IMAX
-
HYD: ఐమాక్స్ వద్ద న్యాయవాదిపై దాడి.. ఇద్దరు మైనర్ల అరెస్టు
సాక్షి,హైదరాబాద్: ఐమాక్స్ వద్ద అడ్వకేట్ కల్యాణ్పై ఇద్దరు దాడి చేసి మొబైల్ ఫోన్ ఎత్తుకెళ్లిన కేసును పోలీసులు ఛేదించారు. నిందితులిద్దరూ మైనర్లని పోలీసులు తెలిపారు. ఈ మేరకు అబిడ్స్ పోలీస్ స్టేషన్లో బుధవారం(నవంబర్ 13) ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అబిడ్స్,సైఫాబాద్ ఏసీపీలు చంద్రశేఖర్, సంజయ్ కేసు వివరాలు వెల్లడించారు.మంగళవారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో అబిడ్స్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లోని గన్ఫౌండ్రిలోని ప్రసాద్ అపార్ట్మెంట్ వాచ్మెన్ను కత్తితో బెదిరించిన ఇద్దరు మైనర్లు మొబైల్ ఫోన్ను ఎత్తుకెళ్లారు. అక్కడి నుంచి ఐమాక్స్ వద్దకు వెళ్లారు. 5 గంటల సమయంలో అక్కడ వాకింగ్ చేస్తున్న న్యాయవాది కల్యాణ్ వద్ద ఉన్న స్మార్ట్ ఫోన్ను ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించారు. కల్యాణ్ వారిని అడ్డుకోవడంతో కత్తితో బెదిరించారు.ఈ క్రమంలో మైనర్ల చేతిలో కల్యాణ్ గాయపడ్డారు.సెంట్రల్ జోన్ పరిధిలో ఒకేరోజు గంటల వ్యవధిలో రెండు ఇదే తరహా కేసులు నమోదు కావడంతో డీసీపీ యాదవ్ నేతృత్వంలో రెండు ప్రత్యేక బృందాలు ఏర్పడి దర్యాప్తు చేపట్టారు.సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా రాంనగర్ ఫిష్ మార్కెట్ వద్ద ఓ మైనర్ను అదుపులోకి తీసుకొని విచారించారు.అతని వద్ద ఉన్న వాచ్మెన్ మొబైల్ ఫోన్ను పోలీసులు తొలుత స్వాధీనం చేసుకున్నాం.నిందితుడు ఇచ్చిన సమాచారం ఆధారంగా చాంద్రాయణగుట్ట బండ్లగూడ వద్ద మరో మైనర్ను అదుపులోకి తీసుకున్నాం. అతని వద్ద న్యాయవాది కల్యాణ్ స్మార్ట్ ఫోన్, దాడికి ఉపయోగించిన కత్తి, వారు వాడిన హోండా యాక్టివా వాహనాన్ని స్వాధీనం చేసుకున్నాం. వారి ఆధార్ కార్డుల ప్రకారం మైనర్లుగా తేలిందని..అయితే, వారి వయసును నిర్ధరించేందుకు ఉస్మానియా ఆస్పత్రిలో టెస్టుల కోసం పంపించాం. గతంలో వారిపై ఇదే తరహాలో ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో మొబైల్ స్నాచింగ్ కేసు నమోదైంది’ అని పోలీసులు తెలిపారు.ఇదీ చదవండి: ట్యాపింగ్ కేసులో భుజంగరావుకు షాక్ -
యూత్కి పిచ్చిగా నచ్చేసిన 'కల్కి' బుజ్జి.. ఐమాక్స్లో స్పెషల్ అట్రాక్షన్..(ఫోటోలు)
-
IMAX వద్ద కల్కి సందడి
-
ప్రభాస్ ఫ్యాన్స్కు షాక్.. ఆ థియేటర్లలో ఆదిపురుష్ రిలీజ్ లేనట్లేనా?
రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ భామ కృతి సనన్ జంటగా నటించిన మైథలాజికల్ చిత్రం 'ఆదిపురుష్'. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ రావణుడి పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి ఓం రౌత్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలు పెంచేశాయి. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా తిరుపతిలో భారీస్థాయిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆదిపురుష్ చిత్రానికి ఊహించని షాక్ తగిలింది. ఆదిపురుష్ సినిమాను 3డీలో థియేటర్లలో రిలీజ్ చేయడం లేదంటూ ఓ వార్త నెట్టింట్లో తెగ వైరలవుతోంది. దీంతో త్రీడీలో ప్రభాస్ మూవీ చూడాలనుకున్న ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురవుతున్నారు. అదే రోజు హాలీవుడ్ సూపర్ హీరో చిత్రం 'ది ఫ్లాష్' విడుదలవుతున్నందున, వార్నర్ బ్రదర్స్ పిక్చర్స్ ఐమ్యాక్స్ స్క్రీన్స్ బ్లాక్ చేసిందని ప్రచారం జరుగుతోంది. ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ శ్రీధర్ పిల్లై ఆదిపురుష్ త్రీడీలో రిలీజ్ కావడం లేదంటూ ట్వీట్ చేశారు. దీంతో నెటిజన్స్ టీ-సిరీస్ యాజమాన్యానిది చెత్త ప్లానింగ్ అంటూ మండిపడుతున్నారు. అటు అభిమానులు మాత్రం ఆదిపురుష్ త్రీడీలో రిలీజ్ చేయాలంటూ దర్శకుడు ఓం రౌత్, టి-సిరీస్ నిర్మాత భూషణ్ కుమార్కి ట్విటర్ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నారు. ఆ వార్తల్లో నిజంలేదు తాజాగా ఈ వార్తలపై చిత్రయూనిట్ స్పందించింది. ఆదిపురుష్ 2డీతో పాటు 3డీలో విడుదల చేస్తున్నట్లు వెల్లడించింది. సినిమాపై వచ్చే ఎటువంటి పుకార్లను నమ్మవద్దని కోరింది. కాగా ఆదిపురుష్ జూన్ 16న తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల కానుంది. There is a 3D release https://t.co/VcqZpffCXl — Karthik Gowda (@Karthik1423) June 12, 2023 -
'శాకుంతలం' సినిమాకు ఊహించని షాక్, తొలిరోజే ఇలా జరిగిందేంటి..
