిన్ పంపిణీ అనేది పూర్తిగా శాస్త్రీయ కోణంలో నిపుణుల సూచనల మేరకే జరుగుతుందని మంత్రి హర్షవర్దన్ వివరించారు. ప్రస్తుతం 20 వ్యాక్సిన్లు వివిధ అభివృద్ధి దశల్లో ఉన్నాయని హర్షవర్ధన్ తెలిపారు. ముఖ్యమైన వ్యాక్సిన్ల క్లినికల్ ట్రయల్స్కు ఏర్పాట్లు చేశామన్నారు. ఆక్స్ఫర్డ్–సీరం ఇన్స్టిట్యూట్ వ్యాక్సిన్ ఫేజ్–3 క్లినికల్ ట్రయల్ దాదాపు పూర్తి కావొచ్చిందన్నారు. భారత్ బయోటెక్–ఐసీఎంఆర్ దేశీయంగానే అభివృద్ధి చేస్తున్న కరోనా వ్యాక్సిన్ ఫేజ్–3 క్లినికల్ ట్రయల్ ఇప్పటికే ప్రారంభమైంది. రష్యాకు చెందిన స్పుత్నిక్–5 వ్యాక్సిన్ ఫేజ్–2/ఫేజ్–3 ప్రయోగాలను రెడ్డీస్ ల్యాబ్ సంస్థ ఇండియాలో త్వరలోనే ప్రారంభించనుంది. ఎవరికి వారు స్వీయ జాగ్రత్తలు పాటించడం, మరొకరిని చైతన్యపర్చడం ద్వారా కోవిడ్–19ను 90–99 శాతం అరికట్టవచ్చని మంత్రి హర్షవర్ధన్ సూచించారు. (చదవండి: పడవ మీద తిరిగే ప్రాణదాత) క్రిస్మస్కు ముందే వ్యాక్సిన్! ఫైజర్, బయో ఎన్టెక్ వ్యాక్సిన్ క్రిస్మస్లోపే మార్కెట్లోకి విడుదల కావచ్చునని బయో ఎన్టెక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఉగుర్ సాహిన్ వెల్లడించారు. తీవ్రమైన దుష్ప్రభావాలు లేవని తేలిన తరువాత వచ్చే నెలలో అమెరికా, యూరప్లో వ్యాక్సిన్కి అనుమతులు పొందనున్నట్లు ఫైజర్, బయో ఎన్టెక్ తెలిపాయి. వ్యాక్సిన్ పనితీరు వివిధ వయస్సులు, గ్రూపులపై ఒకేరకమైన పనీతీరు కనపర్చినట్లు ఆ కంపెనీలు వెల్లడించాయి. డిసెంబర్ మధ్యనాటికి యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ వ్యాక్సిన్ అత్యవసర వాడకానికి అనుమతి రావచ్చని, ఈయూ నుంచి అనుమతులు లభించవచ్చునని ఉగుర్ తెలిపారు. క్రిస్మస్కి ముందే వ్యాక్సిన్ సరఫరా ప్రారంభించనున్నట్టు ఆయన చెప్పారు. తమ వద్ద రెండు అధిక సామర్థ్యం కలిగిన సురక్షితమైన వ్యాక్సిన్లు ఉన్నాయని కొద్ది వారాల్లోనే పంపిణీకి సిద్ధం అవుతాయని యుఎస్ హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్ సెక్రటరీ అలెక్స్ హజార్ తెలిపారు. వృద్ధుల్లో ఆక్స్ఫర్డ్ టీకా సత్ఫలితాలు లండన్: ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ రూపొందిస్తున్న కరోనా వ్యాక్సిన్ వయసు పైబడినవాళ్లలో మంచి వ్యాధినిరోధకత అభివృద్ధి చెందేలా దోహదం చేస్తోంది. ఈ మేరకు లాన్సెట్లో ప్రచురించిన వివరాలు టీకాపై ఆశలను పెంచుతున్నాయి. సుమారు 560 మంది వయసు పైబడిన వాలంటీర్లపై ఈ వ్యాక్సిన్ను ప్రయోగించి చూడగా మంచి ఫలితాలు వచ్చాయని, 70 ఏళ్లు పైబడిన వాళ్లలో కూడా వ్యాధినిరోధకత పెరిగిందని రిసెర్చ్ నివేదిక తెలిపింది. కరోనా ఎక్కువగా పెద్దవారిపై నెగెటివ్ ప్రభావం చూపుతున్న తరుణంలో ఈ ఫలితాలు ఆశావహంగా ఉన్నాయని తెలిపింది. పెద్దల్లో టీకా నెగెటివ్ ప్రభావాలు చూపకపోవడమే కాకుండా, వారిలో ఇమ్యూనిటీని పెంచడం ముదావహమని ఆక్స్ఫర్డ్ వాక్సిన్ గ్రూప్నకు చెందిన డాక్టర్ మహేషి రామసామి చెప్పారు. -
‘వ్యాక్సిన్’ కోసం లక్షమంది వివరాలు..
సాక్షి, రంగారెడ్డి జిల్లా: కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతూనే ఉంది. ఒకపక్క యంత్రాంగం, ప్రజలు దీనితో పోరాడుతుండగా.. మరో పక్క దీనికి చెక్పెట్టే వ్యాక్సిన్ తయారీలో దేశవ్యాప్తంగా 9 ఫార్మా కంపెనీలు నిమగ్నమయ్యాయి. టీకాలు వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలో అందుబాటులోకి వస్తాయని వైద్య నిపుణులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంచనా వేస్తున్నాయి. ఈక్రమంలో కరోనా ను ఖాతరు చేయకుండా ప్రాణాలను పణంగా పెట్టి వైద్యులు, సిబ్బంది సేవలందిస్తున్న విషయం తెలిసిందే. వ్యాక్సిన్ అందుబాటులోకి రాగానే తొలుత ఈ ఫ్రంట్లైన్ వారియర్స్కే ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. అందులో భాగంగా నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్హెచ్ఎం) ఆధ్వర్యంలో హెల్త్కేర్ వర్కర్స్ డేటాబేస్ను రూపొందిస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు, మెడికల్ కాలేజీల్లో పనిచేస్తున్న డాక్టర్లు, పారామెడికల్ స్టాఫ్ తదితర సిబ్బంది సమాచారాన్ని రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో సేకరిస్తున్నారు. మొత్తంగా తొమ్మిది కేటగిరీల్లో వివిధ క్యాడర్ల వివరాలను క్షేత్రస్థాయిలో ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న అన్ని క్యాడర్లలో కలిపి సుమారు లక్ష మంది వివరాలను సేకరించారు. జనరల్, జిల్లా ఆస్పత్రులు, కమ్యూనిటీ హెల్త్సెంటర్లు, పీహెచ్సీలు, యూపీహెచ్సీలు, హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లు, డిస్పెన్సరీలు, ఆయుష్ ఆస్పత్రులు, మథర్ అండ్ చైల్డ్ కేర్ సెంటర్లు తదితరాల్లో పనిచేస్తున్న వీరందరి వివరాలు ఆరా తీస్తున్నారు. ఈ డేటాను వెబ్సైట్లో నమోదు చేస్తున్నారు. ఇక ప్రైవేటు రంగంలోని వివిధ స్థాయిల ఆస్పత్రులు, మెడికల్ కళాశాలలు, నర్సింగ్ హోంలు, పాలిక్లినిక్లు, ఎన్జీఓ వసతి కేం ద్రాల్లోని స్టాఫ్ వివరాల సేకరణ కొనసాగు తోంది. ఈ ప్రక్రియను వచ్చేనెల 10లోపు పూర్తిచేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు. (చదవండి: కీలక దశకు దేశీయ కరోనా వ్యాక్సిన్) నాలుగంచెల్లో సమన్వయం రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో