huge demand
-
నలభీముల వంట పండింది
కేవలం నాలుగు రోజులు వంట పని. ఉదయం సుమారు 500 మందికి టిఫిన్.. 1,500 నుంచి 2 వేల మందికి నాన్ వెజ్ వంటకాలతో మధ్నాహ్న, రాత్రి భోజనం.. సాయంత్రం స్నాక్స్. ఇవన్నీ చేయడానికి ఆరేడుగురు వంట మేస్త్రీలు, మాస్టర్లు, మహిళలు సహా పదిమందికి పైగా సహాయకులు. రోజుకు కనీసం రూ.50 వేల చొప్పున సంక్రాంతి పండుగ మొత్తం రూ.2 లక్షలకు మించి వెచ్చించే తరుణమిది. కృష్ణా జిల్లా గన్నవరం మండలం సూరంపల్లి–మాదలవారిగూడెం సమీపంలో కోడి పందేల బరివద్ద ఏర్పాట్ల కోసం ఉంగుటూరు మండలం ఇందుపల్లికి చెందిన వారితో కుదుర్చుకున్న ఒప్పందమిది.సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: వంటల్లో చేయితిరిగిన నలభీములకు సంక్రాంతి పండుగ వేళ రాష్ట్రవ్యాప్తంగా డిమాండ్ ఏర్పడింది. ముఖ్యంగా ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు తదితర ఉమ్మడి జిల్లాల్లో ఏర్పాటవుతున్న బరుల వద్ద పైతరహా ఒప్పందాలు జరిగాయి. సంప్రదాయ పిండి వంటలు, తీపి పదార్థాలు చేయడంలోనూ అనుభవజ్ఞుల పంట పండుతోంది. నాన్ వెజ్ వంటకాల్లో ప్రావీణ్యం ఉన్న ఒక్కో వంట మాస్టర్కు రోజుకు రూ.4 వేల నుంచి రూ.10 వేల వరకు సమకూరుతోంది. నగరాలు, పట్టణాల్లోని హోటళ్లలో పనిచేస్తున్న మాస్టర్లు కొందరు స్వస్థలాలకు వెళ్లి వస్తామంటూ తాత్కాలిక ఒప్పందాలు కుదుర్చుకుని వెళుతున్నారని ఆయా హోటళ్ల నిర్వాహకులు, యజమానులు చెబుతున్నారు. కొత్త అల్లుళ్లు, బంధుమిత్రుల కోసంసంక్రాంతికి ఇంటికొచ్చిన కొత్త అల్లుళ్లు, బంధువులు, స్నేహితులకు వివిధ రకాల విందు భోజనాలు ఏర్పాటు చేయాలని సంపన్న వర్గాల వారు తహతహలాడుతుంటారు. అల్లుళ్లకు మర్యా దలు చేయడంలో గోదారోళ్ల స్టైలే వేరు. కృష్ణా, గుంటూరు వాళ్లదీ అదే తీరు. వందల రకాలు వడ్డించడం వారికొక సరదా. గతేడాది ఏలూరు జిల్లాలో కొత్త అల్లుడికి 379 రకాల పదార్థాలు వడ్డించిన కుటుంబం వార్తల్లో నిలిచింది. వంద రకాలకు పైగా స్వీట్లు, నలభై రకాలకు మించి స్నాక్స్, నలభై రకాల కూరలు, ఇరవై రకాల చట్నీలు.. ఇలా విభిన్న పదార్థాలు విస్తరిలో వడ్డించి తమ ప్రేమాభిమానాలను చాటుకున్నారు.ఇలాంటివి పలుచోట్ల చోటుచేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. మటన్, చికెన్, రొయ్యలు, పీతలు, కొరమీను, మెత్తళ్లు, నల్లసందువా తదితర చేపలతో వెరైటీలు చేయగలిగిన వారిని సంపన్న కుటుంబాల వారు రోజుకు లేదా గుంపగుత్తగా రూ.వేలల్లో చెల్లించి నియమించుకుంటున్నారు. వారం నుంచి పక్షం రోజుల వరకు ఇళ్లల్లోనే ఉండి కావాల్సిన వెరైటీ వంటలు చేయాల్సి ఉంటుంది. రోజుకు వేతనం రూ.2 వేల నుంచి రూ.5 వేల వరకు చెల్లిస్తున్నారని, సహాయకుడికి రూ.వెయ్యి నుంచి రూ.1,500 వరకు చెల్లిస్తారని పాలకొల్లుకు చెందిన కేటరింగ్ నిర్వాహకుడు మజ్జి శ్రీనివాస్ వివరించారు. దమ్ చేయడం తెలిస్తే..మటన్, బికెన్ దమ్ బిర్యానీ చేయడంలో ఆరితేరిన వారికి మంచి డిమాండ్ ఉందని విజయవాడలో పలు హోటళ్లు నిర్వహిస్తున్న మనోహర్ ‘సాక్షి’కి చెప్పారు. ఏదైనా ఒక ఈవెంట్ కోసం 2 వేల మందికి స్పెషల్స్ చేయడానికి మాస్టర్ రూ.6 వేల నుంచి రూ.7 వేలు తీసుకుంటారని, సంఖ్య అంతకు మించితే మరో మాస్టర్కు అంతే మొత్తం చెల్లించాల్సి వస్తుంది. మాస్టర్లకు, వారి సహాయకులకు వసతి, భోజనం, రవాణా వసతి అదనం. వివాహాలు, ఈవెంట్ల కోసం రెండు రకాల వెరైటీ స్వీట్స్ చేసే వారికి కూడా మంచి డిమాండ్ ఉందని వివరించారు.ఇతర జిల్లాల వారికీ డిమాండ్⇒ పాలకొల్లు బంగారుచెరువు గట్టు ప్రాంతంలో దాదాపు వంద మంది వరకు కేటరింగ్ నిర్వాహకులు ఉన్నారు. ఇప్పటికే వీరిలో చాలామంది సంక్రాంతి కోడి పందేల బరులు, సంపన్నుల ఇళ్లు, అతిథి గృహాలు, విల్లాల వద్ద ప్రత్యేక వంటలు చేసేందుకు ఒప్పందాలు కుదుర్చుకుని వెళ్లిపోయారు. ⇒ కాకినాడ జిల్లా వేళంగి గ్రామం కూడా వంట మేస్త్రీలకు ప్రసిద్ధి. ఇక్కడ 150 మందికి పైగానే వంట మేస్త్రీలు ఉంటారు. రాష్ట్రంలోని నలుమూలలకు వెళ్లి విభిన్న రకాల వంటలు వండి వడ్డిస్తుంటారు. సంక్రాంతి పండుగ సందర్భంగా వీరికీ డిమాండ్ ఎక్కువగా ఉంది.⇒ భీమవరం సమీపంలోని చినఅమిరంలో ఆర్డర్లపై పిండి వంటలు తయారుచేసే వారున్నారు. ఎన్ని వెరైటీలు కావాలన్నా సమయానికి అందజేస్తారు. కాళ్ల మండపం కోపల్లె, తణుకు మండలం వేల్పూరు గ్రామాల్లో పిండి వంటలు తయారు చేసే మహిళలు ఎక్కువ. సంక్రాంతి రోజుల్లో ఆర్డర్లపై దేశ విదేశాల నుంచి వచ్చిన వారికి పిండి వంటలు సిద్ధం చేసి ఇస్తుంటారు.⇒ ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాలకు చెందిన పలు పేద కుటుంబాల వారు హైదరాబాద్, విజయవాడ, విశాఖ తదితర నగరాల్లోని విల్లాలు, అపార్ట్మెంట్లు, ఆఫీసుల వద్ద వాచ్మెన్లుగా కొనసాగుతుంటారు. సంక్రాంతి పండుగకు కుటుంబం మొత్తం స్వస్థలాలకు వారం, పది రోజులు ఉండేలా వస్తుంటారు. అలాంటి వారిలో ప్రావీణ్యమున్న వారు వంటలు చేయడానికి, సహాయకులుగా ఒప్పందాలు కుదుర్చుకుంటుంటారు. ⇒ వంటలు చేయడంలో ఆరితేరిన మేస్త్రీలు, సహాయకులకు ఇంతగా డిమాండ్ పెరగడానికి మరో కారణం కూడా ఉంది. ప్రావీణ్యమున్న పలువురు పండుగ సమయంలో తమ కుటుంబీకులు, స్నేహితులతో గడపడానికి ప్రాధాన్యం ఇస్తుంటారు. ఎంత డబ్బులు ఇస్తామన్నా వంట పనికి వెళ్లరు. దీంతో పనికి సిద్ధపడే వారు కొద్దిరోజులకే జాక్పాట్ కొట్టినట్టే.వంట మేస్త్రీలను ఏర్పాటు చేసుకుంటాం మా ముగ్గురు కుమారు ల కుటుంబ సభ్యు లతో పాటు బంధుమిత్రులు 40 మంది వరకు పండగ కు ఇంటికి వస్తుంటా రు. వారికి ఏ లోటూ లేకుండా అవసరమైన వంటలు సిద్ధం చేసేందుకు ప్రత్యేకంగా వంట మేస్త్రీలను ఏర్పాటు చేసుకుంటాం. పనుల్లో వారికి మా కుటుంబ సభ్యులు సహకరిస్తుంటారు. వంట మేస్త్రీ ఒకరికి పండుగ మూడు రోజులకు రూ.10 వేలు వరకు ఇస్తాం. – చవ్వాకుల సత్యనారాయణమూర్తి, ఆక్వా రైతు, తోలేరు, పశ్చిమ గోదావరి జిల్లాఇందుపల్లి వంటవారు ప్రత్యేకంవంటలు చేయడంలో కృష్ణా జిల్లా ఇందుపల్లి వారికి రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. కృష్ణాతో పాటు పొరుగు జిల్లాలు, రాష్ట్రాల వారు కూడా ముఖ్య కార్యక్రమాలు ఉన్నప్పుడు ఇందుపల్లి వంటలకు ప్రాధాన్యమిచ్చి పిలిపించుకుంటారు. సంక్రాంతి సందర్భంగా అనేక ప్రాంతాల వారి నుంచి పిలుపులు వచ్చాయని ఇందుపల్లి ఎంపీటీసీ సభ్యుడు, వంట మేస్త్రీ అయిన కూరాకుల వెంకట్రామయ్య తెలిపారు. తమ బృందం కూడా నాలుగు రోజుల వంటలకు ఒప్పందం కుదుర్చుకుందన్నారు. -
విద్యుత్కు భారీ డిమాండ్