స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం శాకుంతలం. గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా నేడు(శుక్రవారం)ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ సినిమాకు రిలీజ్ రోజే ఊహించని షాక్ తగిలింది. శాకుంతలం షోలు రద్దయ్యాయి. ఎందుకంటే.. నేడు(ఏప్రిల్ 14)న డాక్టర్ బీఆర్ అబేద్కర్ జయంతి నేపథ్యంలో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా బీఆర్ అంబేద్కర్ 125 అడుగుల భారీ విగ్రహావిష్కరణకు సర్వం సిద్ధమయింది. హుస్సేన్ సాగర్ తీరంలో ఎన్టీఆర్ గార్డెన్కు ఆనుకుని ఉన్న స్థలంలో ఈ కార్యక్రమం జరగనుంది. ఆ తర్వాత భారీ బహిరంగ సభ కూడా ఉండటంతో రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. దీంతో అక్కడే ఉన్న ఐమాక్స్ థియేటర్పై భారీ దెబ్బ పడింది. థియేటర్కు వచ్చే అన్ని దారులు మూసివేయడంతో శాకుంతలం షోలను రద్దు చేయాల్సి వచ్చింది. తెల్లవారుజామున 5 గంటలకు వేసే బెనిఫిట్ షోతో పాటు సాయంత్రం 6 గంటల వరకు అన్ని షోలను రద్దు చేశారు.ఆ తర్వాత రాత్రి పది గంటల నుంచి యథావిధిగా షోలు నిర్వహించనున్నారు. ముందుగా టికెట్స్ బుక్ చేసుకున్న వారికి డబ్బులు రీఫండ్ చేస్తామని యాజమాన్యం పేర్కొంది. An important update to our beloved fans & moviegoers in Hyderabad : Due to Dr. Ambedkar Statue Inauguration Tomorrow, all the shows at Prasads Imax have been Cancelled. Book your tickets accordingly in other screens!#Shaakuntalam in cinemas from Tomorrow! 🎟️… pic.twitter.com/TTjdOSloDT — Gunaa Teamworks (@GunaaTeamworks) April 13, 2023 -
జేబులో ఐమాక్స్.. యూట్యూబ్, సినిమాలు, వీడియోలు అన్నీ చూడొచ్చు
జేబులో ఐమాక్స్... అంత పెద్ద థియేటర్ మన జేబులో పట్టడమేంటని ఆలోచిస్తున్నారా? నిజమే.. కాకపోతే థియేటర్ కాదు. ఆ స్క్రీన్ను తలపించే కళ్లద్దాలు వచ్చేశాయి. ఇంట్లో, కారులో, బయట ఎక్కడంటే అక్కడ కూర్చుని థియేటర్ యాంబియెన్స్తో మీ ఫోన్లోని సినిమాలు, వీడియోలు చూసేయొచ్చు. అరచేతిలో అంతపెద్ద స్క్రీన్ను చూపించే ఆ కళ్లద్దాల కథేమిటో తెలుసుకుందాం. బ్రిటిష్ మొబైల్ నెట్వర్క్ ఆపరేటర్, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ ఈఈ (ఒకప్పటి ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్) ఈ ‘ఎన్రియల్ ఎయిర్’ కళ్లజోడును ఆవిష్కరించింది. చూడటానికి సాధారణ కళ్లద్దాల మాదిరిగానే కనిపించే వీటి వెనకాల ఆర్గానిక్ ఎల్ఈడీ డిస్ప్లే ఉంటుంది. దీనితో సినిమాలు చూడొచ్చు. గేమ్స్ ఆడుకోవచ్చు. అంత బిగ్ స్క్రీన్ను ఆవిష్కరించే గ్లాసెస్ కదా.. ఎంత బరువుంటాయో అన్న అనుమానం వద్దు. అవి కేవలం 79గ్రాముల బరువుంటాయి. సాధారణ యూఎస్బీ కేబుల్తో గ్లాసెస్ను ఫోన్కు కనెక్ట్ చేస్తే చాలు. 20 అడుగుల స్క్రీన్ మీ కళ్ల ముందు ప్రత్యక్షమవుతుంది. కళ్లద్దాలకు పక్కనే చెవుల మీదుగా ఉండే ఫ్రేమ్లో ఏర్పాటు చేసిన స్పీకర్స్లోంచి ఆడియో వినబడుతుంది. యూట్యూబ్ వీడియోస్ చూడొచ్చు, వెబ్ను సర్ఫ్ చేయొచ్చు. ఒకేసారి అనేక స్క్రీన్స్ చూసే అవకాశమూ ఇందులో ఉంది. ఇక రెండోది ఎయిర్ కాస్టింగ్. దీనితో మీ స్మార్ట్ఫోన్ను ఎదురుగా ఉన్న వర్చువల్ స్క్రీన్కు కనెక్ట్ చేయొచ్చు. స్మార్ట్ఫోన్లో ఉన్న అప్లికేషన్స్ అంటే గేమ్స్, ఓటీటీ ఫ్లాట్ఫామ్స్, సోషల్ మీడియాను ఆపరేట్ చేయొచ్చు. చదవండి: జాబిల్లిపై పచ్చదనం! -
ఐమాక్స్ వీడియో రికార్డింగ్ ఈ స్మార్ట్ఫోన్ సొంతం...!
