joining
-
ఫ్రెషర్లకు ఇన్ఫోసిస్ నియామక పత్రాలు
న్యూఢిల్లీ: క్యాంపస్ నియామకాల్లో భాగంగా ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ 1,000 మందికిపైగా అభ్యర్థులకు నియామక పత్రాలు జారీ చేసినట్టు సమాచారం. అభ్యర్థుల ఆన్బోర్డింగ్ సెపె్టంబర్ చివర లేదా అక్టోబర్ నుండి ప్రారంభం అవుతుందని తెలుస్తోంది. ఇన్ఫోసిస్ నుంచి దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన వెల్లడి కాలేదు. 2022 బ్యాచ్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు వీరిలో ఉన్నారని ఐటీ, ఐటీఈఎస్ ఉద్యోగుల హక్కుల కోసం పోరాడుతున్న నాసెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్ (ఎన్ఐటీఈఎస్) వెల్లడించింది. రెండేళ్లుగా వీరంతా నియామక పత్రాల కోసం ఎదురు చూస్తున్నారని ఎన్ఐటీఈఎస్ ప్రెసిడెంట్ హర్ప్రీత్ సింగ్ సలూజా తెలిపారు. ‘మేము అప్రమత్తంగా ఉంటాం. ఇన్ఫోసిస్ ఈ నిబద్ధతను గౌరవించడంలో విఫలమైనా, చేరే తేదీని ఉల్లంఘించినా ఇన్ఫోసిస్ కార్యాలయం ముందు నిరసన చేపట్టడానికి వెనుకాడము’ అని హెచ్చరించారు. 2022–23 రిక్రూట్మెంట్ డ్రైవ్లో సిస్టమ్ ఇంజనీర్, డిజిటల్ స్పెషలిస్ట్ ఇంజనీర్ పోస్టులకు ఎంపికైన 2,000 మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లను ఆన్బోర్డింగ్ చేయడంలో ఆలస్యం చేసినందుకు ఇన్ఫోసిస్పై కార్మి క, ఉపాధి మంత్రిత్వ శాఖకు ఎన్ఐటీఈఎస్ గతంలో ఫిర్యాదు చేసింది. ఫ్రెషర్లకు ఇచి్చన ఆఫర్ లెటర్లను కంపెనీ గౌరవిస్తుందని ఇన్ఫోసిస్ సీఈఓ సలీల్ పరేఖ్ ఇటీవలే స్పష్టం చేశా రు. ‘కొన్ని నియామక తేదీలను మార్చాం. అందరూ ఇన్ఫోసిస్లో చేరతారు. ఆ విధానంలో ఎటువంటి మార్పు లేదు’ అని వెల్లడించారు. -
ఎకరాకు రూ.14 వేల బోనస్ ఎందుకివ్వడం లేదు?
కరీంనగర్ టౌన్: అసెంబ్లీ ఎన్నికలకు ముందు క్వింటాల్ వడ్లకు రూ.500 చొప్పున బోనస్ ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, ఈ లెక్కన ఎకరానికి సగటున 28 క్వింటాళ్ల వడ్లకు రూ.14 వేల చొప్పున బోనస్ ఎందుకివ్వడం లేదని బీజేపీ జాతీయ ప్రధా న కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ ప్రశ్నించారు. ఇచ్చిన హామీల మేరకు తాలు, తరుగు, తేమతో పనిలేకుండా వడ్లు కొనాలని డిమాండ్ చేశారు. కరీంనగర్లో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో హుస్నాబాద్ నియోజకవర్గంలోని బీఆర్ఎస్కు చెందిన తాజా, మాజీ సర్పంచులు పలువురు బీజేపీలో చేరారు. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం సంజయ్ మాట్లాడు తూ బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలనలో సర్పంచుల పరిస్థితి దారుణంగా మారిందన్నారు. మోదీ ప్రభు త్వం పంచాయతీలకు నిధులివ్వడంతోనే సిబ్బందికి జీతాలిస్తున్నారని తెలిపారు. దేశమంతా మోదీ గాలి వీస్తుందని, తొలివిడతలోనే 102 ఎంపీ స్థానాల్లో గెలవబోతున్నట్లు జోస్యం చెప్పారు. -
బాబు, పవన్ కు ఊహించని షాక్..
-
బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరింది వీరే..
సాక్షి,హైదరాబాద్: పార్లమెంట్ ఎన్నికల ముందు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వలసలు జోరందుకున్నాయి. మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డి, ఆయన సతీమణి వికారాబాద్ జెడ్పీ చైర్ పర్సన్ సునీతా మహేందర్రెడ్డితో కలిసి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. వీరితో పాటు జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, ఆయన సతీమణి చర్లపల్లి కార్పొరేటర్ బొంతు శ్రీదేవి ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్రెడ్డి తదితరులు గాంధీభవన్లో కాంగ్రెస్ తెలంగాణ ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీ ఆధ్వర్యంలో కాంగ్రెస్లో చేరారు. ఈ సందర్భంగా మున్షీ వీరికి హస్తం కండువా కప్పి కాంగ్రెస్లోకి ఆహ్వానించారు. అనంతరం నేతలంతా అసెంబ్లీకి వెళ్లి సీఎం రేవంత్రెడ్డిని కలిశారు. ఇదీ చదవండి.. ముందు ఆరు గ్యారెంటీలు అమలు చేయండి.. అక్బరుద్దీన్ -
చంద్రబాబుకి భారీ షాక్..వైఎస్సార్సీపీ లోకి టీడీపీ నేతలు
-
సీఎం జగన్ సమక్షంలో YSRCPలో చేరిన భాస్కర్ రెడ్డి
-
చంద్రబాబుకు బిగ్ షాక్ ఇచ్చిన టీడీపీ కార్యకర్తలు
-
టీడీపి, జనసేనకు భారీ షాక్
-
టీడీపీకి బిగ్ షాక్...వైఎస్సార్సీపీలోకి భారీ చేరికలు
-
చంద్రబాబుకి భారీ షాక్.. వైఎస్సార్ సీపీలోకి టీడీపీ నేతలు
-
నెల్లూరులో టీడీపీ మటాష్..వైఎస్ఆర్ సీపీలోకి భారీ చేరికలు
-
చంద్రబాబుకు బిగ్ షాక్ వైఎస్సార్ సీపీలోకి టీడీపీ కుటుంబాలు
-
ఈటల ఎవరినీ ఎదగనివ్వలేదు: సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: ఈటల రాజేందర్ ముదిరాజుల్లో ఎవరిని ఎదగనివ్వలేదని అందుకే బండ ప్రకాష్ను తీసుకొచ్చి పదవులిచ్చామని సీఎం కేసీఆర్ అన్నారు. శుక్రవారం టీటీడీపీ మాజీ చీఫ్ కాసాని ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫాంహౌజ్లో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ ఇప్పుడు ఈటల రాజేందర్ కన్నా పెద్ద మనిషి కాసాని బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చారన్నారు. రాజ్యసభ ఎమ్మెల్సీ పదవులు ముదిరాజ్ లకు వస్తాయని తెలిపారు. ముదిరాజ్ ల నుంచి ఎక్కువ సంఖ్యలో నాయకులు తయారు అవ్వాలని పిలుపునిచ్చారు. ఎన్నికల తరువాత ముదిరాజ్ లతో సమావేశం అవుతానన్నారు.బీఆర్ఎస్ హయాంలో వృత్తి పరంగా ముదిరాజ్ లకు న్యాయం జరిగిందన్నారు. -
చంద్రబాబుకు బిగ్ షాక్..వైఎస్సార్సీపీలోకి భారీగా టీడీపీ నేతలు
-
కాంగ్రెస్లోకి మళ్లీ కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి?
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాల్లో సమీకరణాలు మారుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి తిరిగి కాంగ్రెస్లోకి చేరనున్నట్లు సమాచారం. అయితే, కోమటిరెడ్డి పార్టీ మారతాడంటూ జరుగుతున్న ప్రచారంపై వివరణ కోరేందుకు రాజగోపాల్రెడ్డిని ‘సాక్షి’ ప్రతినిధులు సంప్రదించగా, పార్టీ మార్పు వార్తలు ప్రచారమేనని ఆయన కొట్టిపారేశారు. బీజేపీ నుంచి ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచన లేదన్న కోమటిరెడ్డి.. కాంగ్రెస్ పార్టీ నుంచి తనకు ఆఫర్ ఉందని తెలిపారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపై ఇప్పటివరకు నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. కాగా, రాజగోపాల్ రెడ్డి ఈ నెల 27న ఢిలీలో రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ చేరే అవకాశం ఉందని, మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగే అవకాశముందనే ప్రచారం జరుగుతోంది. గతంలో మనుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న ఆయన రాజీనామా చేసి బీజేపీలోకి చేరిన సంగతి తెలిసిందే. ఆ పార్టీ నుంచి పోటీ చేసి ఉప ఎన్నికల్లో ఓటమి చవిచూశారు. అప్పటి నుంచి ఆయన బీజేపీలోనే కొనసాగుతున్నా అంత యాక్టివ్గా లేరు. పార్టీ కార్యక్రమాలకు కూడా దూరమయ్యారు. ఇప్పటికే కాంగ్రెస్ హైకమాండ్తో మంతనాలు జరిపిన రాజగోపాల్రెడ్డికి ఆ పార్టీ నుంచి గ్రీన్సిగ్నల్ వచ్చినట్లు తెలిసింది. చదవండి: బీజేపీ తొలి జాబితాలో బీసీలకు 36% సీట్లు -
టీడీపీకి ఎదురుదెబ్బ..YSRCPలో చేరిన టీడీపీ నాయకులు
-
చంద్రబాబుకు భారీ షాక్
-
కర్నూల్ జిల్లాలో టీడీపీ కి బిగ్ షాక్
-
ఈ స్టూడెంట్ వయసు జస్ట్... 92
‘చదువుకు వయసుతో పనేమిటి’ అనేది పాత డైలాగే కావచ్చు గానీ 92 సంవత్సరాల సలీమాఖాన్కు మాత్రం ఎప్పటికప్పుడు కొత్త విషయాలు తెలుసుకోవడం, నేర్చుకోవడం అంటే ఇష్టం. ఆ ఇష్టమే బామ్మను 92 ఏళ్ల వయసులోనూ బడి బాట పట్టించింది. ఉత్తర్ప్రదేశ్లోని బులందర్షహర్కు చెందిన సలీమాకు బడి సౌకర్యం లేకపోవడం, రకరకాల పరిస్థితుల వల్ల చదువుకునే అవకాశం దొరకలేదు. ఆరు నెలల క్రితం బడిలో చేరిన సలీమా పిల్లలతో పాటు క్లాస్రూమ్లో కూర్చునేది. చదవడం, రాయడం నేర్చుకుంది. ‘నేను కూడా చదవగలుగుతున్నాను. రాయగలుగుతున్నాను అనే సంతోషాన్ని చెప్పడానికి మాటలు లేవు’ అంటుంది సలీమాఖాన్. ‘మొదట్లో ఆమెకు చదువు చెప్పడానికి టీచర్లు తటపటాయించారు. అయితే ఆమెను వద్దనడానికి మా దగ్గర ఏ కారణం కనిపించలేదు. ఆమె పట్టుదల చూసి టీచర్లకు ఉత్సాహం వచ్చింది. అక్షరాస్యురాలిని కావాలి అనే ఆమె పట్టుదల టీచర్లకు నచ్చింది’ అంటుంది స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు ప్రతిభ శర్మ. -
తాలిబాన్తో చెలిమి వెనుక చైనా ఎత్తుగడ ఏమిటి? భారత్పై ప్రభావమెంత?