న్యూఢిల్లీ: విద్యుత్కు దేశంలో డిమాండ్ ఏటా భారీగా పెరుగుతోంది. గడిచిన దశాబ్ద కాలంలో ఏటా 11 గిగావాట్ల చొప్పున డిమాండ్ పెరగ్గా.. వచ్చే ఆరేళ్ల పాటు ఏటా 15 గిగావాట్ల మేర అధికం అవుతుందని కేంద్ర విద్యుత్ శాఖ అదనపు సెక్రటరీ శ్రీకాంత్ నాగులపల్లి తెలిపారు. సుమారు 40 గిగావాట్లు స్టోరేజ్ రూపంలో ఉంటుందన్నారు. ‘‘2030 నాటికి రోజులో సూర్యరశ్మి ఎక్కువగా ఉండే సమయంలో (సోలార్ హవర్స్) అదనంగా 85 గిగావాట్ల విద్యుత్ డిమాండ్ తోడవుతుంది. అదే నాన్ సోలార్ హవర్స్లో 90 గిగావాట్ల గరిష్ట డిమాండ్ నమోదవుతుంది’’అని శ్రీకాంత్ వెల్లడించారు. 2030 నాటికి స్టోరేజ్ సామర్థ్యంపై ఆధారపడే పరిస్థితి వస్తుందన్నారు. సోలార్ హవర్స్లో నిల్వ చేసిన విద్యుత్ను, నాన్ సోలార్ హవర్స్లో వినియోగించుకోవచ్చన్నారు. ఐఈఈఎంఏ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడారు. బొగ్గు ఆధారిత విద్యుత్ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచడంతోపాటు, సోలార్, పవన (విండ్), స్టోరేజ్, ప్రసారం సామర్థ్యాల విస్తరణ కూడా చేపడుతున్నట్టు చెప్పారు. 300 గిగావాట్ల లక్ష్యం.. 2030 నాటికి శిలాజ ఇంధనేతర మార్గాల ద్వారా (పునరుత్పాదక/పర్యావరణ అనుకూల) 500 గిగావాట్ల విద్యుత్ సామర్థ్యాన్ని కేంద్ర సర్కారు లక్ష్యంగా పెట్టుకోవడం గమనార్హం. ఇప్పటికే పునరుత్పాదక ఇంధన వనరుల రూపంలో 200 గిగావాట్ల విద్యుత్ సామర్థ్యాన్ని సాధించినట్టు శ్రీకాంత్ వెల్లడించారు. వచ్చే ఐదేళ్లలో మరో 300 గిగావాట్ల సామర్థ్యం ఆచరణలోకి వస్తుందన్నారు. ఇందులో 225 గిగావాట్లు కేవలం సోలార్, పవన విద్యుత్ రూపంలో ఉంటుందని తెలిపారు. సోలార్ సామర్థ్యం దండిగా ఉన్న రాజస్థాన్, గుజరాత్, కర్ణాటక, మధ్యప్రదేశ్ ప్రాంతాలతో కూడిన ఆర్ఈ జోన్లలో సామర్థ్యం ఎక్కువగా వస్తుందన్నారు. గుజరాత్, తమిళనాడు తీరాల్లో ఆఫ్షోర్ (సముద్ర జలాలు) విండ్ ఫార్మ్లు, ఒడిశా, గుజరాత్, తమిళనాడు తీరాల్లో గ్రీన్ హైడ్రోజన్ సామర్థ్యాల ఏర్పాటు ప్రణాళికలను సైతం వెల్లడించారు. ఎలక్ట్రిక్ వాహనాలు (ఈవీలు), డేటా కేంద్రాల రూపంలోనూ విద్యుత్కు డిమాండ్ గణనీయంగా పెరగబోతోందన్నారు. దేశం మొత్తాన్ని ఒకే ఫ్రీక్వెన్సీతో నడిచే ఒకే గ్రిడ్తో అనుసంధానించడం వల్ల 170 గిగావాట్ల విద్యుత్ను, ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి సరఫరా చేయొచ్చన్నారు. పంప్డ్ హైడ్రో స్టోరేజ్ ప్రాజెక్టులు, బ్యాటరీ స్టోరేజ్ ప్రాజెక్టులను ప్రోత్సహిస్తున్నట్టు శ్రీకాంత్ వెల్లడించారు. ‘‘40 గిగావాట్ల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్(బీఈఈఎస్)ను, 19 గిగావాట్ల పీఎస్పీ సామర్థ్యాన్ని ఆరేళ్లలో సాధించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్టు చెప్పారు. -
పసిడి రుణాలకు భారీ డిమాండ్.. ఐదేళ్లలో రూ.14.19 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: అవసరాల్లో బంగారాన్ని తనఖా పెట్టి రుణాలు తీసుకునే ధోరణి దేశంలో గణనీయంగా పెరిగిపోతోంది. సంఘటిత రంగం బంగారం రుణాల మార్కెట్ వచ్చే ఐదేళ్లలో రెట్టింపై రూ.14.19 లక్షల కోట్లకు చేరుకుంటుందని పీడబ్ల్యూసీ ఇండియా నివేదిక అంచనా వేసింది. ‘‘అసంఘటిత రంగంలో (వ్యక్తులు, పాన్బ్రోకర్ల వద్ద తనఖాలు) ఇది ఇంకా ఎక్కువే ఉండొచ్చు. 2023–24లో సంఘటిత రంగంలో బంగారం రుణాల మార్కెట్ రూ.7.1 లక్షల కోట్లకు చేరుకుంది. ఏటా 14.85 శాతం కాంపౌండెడ్ చొప్పున పెరుగుతూ 2029 మార్చి నాటికి రూ.14.19 లక్షల కోట్లకు చేరుతుంది’’ అని పీడబ్ల్యూసీ ఇండియా తెలిపింది. ముఖ్యంగా బంగారం రుణాల్లో 79.1 శాతం వాటాతో దక్షిణాది మార్కెట్ అగ్రగామిగా ఉన్నట్టు పేర్కొంది. ‘‘భారతీయ కుటుంబాల వద్ద 25,000 టన్నుల బంగారం ఉంటుంది. దీని ప్రస్తుత విలువ రూ.126 లక్షల కోట్లు. బంగారం విలువపై ఇచ్చే రుణం (ఎల్టీవీ) విషయంలో ఆర్బీఐ కఠిన పరిశీలనల నేపథ్యంలో వచ్చే రెండేళ్లలో బంగారం రుణాల మార్కెట్ మోస్తరు వృద్ధిని చూడొచ్చని పీడబ్ల్యూసీ ఇండియా నివేదిక వివరించింది. రుణాన్ని నగదు రూపంలో రూ.20 వేలకు మించి ఇవ్వరాదంటూ ఎన్బీఎఫ్సీలకు ఆర్బీఐ సూచించిన నేపథ్యంలో.. కస్టమర్లు అసంఘటిత రంగంపై ఆధారపడడం పెరగొచ్చని ఈ నివేదిక అంచనా వేసింది. ఫిన్టెక్ స్టార్టప్ల ద్వారా రుణాల జారీ ప్రక్రియపైనా ఆర్బీఐ ఆందోళన వ్యక్తం చేయడం గమనార్హం. ఇవే ఎన్బీఎఫ్సీల షేర్ల ధరలు తగ్గడానికి దారితీశాయంటూ పీడబ్ల్యూసీ తన నివేదికలో వివరించింది. నిబంధనల అమలుకు ప్రాధాన్యం.. వ్యయ నియంత్రణ చర్యల అమలుతో బంగారం రుణాలు ఇచ్చే ఎన్బీఎఫ్సీల లాభదాయకత పెరుగుతుందని, ఇన్వెస్టర్ల విశ్వాసం అధికమవుతుందని పీడబ్ల్యూసీ నివేదిక అంచనా వేసింది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో బంగారం ధరలు గణనీయంగా పెరగడం వీటిపై రుణ రేట్ల విషయంలో ఎన్బీఎఫ్సీలు అప్రమత్తంగా వ్యవహరించేలా చేసినట్టు వివరించింది. బంగారం ధరలు తగ్గుముఖం పడితే అది లోన్ టు వ్యాల్యూ పరిమితిని ఉల్లంఘనకు దారితీస్తుందని, నిర్వహణ పరమైన సమస్యలకు దారితీసి బంగారం వేలం వేయాల్సిన పరిస్థితులు రావొచ్చన్న ఆందోళనను పీడబ్ల్యూసీ నివేదిక ప్రస్తావించింది. బంగారం రుణ మార్కెట్ వృద్ధిని బ్యాంకులతోపాటు ఎన్బీఎఫ్సీలు నడిపిస్తాయని పేర్కొంది. బ్యాంక్లకు ఎక్కువ లబ్ధి ప్రపంచంలో రెండో అతిపెద్ద బంగారం రుణాల మార్కెట్ అయిన భారత్లో.. పరిశ్రమ మరింత వృద్ధి చెందడం వల్ల ఈ రంగంలోని అన్ని సంస్థలు ప్రయోజనం పొందొచ్చని ఈ నివేదిక తెలిపింది. తక్కువ వడ్డీ రేట్ల కారణంగా బ్యాంక్లకు ఎక్కువ ప్రయోజనం ఉంటుందని అంచనా వేసింది. ‘‘బంగారంపై రుణాలన్నవి పూర్వకాలం నుంచి ఉన్న విధానం.. వినియోగదారులతోపాటు, రుణాలిచ్చే సంస్థలకు ఇది ఆకర్షణీయమైన ఆప్షన్గా ఉంటోంది’’అని పేర్కొంది. -
బుల్.. కొత్త రికార్డుల్
ముంబై: ఐటీ, ఇంధన షేర్లు రాణించడంతో స్టాక్ సూచీలు వరుసగా మూడో రోజూ జీవితకాల గరిష్టాలను నమోదు చేశాయి. తొలిసారి సెన్సెక్స్ 79 వేలు, నిఫ్టీ 24 వేల పాయింట్ల మార్కును దాటాయి. అధిక వెయిటేజీ షేర్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ 1%, టీసీఎస్, ఇన్ఫోసిస్ 2%, అ్రల్టాటెక్ సిమెంట్ 5%, ఎన్టీపీసీ 3% పెరిగి సూచీల రికార్డుల ర్యాలీకి దన్నుగా నిలిచాయి. ఉదయం స్వల్ప నష్టాలతో ప్రారంభమైన సూచీలు, కాసేపటికే పుంజుకొని తాజా రికార్డులు నమోదు చేశాయి. మిడ్సెషన్ నుంచి కొనుగోళ్లు మరింత ఊపందుకోవడంతో ఇరు సూచీలు సరికొత్త రికార్డుల ఎగువనే ముగిశాయి.ట్రేడింగ్లో సెన్సెక్స్ 721 పాయింట్లు ఎగసి 79,396 వద్ద ఆల్టైం హైని అందుకుంది. చివరికి 569 పాయింట్ల లాభంతో 79,243 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 219 పాయింట్లు బలపడి 24,087 వద్ద తాజా గరిష్టాన్ని నెలకొలి్పంది. ఆఖరికి 176 పాయింట్లు బలపడి 24,044 వద్ద నిలిచింది. రికార్డుల ర్యాలీలోనూ ఫైనాన్స్, పారిశ్రామిక, రియల్టీ, క్యాపిటల్ గూడ్స్ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. బీఎస్ఈ మిడ్క్యాప్ ఇండెక్స్ 0.17 % లాభపడగా, స్మాల్క్యాప్ ఇండెక్స్ అరశాతానికి పైగా నష్టపోయింది. డాలర్ మారకంలో రూపాయి విలువ 12 పైసలు బలపడి 83.45 వద్ద స్థిరపడింది. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి. యూరప్ సూచీలు బలహీనంగా ముగిశాయి. అమెరికా మార్కెట్లూ స్వల్ప నష్టాలతో ట్రేడవుతున్నాయి. ‘‘జూన్ డెరివేటివ్ కాంట్రాక్టుల గడువు ముగింపు నేపథ్యంలో షార్ట్ కవరింగ్ జరగడంతో సెన్సెక్స్ 79 వేలు, నిఫ్టీ 24 వేల స్థాయిలను అధిగమించాయి. అధిక వెయిటేజీ షేర్లు రాణించడం, రాజకీయ స్థిరత్వం, విదేశీ ఇన్వెస్టర్ల పునరాగమన అంశాలు సూచీలను సరికొత్త శిఖరాలపైకి చేర్చాయి. అధిక వాల్యుయేషన్ల ఆందోళనలతో మిడ్, స్మాల్ క్యాప్ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనవుతున్నాయి’’ రిలిగేర్ బ్రోకింగ్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా తెలిపారు.జీవితకాల గరిష్టానికి ఇన్వెస్టర్ల సంపద స్టాక్ మార్కెట్ రికార్డు ర్యాలీతో ఇన్వెస్టర్ల సంపద జీవితకాల గరిష్టానికి చేరింది. సెన్సెక్స్ 4 రోజుల్లో 2,033 పాయింట్లు(2.63%) పెరగడంతో రూ.3.93 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈలోని కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆల్టైం రికార్డు రూ.438.41 లక్షల కోట్లకు చేరింది. ర్యాలీ ఇలానిఫ్టీ చేరేందుకు పట్టిన కాలం 20,000 51 రోజులు 21,000 60 రోజులు 22,000 25 రోజులు 23,000 88 రోజులు 24,000 25 రోజులు -
అందరి గురి మల్కాజిగిరి!