ప్రముఖ చైనీస్ స్మార్ట్ఫోన్ కంపెనీ హానర్ మార్కెట్లలోకి సరికొత్త ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్ను లాంచ్ చేసింది. ఫ్లాగ్షిప్ సిరీస్లో భాగంగా హానర్ మ్యాజిక్ 3, హానర్ మ్యాజిక్ 3 ప్రో, హానర్ మ్యాజిక్ 3 ప్రో ప్లస్ స్మార్ట్ఫోన్లను రిలీజ్ చేసింది. అద్బుతమైన ఐమాక్స్ వీడియో రికార్డింగ్ ఫీచర్ ఈ స్మార్ట్ఫోన్ సొంతం. హనర్ మ్యాజిక్ 3 మోడల్ ధరలు సుమారు రూ. 52,800 నుంచి ప్రారంభమౌతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ స్మార్ట్ఫోన్ చైనా మార్కెట్లలో రిలీజ్ కానుంది. త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ మార్కెట్లలోకి లాంచ్ చేయనున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. హానర్ మ్యాజిక్ 3 స్మార్ట్ఫోన్లు 8జీబీ, 12 జీబీ ర్యామ్తో, 128 జీబీ, 256 జీబీ, 512జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్లతో మార్కెట్లలోకి రానుంది. హానర్ మ్యాజిక్ 3 బ్రైట్ బ్లాక్, డాన్ బ్లూ, గ్లేజ్ వైట్, గోల్డ్ కలర్ ఆప్షన్లలో లభించనుంది. హానర్ మ్యాజిక్ 3 స్మార్ట్ఫోన్ ఫీచర్లు 6.76-అంగుళాలు (1344x2772) డిస్ప్లే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 888+ ప్రాసెసర్ 13ఎంపీ ఫ్రంట్ కెమెరా రియర్ కెమెరా 50ఎంపీ వైడ్ సెన్సార్ + 64 ఎంపీమోనోక్రోమ్ సెన్సార్+ 64 ఎంపీ+ 64 ఎంపీ 8 జీబీ, 12 జీబీ ర్యామ్ ఐపీ54 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ 128 జీబీ, 256 జీబీ, 512జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ 4600mAh బ్యాటరీ టైప్ సీ పోర్ట్ 5జీ సపోర్ట్, బ్లూటూత్ 5.2 50వాట్స్ చార్జింజ్ సపోర్ట్ -
‘అంతమయ్యే ఆట’కు.. అంతులేని జనాలు
‘అవేంజర్స్ ఎండ్గేమ్’ సినిమా శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో దీనికి విపరీతమైన క్రేజ్ పెరిగింది. టికెట్ల కోసం జనాలు క్యూ కడుతున్నారు. బుధవారం ఈ సినిమా టికెట్లకు ఓపెనింగ్ మొదలు కావడంతో నగరంలోని ఐమ్యాక్స్ థియేటర్ వద్ద ఉదయం 7 గంటల నుంచే కి.మీ మేర యువత బారులు తీరారు. మార్వెల్ సిరీస్లో అవేంజర్ సినిమాలో ఇది చివరిది. దీంతో ఈ చిత్రానికి హైప్ క్రియేట్ అయింది. కొంత మంది తల్లులు తమ పిల్లల కోసం కూడా క్యూలో నిల్చోవడం విశేషం. -
మస్త్ మార్కెటింగ్
మార్కెటింగ్ మెళకువలు బాగా తెలిసిన నటుడు ఆమిర్ ఖాన్. కేవలం మంచి స్క్రిప్ట్ ఎంచుకోవడంలోనే కాదు దాన్ని ఆడియన్స్ వరకూ తీసుకెళ్లడంలోనూ మాస్టర్ ఆయన. అందుకే కలెక్షన్స్ రాబట్టడంలో టాప్లో ఉంటారు. లేటెస్ట్గా విజయ్కృష్ణ ఆచార్య దర్శకత్వంలో ఆమిర్ఖాన్, అమితాబ్ బచ్చన్ యాక్ట్ చేస్తోన్న భారీ బడ్జెట్ పీరియాడికల్ మూవీ ‘థగ్స్ ఆఫ్ హిందోస్తాన్’. కత్రినా కైఫ్, ఫాతిమా సనాషేక్ హీరోయిన్లు. ఈ సినిమాను 3డి, ఐమాక్స్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసింది చిత్రబృందం. అలాగే తెలుగు, తమిళ భాషల్లో కూడా డబ్ చేసి రిలీజ్ చేయనుంది. ఈ రెండు భాషల్లో మాత్రమే కాదు.. వీలైనన్ని ఎక్కువ భాషల్లో రిలీజ్ చేసి అన్ని మార్కెట్స్లో కలెక్షన్స్ కొల్లగొట్టాలనుకుంటోంది. నవంబర్ 7న రిలీజ్ కానున్న ఈ చిత్రాన్ని యశ్రాజ్ సంస్థ నిర్మిస్తోంది. -
గోల్ ‘మాల్స్’పై కొరడా.!
