Ketto
-
ఒకప్పుడు పండ్లు అమ్ముకుంటూ బతికాడు.. సినిమాల్లోకి వచ్చాక..
రజనీకాంత్ నేరుగా సినిమాల్లోకి రాలేదు. ముందు బస్ కండక్టర్గా పని చేశాడు, తర్వాత సినిమాల్లోకి వచ్చి సూపర్స్టార్గా ఎదిగాడు. బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ కూడా మొదట్లో ఫుడ్ స్టాల్లో పని చేశాడు. మోడలింగ్ చేస్తూ చిన్నా చితకా పాత్రలు పోషిస్తూ నేడు స్టార్ హీరో స్థాయికి ఎదిగాడు. అలా చాలామంది సినిమాల్లోకి రావడానికి ముందు అనేక పనులు చేశారు. ఇప్పుడు చెప్పుకునే వ్యక్తి కూడా మొదట్లో పండ్లు అమ్మాడు. ఆ తర్వాతే ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. ఇప్పుడు కోట్లు విలువ చేసే కంపెనీ నడుపుతున్నాడు. అతడే కునాల్ కపూర్. సినిమాకే అంకితమయ్యేవాడిని.. కునాల్ 18 ఏళ్ల వయసులో పండ్లు అమ్మేవాడట. ఈ విషయాన్ని అతడే గతంలో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. 'ఒక్కసారి నేను సినిమా ఒప్పుకున్నాక.. అబ్బా, ఇది చేయకుండా ఉంటే బాగుండేది అని ఎన్నడూ అనుకోలేదు. సినిమాకే అంకితమయ్యేవాడిని. ఏదో ఒక పని చేయాలనుకుంటే సినిమాల్లోకి రాకముందు ఎలాగైతే పండ్లు ఎగుమతి చేసేవాడినో అదే పని కొనసాగించేవాడిని. ఇంకా చెప్పాలంటే ఇప్పుడున్న డాలర్ రేటుతో పోలిస్తే ఈ వ్యాపారం మరింత లాభాలు తెచ్చిపెడుతుంది. కానీ నాకు సినిమా అంటేనే ఇష్టం' అని చెప్పాడు. అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి నటుడిగా.. 'అక్స్' అనే మూవీతో అసిస్టెంట్ డైరెక్టర్గా కెరీర్ మొదలుపెట్టాడు కునాల్. తర్వాత నసీరుద్దీన్ షా నడిపిన యాక్టింగ్ స్కూల్లో శిక్షణ తీసుకున్నాడు. 'మీనాక్షి: ఎ టేల్ ఆఫ్ త్రీ సిటీస్' అనే సినిమాలో తొలిసారి నటించాడు. తనకు గుర్తింపు తెచ్చిపెట్టిన సినిమా 'రంగ్దే బసంతి'. ఈ మూవీలో అవినీతికి వ్యతిరేకంగా పోరాడే కాలేజీ విద్యార్థిగా నటించాడు. ఈ సినిమా తర్వాత అతడు అవకాశాల కోసం వెంపర్లాడే పనిలేకుండా పోయింది. ఆయనను వెతుక్కుంటూ బోలెడన్ని ఛాన్సులు వచ్చిపడ్డాయి. డాన్ 2, ఆజ నచ్లే, బచ్నాయే హసీనో, డియర్ జిందగీ.. ఇలా ఎన్నో హిట్ చిత్రాల్లో నటించాడు. ఎంతోమంది ప్రాణం నిలబెట్టిన 'కెట్టో' ఈయన కేవలం నటుడు మాత్రమే కాదు ఓ ఎంటర్ప్రెన్యూర్ కూడా! క్రౌడ్ ఫండింగ్ ప్లాట్ఫామ్ కెట్టో స్థాపకుల్లో ఈయన ఒకరు. కెట్టో అనేది.. ఆపదలో ఉన్నవారి కోసం విరాళాలు సేకరించే ప్లాట్ఫామ్. 2012లో జహీర్ అదెన్వాలా, వరుణ్ సేత్లతో కలిసి కునాల్ ఈ కెట్టోను ప్రారంభించాడు. ఇది ఎంత బాగా హిట్టయిందంటే.. ఇప్పటివరకు రూ.1249 కోట్ల విరాళాలాను సేకరించి ఎంతోమంది ప్రాణాలు కాపాడింది. ఈ ప్లాట్ఫామ్ వల్ల సంస్థ వ్యవస్థాపకులకు దాదాపు రూ.110 కోట్ల మేర ఆదాయం వచ్చినట్లు కథనాలు వెలువడ్డాయి. కాగా కునాల్ కపూర్.. బిగ్బీ అమితాబ్ బచ్చన్కూ బంధువే! అమితాబ్ సోదరుడు అజితాబ్ కూతురు నైనాను కునాల్ పెళ్లాడాడు. అలా వరుసకు అమితాబ్కు అల్లుడయ్యాడు. కునాల్ చివరగా ద ఎంపైర్ అనే వెబ్ సిరీస్లో కనిపించాడు. చదవండి: ఆ దర్శకుడు నేను సినిమాల్లోకి పనికి రానన్నాడు.. ఇప్పుడు రెండు చోట్లా.. -
మీరే దిక్కు.. ప్లీజ్.. కాపాడరూ...!
‘‘ఇప్పుడే మనలోకంలోకి అడుగుపెట్టిన చిన్నారి లేత గుండెలో సమస్యలు ఉన్నాయంటే ఆ ఆవేదనకు అంతుండదు. వంశాంకురంలో తలెత్తిన ఆ గుండె జబ్బు తీరని శోకాన్ని తెచ్చిపెడుతుంది. ఇప్పుడు నేను అదే బాధను అనుభవిస్తున్నా. మా కలల పంటగా పుట్టిన నా పసి బిడ్డ లేత గుండెకు 6 నెలల వయస్సులో అనారోగ్యానికి గురైందని తెలిసి నా గుండెపగిలిపోయింది. సింగిల్ పేరెంట్గా నా బిడ్డను కాపాడుకునేందుకు అప్పోసప్పో చేసి ట్రీట్మెంట్ ఇప్పించా. కానీ ఇప్పుడు పరిస్థితి నా చేయి దాటిపోయింది. 16 ఏళ్ల వయస్సున్న నా కుతురు బాధపడని రోజు లేదు.. ఆమె బాగుండాలని ప్రార్థించిన నామొర ఆ భగవంతుడు వినలేదు. నా పాప జీవితం మీ చేతుల్లో ఉంది రక్షించరూ...’’అంటూ వేడుకుంటోంది ఓ మాతృమూర్తి. అందరిలాగే కలల పంటగా పుట్టిన తెరిమెల్ల భవానీ మన లోకంలోకి పసిబిడ్డ అడుగుపెట్టిన 6 నెలల వయస్సులో గుండెలో స్టెనోసిస్ అనే సమస్య తలెత్తింది. శరీరంలోని మెదడు, మూత్రపిండాలు సహా కీలక అవయవాలకు రక్త సరఫరాను ప్రభావితం చేసే బృహద్ధమనిలో గొట్టం ఉంటుంది. ఆ గొట్టం ద్వారా గుండె నుంచి రక్తం శరీరంలోని వివిధ అవయవాల్లోకి వెళ్లాలి. తిరిగి వెనక్కి రాకూడదు. ఎప్పుడైతే రక్తం సరఫరా అయ్యే ఆ గొట్టం సన్నబడుతుందో గుండె పనితీరు మందగిస్తుంది. భవానీ ఇదే బాధను అనుభవిస్తోంది. 6 నెలలున్న వయస్సు నుంచి 16 ఏళ్ల వయస్సు వచ్చే వరకు గుండెలో సమస్యతో పోరాడుతోంది. 👉 మీవంతు సాయం అందించేందుకు ఇక్కడ క్లిక్ చేయండి భవానీ జబ్బును నయం చేసేందుకు అహోరాత్రులు శ్రమించి చికిత్స చేయించింది తల్లి. ఉన్న ఇల్లు వాకిలి అన్నీ అమ్ముకొని వైద్యానికి ఖర్చు పెట్టింది. కానీ ఇపుడు పరిస్థితి రోజు రోజుకు క్షీణిస్తూ చేయి దాటిపోతోంది. చేతిలో చిల్లిగవ్వలేదు. కుమార్తె ఆరోగ్యం కుదుట పడాలంటే గుండెకు ఆపరేషన్ చేయాలి..అందుకు అక్షరాలరూ.5 లక్షలు ఖర్చవుతుందని వైద్యులు తేల్చారు. ఇక వేరే మార్గం లేక తన బిడ్డను కాపాడమని దాతలను అర్థిస్తోంది. 10వ తరగతి పూర్తి చేయబోతుండగా అధ్వాన్నంగా మారిపోతున్న కూతురి భవాని పరిస్థితి చూసి తల్లిమనసు తల్లడిల్లి పోతోంది. ఎలాగైనా తన బిడ్డ చదువు పూర్తి చేసి జీవితంలో విజయం సాధించాలని ఆశిస్తోంది. అందుకే తమ కుమార్తును రక్షించుకునేందుకు శతవిధాలా పోరాడుతోంది. దయచేసి తమ కుమార్తె వైద్య కోసం చేయాలని దాతలను వేడుకుంటోంది. (అడ్వర్టోరియల్) 👉 మీవంతు సాయం అందించేందుకు ఇక్కడ క్లిక్ చేయండి -