ఇటీవల భారత రాజధాని న్యూఢిల్లీలో జరిగిన జీ20 సదస్సు యావత్ ప్రపంచం దృష్టిని తనవైపు తప్పుకుంది. అయితే అదేసమయంలో చైనా పెద్ద రాజకీయ ఎత్తుగడ వేసింది. 55 దేశాలతో కూడిన ఆఫ్రికన్ యూనియన్ జి-20లో ప్రవేశించడం చైనా తనకు ఎదురుదెబ్బగా భావించింది. తాజాగా చైనా.. తాలిబాన్ ఆక్రమిత ఆఫ్ఘనిస్థాన్లో తన రాయబారిని నియమించింది. ప్రపంచంలోనే ఇటువంటి నిర్ణయం తీసుకున్న మొదటి దేశంగా చైనా అవతరించింది. రాయబారి నియామకం అంటే ఆఫ్ఘనిస్థాన్తో చైనా అధికారికంగా దౌత్య సంబంధాలను నెలకొల్పబోతోందని అర్థం. ప్రపంచవ్యాప్తంగా విమర్శలు 2021లో ఆఫ్ఘనిస్థాన్లో అధికారాన్ని చేజిక్కించుకున్నప్పటి నుండి తాలిబాన్ ప్రభుత్వం అంతర్జాతీయ గుర్తింపునకు నిరంతరం ప్రయత్నిస్తోంది. ఈ నేపధ్యంలో చైనాతో ఆఫ్ఘనిస్థాన్ దోస్తీ ఆ దేశానికి కలిసివచ్చేలా ఉంది. ఆఫ్ఘనిస్థాన్తో చైనా మైత్రి భారతదేశంపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందనేది ఇప్పుడు చర్చనీయాంశంగామారింది. అయితే చైనా.. ఆఫ్ఘనిస్థాన్తో చెలిమి చేయడంపై ప్రపంచవ్యాపంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అనాగరిక పాలన సాగిస్తున్న తాలిబాన్ ప్రభుత్వంతో చైనా స్నేహం చేయడాన్ని ఏ దేశమూ ఇష్టపడటం లేదు. ఆఫ్ఘనిస్థాన్లో చైనా ఆధిపత్యం? వాస్తవానికి చైనా ఇప్పుడున్న పరిస్థితుల్లో అమెరికాకు వ్యతిరేకంగా ప్రపంచంలోనే అగ్రరాజ్యంగా నిలవాలని కోరుకుంటోంది. దీనిలో భాగంగానే ఆఫ్ఘనిస్థాన్లో అడుగు పెట్టింది. ఇది చైనా వ్యూహంలో ఒక భాగమని విశ్లేషకులు అంటున్నారు. అమెరికా తన ఆధిపత్యాన్ని చాటుకున్న ఆఫ్ఘనిస్థాన్లో చైనా కూడా అదే పనిచేసేందుకు సిద్ధం అవుతోంది. అలాగే చైనా తన వాణిజ్య లక్ష్యాలను నెరవేర్చుకునేందుకు ఆఫ్ఘనిస్థాన్ను వాడుకోవాలనుకుంటోంది. ఆఫ్ఘనిస్థాన్లో వైట్ గోల్డ్గా పిలిచే లిథియం నిల్వలపై చైనా దృష్టి సారించింది. చైనా.. ఆఫ్ఘనిస్తాన్లో ముడి చమురు కోసం వెతకడమే కాకుండా, ఆఫ్ఘనిస్తాన్ ఖనిజ సంపదపై కూడా కన్నేసింది. కోటి ఆశలతో చైనాతో చెలిమి తాలిబాన్ అభిప్రాయం ప్రకారం చైనాతో ఒప్పందం కుదుర్చుకోవడం వల్ల ఆఫ్ఘనిస్థాన్లో లక్షలాది ఉద్యోగాలు ఏర్పడతాయి. మరోవైపు చైనా తన ప్రతిష్టాత్మకమైన చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అంటే సీపీఈసీని ఆఫ్ఘనిస్థాన్ ద్వారా మధ్య ఆసియా దేశాలకు తీసుకెళ్లాలని భావిస్తోంది. చైనాతో స్నేహం దరిమిలా అంతర్జాతీయ సమాజంలో తమ పరిస్థితి కూడా మారుతుందని తాలిబాన్ భావిస్తోంది. కాగా చైనా- తాలిబాన్ స్నేహం భారతదేశానికి పలు సమస్యలను తెచ్చిపెట్టనున్నదని విశ్లేషకులు భావిస్తున్నారు. భారత అంతర్జాతీయ ప్రాజెక్టులకు ఆటంకం ఆఫ్ఘనిస్థాన్ పొరుగు దేశమైన ఇరాన్లోని చబహార్ పోర్టు ద్వారా మధ్య ఆసియా దేశాలతో కనెక్టివిటీని నెలకొల్పేందుకు భారత్ ప్రయత్నిస్తోంది. అయితే ఆఫ్ఘనిస్తాన్లో చైనా ఉనికి కారణంగా అంతర్జాతీయ ఉత్తర-దక్షిణ కారిడార్ వంటి భారతదేశ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు ప్రభావితం కావచ్చు. తాలిబాన్ అధికారంలోకి రాకముందే ఆఫ్ఘనిస్థాన్లో మిలియన్ల డాలర్ల విలువైన ప్రాజెక్టులను భారతదేశం ప్రారంభించింది. ఆ ప్రాజెక్టులను భారత్ పూర్తి చేయాలని తాలిబాన్ ప్రభుత్వం కోరుకుంటోంది. అయితే ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో చైనా ఉనికి భారతదేశ అసంపూర్ణ ప్రాజెక్టులను ప్రభావితం చేయనున్నదనే అంచనాలున్నాయి. ఇది కూడా చదవండి: వారి ‘నిప్పు కోడి పాదాల’ రహస్యం ఏమిటి? ఈ తెగ ఎక్కడుంది? -
చంద్రబాబుకు భారీ షాక్..వైసీపీలో టీడీపీ నేతలు
-
చంద్రబాబుకు షాక్..వైఎస్సార్సీపీలో భారీగా టీడీపీ నేతలు చేరిక
-
బోనస్ ఇస్తాంలే కాస్త ఆగండి.. జాయినింగ్ ఆలస్యం చేస్తున్న యాక్సెంచర్
ఇటీవల 19,000 మంది ఉద్యోగుల తొలగింపును ప్రకటించిన యాక్సెంచర్ కొత్త ఉద్యోగుల జాయినింగ్ను కూడా ఒక సంవత్సరం వరకు ఆలస్యం చేస్తోంది. కంపెనీ కొత్త ఉద్యోగుల జాయినింగ్ తేదీని ఎప్పుటికప్పుడూ పొడిగిస్తూ వస్తున్న సంగతి తాజాగా వెలుగులోకి వచ్చింది. (Vodafone Idea 5G: వోడాఫోన్ కస్టమర్లకు గుడ్ న్యూస్.. ఎట్టకేలకు ముగిసిన నిరీక్షణ!) తమకు ప్రస్తుతం కొత్త ఉద్యోగుల అవసరం లేనందునే యాక్సెంచర్ కొత్త ఉద్యోగుల జాయినింగ్ తేదీలను పొడిగిస్తూ వస్తున్నట్లు తెలిసింది. పరిస్థితి ఇలా ఉంటుందని ముందే తెలిస్తే తాము మరేదైనా కంపెనీలో చేరేవాళ్లమని, కానీ యాక్సెంచర్ జాయినింగ్ను నెలల తరబడి ఆలస్యం చేస్తూ వస్తోందని అభ్యర్థులు నిట్టూరుస్తున్నారు. తమ క్లయింట్ల అవసరాలకు తగ్గట్టుగా కొత్త ఉద్యోగుల జాయినింగ్ తేదీలను సర్దుబాటు చేస్తున్నట్లుగా యాక్సెంచర్ ప్రతినిధి రాచెల్ ఫ్రే ఈమెయిల్ ద్వారా తెలియజేశారు. ఇలా ఎంతమంది అభ్యర్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ జాప్యం ఇలాగే కొనసాగుతుందా అనే విషయాలపై స్పష్టత లేదు. (Akshata Murthy: బ్రిటన్ ప్రధాని సతీమణి చేతికి ఒక్క రోజులో రూ.68 కోట్లు..) యాక్సెంచర్ తనకు యూకేలో కన్సల్టింగ్ ఉద్యోగం ఇచ్చిందని, వచ్చే జూన్లో ఉద్యోగంలో చేరాల్సి ఉండగా జాయినింగ్ తేదీని అక్టోబరు నెలకు మార్చిందని ఇటీవల గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన ఓ అభ్యర్థి బ్లూమ్బర్గ్ వార్తా సంస్థకు తెలియజేసింది. జాయినింగ్ తేదీని మళ్లీ 2024 సంవత్సరం ప్రారంభానికి మార్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఆమె ఆ ఉద్యోగం వదిలివేయాలని నిర్ణయించుకున్నారు. అయితే జాయినింగ్ ఆలస్యానికి యాక్సెంచర్ రిక్రూటర్ ఆ ఈమెయిల్లో క్షమాపణలు కోరారు. ఇలా జాయినింగ్ ఆలస్యం అయిన వారికి కంపెనీ అదనపు బోనస్ ఇవ్వనున్నట్లు తెలిసింది. యాక్సెంచర్లో జాయినింగ్ ఆలస్యం కావడం పట్ల విసుగు చెందిన కొందరు అభ్యర్థులు రెడ్డిట్ ఫోరమ్లలో కూడా తమ నిరాశను వ్యక్తం చేశారు. (Akshay Tritiya 2023: అక్షయ తృతీయ నాడు బంగారం కొంటున్నారా? ఈ విషయాలు గుర్తుంచుకోండి...) -