సాక్షి,సిటీబ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మల్టీప్లెక్స్, థియేటర్ల చేతివాటంపై తూనికల కొలుతల శాఖ కన్నెర చేసింది. మల్టీప్లెక్స్, థియేటర్లలో ప్యాకేజ్డ్ కమోడిటీస్ చట్టం (ఎమ్మార్పీ) అమలు ఉల్లంఘనపై గురువారం ‘సాక్షి’ దిన పత్రికలో ‘ఆగని గోల్ మాల్స్’ శీర్షికతో ప్రచురితమైన కథనంపై తూనికలు, కొలుతల శాఖ స్పం దించింది. ఎంఆర్పీ కంటే అధిక ధరలు వసూలు చేస్తున్న పలు మల్టీప్లెక్స్లపై గురువారం మూకు మ్మడి దాడులు నిర్వహించి కేసులు నమోదు చేసి ంది. నగరంలోని 20 మల్టీప్లెక్స్లపై తూనికలు, కొలుతల శాఖ అసిస్టెంట్ కంట్రోలర్లు భాస్కర్రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, విజయసారథి, నిర్మల్ కుమార్, రాజేశ్వర్, శివానంద్ ఆధ్వర్యంలో సుమా రు 30 మందితో కూడిన ఏడు ప్రత్యేక బృందాలు తనిఖీలు నిర్వహించాయి. నిబంధనలు పాటించకుండా వస్తువులను అధిక ధరలకు విక్రయిస్తున్న 18 మల్టీప్లెక్స్లలో 54 కేసులు నమోదు చేశాయి. కేసులు నమోదైన మాల్స్ ఇవే... ఈ సందర్భంగా అధికారులు ఐమాక్స్, పీవీఆర్ గెలీలియో, పీవీఆర్ ఐకాన్ మాదాపూర్, జీవీకే వన్ బంజారాహిల్స్, బిగ్ సినిమా కాచిగూడ, మహాలక్ష్మి కొత్తపేట, బీబీకే మల్టీప్లెక్స్ ఎల్బీనగర్, ఏషియన్ సినిమా స్క్వైర్ ఉప్పల్, ఏషియన్ రాధిక ఈసీఐఎల్, సినీపోలీస్ మల్కాజిగిరి, తాళ్లూరి ఈసీఐఎల్, స్పెషల్ సినిమా ప్రై.లి. మల్లాపూర్, ఏషియన్ ముకుంద మేడ్చల్, ఏషియన్ సినీ ప్లాంట్ కొంపల్లి, సుజనా ఫోరం మాల్ కూకట్పల్లి, మంజీరా మాల్ జేఎన్టియూ, సినీపోలీస్, శంషాబాద్, ఏషియన్ సినిమా టౌన్, మియాపూర్ మల్టీప్లెక్స్లపై కేసులు నమోదు చేశారు. కూకట్పల్లిలో ఇలా... సుజనా ఫోరం మాల్లోని పీవీఆర్ సినిమాలో తనిఖీలు నిర్వహించిన అధికారులు కూల్ డ్రింక్స్ కప్లపై లార్జ్, స్మాల్ అనే సంకేతాలు తప్ప ఎంత పరిమాణం(లీటర్లలో) పేర్కొన లేదని గుర్తించారు. పీవీఆర్ మఖానా ప్యాక్పై కస్టమర్ కేర్కు సంబంధించిన సమాచారం లేదు. వాటిని స్వాధీనం చేసుకున్న అధికారులు రెండు వేర్వేరు కేసులు నమోదు చేశారు. ఎమ్మార్పీ ధరల అమలుకు సంబంధించి జారీచేస్తున్న బిల్లులను సైతం సరిపోల్చుకున్నారు. మంజీ రా ట్రినిటీ మాల్లో గల సినీపోలీస్లోనూ తినుబండారాల విక్రయ కేంద్రా ల వద్ద సరైన సమాచారం లేకపోవడం, పాప్కార్న్ ప్యాక్లు, కూల్ డ్రింక్ కప్లపై పరిమాణం తెలిపే వివరాలు లేకపోవడాన్ని గుర్తించా రు. వేయింగ్ మెషిన్లపై అధికారిక ముద్ర, సీల్ లేకపోవడాన్ని గుర్తించి మూడు కేసులు నమోదు చేశారు. కొత్తపేటలోని మహాలక్ష్మీ, మిరాజ్ సినిమా మల్టీప్లెక్స్ హాళ్లను తనిఖీ చేసిన అధికారులు మహాలక్ష్మీ థియేటర్ నిర్వాహకులపై మూడు కేసులు నమోదు చేశారు. కాచిగూడలో.. సుల్తాన్బజార్: కాచిగూడ క్రాస్రోడ్స్లోని ఐనాక్స్ మల్టీప్లెక్స్లో సమోసాలు, పాప్కార్న్, కూల్ డ్రింక్స్ ధరలను చూసి అధికారులు ఆశ్చర్యానికి గురయ్యారు. అధిక ధరలకు విక్రయిస్తున్న పాప్కార్న్ ఇతర ఆహార పదార్థాలను స్వాధీనం చేసు కుని నోటీసులు జారీ చేశారు. అదే విధంగా ఏఎస్రావునగర్లోని ఆసియా సినిమా(రాధిక మల్టీప్లెక్స్), తాళూరి ధియేటర్ల క్యాంటిన్లలో