కేన్సర్ అంటే ఏంటో కూడా తెలియదు..కానీ నా మనోజ్
కిల కిల నవ్వులతో ఇల్లంతా సందడి చేసే చిన్నారి అకస్మాత్తుగా అనారోగ్యానికి గురైతే ఆ కుటుంబమంతా తల్లడిల్లిపోతుంది. అలాంటిది స్కూలుకు వెళ్లి స్నేహితులతో చదువు, ఆటపాటలతో ఉల్లాసంగా ఉండాల్సిన కుమారుడు కేన్సర్ లాంటి ప్రాణాంతకమైన వ్యాధి బారిన పడితే ఆ తల్లిదండ్రులు నిలువునా వణికిపోతారు. గౌతమి, ఆమె భర్త పరిస్థితి ఇలాంటిదే. గౌతమి కుమారుడు మనోజ్కు ఇపుడు అయిదేళ్లు. ముందు తరచుగా జ్వరం వచ్చేది. ఆ తరువాత ఏం తిన్నా వాంతులు చేసుకుంటూ ఉండేవాడు. సాధారణ చికిత్సం చేసినా ప్రయోజనం లేకపోయింది. దీంతో మనోజ్పేరెంట్స్ మల్టీ-స్పెషాలిటీ హాస్పిటల్కు తరలించారు. మనోజ్కి హాడ్జికిన్స్ లింఫోమా ఉన్నట్లు ఈ ఏడాది జూన్లో వైద్యులు నిర్ధారించారు. దీని చికిత్సయ్యే ఖర్చు కూడా ఖరీదైనదే తేల్చారు. మనోజ్ చికిత్సకు రూ. 5 లక్షలు (6114.87 డాలర్లు) కావాలని అంచనా వేశారు. దీనికి తోడు మనోజ్ మెడ, కడుపు ప్రాంతంలో గడ్డలు కూడా మొదలు కావడంతో కన్న వారి ఆందోళన మరింత తీవ్రమైంది. 👉 మీవంతు సాయం అందించేందుకు ఇక్కడ క్లిక్ చేయండి ఆరు నెలలకు పైగా కేన్సర్తో పోరాడుతున్న మనోజ్ను దక్కించుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. అందుకే తమ బిడ్డ ప్రాణాలను రక్షించాలని కాపాడుకునేందుకు దాతలను ఆశ్రయించారు. రోజువారీ కూలీగా పనిచేసే గౌతమి భర్త సంపాదన కుటుంబ పోషణకు అక్కడిక్కడే సరిపోతుంది. ఇంక ఖరీదైన వైద్యం వారి తలకు మించిన భారం. అయినా శాయశక్తులా బిడ్డ చికిత్సకు ఖర్చుపెట్టారు. మనోజ్కి మరికొన్ని రౌండ్లు క్యాన్సర్ థెరపీ చేస్తే, నయమవుతుందని డాక్టర్లు చెప్పడంతో పెద్దమనసుతో దాతలిచ్చే విరాళాల కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ‘‘మాది గ్రామీణ నేపథ్యం. అసలు కేన్సర్ అంటే ఏమిటో మాకు తెలియదు. కానీ ఆ మాయదారి రోగం నా బిడ్డను వేధిస్తోంది. మనోజ్ లేత చేతికి ఇంజక్షన్ గుచ్చు తున్నపుడు మొదటిసారి వాడి కళ్లల్లో నీళ్లు చూసి నా ప్రాణం విలవిల్లాడిపోయింది. వాడి బాధ చూస్తోంటే కడుపు తరుక్కు పోతోంది. అందుకే నా మనోజ్కు దీర్ఘాయుష్షునిచ్చేందుకు నా శక్తికి మించి చేయాలనుకుంటున్నాను. ఇంత చిన్నవయసులో మనోజ్ పడుతున్న కష్టాన్ని చూడలేకపోతున్నా. దయచేసిన నా బిడ్డకు ప్రాణ భిక్ష పెట్టండి అంటూ కన్నీళ్లతో ప్రార్థిస్తోంది గౌతమి. (అడ్వర్టోరియల్) 👉 మీవంతు సాయం అందించేందుకు ఇక్కడ క్లిక్ చేయండి -
ట్విన్స్ పుట్టారన్న ఆనందం మాయదారి రోగంతో మాయం, 17 ఏళ్లొచ్చినా!
17 ఏళ్లు అయినా ఇంకా పసిపిల్లల్లా పాకుతూనే ఉన్న కన్నబిడ్డల్ని చూసి తల్లిడిల్లిపోతున్న తల్లితండ్రుల ఆవేదన ఇది.. ‘మేమిద్దరం మాకిద్దరం’ అన్నట్టుగా ఇద్దరు కవల పిల్లలతోపాటు నలుగురు కుటుంబ సభ్యులూ హ్యాపీగా జీవితాన్ని గడుపుతున్నారు. కానీ మాయదారి వ్యాధి వారి జీవితాల్లో కల్లోలం నింపింది. దీంతో తమ కన్నబిడ్డల్ని ఎలాగైనా కాపాడుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. దామోదరన్, అతని భార్యకు ఇద్దరు మగపిల్లలు కవలలుగా జన్మించారు. వారికి అల్లారుముద్దుగా రామర్ , లక్ష్మణన్ అని పేరు పెట్టుకున్నారు. పుట్టిన కొన్ని నెలల వరకు కుటుంబం అంతా ఆనంద క్షణాలను ఆస్వాదించారు. కానీ.. నెలలు పెరిగే కొద్దీ తమ బిడ్డల్లో ఎదుగుదల లోపం ఉన్నట్టు గుర్తించారు. సరైన చికిత్స అందించేందుకు ఎన్నో ఆస్పత్రులు చుట్టూ తిరిగారు. చివరికి వైద్యులు చెప్పిన సంగతి విని దామోదరన్ దంపతులు నిలువునా కుంగిపోయారు. భవిష్యత్తు భయంకరంగా తోచి వణికిపోయారు. ‘స్పాస్టిక్ డిప్లెజియా’ అనే అరుదైన వ్యాధి కారణంగానే వారికిలా జరుగుతోందని వైద్యులు నిర్ధారించారు. స్పాస్టిక్ డిప్లెజియా సెరిబ్రల్ పాల్సీ చిన్నపిల్లల్లో మెదడుకు వచ్చే అరుదైన పక్షవాతం. బాల్యంలో లేదా చిన్నతనంలో ఈ వ్యాధి కనిపిస్తుంది. ఇది కండరాల నియంత్రణ , సమన్వయాన్ని శాశ్వతంగా ప్రభావితం చేస్తుంది. మెదడు ఎదుగుదల సరిగా లేకపోవడం వల్లనే చూపు కూడా మందగించింది. వారి స్వంతంగా ఏమీ చేసుకోలేకపోతున్నారు. నడవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. కవలలకు చికిత్సకు రూ. 6,00,000 ($7359.03) ఖర్చవుతుందని వైద్యులు చెప్పడంతో దామెదరన్ దంపతులు ఆందోళనలో పడిపోయారు. 65 ఏళ్ల రోజుకూలీగా పనిచేస్తున్న దామోదరన్ కూడా కొన్ని అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. అయినా ఉన్నదంతా తెగనమ్మి బిడ్డలకు వైద్యం చేయించారు. చికిత్స కోసం ఆసుపత్రుల చుట్టే తిరుగుతుండటంతో ఉన్న ఆ కాస్త రాబడి కూడా లేదు. మరోవైపు అప్పులు, వైద్య బిల్లులు కొండలా పేరుకు పోయాయి. ఈ నేపథ్యంలో దాతలు పెద్దమనసుతో తమను ఆదుకోవాలని కోరుతున్నారు దామోదరన్ దంపతులు. రోజులు గడిచే కొద్దీ, నిమిష నిమిషానికీ తమ బిడ్డల పరిస్థితి దారుణంగా మారుతోందని కన్నీరుమున్నీరవుతున్నారు. తమ కవల పిల్లలైన రామర్, లక్ష్మణన్ కోలుకోవాలంటే మీ ఆదరణే దిక్కు. దయచేసి పిల్లలను రక్షించడంలో మాకు సహాయం చేయమనివారు ప్రార్థిస్తున్నారు. (అడ్వర్టోరియల్) 👉 మీవంతు సాయం అందించేందుకు ఇక్కడ క్లిక్ చేయండి -
కవల పిల్లలని ఎంతో సంబరపడ్డా, కానీ.. నా పిల్లలను ఆదుకోండి.. ప్లీజ్!