సాక్షి, న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమవుతున్న భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియకు పదును పెట్టింది. పార్టీ ముఖ్యులతో ముమ్మర చర్చలు జరుపుతోంది. శుక్రవారం తెలంగాణ బీజేపీ రాష్ట అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఢిల్లీ నివాసంలో రాష్ట్ర ఎన్నికల కమిటీ సభ్యులు సమావేశమయ్యారు. కె.లక్ష్మణ్, డీకే అరుణ, మురళీధర్ రావు, బండి సంజయ్, ఈటల రాజేందర్, గరికపాటి మోహన్రావు, జితేందర్ రెడ్డి, సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలోని 17 పార్లమెంటు నియోజకవర్గాలకు అందిన దరఖాస్తులను పరిశీలించారు. ఒక్కో నియోజకవర్గానికి మూడు నుంచి ఐదుగురి పేర్లు పరిగణనలోకి తీసుకున్నారు. మల్కాజిగిరి స్థానానికి ఎక్కువ దరఖాస్తులు వచ్చినట్లు తెలిసింది. మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఈ సీటు కోసం పోటీ పడుతున్నారు. తనకున్న ప్రజాదరణ, రాజకీయ అనుభవాన్ని దృష్టిలోపెట్టుకుని మల్కాజిగిరి సీటు ఇవ్వాలని కోరినట్లు తెలిసింది. ఇదే సీటును ఆశిస్తున్న మురళీధర్రావు.. దశాబ్దాలుగా తనకున్న జాతీయ స్థాయి అనుభవం, పార్టీకి అంకిత భావంతో పనిచేయడం పరిగణనలోకి తీసుకుని పోటీకి అవకాశం ఇవ్వాలని అడుగుతున్నట్లు సమాచారం. మాజీ ఎంపీ చాడా సురేష్రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు, బీజేపీ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు హరీశ్రెడ్డి కూడా ఈ సీటును కోరుతున్నారు. ఈ సీటుపై ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్న నేపథ్యంలో దీనిపై నిర్ణయాన్ని అధిష్టానానికి అప్పగించినట్లు తెలిసింది. మరోవైపు జహీరాబాద్ నుంచి పోటీ చేయాలని జైపాల్రెడ్డి, పైడి ఎల్లారెడ్డి, ఆలె భాస్కర్, మురళీగౌడ్ భావిస్తుండగా, మహబూబ్నగర్ నుంచి పోటీకి డీకే అరుణ, జితేందర్రెడ్డి, శాంతకుమార్ బరిలో ఉన్నారు. త్వరలో అభ్యర్థుల ప్రకటన: కిషన్రెడ్డి అధిష్టానంతో చర్చించిన తర్వాత త్వరలోనే ఎంపీ అభ్యర్థుల పేర్లు ప్రకటిస్తామని సమావేశానంతరం కిషన్రెడ్డి మీడియాకు చెప్పారు. తొలి జాబితాలోనే వీలైనన్ని ఎక్కువ పేర్లు ప్రకటిస్తామన్నారు. తమ పార్టీకి రాష్ట్రంలో వాతావరణం అనుకూలంగా ఉందని, గ్రామ స్థాయిలో పార్టీలో చేరికల కోసం 25 మంది యువకులు, మహిళలు, రైతులతో కమిటీలు వేస్తామన్నారు. దేశ రాజకీయాల్లో అసందర్భంగా మారిన బీఆర్ఎస్ పార్టీ మహారాష్ట్రలోని ఆఫీస్కు తాళం వేశారని, రాష్ట్రంలోనూ అదే పరిస్థితి నెలకొంటుందని విమర్శించారు. -
నల్లగొండ ఎంపీ టికెట్కు డిమాండ్
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ఉమ్మడి జిల్లాలో ప్రధాన పార్టీల నుంచి ఎంపీ టికెట్కు డిమాండ్ పెరుగుతోంది. ఆయా పార్టీల్లోని ఆశావహులు తమ గాడ్ ఫాదర్ల ఆశీస్సులు పొందేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. వచ్చే నెలలో లోక్సభ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉండటంతో ఆశావహుల సందడి మొదలైంది. ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులు ఎవరనేది ఇంకా నిర్ణయించకపోయినా ఆశావహులు మాత్రం తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. దీంతో వారి జాబితా రోజురోజుకూ పెరుగుతోంది. నల్లగొండలో ఎక్కువ మంది.. నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గంలో ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉంది. అధికార కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికే తాను ఎంపీగా పోటీ చేస్తానని మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి ప్రకటించారు. మరోవైపు ఆయన కుమారుడు రఘువీర్రెడ్డికి టికెట్ ఇవ్వాలని పట్టుపడుతున్నారనే చర్చ పార్టీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. అయితే అసెంబ్లీ ఎన్నికల సమయంలో సూర్యాపేట టికెట్ను మాజీమంత్రి దామోదర్రెడ్డికి కేటాయించడంతో ఆ టికెట్ను ఆశించిన పటేల్ రమేష్రెడ్డికి ఎంపీ టికెట్ ఇస్తామని పార్టీ అధిష్టానం హామీ ఇచ్చింది. ప్రస్తుతం రఘువీర్రెడ్డికి ఎంపీ టికెట్ ఇవ్వాలని జానారెడ్డి పట్టుపడుతున్న నేపథ్యంలో పటేల్ రమేష్రెడ్డికి ఎమ్మెల్సీ ఇస్తారా? లేదా ఎంపీ టికెట్ ఇస్తారా? ఏం ఇస్తారన్నది ఆసక్తికరంగా మారింది. పటేల్ రమేష్రెడ్డికి ఏదో ఒకటి మాత్రం కచ్చితంగా ఇస్తారనే చర్చ సాగుతోంది. బీఆర్ఎస్లోనూ పలువురు ఆశావహలు ఎంపీ టికెట్కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి తనయుడు గుత్తా అమిత్రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో మునుగోడు టికెట్ ఆశించారు. అయినా అధిష్టానం ఇవ్వలేదు. తన కుమారుడికి నల్లగొండ ఎంపీ టికెట్ కావాలని ఇప్పటికే అధిష్టానం దృష్టికి తీసుకెళ్లిన గుత్తా సుఖేందర్రెడ్డి శుక్రవారం నల్లగొండ లేదా భువనగిరిలో ఎక్కడ టికెట్ ఇచ్చినా పోటీ చేస్తామని ప్రకటించారు. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో హుజూర్నగర్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన శానంపూడి సైదిరెడ్డి కూడా టికెట్ ఆశిస్తున్నట్లు చర్చ సాగుతోంది. వారే కాకుండా ఓ వ్యాపారవేత్తతోపాటు మరికొందరు కూడా నల్లగొండ ఎంపీ టికెట్ కోసం ప్రయత్నం చేస్తున్నట్లు తెలిసింది. భువనగిరి నుంచి పోటీకి పలువురి ఆసక్తి భువనగిరి పార్లమెంట్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీలోనే ఎక్కువగా పోటీ ఉంది. ఏడెనిమిది మంది అక్కడి నుంచి టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. భువనగిరి ఎంపీగా ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి సతీమణి లక్ష్మి పోటీ చేస్తారని గతంలో చర్చ జరగ్గా.. ఇటీవల కోమటిరెడ్డి సూర్యపవన్రెడ్డి పేరు తెరపైకి వచ్చింది. మరోవైపు సీఎం రేవంత్రెడ్డికి అనుచరుడిగా ఉన్న టీపీసీసీ ఉపాధ్యక్షుడు చామల కిరణ్కుమార్రెడ్డి ఎంపీ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి తన కూతురు కీర్తిరెడ్డి కోసం టికెట్ అడుగుతుండగా, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ నారాయణరెడ్డి టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్రెడ్డి, బూడిద భిక్షమయ్యగౌడ్, గొంగిడి మహేందర్రెడ్డి టికెట్ ఆశిస్తున్నట్లు తెలిసింది. శుక్రవారం తెలంగాణ భవన్లో భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ సన్నాహక సమవేశం జరిగింది. ఈ సమావేశంలో ఎవరిని పోటీలో ఉంచాలన్న దానిపైనా చర్చ జరక్కపోయినా ఆశావహలు మాత్రం తమకు టికెట్ కావాలన్న విషయాన్ని అధిష్టానం వద్ద ప్రస్తావించినట్లు తెలిసింది. ఇక బీజేపీ నుంచి పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్రెడ్డి, ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పీవీ శ్యాంసుందర్రావు, డాక్టర్ బూర నర్సయ్యగౌడ్తోపాటు మరో ఇద్దరు పోటీకి ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. బీజేపీ నుంచి పది మంది.. బీజేపీ నుంచి టికెట్ ఆశిస్తున్న వారి జాబితా కూడా పెద్దగానే ఉంది. పది మంది ఆశావహులు తమకు టికెట్ కావాలని అడుతుండడం ఆసక్తికరంగా మారింది. ఇటీవల నల్లగొండలోని ఆ పార్టీ కార్యాలయంలో పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి చింతల రామచంద్రారెడ్డి అధ్యక్షతన జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో గార్లపాటి జితేందర్, మన్నెం రంజిత్యాదవ్, నూకల నర్సింహారెడ్డి, బండారు ప్రసాద్, గోలి మధుసూదన్రెడ్డి, లాలూనాయక్, నాగం వర్షిత్రెడ్డి, నివేదితారెడ్డి, సత్యనారాయణ, మన్మథరెడ్డి తమకు ఎంపీ టికెట్ కావాలని అడిగారు. బీజేపీ నుంచి కూడా అంతమంది టికెట్ అడుగుతుండటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. -
ఇండియన్ ఫుడ్కు భారీ డిమాండ్.. భారత్ను వేడుకుంటున్న దేశాలు
భారతీయ ఆహార ఉత్పత్తులకు బయటి దేశాల్లో భారీ డిమాండ్ ఉంటోంది. అందుకు అనుగుణంగా దిగుమతులకు వీలు కల్పించాలని ఆయా దేశాలు భారత్ను వేడుకుంటున్నాయి. భారత్ నుంచి చికెన్, డైరీ, బాస్మతి రైస్, ఆక్వా, గోధుమ ఉత్పత్తులకు మధ్యప్రాచ్య దేశాలలో భారీ డిమాండ్ ఉందని యుఏఈ ఆహార పరిశ్రమ తెలిపింది. వీటి దిగుమతుల కోసం భారత ప్రభుత్వ మద్దతును కోరుతోంది. అగ్రికల్చరల్ & ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ (APEDA) సమన్వయంతో ధ్రువీకరణ ప్రక్రియలు సజావుగా జరిగేలా సహకరించాలని యూఏఈ ఆహార పరిశ్రమ భారత్ను కోరింది. బహ్రెయిన్, కువైట్, సుల్తానేట్ ఆఫ్ ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఏఈ) వంటి దేశాలలో ఆహార ఉత్పత్తుల ఎగుమతులను పెంచడానికి భారత ఉత్పత్తుల అధిక నాణ్యత ప్యాకేజింగ్ సహాయపడుతుందని పేర్కొంటోంది. ఇటీవల యూఏఈలో పర్యటించిన భారత వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అక్కడి దిగుమతిదారులతో వివరణాత్మక చర్చలు జరిపారు. భారత్ నుంచి ఎగుమతులను పెంచే మార్గాలపై చర్చించారు. ఈ దేశాలలో ఫ్రోజెన్ ఉత్పత్తులను ఎగుమతి చేయడానికి భారతదేశానికి భారీ అవకాశాలు ఉన్నాయని గ్లోబల్ ఫుడ్ ఇండస్ట్రీస్ LLC సేల్స్ UAE హెడ్ నిస్సార్ తలంగర అన్నారు. బాస్మతి బియ్యానికి డిమాండ్ భారతీయ బాస్మతి బియ్యానికి డిమాండ్ ఉందని, ఈ బియ్యంపై కనీస ఎగుమతి ధర (MEP) తగ్గింపు భారత్ ఎగుమతులను పెంచడంలో సహాయపడుతుందని ఒమన్కు చెందిన ఖిమ్జీ రాందాస్ గ్రూప్ ప్రతినిధి చెప్పారు. ప్రస్తుతం టన్నుకు 1,200 డాలర్లుగా ఉన్న MEPని 850 డాలర్లకు తగ్గించాలని ప్రభుత్వం పరిశీలిస్తోంది. జీసీసీ (గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్) దేశాల నుంచి మరొక దిగుమతిదారు హలాల్ సర్టిఫికేషన్ సమస్యను లేవనెత్తారు. భారత్లో అత్యంత మెరుగైన హలాల్ మాంసం ధ్రువీకరణ వ్యవస్థ ఉంది. అల్లానాసన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫౌజాన్ అలవి మాట్లాడుతూ భారత్, యూఏఈ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం మాంసం ఉత్పత్తుల ఎగుమతులను ప్రోత్సహించడంలో సహాయపడుతుందన్నారు. చోయిత్రమ్స్ హెడ్ (రిటైల్ ప్రొక్యూర్మెంట్) కీర్తి మేఘనాని కూడా ఇదే విధమైన అభిప్రాయాలను వెలిబుచ్చారు. ఉత్పత్తుల ప్యాకేజింగ్పై దృష్టి పెట్టడం వల్ల యూఏఈ, ఇతర గల్ఫ్ ప్రాంత దేశాలతో వాణిజ్యాన్ని పెంచుకోవడానికి భారతీయ ఎగుమతిదారులు సహాయపడతారన్నారు. యాప్కార్ప్ హోల్డింగ్ చైర్మన్ నితేష్ వేద్ మాట్లాడుతూ ఇక్కడ ఏపీఈడీఏ కార్యాలయం ఏర్పాటు చేయడం వల్ల ఆహార పరిశ్రమకు దోహదపడుతుందని సూచించారు. GCC గ్రూప్కు చెందిన మరో దిగుమతిదారు మాట్లాడుతూ భారతీయ కుటీర పరిశ్రమలు తయారు చేసే ఉత్పత్తులకు డిమాండ్ ఉందని, దీని కోసం భారతదేశం ప్రమాణాలు, ప్యాకేజింగ్, లేబులింగ్కు సంబంధించిన సమస్యలను చూడాల్సి ఉందని చెప్పారు. భారత్-యూఏఈ వాణిజ్య ఒప్పందం గతేడాది మేలో అమల్లోకి వచ్చింది. దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 2021-22లో 72.9 బిలియన్ డాలర్ల నుంచి 2022-23లో 84.9 బిలియన్ డాలర్లకు పెరిగింది. -
గణపయ్యా.. కాస్త దిగి రావయ్యా!