నిబ ంధనలకు విరుద్దంగా తినుబండారాలను అధిక ధరలకు విక్రయిస్తుండటమేగాక నిర్ణీత పరిమాణానికి తక్కువగా తినుబండరాలను, కూల్డ్రింకులను వి క్రయిస్తున్నట్లు గుర్తించి మూడు కేసులు నమోదు చేశారు. మాల్స్లో బిల్లింగ్ మెషిన్లు సీజ్ తూనికలు, కొలతల శాఖ అధికారులు మాల్కాజిగిరి సినీపోలీస్, ఐమాక్స్ ప్రసాద్, తాళ్లూరి, స్పెషల్ సినిమాక్స్, ఐనాక్స్ కాచిగూడ, శంషాబాద్ సినీపోలీస్ మల్టీప్లెక్స్లలో బిల్లింగ్ మెషిన్లు సీజ్ చేశారు. ధరల పట్టికల ఏర్పాటు... చిక్కడపల్లి: ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని దేవి, సుదర్శ న్ థియేటర్లో ధరల సూచిక బోర్డు చేశారు. సూచిక బోర్డు కింద తూనికలు కొలతల శాఖకు ఫిర్యాదు చేయాల్సిన నంబర్లను సైతం అందుబాటులో ఉంటారు. టోల్ ఫ్రీ నంబర్ 1800450033, వాట్సప్ నంబర్ 7330774444 నంబర్లు అందుబాటులో ఉంచారు. ప్రధానంగా సినిమా హాల్స్, మల్టీఫ్లెక్స్లలో అధిక ధరలకు అమ్ముతున్నట్లు తూనికల కొలతల శాఖకు ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో శాఖ అదేశాల మేరకు థియేటర్ యాజ మానులు స్పందించి సూచిక బోర్డును ఏర్పాటు చేశారు. -
ఐకమత్యం లేకపోతే ఎన్నటికీ గెలవలేం..!
బాలీవుడ్ యాక్షన్ స్టార్ అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తున్న స్పోర్ట్స్ డ్రామా ‘గోల్డ్’. 1946 ఒలింపిక్స్లో భారత్కు హాకీలో గోల్డ్ మెడల్ అందించిన కోచ్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన గోల్డ్ టీజర్, ట్రైలర్లకు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా డైలాగ్స్ సినిమా మీద అంచనాలు పెంచేస్తున్నాయి. ఐమాక్స్ వర్షన్లో రిలీజ్ అవుతున్న ఈ సినిమాకు ఐమాక్స్ వర్షన్ టీజర్ను ప్రత్యేకంగా రిలీజ్ చేశారు. బుధవారం రిలీజ్ అయిన ఐమాక్స్ ప్రత్యేక వర్షన్ టీజర్కు కూడా మంచి రెస్సాన్స్ వస్తోంది. ‘జట్టులో ఐకమత్యం లేకపోతే ఎన్నటికీ కప్ గెలవలేం’ ‘చేపకు ఇదటం నేర్పించొద్దు’ లాంటి డైలాగ్స్ ఆసక్తికరంగా ఉన్నాయి. రీమా కగ్టి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో మౌనీ రాయ్, కునాల్ కపూర్, అమిత్ సద్, వినీత్ కుమార్సింగ్లు ఇతర కీలక పాత్రలు నటిస్తున్నారు. స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ఆగస్టు 15న గోల్డ్ ప్రేక్షకుల ముందుకు రానుంది. -
‘గోల్డ్’ ట్రైలర్ రిలీజ్
-
ఐమాక్స్ వద్ద కూలిన షెడ్డు: ఇద్దరు మృతి
హైదరాబాద్: ఎగ్జిబిషన్ కోసం సిద్ధం చేస్తున్న షెడ్డు కూలి ఇద్దరు మృతి చెందారు. ఈ సంఘటన నగర నడిబొడ్డులోని ఐమాక్స్ థియేటర్ సమీపంలో సోమవారం ఉదయం చోటు చేసుకుంది. ఐమాక్స్ సమీపంలో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం కోసం నూతనంగా షెడ్డులు నిర్మిస్తున్నారు. ఆ సమయంలో ప్రమాదవశాత్తు ఓ షెడ్డు కూలడంతో ఇద్దరు కార్మికులు మృతి చెందారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
టికెట్ల కోసం ఐమ్యాక్స్ వద్ద భారీ క్యూ లైన్
-
రేపటిలోగా స్థలాన్ని ఖాళీ చేస్తాం