ఐదేళ్లుగా పిల్లల కోసం ఎంతగానో పరితపించిన దంపతులకు ఎట్టకేలకు మోక్షం కలిగింది. ఆస్పత్రులు చుట్టూ తిరిగి మందులు వాడగా.. ఆమె గర్భవతి అయ్యింది. ట్విన్స్ అని తెలిసి ఆ దంపతుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఆరు నెలలకే ఆమె బిడ్డలకు జన్మనిచ్చింది. ఆ తర్వాత ఏమైందంటే.. మాతృత్వపు మాధుర్యాన్ని తలచుకుంటూ.. తొమ్మిది నెలల భారాన్ని ఆనందంగా అనుభవించి.. బిడ్డకు జన్మనివ్వాలని అనుకున్నాను. కానీ నేను అమ్మ తనం కోసం ఐదేళ్లు ఎదురు చూశా. దేవుడు కరుణించడంతో గర్భం దాల్చాను. అయితే గర్భవతిగా ఉన్న నాకు ఓ రోజు ఉదయం నాకు పురిటి నొప్పులు మొదలయ్యాయి. అత్యవసర చికిత్స కోసం ఆస్పత్రికి వెళ్లగా.. వైద్య పరీక్షలు చేసి ఉమ్మనీరు తగ్గిందని, వెంటనే డెలివరీ చేయాల్సి ఉంటుందని డాక్టర్లు చెప్పిన విషయాన్ని అన్బుకరసి గుర్తు చేసుకున్నారు. మీవంతు సాయం అందించేందుకు ఇక్కడ క్లిక్ చేయండి 26 వారాల గర్భిణీ స్త్రీగా ఉన్న నాకు డాక్టర్లు ప్రీ మెచ్యూర్ డెలివరీ చేశారు. ప్రీ మెచ్యూర్ డెలివరీ కారణంగా పుట్టిన కవలలకు శ్వాసకోశ సంబంధిత సమస్యలు ఏర్పడ్డాయి. దీంతో అప్పటి నుంచి వాళ్లిద్దరూ ఎన్ఐసీయూలో చికిత్స పొందుతున్నారు.పిల్లలు ట్వీట్మెంట్కు సహకరిస్తున్నారని, సురక్షితంగా బయటపడాలంటే మరికొన్ని నెలలు ఎన్ఐసీయూలోనే చికిత్స పొందాల్సి ఉంటుందని డాక్టర్లు చెప్పారు. ఖరీదైన వైద్యం కోసం రూ.20 లక్షలు ఖర్చువుతుంది. చాలీ చాలని జీతాలతో బతుకు భారాన్ని మోస్తున్న మేం.. మా పిల్లల్ని రక్షించుకునేందుకు ఇల్లు వాకిలి అమ్ముకున్నాం. బ్యాంకు లోన్ తీసుకొని రూ.8 లక్షల వరకు ఖర్చు చేశాం. ఇప్పటి వరకు చేయాల్సిన వన్నీ చేశాం. మా పిల్లల ప్రాణాలు మీ చేతుల్లో ఉన్నాయి. చికిత్స కోసం తగినంత ఆర్ధిక సాయం చేయండి. మా పిల్లల ప్రాణాల్ని కాపాడండి. (అడ్వర్టోరియల్) మీవంతు సాయం అందించేందుకు ఇక్కడ క్లిక్ చేయండి -
అయ్యో! రామూ.. నీ జీవితం ఎందుకిలా మారిపోయింది?
నిర్జీవంగా పడి ఉన్న భర్త రామస్వామి మంచం పక్కనే వేయి కళ్లతో ఎదురు చూస్తోంది రాధమ్మ. ప్రతీక్షణం అతని పలకరింపు కోసం పడిగాపులు కాస్తోంది. కానీ అది జరగాలంటే అతనికి ఖరీదైన వైద్యం చాలా అవసరం. అందుకే దాతలు అదుకుని తన భర్త రామస్వామికి మంచి జీవితాన్ని ప్రసాదించమని కోరుతోందామె. దాతలు మంచి మనసుతో విరాళాలిచ్చి ఆరోగ్యవంతంగా తన భర్త రామూని తిరిగి ఇవ్వాలని కన్నీళ్లతో వేడుకుంటోంది. భార్యభర్తలుగా తమ కుటుంబం కోసం ఎన్నో కలలు కంటుంది ఏ జంట అయినా.. రాత్రి పగలు కష్టపడి తమను నమ్ముకున్న వారికి మంచి జీవితాన్ని ఇవ్వాలని ఆశిస్తారు. అలాంటి దంపతులే రాధమ్మ రామస్వామి. కానీ అనుకోని ప్రమాదం ఈ దంపతుల జీవితంలో నిప్పులు పోసింది. పనినుంచి క్షేమంగా ఇంటికి తిరిగి వస్తాడనుకున్న భర్త ప్రమాదానికి గురై అచేతనంగా పడి ఉండడాన్ని చూసి కుమిలిపోతోంది రాధమ్మ. అసలేం జరిగిందంటే.. ఎలక్ట్రీషియన్గా పనిచేసే రామస్వామి ఒకరోజు పనినుంచి ఇంటికి వస్తుండగా ప్రమాదానికి గురయ్యాడు. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించినప్పటికీ.. తీవ్ర గాయాలతో అతను అప్పటికే కోమాలోకి వెళ్లిపోయాడు. పలు పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు రామస్వామి పరిస్థితి విషమంగా ఉందని, అత్యవసరంగా పోస్ట్ ట్రామాటిక్ కేర్ బ్రెయిన్ సర్జరీ అవసరమవుతుందని చెప్పారు. అతడిని కాపాడేందుకు అదొక్కటే మార్గం అని కూడా వైద్యులు రాధమ్మకు తేల్చి చెప్పారు. ఈ చికిత్సకు దాదాపు 10 లక్షలు ($ 12853.88) అవుతుందన్నారు. దీంతో ఆమె దుఃఖంతో కుప్పకూలిపోయింది. నిరుపేద కుటుంబానికి ఆ ఖర్చును భరించడం చాలా కష్టం. అయినా అందిన చోటల్లా అప్పు తెచ్చి చికిత్స అందించారు. కానీ రామస్వామి పూర్తిగా కోలుకోవాలంటే ఆపరేషన్లు, కీలకమైన మందులు అవసరం. అందుకే నిస్సహాయస్థితిలో ఉన్న తనను ఆర్థికంగా ఆదుకోవాలని రాధమ్మ ఆకాంక్షిస్తోంది. తన భర్త రామస్వామికి కొత్త జీవితాన్ని ప్రసాదించేలా సాయం చేయమని కోరుతోంది. దాతల దాతృత్వమే తనకు రక్ష అని కన్నీటితో ప్రార్థిస్తోంది రాధమ్మ. మీ విరాళాలతో ఆమె కుటుంబాన్ని ఆదుకొని, రామస్వామికి మెరుగైన జీవితాన్ని ప్రసాదించండి! (అడ్వర్టోరియల్) 👉 మీవంతు సాయం అందించేందుకు ఇక్కడ క్లిక్ చేయండి -
అయ్యో..వైష్ణవీ..ఎంత కష్టం! కడుపు తరుక్కుపోతోంది!