కాంగ్రెస్లో చేరికల పోరు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర కాంగ్రెస్లో చేరికలు ఒకవైపు కేడర్లో నూతనోత్తేజం నింపుతుంటే మరోవైపు నేతల మధ్య వర్గపోరు పెరుగుతోంది. పార్టీలో చేరాలనుకున్న వారంతా గాంధీభవన్లో చేరాల్సి ఉండగా అందుకు భిన్నంగా కీలక నేతల ఇళ్లలో ఎవరికి వారుగా చేరడం గందరగోళానికి దారితీస్తున్నట్లు కనిపిస్తోంది. ఆదివారం జరిగిన చేరికలు ఇదే విషయాన్ని తేటతెల్లం చేస్తున్నాయి. పీసీసీ, సీఎల్పీ, స్టార్ క్యాంపెయినర్... టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డికి చెందిన జూబ్లీహిల్స్ కార్యాలయంలో మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకర్గానికి చెందిన కొందరు నేతలు కాంగ్రెస్లో చేరగా మంచిర్యాల జిల్లాకు చెందిన మరికొందరు నేతలు మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్రావు నేతృత్వంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కార్యాలయంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అలాగే పార్టీ నుంచి ఆరేళ్లపాటు సస్పెండ్ అయిన తుంగతుర్తి రెబల్ నేత డాక్టర్ వడ్డెపల్లి రవి... కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి నివాసంలో పార్టీలో చేరారు. గాంధీభవన్ చేరికల్లో కనిపించని కీలక నేతలు ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలకు చెందిన వివిధ పార్టీల నేతలు పార్టీలో చేరేందుకు గాంధీభవన్కు వచ్చారు. పీసీసీ అధ్యక్షుడి సమక్షంలో మాజీ మంత్రి బోడ జనార్ధన్తోపాటు మెట్పల్లి జెడ్పీటీసీ రాధాశ్రీనివాస్రెడ్డి, సిర్పూర్ కాగజ్నగర్ బీజేపీ నేత రావి శ్రీనివాస్ కాంగ్రెస్లో చేరారు. ఆ సమయంలో రేవంత్రెడ్డి, మాజీ ఎంపీ మల్లు రవి మినహా సీనియర్ నేతలెవరూ అక్కడ లేరు. సస్పెన్షన్లో ఉన్న వారిని ఎలా..? గత ఎన్నికల సమయంలో రెబెల్ అభ్యర్థిగా ఉన్న తుంగతుర్తి నేత డాక్టర్ వడ్డెపల్లి రవిని పార్టీలోకి ఎలా ఆహ్వానించారని తుంగతుర్తి నియోజకవర్గ ఇన్చార్జి అద్దంకి దయాకర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. వడ్డెపల్లి రవిని పార్టీ ఆరేళ్లపాటు సస్పెండ్ చేసిందని గుర్తుచేసిన ఆయన... కోమటిరెడ్డి వెంకట్రెడ్డి సమక్షంలో ఎలా చేరారని ప్రశ్నించారు. దీనిపై రేవంత్రెడ్డితోపాటు పార్టీ రాష్ట్ర ఇన్చార్జి మాణిక్కం ఠాగూర్కు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. చేరికల కమిటీ చైర్మన్ జానారెడ్డి ఎక్కడ? పార్టీలోకి ఎవరిని తీసుకోవాలో ఎవరిని తీసుకోకూడదన్న వ్యవహారంపై మాజీ మంత్రి జానారెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ఓ కమిటీ వేసింది. ప్రస్తుతం జరుగుతున్న చేరికలకు జానారెడ్డి దగ్గర చర్చ జరిగిందా లేదా అనే దానిపై ఏ నాయకుడికీ స్పష్టత లేదు. ఏదో పేరుకే కమిటీ వేసి జానా రెడ్డిని బాధ్యుడిగా పెట్టారని, చేరికల అంశాలేవీ ఆయన దృష్టికి వెళ్లడంలేదని పార్టీలోని సీనియర్లు చెబుతున్నారు. -
టీఆర్ఎస్లో చేరిన మాజీమంత్రి పెద్దిరెడ్డి
-
టీఆర్ఎస్లో చేరిన మాజీమంత్రి పెద్దిరెడ్డి
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)లో చేరారు. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం తెలంగాణ భవన్లో పెద్దిరెడ్డికి గులాబీ కండువా వేసి పార్టీలోకి స్వాగతం తెలిపారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డిపై సీఎం కేసీఆర్ ప్రశంసలు కురిపించారు. కరీంనగర్ జిల్లాకు చెందిన పెద్దిరెడ్డి బీజేపీకి ఇటీవల రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తెలుగుదేశం పార్టీలో గతంలో తామిద్దరం కలిసి పని చేసినట్లు సీఎం కేసీఆర్ గుర్తుచేశారు. పెద్దిరెడ్డి తనకు ఎంతో సన్నిహితులని పేర్కొన్నారు. ప్రజా సంక్షేమంలో భాగస్వామ్యం కావడానికి నాయకులు టీఆర్ఎస్లో చేరుతున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. -
క్లబ్హౌజ్లో ఎంట్రీ ఇప్పుడు మరింత ఈజీ..!
గత కొన్ని రోజుల నుంచి బాగా ప్రాచుర్యం పొందిన సోషల్మీడియా యాప్ క్లబ్హౌజ్. ఈ యాప్తో ఆడియో రూపంలో యూజర్లు తమ భావాలను ఇతరులతో పంచుకోవచ్చును. ఈ యాప్ తొలుత ఆపిల్ ఐవోఎస్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉండగా, ప్రస్తుతం ఆండ్రాయిడ్ యూజర్లకు కూడా అందుబాటులోకి వచ్చింది. క్లబ్హౌజ్ యాప్ను మార్చి 2020లో విడుదల చేశారు. క్లబ్హౌజ్కు భారీగా ప్రాచుర్యం రావడంతో దిగ్గజ సోషల్ మీడియా ప్లాట్ఫాం ఫేస్బుక్ కూడా ఆడియో రూపంలో సరికొత్త యాప్ను అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది. ఇతర సోషల్ మీడియా యాప్స్ మాదిరిగా కాకుండా, క్లబ్హౌజ్లో చేరాలంటే కేవలం అందులో ఉన్న సభ్యులు ఆహ్వానిస్తేనే చేరే అవకాశం ఉంటుంది. మీ స్నేహితుడు, లేదా ఇతరులు ఆహ్వానిస్తేనే తప్ప అందులో చేరే అవకాశం లేదు. ఆహ్వానం లేకుండా ఫోన్ నంబర్తో నమోదు చేసుకోవాలనుకునే వారిని వెయిటింగ్ లిస్టులో చూపిస్తోంది. వెయిటింగ్ లిస్ట్ ప్రకారం కొత్త యూజర్లకు క్లబ్హౌజ్ అందుబాటులో వస్తోంది. తాజాగా క్లబ్హౌజ్ అధిక సంఖ్యలో యూజర్లను ఆకర్షించడం కోసం కీలక నిర్ణయం తీసుకుంది. ఎలాంటి ఇన్విటేషన్ కోడ్ లేకుండా యూజర్లు ఇకపై క్లబ్హౌజ్లో జాయిన్ కావచ్చునని ఒక ప్రకటనలో పేర్కొంది. వెయిటింగ్ లీస్ట్ పద్దతిని కూడా ఎత్తి వేసింది. క్లబ్హౌజ్ లాంటి సర్వీసులను ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ఫాంలు ఇన్స్టాగ్రామ్, ట్విటర్, రెడ్డిట్, టెలిగ్రాం వంటివి తమ సొంత వర్షన్లతో యాప్ను రిలీజ్ చేయాలని భావిస్తున్నాయి. క్లబ్హౌజ్ ప్రకారం.. ప్రస్తుతం క్లబ్హౌజ్లో డేలీ రూమ్స్ సంఖ్య 50 వేల నుంచి 5 లక్షలకు పెరిగింది. అంతేకాకుండా క్లబ్ హౌజ్ టెడ్ టాక్స్తో భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. -
భారతీయ జనతా పార్టీలోకి కాంగ్రెస్ కీలక నేత..