హైదరాబాద్: పది అడుగుల ఎత్తు వినాయక విగ్రహం ధర రూ.45 వేలు. ఇంకొంచెం ఆకర్షణీయంగా ఉంటే రూ.50 వేలు. 18 అడుగుల గణనాథుడు రూ.2 లక్షల పైనే ఉన్నాడు. ఇక 25 ఫీట్ల మూర్తిని మండపంలో ఏర్పాటు చేయాలంటే రూ.3 లక్షల నుంచి రూ.3.5 లక్షల వరకు చెల్లించి కొనుగోలు చేయాల్సిందే. ఈసారి గణనాథుడి విగ్రహాల ధరలకు రెక్కలొచ్చాయి. నగరంలోని అనేక చోట్ల విగ్రహాలు అమ్మకానికి సిద్ధంగా ఉన్నప్పటికీ ధరలు మాత్రం భగ్గుమంటున్నాయి. గత సంవత్సరంతో పోల్చితే ఈసారి 20 శాతం వరకు పెరిగినట్లు అంచనా. వినాయక విగ్రహాల తయారీ కోసం వినియోగించే వివిధ రకాల ముడిసరుకు ధరలు, రవాణా చార్జీలు పెరగడంతోనే విగ్రహాల ధరలు పెంచాల్సి వచ్చిందని ధూల్పేట్, నాగోల్, మియాపూర్ తదితర ప్రాంతాలకు చెందిన వ్యాపారులు చెబుతున్నారు. పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుంచి వచ్చే కళాకారులకు సైతం డిమాండ్ పెరిగిందని, ఎక్కువ మొత్తంలో చెల్లిస్తే తప్ప కళాకారులు లభించడం లేదని ధూల్పేట్కు చెందిన ఒక వ్యాపారి విస్మయం వ్యక్తం చేశారు.ఈ మేరకు గతేడాది కంటే ఈసారి కొంతమేరకు పెరిగాయన్నారు. ఆకట్టుకునే ఆకృతుల్లో.. ఈ నెల 18వ తేదీ నుంచి ప్రారంభం కానున్న గణపతి నవరాత్రి ఉత్సవాల కోసం అందమైన వినాయక విగ్రహాలు ముస్తాబయ్యాయి. కొన్ని చోట్ల అమ్మకాలు కూడా ఆరంభమయ్యాయి. ఇంకా కొన్ని ప్రాంతాల్లో విగ్రహాలకు తుది మెరుగులు దిద్దుతున్నారు. హైదరాబాద్తో పాటు తెలుగు రాష్ట్రాలకు చెందిన వివిధ ప్రాంతాలకు చెందిన మండపాల నిర్వాహకులు హైదరాబాద్ నుంచే విగ్రహాలను తరలిస్తారు. ఈ మేరకు ధూల్పేట్, ఎల్బీనగర్, నాగోల్, ఉప్పల్, కార్ఖానా, కూకట్పల్లి, మియాపూర్ తదితర ప్రాంతాల్లో ప్రస్తుతం విభిన్న ఆకృతుల్లో బొజ్జ గణపయ్య మూర్తులు అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. ధరలు ఎందుకు పెరిగాయంటే.. ► ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, కొబ్బరి పీచు, రంగులు తదితర వస్తువుల ధరలు పెరగడంతో విగ్రహాల ధరలకు రెక్కలొచ్చాయి. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు తదితర ప్రాంతాల నుంచి ముడిసరుకును హైదరాబాద్కు తరలించేందుకు రవాణా చార్జీలు కూడా భారీగా పెరిగాయి. దీంతో విగ్రహాల ధరలను పెంచవలసి వచ్చిందని హస్తకళాకారులు చెబుతున్నారు. సుమారు 500కు పైగా చిన్న, పెద్ద కార్ఖానాలు ఉన్న ధూల్పేట్లో రూ.500 ఖరీదైన విగ్రహాలు మొదలుకొని రూ.3.5 లక్షల ఖరీదు చేసే విగ్రహాలు కూడా అందుబాటులో ఉన్నాయి. వివిధ రకాల సైజులను బట్టి 15 శాతం నుంచి 20 శాతం వరకు ధరలు పెరిగాయి. ► గతేడాది రూ.40 వేలకు లభించిన విగ్రహాలు ఇప్పుడు రూ.45 వేలకు పెరిగాయి. 15 ఫీట్ల విగ్రహం రూ.85 వేల నుంచి 1.10 లక్షల వరకు పెరిగింది. ఎక్కువమంది కొనుగోలు చేసే 18 ఫీట్ల విగ్రహాల ధరలు కూడా రూ.2 లక్షలకు చేరాయి. ► చిన్న విగ్రహాలకు సైతం భారీ డిమాండ్ ఉంది. ధూల్పేట్లోని కళాకారులు ఇళ్లల్లో చిన్న విగ్రహాలను తయారు చేసి విక్రయిస్తున్నారు. వీటికి రూ.500 నుంచి రూ.2500 వరకు ధరలు ఉన్నాయి. ఈ ధరలకు అనుగుణంగానే వివిధ సైజుల్లో ఉన్న విగ్రహాలను అమ్మకానికి సిద్ధం చేశారు. కార్ఖానా ఖర్చులు పెరిగాయి: గణేష్ నగరంలో విగ్రహాల తయారీ కోసం కోల్కతా, పుణె, ఛత్తీస్గఢ్ తదితర ప్రాంతాల నుంచి కూడా కళాకారులను తీసుకొస్తాం. వాళ్లకు చెల్లించే జీతభత్యాలు ఈసారి బాగా పెరిగాయి. విగ్రహాల తయారీ పూర్తయ్యే వరకు భోజనం, వసతి కూడా కల్పించాలి. ముడిసరుకు ధరలు పెరగడం వల్ల కార్ఖానా నిర్వహణ ఖర్చులు కూడా పెరిగాయి. పోటీ కూడా ఎక్కువే : రాకేష్ ఒకప్పుడు ధూల్పేట్ విగ్రహాలు మాత్రమే ఉండేవి. ఇప్పుడు అన్ని చోట్లా విగ్రహాలను తయారు చేసి అమ్ముతున్నారు. షోలాపూర్ నుంచి తెచ్చి ఇక్కడ అమ్మకానికి పెట్టారు. రూ.లక్షలు ఖర్చు చేసి విగ్రహాలను తయారు చేస్తే ఈ పోటీ వల్ల ఇబ్బందులకు గురికావాల్సి వస్తోంది. అలాగని నష్టానికి అమ్ముకోలేం కదా. -
అ'ధర'గొట్టిన గుంటూరు మిర్చి ఎగుమతులు
-
కోల్ ఇండియా ఆఫర్కు డిమాండ్
న్యూఢిల్లీ: పీఎస్యూ దిగ్గజం కోల్ ఇండియా ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్)కు తొలి రోజు భారీ డిమాండ్ నెలకొంది. సంస్థాగత ఇన్వెస్టర్ల నుంచి గురువారం ఏకంగా రూ. 6,500 కోట్ల విలువైన బిడ్స్ దాఖలయ్యాయి. కంపెనీలో 3 శాతం వాటా విక్రయించేందుకు కేంద్ర ప్రభుత్వం ఓఎఫ్ఎస్ చేపట్టింది. ఇందుకు రూ. 225 ఫ్లోర్ ధరను నిర్ణయించింది. గురువారం(1)న సంస్థాగత ఇన్వెస్టర్లకు ప్రారంభమైంది, నేడు(శుక్రవారం) రిటైలర్లకు ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) విండో ఓపెన్ కానుంది. తొలి రోజు ప్రభుత్వం 8.31 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచగా.. 28.76 కోట్ల షేర్ల కోసం బిడ్స్ దాఖలయ్యాయి. అంటే 3.46 రెట్లు అధిక సబ్స్క్రిప్షన్ లభించింది. ఓఎఫ్ఎస్లో భాగంగా కంపెనీ ఈక్విటీలో 3 శాతం వాటాకు సమానమైన మొత్తం 18.48 కోట్లకుపైగా షేర్లను విక్రయించనుంది. ఆఫర్ ధర ప్రకారం ప్రభుత్వానికి రూ. 4,158 కోట్లు అందనున్నాయి. తద్వారా ఈ ఆర్థిక సంవత్సరం(2023–24)లో తొలి పీఎస్యూలో డిజిన్వెస్ట్మెంట్కు తెరలేచింది. ప్రస్తుతం కంపెనీలో ప్రభుత్వానికి 66.13% వాటా ఉంది. ఈ ఏడాది డిజిన్వెస్ట్మెంట్ ద్వారా ప్రభుత్వం రూ. 51,000 కోట్ల సమీకరణను లక్ష్యంగా పెట్టుకున్న విషయం విదితమే. ఓఎఫ్ఎస్ నేపథ్యంలో గురువారం కోల్ ఇండియా షేరు బీఎస్ఈలో 4.4 శాతం పతనమై రూ. 231 వద్ద ముగిసింది. బుధవారం ధరతో పోలిస్తే 6.7 శాతం డిస్కౌంట్లో ప్రభుత్వం ఓఎఫ్ఎస్ను ప్రకటించింది. -
లిథియం బ్యాటరీలకు భారీ డిమాండ్.. ఏకంగా 5 రెట్లు!