తొలికాన్పులో పుట్టిన మగబిడ్డ సాత్విక్ అల్లారుముద్దుగా ఎదుగుతున్నాడు. ఈ క్రమంలో తమ కుమారుడికి బుజ్జి చెల్లాయిని ఇద్దామని కలలుకన్నారు. తమ కలల ప్రతిరూపంగా ఆడబిడ్డ వైష్ణవి ఇంటికి దేవతలా దిగిరావడంతో తమ అదృష్టానికి పొంగిపోయారు. కానీ వైష్ణవి ట్రీట్మెంట్ కోసం ఆస్పత్రుల చుట్టూ తిరిగాల్సి వస్దుందని అస్సలు అనుకోలేదు. ప్రస్తుతం బిడ్డను వేధిస్తున్న మాయదారి రోగాన్ని తలచుకుని తల్లడిల్లిపోతున్నారు కన్నవాళ్లు. బిడ్డకు సోకిన ఇన్ఫెక్షన్ను తన అజ్ఞానంతో నిర్లక్క్ష్యం చేశా.. లేదంటే తన పాప ఇంత దీనస్థితిలో ఉండేది కాదంటూ కంటికి ధారగా విలపిస్తున్న ఓ తల్లి ఆవేదన ఇది..! వివరాల్లోకి పరిశీలిస్తే.. ఏడాది వయసులోనే వైష్ణవి తీరని బాధతో విలవిల్లాడిపోతోంది. చిన్నగా మొదలైన ఇన్ఫెక్షన్ అటు బిడ్డకు, వారి తల్లి దండ్రులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. మూడు నెలల క్రితం, వైష్ణవి కుడికాలుపై చిన్న ఇన్ఫెక్షన్లా వచ్చింది. దాన్ని చూసిన తల్లి ఇవేవో మామూలు దద్దుర్లేలే....అవే పోతాయని అనుకుంది. ఎందుకంటే వైష్ణవి తల్లి, తండ్రి తారక్ది గ్రామీణ నేపథ్యం. ఆసుపత్రులు, వైద్యం, జబ్బులు, చికిత్సలపై వారికి పెద్దగా అవగాహన లేదు. ఫలితంగా చిన్నగా మొదలైన ఇన్ఫెక్షన్ బాగా ముదిరిపోయింది. చివరికి నొప్పితో బాధ పడుతున్న వైష్ణవిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. పాపను పరీక్షించిన వైద్యులు ఆపరేషన్ చేయాలని సూచించారు. దీంతో తల్లిడిల్లిన తారక్ దంపతులు అప్పుచేసి మరి ఆపరేషన్ చేయించినా దురదృష్టం వారిని వెంటాడింది. మూడు రోజుల తర్వాత డిశ్చార్జ్ అయిన వెంటనే సర్జరీ జరిగిన ప్రదేశంలో మళ్లీ మరింతగా ఇన్ఫెక్షన్ సోకింది. మళ్లీ ఆసుపత్రికి పరిగెత్తారు. పాప పూర్తిగా కోలుకోవాలంటే ఖరీదైన మందులు, చికిత్సఅవసరమని,ఇందుకు దాదాపు రూ. 7 లక్షలు (8762.92 డాలర్లు) అవుతాయని వైద్యులు తేల్చారు. ఇప్పటికే ఆసుపత్రుల చుట్టూ తిరిగేందుకు వైద్య ఖర్చుల నిమిత్తం, ఉన్న వ్యవసాయ భూమిని అమ్మేశారు. అప్పులు చేసి మరీ వైద్యం చేయించారు. ఇక అమ్ముకునేందుకు వారి దగ్గర ఏమీ మిగల్లేదు. అందుకే తన పాపను కాపాడుకునేందుకు దాతలు స్పందించి విరాళాలివ్వాలని ప్రార్థిస్తున్నారు. ‘‘నిండా ఏడాది కూడా నిండకుండానే ఇంత చిన్న వయసులో పాప అనుభవిస్తున్న కష్టం చూస్తే నా గుండె తరుక్కుపోతోంది. మాటలు రాని వైష్ణవి.. బాధను తట్టుకోలేక ‘మమ్మా...’ అని మూలుగుతోంటే నా ప్రాణాలు పోతున్నంత పని అవుతోంది. తల్లిగా, ఆ బాధను భరించలేక పోతున్నా. మా దగ్గర తాకట్టు పెట్టడానికి ఇక ఏమీ లేదు, మీ ఔదార్యం మాత్రమే మాకు రక్ష. దయచేసి నా చిన్నారి పాప ఆరోగ్యాన్ని కాపాడండి’’ అంటూ నీరు నిండిన కళ్లతో వేడుకుంటోంది తల్లి. (అడ్వర్టోరియల్) 👉 మీవంతు సాయం అందించేందుకు ఇక్కడ క్లిక్ చేయండి -
దేవుడా! మాకే ఎందుకు ఇలా జరుగుతోంది!!
పుట్టబోయే బిడ్డకోసం వేయికళ్లతో ఎదురు చూస్తుంది ఏ జంట అయినా. ముద్దులొలికే పసిపాప బోసి నవ్వుల కోసం కలలు కంటుంది. అయితే శ్రీలక్ష్మి, షణ్ముగం దంపతులు మాత్రం తీరని వ్యధలో కూరుకుపోయారు. ఊహించని కారణాలతో నెలలు నిండకుండానే పుట్టిన బిడ్డ ప్రమాదంలో పడిపోవడం వారికి కలచివేస్తోంది. చుట్టూ వైర్లతో, అతిసుకుమారమైన బిడ్డ ఒంటిపై సూదులతో ఆసుపత్రిలో బెడ్పై దయనీయ పరిస్థితిలో ఉన్న పసిబిడ్డను చూసి తల్లడిల్లి పోతున్నారు. ఏం జరిగిందంటే.. భార్య శ్రీలక్ష్మి గర్భం దాల్చడంతో షణ్ముగం చాలా హ్యాపీ ఫీలయ్యాడు. అయితే ఉన్నట్టుండి శ్రీలక్ష్మి కాలు వాచిపోయింది. ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా మారింది. దీంతో ఆందోళన చెందిన షణ్ముగం వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించాడు. శ్రీలక్ష్మిని పరీక్షించిన వైద్యులు వెంటనే డెలివరీ చేయకపోతే తల్లి పరిస్థితి విషమంగా మారే అవకాశం ఉందని సూచించారు. అలా నెలలు నిండకుండానే 25 వారాలకు బాబు పుట్టాడు. అదీ చాలా బలహీనంగా. నవజాత శిశువు త్వరగా కోలుకునేందుకు ఎన్ఐసీయూలో చేర్చి చికిత్స అందిస్తున్నారు వైద్యులు. అత్యవసర మందులు, ఇతర సప్లిమెంట్లను ఇస్తున్నారు. అయినా ఇంకొన్ని రోజులు పాటు మెరుగైన వైద్యం అందిస్తే తప్ప బాబుకు ప్రాణాపాయం తప్పదని వైద్యులు స్పష్టం చేశారు. ఈ చికిత్సను కొనసాగించడానికి అయ్యే ఖర్చు రూ. 8 లక్షలు ($ 10014.90). దీంతో శ్రీలక్ష్మి షణ్ముగం జంట ఆందోళనలో పడిపోయింది. ఎందుకంటే షణ్ముగం డెలివరీబాయ్ గా పనిచేస్తున్నాడు. మరోవైపు పోలియోతో దివ్యాంగురాలైన శ్రీలక్ష్మి ఒక ప్రైవేట్ సంస్థలో క్లర్క్గా పనిచేస్తోంది. వీరికొచ్చే ఆదాయం అంతంత మాత్రం. ఉన్నదంతా ఇప్పటికే ఆసుపత్రి ఖర్చుల నిమిత్తం వెచ్చించారు. ఇపుడు 8 లక్షలన్నమాటే వారికి పెద్ద ఆటంబాంబులా వినిపిస్తోంది. బంధువులు, స్నేహితులు కొంత సాయం చేసినప్పటికీ, ఫలితం లేదు. తమను ఆదుకునే వారే లేరా అంటూ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. దేవుడా మాకే ఎందుకు ఇన్ని కష్టాలని ఆవేదన చెందుతున్నారు. దయగల దాతలు ముందుకొచ్చి తమ బిడ్డను రక్షించాలని కోరుతున్నారు. తగిన సహాయం అందుతుందనే ఆశతో వారు రోజంతా ప్రార్థనలు చేస్తున్నారు. దయచేసి విరాళం అందించండి!! తమ నవజాత శిశువును కాపాడండి అని వేడుకుంటున్నారు. (అడ్వర్టోరియల్) 👉 మీవంతు సాయం అందించేందుకు ఇక్కడ క్లిక్ చేయండి -
'అయ్యో భగవంతుడా.. మేం ఏ పాపం చేశాం'!