పనిచేస్తున్న వైద్యులు, పారా మెడికల్ తదితర కేటగిరీల్లోని మొత్తం 7 లక్షల మంది వివరాలను వైద్య ఆరోగ్యశాఖ సేకరిస్తోంది. ఇందులో ప్రైవేటు రంగంలోనే అత్యధికంగా 6 లక్షల మంది ఉండొచ్చని అంచనా. వివరాల సేకరణ ప్రక్రియ సమన్వయానికి 4 అంచెల్లో ప్రత్యేక కమిటీలు ఏర్పాటయ్యాయి. నేషనల్ స్టీరింగ్ కమిటీ, రాష్ట్ర స్టీరింగ్ కమిటీ, స్టేట్ టాస్క్ఫోర్స్, జిల్లా టాస్క్ఫోర్స్.. ఇవి సమన్వయం చేస్తున్నాయి. ఫ్రంట్లైన్ హెల్త్ వర్కర్స్ అయిన ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు, సూపర్వైజర్లు, అంగన్వాడి టీచర్లు, నర్సులు/సూపర్వైజర్లు, మెడికల్ ఆఫీసర్లు, పారామెడికల్ స్టాఫ్, సపోర్ట్ స్టాఫ్, మెడికల్ విద్యార్థులు, సైంటిస్టులు/రిసెర్చ్ స్టాఫ్, క్లరికల్/అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్, ఇతర ఆరోగ్య వైద్య సిబ్బంది కేటగిరీల్లో పనిచేస్తున్న వారినీ పరిగణనలోకి తీసుకున్నారు. ఒక్కో మెడికల్ స్టాఫ్కు సంబంధించి 24 అంశాల్లో వివరాలు సేకరిస్తున్నారు. వ్యక్తి పేరు, పుట్టిన తేదీ, గుర్తింపు కార్డు, మొబైల్ నంబర్, పోస్టల్ కోడ్, గుర్తింపు కార్డు, పనిచేస్తున్న ఆస్పత్రి పేరు, ఏరియా, కేటగిరీ తదితర సమాచారాన్ని తీసుకుంటున్నారు. -
కరోనాపై యుద్ధంలో సమిధలు
వాషింగ్టన్: కరోనా మహమ్మారిపై పోరాటంలో వైద్యులు, నర్సులు, ఆరోగ్య కార్యకర్తలు కీలకంగా పనిచేస్తున్నారు. వారంతా తమ ప్రాణాలను పణంగా పెడుతూ కరోనా బాధితులకు వైద్య సేవలందిస్తున్నారు. విధి నిర్వహణలో ఉండగా కరోనా వైరస్ సోకి అర్ధాంతరంగా మరణిస్తున్నారు. ప్రపంచంలో ఇప్పటిదాకా 1,500 మంది నర్సులు కరోనా బారినపడి ప్రాణాలు వదిలారని ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ నర్సెస్(ఐసీఎన్) తాజాగా వెల్లడించింది. ఇవి కేవలం 44 దేశాలకు సంబంధించిన గణాంకాలే. 1914 నుంచి 1918 దాకా నాలుగేళ్లపాటు జరిగిన మొదటి ప్రపంచ యుద్ధంలోనూ దాదాపు 1,500 మంది నర్సులు మరణించారని అంచనా. మొత్తం ప్రపంచవ్యాప్తంగా చూస్తే కరోనా కాటుకు ప్రాణాలు కోల్పోయిన నర్సుల సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుందని సీఏసీఎన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ హోవార్డ్ కాటన్ చెప్పారు. అన్ని దేశాల్లో నర్సుల మరణాలను పూర్తి స్థాయిలో నమోదు చేయకపోవడం బాధాకరమని అన్నారు. మొదటి ప్రపంచ యుద్ధం కంటే ఇప్పుడు కరోనా రక్కసి ఎక్కువ మంది నర్సుల ప్రాణాలను బలిగొన్నట్లు స్పష్టమవుతోంది. చాలా దేశాల్లో కరోనా సెకండ్ వేవ్ మొదలైనట్లు వార్తలొస్తున్నాయి. నర్సుల మరణాలు ఎన్నో రెట్లు పెరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. 2020 సంవత్సరాన్ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ద నర్సు అండ్ మిడ్వైఫ్గా జరుపుకుంటున్నారు. అలాగే ఆధునిక నర్సింగ్ వ్యవస్థకు ఆద్యురాలైన ఫ్లోరెన్స్ నైటింగేల్ 200వ జయంతి కూడా ఈ సంవత్సరమే. ఒకవేళ ఫ్లోరెన్స్ నైటింగేల్ ఇప్పుడు జీవించి ఉంటే.. కరోనాపై పోరాటంలో ప్రాణాలు కోల్పోతున్న నర్సుల పరిస్థితి చూసి తీవ్రంగా చలించిపోయేవారని హోవార్డ్ కాటన్ వ్యాఖ్యానించారు. బ్రిటన్లో లాక్డౌన్ లండన్: కరోనా వైరస్ పంజా విసురుతుండడంతో బ్రిటన్ వణికిపోతోంది. దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 10 లక్షల మార్కును దాటేసింది. వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి మరోసారి పూర్తిస్థాయి లాక్డౌన్ విధించేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. గురువారం నుంచి జనమంతా ఇళ్లకే పరిమితం కావాలని, అనవసరంగా బయటకు రావొద్దని యూకే ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ పిలుపునిచ్చారు. ఈ మేరకు స్టే ఎట్ హోం(లాక్డౌన్) నిబంధనలు జారీ చేశారు. డిసెంబర్ 2వ తేదీ వరకు ఇవి అమల్లో ఉంటాయి. అంటే దాదాపు నెల రోజులపాటు లాక్డౌన్ అమలు చేయనున్నారు. ఏప్రిల్లో బయటపడిన కరోనా కేసుల కంటే ఇప్పుడు మరిన్ని కేసులు నమోదవుతున్నాయని బోరిస్ జాన్సన్ చెప్పారు. మరణాల సంఖ్య సైతం అదేస్థాయిలో పెరుగుతోందని అన్నారు. మహమ్మారి వ్యాప్తిని అరికట్టాలంటే ప్రస్తుతం మన ముందున్న ఏకైక మార్గం సంపూర్ణ లాక్డౌన్ మాత్రమే అని స్పష్టం చేశారు. ప్రజలంతా సహకరించాలని కోరారు. -
రూ.50 లక్షల కరోనా బీమా
సాక్షి, హైదరాబాద్: కరోనా విధులు నిర్వహిస్తున్న వైద్యులు, వైద్య సిబ్బందికి రూ.50 లక్షల బీమా పథకాన్ని అమలు చేస్తూ కేంద్ర ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీచేసింది. ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజనలో భాగంగా దీన్ని అమలు చేస్తున్నట్లు కేంద్రం ఇదివరకు ప్రకటించగా తాజాగా మార్గదర్శ కాలు విడుదల చేసింది. కరోనాతో మరణిస్తే కరోనా సంబంధ విధుల్లో ప్రమాదకర స్థితిలో మరణిస్తే ఈ పథకం వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లోని వైద్యులు, సిబ్బంది, ఔట్సోర్సింగ్ ఉద్యోగులతోపాటు ప్రైవేటు ఆస్పత్రుల్లోని వైద్యులు, సిబ్బందికీ పథకం వర్తించనుంది. అయితే ఈ మరణాలను రాష్ట్ర, జిల్లా స్థాయి లోని కమిటీలు నిర్ధారించాల్సి ఉంటుంది. ఆ తర్వాతే ఈ పథకం కింద బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందిస్తారు. -
వ్యాక్సిన్ వస్తే ముందు వారికే!