ప్రపంచవ్యాప్తంగా లిథియం బ్యాటరీలకు డిమాండ్ బాగా పెరిగింది. స్మార్ట్ఫోన్ల నుంచి ల్యాప్టాప్ల వరకు, వైద్య పరికరాల నుంచి ఎలక్ట్రిక్ కార్ల వరకు అన్నింటినిలోనూ లిథియం-అయాన్ బ్యాటరీలు వినియోగం ఎక్కువైంది. అందుకే వాటి డిమాండ్ రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. అందుకే దీన్ని ‘వైట్ గోల్డ్’ అని పిలుస్తున్నారు. గ్లోబల్ లిథియం మార్కెట్ పరిమాణం 2021లో 6.83 బిలియన్ డాలర్లుగా ఉంది. గ్రాండ్ వ్యూ రీసెర్చ్ ప్రకారం... 2022 నుంచి 2030 నాటికి దీని సమ్మిళిత వార్షిక వృద్ధి రేటు 12 శాతం పెరగనుంది. ఎలక్ట్రిక్ వాహనాల తయారీ వాడకం గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో లిథియం-అయాన్ బ్యాటరీలకు డిమాండ్ అదే స్థాయిలో పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వాలు కూడా ఎలక్ట్రిక్ వాహనాలకు రాయితీలు ఇస్తుండటం లిథియం బ్యాటరీ మార్కెట్ వృద్ధికి అదనపు బూస్టర్గా పనిచేస్తోంది. 2030 నాటికి 5రెట్లకు పైగా.. పబ్లిక్-ప్రైవేట్ అలయన్స్ లీ-బ్రిడ్జ్ ప్రకారం... లిథియం బ్యాటరీలకు డిమాండ్ ప్రపంచవ్యాప్తంగా 2030 నాటికి ఐదు రెట్ల కంటే ఎక్కువగా పెరుగుతుందని అంచనా. యూఎస్ జియోలాజికల్ సర్వే ప్రకారం.. 2021లో ప్రపంచవ్యాప్తంగా లిథియం ఉత్పత్తి లక్ష టన్నులు (90.7 మిలియన్ కిలోలు), ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 22 మిలియన్ టన్నుల (20 బిలియన్ కిలోలు) లిథియం నిల్వలు ఉన్నాయి. 2022లో చిలీలో అత్యధికంగా 9.3 మిలియన్ మెట్రిక్ టన్నుల లిథియం నిల్వలు, ఆస్ట్రేలియాలో 6.2 మిలియన్ మెట్రిక్ టన్నులు, అమెరికా వద్ద ఒక మిలియన్ మెట్రిక్ టన్నుల లిథియం నిల్వలు ఉంటాయని అంచనా తాజాగా జమ్ము కశ్మీర్లో 5.9 మిలియన్ టన్నుల లిథియం కనుగొనడంతో భారత్ కూడా లిథియం సూపర్ పవర్ క్లబ్లో చేరింది. (ఇదీ చదవండి: Thomas Lee: ప్రముఖ బిలియనీర్, ఫైనాన్షియర్ ఆత్మహత్య) 2025 నాటికి లిథియం కొరత లిథియం వినియోగంలో అత్యధిక వాటా బ్యాటరీలదే. రీచార్జబుల్ లిథియం బ్యాటరీల ఆధారితమైన ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లో వృద్ధి కారణంగా గ్లోబల్ లిథియం డిమాండ్ 2025 నాటికి ఒక మిలియన్ మెట్రిక్ టన్నులకు, 2030 నాటికి రెండు మిలియన్ టన్నులకు చేరుకుంటుందని అంచనా. ఇదే క్రమంలో 2025 నాటికి ప్రపంచం లిథియం కొరతను ఎదుర్కొంటుందని ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ పేర్కొంటోంది. (ఇదీ చదవండి: అతిగా ఫోన్ వాడుతున్నారా.. ఈమెకు జరిగిందే మీకూ జరగొచ్చు!) -
నాటుకోడికి ఫుల్ గిరాకీ.. ఆ రుచే వేరబ్బా.. ఎంత ఆరోగ్యమో తెలుసా..?
రాయదుర్గం(అనంతపురం జిల్లా): రాయదుర్గానికి చెందిన ఎరుకుల వెంకటేశులు గ్రామాలు తిరుగుతూ నాటుకోళ్లను హోల్సేల్ ధరలకు కొనుగోలు చేస్తాడు. ద్విచక్రవాహనంపై బళ్లారికి తీసుకెళ్లి అక్కడ అధిక ధరలకు అమ్మకం చేపట్టి లాభాలు పొందుతున్నాడు. వారానికి అన్ని ఖర్చులూ పోను రూ.6 వేల వరకు సంపాదిస్తున్నాడు. ఇలా జిల్లా వ్యాప్తంగా నాటుకోడి వ్యాపారాలు చేపట్టి ఆశించిన లాభాలు పొందే వారి సంఖ్య ఇటీవల గణనీయంగా పెరిగింది. చదవండి: హనీ ట్రాప్.. యువకులకు యువతి వల.. వీడియో కాల్స్ రికార్డ్ చేసి.. నాటుకోడి అంటే మాంసం ప్రియులకు నోరూరుతుంది. బ్రాయిలర్ చికెన్ ధరకు రెట్టింపు, మటన్తో సమానంగా ధర పలుకుతున్నా కొనుగోలుకు వెనుకాడటం లేదు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో వాటి మాంసానికి ఉన్న ఆదరణ చూసి కొందరు దుకాణదారులు, హోటల్ నిర్వాహకులు మోసాలకు పాల్పడుతున్నారు. వాటిని పోలిన జాతులను చూపిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. నాటో.. కాదో నిర్ధారించుకోవడం కొంత కష్టంగా ఉన్నా, తరచి చూస్తే ఇలాంటి మోసాలకు తెరదించొచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఎలా పెంచుతారంటే..? గ్రామాల్లో దేశవాళీ నాటుకోడి పెరిగేందుకు ఎక్కువ కాలం పడుతుంది. ఆరు వారాలకు 400 గ్రాముల బరువు పెరుగుతుంది. వంద రోజులు దాటితే 1.5 కిలోలకు ఎదుగుతాయి. అదే వనరాజ, గిరిరాజ కోళ్లు ఆరు వారాల్లోనే 850 గ్రాముల పైన, బ్రాయిలర్ 1.50 కిలోల వరకు పెరుగుతుంది. ఫారంలో లైట్ల వెలుగులో నిద్రపోకుండా చేసి, మొక్కజొన్న, జొన్న, శనగచెక్క వంటి బలమైన ఆహారాన్ని అందిస్తూ వేగంగా పెరిగేలా చేస్తున్నారు. వాటినే మార్కెట్లో నాటుకోళ్లుగా విక్రయిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆరుబయట తిరిగే దేశవాళీ కోళ్లు పురుగులు, ఆకులు, గడ్డి ఇతర విత్తనాలు వంటివి తిని బలిష్టంగా ఉంటాయి. గుర్తించడం ఇలా.. ♦నాటుకోడి కాళ్లు, ఎముకలు బలిష్టంగా ఉంటాయి. ఎక్కువ సమయం బయట నిల్వ ఉంచినా మాంసం పాడవ్వదు. ♦వండిన తర్వాత ఎముకలు నమిలేందుకు గట్టిగా ఉంటాయి. ♦మటన్తో సమానంగా ఉడికించాల్సి వస్తుంది. ♦గిరిరాజ, వనరాజ, కడక్నాథ్ కోళ్లు సాధారణంగా ఒకే రంగులో జుట్టు కలిగి ఉంటాయి. ఎముకలు పలుచగా, ఈకలు ఎక్కువగా ఉంటాయి. ♦బ్రాయిలర్ మాంసం కూడా తక్కువ సమయంలోనే ఉడికించవచ్చు. నాటుకోడి రుచే వేరు.. కోళ్ల మాంసంలో నాటు కోడి రుచేవేరు. ఆ మాంసం ఆరోగ్యానికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని వైద్యులు చెపుతారు. గ్రామీణ ప్రాంతాల్లో పెరిగే కోళ్లలో అనేక రకాలు ఉన్నాయి. ఇలాంటి దేశవాళీతో పాటు షెడ్లలో వేగంగా పెరిగే వనరాజ, గిరిరాజ, కడక్నాథ్ వంటివి ప్రస్తుతం అందుబాటులోకి వచ్చాయి. వీటినీ నాటుకోడి మాంసమని చెప్పి విక్రయిస్తూ మోసగిస్తున్నారు. నాటుకోడి విక్రేతలు ధరలో ఎక్కడా రాజీపడరు. కిలో రూ.350 నుంచి రూ.400కు తక్కువ ఇవ్వలేరు. షెడ్లలో పెంచే కడక్నాథ్, గిరిరాజ ఇతర జాతుల కోళ్లు రూ.300లోపే లభ్యమవుతాయి. ఉమ్మడి జిల్లాలో రోజూ ఒకటిన్నర టన్ను వరకు విక్రయాలు జరుగుతుంటాయని, ఒక్క అనంతపురం జిల్లాలోనే టన్ను వరకు అమ్మకాలు జరుగుతాయని పశు సంవర్ధక శాఖ అధికారుల ప్రాథమిక అంచనా ద్వారా తెలిసింది. సాధారణంగా చాలామంది ఆదివారం మాంసం తినేందుకు ఇష్టపడతారు. పట్టణం, పల్లె ఏదైనా సరే ప్రస్తుతం అందరి చూపు నాటు కోడి వైపు మళ్లడంతో విక్రయదారులు సైతం ధరలు పెంచేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ప్రత్యామ్నాయం.. లాభదాయకం.. వ్యవసాయం కలిసిరాకపోవడంతో ప్రత్యామ్నాయంగా నాటుకోళ్ల పెంపకం ఎంచుకున్నాను. మూడేళ్ల క్రితం 100 కోళ్ల పెంపకంతో మొదలు పెట్టాను. ప్రస్తుతం 300 కోళ్లకు ఫారం సామర్థ్యం పెరిగింది. ఇప్పటికే 200 కోళ్లు అమ్మేశాను. మోసం లేకుండా నాణ్యమైన దేశవాళీ బ్రీడ్ కోళ్లు మాత్రమే అమ్మడంతో గిరాకీ బాగా పెరిగింది. ఫారం వద్ద అయితే కిలో రూ.350 నుంచి రూ.400కు కొనుగోలు చేస్తున్నారు. ఇదే కోడి బయట మార్కెట్లో రూ.500కు పైగా అమ్ముడుపోతున్నాయి. పెట్టుబడి పోనూ రూ.40 వేలకు పైగా లాభం చేకూరుతోంది. – గజ్జిని సత్యనారాయణ, రైతు, గొల్లపల్లి పొలం వద్దే పెంపకం పొలం వద్దే 50 నుండి 70 వరకు నాటు కోళ్లు పెంచుతాను. పొలంలో ఆరుబయట మేత కోసం తోలి.. సాయంత్రం కొన్ని గింజలు వేస్తాను. ఒక్కో కోడి 2.50 కిలోల నుంచి 3 కిలోలకు పైగా తూకం రాగానే అమ్మకం చేపడతాను. చాలామంది అధికారులు నేరుగా వచ్చి కొనుగోలు చేస్తారు. అడ్వాన్స్ కూడా ఇచ్చిపోతారు. కిలో రూ.300 నుండి రూ.400 వరకు విక్రయిస్తాను. మంచి లాభాలు ఉన్నాయి. నాటుకోడి రుచికి.. గిరిరాజ రుచికి చాలా తేడా ఉంటుంది. – జయరాములు, రైతు, బానేపల్లి కొవ్వు శాతం తక్కువ పెరటి కోళ్లు స్వేచ్ఛగా పెరుగుతాయి. షెడ్లలో పెంచిన వాటికంటే బలంగా ఉంటాయి. మిగిలిన వాటితో పోల్చితే పోషకాలు ఎక్కువ. వీటిలో కొవ్వు శాతం చాలా తక్కువగా ఉంటుంది. నాటుకోడి గుర్తించే కొనుగోలు చేయడం మంచిది. ఆహార నియమాల్లో మార్పులు రావడంతో పాటు చాలా మంది మాంసం ప్రియులు నాటుకోడి వైపు చూస్తున్నారు. దీంతో ధరలు కూడా పెరుగుతున్నాయి. మంచి గిరాకీ ఉండడంతో రైతులను ప్రోత్సహిస్తున్నాం. ప్రతి గ్రామంలోనూ 10 నుండి 20 కోళ్ల వరకు ఇళ్ల వద్ద పెంపకం కూడా బాగా పెరిగింది. – నవీన్కుమార్, పశువైద్యాధికారి, రాయదుర్గం -
ఈక్విటీ ఫండ్స్కు భారీ డిమాండ్..