పుట్టిన బిడ్డ పురిట్లోనే కన్నుమూస్తే ఆ తల్లి గర్భశోకం తీర్చలేనిది. అందులోనూ తొలిచూలు బిడ్డను కోల్పోయి, పుట్టెడు దుఃఖంలో ఉండగా ఆశలదీపంగా పుట్టిన మరో బిడ్డ కూడా ప్రాణాపాయంలో పడిపోతే..ఆ దంపతుల బాధ వర్ణనాతీతం. తన బిడ్డను కాపాడుకునేందుకు ఒక తల్లి పడుతున్న ఆవేదన ఇది!! తొలిసారి పుట్టిన కొడుకు చనిపోతే ఆ బాధను పంటి బిగువున భరించా. అయితే ఆదేవుడి దయ వల్ల మేఘనాథ్ రూపంలో మరో బిడ్డ పుట్టడంతో కొడుకును కోల్పోయామన్న బాధను మర్చిపోయాం. పొత్తిళ్లల్లోని మేఘనాథ్ స్పర్శతో అనిర్వచనీయమైన అనుభూతికి లోనయ్యా అలాకొన్ని రోజులు గడిచాయో లేదో.. నా ఆనందాన్ని చూసి విధికి కన్నుకుట్టిందేమో...మేఘనాథ్ అకస్మాత్తుగా అనారోగ్యానికి గురయ్యాడు. శరీరం, కళ్ళు పాలిపోయాయి. దీంతో ఈ బిడ్డనైనా కాపాడమని వేడుకుంటూ ఆస్పత్రికి పరుగెత్తా.. డాక్టర్లు పరీక్షలు చేశారు. అలా పరీక్షలు చికిత్సతో రోజులు గడుస్తున్నాయి. అయినా బాబు ఆరోగ్యంలో ఎలాంటి మార్పు కనిపించలేదు. పైగా పరిస్థితి చేయి దాటి పోతోందన్న ఆందళన కలిగింది. కడుపు ఉబ్బరంగా ఉండడంతో అనుమానం వచ్చి నేను నా భర్త వెంటనే మరో ఆస్పత్రికి తరలించాం. మరోసారి వైద్యులు టెస్ట్లు, స్క్రీనింగ్లు చేశారు. అనంతరం డాక్టర్లు పిడుగులాంటి వార్త చెప్పారు. పుట్టుకతోనే వచ్చే బిలియరీ అట్రేసియా అనే వ్యాధి బారిన పడ్డాడని చెప్పడంతో నా గుండె పగిలింది. నా బిడ్డ ప్రాణాలతో ఉండాలంటే కాలేయమార్పిడి చేయాల్సిందేనని వైద్యులు తేల్చి చెప్పారు. దీనికయ్యేమొత్తం ఖర్చు రూ. 18 లక్షలు ($ 22506.34). అయ్యో భగవంతుడా...పసిగుడ్డుకు ఎంత కష్టం వచ్చింది. దీనికి మందేలేదా అని ఇద్దరమూ కంటికి మిన్నగా రోదించాం. అయితే కాలేయ మార్పిడి ఈ సమస్యకు పరిష్కారమని, డోనర్లు దొరికితే నా కొడుకు ప్రాణాలు కాపాడతామని డాక్టర్లు చెప్పారు. నా ప్రాణం పోయినా సరే నా బిడ్డను బ్రతికించుకోవాలని నిశ్చయించుకున్నా. నా లివర్ను దానం చేయడానికి నేను సిద్ధం. కానీ నిరుపేదలమైన మాకు ఈ మొత్తం ఖర్చు భరించే శక్తి లేదు. అందుకే మీ సాయం కోసం అభ్యర్థిస్తున్నా. తొలిసారి నెలలు నిండకుండానే పుట్టిన మగబిడ్డను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్నా. మరోసారి ఈ కడుపు శోకాన్ని భర్తించే శక్తి నాకు లేదు. మేఘానంద్కు ఆరోగ్యం బాగాలేదని చెప్పిన నాటి నుంచి వాడి ప్రాణాల్ని కాపాడుకునేందుకు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నా. వైద్యం కోసం ఇల్లు వాకిలి అన్నీ అమ్మేశా. పెట్రోల్ బంకులో పనిచేసే నా భర్త చాలీ చాలని జీతంతో ఇంటిని వెళ్లదీస్తున్నాం. ఈ పరిస్థితుల్లో మేఘనాధ్కు ట్రీట్మెంట్ చేయించలేక ప్రతీ రోజూ నరకం అనుభవిస్తున్నాం. అందుకే మేఘనాథ్ ఆరోగ్యంగా ఉండేందుకు సాయం చేయమని ప్రార్థిస్తున్నాను. దయచేసి సాయం చేయండి. నా మేఘనాధ్కు ప్రాణ భిక్ష పెట్టమని కన్నీళ్లతో వేడుకుంటున్నా. (అడ్వర్టోరియల్) 👉 మీవంతు సాయం అందించేందుకు ఇక్కడ క్లిక్ చేయండి -
లేక లేక ట్విన్స్ పుట్టారు..కానీ ఆ సంతోషం నిలవాలంటే!
ఆస్తికి పేదలైనా, అమ్మా, నాన్న అనిపించుకోవాలని ప్రతీ జంట కోరుకుంటుంది. అలా లేక లేక...ఏడేళ్ల ఎదురు చూపుల తరువాత గర్భం దాలిస్తే... అందులోనూ కడుపులో ఉన్నది ట్విన్స్ అని తెలిస్తే.. ఇంకా ఆనందం. కానీ ఫాతిమా, జునైద్ కథ వేరే..అదేంటో ఒకసారి చూద్దాం..! ఫాతిమా, జునైద్ ఇద్దరూ అన్యోన్య దంపతులు. పెళ్లి అయ్యి 7 సంవత్సరాలు గడిచినా పిల్లలు పుట్టకపోవడంతో ఆందోళన చెందారు. ఇక లాభం లేదు అని నిరాశపడుతున్న సమయంలో వారి ప్రయత్నాలు ఫలించి ఫాతిమా గర్భం దాల్చింది. దీంతో తమ ఆశలు నెరవేరబోతున్నందుకు, అందులోనూ కవలలకు జన్మనివ్వబోతున్నామని తెలిసి ఫాతిమా జునైద్ జంట ఆనందానికి అవధుల్లేవు. కానీ సరిగ్గా మూడు నెలలైనా తిరగకుండానే ఆ సంతోషం కాస్తా ఆందోళనగా మారిపోయింది. పిల్లల ఎదుగుదల సరిగ్గా లేదు. అబార్షన్ చేయించుకోవాలని వైద్యులు సూచించారు. అంతేకాదు గర్భాన్ని కొనసాగిస్తే తల్లికి కూడా ప్రమాదమని హెచ్చరించారు. అయినా ఫాతిమా, జునైద్ పెద్దసాహసమే చేశారు. ఎలాగైనా బిడ్డల్ని కనాలనే నిర్ణయించుకున్నారు. మొత్తానికి అలా ఎనిమిదినెలలు గడిచాయి. ఒకరోజు విపరీతమైన కడుపునొప్పితో ఫాతిమా ఇబ్బంది పడింది. ఆ తరువాత ఏం జరిగిందో తెలియదు. కళ్లు తెరిచి చూసేసరికి ఎదురుగా ఆందోళనగా భర్త. ‘‘ఏమైంది’’ అని అడిగింది విచారంగా ఫాతిమా..కవలబిడ్డల్ని తలుచుకుంటూ..‘‘థ్యాంక్ గాడ్..నీకు గండం గడిచింది ఆ దేవుడు దయ వల్ల అతికష్టంమీద నువ్వు ప్రాణాపాయం నుంచి బయటపడ్డావు. మనకి ఇద్దరు కొడుకులు ఫాతిమా’’ అని చెప్పాడు ఉబికివస్తున్న కనీళ్లను అదుముకుంటూ. ‘‘కానీ ఇద్దరు వెంటిలేటర్పై NICUలో ఉన్నారు.డాక్లర్లు ఇంకా ఏ విషయమూ చెప్పడం లేదు’’ అన్నాడు నీరు నిండిన కళ్లను తుడుచుకుంటూ. అలా దాదాపు నెల రోజులు గడిచిపోయింది. అయినా ప్రమాదం ఇంకా పూర్తిగా తొలగిపోలేదు. నెలలు నిండకుండా పుట్టడం వల్ల వచ్చిన సమస్యలతో పిల్లలు పూర్తిగా కోలుకోవాలంటే సుమారు 10 లక్షలు ($ 12506.89) ఖర్చవుతుందని వైద్యులు చెబుతున్నారు. ఇప్పటికే ఉన్నదంతా ఖర్చుపెట్టారు. జునైద్ నెల సంపాదన కేవలం 5 వేల రూపాయలుమాత్రమే. అయినా దాదాపు రెండు లక్షల వరకు ఖర్చుపెట్టారు. ఒకవైపు సమస్యలు రోజురోజుకు తీవ్రమవుతున్నాయి. మరోవైపు వైద్య ఖర్చులు భరించే శక్తి లేదు. అందుకే తన కుమారులను కాపాడుకునేందుకు దాతలు స్పందించాలని కన్నీళ్లతో వేడుకుంటున్నారు ఫాతిమా జునైద్ దంపతులు. ఇన్ని రోజులైనా బిడ్డలు ఇంకా కోలుకోలేదు.వారిని మనసారా గుండెలకు హత్తుకుని తడిమి చూసుకోలేదంటూ ఫాతిమా తల్లడిల్లిపోతోంది. నా కవల పిల్లల్ని కాపాడుకునేందుకు మీ మద్దతు చాలా అవసరం! దయచేసి నా కుటుంబాన్ని, నా మాతృత్వాన్ని, నా పిల్లలను రక్షించండి! వారి జీవితాలు మీచేతుల్లోనే.. దయచేసి మీకు వీలైనంత సాయం చేయండి అని ఫాతిమా ప్రార్థిస్తోంది. (అడ్వర్టోరియల్) మీవంతు సాయం అందించేందుకు ఇక్కడ క్లిక్ చేయండి -
నా కూతురే పెద్ద దిక్కనుకున్నా... ఇంతలోనే..!