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జితిన్ ప్రసాద తాను భారతీయ జనతా పార్టీలోకి చేరుతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు, ఆయన ఢిల్లీలోని కేంద్ర మంత్రి పీయుష్ గోయల్ ఇంటికి చేరుకొని తన నిర్ణయాన్ని వెల్లడించారు. గతంలో జితిన్ ప్రసాద యూపీఏ-2 హయాంలో కేంద్ర మంత్రిగా ఉక్కు మంత్రిత్వ శాఖను నిర్వహించారు. 2019 కాంగ్రెస్ తిరుగుబాటు నేతల బృందం జీ-23లో జితిన్ కీలకంగా వ్యవహరించారు. అయితే, బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన ప్రసాద..‘ బ్రాహ్మిన్ చేత్న పరిషత్’ను గత సంవత్సరం ప్రారంభించారు. తాజాగా, ఆయనను కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ వెస్ట్బెంగాల్ జనరల్ సెక్రెటరీగా నియమించింది. ఇలాంటి తరుణంలో జితిన్ ప్రసాద బీజేపీలోకి చేరుతుండటం రాజకీయంగా రసవత్తరంగా మారింది. ఉత్తర ప్రదేశ్లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ చేరిక కీలకంగా మారింది. చదవండి: ఉచిత వ్యాక్సినేషన్, రేషన్.. కేంద్రంపై రూ.1.45 లక్షల కోట్ల భారం -
ఆ జంక్షన్కి కొత్త మహిళా అసిస్టెంట్ లోకోపైలెట్లు..
సాక్షి, కాజీపేట: కాజీపేట రూరల్ జంక్షన్లోని రైల్వే డ్రైవర్ల కార్యలయం కేంద్రంగా శిక్షణ పొందిన మహిళా అసిస్టెంట్ లోకోపైలేట్లు విధుల్లో చేరారు. ఉన్నతాధికారుల ఆదేశాలమేరకు ఈ ఆరుగురు మహిళా లోకో పైలేట్లకు కాజీపేట- డోర్నకల్ సెక్షన్లో అప్ అండ్ డౌన్ రూట్లలో గూడ్స్ రైళ్ల విధులు కేటాయించారు. కాగా, ఆర్ఆర్బీ ద్వారా నియామకమైన మరో నలుగురు మహిళ అసిస్టేంట్ లోకోపైలేట్లను కాజీపేటకు కేటాయించారు. వీరు కూడా ఇక్కడ శిక్షణ పొందాక విధుల్లో చేరనున్నారు. -
అక్షయ్- ట్వింకిల్ భార్యాభర్తలు.. మేంకాదు
కోల్కత్తా : పశ్చిమ బెంగాల్లో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. టీఎంసీని ఢీ కొట్టేందుకు అన్ని విధాల ప్రయత్నాలు మొదలుపెట్టిన బీజేపీ.. సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులను తమ పార్టీలోకి ఆహ్వానిస్తుంది. ఈ క్రమంలోనే పలువురు టాలీవుడ్ (బెంగాల్ చిత్రపరిశ్రమ)కు చెందిన యాశ్ దాస్ గుప్తా, ఇంకా దేవ్ అధికారి, సంధ్యా రాయ్ సహా పలువురు నటులు బీజేపీలో చేరారు. అయితే యశ్ దాస్ బీజేపీలోకి చేరడంతో ఒక్కసారిగా వార్తల్లో నిలిచారు. ఇందుకు ఆయన గతంలో టీఎంసీ ఎంపీ నుస్రత్ జహన్తో డేటింగ్ చేసినట్లు వార్తలు రావడమే కారణం. 2019లో నిఖిల్ అనే వ్యాపారవేత్తని పెళ్లాడిన నుస్రత్ కొన్నాళ్ల క్రితం హీరో యశ్తో కలిసి రాజస్తాన్ పర్యటనకు వెళ్లొచ్చింది. దీంతో వీరిద్దరి మధ్యా ప్రేమాయణం నడిచినట్లు అప్పట్లో పెద్ద ఎత్తున రూమర్లు వినిపించిన విషయం తెలిసిందే. అయితే ఆమె టీఎంసీలో చేరిన అనంతరం ఇద్దరి మధ్య దూరం పెరిగినట్లు తెలుస్తోంది. ఈ కారణంగానే యశ్ బీజేపీ తీర్థం పుచ్చుకున్నాడని కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. యశ్ దాస్ బీజేపీ చేరికపై అయన్ని ప్రశ్నించగా...తనకు ప్రధాని నరేంద్రమోదీపై ఎంతో నమ్మకం ఉందని, భారత్పై ఆయనకున్న విజన్ వల్లే తాను రాజకీయాల్లోకి వచ్చనట్లు తెలిపాడు. బెంగాల్లో ఉద్యోగవకాశాలు, మౌలిక సదుపాయాల కల్పన అవసరం ఉందని, అది బీజేపీతోనే సాధ్యమని చెప్పారు. ఎంపీ సుస్రత్ గురించి ప్రశ్నించగా..ఒకే కుటుంబంలో భిన్నాబిప్రాయాలు ఉండటం సహజమే కదా..అది కూడా రాజకీయాల పరంగానూ ఉండొచ్చు అని పేర్కొన్నారు. అక్షయ్ కుమార్, ట్వింకిల్ ఖన్నా లాగానే అని అడగ్గా..వారిద్దరు భార్యాభర్తలు..నేను, నుస్రత్ కాదు అని బదులిచ్చారు. చదవండి : (జయలలిత బాటలో దీదీ: విజయం వరిస్తుందా?) (బీజేపీలోకి యంగ్ హీరో..!) -
స్కూల్ అడ్మిషన్కు నో ‘టీసీ’!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పాఠశాలల్లో ఇకపై టీసీ(ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్) లేకున్నా ప్రవేశాలు పొందవచ్చు. ఐదోతరగతి లోపు ఇప్పటివరకు టీసీ లేకున్నా ప్రవేశాలకు అవకాశం ఉండగా, ఇకపై పదోతరగతి వరకు టీసీ లేకున్నా ప్రవేశాలు కల్పించేలా విద్యా శాఖ ఏర్పాట్లు చేస్తోంది. ప్రైవేటు పాఠశాలల్లో యాజమాన్యాలు ఫీజులు చెల్లిస్తేనే టీసీ ఇస్తామంటూ మెలిక పెడుతుండటంతో తల్లిదం డ్రులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుత కరోనా పరిస్థితులతో ప్రైవేటు పాఠశాలల్లో చదివించే ఆర్థిక స్తోమత లేని తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలల్లో తమ పిల్లలను చేర్పించేందుకు సిద్ధమైనా టీసీ ఇవ్వాలంటే పాత ఫీజులు, ఈ విద్యా సంవత్సరపు ఫీజు చెల్లించాలంటూ యాజమాన్యాలు మెలిక పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో విద్యాశాఖ.. టీసీ అవసరం లేకుండానే పాఠశాలల్లో ప్రవేశానికి వీలు కల్పించాలని ప్రతిపాదనలను రూపొందించి ప్రభుత్వానికి పంపించింది. త్వరలో ఈ ప్రతిపాదనలను ప్రభుత్వం ఆమోదించే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. ప్రైవేటు దోపిడీకి అడ్డుకట్ట ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాథమిక స్థాయిలో టీసీ లేకున్నా ప్రవేశాలు కల్పిస్తుం డగా, ఉన్నత పాఠశాలల్లో మాత్రం టీసీ తప్పనిసరి నిబంధనను అమలు చేస్తున్నారు. ప్రైవేటు స్కూళ్లలో అయితే అన్ని తరగతుల్లో టీసీ అడుగుతున్నారు. ప్రస్తుతం కరోనా కారణంగా బడులు ఇంకా ప్రారంభం కాలేదు. సెప్టెంబర్ 1 నుంచి సర్కారు డిజిటల్ పాఠాలు ప్రారంభించింది. కొన్ని ప్రైవేట్ స్కూళ్లు ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తూ విద్యార్థుల నుంచి వందశాతం ట్యూషన్ ఫీజు వసూలు చేస్తున్నాయి. ఫీజులు కట్టే స్తోమత లేని పేరెంట్స్ పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు మార్చాలని భావిస్తున్నారు. ఇందుకోసం టీసీలు కావాలని సదరు ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాన్ని కోరితే ఫీజు మొత్తం కట్టాలని దబాయిస్తుండడంతో ఆయా పిల్లల తల్లిదండ్రులకు ఎటూ పాలుపోలేని పరిస్థితి ఏర్పడుతోంది. ఈ క్రమంలో కొందరు తల్లిదండ్రులు పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికా రులను ఆశ్రయించారు. -
టీడీపీ నుంచి వైఎస్సార్ సీపీలోకి..