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్కు వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే మహమ్మారిపై పోరాడుతున్న వైద్య సిబ్బందితో పాటు వైరస్ ముప్పున్న ప్రజలకు తొలుత టీకాను ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన మంగళవారం జరిగిన సమావేశంలో నిర్ణయించారు. వ్యాక్సిన్ వచ్చిన తర్వాత దాని అందుబాటును పరిగణనలోకి తీసుకుని సరఫరాకు కార్యాచరణ ప్రణాళిక చేపట్టడంపై ఈ భేటీలో చర్చించారు. వైద్య సరఫరా వ్యవస్థల నిర్వహణ, వైరస్ ముప్పున్న జనాభాలకు ప్రాధాన్యత, వివిధ ఏజెన్సీలు..ప్రైవేట్ రంగం, పౌరసమాజం మధ్య సమన్వయం వంటి నాలుగు సూత్రాల అధారంగా వ్యాక్సిన్ పంపిణీపై నిర్ణయాలు తీసుకోవాలని సమావేశంలో నిర్ణయించారు. వ్యాక్సినేషన్ కోసం సార్వజనీనంగా, అందుబాటు ధరలో ఉండేలా కార్యాచరణ చేపట్టాలని సమావేశంలో చర్చ జరిగినట్టు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నారు. వ్యాక్సిన్ తయారీ, ఉత్పత్తి సామర్ధ్యాలపై రియల్ టైం పర్యవేక్షణ ఉండాలని కూడా ఈ అత్యున్నత సమావేశంలో నిర్ణయించారు. కాగా ప్రపంచవ్యాప్తంగా పలువురు శాస్త్రవేత్తలు, ఫార్మా కంపెనీలు కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ కనుగొనే పనిలో అవిశ్రాంతంగా శ్రమిస్తున్న సంగతి తెలిసిందే. వివిధ దేశాల్లో వ్యాక్సిన్ ప్రయోగాలు కీలక దశకు చేరుకున్నాయి. ఇక ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఆస్ర్టాజెనెకా సంస్ధతో కలిసి అభివృద్ధి చేస్తున్న కరోనా వ్యాక్సిన్ ఈ ఏడాది అక్టోబర్ నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. చదవండి : కరోనా టీకా: మరో కీలక అడుగు -
కరోనా పోరు: కేంద్రం మరో కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి అధికమౌతుండటంతో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్ బాధితులకు సేవలందిస్తున్న వైద్య, ఆరోగ్య సిబ్బందికి ఉద్దేశించిన రూ. 50 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ను మరో మూడు నెలలు పొడిగించింది. దీంతో సెప్టెంబర్ వరకు కోవిడ్ వారియర్స్కు బీమా కవరేజీ ఉంటుంది. 22 లక్షల వైద్య, ఆరోగ్య సిబ్బందికి ఈ బీమా వర్తించనుంది. కాగా, ఈ ఇన్సూరెన్స్ను న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ ద్వారా అందిస్తున్నారు. దేశంలో కరోనా వైరస్ మొదలైన గత మార్చి నుంచి ఈ బీమాను వర్తింపజేస్తున్నారు. (చదవండి: రెండో దశ మానవ పరీక్షలు షురూ..) జూన్ 30న ఈ బీమా గడువు ముగియనుండటంతో కేంద్రం తాజా నిర్ణయం తీసుకుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలో ఉన్న ప్రభుత్వ దవాఖానలు, హెల్త్ కేర్ సెంటర్లు, వెల్నెస్ సెంటర్లలోని సిబ్బంది, కమ్యూనిటీ హెల్త్కేర్ వర్కర్లు, ఆశ కార్యకర్తలు, శానిటేషన్ వర్కర్లకు ఈ బీమా వర్తిస్తుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గతంలోనే వెల్లడించారు. కోవిడ్ బాధితులకు చికిత్స అందిస్తున్న ప్రైవేట్ ఆస్పత్రుల సిబ్బందికి కూడా ఈ బీమా వర్తిస్తుందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. (చదవండి: ధీటుగా బదులివ్వండి.. సైన్యానికి పూర్తి స్వేచ్ఛ!) -
44డిగ్రీల ఎండలో..25 నిమిషాల పాటు
భోపాల్: బయట ఎండలు దారుణంగా ఉన్నాయి. ఈ అధిక ఉష్ణోగ్రతలో కాస్తా బిగుతుగా ఉన్న దుస్తులు ధరిస్తే ఎంతో ఇబ్బందిగా ఉంటుంది. అలాంటిది ఒళ్లంతా కప్పి ఉంచే పీపీఈ కిట్లు ధరించి కరోనా పేషంట్లకు సేవలందించే వారికి ఎంత ఇబ్బందిగా ఉంటుందో ఓ సారి ఊహించుకొండి. ఒంటి మీద పీపీఈ కిట్ వేడి.. బయట ఎండకి తాళలేక సొమ్మసిల్లి పడిపోయాడు ఓ ఆరోగ్య కార్యకర్త. దారుణం ఏంటంటే అతడు పని చేసే ఆస్పత్రి యాజమాన్యం సదరు వ్యక్తికి చికిత్స అందించడానికి నిరాకరించింది. దాంతో దాదాపు 25 నిమిషాల పాటు 44 డిగ్రీల ఎండలో ఆ వ్యక్తి అలానే ఉన్నాడు. తర్వాత అతని సహోద్యోగి ఒకరు మరో ఆస్పత్రికి తీసుకెళ్లడంతో కోలుకున్నాడు. వివరాలు.. హిరలాల్ ప్రజాపతి అనే వ్యక్తి 108 అంబులెన్స్కు అనుబంధ ఉద్యోగిగా బుండేల్ఖండ్ మెడికల్ కాలేజీ(బీఎంసీ)లో పని చేస్తున్నాడు. టీబీ హాస్పిటల్ నుంచి బీఎంసీకి కరోనా వైరస్ పాజిటివ్ వ్యక్తులను తీసుకెళ్లే విధులు నిర్వహిస్తుంటాడు. ఈ క్రమంలో విధుల్లో ఉన్నంతసేపు ప్రజాపతి పీపీఈ కిట్ ధరించి ఉంటాడు. దాంతో అధిక వేడికి తట్టుకోలేక ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో బీఎంసీ ప్రాంగణంలో కుప్పకూలాడు. అయితే ఆస్పత్రి యాజమాన్యం ప్రజాపతికి చికిత్స అందించడానికి నిరాకరించడంతో దాదాపు 25నిమిషాల పాటు అలా ఎండలోనే ఉండిపోయాడు. (‘గాలి ఆడక.. చెమటతో చాలా ఇబ్బంది పడ్డాం’) అనంతరం ప్రజాపతి సహోద్యోగి ఒకరు పారామెడికల్ సిబ్బంది సాయంతో అతడిని మరో ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. ప్రస్తుతం అతడు క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అయితే బీఎంసీ అధికారుల తీరు పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
నిరసనకు దిగిన వైద్య సిబ్బందికి ఝలక్!
-
పారిస్లో వైద్య సిబ్బందికి జరిమానా
పారిస్ : కరోనా కష్టకాలంలో అహర్నిశలు కష్టపడుతున్న తమ సమస్యలను తీర్చాలని నిరసనకు దిగిన వైద్య సిబ్బందికి పారిస్ పోలీసులు ఝలక్ ఇచ్చారు. నిరసనకు దిగిన 50 మంది వైద్య సిబ్బందికి జరిమానా విధించగా, ముగ్గురిని అరెస్ట్ చేశారు. కరోనావైరస్ వ్యాప్తికి ముందు నుంచే పారిస్లోని రాబర్ట్ డెబ్రే ఆసుపత్రి ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటుంది. ఇక కరోనా వ్యాప్తితో అక్కడి సిబ్బందిపై పనిభారం పెరిగింది. దీనికి తోడూ వేతనాల్లో కత్తెర, వైద్య పరికరాల కొరత వంటి సమస్యలతో సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో దాదాపు 400 మంది వైద్యులు, నర్సులు, సహాయక సిబ్బంది నిరసనకు దిగారు. ఆసుపత్రికి మెరుగైన నిధులు మంజూరు చేయాలని కోరుతూ ఆసుపత్రి ఎదుట రోడ్డుపై ర్యాలీ తీశారు. అయితే నిరసనకారులు సామాజిక దూరం విషయంలో నియమాలను ఉల్లంఘించారని పారిస్ పోలీసులు తెలిపారు. అక్కడున్నవారిని