కష్టాలు,కన్నీళ్లతో జీవితాన్ని అతి జాగ్రత్తగా నెట్టుకొస్తున్న కుటుంబానికి వరుసగా దెబ్బ మీద దెబ్బ కోలుకోలేని మరో దెబ్బ పడితే! కష్టసమయంలో ఫ్యామిలీగా అండగా ఉన్నవారే ఉన్నట్టుండి ప్రమాదంలో పడితే! ఆ ఇంట్లోని వాళ్లు అనుభవించే బాధ ఊహించడానికే కష్టం. లలిత మనీషా కష్టం అలాంటిదే! జీవన్మరణ పోరాట చేస్తున్న కన్న కూతురిని కాపాడుకునేందుకు అష్టకష్టాలుపడుతూ..దాతలు స్పందించాలని వేడుకుంటున్న కన్నతల్లి గాథ ఇది!! 2008లో లలితషా భర్త బ్రెయిన్ హేమరేజ్తో చనిపోయారు. ఆర్థిక సంక్షోభానికి తోడు, చిన్నపిల్లలతో కుటుంబాన్ని ఎలాగోలా నెట్టుకొస్తోంది. ఈ క్రమంలో పెద్ద కుమార్తె ఏళ్ల మనీషా(22) ఎంతో కష్టపడి పీజీ పూర్తి చేసి ఉద్యోగాన్ని సంపాదించుకుంది. కుటుంబం బాధ్యతలను తన భుజాలపై వేసుకుంది. చిన్నతనంలోనే భర్తను పోగొట్టుకుని, అనేక కష్టాలుపడిన తనకు అంతకంటే చిన్నవయసులోనే పెద్దకుమార్తె చేతికి అందిరావడంతో పొంగిపోయింది. కానీ ఆ ఆనందం ఆమెకు ఎంతోకాలం నిలవలేదు ఈ ఏడాదిలో కొద్దిగా తలనొప్పి అనిపించింది మనీషాకు. పెద్దగా పట్టించుకోలేదు యథావిధిగాగా డ్యూటీకి వెళ్లిపోయింది. తర్వాత అదికాస్తా మరింత తీవ్రమై గత ఏప్రిల్లో స్పృహ కోల్పోవడంతో ఆసుపత్రికి తరలించారు. ఆమెకు మెదడులో రక్తస్రావమై, గడ్డ కట్టినట్లు పరీక్షల్లో తేలింది. వైద్యులు ఎంఆర్ఐ, రక్తపరీక్షలు, సీటీ స్కాన్లు నిర్వహించి మనీషాకు మెదడుకు సంబంధించిన వ్యాధి ఉన్నట్లు నిర్ధారించారు. తక్షణమే అత్యవసర శస్త్రచికిత్స నిర్వహించారు. ఈ క్రమంలో పక్షవాతానికి గురైన మనీషా మాట్లాడలేని, చూడలేని దీనస్థితికి చేరుకుంది. మెదడులో రక్తం గడ్డ కట్టడంతోపాటు, నీరు కూడా చేరడంతో తలంతా ఉబ్బిపోయింది. చివరికి, మనీషా బతకాలంటే న్యూరో సర్జరీ అవసరమని వైద్యులు తేల్చేశారు. దీనికయ్యే ఖర్చు రూ. 7,41,200 ($ 9291.25)గా అంచనా వేశారు. అయితే మనీషా వైద్యం కోసం నగలు అమ్మేశారు లలిత షా. దొరికిన చోటల్లా శక్తికిమించి అప్పు చేసి ఇప్పటికే రూ. 10లక్షలు దాకా ఖర్చు చేశారు. ఫలితంగా అప్పుల ఊబిలో కూరుకుపోయిన లలిత కుటుంబానికి ఇక వైద్య ఖర్చులు భరించే శక్తి లేదు. అందుకే దాతలే కరుణించి తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. "ప్రతి సెకనుకి నా బిడ్డ పరిస్థితి క్షీణిస్తోంది. సరిగ్గా చూడలేక నోరారా మాటకు నోచుకోకుండా పడివున్న నా కుమార్తెను చూస్తోంటే గుండె తరుక్కుపోతోంది. దయచేసిన నా పరిస్థితిని అర్థం చేసుకుని విరళాలివ్వండి! నా కుమార్తెను కాపాడండి’’ అంటూ కన్నీళ్లతో వేడుకుంటోంది. దయచేసి సాయం చేయండి,మనీషాకు ప్రాణభిక్ష పెట్టండి! అని ప్రార్థిస్తోంది. (అడ్వర్టోరియల్) మీవంతు సాయం అందించేందుకు ఇక్కడ క్లిక్ చేయండి -
నా బంగారాన్ని బతికించండి!