ఐమాక్స్ పక్కన పార్కింగ్ స్థలంపై హైకోర్టుకు నివేదించిన డాక్టర్ కార్స్ అప్పీల్ ఉపసంహరణకు ధర్మాసనం అనుమతి సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ పట్టణాభివృద్ధి సంస్థ(హెచ్ఎండీఏ) నుంచి ప్రసాద్స్ ఐమాక్స్ పక్కన లీజుకు తీసుకున్న స్థలాన్ని శనివారంలోపు ఖాళీ చేస్తామని డాక్టర్ కార్స్ యాజమాన్యం హైకోర్టుకు నివేదించింది. సింగిల్ జడ్జి తీర్పుపై తాము దాఖలు చేసిన అప్పీల్ను సైతం ఉపసంహరించుకుంటున్నామని తెలిపింది. దీనిని పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు అప్పీల్ ఉపసంహరణకు అనుమతినిచ్చింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధానన్యాయమూర్తి(ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ అంబటి శంకర నారాయణలతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. సెకండ్ హ్యాండ్ కార్ల విక్రయం, ప్రదర్శన నిమిత్తం డాక్టర్ కార్స్ యాజమాన్యం 2012లో హెచ్ఎండీఏ నుంచి ప్రసాద్ ఐమాక్స్ పక్కనున్న స్థలాన్ని లీజుకు తీసుకుంది. అద్దె బకాయిలు చెల్లించలేదంటూ ఆ స్థలాన్ని ఖాళీ చేయాలని హెచ్ఎండీఏ ఇటీవల నోటీసులు జారీ చేసింది. దీనిపై డాక్టర్ కార్స్ హైకోర్టును ఆశ్రయించగా సింగిల్ జడ్జి స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. ఆ తరువాత స్టే ఎత్తివేయాలని కోరుతూ హెచ్ఎండీఏ అనుబంధ పిటిషన్ దాఖలు చేయగా సింగిల్జడ్జి స్టేని ఎత్తివేస్తూ తీర్పునిచ్చారు. దీనిపై డాక్టర్ కార్స్ యాజమాన్యం ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేయగా బుధవారం ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. లీజు గడువు ముగిసిన నేపథ్యంలో ఎప్పటిలోపు స్థలాన్ని ఖాళీ చేస్తారో చెప్పాలంటూ కోర్టు విచారణను గురువారానికి వారుుదా వేసింది. అప్పీల్ గురువారం విచారణకు రాగా శనివారంలోపు స్థలాన్ని ఖాళీ చేస్తామని డాక్టర్ కార్స్ యాజమాన్యం కోర్టుకు నివేదించింది. -
భూమిపై శాస్త్రజ్ఞుల సినిమా
వాషింగ్టన్: ఎప్పుడూ ఏదో ఒక అంశంపై పరిశోధనలు చేసే శాస్త్రజ్ఞులు తాజాగా ఓ సినిమాను నిర్మించే పనిలో పడ్డారు. 'బ్యూటిఫుల్ ప్లానెట్' పేరుతో అమెరికాలోని నాసాకు చెందిన శాస్త్రజ్ఞులు భూమిని గురించిన విషయాలను ప్రధానంగా ఇందులో చూపనున్నారు. భూమిపై మానవుడు వివిధ పరిణామ క్రమాల్లో చూపిన ప్రభావాలను పగటిపూట విధుల నిర్వహణ అనంతరం రాత్రి సమయాల్లో, సెలవు దినాల్లో ఈ సినిమాను పరిశోధకులు చిత్రీకరించారు. ఈ నెల 29నుంచి ఈ చిత్రం అమెరికాలోని థియేటర్లలో ప్రదర్శించేందుకు శాస్త్రజ్ఞులు ఐమ్యాక్స్తో ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. నాసాలో పనిచేసే క్జేల్ లిండ్ర్గేన్, టెర్రీ విర్స్ట్, బారీ విల్మోర్, నాసా పూర్వపు ఆస్ట్రోనాట్ స్కాట్ కెల్లీలు ప్రఖ్యాత హాలీవుడ్ డైరెక్టర్ టోనీ మైర్స్, ఫోటోగ్రఫీ డైరెక్టర్ జేమ్స్ల వద్ద ట్రైయినింగ్ తీసుకుని ఈ చిత్రాన్ని నిర్మించారు. కదిలే భూమి ఎంత సున్నితమైనదో ఈ చిత్రం ప్రజలకు తెలియజేస్తుందని నాసా ఓ ప్రకటనలో తెలిపింది. అంతరిక్షం నుంచి భూమి కదలికలను చిత్రించడం కష్టతరం కావడం చేత ఆ సన్నివేశాలను చిత్రించేందుకు దాదాపు మూడు సంవత్సరాల సమయం పట్టిందని నాసా వివరించింది. -
ప్రశాంత నగరం..