న్యూఢిల్లీ: దేశీ స్టాక్ మార్కెట్ల ర్యాలీ నేపథ్యంలో ఈక్విటీ మ్యుచువల్ ఫండ్స్లోకి పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. న్యూ ఫండ్ ఆఫర్ల (ఎన్ఎఫ్వో) ఊతంతో జులైలో నికరంగా రూ. 22,583 కోట్ల నిధులు వచ్చాయి. దీంతో వరుసగా అయిదో నెలా ఈక్విటీ ఫండ్స్లోకి ఇన్వెస్ట్మెంట్లు వచ్చినట్లయింది. జూన్తో పోలిస్తే జులైలో రూ. 5,988 కోట్లు అధికంగా పెట్టుబడులు వచ్చాయి. అసోసియేషన్ ఆఫ్ మ్యుచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (యాంఫీ) సోమవారం విడుదల చేసిన గణాంకాల్లో ఈ అంశాలు వెల్లడయ్యాయి. వీటి ప్రకారం ఈ ఏడాది మార్చిలో రూ. 9,115 కోట్లు, ఏప్రిల్లో రూ. 3,437 కోట్లు, మే నెలలో రూ. 10,083 కోట్ల మేర ఈక్విటీ స్కీముల్లోకి పెట్టుబడులు వచ్చాయి. అంతకన్నా ముందు 2020 జులై నుంచి 2021 ఫిబ్రవరి దాకా వరుసగా ఎనిమిది నెలల పాటు నిధుల ఉపసంహరణ కొనసాగింది. తాజా పరిణామాలతో జూన్ ఆఖరున రూ. 33.67 లక్షల కోట్లుగా ఉన్న ఫండ్ పరిశ్రమ నిర్వహణలోని అసెట్స్ (ఏయూఎం) విలువ జులై ఆఖరుకు రూ. 35.32 లక్షల కోట్లకు చేరింది. లిక్విడిటీ.. విధానాల ఊతం.. రిజర్వ్ బ్యాంక్ ఉదార విధానాలు, కార్పొరేట్ల ఆదాయాల వృద్ధి మెరుగ్గా ఉండటం, టీకాల ప్రక్రియతో కోవిడ్ మహమ్మారిని స్థిరంగా కట్టడి చేయగలుగుతుండటం, దేశ..విదేశాల నుంచి వచ్చే నిధుల (లిక్విడిటీ)ఊతంతో ఈక్విటీ మార్కెట్లు చారిత్రక గరిష్టాలను తాకుతున్నాయని యాంఫీ సీఈవో ఎన్ఎస్ వెంకటేష్ తెలిపారు. దీనితో రిటైల్ ఇన్వెస్టర్లు కూడా మ్యుచువల్ ఫండ్ సిప్ (సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్)ల ద్వారా ఈక్విటీ ర్యాలీలో పాలుపంచుకుంటున్నారని ఆయన వివరించారు. సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టడం, ఈక్విటీలు ఇటీవల మెరుగైన రాబడులు ఇవ్వడం, కోవిడ్ రెండో విడతలోనూ మార్కెట్లు స్థిరంగా నిలదొక్కుకోవడం వంటి అంశాలు ఇన్వెస్టర్లకు భరోసా కల్పిస్తున్నాయని ఫండ్స్ఇండియా సంస్థ రీసెర్చి విభాగం హెడ్ అరుణ్ కుమార్ తెలిపారు. ఈక్విటీల్లోకి ప్రవహించిన నిధుల్లో 50 శాతం భాగం ఎన్ఎఫ్వోల ద్వారా వచ్చినవేనని వైట్ ఓక్ క్యాపిటల్ సీఈవో ఆశీష్ సోమయ్య పేర్కొన్నారు. మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నిర్దేశించిన స్కీమ్ కేటగిరీ నిబంధనలకు అనుగుణంగా అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలు (ఏఎంసీ) నిధులను కేటాయించడం ఇందుకు ఓ కారణమని వివరించారు. మరిన్ని విశేషాలు.. ►ఈక్విటీ ఫండ్స్లో విభాగాలవారీగా చూస్తే ఫ్లెక్సీ క్యాప్ సెగ్మెంట్లోకి అత్యధికంగా రూ. 11,508 కోట్లు వచ్చాయి. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఫ్లెక్సీక్యాప్ ఫండ్, ఇతర ఎన్ఎఫ్వోలు దాదాపు ఏకంగా రూ. 13,709 కోట్లు సమీకరించడం ఇందుకు దోహదపడింది. ►గత నెలలో హైబ్రిడ్ ఫండ్స్లో ఇన్వెస్టర్లు రూ. 19,481 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. ఇందులో రూ. 14,924 కోట్లను ఆర్బిట్రేజ్ ఫండ్స్లో పెట్టారు. ►ఈక్విటీ ఆధారిత సేవింగ్స్ స్కీముల (ఈఎల్ఎస్ఎస్) నుంచి మాత్రం రూ. 512 కోట్లు, వేల్యూ ఫండ్స్ నుంచి రూ. 462 కోట్లు మేర పెట్టుబడులను ఇన్వెస్టర్లు వెనక్కి తీసుకున్నారు. ►గోల్డ్ ఎక్సే్చంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్)లోకి నికరంగా రూ. 257 కోట్లు వచ్చాయి. జూన్లో ఇవి రూ. 360 కోట్లు. ►డెట్ మ్యుచువల్ ఫండ్స్లో ఇన్వెస్టర్లు నికరంగా రూ. 73,964 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. అత్యధికంగా లిక్విడ్ ఫండ్స్లోకి రూ. 31,740 కోట్లు రాగా, మనీ మార్కెట్ ఫండ్స్లోకి రూ. 20,910 కోట్లు, తక్కువ వ్యవధి ఉండే ఫండ్స్లోకి రూ. 8,161 కోట్లు, అల్ట్రా షార్ట్ టర్మ్ ఫండ్స్లోకి రూ. 6,656 కోట్లు వచ్చాయి. ►వివిధ విభాగాలవారీగా చూస్తే మ్యుచువల్ ఫండ్స్ పరిశ్రమలోకి నికరంగా రూ. 1.14 లక్షల కోట్లు వచ్చాయి. జూన్లో ఇవి రూ. 15,320 కోట్లు. -
ఖరీదైన కడక్, నలుపెందుకో తెలుసా?
సాక్షి, హైదరాబాద్: ఈ కోడి చాలా కడక్.. పోషక విలువల్లోనే కాదు ఖరీదులో సైతం.. దీని కడక్నాథ్ కోడి. కరోనా నేపథ్యంలో ప్రస్తుతం ఈ కోడికి మాంచి డిమాండ్ వచ్చింది. రోగ నియంత్రణకు మాంసాహారం తీసుకోవాలనే వైద్య నిపుణులు సూచిస్తున్న క్రమంలో.. ఈ కోడిలో పోషకాలు మెండుగా ఉండడంతో మాంసంప్రియుల చూపు దీనిపై పడింది. అసలు ఆ కోడి ఎక్కడ నుంచి వచ్చింది? దీని ప్రత్యేకత ఏమిటి? తెలుసుకోవాలంటే ఓ లుక్కేయండి. అన్నీ నలుపే.. సాధారణంగా కడక్నాథ్ జాతి కోళ్లు మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, గుజరాత్, రాజస్థాన్లలోని గిరిజన ప్రాంతాల్లో దొరుకుతాయి. నలుపు రంగులో ఉండే ఈ కోడి.. గుడ్లు కాఫీ రంగుతో పాటు కొంత పింక్ కలర్లో ఉంటాయి. ఈ కోళ్లను మాంసం కోసం పెంచుతారు. దీని చర్మమే కాదు, ముక్కు, గోళ్లు, ఎముకలు చివరికి నాలుక కూడా నలుపే. దీని శరీరంలో మెలనిన్ ఎక్కువగా ఉండటంతో ఈ రంగులో ఉంటుందని పౌల్ట్రీ రంగ నిపుణులు చెబుతున్నారు. ఔషధ గుణాలు భేష్ కడక్నాథ్ కోళ్లలో ప్రొటీన్లు సమృద్ధిగా లభిస్తాయి, కొవ్వు, కొలెస్ట్రాల్ శాతం తక్కువగా ఉంటాయి. దీని మాంసం తింటే ఊబకాయం రాదు. ఈ కోడి మాంసంలో ఔషధ గుణాలు కూడా ఎక్కువే. పోషకాలు రక్తంలో హిమోగ్లోబిన్ శాతం పెంచడమే కాకుండా, శ్వాస సంబంధమైన ఆస్తమా వంటి రోగాలను నియంత్రణలో ఉంచుతుందట. పురిటినొప్పులు తగ్గించడంతో పాటు.. మగవారిలో సంతానోత్పత్తి సామర్థ్యాన్ని పెంచడంలోనూ ఈ మాంసం తోడ్పడుతుందనే ప్రచారమూ ఉంది. తేడా ఇలా.. కడక్నాథ్ మంచి బరువు తూగేందుకు 8 నెలల సమయం పడుతుంది. సాధారణంగా మార్కెట్లో దొరికే బ్రాయిలర్ కోళ్లు 45 రోజుల్లోనే ఒకింత బరువు తూగుతాయి. ఇక్కడే సాధారణ కోడికి, కడక్నాథ్ కోడికి తేడా ఉంది. కడక్నాథ్ కోళ్లలో క్వాలిటీ ఉంటుంది. వీటి పెంపకం నిర్వహణ ఖర్చు కూడా ఎక్కువే. అందుకే దీని ధర అధికంగా ఉంటుందని పెంపకందారులు చెబుతున్నారు. ఊపందుకుంది.. కరోనా వైరస్ వ్యాప్తి మొదలైనప్పట్నుంచీ ప్రజల్లో ఆరోగ్యం, వ్యక్తిగత పరిశుభ్రతపై మరింత శ్రద్ధ పెరిగింది. కోవిడ్ బారిన పడకుండా ఉండటం కోసం.. రోగ నిరోధక శక్తిని పెంచుకోవడంపై దృష్టి పెట్టారు జనాలు. ఇందులో భాగంగా డ్రై ఫ్రూట్స్, పండ్లు, ఆకుకూరలు, కోడిగుడ్లు, మాంసాహారం ఎక్కువగా తీసుకోవడం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్ గిరిజన ప్రాంతం ఝూబువా, అలీరాజ్పూర్కే పరిమితమైన దేశీ నల్ల కోడి కడక్నాథ్కు ఫుల్ డిమాండ్ పెరిగింది. దీంతో నగర శివారు ప్రాంతాల్లో కడక్నాథ్ కోళ్ల పెంపకం ఊపందుకుంది. కడక్నాథ్ చికెన్ ధర దాదాపు వెయ్యి రూపాయలపైనే పలుకుతోంది. బతికున్న కోడి కిలో రూ.800 నుంచి రూ.1000 వరకు అమ్ముడవుతోంది. చదవండి: బర్డ్ఫ్లూ నేపథ్యంలో ధోని కీలక నిర్ణయం నాటు కోడి గుడ్లను ఎక్కువ ధర పెట్టి కొంటున్నారా? -
డాలర్ల కోసం బ్యాంకర్ల డిమాండ్
ముంబై: ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో మంగళవారం డాలర్ మారకంలో రూపాయి విలువ 16 పైసలు తగ్గి 73.64 వద్ద ముగిసింది. బ్యాంకర్లు, చమురు దిగుమతిదారుల నుంచి అమెరికా డాలర్లకు భారీ డిమాండ్ దీనికి కారణం. కొన్ని ముఖ్యాంశాలు చూస్తే... సోమవారం రూపాయి ముగింపు 73.48. మంగళవారం 73.33 వద్ద సానుకూలంగానే ట్రేడింగ్ ప్రారంభమైంది. అయితే డాలర్ల కోసం భారీ డిమాండ్తో ఒక దశలో 73.72 కనిష్టానికి కూడా చూసింది. రోజంతా ఈ శ్రేణి (73.33–73.72)లోనే రూపాయి తిరిగింది. పోర్టిఫోలియో ఇన్ఫ్లోల (ఈక్విటీల్లో విదేశీ అమ్మకాలు) పరిస్థితుల్లో డాలర్ల అవసరాల రీత్యా ఆర్బీఐ తరఫున బ్యాంకులు డాలర్లు కొనుగోలు చేస్తున్నట్లు భావిస్తున్నట్లు ఫారెక్స్ ట్రేడర్లు తెలిపారు. (నేడు ప్రతికూల ఓపెనింగ్?! ) ఇక చమురు దిగుమతిదారుల నుంచి కూడా డాలర్లకు డిమాండ్ ఉన్నట్లు ఎల్కేపీ సెక్యూరిటీస్లో సీనియర్ రిసెర్చ్ విశ్లేషకులు (కమోడిటీ అండ్ కరెన్సీ) జితిన్ త్రివేది తెలిపారు. 73.40–73.50 మధ్య రూపాయి నిలకడగా ఉండడానికి ఆర్బీఐ ప్రయత్నిస్తున్నట్లు కనబడుతోందని పేర్కొన్నారు. అయితే సమీప భవిష్యత్తులో 73.90–74.10 వరకూ రూపాయి వెళ్లే అవకాశం ఉందని కూడా విశ్లేషించారు. ఇక అధిక ద్రవ్యోల్బణం, ఆర్థిక వ్యవస్థపై భారీ క్షీణ రేట్ల అంచనా కూడా రూపాయి సెంటిమెంట్ను దెబ్బతీస్తోందని నిపుణుల అంచనా. రూపాయికి ఇప్పటి వరకూ ఇంట్రాడే కనిష్ట స్థాయి 76.92 (2020, ఏప్రిల్ 22వ తేదీ). ముగింపులో రికార్డు పతనం 76.87 (2020, ఏప్రిల్ 16వ తేదీ). 73.83 వద్ద నిరోధం, 73.20 వద్ద మద్దతు ఉందని హెచ్డీఎఫ్సీ రిటైల్ రిసెర్చ్ డిప్యూటీ హెడ్ దేవర్షి వకీల్ పేర్కొన్నారు. (ఎస్బీఐ ఏటీఎంకు మొబైల్ తీసుకెళ్లండి!) -
‘ఐటీలో ఉద్యోగానికి ఈ కోర్సులు నేర్చుకోండి’
ముంబై: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ ప్రభావం అన్ని రంగాలపై పడింది. ముఖ్యంగా ఐటీ ప్రాజెక్టులు అధికంగా లభించే అమెరికా, బ్రిటన్ లాంటి దేశాలలో వైరస్ విజృంభణ పతాక స్థాయికి చేరడంతో కొత్త ప్రాజెక్టులు లేక కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ప్రస్తుతం క్లౌడ్ కంప్యూటింగ్, డైటా సైన్స్ లాంటి కోర్సులకు విపరీతమైన డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో ఉద్యోగాలు కోల్పోయిన వారికి క్లౌడ్ కంప్యూటింగ్, డేటా సైన్స్ తదితర కోర్సులను జాబ్ కన్సెల్టెన్సీలు ఆఫర్ చేస్తున్నాయి. అత్యాధునిక టెక్నాలజీలకు శిక్షణ ఇచ్చే జిగ్సా అకాడమీ సీఈఓ వోహ్రా స్పందిస్తూ.. ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లో కూడా వైవిధ్యమైన కోర్సుల్లో నైపుణ్యం పొందిన వారికి ఉద్యోగాలలో డోకా ఉండదని తెలిపారు. మరోవైపు టెక్నాలజీలకు పేరు పొందిన యుడెమీ సీఈఓ ఇర్విన్ ఆనంద్ స్పందిస్తూ.. వెబ్ డెవలప్మెంట్, డేటా సైన్స్ కోర్సులలో 60శాతంనుంచి 58శాతం వృద్ధి నమోదైందని పేర్కొన్నారు. కాగా లాక్డౌన్ వల్ల వీడియా లెర్నింగ్కు అధిక ప్రాధాన్యత పెరిగిందని స్ప్రింగ్ సీఈఓ రవి కాక్లసరి తెలిపారు. మరోవైపు సైబర్ సెక్యూరిటీ, కృత్రిమ మేధ(ఆర్టిఫిషియల్ ఇంటలిజన్స్) తదితర కోర్సులకు విపరీతమైన డిమాండ్ ఉందని సీనియర్ రీసెర్చ్ డైరెక్టర్ డీ.డీ మిశ్రా అభిప్రాయపడ్డారు.(చదవండి: కంపెనీ పెట్టండి..రాయితీ పట్టండి) -
నాటు కోడికి పెరుగుతున్న క్రేజ్
ముక్క కొంచెం గట్టిగా ఉంటుంది గానీ.. నాలుక మీద పడగానే ఆ రుచి అదిరిపోతుంది. పంటితో కొరికాక చూడాలి ఆ ముక్క మజాని.. కొన్ని క్షణాలు కళ్లు తెరిస్తే ఒట్టు. ఆ నాటు ఘాటును అలా హాయిగా ఆస్వాదించేస్తాం మరి. ఇగురైనా.. పులుసైనా.. చివరకు ఫ్రై అయినా.. ఆ టేస్టే వేరు. అందుకే తిన్నాక అంటాం.. తింటే నాటు కోడినే తినాలని. అందుకే ఇప్పటివరకూ కొంచెం దూరమైన ఆ రుచిని మాంసం ప్రియులు మళ్లీ కోరుకుంటున్నారు. బ్రాయిలర్కు బదులు ‘నాటు’కే ఓటేస్తున్నారు. సాక్షి, నెట్వర్క్: నాటు కోడి గుడ్డు.. మాంసాన్ని బలవర్ధక ఆహారంగా పరిగణిస్తారు. కానీ.. నాటు కోడి మాంసం గట్టిగా.. తినడానికి ఇబ్బందిగా ఉంటోందని వినియోగాన్ని తగ్గించేశారు. పల్లెల్లో సైతం మారిన జీవనశైలికి నాటుకోళ్ల పెంపకం భారం కావడంతో దాదాపు మానుకున్నారు. పల్లెల్లో సైతం బ్రాయిలర్ కోడి మాంసం అందుబాటులోకొచ్చింది. అందుకే ఇంతకాలం నాటుకోళ్లకు ప్రత్యామ్నాయంగా మాంసం ప్రియులు బ్రాయిలర్ కోడి మాంసానికి అలవాటుపడ్డారు. మెత్తగా.. తినడానికి వీలుగా ఉంటుందనే ఉద్దేశంతో దీనినే ఎక్కువగా వినియోగిస్తూ వచ్చారు. అయితే ఇటీవల మాంసం ప్రియుల ఆహార అలవాట్లలో మార్పులొచ్చాయి. బరువు పెరగడానికి బ్రాయిలర్ కోళ్లకు ఇంజెక్షన్లు చేస్తున్నారనే అనుమానం పెరిగింది. హార్మోన్ ఇంజెక్షన్లతో నెల రోజుల కోడి పిల్లను రెండు, మూడు కేజీలకు పెంచుతున్న వైనాలూ వెలుగు చూస్తున్నాయి. మరోవైపు వాటి రుచి తగ్గిపోవడం వంటి కారణాలతో బ్రాయిలర్ మాంసం వినియోగాన్ని క్రమంగా తగ్గించేస్తున్నారు. వారాంతంలో విధిగా నాటు కోడి మాంసం కొనుగోలుకే అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇంటికొచి్చన బంధువులకు, వివాహ విందులు, ఇతర కార్యక్రమాల్లో నాటు కోడి కూర వండి వడ్డిస్తున్నారు. కిలో రూ.400 నుంచి 500పైనే.. పల్లెటూళ్లలో పెంచుతున్న నాటుకోళ్లను పట్టణాలు, నగరాలకు తీసుకొచ్చి వారాంతంలో విక్రయిస్తున్నారు. పెంపకందార్లు నాటు కోడిని రూ.300 వరకు విక్రయిస్తుంటే.. మార్కెట్లో కిలో కోడిని రూ.400 నుంచి రూ.500కు పైగా అమ్ముతున్నారు. మార్కెట్లో మటన్, నాటు కోడి మాంసం ధరలు దాదాపు ఒకేలా ఉంటున్నాయి. నాటు కోడికి పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా ఇటీవల కాలంలో బ్రాయిలర్ కోళ్ల ఫారాలు మాదిరిగా నాటు కోళ్ల ఫారాలు పెరిగాయి. నాటు కోడి పులుసు రెడీ పట్టణాల్లో ఓ మోస్తరు హోటళ్లు మొదలుకుని.. విజయవాడ,విశాఖ, గుంటూరు, తిరుపతి, నెల్లూరు, కర్నూలు, కాకినాడ, రాజమండ్రి తదితర నగరాల్లోని రెస్టారెంట్లు, స్టార్ హోటళ్లలో నాటు కోడి ఇగురు, పులుసును మెనూలో ప్రత్యేకంగా చూపుతున్నారు. రాయలసీమ జిల్లాల్లో అన్ని రెస్టారెంట్లు, దాబాలు.. నాటు కోడి పులుసు, రాగి సంగటితో స్వాగతం పలుకుతున్నాయి. జాతీయ రహదారుల వెంట దాబాల్లో నాటు కోడికే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. కోళ్ల పెంపకంపై ఆసక్తితో.. సుదీర్రెడ్డి, వైఎస్సార్ జిల్లా, ఓబులవారిపల్లి మండలం, తల్లెంవారి పల్లె గ్రామ నివాసి. గతంలో ప్రైవేటు కంపెనీలో పనిచేసేవాడు. నాటు కోళ్ల పెంపకంపై ఆసక్తితో ఇటీవలే అక్కడ ఉద్యోగం మానేసి సొంతంగా రూ. 