మెంటాడ: మెంటాడ మండలంలో వైఎస్సార్ సీపీకి మరింత ఆదరణ లభిస్తోంది. మండలంలోని చల్లపేటలో మాజీ సర్పంచ్లు జి.భాగ్యలక్ష్మి, తాడ్డి అరుణ, మాజీ ఎంపీటీసీ జి.సత్యశ్రీనివాసరావు, మెంటాడ పీఏసీఎస్ అధ్యక్షుడు తాడ్డి రామచంద్రరావు ఆధ్వర్యంలో ఆదివారం అదే గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ సర్పంచ్ చప్ప సూర్య కుమారి, తాడ్డి తనూష, విశ్రాంత ఉపాధ్యాయులు చప్ప సూర్యం, తాడ్డి గోవిందరావు, మిత్తిరెడ్డి గోపాలం తో పాటు సుమారు 200 కుటుంబాలు వైఎస్సార్ సీపీలో చేరాయి. సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర, గజపతినగరం ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్యలు పార్టీ కండువాలు కప్పి వారిని సాదారంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర మాట్లాడుతూ సీఎం జగన్మోహన్రెడ్డి సాలూరు నియోజకవర్గ అభివృద్ధికి రూ.50 కోట్లు మంజూరు చేశారన్నారు. జేకే నిధులు మంజూరయ్యాయని ఆండ్ర హైలెవెల్ కెనాల్ పూర్తి చేసి ఏన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న 17 గ్రామాల రైతులకు చెందిన 4100 ఎకరాలకు అదనపు సాగునీరు అందిస్తామని రైతులు అడిగిన ప్రశ్నకు ఆయన హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే అప్పలనరసయ్య మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు నేరుగా అందించాలనే ఉద్దేశంతో సీఎం వైఎస్ జగన్ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశారన్నారు. కార్యక్రమంలో మండల వైఎస్సార్ సీపీ కన్వీనర్ రెడ్డి సన్యాసినాయుడు, యువజన అధ్యక్షుడు రాయిపిల్లి రామారావు, మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు వడ్డి చిన్నారావు, సాలూరు నియోజకవర్గం మహిళా అధ్యక్షురాలు సిరిపురపు నాగమణి, సాలూరు నియోజకవర్గం నాయకులు దండి శ్రీను, సువ్వాడ రమణ, హేమంత్, మాజీ ఎంపీపీలు శొంఠ్యాణ సింహాచలం, కొర్రాయి కళావతి, ఏఎంసీ మాజీ చైర్మన్ పొరిపిరెడ్డి అప్పలనాయుడు పాల్గొన్నారు. -
అమిత్షాతో గోవా సీఎం భేటీ
న్యూఢిల్లీ: గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్షా, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డాలతో గురువారం ఢిల్లీలో భేటీ అయ్యారు. గోవాలో కాంగ్రెస్ పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరిన నేపథ్యంలో రాష్ట్ర కేబినెట్ విస్తరణ సహా పలు అంశాలపై చర్చలు జరిపినట్లుగా తెలుస్తోంది. గోవా అసెంబ్లీలో మొత్తం 40 స్థానాలు ఉండగా.. బీజేపీ 17 స్థానాలను, కాంగ్రెస్ 15 స్థానాలను గెలుచుకున్నాయి. గోవా ఫార్వర్డ్ పార్టీ సహా పలు స్వతంత్రుల మద్దతుతో కూటమిగా ఏర్పడి బీజేపీ అధికారాన్ని చేపట్టింది. తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్యేల చేరికతో కూటమి పార్టీల మద్దతు అవసరం లేకుండానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే స్థాయికి చేరుకుంది. అభివృద్ధి కోసమే బీజేపీలోకి.. తమ నియోజకవర్గాల అభివృద్ధి కోసమే బీజేపీలో చేరామని చంద్రకాంత్ కవ్లేకర్ వెల్లడించారు. మిగతా 9 మంది ఎమ్మెల్యేలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రతిపక్షంలో ఉంటే తమ ప్రాంతాల అభివృద్ధి అసాధ్యమని ఆరోపించారు. -
మహబూబ్నగర్లో కాంగ్రెస్ ఖాళీ
ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి దెబ్బమీద దెబ్బ పడుతోంది. ఇప్పటికే అసెంబ్లీ ఫలితాలతో నిస్తేజంలో ఉన్న హస్తానికి వలసల గుబులు పట్టుకుంది. రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో ప్రారంభమైన వలసల సంస్కృతి ఇప్పుడు పాలమూరుకు వ్యాపించింది. ఇన్నాళ్లు పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న డీకే అరుణతో పాటు ఎమ్మెల్యే హర్షవర్ధన్రెడ్డి కాంగ్రెస్కు గుడ్బై చెప్పారు. వీరితో పాటు పలువురు మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జ్లు, డీసీసీ అధ్యక్షులు, జెడ్పీటీసీ సభ్యులు సైతం టీఆర్ఎస్, బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. సోమవారం అర్ధరాత్రి సీనియర్ నేత, మాజీ మంత్రి డీకే అరుణ కాంగ్రెస్ను వీడి కమలం గూటికి చేరగా.. మరుసటి రోజే కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి కేటీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. ఇరువురి అనుచరులు సైతం వీరితో పాటు ఆయా పార్టీల్లో చేరేందుకు సిద్ధమవుతున్నారు. మరో వారం రోజుల్లో ఉమ్మడి పాలమూరు జిల్లాలో కాంగ్రెస్ నుంచి పెద్ద ఎత్తున వలసలు ఉంటాయని తెలుస్తోంది. అయితే ఇరువురు నేతలతో ఎవరెవరు పార్టీని వీడుతారో అనే చర్చ జిల్లాలో హాట్టాపిక్గా మారింది. ఒకవేళ ఇదే జరిగితే.. కాంగ్రెస్కు కంచుకోటగా ఉన్న పాలమూరులో రానున్న రోజుల్లో పార్టీకి గడ్డుకాలం రాబోతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ‘చే’జారుతోన్న క్యాడర్ను కాపాడుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. వలస వెళ్లిన ఇరువురు నేతల అనుచరులు పార్టీని వీడకుండా చర్యలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. జేజమ్మ వెంటే.. పాలమూరులో కాంగ్రెస్కు పెద్ద దిక్కుగా ఉన్న మాజీ మంత్రి డీకే అరుణ పార్టీ వీడడం వెనక చాలా కారణాలున్నాయి. ఉమ్మడి జిల్లా కాంగ్రెస్లో కేంద్ర మాజీ మంత్రి ఎస్.జైపాల్రెడ్డి, మాజీ మంత్రి చిన్నారెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్కుమార్, మాజీ ఎంపీ, టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లురవి, మాజీ ఎమ్మెల్యే రేవంత్రెడ్డి, నాగం జనార్దన్రెడ్డితో పాటు మాజీ మంత్రి డీకే అరుణ వంటి సీనియర్లు ఉన్నారు. వీరిలో పలువురు సీనియర్లకు, అరుణకు మధ్య వర్గ విభేదాలున్నాయి. తన క్యాడర్కు టికెట్లు, పార్టీ పోస్టులు ఇప్పించుకోవడంలో అరుణ సీనియర్లతో పోటీ పడేవారు. ముఖ్యంగా ఆమెకు జైపాల్రెడ్డికి మధ్య తీవ్రమైన పోటీ ఉండేది. పలు సందర్భాల్లో ఏఐసీసీ, టీపీసీసీ అరుణ ప్రతిపాదించిన వారిని కాదని ఇతరులకు టికెట్లు కేటాయించడంతో ఆమె నిరాశకు లోనయ్యారు. ముఖ్యంగా తాజాగా కాంగ్రెస్ ప్రకటించిన లోక్సభ అభ్యర్థుల గురించి తనతో చర్చించలేదని తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆమె పార్టీకి గుడ్బై చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఉమ్మడి జిల్లాలో దేవరకద్ర నుంచి వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసిన డోకూరు పవన్కుమార్, మహబూబ్నగర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఎర్రశేఖర్, నారాయణపేట నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన కుంభం శివకుమార్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి, జోగులాంబ గద్వాల జిల్లా డీసీసీ అధ్యక్షుడు పటేల్ ప్రభాకర్రెడ్డి, టీపీసీసీ సభ్యుడు గడ్డం కృష్ణారెడ్డి, ఆ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు బండల పద్మావతి, గద్వాల మున్సిపల్ చైర్పర్సన్ కృష్ణవేణి తదితరులు అరుణతో కలిసి కమల దళంలో చేరుతారనే ప్రచారం జరుగుతోంది. ‘బీరం’తో పాటు ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు నాగర్కర్నూల్ జిల్లాకు సంబంధించి కాంగ్రెస్ తరఫున పోటీచేసి గెలుపొందిన కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి బుధవారం హైదరాబాద్లో గులాబీ కండువా కప్పుకున్నారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న కొల్లాపూర్–సిద్ధేశ్వరం వంతెన, శ్రీశైలం ముంపు బాధితులను ఆదుకుంటామని కేసీఆర్ హామీ ఇవ్వడంతోనే ఆయన కాంగ్రెస్ను వీడినట్లు ప్రకటించారు. బీరం హర్షవర్ధన్రెడ్డితో పాటే ఇంకొందరు నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా నాగరకర్నూల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు చిక్కిడు వంశీకృష్ణ కూడా వలస వెళ్లే వారి జాబితాలో ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం వంశీకృష్ణ భార్య అనురాధ అమ్రాబాద్ జెడ్పీటీసీగా ఉన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి అమ్రాబాద్ మండలం ఎస్సీ జనరల్కు రిజర్వ్ కావడం, జెడ్పీ చైర్మన్ కూడా ఎస్సీ జనరల్కు రిజర్వ్ కావడంతో ఈ పదవి కోసం వంశీకృష్ణ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అనుకున్నట్లు ముఖ్యమంత్రి నుంచి హామీ వస్తే హర్షవర్ధన్తో పాటు పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. ఎస్సీ సామాజిక వర్గం నుంచి పెద్దగా పేరున్న నాయకుడు లేకపోవడం, ఎమ్మెల్యేగా చేసిన అనుభవం ఉండడం వంశీకృష్ణకు కలిసొచ్చే అంశాలుగా చెప్పవచ్చు. మరోవైపు షాద్నగర్ మాజీ ఎమ్మెల్యే ప్రతాప్రెడ్డితో పాటు పారిశ్రామికవేత్త అనిరుధ్రెడ్డి కాంగ్రెస్కు గుడ్బై చెప్పేందుకు నిర్ణయించినట్లు తెలుస్తోంది. అనిరుధ్రెడ్డికి మహబూబ్నగర్ జెడ్పీ చైర్మన్ పదవి ఇచ్చేందుకు కేటీఆర్ అంగీకరించినట్లు సమాచారం. -
వైఎస్ఆర్సీపీ చేరిన కాపుసంఘం జిల్లా అధ్యక్షుడు రామజోగి
-
నెల్లూరులో వైఎస్ఆర్సీపీలో చేరిన యువకులు
-
వైఎస్ఆర్సీపీలో చేరుతున్నట్లు ప్రకటించిన నేదురుమల్లి రాంకూమార్రెడ్డి
-
వైఎస్ఆర్సీపీలో చేరిన టీడీపీ, కాంగ్రెస్ నేతలు
-
వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్సీపీ చేరిన వివిధ పార్టీల నేతలు
-
ఎమ్మెల్యే చెబితేనే జాయినింగ్!