కేన్సర్ను, దాని చికిత్సను తట్టుకోవడం పెద్దవాళ్లకే చాలా కష్టం. అలాంటిది నాలుగేళ్ల వయసులోనే ప్రాణాంతక కేన్సర్బారిన పడితే ఊహించడమే కష్టం. థెరపీలు, ఇంజక్షన్లతో చిన్నారుల బాధను చూడలేక తల్లిదండ్రులు నరకం అనుభవిస్తారు. దీనికి తోడు వైద్య ఖర్చులు కలలో కూడా ఊహించనంతభారంగా మారితే...అటు డబ్బు సమకూర్చుకోలేక, ఇటు రోజు రోజుకూ మృత్యువుకు చేరువవుతున్న బిడ్డను చూడలేక వారి బాధ వర్ణించలేం. బిడ్డను ఎలాగైనా బతికించుకోవాలనే తపన వారికి కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. సరిగ్గా మనస్వి తల్లిదండ్రులు కూడా ఇదే మానసిక క్షోభను అనుభవిస్తున్నారు. నాలుగేళ్ల పాప మనస్వికి న్యూరోబ్లాస్టోమా కేన్సర్ సోకింది. ప్రాణాంతకమైన న్యూరోబ్లాస్టోమాతో ఇబ్బంది పడుతున్న కుమార్తెను కాపాడుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు మనస్వి తల్లిదండ్రులు. సెలూన్లో పనిచేసే పాప తండ్రి సంపాదన రోజుకు కేవలం 400 మాత్రమే. దీంతో వైద్యానికి అవసరమైన మొత్తాన్ని సమకూర్చు కోవడం కష్టంగా మారింది. అయినా చేయాల్సిందంతా చేశారు. ఇప్పటికే పాప వైద్య కోసం ఉన్నదంతా ఖర్చు పెట్టేశారు. స్తోమతకు మించి ఆస్తులు అమ్మి, అప్పులు చేసి,ప్రతీ చివరి పైసా చికిత్సకు ఖర్చు చేశారు. మరోవైపు మనస్వికి సోకిన కేన్సర్ ముదురుతోంది. తక్షణమే మెరుగైన వైద్యం అందించకపోతే పాప ప్రాణాలకే ముప్పు అందుకే దయచేసి విరాళాలందించమని వేడుకుంటున్నారు. మనస్వికి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అవసరమని వైద్యులు స్పష్టం చేశారు. ఇందుకోసం అయ్యే ఖర్చు రూ. 20 లక్షలు ($ 25769.54)గా అంచనా వేశారు. ‘‘మా తొలిచూలు బిడ్డ మనస్వి . పాపే మా ప్రపంచం.పాపే మాకు ప్రాణం. ముద్దుల మూటగట్టే ఆమె చిరునవ్వులు చూసి మురిసిపోయాం. కానీ విధి ఇంత క్రూరంగా ఉంటుందని ఊహించలేదు. గుండెలు బద్దలయ్యే వార్త తెలిసింది. నాలుగేళ్ల పసిప్రాయంలోనే మనస్వికి ప్రాణాంతకమైన న్యూరోబ్లాస్టోమా సోకింది. చికిత్సకు తట్టుకోలేక చిరునవ్వుకు దూరమై, పాప కష్టాన్ని చూడలేకపోతున్నాం. ఈ బాధ తట్టుకోలేకపోతున్నాం. దయచేసి మాకు సహాయం చేయండి’’ అని మనస్వి తల్లిదండ్రులు కన్నీటితో వేడుకుంటున్నారు మీ మద్దతే మాకు రక్ష. దయచేసి విరాళం అందించండి! ఈ కష్టం నుంచి మా కుటుంబాన్ని గట్టెక్కించండి!! అని ప్రార్థిస్తున్నారు.(అడ్వెర్టోరియల్) మీవంతు సాయం చేసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి -
నా బిడ్డను కాపాడండి: దాతలూ ఆదుకోండి ప్లీజ్!
రోడ్డు ప్రమాదం ఒక కుటుంబాన్ని అతలాకుతలం చేస్తుంది. అందులోనూ కుటుంబానికి ఆసరాగా ఉన్న వ్యక్తికి అకస్మాత్తుగా ఏమైనా జరిగితే వారి జీవితం అంధకారంలోకి కూరుకు పోతుంది. తన ప్రాణానికి ప్రాణం, కుటుంబానికి పెద్దదిక్కైన 28 ఏళ్ల కొడుకు రాహుల్ పనినుంచి తిరిగి వస్తాడని ఎదురుచూస్తూన్న తల్లికి అతనికి ప్రమాదం జరిగిందని తెలిస్తే గుండె పగిలి పోదూ! సరిగ్గా నిర్మల జీవితంలోనూ ఇదే జరిగింది. కొడుకు వస్తాడనే సంబురంతో రాత్రి భోజనానికి సిద్ధమవుతుండగా కుమారుడి స్నేహితుడి ఫోన్కాల్ పిడుగులా మారింది. రాహుల్ బైక్ను లారీ ఢీకొట్టిందనీ, తీవ్రంగా గాయపడిన రాహుల్ని ఆసుపత్రికి తరలించారని అతని స్నేహితుడు ఫోన్ చేసి సమాచారం అందించాడు. ఈ వార్త వినేసరికి కుప్పకూలిపోయింది నిర్మల. వెంటనే ఆసుపత్రికి పరిగెత్తింది. అక్కడ రాహుల్ జాడ కనిపించలేదు. దీంతో బిడ్డ ఏమై పోయాడో అన్న భయంతో గుండె వేగం మరింత పెరిగింది. అయితే దెబ్బలు బాగా తగలడంతో మరో ఆసుపత్రికి తరలించినట్లు నర్సు చెప్పడంతో కాస్త ఊరట పడింది. దెబ్బలు తగిలినా పరవాలేదు. బిడ్డ ప్రాణాలతో ఉంటే చాలు ఎలాగైనా కాపాడుకుంటా అంటూ ఆ తల్లి మనసు ఆరాట పడింది. ఆందోళనతో ఆ ఆసుపత్రి కెళ్లేసరికి అత్యవసర శస్త్రచికిత్స చేయడానికి వైద్యులు తీసుకెళ్లారని తెలిసింది. దీంతో సాయం చేసిన వారందరికీ కన్నీళ్లతోనే ధన్యవాదాలు తెలుపుకొని, నా బిడ్డను ఎలాగైనా కాపాడు తండ్రీ అంటూ వేయి దేవుళ్లకు మొక్కుకుంది. మీవంతు సాయం అందించేందుకు ఇక్కడ క్లిక్ చేయండి రాహుల్ని కళ్లారా చూసేందుకు ఆరాటపడుతూ థియేటర్ బయట కూర్చొని ఎదురు చూస్తోంది. రాహుల్ చిన్నతనంలోనే తండ్రి కంటి చూపుకోల్పోయాడు. అప్పటినుంచి అన్నీ తానే అయ్యా కుటుంబ పోషణ బాధ్యత తీసుకున్నాడు. పగలూ రాత్రి కష్టపడి కూలిపని చేస్తూ, తల్లి దండ్రులను కంటికి రెప్పలా కాపాడుకుంటున్న కొడుకు జ్ఞాపకాల్లో మునిగిపోయింది నిర్మల. ఇంతలో థియేటర్ నుంచి బైటికి వచ్చి వైద్యులు చెప్పిన మాట విని నిర్మలమ్మ కాళ్ల కింద భూమి కంపించిపోయింది. ‘‘రాహుల్కి అన్నిపరీక్షలు చేశాం అతని మెదడులో తీవ్రమైన ఇంటర్నల్ బ్లీడింగ్ను గుర్తించాం. మెదడులోని రక్తస్రావాన్ని ఆపి, అతడి ప్రాణాల్ని రక్షించేందుకు అత్యవసరంగా అతనికి పుర్రెలో ఒక భాగానికి శస్త్రచికిత్స చేశాం. కానీ శరీరంలో ఎడమ భాగం పక్షవాతానికి గురైంది. అయినా ఈ గండంనుంచి రాహుల్ గట్టెక్కాలంటే మరిన్ని ఆపరేషన్లు చేయాలి. సుమారు 10-15 రోజుల ఆసుపత్రిలో ఉండాల్సి ఉంటుంది. ఈ చికిత్సకు మొత్తం ఖర్చు రూ. 7 లక్షలు ($ 8878.46) అవుతుంది’’ ఇదీ డాక్టర్లు చెప్పిన మాట. చెట్టంత ఎదిగిన కొడుకు అచేతనంగా పడిపోవడంతో, బిడ్డను బతికించుకోవడానికి అవసరమైన డబ్బు లేక ఆ నిరుపేద కుటుంబం అల్లాడిపోతోంది. మరోవైపు ప్రమాదానికి ముందు, తరువాత సంగతులు కొడుకు మర్చిపోతాడేమోననే భయం నిర్మలను ఆవరించాయి. అయినా తన కొడుకును దక్కించుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తోంది. దయగల దాతలు స్పందించి దయచేసి నా బిడ్డను రక్షించండి! అని నిర్మల దీనంగా వేడుకుంటోంది. సరిగ్గా కదలలేక, తిండిలేక, నిద్రలేక అల్లాడిపోతున్న కొడుకును ఈ స్థితిలో చూడలేపోతున్నాను. మా దగ్గర ఉన్నదంతా ఖర్చు పెట్టేశాం అంటూ రాహుల్ ఆపరేషన్ ఖర్చులకు అవసరమైన సొమ్మును సమకూర్చాల్సిందిగా దాతలను కోరుతున్నారు ఆ నిర్మలమ్మ దంపతులు. రాహుల్ ప్రాణం కాపాడేందుకు మీ వంతు సాయం అందించండి! దానం చేయండి!! (అడ్వర్టోరియల్) మీవంతు సాయం అందించేందుకు ఇక్కడ క్లిక్ చేయండి -
నా కొడుకు ప్రాణాలు దక్కాలంటే..