10 లక్షలతో ఫారం ఏర్పాటు చేశాడు. ఎలాంటి కృత్తిమ మందులు వాడకుండా పూర్తిగా సంప్రదాయ దాణాలతో దాదాపు 3,000 కోళ్లను పెంచుతున్నారు. ఆయన్ని పలకరించగా.. నాటు కోడి గుడ్లకు, మాంసానికి విపరీతమైన డిమాండ్ ఉందని, ప్రతి రోజూ ఫారం దగ్గరికే వచ్చి మాంస ప్రియులు నాటు కోళ్లను, గుడ్లను తీసుకెళ్తున్నారని చెబుతున్నారు. వారాంతాలు, పండుగల్లో దూర ప్రాంతాల వారు కూడా ఇక్కడికి వస్తుంటారని వివరించాడు. ఒకసారి ఉత్పత్తి ప్రారంభమైన తర్వాత నెలకు రూ. లక్ష వరకు లాభాలు ఉంటాయని చెప్పుకొచ్చారు. నాణ్యతకు పెద్దపీట మా నాటు కోళ్ల ఫారం కర్నూలు సిటీకి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నా.. ప్రతి ఆదివారం కనీసం 50 మంది ఇక్కడికే వచ్చి నాటు కోళ్లు కొనుక్కెళ్తున్నారు. వినియోగదారులు డబ్బుకు వెనకాడటం లేదు. రుచి, నాణ్యతకు పెద్దపీట వేస్తున్నారు. – వెంకటేశ్వర్లు, కర్నూలు సబ్సిడీపై కోళ్ల పిల్లలు గతంలో రైతులు పెరట్లో నాటు కోళ్లు విరివిగా పెంచేవారు. కాలక్రమేణా ఈ పెంపకం తగ్గింది. ఇటీవల కాలంలో రైతులు మళ్లీ నాటుకోళ్లు పెంపకంపై ఆసక్తి చూప్తున్నారు. ప్రతి జిల్లాలో చిన్న చిన్న ఫామ్లు వెలుస్తున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం కూడా పెరటికోళ్ల పెంపకాన్ని ప్రోత్సహించేందుకు ప్రతి రైతుకూ సబ్సిడీపై 45 నాటుకోళ్ల పిల్లలను పంపిణీ చేస్తుంది. – ఎన్.టి.శ్రీనివాస్, పశుసంవర్థకశాఖ జాయింట్ డైరెక్టర్ పోషక విలువలు అధికం నాటు కోళ్లలో తక్కువ ఖర్చుతో ఎక్కువ మాంసకృత్తులు లభిస్తాయి. నాటు కోడి గుడ్లు ఎక్కువ బలమైన ఆహారం. కోళ్లకు తరుచూ సీజనల్ వ్యాధులకు వ్యాకిన్స్లు వేయించుకోవాలి. – డా‘‘ వి.అనురాధ, పశుసంవర్ధకశాఖ (వీబీఆర్ఐ) జెడీ, సామర్లకోట. మాజీ సైనికుని ఇంట సిరుల పంట ఎర్రావారిపాళెం (చిత్తూరు జిల్లా): ఎర్రావారి మండలం కూరపర్తివారిపల్లిలో మాజీ సైనికుడు శ్రీనాథ్రెడ్డి కడక్నాథ్ రకంతోపాటు నాటు కోళ్లు పెంచుతున్నారు. మార్కెట్లో నాటు కోళ్లకు డిమాండ్ బాగుండటంతో మంచి లాభాలు ఆర్జిస్తున్నట్టు శ్రీనాథ్రెడ్డి చెప్పారు. కోళ్లతోపాటు కోడిగుడ్లు, పిల్లల్ని కూడా అమ్ముతున్నట్టు వివరించారు. తక్కువ శ్రమతో ఎక్కువ లాభాలు ఆర్జించవచ్చని ధీమాగా చెప్పారు. రాష్ట్రంలో జీవాల గణాంకాలివీ.. (సుమారుగా..) లేయర్ కోళ్లు- 11,01,10,315 బ్రాయిలర్ కోళ్లు- 8,05,83,000 నాటు కోళ్లు- 35,18,950 మేకలు- 44,12,500 గొర్రెలు- 1,35,04,350 -
మధురఫలం మహాప్రియం
భారీగా తగ్గిన మామిడి పండ్ల దిగుమతి ఎగుమతులకే సరిపోతున్న మేలు రకాలు వెలవెలబోతున్న మార్కెట్లు గతేడాదితో పోలిస్తే రెండింతలైన ధరలు హైదరాబాద్: మామిడి..! మండు వేసవిలో ఈ పేరు వింటేనే నోరూరుతుంది కదూ. నిజమే ..ఫలాలన్నింటిలో రాజఠీవిని ఒలకబోస్తూ, అనేక పోషకాలనిచ్చే ఈ రాజఫలం నగరంలో మహా ప్రియమైంది. ఇందుకు రకరకాల కారణాలున్నాయి. వెంటాడిన కరువుకు తోడు, ఆంధ్రప్రదేశ్ నుండి రావాల్సిన మామిడి రకాలు, అక్కడి అవసరాలకే వినియోగిస్తుండటంతో నగర మార్కెట్లకు వచ్చే మామిడి అనూహ్యంగా తగ్గిపోయింది. గత ఏడాది సరిగ్గా ఇదే రోజుకు నగరంలోని ప్రధాన మార్కెట్లన్నింటినీ మామిడి దిగుబడులు ముంచెత్తగా, ఈమారు భారీగా పడిపోయాయి. అక్కడక్కడ వస్తున్న మేలు రకాలను దిల్లీ, లక్నో వ్యాపారులే ఇక్కడి నుండి నేరుగా కొనుగోలు చేస్తూ విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. దీంతో సాధారణ మార్కెట్లో మామిడి పండ్ల ధర గత ఏడాదితో పోలిస్తే రెండింతలైంది. హోల్సేల్ మార్కెట్లో క్వింటా గత ఏడాది రూ.5000 మోడల్ ధర కాగా, ఈ యేడాది రూ.7000కు చేరింది. రిటైల్ మార్కెట్లో రూ. 80 నుండి రూ.150 వరకు విక్రయిస్తున్నారు. ఏడాదిలో ఎంత తేడా.. ఏటా మార్చి నుండి జూలై వరకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని రకాల మామిడి పండ్లు దొరికే గడ్డిఅన్నారం మార్కెట్లో ప్రస్తుతం రెండు మూడు రకాలకు మించిన మామిడి పండ్లు దొరకటం లేదు. ఒక వైపు భారీగా పడిపోయిన దిగుమతులకు తోడు, వినియోగదారులను నోరూరించే రకాలు సైతం ఈ మారు పెద్దగా రావటం లేదు. గడిచిన ఏడాది వరకు బెనీషాన్, ఆలంపూర్, బంగినపల్లి, ఆల్ఫోన్సో, హిమసాగర్, తొతపూరి తదితర రకాల అందుబాటులో ఉండగా, ఈ మారు బెనీషాన్ రకం ఒక్కటే ఎక్కువగా వస్తోంది. గత సంవత్సరం మార్చి, ఏప్రిల్ మాసాల్లో ఒక్క గడ్డి అన్నారం మార్కెట్కే 6,40,239 క్వింటాళ్ల మామిడి రాగా, ఈ యేడు మాత్రం కేవలం 47,406 క్వింటాళ్లు మాత్రమే రావటం దారుణమైన పరిస్థితికి నిదర్శనమని మార్కెట్ కమిటీ ఉద్యోగి జీవన్ చెప్పారు. అందుబాటులోకి రైఫనింగ్ చాంబర్స్ పండ్లను మగ్గించటంలో కార్బైడ్, ఇథిలిన్ తదితర విష రసాయనాలు వాడొద్దన్న కఠిన నిబంధనల నేపథ్యంలో మార్కెట్లలో రైఫనింగ్ ఛాంబర్స్ అందుబాటులోకి వచ్చాయి. గడ్డిఅన్నారం మార్కెట్ కమిటీ నిర్మించాల్సిన ఛాంబర్లు, ఇంకా పూర్తి కాకపోగా, 15 మంది ప్రైవేటు వ్యాపారులు అనుమతి తీసుకుని, ఆరు చోట్ల అందుబాటులోకి తెచ్చారు. ఎండ తీవ్రతతో..మగ్గటంలో ఇబ్బంది మార్కెట్కు వస్తోన్న మామిడిని మగ్గించేందుకు కొందరు వ్యాపారులు రైఫనింగ్ ఛాంబర్స్ను ఉపయోగించుకుంటుండగా, మిగిలిన వాళ్లు సాధారణ పద్ధతులు పాటిస్తున్నారు. ఎండ తీవ్రతతో సరిగ్గా పోషకాలు అందక, మామి డి పండులో 16 శాతం వరకు ఉండాల్సిన ఇథిలిన్, తొమ్మిది శాతం కంటే తక్కువగా ఉంటోంది. దీంతో మళ్లీ రైఫనింగ్ ఛాంబర్లలో మూడు రోజుల పాటు ఉంచి మగ్గిస్తున్నారు. కష్టమైనా తప్పటం లేదు.. 50 సంవత్సరాల నుంచి కార్బైడ్తోనే మామిడి కాయలను అమ్మడం..కొనడం జరుగుతుంది. ఇప్పడు కార్బైడ్ లేకుండా మామిడి కొనుగోలు చేయ డం అంటే కష్టంగా ఉంది. వ్యాపారాలు చాల వరకు తగ్గాయి. దీనికి తోడు కరువుతో దిగుబడులు తగ్గాయి. ఇప్పటికే కిట కిటలాడ్సిన మార్కెట్ నేడు బోసిపోతోంది. - తాజొద్దీన్, పండ్ల వ్యాపారి రైతుకు గడ్డుకాలం ఈ సారి రైతుకు సరియైన పంట లేకపోవడంతో గిట్టుబాటులేదు. రైతులకు పంటను చూస్తే రక్తం చుక్కలేదు. నేను 200 ఎకరాలు కౌలుకు తీసుకుని మామిడి సాగుచేశాను. సకాలంలో వర్షంలేకపోవడంతో భూగర్భజలాలు అడుగంటాయి. నీరు లేకపోవడం, వాతావరణంలో వచ్చిన మార్పుల వలన కాయ సైజు 10 శాతం తగ్గింది. కార్బైడ్ వాడొద్దంటూ ప్రభుత్వం వ్యాపారులపై ఆంక్షలు విధించింది. ఇథిలిన్తో మామిడి పండ్లను మగ్గపెట్టాలంటే రైతులు ముందుకు రావడంలేదు. ఖర్చుతో కూడుకుంది. గత సంవత్సరం నేను 600 టన్నులు మామిడిని మార్కెట్లో అమ్మితే ఈ సంవత్సరం కేవలం 150 టన్నులు మాత్రమే అమ్మాను. - రైతు తాజ్బాబు, కోదాడ సొంతంగా ..ఛాంబర్ ఏర్పాటు చేశా పండ్లను ఇథలిన్తో పండించడం ఖర్చుతో కూడుకుంది. ప్రభుత్వం నుంచి ఎలాంటి సబ్సిడీలేదు. మేమే పండ్ల మార్కెట్లో కోల్డ్స్టోరేజ్ను ఏర్పాటు చేసుకున్నాం. కార్బైడ్ లేకుండా పండ్లను పండిస్తున్నాం. ఇథిలిన్ను రోజుకు రెండు సార్లు వదులుతాం. మూడు నుంచి నాలుగు రోజుల్లో మామిడి పండ్లు పండుతాయి. వాటిని మార్కెట్లో అమ్ముతాం. ఇలా స్టోరేజ్ వలన విద్యుత్ బిల్లులు నెలకు రూ40 వేల నుంచి 50 వేల వరకు వస్తుంది. నిర్వహణ కష్టసాధ్యంగా ఉంది. - అజంఖాన్, ఫేమస్ ప్రూట్కంపెనీ -
గాడిద పాలకు పెరుగుతున్న డిమాండ్
-
బిగ్ స్క్రీన్ ఫోన్లకు పెరుగుతున్న డిమాండ్