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల : ‘బదిలీపై వచ్చావా..? ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ సిఫారసు లెటర్ ఉందా? బదిలీ లెటర్ తెచ్చినా... వారు చెపితేనే విధుల్లో చేర్చుకుంటా!’ అని ఓ తహసీల్దార్ గిర్ధావర్ (రెవెన్యూ ఇన్స్పెక్టర్ను వెనక్కు పంపడం మంచిర్యాల జిల్లా రెవెన్యూ వర్గాల్లో హాట్టాపిక్గా మారింది. ఇటీవల జిల్లాలో చేపట్టిన రెవెన్యూ ప్రక్షాళనలో భాగంగా జన్నారం మండలంలో ఆర్ఐగా పనిచేసిన ఎం.మోహన్ను తొలుత భీమినికి బదిలీ చేశారు. మోహన్ విజ్ఞప్తి మేరకు స్వల్ప మార్పులతో భీమిని నుంచి జైపూర్ మండలానికి బదిలీ చేస్తూ గత నెల 29న కలెక్టర్ ఆర్వీ.కర్ణన్ ప్రొసీడింగ్స్ ఇచ్చారు. ఈ మేరకు మోహన్ మే 31న జైపూర్ తహసీల్దార్ శేఖర్ను కలిసి విధుల్లో చేర్చుకోవాలని కోరగా, అందుకు నిరాకరించడం వివాదాస్పదమైంది. ‘ఎన్నికల సంవత్సరం ఇది. ఎమ్మెల్యే (నల్లాల ఓదెలు), ఎమ్మెల్సీ (పురాణం సతీష్)ల అనుమతి లేకుండా నిన్ను విధుల్లో చేర్చుకోలేను. వారి ఆదేశాలకు అనుగుణంగా పనిచేయాల్సి ఉంటుంది. వారి నుంచి లెటర్ తీసుకువస్తేనే జాయిన్ చేసుకుంటా’ అని తహసీల్దార్ శేఖర్ తనను వెనక్కు పంపారని శనివారం ‘సాక్షి’ కార్యాలయానికి వచ్చిన మోహన్ వివరించారు. ఆరోజు జైపూర్ తహసీల్ కార్యాలయం పరిశీలనకు వచ్చిన జాయింట్ కలెక్టర్కు ఈ విషయాన్ని తెలియజేశానని, కలెక్టర్ ప్రొసీడింగ్స్ను తిరస్కరించకూడదని జేసీ హితువు చెప్పారని వివరించారు. జేసీ ముందు జాయిన్ చేసుకుంటానని చెప్పి తరువాత మళ్లీ వెనక్కు పంపారని తెలిపారు. ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం కలెక్టర్ ఆర్వీ.కర్ణన్ను కలిసి ఫిర్యాదు చేస్తే ఏవో, ఆర్డీవోలకు కలెక్టర్ ఆదేశాలిచ్చారని మోహన్ తెలిపారు. కాగా శనివారం తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొనేందుకు గిర్ధావర్ హోదాలో జైపూర్కు వెళ్లగా, ఆఫీసులో కూర్చున్న తనను జాయిన్ చేసుకోలేనని చెప్పి మళ్లీ తహసీల్దార్ వెనక్కు పంపారని తెలిపారు. కలెక్టర్ బదిలీ ఉత్తర్వులను తీసుకొని వెళితే తనను విధుల్లో చేరకుండా అడ్డుకొని వెనక్కు పంపడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. తనను బెదిరిస్తూ అబద్ధాలు ప్రచారం చేస్తున్నాడు : తహసీల్దార్ శేఖర్ బదిలీ ఉత్తర్వులతో వచ్చిన గిర్దావర్ మోహన్ విధుల్లో చేరకముందే తన పై అధికారి అనే గౌరవం కూడా ఇవ్వకుండా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని జైపూర్ తహసీల్దార్ శేఖర్ ‘సాక్షి’కి తెలిపారు. గిర్ధావర్ ఆరోపణలపై వివరణ కోరగా... తనకు తెలియకుండా ఎవరిని విధుల్లో చేర్చుకోవద్దని ఓ ప్రజాప్రతినిధి చెప్పిన మాటలనే మోహన్కు చెప్పానని స్పష్టం చేశారు. ఈ మాటలకు తప్పుడు ప్రచారం చేస్తూ అధికార పార్టీ పేరును, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, జిల్లా కలెక్టర్ పేర్లను వివాదాస్పదం చేశాడని పేర్కొన్నారు. ‘జరిగిన పరిణామాలను కలెక్టర్కు నివేదించాను. కలెక్టర్ నుంచి నాకు తదుపరి ఆదేశాలు ఇంకా రాలేదు. ఈ నేపథ్యంలోనే శనివారం మండల కార్యాలానికి వచ్చిన గిర్ధావర్ మోహన్ను విధుల్లో చేర్చుకోలేదు’ అని వివరించారు. -
వైఎస్సార్సీపీలో చేరుతున్నా: యలమంచిలి రవి
విజయవాడ : తెలుగుదేశం పార్టీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరునున్నారు. ఈ నెల 14వ తేదీ ఉదయం 9 గంటలకు కనకదుర్గమ్మ వారధి వద్ద వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా యలమంచిలి రవి శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ.. టీడీపీలో తనకు గౌరవం ఇవ్వలేదని అన్నారు. ‘2009లో ప్రజారాజ్యంలో ఎమ్మెల్యే ఎన్నికయ్యాను. ఆ తర్వాత టీడీపీలో చేరాను. ఇప్పుడు టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలోకి వెళ్తున్నాను. ప్రత్యేక హోదా వద్దు ప్యాకేజీ ముద్దు అనడంతో యువత నిరుత్సాహ పడ్డారు. 2004, 2014లో నన్ను భంగపడేలా చేశారు. 2014 నుంచి అవకాశం రాకపోయినా పార్టీలో ఉన్నాను. కొందరి చర్యల కారణంగా నేను పార్టీలో ఉన్నానో లేదో నాకే అర్థం కాలేదు. దీంతో బాధపడ్డాను’ అని వ్యాఖ్యానించారు. ‘టీడీపీలో ఉన్న మంత్రులు నన్ను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడం బాధకు గురిచేశాయి. నేను అందుకే పార్టీ మారడానికి దోహదపడ్డాయి. రైతు గర్జన సమయంలో కూడా మమ్మల్ని ఉపయోగించుకుని మాకు సీటు ఇస్తామని హామీ ఇచ్చి మళ్లీ మోసం చేశారు. టీడీపీలో నాకు గౌరవం ఇవ్వలేదు. మనస్తాపం చెందాను. నా తండ్రి లాగానే వివాదాలు లేకుండానే పార్టీ అభివృద్ధి కోసం పని చేస్తాను. మా తాత దగ్గర నుంచి ప్రజలకు సేవ చేస్తున్నాము. వైఎస్ జగన్ మాటకు కట్టుబడి ఉన్నాను’ అని యలమంచిలి రవి పేర్కొన్నారు. టీడీపీలో కలవరం ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు వస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్పయాత్ర టీడీపీ శ్రేణుల్లో గుబులు పుట్టిస్తోంది. జిల్లాలో పాదయాత్ర అనంతరం టీడీపీ పునాదులు కదిలే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే ప్రత్యేక హోదా అంశంలో వైఎస్సార్ సీపీ వ్యూహానికి తలకిందులైన టీడీపీ నాయకులపై ఆ పార్టీ నిఘా ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. -
పోలవరం డీఎస్పీగా రవికుమార్
ఏలూరు అర్బ¯ŒS/కొవ్వూరు : జిల్లాలో నూతనంగా ఏర్పాౖటెన పోలవరం పోలీస్ సబ్ డివిజ¯ŒSకు ఏటీ రవికుమార్ను డీఎస్పీగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన అనంతరం శాంతి భద్రతలపై దృష్టి పెట్టిన ప్రభుత్వం తెలంగాణ నుంచి విభజించిన కుక్కునూరు, వేలేరుపాడు, తదితర ఏడు మండలాలతో పోలవరం సబ్ డివిజ¯ŒSను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలవరం డివిజ¯ŒSకు మొట్టమొదటి డీఎస్పీగా రవికుమార్ నియమితులయ్యారు. ఆయన త్వరలో ఇక్కడ బాధ్యతలు స్వీకరించనున్నారు. -
వైఎస్ఆర్సీపీలోకి పలువురి చేరిక
-
రెండు మండలాలు జనగామలో కలిపేందుకు మద్దతు
ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య రఘునాథపల్లి : కొత్తగా జనగామ జిల్లా ఏర్పడితే ప్రజల ఆకాంక్ష మేరకు రఘునాథపల్లి, లింగాలఘణపురం మండలాలు అందులో కలిపేందుకు తన పూర్తి మద్దతు ఉంటుందని ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అన్నారు. సోమవారం మండల కేంద్రంలో పార్టీ నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సబ్ కమిటీకి తాను కొత్తగా జనగామ జిల్లా చేయాలని కోరానే తప్ప మండలాల ప్రస్తావన తీసుకురాలేదని పేర్కొన్నారు. భౌగోళికంగా ఏ జిల్లాకు మండలాలు దగ్గరలో ఉంటే ఆ మండలాలను అందులో కలపాల్సి ఉంటుందన్నారు. రఘునాథపల్లి, లింగాలఘణపురం మండలాలు తిరిగి జనగామ పాత నియోజక వర్గంలో కలువాలని ప్రజలు కోరుకుంటున్నారని, వారితో తాను ఏకీభవిస్తున్నట్లు చెప్పారు. దర్మసాగర్, జఫర్గఢ్, స్టేషన్ఘన్పూర్ మండలాల ప్రజల అభీష్టం మేరకు నడుచుకుంటానని ఆయన పేర్కొన్నారు. సమావేశంలో ధర్మసాగర్ జెడ్పీటీసీ కీర్తి వెంకటేశ్వర్లు, జఫర్గఢ్ ఎంపీపీ గుజ్జరి స్వరూప, నాయకులు రాంబాబు, బుచ్చయ్య, బ్రహ్మారెడ్డి,తదితరులు పాల్గొన్నారు. -
పోస్టల్ సూపరింటెండెంట్గా శ్రీనివాసరావు