దేశంలో నివసించేందుకు అనువైన నగరాల్లో హైదరాబాద్ను మించింది మరొకటి లేదు. ఇక్కడ ఉన్నందుకు ఎంతో గర్విస్తుంటా. నాకు ఈ సిటీ ఎన్నో ఇచ్చింది. ఆ జ్ఞాపకాలు ఎన్నటికీ మరచిపోలేనివి. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ సిటీ... భిన్న ప్రాంతాలు, సంస్కృతుల ప్రజలకు ఆశ్రయమిచ్చింది. అందరూ ఎంతో సఖ్యతతో ఉండడం చాలా నచ్చింది. చిన్నప్పటి నుంచీ ఇక్కడే పెరిగా. ఐమాక్స్ బిగ్ స్క్రీన్పై సినిమా చూడ్డమన్నా, చార్మినార్ను చూడ్డమన్నా భలే ఇష్టం. ఇక్కడి బిర్యానీ, హలీం రుచులు ప్రపంచ ప్రజల మనసు దోచాయి. నెక్లెస్ రోడ్డులో తిరుగుతుంటే ఆ ప్రశాంతతే వేరు. - నాగశౌర్య -
ఐమ్యాక్స్ కేంద్రంగా చిల్డ్రన్స్ ఫిలిమ్ ఫెస్టివల్
సాక్షి,సిటీబ్యూరో: 19వ అంతర్జాతీయ బాలల చలనచిత్రోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. నవంబర్ 14 నుంచి 20 వరకు హైదరాబాద్ నగరం ఈ ఫెస్టివల్కు వేదికకానున్నది. ది చిల్డ్రన్స్ ఫిల్మ్ సోసైటీ అందుకు సంబంధించిన కసరత్తును ప్రారంభించింది. 13 మల్టీప్లెక్సుల్లో 200 సినిమాలు ప్రదర్శించనున్నారు. అంతేకాకుండా రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో బాలల చిత్రాలు ప్రదర్శించనున్నారు. చిల్డ్రన్స్ జ్యూరీలో పిల్లలు కూడా జడ్జిలుగా వ్యవహరిస్తారు. ఐమ్యాక్స్ లో మీడియా పాయింట్ను ఏర్పాటు చేయనున్నారు. చివరిరోజు కేఎం రాధాక్రిష్ణన్తో డిజైన్ చేయించిన స్పెషల్ థీమ్ సాంగ్స్ ఫెస్టివల్కి ప్రధాన ఆకర్షణ కానున్నాయి. దేశ నలుమూలల నుంచి 500 మంది ప్రతినిధులు ఇందులో పాల్గోనున్నారు. బాలల చలనచిత్రోత్సవాలకు ప్రసాద్ ఐ మ్యాక్స్ ప్రధాన క్రేందం కానున్నది. ఫెస్టివల్ పర్యవేక్షణ కోసం 25 మంది ప్రముఖులతో ఓ కమిటీ కూడా వేశారు. భారతీయ సినిమా వందేళ్ల పేరుతో ఒక ఎగ్జిబిషన్ను నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. -
బాహుబలి ఫీవర్ అందరిలో వుంది
-
మరిన్ని మల్టీప్లెక్స్ స్క్రీన్లు!
- వ్యాపార విస్తరణకు సంస్థల అడుగులు - ప్రాతీయ మార్కెట్పై దృష్టి - సంప్రదాయ రూట్లో పీవీఆర్, ఐనాక్స్ - భారీ డీల్స్తో పెరుగుతున్న కార్నివాల్ సాక్షి, హైదరాబాద్: టెక్నాలజీతో సినిమా ప్రొడక్షన్ వ్యయం తగ్గింది. దీనికి తగ్గట్టే సినిమాల నిర్మాణం పెరిగింది. దీంతో ప్రాంతీయ భాషా చిత్రాల సంఖ్యలోనూ వృద్ధి కనిపిస్తోంది. వీటన్నిటికీ తోడు ఇపుడు ఏ సినిమా అయినా సాధారణంగా రెండు మూడు భాషల్లో విడుదలవుతోంది. ఇవన్నీ కలిసి సినిమా థియేటర్లకు గిరాకీ పెంచుతున్నాయి. సరిగ్గా ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకునే మల్టీప్లెక్స్లు భారీ విస్తరణకు ప్రణాళికలు వేస్తున్నాయి. సినిమాల సంఖ్యకు తగ్గట్టుగా థియేటర్లు పెరగటం లేదని, ఈ లోటును భర్తీ చేయటానికి తాము ద్వితీయ శ్రేణి పట్టణాలు, నగరాలపై దృష్టి సారిస్తున్నామని మల్టీప్లెక్స్ సంస్థలు చెబుతున్నాయి. ఇపుడు ద్వితీయ శ్రేణి నగరాలు, పట్టణాల్లో మాల్స్ కూడా భారీగా వస్తుండటంతో థియేటర్లు ఏర్పాటు చేయటమూ వాటికి పెద్ద కష్టం కావటం లేదు. ప్రాంతీయ మార్కెట్పై మల్టీప్లెక్స్ల కన్ను భవిష్యత్తు అవకాశాలన్నీ ప్రాంతీయ మార్కెట్లోనే ఉన్నాయని భావిస్తున్న మల్టీప్లెక్స్ సంస్థలు.. తమ దృష్టిని జాతీయ మార్కెట్ నుంచి ప్రాంతీయ మార్కెట్పైకి మళ్లిస్తున్నాయి. ‘‘దేశంలో అధిక సంఖ్యలో చిన్న చిన్న పట్టణాలున్నాయి. వీటిల్లో సినిమాలను వీక్షించే వారి సంఖ్య ఎక్కువగా ఉంది. అందుకని మల్టీప్లెక్స్ థియేటర్ సంస్థలు ఈ పట్టణాలపై దృష్టి కేంద్రీకరిస్తే బాగుంటుంది’’ అనేది మల్టీప్లెక్స్ వ్యాపారంలో అత్యధిక వాటా కలిగి ఉన్న పీవీఆర్ గ్రూప్ అభిప్రాయం. ఎక్కువ థియేటర్లున్న ఐనాక్స్, సినీ పోలిస్, కార్నివాల్ సినిమాస్ ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుంటే బావుంటుందన్నది సంస్థ అభిప్రాయం. పెరగనున్న మల్టీప్లెక్స్ స్క్రీన్లు: నిజానికి ఇప్పటిదాకా పీవీఆర్, సినీ పోలిస్లు సంప్రదాయ విస్తరణపైనే (మల్టీప్లెక్స్ స్క్రీన్ల నిర్మాణం) ఎక్కువ దృష్టి కేంద్రీకరించాయి. అంతే తప్ప వేరే సంస్థను కొనుగోలు చేయటం వంటివేమీ చేయలేదు. పీవీఆర్ గత రెండేళ్ల నుంచీ ఏడాదికి 70-75 స్క్రీన్లను పెంచుకుంటూ వెళుతోంది. ఇపుడు ఈ సంఖ్యను 100కు చేర్చే యోచనతో ఉంది. ‘‘దేశంలో సినిమా ప్రదర్శనలో మార్పులు జరుగుతున్నాయి. ఈ సమయంలో సంప్రదాయక విస్తరణ అత్యవసరం. దీనివల్ల కొత్త స్క్రీన్లు వస్తాయి. కార్నివాల్ సంస్థ విస్తరణను స్వాగతిస్తున్నాము. కానీ దీనివల్ల మల్టీప్లెక్స్ స్క్రీన్ల సంఖ్యలో ఎలాంటి మార్పూ ఉండదు. మారింది కేవలం మల్టీప్లెక్స్ల ముందు బ్యానర్ మాత్రమే’’ అని పీవీఆర్ గ్రూప్ పేర్కొంది. కార్నివాల్ సంస్థ ఇటీవల రిలయన్స్ మీడియా వర్క్స్కు చెందిన ‘బిగ్ సినిమాస్’లో మెజారిటీ వాటాను కొనుగోలు చేసి ఆ సంస్థను చేజిక్కించుకుంది. దీనివల్ల బిగ్ సినిమాస్ థియేటర్లన్నీ ఇకపై కార్నివాల్ సినిమాస్గా మారతాయని, అంతేతప్ప కొత్తగా స్క్రీన్లు పెరగటం వంటిది జరగదనేది పీవీఆర్ అభిప్రాయం. మరో అగ్రశ్రేణి సంస్థ సినీపోలిస్ కూడా మల్టీప్లెక్స్ స్క్రీన్ల సంఖ్యను మరో 60కి పెంచటానికి చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించింది. ‘‘దేశంలో మల్టీప్లెక్స్ పరిశ్రమ మరింత విస్తరించే అవకాశాలున్నాయి. ఫన్ సినిమాతో ఒప్పందం చేసుకునేదాకా మేం ఒంటరిగానే వ్యాపార విస్తరణను చేపట్టాం. ప్రస్తుతం దేశంలో చాలా చైన్ మల్టీప్లెక్స్లు మావే. సంప్రదాయక విస్తరణపైనే ఎక్కువ దృష్టి కేంద్రీకరించాం. ఉనికి, లాభదాయకతపైనే వ్యాపార వృద్ధి అధారపడి ఉంటుంది’’ అని గ్రూప్ అభిప్రాయపడింది. ఈ ఏడాది కార్నివాల్ కూడా తన స్క్రీన్ల సంఖ్యను 500కు పెంచటానికి ప్రణాళికలు రచిస్తోంది. ఈ సంస్థలు కొత్త స్క్రీన్లను మొదట కోల్కతా, తర్వాత బెంగళూరు, చండీగఢ్, ఢిల్లీలలో నిర్మించనున్నాయి. మనకు థియేటర్ల సంఖ్య సమస్యేనా? ‘‘సినిమాల సంఖ్య పరంగా చూస్తే మనకు ఎలాంటి సమస్యా లేదు. ఎందుకంటే దేశంలో ఏటా 1000కి పైగా సినిమాలు విడుదలవుతున్నాయి. సంవత్సరానికి 4 బిలియన్ల టికెట్లను విక్రయిస్తున్నాం. మనకు ఉన్న సమస్యల్లా వాటి ప్రదర్శనకు తగినన్ని థియేటర్లు లేకపోవటమే’’ అనేది ఐనాక్స్ గ్రూప్ మాట. 10 లక్షల జనాభాకు మనం 9 స్క్రీన్లను (2 మల్టీప్లెక్స్లు) మాత్రమే కలిగి ఉంటే చైనా 25 స్క్రీన్లను కలిగి ఉందని సంస్థ వెల్లడించింది. మన దేశంలోని మొత్తం మల్టీప్లెక్స్ స్క్రీన్లు 2,050 మాత్రమే. -
మోడ్రన్ సంత