చెదరగొట్టడానికి ప్రయత్నించగా, అందుకు తిరస్కరించిన వారికి అక్కడే 150 డాలర్ల జరిమానా విధించారు. జరిమానా కట్టని ముగ్గురిని అరెస్ట్ చేశారు. వేతనాల పెంపుతోపాటూ, కార్మికుల ఆరోగ్య సంరక్షణకు మెరుగైన వసతులను కల్పించాలని వారు డిమాండ్ చేశారు. కరోనా మహమ్మారితో వైద్య సిబ్బందిపై పనిభారం అధికమైందని నిరసనల్లో పాల్గొన్న వైద్యులు తెలిపారు. అంతేకాకుండా సరైన వైద్య పరికరాలు లేకపోవడంతో తమకు కరోనా వ్యాపించే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. మే ప్రారంభం నుంచే ఫ్రాన్స్లో లాక్డౌన్ నిబంధనలను సడలిస్తూ వస్తోంది. కొన్ని విభాగాల్లో ఆర్థిక కార్యకలాపాలు తిరిగి ప్రారంభమయ్యాయి. షాపులు, పాఠశాలలను కూడా తెరిచేందుకు అవకాశం ఇచ్చింది. అయితే కరోనా వ్యాప్తిని అరికట్టడానికి విధించిన నిబంధనల విషయంలో మాత్రం ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. -
కరోనా హీరో: ‘నూరు’ పిపిఇ గౌన్లు
కరోనా పోరాటంలో నేను సైతం అంటూ ఎంతో మంది కదిలారు. అందులో పిల్లలు కూడా తమ వంతు సాయం అందిస్తూ తమ సత్తా చాటుతున్నారు. వారిలో ముందు వరసలో ఉంటుంది తొమ్మిదేళ్ల నూరు అఫియా కిస్టినా. మలేషియాకు చెందిన నూరు ఆడుతు పాడుతూ తల్లి వద్ద ఐదేళ్ల వయసు నుంచే మిషన్ కుట్టడం నేర్చుకుంది. తల్లి టైలరింగ్ చేస్తుండటంతో కూతురు కూడా ఆ పనిలో మెల్ల మెల్లగా నిమగ్నమయ్యేది. ఇంటికి సమీపంలో ఉన్న ఆసుపత్రిలోని వైద్యులకు, నర్సుల బృందానికి పిపిఇ గౌన్లు అవసరమని అమ్మానాన్నల ద్వారా తెలుసుకుంది. తల్లిదండ్రుల సాయంతో కావల్సిన మెటీరియల్ తీసుకొని మార్చి నెల నుంచి ఇప్పటి వరకు 130 పిపిఇ గౌన్లు తయారుచేసింది. వాటిని తన ఇంటికి దగ్గరలో ఉన్న ఆసుపత్రికి అందజేసింది. పిపిఇ కిట్స్ కుడుతున్న నూరు ఒకే రోజులో 4 గౌన్లు ‘ఇవి చెడు రోజులు. ప్రజలు ఎంతగా కష్టపడుతున్నారో వింటుంటే నాకు చాలా బాధగా ఉంది. ఈ వైరస్ చాలా ప్రమాదకరమైనది అని తెలుసుకున్నాను. దీనికి అడ్డుకట్ట వేసే వారికి సహాయం చేయాలని ఉందని మా అమ్మకు చెప్పాను. లాక్డౌన్ కారణంగా మాకు స్కూల్ కూడా లేదు. ఆన్లైన్లో చదువుకుంటున్నాను. ఖాళీ సమయంలో పిపిఇ గౌన్లు తయారు చేస్తున్నాను. రోజుకు నాలుగు గౌన్లు తయారు చేస్తున్నాను. ఇందుకు మా అమ్మ కూడా సాయం చేస్తుంటుంది. ఇప్పుడు మరో 60 గౌన్లను తయారు చేయడానికి అన్ని పనులు పూర్తి చేసుకున్నాను’ అంటుంది నూర్. పొరుగువారి దుస్తులు మరమ్మతు మిషన్ పైన కుట్టడం అనే నైపుణ్యాన్ని తల్లి నుండి నేర్చుకుంది నూర్. ఇరుగుపొరుగు వారి దుస్తులను బాగు చేయగా వచ్చే డబ్బును తన పాకెట్ మనీగా వాడుకునేది. ఇప్పుడు ఈ నైపుణ్యాన్ని పిపిఇ గౌన్లు తయారు చేయడానికి ఉపయోగపడింది. ఇలా కరోనా వారియర్స్కి నా వంతు సాయపడుతున్నాను అని సంతోషంగా చెబుతుంది నూర్. వయసు చిన్నదే. కానీ, మనసు పెద్దది అనిపించక మానదు నూర్ చేస్తున్న పని చూస్తుంటే. -
కరోనా యోధులపై నేడు పూలవర్షం
సాక్షి, హైదరాబాద్: కరోనా వారియర్స్కు అరుదైన గౌరవం దక్కనుంది. హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో వైద్యసేవలందిస్తున్న వైద్యులు, సిబ్బందిపై ఆదివారం ఉదయం 9.30 గంటలకు పూలవర్షం కురిపించేందుకు భారత వాయుసేన రంగం సిద్ధం చేసింది. శనివారం ఆస్పత్రి పరిసరాల్లో ట్రయల్రన్ నిర్వహించింది. దేశవ్యాప్తంగా కరోనా కట్టడిపై పోరాటం చేస్తున్న యోధులకు సంఘీభావం ప్రకటిస్తూ వారిపై పూలవాన కురి పించాలని త్రివిధ దళాధిపతి జనరల్ బిపిన్రావత్ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో గాంధీ ఆస్పత్రి ప్రాంగణంలోని జయశంకర్ విగ్రహం వద్ద వాయుసేన హెలికాప్టర్ ద్వారా ఆస్పత్రి వైద్యులు, స్టాఫ్నర్సులు, పారిశుధ్యం, పారామెడికల్, పోలీస్, నాల్గవ తరగతి ఉద్యోగులపై పూలవాన కురిపించనున్నారు. హకీంపేట ఎయిర్ఫోర్స్ స్టేషన్ కమాండ్ కెప్టెన్ కేఎస్ రాజు, గ్రూప్ కెప్టెన్ పంకజ్గుప్తా నేతృత్వంలో ప్రత్యేక శిక్షణ పొందిన వాయుసేన దళాలు ఆకాశం నుంచి పూలవర్షం కురిపిస్తాయి. చదవండి: కరోనా: ఓ అడుగు ముందుకు.. -
మీ త్యాగం అర్థం చేసుకోగలం: మహేశ్
సాక్షి, హైదరాబాద్: ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కరోనా బాధితులకు సేవలు అందిస్తున్న డాక్టర్లు, వైద్యసిబ్బందిపై టాలీవుడ్ సూపర్స్టార్ మహేశ్ బాబు ప్రశంసల వర్షం కురిపించారు. ఈ మేరకు శనివారం వరుస ట్వీట్లతో వైద్యసిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. ‘ఈ కష్టకాలంలో మీరు మీ ఇంటికి, ఇష్టమైన వారికి దూరంగా ఉంటూ కరోనాతో యుద్దం చేస్తున్నారు. మమ్మల్ని సురక్షితంగా, ఆరోగ్యంగా ఉంచేందుకు నిస్వార్థంతో అలుపెరగని పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. మా కోసం మీరు చేస్తున్న త్యాగం అర్థం చేసుకోగలం. కరోనా మహమ్మారి తీవ్రస్థాయిలో విజృంభిస్తున్న తరుణంలో ముందుండి నిలిచి పోరాడుతున్న వైద్యసిబ్బందే మన సూపర్ హీరోలు. ఈ కష్ట కాలంలో వారిపై ప్రేమ, సానుభూతి చూపించడమే వారికి మనం ఇచ్చే గొప్ప బహుమతి. ఈ పోరాటవీరుల పట్ల మర్యాదపూర్వకంగా, దయతో మెలగాలని అందరినీ అభ్యర్థిస్తున్నా. వారికి గౌరవం ఇవ్వండి. అవిరామంగా పనిచేస్తున్న వైద్యసిబ్బందికి కృతజ్ఞతలు. లాక్డౌన్ సమయంలో ప్రజలందరూ ఇంటివద్దనే ఉంటూ సురక్షితంగా ఉండండి’అంటూ మహేశ్ ట్వీట్ చేశాడు. ఇప్పటికే కరోనా సమయంలో పోలీసు, పారిశుద్య కార్మికుల సేవలను కొనియాడుతూ ట్వీట్లు చేసిన విషయం తెలిసిందే. I stand in gratitude for all health workers who are working selflessly and tirelessly to keep us safe and secure in these trying times. We must come to understand that they're doing this to safeguard us. 🙏🙏 pic.twitter.com/QG5AlXrMMo — Mahesh Babu (@urstrulyMahesh) May 2, 2020 చదవండి: మళ్లీ ట్రెండింగ్లోకి ‘మున్నా’.. 13 ఏళ్లైంది కదా! అఘోరాగా బాలయ్య.. ఇది నిజమేనంటా var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_931254882.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
కరోనా: పేర్లు ఎందుకు రాశారంటూ బూతులు!