కడప వైఎస్ఆర్ సర్కిల్ : జిల్లా పోస్టల్ కార్యాలయ సూపరింటెండెంట్గా ఎ.శ్రీనివాసరావు గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈయన అనంతపురంలో పని చేస్తూ బదిలీపై కడపకు వచ్చారు. ఇక్కడ పని చేస్తున్న శ్రీనివాసమూర్తి తిరుపతికి బదిలీ అయ్యారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన పోస్టల్ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు మాట్లాడుతూ జిల్లాలో పోస్టల్ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. ఇటీవల కేంద్రం ప్రవేశ పెట్టిన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తామన్నారు. బాధ్యతలు స్వీకరించిన ఈయనకు పోస్టల్ సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. -
టీఆర్ఎస్లోకి ఖమ్మం కాంగ్రెస్ ఎమ్మెల్యే
ఖమ్మం: పాలేరు ఉప ఎన్నికకు ముందు తెలంగాణ కాంగ్రెస్ పార్టీకు మరో ఎదురు దెబ్బ తగలనుంది. ఖమ్మం కాంగ్రెస్ ఎమ్మెల్యే పువ్వాడ అజయ్కుమార్ అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు తెలుస్తుంది. ఖమ్మం క్యాంపు కార్యాలయంలో ఆదివారం పార్టీ కార్యకర్తలతో పువ్వాడ సమాలోచనలు జరిపినట్టు సమాచారం. ఇప్పటికే పాలేరు టీఆర్ఎస్ అభ్యర్థి మంత్రి తుమ్మలతో ఆయన భేటీ అయినట్లు ఊహగానాలు వినిపిస్తున్నాయి. ఈ నెల 27న ఖమ్మంలో జరిగే టీఆర్ఎస్ ప్లీనరీలో సీఎం కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరే అవకాశమున్నట్లు తెలుస్తుంది. ఒక వైపు తెలంగాణ కాంగ్రెస్ నేతలు అన్ని పార్టీలను కలిసి మద్దతు కూడగడుతుండగా... జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యే పార్టీ ఫిరాయింపుపై నేతలు దైలమాలో పడ్డారు. -
టీఆర్ఎస్ లోకి సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు
పార్టీలోకి ఆహ్వానించిన కొత్తగూడెం ఎమ్మెల్యే జలగం కొత్తగూడెం: కొత్తగూడెం ఎమ్మెల్యే జలగం వెంకట్రావు సమక్షంలో గురువారం పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు టీఆర్ఎస్లో చేరారు. మండల పరిధిలోని లక్ష్మీదేవిపల్లిలో ఉన్న జలగం క్యాంపు కార్యాలయంలో వివిధ పార్టీలకు చెందిన ప్రజా ప్రతినిధులకు టీఆర్ఎస్ కండువాలు కప్పి ఎమ్మెల్యే పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో సింగభూపాలెం సర్పంచ్ భూక్యా జ్యోతి, కారుకొండ పంచాయతీ సర్పంచ్ మాళోతు భారతి, అనిశెట్టిపల్లి సర్పంచ్ ఈసం రామారావు, పెనుబల్లి సర్పంచ్ హాలావత్ రుక్మిణి, రుద్రంపూర్ సర్పంచ్ గొగ్గెల లక్ష్మి, సీతంపేట సర్పంచ్ లావుడ్య మంగమ్మ, వెంకటేష్ఖని సర్పంచ్ తాటి సావిత్రి, గౌతంపూర్ ఎంపీటీసీ-3 భూక్యా రుక్మిణి, రుద్రంపూర్-1 ఎంపీటీసీ అజీజ్ఖాన్, లక్ష్మీదేవిపల్లి ఎంపీటీసీ తేజావత్ భద్రమ్మ, చుంచుపల్లితండా ఎంపీటీసీ, వైస్ ఎంపీపీ మాళోతు ఈరి, కొత్తగూడెం మున్సిపాలిటీ 24వ వార్డు కౌన్సిలర్ బండి నర్సింహారావు, 33వ వార్డు కౌన్సిలర్ బాలిశెట్టి సత్యభామ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో సీఎం కేసీఆర్, కొత్తగూడెం నియోజకవర్గంలో ఎమ్మెల్యే చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై టీఆర్ఎస్లో చేరుతున్నట్లు తెలిపారు. -
11న టీఆర్ఎస్లోకి గాంధీ, గోపీనాథ్!!
ముఖ్యమంత్రి కేసీఆర్తో భేటీ అయిన టీడీపీ ఎమ్మెల్యేలు సాక్షి, హైదరాబాద్: టీటీడీపీకి చెందిన మరో ఇద్దరు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరడానికి ముహూర్తం కుదిరింది. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఈనెల 11వ తేదీన గులాబీ తీర్థం పుచ్చుకోనున్నారు. మహారాష్ట్ర పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు మంగళవారం రాత్రి తిరిగి వచ్చాక దాదాపు ఏడున్నర గంటల సమయంలో ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు ఆయనను కలసి చర్చించారు. తమ చేరికకు గ్రీన్సిగ్నల్ తీసుకుని... ఇందుకు 11వ తేదీని ముహూర్తంగా ఎంచుకున్నారు. సీఎం కేసీఆర్ సమక్షంలో వీరిద్దరూ టీఆర్ఎస్లో చేరనున్నారు. అయితే మాగంటి గోపీనాథ్ సోమవారం ఉదయమే సీఎం కేసీఆర్ను కలసి తమ చేరిక గురించి చర్చించారు. మంగళవారం అరికెపూడి గాంధీతో కలసి మరోసారి కేసీఆర్తో భేటీ అయ్యారు. ఈ ఇద్దరు ఎమ్మెల్యేలూ పార్టీ మారితే.. ఇక తెలంగాణ టీడీపీకి మిగిలేది ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రమే కావడం గమనార్హం. కాగా, టీడీఎల్పీని టీఆర్ఎస్లో చేర్చాలంటూ స్పీకర్కు లేఖ ఇచ్చిన ఎర్రబెల్లికి మాగంటి, అరికెపూడి మద్దతు తెలిపారని సమాచారం. విలీనానికి తాము కూడా అంగీకారం తెలుపుతున్నామని రాతపూర్వకంగా హామీ ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. -
టీఆర్ఎస్లోకి డీఎస్!
⇒ గులాబీ తీర్థం పుచ్చుకోవడం దాదాపు ఖాయం ⇒ బుధవారం ముఖ్యమంత్రి ⇒ కేసీఆర్తో డీఎస్ భేటీ ⇒ ఆయనను స్వయంగా తీసుకెళ్లిన ఎంపీ కవిత ⇒ నేడో రేపో అధికారికంగా ప్రకటించే అవకాశం ⇒ ఇదే దారిలో దానం సహా మరికొందరు నేతలు సాక్షి, హైదరాబాద్: పీసీసీ మాజీ చీఫ్, కాంగ్రెస్ సీనియర్ నేత డి.శ్రీనివాస్ టీఆర్ఎస్లో చేరడం దాదాపుగా ఖాయమైపోయింది. బుధవారం ఆయన సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్తోభేటీ అయ్యారు. కేసీఆర్ కుమార్తె, ఎంపీ కవిత స్వయంగా డీఎస్ను క్యాంపు కార్యాలయానికి తీసుకెళ్లారు. డీఎస్ గులాబీ తీర్థం పుచ్చుకోనున్నారంటూ కొద్దిరోజులుగా జరుగుతున్న ప్రచారం వాస్తవమేనని దీనితో తేలిపోయింది. అయితే అటు డీఎస్ కానీ, ఇటు టీఆర్ఎస్ నాయకత్వం కానీ ఆయన చేరికపై అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయలేదు. అయితే కాంగ్రెస్ను వీడుతున్నట్లుగా బుధవారం రాత్రే ఏఐసీసీ నాయకత్వానికి డీఎస్ ఒక లేఖను ఫ్యాక్స్ చేశారు. గురువారం ఉదయం ఆయన టీఆర్ఎస్లో చేరడంపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. కీలక పదవి ఇచ్చే అవకాశం: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రెండు పర్యాయాలు పీసీసీ చీఫ్గా పనిచేసిన డీఎస్కు టీఆర్ఎస్లో సముచిత స్థానమే దక్కనుంది. ఎమ్మెల్సీగా లేదా రాజ్యసభ సభ్యుడిగా ఆయనకు అవకాశం కల్పిస్తారని ప్రచారం జరుగుతున్నా... డీఎస్ స్థాయికి తగిన పదవి ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నారని పార్టీ వర్గాల సమాచారం. కేబినెట్ ర్యాంకు హోదా ఉన్న ప్రభుత్వ ముఖ్య సలహాదారు పదవిని ఆయనకు కట్టబెట్టే అవకాశమున్నట్లు తెలుస్తోంది. మరోవైపు స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిజామాబాద్ స్థానం నుంచి గెలిపించి ముఖ్యమైన శాఖలతో మంత్రి పదవి ఇవ్వనున్నారన్న ప్రచారమూ జరుగుతోంది. రుణం తీర్చుకుందాం! వాస్తవానికి నిజామాబాద్లో టీఆర్ఎస్ పూర్తి ఆధిక్యంలో ఉంది. ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ నుంచి డీఎస్ను తీసుకురావాల్సిన అవసరం లేదని ఆ జిల్లాకు చెందిన నేతలు సీఎం కేసీఆర్ ఎదుట వాదించారని సమాచారం. అయితే తెలంగాణ సాధనలో డీఎస్ కషిని విస్మరించలేమని, అన్నీ రాజకీయాల కోసమే చేయమని, కొన్ని విలువల కోసం చేస్తామని చెప్పి సీఎం వారిని బుజ్జగించినట్లు తెలుస్తోంది. తెలంగాణవాదిగా ముద్రపడి కాంగ్రెస్లో ఇబ్బందిపడిన డీఎస్ను దగ్గరకు తీసుకుంటే బాగుంటుందని కేసీఆర్ వ్యాఖ్యానించినట్లు సమాచారం. ఉద్యమకాలం నుంచి డీఎస్కు, కేసీఆర్కు సన్నిహిత సంబంధాలే ఉండడంతో అదిప్పుడు వారు కలసి పనిచేయడానికి ఊతమిచ్చిందని పేర్కొంటున్నారు. ఇదే దారిలో.. టీఆర్ఎస్లో చేరడానికి మరికొందరు నేతలు కూడా ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్కే చెందిన మాజీ మంత్రి సుదర్శన్రెడ్డి గులాబీ పార్టీలో చే రనున్నారని.. గత ఆరునెలలుగా ఆయన ఓ మంత్రి ద్వారా ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. ఇక హైదరాబాద్కు చెందిన కాంగ్రెస్ మాజీ మంత్రి దానం నాగేందర్, మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్గౌడ్ల పేర్లు కూడా వినవస్తున్నాయి. అయితే వీరెవరూ డీఎస్తో పాటు టీఆర్ఎస్లో చేరే జాబితాలో లేరని అంటున్నారు. నిజామాబాద్ కార్పొరేషన్లో కాంగ్రెస్కు 16 మంది కార్పొరేటర్లు ఉన్నారు. అందులో మెజారిటీ కార్పొరేటర్లు, ఓ జెడ్పీటీసీ సభ్యురాలు డీఎస్ వెంట గులాబీ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉంది. నన్ను అవమానించారు... సోనియాగాంధీకి డీఎస్ లేఖ తాను జీవితాంతం కాంగ్రెస్లోనే కొనసాగాలనుకున్నా.. పార్టీలోని పరిణామాలతో కొనసాగలేకపోతున్నానని పేర్కొంటూ ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీకి డి.శ్రీనివాస్ ఒక లేఖ రాశారు. పార్టీని వీడుతున్న పరిస్థితులు, తనకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ బుధవారం రాత్రే ఈ లేఖను ఫ్యాక్స్ చేశారు. ‘తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడంలో కాంగ్రెస్దే కీలకపాత్ర. రాష్ట్రం ఇచ్చిన ఘనతను గత ఎన్నికల్లో ఉపయోగించుకోలేకపోయాం. దానికి కారణం మీ చుట్టూ చేరిన నాయకుల తప్పుడు సలహాలు. కొందరు స్వార్థపరులు అసూయతో చేసిన ఫిర్యాదులతో నావంటి నిజాయితీ కలిగిన నాయకులను అవమానించారు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు, నిజాయితీ కలిగిన వారిని, అనుభవమున్న నాయకులను అంతర్గతంగా ఇబ్బందులు పెడుతున్నారు..’’ అని ఆ లేఖలో డీఎస్ పేర్కొన్నారు. తెలంగాణ ఇవ్వడంతో కాంగ్రెస్కు ఈ ప్రాంతంలో ఎదురే ఉండదని విశ్వసించామని, పొన్నాల లక్ష్మయ్య వంటి బలహీనమైన నాయకుడికి టీపీసీసీ పదవి ఇవ్వడంతో నష్టపోయామన్నారు. పార్టీలో విద్యార్థి దశ నుంచి అంకితభావంతో, నిజాయితీతో పనిచేస్తున్న తనను పక్కనబెట్టి ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు పెద్దపీట వేశారని ఆరోపించారు. ‘జానారెడ్డి, జీవన్రెడ్డి వంటి నేతలు టీడీపీ నుంచి వచ్చారు. జైపాల్రెడ్డి జనతాదళ్లో ఉన్నప్పుడు తిట్టిన తిట్లు తక్కువేమీ కాదు. అలాంటి నాయకులకు ఉన్నత పదవులు కట్టబెడుతూ.. నాలాంటి నేతలను అవమానించారు. పార్టీ కష్టకాలంలో ఉన్న ఈ సమయంలో నాకు ఎమ్మెల్సీ పదవిని ఇవ్వలేదు. పదవిని ఆశించిన నాకు కనీస సమాచారం ఇవ్వకుండా వేరొకరిని ఎంపిక చేశారు. ఆ తరువాతా నాతో ఎవరూ మాట్లాడలేదు. అంతకుముందు శాసనమండలిలో ప్రతిపక్షనేతగా అవకాశం ఇవ్వడంలోనూ చాలా ఇబ్బందులు పెట్టారు. తర్వాత షబ్బీర్ అలీని ఎంపిక చేయడంలోనూ దిగ్విజయ్సింగ్ అప్రజాస్వామికంగా వ్యవహరించారు. దిగ్విజయ్ నాపై కక్షగట్టారు. పార్టీలో రాహుల్గాంధీ శకం నడుస్తున్నది. రాహుల్ శకంలో రాజు, రావులదే హవా నడుస్తోంది. ఇలాంటి అవమానకర పరిస్థితుల్లో పార్టీలో కొనసాగలేక, బాధాతప్త హదయంతో పార్టీని వీడుతున్నా..’’ అని డీఎస్ ఆ లేఖలో పేర్కొన్నారు. నేడు రాజీనామా ప్రకటన.. డి.శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీకి తన రాజీనామాను గురువారం ఉదయం 11 గంటలకు ప్రకటించే అవకాశం ఉంది. రాజీనామా చేయడానికి కారణాలను, టీఆర్ఎస్లో చేరాలనే నిర్ణయం తీసుకోవడానికి దారితీసిన పరిస్థితులను ఒక బహిరంగ లేఖలో వివరించనున్నారు. సీఎం కేసీఆర్ కనుసన్నల్లో రూపొందిన ఆ బహిరంగ లేఖను ఉదయం విడుదల చేయనున్నారు. -
బీజేపీలో చేరిన కిరణ్ బేడీ
న్యూఢిల్లీ : మాజీ ఐపీఎస్ అధికారిణి కిరణ్ బేడీ చేరికతో బీజేపీకి మరింత బలం పెరిగిందని ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా వెల్లడించారు. న్యూఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. ఢిల్లీ సీఎం ఎవరనేది పార్లమెంటరీ బోర్డు నిర్ణయిస్తుందని తెలిపారు. గురువారం న్యూఢిల్లీలో అమిత్ షా సమక్షంలో కిరణ్ బేడీ కాషాయం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కిరణ్ బేడీ మాట్లాడుతూ... మోదీ పాలన తనలో స్పూర్తి నింపిదని ఆమె తెలిపారు. తానేప్పుడు పదవుల కోసం పని చేయడం లేదని ... తన జీవితం దేశానికే అంకితమని ఆమె స్పష్టం చేశారు. పోలీసు శాఖలో ఉన్నతాధికారిగా తన 40 ఏళ్ల అనుభవాన్ని ఢిల్లీ ప్రజలకు అర్పించేందుకే వచ్చానని కిరణ్బేడీ ఈ సందర్భంగా వెల్లడించారు. -
రఘునందన్కాంగ్రెస్ గూటికి
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: టీఆర్ఎస్ జిల్లా మాజీ అధ్యక్షుడు ఎం.రఘునందన్రావు మంగళవారం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఢిల్లీలో సీఎం కిరణ్కుమార్రెడ్డి సమక్షంలో చేరారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్ పార్టీ కండువా కప్పి రఘునందన్ను కాంగ్రెస్లోకి ఆహ్వానించారు. సీఎం కిరణ్కు అత్యంత సన్నిహితుడు, ఎమ్మెల్సీ మాఘం రంగారెడ్డి మధ్యవర్తిత్వంతో రఘునందన్రావు కాంగ్రెస్లో చేరినట్టు సమాచారం. జిల్లాకు చెందిన మరో ఇద్దరు టీఆర్ఎస్ నేతలు కూడా త్వరలో కాంగ్రెస్లో చేరతారని రఘునందన్రావు తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో ఎవరా ఇద్దరు నేతలు అనే విషయం ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్లో చేరిన తరువాత రఘునందన్రావు ఢిల్లీ నుంచి ‘సాక్షి’తో ఫోన్లో మాట్లాడుతూ ప్రొఫెసర్ జయశంకర్ ఆలోచన మేరకు పార్టీ జెండాలు పక్కన పెట్టి ఉద్యమించి తెలంగాణ సాధించుకున్నట్టు తెలిపారు. తెలంగాణ ఇస్తే కాంగ్రెస్ చేతులను బలోపేతం చేయాలని కేసీఆర్ గతంలోనే అన్నారని ఆయన గుర్తుచేశారు. అందులో భాగంగానే తాను కాంగ్రెస్లో చేరినట్టు వెల్లడించారు. విజయశాంతి చేరికపై నిరసన గళం.. టీఆర్ఎస్ బహిష్కృత ఎంపీ విజయశాంతి కాంగ్రెస్లో చేరికపై ఆ పార్టీలో నిరసన గళం వినిపిస్తోంది. విజయశాంతి పార్టీలో చేరితే వచ్చే ఎన్నికల్లో తమ గెలుపు అవకాశాలు దెబ్బతింటాయని జిల్లాకు చెందిన అధికార పార్టీ నేతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇదే అంశంపై జిల్లాకు చెందిన పలువురు కాంగ్రెస్ కీలక నేతలు మంగళవారం ఢిల్లీలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఎంపీపై తీవ్ర వ్యతిరేకత నెలకొందని, అది పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల విజయావకాశాలను దెబ్బ తీస్తుందని దిగ్విజయ్కు ఫిర్యాదు చేసేం దుకు నేతలు సిద్ధమవుతున్నారు. ఒకటి,రెండు రోజుల్లో ఇదే అంశంపై దిగ్విజయ్తో ప్రత్యేకంగా భేటీ అవుతామని కాంగ్రెస్ కీలక నేత ఒకరు స్పష్టం చేశారు. కాంగ్రెస్లో చేరికపై సోమవారం దిగ్విజయ్ సింగ్తో భేటీ అయిన విజయశాంతి మంగళవారం ఆంటోనీ కమిటీ సభ్యుడు వీరప్ప మొయిలీని కూడా కలిశారు. రాష్ట్ర విభజన ద్వారా సీమాంధ్రుల్లో నెలకొన్న అపోహలు, భయాలు, వాటిని తొలగించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై మొయిలీకి విజయశాంతి నివేదిక సమర్పించినట్టు విశ్వసనీయ సమాచారం.