హరిద్వార్: కోవిడ్ నివారణ చర్యల్లో భాగంగా వివరాలు సేకరిస్తున్న ఆరోగ్య సిబ్బందిపై గ్రామస్తులు దాడిచేసిన ఘటన ఉత్తరాఖండ్లో మంగళవారం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఒకరిని అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. హరిద్వార జిల్లాలోని మఖాన్పూర్ గ్రామంలో ఆశా కార్యకర్తలు కొవిడ్-19 సర్వే కోసం వెళ్లగా స్థానికులు దాడికి దిగారు. మహిళలు అని కూడా చూడకుండా వారిపట్ల అసభ్యంగా ప్రవర్తించారు. తమ పేర్లను ఎందుకు నమోదు చేశారని బూతులు తిడుతూ.. వారి చేతుల్లోని రిజిస్టర్లను లాక్కుని పేజీలను చించేశారు. (చదవండి: అలా అయితే ఆఫీస్కు రావద్దు : కేంద్రం) తాము ఇంటింటి సర్వే చేస్తుండగా కొందరు దాడికి పాల్పడ్డారని, ఒక మహిళ తమ చేతిలోని రిజష్టర్లు లాక్కుని చించేసిందని ఆశా వర్కర్లు తెలిపారు. ఘటనలో తమకు స్వల్ప గాయాలయ్యాయని అనిత అనే ఆశా వర్కర్ వెల్లడించారు. ఈ ఘటనపై ఆశా వర్కర్ల ఫిర్యాదు అందిందని హరిద్వార్ ఎస్పీ సెంథిల్ అబుదై కృష్ణరాజ్ తెలిపారు. మహిళా ఆరోగ్య సిబ్బంది పట్ల అసభ్యంగా ప్రవర్తించి, భౌతిక దాడికి పాల్పడినవారిపై ఎపిడెమిక్ డీసీజెస్ యాక్ట్ (2020-ఆర్డినెన్స్) ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. కేసు నమోదు చేసి నిందితుల్లో ఒకరిని అదుపులోకి తీసుకున్నామని, మిగతావారి కోసం గాలిస్తున్నామని ఎస్పీ వెల్లడించారు. (చదవండి: ఆశా వర్కర్లపై దాడి.. కరోనా టెంట్లు ధ్వంసం) -
ప్రతి ఆరోగ్య కార్యకర్తనూ కాపాడుకుంటాం : మోదీ
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో ప్రతి ఒక్క ఆరోగ్య కార్యకర్తనూ కాపాడేందుకు అన్ని చర్యలూ సత్వరం చేపడతామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కోవిడ్-19పై ముందుండి పోరాడుతున్న ఆరోగ్య కార్యకర్తలు, సిబ్బంది ప్రయోజనాల పరిరక్షణ పట్ల తమ చిత్తశుద్దికి ఎపిడమిక్ డిసీజెస్ (సవరణ) ఆర్డినెన్స్ 2020 చేపట్టడమే నిదర్శనమని ప్రధాని ట్వీట్ చేశారు. ఆరోగ్య కార్యకర్తల భద్రతపై రాజీపడబోమని స్పష్టం చేశారు. కాగా వైద్యులకు రక్షణ కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకువస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. వైద్యులపై దాడులకు తెగబడితే మూడు నుంచి ఏడేళ్ల వరకూ జైలు శిక్ష విధిస్తామని కేంద్ర కేబినెట్ భేటీ అనంతరం కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ తెలిపారు. చదవండి : ప్రధాని మోదీ ఏం మాట్లాడబోతున్నారు? -
కరోనా టెంట్లు ధ్వంసం
-
అలజడి : ఆశా వర్కర్లపై దాడి
సాక్షి, బెంగళూరు : కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్న వైద్య సిబ్బందిపై దాడి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నా పోకిరీలు రెచ్చిపోతున్నారు. వైద్య, పోలీసు సిబ్బందిపై దాడికి పాల్పడి, కరోనా అనుమానిత ప్రాంతంలో ఏర్పాటు చేసిన బారికేడ్లను ధ్వంసం చేసిన ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. రాష్ట్ర పోలీసు అధికారి బీ రమేష్ తెలిపిన వివరాల ప్రకారం. పశ్చిమ బెంగళూరు పరిధిలోని పెద్దనారాయణపురంలో ఈనెల మొదటి వారంలో ముగ్గురు వ్యక్తులకు కరోనా పాజిటివ్గా తేలింది. అయితే ఈ ముగ్గురు ఢిల్లీలోని నిజాముద్దీన్లో జరిగిన మర్కజ్ మత ప్రార్థనలకు వెళ్లి వచ్చినట్లు పోలీసుల గుర్తించారు. దీంతో ఆ ముగ్గురు యువకులు నివహిస్తున్న ప్రాంతాన్ని గుర్తించిన పోలీసులు చూట్టూ బారికేడ్లు ఏర్పాటు చేసి అందరినీ స్వీయ నిర్బంధంలో ఉండాలని ఆదేశించారు. అంతేకాకుండా వారిలో వైరస్ లక్షణాలు కనిపించిన పలువురికి ఇంట్లోనే వైద్య చికిత్సలు అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి అక్కడి చేరుకున్న ఆశా వర్కర్లు, పోలీసులపైకి కొందరు యువకులు దాడికి దిగారు. బారికేడ్లను ధ్వంసం చేసి వైద్య పరికరాలను పగటకొట్టారు. ఈ ఘటనలో పలువురు ఆశా వర్కర్లు గాయపడ్డారు. విషయం తెలుసుకున్న డీజీపీ, రాష్ట్ర హోంమంత్రితో సహా పలువురు అధికారులు భారీ బందోబస్త్తో ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితి సమీక్షించారు. దాడికి పాల్పడిన వారిలో 58మందిపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అలాగే మిగతా వారిపై నిర్బంధం కొనసాగిస్తామని తెలిపారు. తాజాగా ఈ ఘటనపై ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప స్పందించారు. బాధ్యతులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే ఆశా వర్కర్లు, వైద్య చికిత్స అందిస్తున్న సిబ్బందికి భద్రతను ఏర్పాటు చేస్తామన్నారు. -
దాడులు చేసేవారిని ఉపేక్షించవద్దు: కిషన్ రెడ్డి
-
వివరాల ఆరాపై ‘మర్కజ్’ వెళ్లొచ్చిన వారి అపోహలు
సాక్షి, హైదరాబాద్: తబ్లిగీ జమాత్ కోసం ఢిల్లీకి వెళ్లొచ్చిన వారి వివరాల సేకరణ పోలీసులకు కష్టంగా మారుతోంది. ఎన్నార్సీ సర్వే జరుగుతోందన్న అపోహతో చిరునామాలు తీసుకునేందుకు వెళ్లిన ఆరోగ్య కార్యకర్తలకు సమాచారం ఇచ్చేందుకు కొందరు ససేమిరా అంటున్నారు. ఇది ముమ్మాటికీ ఎన్ఆర్సీ కోసమే అంటూ వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెళ్లకపోతే దాడి చేస్తామంటూ హెచ్చరిస్తున్నారు. తమ ఆధార్ కార్డులు, ఇంటి నెంబర్లు మీకెందుకు అని సతాయిస్తున్నారు. దీంతో ఆరోగ్య కార్యకర్తలు పోలీసులకు సమాచారమిస్తున్నారు. వారు రంగ ప్రవేశం చేసి ఒప్పించే సరికి తలప్రాణం తోకకు వస్తోందని వాపోతున్నారు. తెలంగాణ నుంచి 1,030 మంది ఢిల్లీలో జరిగిన మత కార్యక్రమాలకు వెళ్లి వచ్చారని ప్రభుత్వం గుర్తించిన విషయం తెలిసిందే. ఇందులో ఇంకా 100 మందికి పైగా ఉన్నవారి ఆచూకీ ఇంకా తెలియలేదు. మరోవైపు శుక్రవారం ఒకేరోజు 75 కోవిడ్ పాజిటివ్ కేసులు వెలుగుచూడటంతో పోలీసులు వారి జాడ కనిపెట్టేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అంతా నేరుగా రాష్ట్రానికి రాలేదు.. మర్కజ్కు వెళ్లి వచ్చిన వారంతా నేరుగా రాష్ట్రానికి రాలేదు. అందుకే, పోలీసులకు అందరి వివరాలు తెలియడం లేదు. కొందరు సమూహాలుగా రైలు, రోడ్డు మార్గాల ద్వారా వచ్చారు. ఇలాంటి వారి ఆచూకీ సులభంగా కనిపెట్టగలుగుతున్న పోలీసులు.. ఒంటరిగా ఢిల్లీకి వెళ్లినవారి వివరాలు కనుక్కోవడం గగనంగా మారిందంటున్నారు. ఇలాంటి వారిలో పలువురు ప్రభుత్వ ఉద్యోగులు ఉండటం గమనార్హం. క్వారంటైన్కు వెళ్లకుండా విధులకు హాజరవుతుండటంతో సెక్రటేరియట్, సింగరేణిలో కరోనా ఇదే పద్థతిలో విస్తరించిన సంగతి తెలిసిందే. తాజాగా నల్లగొండలో ఉపాధ్యాయుడికి కరోనా పాజిటివ్ రావడంతో అతని వద్ద పాఠాలు విన్న 60 మంది విద్యార్థుల పరిస్థితి ఆందోళనకరంగా మారింది. సమాచారాన్ని దాచిపెట్టిన వారిపై కేసులు పెడుతామని హెచ్చరించినా కొందరిలో మార్పు రాకపోవడం గమనార్హం. ఒంటరిగా ఢిల్లీకి వెళ్లిన వారంతా.. లాక్డౌన్ విధించాక నేరుగా రాష్ట్రానికి రాలేదు. మధ్యలో పలు ప్రార్థనా మందిరాలను సందర్శించారు. ఫలితంగా ఆలస్యంగా రాష్ట్రానికి చేరుకుంటున్నారు. తెలంగాణలో ప్రతిరోజూ బయటపడుతున్న కరోనా పాజిటివ్ కేసుల్లో అధికశాతం వీరే కావడంతో ప్రజల్లో ఆందోళన పెరిగిపోతోంది. స్వచ్ఛందంగా ముందుకు రండి.. ఈ నేపథ్యంలో ఢిల్లీ నుంచి వచ్చిన వారు స్వచ్ఛందంగా తమ వివరాలు అందించి సహకరించాలని పోలీసులు, అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. వారిని..వారి కుటుంబీకుల ప్రాణాలను ఆపదలోకి నెట్టవద్దని సూచిస్తున్నారు. ఇరుగుపొరుగు వారు సైతం ఢిల్లీకి వెళ్లి వచ్చినవారి వివరాలు డయల్ 100కు ఫోన్ చేసి తెలియజేయవచ్చన్నారు. అలాంటి వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని భరోసా ఇస్తున్నారు. ఈ విషయాన్ని ప్రతీ పోలీస్స్టేషన్ పరిధిలో పోలీసులు పలు చైతన్య కార్యక్రమాల ద్వారా వివరించే యత్నం చేస్తున్నారు. -
కరోనాపై పోరు : గూగుల్ భారీ సాయం
కాలిఫోర్నియా: ప్రపంచ వ్యాప్తంగా మహారక్కసిలా విరుచుకుపడుతున్న కరోనాపై యుద్ధానికి తమ వంతుగా కార్పొరేట్ దిగ్గజాలు కదిలి వస్తున్నాయి. ఈ క్రమంలో కోవిడ్-19పై పోరుకు సెర్జింజన్ దిగ్గజం గూగుల్ ముందుకొచ్చింది. చిన్న,మధ్య తరహా వ్యాపారులను (ఎస్ఎంబీస్) ఆదుకునేందుకు, 800 మిలియన్ డాలర్లు (సుమారు రూ.5,990 కోట్లు) సహాయాన్ని ప్రకటించింది. చిన్న వ్యాపారాలతోపాటు మహమ్మారి కరోనాపై చేస్తున్న ఆరోగ్య సంస్థలు, ప్రభుత్వాలు, ఆరోగ్య కార్యకర్తలకు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని గూగుల్, ఆల్ఫాబెట్ సీఈవో సుందర్ పిచాయ్ వెల్లడించారు. అలాగే వైరస్ వ్యాప్తి చెందకుండా ఎలా నిరోధించాలనే దానిపై సమాచారాన్ని వ్యాప్తి చేయడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థకు(డబ్ల్యూహెచ్ఓ), ప్రపంచవ్యాప్తంగా వందకు పైగా ప్రభుత్వ సంస్థలకు 250 మిలియన్ డాలర్ల (సుమారు రూ.1,872 కోట్లు) యాడ్ గ్రాంట్స్ను గూగుల్ అందిస్తుందని ఆయన తెలిపారు. వ్యక్తిగత రక్షణ పరికరాలు (పిపిఇ), ఇతర వైద్య పరికరాల ఉత్పత్తిని పెంచడానికి ఆర్థిక సహాయం అందిస్తామని కంపెనీ తెలిపింది. అయితే ఎంత మొత్తం అనేది వెల్లడించలేదు. అవసరమైన పరికరాల తయారీ దారులకు, ఫెడరల్ ప్రభుత్వం సహాయం చేయడానికి గూగుల్ తన ఉద్యోగులను గుర్తిస్తామని గూగుల్ పేర్కొంది. రాబోయే కొన్ని వారాల్లో 2 నుంచి మూడు మిలియన్ల ఫేస్మాస్క్లను ఉత్పత్తి చేసేందుకు మాజిడ్ గ్లోవ్స్ అండ్ సేఫ్టీతో కలిసి గూగుల్ పనిచేస్తోంది. అలాగే కమ్యూనిటీ ఫైనాన్షియల్ ఇనిస్టిట్యూషన్లు, ఎన్జీవోలకు ప్రకటన గ్రాంట్లలో 20 మిలియన్ డాలర్లు ఇవ్వనుండగా, గూగుల్ యాడ్స్ క్రెడిట్స్లో 340 మిలియన్ డాలర్లు మేర అర్హత ఉన్న ఖాతాలకు గూగుల్ స్వయంచాలకంగా క్రెడిట్ను అందుబాటులో ఉంచనుంది. చిరువ్యాపారులను ఆదుకునే ఉద్దేశంతో ప్రపంచవ్యాప్తంగా ఎన్జీవోలు, ఫైనాన్షియల్ సంస్థలకు 200 మిలియన్ డాలర్ల నిధిని ప్రకటించింది. ఈ పెట్టుబడుల నిధిని సమకూర్చడం ద్వారా నగదు లభ్యత అందించనున్నామని, తద్వారా వ్యాపారాలకు, ఇతర ప్రభుత్వేతర సంస్థల ఆర్థిక కార్యకలాపాలకు మద్దతు లభిస్తుందన్నారు. కరోనా వైరస్ మహమ్మారిపై అధ్యయనం చేసేందుకు విద్యాసంస్థలు, పరిశోధకులకు గూగుల్ క్లౌడ్లో 20 మిలియన్ డాలర్లను అందించనుంది. తద్వారా టీకాలు రూపకల్పన, చికిత్సలను అధ్యయనం చేయడానికి లేదా డేటాను ట్రాక్ చేయడానికి ఉపయోగించుకోవచ్చని పిచాయ్ వివరించారు. -
ఆరోగ్య సిబ్బంది బీమా నిబంధనలు ఇవే..
న్యూఢిల్లీ : లాక్డౌన్ సమయంలో దేశంలో పేదల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పేరుతో రూ. 1.7 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా కరోనా వైరస్పై పోరాటం చేస్తున్న వైద్యులు, నర్సులు, ఆశా వర్కర్లు, ఆరోగ్య కార్యకర్తలు, పారిశుద్ధ్య కార్మికుల, పారా మెడికల్ సిబ్బందికి కేంద్ర ప్రభుత్వం మూడు నెలల పాటు రూ. 50 లక్షల ఆరోగ్య బీమా ప్రకటించింది. తాజాగా ఆదివారం ఇందుకు సంబంధించిన నిబంధనలను కేంద్రం విడుదల చేసింది. కరోనా పేషెంట్లకు నేరుగా సేవలు అందిస్తున్న, వారి బాధ్యతలు పర్యవేక్షిస్తున్న కమ్యూనిటీ హెల్త్ వర్కర్లతో సహా 22.12 లక్షల మంది పబ్లిక్ హెల్త్ కేర్ ప్రొవైడర్లకు ఈ బీమా వర్తించనుంది. వారు విధుల నిర్వర్తించే క్రమంలో.. ప్రమాదవశాత్తు కరోనా సోకితే ప్రాణనష్టం సంభవించే అవకాశం ఉంటుందని కేంద్రం తెలిపింది. మొత్తం 90 రోజుల పాటు ఈ బీమా అమల్లో ఉండనుందని.. దీని కింద రూ. 50 లక్షలు అందజేయనున్నట్టు చెప్పింది. అలాగే అసాధారణ పరిస్థితుల్లో కరోనా సంబంధింత సేవలు అందిస్తున్న ప్రైవేటు ఆస్పత్రుల ఉద్యోగులు, రాష్ట్రాలు నియమించుకున్న అవుట్ సోర్స్ సిబ్బందితో పాటు పలు విభాగాలకు ఈ బీమా వర్తించనున్నట్టు పేర్కొంది. అయితే వీరి సంఖ్య కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సూచనలకు లోబడి ఉంటుందని వెల్లడించింది. ఈ బీమా పొందే లబ్ధిదారులు.. ఇతర ఇన్సురెన్స్ పాలసీ చేయించుకుని ఉంటే వాటిని కూడా పొందవచ్చని తెలిపింది. -
పాతికేళ్ల కష్టానికి చెల్లు!
ఎప్పటికైనా న్యాయం జరగకపోతుందా... తమ గోడు వినే నాథుడు రాకపోతాడా... తమ బతుకులు బాగుపడే రోజు రాకపోతుందా... అని పాతికేళ్లుగా ఎదురు చూసిన వారికి సరైన న్యాయమే జరిగింది. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, గిరిజన శాఖ మంత్రి ప్రయత్నం ఫలించింది. ముఖ్యమంత్రి జగనన్న మనసు కరిగింది. పది రెట్లు వేతనం పెంచుతూ నిర్ణయం వెలువడటంతో ఆ చిరుద్యోగుల మోములో ఆనందం వెల్లివిరిసింది. ఇప్పటివరకూ కేవలం నాలుగు వందల వేతనానికి పనిచేస్తున్న గిరిజన సామాజిక ఆరోగ్య కార్యకర్తల వేతనం నాలుగు వేలకు పెరగడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. సాక్షి ప్రతినిధి. విజయనగరం: నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్న ఈ రోజుల్లో నెలకు కేవలం 400 రూపాయలతో ఎవరూ పని చేయరు. కానీ వారు చేశారు. అది కూడా ఒకటి రెండు నెలలో, సంవత్సరాలో కాదు, ఏకంగా పాతికేళ్లుగా చేస్తూనే ఉన్నారు. ఎంతమందికి చెప్పుకున్నా వారి సమస్య పరిష్కారం కాలేదు. ఇక మా బతుకులింతే అని వారు ఆవేదన చెందుతున్న తరుణంలోనే ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి వారి దీనస్థితిని గుర్తించి రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి వెళ్లారు. సీఎం సానుకూలంగా స్పందించడంతో వారి పాతికేళ్ల కష్టానికి తెరపడింది. రాష్ట్రంలో గిరిజనాభివృద్ధి కోసం ఐఎఫ్ఏడీ ఆధ్వర్యంలో 1995లో చేపట్టిన ప్రత్యేక ప్రాజెక్టులో భాగంగా ఐటీడీఏల పరిధిలోని గిరిజన ఏజెన్సీ ప్రాంతాల్లో సామాజిక ఆరోగ్య కార్యకర్తలను ప్రభుత్వం నియమించింది. గిరిజన ఆవాసాలలో స్థానికంగా ఉండే గిరిజన మహిళలనే సామాజిక ఆరోగ్య కార్యకర్తలుగా నియమించారు. ఆశా వర్కర్ల తరహాలోనే గిరిజన ఆవాసాల్లో ఉండే గిరిజనుల ఆరోగ్య స్థితిగతులను ప్రభుత్వానికి చేరవేయడం, ప్రభుత్వం ద్వారా వచ్చే ఆరోగ్య పథకాలను అమలు చేయడం, ప్రత్యేకించి పసిపిల్లలు, బాలింతల ఆరోగ్యాన్ని పర్యవేక్షించడం, అవసరమైన సర్వేలు చేయడం, గ్రామాల్లో పారిశుద్ధ్యం, వ్యక్తిగత శుభ్రతలపై అవగాహన కలిగించడం లాంటి పనులన్నింటినీ వారు చేస్తున్నారు. వారి ఎంపికలో విద్యార్హతలు, స్థానికతలకు సంబంధించిన రెండు తేడాలు మినహా, ఆశ వర్కర్లు చేసే పనులే వీరూ చేస్తున్నారు. కొండ కోనల్లో పని చేసే గిరిజనులు కావడం, వారి సమస్యలపై అధికారులు ఎవరూ స్పందించకపోవడంతో సుమారు రెండున్నర దశాబ్దాలుగా వారి బతుకులు మెరుగుపడలేదు. 1995లో వారిని ఆరోగ్య కార్యకర్తలుగా నియమించినప్పుడు రూ.300లు గౌరవ వేతనం ఇచ్చేవారు. తరువాత కేవలం వంద మాత్రమే పెంచారు. నెలకు రూ.400లతో బతకడం అసాధ్యం. కనిపించిన ప్రతి నాయకుడికీ తమ కష్టాన్ని చెప్పుకున్నా... వారి బతుకులు మారలేదు. కదిలించిన ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి: టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రతిపక్షానికి చెందిన వైసీపీ ఎమ్మెల్యేగా కొనసాగిన ప్రస్తుత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి ఒక గిరిజనబిడ్డగా గతంలో కూడా గిరిజన సామాజిక ఆరోగ్య కార్యకర్తల వేతన సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించారు. ఆమె ప్రతిపక్ష పార్టీకి చెందిన శాసనసభ్యురాలు కావడంతో అప్పటి ప్రభుత్వం ఈమె విన్నపాన్ని పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలోనే వై,ఎస్. జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం, పుష్ప శ్రీవాణి ఉప ముఖ్యమంత్రి కావడం వారికి కలిసొచ్చింది. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన తొలి కేబినెట్ సమావేశంలో ఆశ వర్కర్ల వేతనాలను రూ.3000 నుంచి రూ.10 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్న తరుణంలో గిరిజన సామాజిక ఆరోగ్య కార్యకర్తల పరిస్థితిని పుష్ప శ్రీవాణి ముఖ్యమంత్రికి వివరించారు. వారి వేతనాలను కూడా పెంచాలంటూ సీఎంను కోరారు. దీనికి సీఎం సానుకూలంగా స్పందించడంతో అప్పటిదాకా ఎవరూ పట్టించుకోని గిరిజన సామాజిక ఆరోగ్య కార్యకర్తల వేతనాల పెంపునకు సంబంధించిన ప్రక్రియను అధికారులు ప్రారంభించారు. నవంబర్ 27న జరిగిన కేబినెట్ సమావేశంలో వీరి వేతనాలను రూ.400ల నుంచి రూ.4000లకు పెంచారు. డిసెంబర్ నుంచే పెరిగిన వేతనాలు అందనున్నాయి. ఇంతవరకూ ఎవరూ తమ గోడు పట్టించుకోలేదని, తమ సేవలను వినియోగించుకోవడమే మినహా ఏ ప్రభుత్వమూ తమను ఆదుకోలేదని అయితే ప్రస్తుత ప్రభుత్వం తమ సేవలను గుర్తించి తమ వేతనాన్ని పది రెట్లు పెంచడం తమకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందని గిరిజన సామాజిక ఆరోగ్య కార్యకర్తలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యను పరిష్కరించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికీ, ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణికి ధన్యవాదాలు చెబుతున్నారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం రాష్ట్రం మొత్తం మీద 7 ఐటీడీఏల పరిధిలో 2651 మంది గిరిజన సామాజిక ఆరోగ్య కార్యకర్తలు పని చేస్తుండగా వీరిలో సీతంపేట ఐటీడీఏ పరిధిలో 498 మంది, పార్వతీపురం ఐటీడీఏ పరిధిలో 1184 మంది, పాడేరు ఐటీడీఏ పరిధిలో 752 మంది, చింతూరు ఐటీడీఏ పరిధిలో 40 మంది, కేఆర్ పురం ఐటీడీఏ పరిధిలో 14 మంది, శ్రీశైలం ఐటీడీఏ పరిధిలో 163 మంది పని చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఆశవర్కర్లకు సంబంధించిన వేతనాలను రూ.1000 నుంచి రూ.3 వేలకు పెంచారు. అదే సమయంలో గిరిజన ఐటీడీఏ ప్రాంతాల్లో ఆశ వర్కర్ల తరహాలోనే పని చేస్తున్న వీరి వేతనాలు మాత్రం పెంచలేదు. దీనిపై వారు ఆందోళన చేసినా ఎవరూ పట్టించుకోలేదు. -
విధిని ఎదిరించి..
చెన్నూర్ రూరల్: తోటి పిల్లలు చెంగు చెంగున ఎగురుతుంటే చిన్ని మనసు బాధపడింది. ఆడపిల్ల.. పైగా రెండు కాళ్లు లేవు.. ఎలా బతుకుతుందో ఏమోనని సమాజం జాలిపడుతుంటే మరింత పట్టుదల పెరిగింది. ఎలాగైనా తన అంగవైకల్యాన్ని జయించాలని నిశ్చయించుకుంది. కన్న వాళ్లకు భారమవకూడదని స్వయం ఉపాధి మార్గాన్ని ఎంచుకుంది. అనంతరం దూరవిద్య ద్వారా పదో తరగతి చదివి ప్రభుత్వ ఉద్యోగం సాధించింది. ఆత్మస్థైర్యంతో అంగవైకల్యాన్ని జయించి.. వనితాలోకానికి ఆదర్శంగా నిలిచిన లక్ష్మి విజయమంత్రం ఆమె మాటల్లోనే.. మాది మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలం కిష్టంపేట గ్రామం. అమ్మానాన్న ఎన్నం మల్లక్క, సమ్మయ్య. మేం మొత్తం ఆరుగురం సంతానం. వారిలో నలుగురు అమ్మాయిలం, ఇద్దరు అబ్బాయిలు. నేను రెండో కుమార్తెను. చిన్న వయస్సులోనే నాకు పోలియో సోకి రెండు కాళ్లు పూర్తిగా చచ్చుబడిపోయాయి. మాది నిరుపేద కుటుంబం. నా చిన్నతనంలో ఒక్కో రోజు పస్తులు కూడా ఉండాల్సి వచ్చేది. అంగవైకల్యం ఉండడంతో మనసులో చదువుకోవాలని ఉన్నా చదువుకోలేకపోయాను. అంగవైకల్యం ఉందని నన్నెప్పుడూ ఇంట్లో తిట్టలేదు. మా వాళ్లంతా నన్ను కంటికి రెప్పలా కాపాడుకున్నారు. కానీ నేను ఎన్ని రోజులు వారికి భారంగా ఉండాలని అనిపించింది. ‘కుట్టు’ నేర్చుకుని.. సొంత కాళ్లపై నిలబడ్డా.. తల్లిదండ్రులకు ఏదో విధంగా నా వంతుగా సహాయం అందించాలనుకున్నా. ఆతర్వాత మిషన్ నేర్చుకుని అప్పు చేసి కుట్టుమిషన్ కొనుకున్నా. గ్రామంలోని బస్స్టాప్ సమీపంలో రూ.1000తో ఓ గదిని అద్దెకు తీసుకున్నా. చిన్నగా లేడీస్ టైలర్ ఏర్పాటు చేశా. దుస్తులు కుట్టగా వచ్చిన సొమ్ముతో అదే గదిలో చిన్నగా కంగన్హాల్, బట్టల షాప్ను ఏర్పాటు చేశా. ఆ తర్వాత కుటుంబానికి కొంత ఆసరయ్యా. ఇంకా ఏదో చేయాలనే తపన నన్ను వేధించేది. గ్రామంలోని మహిళలకు, యువతులకు కుట్టులో శిక్షణ ఇచ్చా. అంతటితో ఆగకుండా చిన్నప్పుడు చదువుకోవాలనే ఆశను నెరవేర్చుకోవాలనుకున్నా. దూరవిద్యలో చదువుకున్నా.. 2012లో దూరవిద్యలో పదో తరగతి చదివా. ప్రతీ ఆదివారం చెన్నూర్లోని బాలికల పాఠశాలలో ఓపెన్ తరగతులకు 40 వారాలు హాజరయ్యా. పరీక్షలు రాసి మంచి మార్కులు సాధించా. 2013లో మా నాన్న సమ్మయ్య మృతి చెందాడు. 2016 ఏప్రిల్లో వికలాంగుల కోటా కింద మంచిర్యాల మున్సిపల్ కార్యాలయంలో పబ్లిక్ హెల్త్ వర్కర్గా ప్రభుత్వ ఉద్యోగం సాధించా. ఆగçస్టు 8న ఉద్యోగంలో చేరి ప్రస్తుతం రూ.15వేల వేతనంతో ఉద్యోగం చేస్తున్నా. అమ్మా, తమ్ముళ్లకు చేదోడు, వాదోడుగా ఉంటున్నా. అంగవైకల్యం మనసుకే కానీ మనిషికి కాదు. వికలాంగులు ఆత్మస్థైర్యంతో ముందుకెళ్లాలి. పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు. కుటుంబ అండ కూడా ఉండాలి. -
ప్రతిభా పురస్కారాలు
స్నేహ ఆర్ట్స్ అకాడమి తిరుపతి వారి ఆధ్వర్యంలో ప్రతిఏటా ప్రతిభా పురస్కారాలను నిర్వహిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ సంవ త్సరం కూడా పురస్కార గ్రహీతల ఎంపిక కోసం దరఖాస్తులని ఆహ్వా నిస్తున్నాము. ఇందుకుగాను సమాజానికి బహుముఖంగా తమ సేవలందిస్తున్న ఆరోగ్య కార్యకర్తలు, వైద్యులు, కళాకారులు (నృత్యం) రచయితలు, రైతులు, పౌరోహిత్యం లాంటి వివిధ వృత్తులకు సంబంధించిన వారు ఈ పురస్కారం పట్ల ఆసక్తి ఉండీ, తగిన అర్హత కలిగి ఉంటే అలాంటి వారు తమ వివరాలని జతపరచి పంపాలని కోరుతున్నాము. ఈ పురస్కారాలకు అర్హులైన వారు ఫిబ్రవరి నెల 20వ తేదీలోపు తమ పూర్తి వివరాలని జతపరుస్తూ ఈ కింది చిరునామాకు పంపగలరని ఆశిస్తున్నాం. సమాజానికి మీరు అందిస్తున్న సేవలని గుర్తించి మీ సేవలని మరింత విస్తృత పరుస్తూ మీరు నలుగురికీ ఉపయోగకరమైన పనులను స్వచ్చందంగా ఇకముందు కూడా నిర్వహించేందుకు గాను ప్రోత్సాహకంగా ఈ పురస్కారాలని మీకు అందించే ప్రయత్నమే మా స్నేహ ఆర్ట్స్ అకాడమి ఆలోచన. మీ పూర్తి చిరునామా, సామాజిక సేవలో మీ పాత్ర వివరాలను 2015 ఫిబ్రవరి 20 లోపు ఈ కింది చిరునామాకు పంపగలరు. - కార్యదర్శి, స్నేహ ఆర్ట్స్ అకాడమి. 13-5-531/ఎ. టాటానగర్, పశువైద్యశాల ఎదురుగా, తిరుపతి. మొబైల్: 9703234092 -
ఆరోగ్య కార్యకర్తలకు జీతాలు విడుదల
ఏలూరు, న్యూస్లైన్ : జిల్లాలో కాంట్రాక్ట్ పద్ధతిపై పనిచేస్తున్న ఆరోగ్య కార్యకర్తలకు, అర్బన్ హెల్త్ సెంటర్ల సిబ్బందికి కలెక్టర్ సిద్ధార్థజైన్ చొరవతో రూ.1.28 కోట్ల జీతాలు విడుదలయ్యాయి. ఏలూరు కలెక్టర్ బంగ్లాలో ఆదివారం కలెక్టర్ ఇం దుకు సంబంధించిన మూడు ఫైళ్లను పరిశీలించి జీతాల చెక్కులు విడుదల చేశారు. నాలుగు నెలలుగా జీతాలు రాకపోవడంతో రెండో అంగన్వాడీ కార్యకర్తల ఇబ్బందులను గుర్తించిన ఆయన జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి టి.శకుంతలను పిలిచి సంబంధిత ఫైళ్లను సమర్పించాలని ఆదేశించారు. 539 మంది రెండో ఏఎన్ఎం కార్యకర్తలకు జూలై నుంచి అక్టోబరు వరకు జీతాల కింద రూ. 1.06 కోట్లు, 19 అర్బన్ హెల్త్ సెంటర్ల సిబ్బందికి జూలై నెల జీతాల కింద రూ. 12.77 లక్షల, ఆయుష్ శాఖకు చెందిన సిబ్బందికి జూలై నెల జీతాల కింద రూ. 6.62 లక్షలను జా తీయ ఆరోగ్య మిషన్ నిధుల నుంచి విడుదల చేయాలని కలెక్టర్ ఆదేశించారు.