పిల్లాడికి పాలు పట్టడం కష్టంగా మారుతోంది సంగీతకు. ఎందుకుంటే ఆమె పొత్తిళ్లలో ఉన్న నాలుగు నెలల రిహాన్కు పుట్టుకతోనే గ్రహనమొర్రి ఉంది. దీంతో చనుబాలు తాగడం కష్టమయ్యేది. ఆకలితో గుక్కపట్టి ఏడ్చేవాడు. కానీ ఇటీవల మరో సమస్య వచ్చి పడింది. ఉన్నట్టుండి రిహాన్ ఆరోగ్యం మరింతగా చెడిపోవడం మొదలైంది. పొట్ట ఉబ్బిపోయింది. కళ్లు ఆకుపచ్చ రంగులోకి మారాయి. వెంటనే ఆలస్యం చేయకుండా రిహాన్ను ఆస్పత్రికి తీసుకుళ్లారు సంగీతా, సుబ్రదీప్లు. రిహాన్కు అన్ని పరీక్షలు చేసిన డాక్టర్లు చివరకు ప్రొగ్రసివ్ ఫ్యామిలియల్ ఇంట్రాహెపాటిక్ కొలెస్టాసిట్ (లివర్ వ్యాధి) ఉన్నట్టుగా తేల్చారు. అప్పటికే వ్యాధి ముదిరిపోవడంతో ఆ పసివాడి లివర్ పూర్తిగా చెడిపోయిందని చెప్పారు. అర్జంటుగా లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయకుంటే పసివాడి ప్రాణాలకే ప్రమాదమని చెప్పారు. దీని కోసం అదనపు పరీక్షలు చేయగా సంగీత లివర్ మ్యాచ్ అయ్యింది. అయితే ఆపరేషన్కు రూ.20 లక్షల వరకు ఖర్చు వస్తుందని చెప్పారు. రిహాన్ తల్లిదండ్రులైన సంగీత, సబ్రదీప్ ఇద్దరు వికలాంగులే. సుబ్రదీప్కు వినికిడి సమస్య ఉండగా సంగీతకు రెండు కాళ్లు సమానంగా లేవు. దీంతో అను నిత్యం వాళ్లు అనేక ఇబ్బందుల మధ్య జీవితాన్ని వెళ్లదీస్తున్నారు. వారి జీవితాల్లో ఉన్న ఏకైక ఆశా కిరణం, వారి ముద్దుల బిడ్డ రిహాన్. కానీ ఇప్పుడు రిహాన్ భవిష్యత్తు ప్రశ్నార్థకంలో పడింది. మీవంతు సాయం చేసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి రోజులు గడిచే కొద్ది రిహాన్ మృత్యువుకు చేరువ అవుతున్నాడని డాక్టర్లు చెబుతున్నారు. మరోవైపు దాతగా లివర్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నా ఆపరేషన్కి అవసరమైన సొమ్ము సమకూర్చుకోవడం ఆ దంపతులకు అసాధ్యంగా మారింది. దీంతో తమ కొడుక్కి జరిగే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఆపరేషన్ ఖర్చులకు అవసరమైన సొమ్మును సమకూర్చాల్సిందిగా దాతలను కోరుతున్నారు. ఆ పిల్లాడి ప్రాణం కాపాడేందుకు మీ వంతు సాయం అందించండి.(అడ్వెర్టోరియల్) మీవంతు సాయం చేసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి -
గాలిలో దీపాలు.. నా కవల పిల్లల ప్రాణాలు..
పెళ్లైన చాన్నాళ్లకు తల్లిని కాబోతున్నానే వార్త తెలియగానే గాలిలో తేలినట్టుగా అనిపించింది. శుభవార్త తెలిసన మరుక్షణం నుంచి క్రమం తప్పకుండా ఆస్పత్రికి వెళ్లూ పరీక్షలు చేయించుకునే దాన్ని. కడుపులో ఉన్నప్పటి నుంచే ఆ పిల్లలను అపురూపంగా చూసుకోవాలని నా భర్త కలలు కనేవాడు. ఒక్కరోజు పని మానేసేట్టుగా మా ఆర్థిక పరిస్థితి లేకపోయినా.. నా కోసం, రాబోయే పసివాళ్ల కోసం పనులు మానుకుని ఇంటి దగ్గర ఉన్న రోజులు ఉన్నాయి. ఎప్పుడెప్పుడు నా బిడ్డ ఈ లోకంలోకి వస్తాడా అని కలలు కంటూ ఎదురు చూస్తున్న సమయంలో ఉన్నట్టుండి పొత్తి కడుపులో నొప్పి మొదలైంది. క్షణాల్లోనే నిభాయించుకునే పరిస్థితి కూడా లేకుండా పోయింది. కంగారు పడిన నా భర్త వెంటనే నన్ను ఆస్పత్రికి తీసుకెళ్లాడు. నా చుట్టూతా డాక్టర్లు, నర్సులు వచ్చి చేరారు. క్రమంగా కళ్లు మూతలు పడుతున్నాయి. ఏం జరుగుతుందో తెలియడం లేదు. కళ్లు తెరిచి చూసే సరికి ఆస్పత్రి బెడ్పై ఉన్నాను. కవలలు పుట్టారని చెప్పారు. కానీ... నెలలు నిండకుండానే కవలలు జన్మించడంతో ఇద్దరి ఆరోగ్యం క్రిటికల్గా ఉందని డాక్టర్లు తెలిపారు. తల్లి పొత్తిళ్లలో ఉండాల్సిన చిన్నారులను ఇంటెన్సివ్ కేర్లో ఉన్నారు. శ్వాస తీసుకోవడం మొదలు అనేక అనారోగ్య సమస్యలు ఉన్నాయని డాక్టర్లు చెప్పారు. వారి ఆరోగ్యం సాధారణ స్థితికి రావాలంటే నెలల తరబడి ఆస్పత్రిలో చికిత్స అందివ్వాలని చెప్పారు. దీని కోసం రూ.10లక్షల వరకు ఖర్చు అవుతుందని డాక్టర్లు తెలిపారు. సాయం చేసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి రెక్కాడితే కాని డొక్కాడని కుటుంబం మాది. పిల్లల ఆస్పత్రి ఖర్చులకు సరిపడా డబ్బులు సమకూర్చుకోవడం మా వల్ల కాని పని. మరోవైపు వైద్య చికిత్స అందకపోతే కవలల ప్రాణాలకే ప్రమాదం. ఆలస్యం జరిగే కొద్ది వాళ్లు మృత్యు ఒడికి దగ్గరవుతున్నారనే ఆలోచనలతో నా తల్లిమనసు తల్లడిల్లుతోంది. దయచేసి నా పిల్లల ప్రాణాలు కాపాడేందుకు మీ వంతు సాయం అందివ్వండి. నా బిడ్డలకు మరుజన్మ ప్రసాదించండి. (అడ్వెర్టోరియల్) సాయం చేసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి -
చేతులు జోడించి వేడుకుంటున్నా...
మాకు పెళ్లైన ఎనిమిదేళ్లకు నేనే తల్లినయ్యారు. పుట్టబోయే బిడ్డను ఎలా చూసుకోవాలి, ఆ బిడ్డ బంగారు భవిష్యత్తు కోసం ఎలా కష్టపడాలి అనుకుంటూ నేను, నాభర్త రోజుల తరబడి గడిపాం. చివరకు నేను తల్లినయ్యాను. బిడ్డను పొదివి పట్టుకున్నప్పుడు నేను పొందిన ఆనందం మాటల్లో వర్ణించలేనిది. ఆ బిడ్డ కోసమే మా భవిష్యత్తు అనుకున్నాం. కానీ మా కలలు కల్లలయ్యాయి. పుట్టిన కొద్ది రోజులకే పాపకు కాన్జెనిటల్ హార్ట్ డిసీజ్ ఉందని తేలింది. దీంతో పాప ఆరోగ్యం బాగయ్యేందుకు అనేక ఆస్పత్రుల చుట్టూ తిరిగాం. ఇంట్లో ఉండటం కంటే ఆస్పత్రుల్లోనే ఎక్కువగా గడిపాం. తల్లి పొత్తిళ్లలో ఆడుకోవాల్సిన బిడ్డ ఆస్పత్రి బెడ్పైనే ఎక్కువగా ఉంది. చివరకు ఓపెన్ హార్ట్ సర్జరీ చేస్తే పాపకి ఆరోగ్యం నయం అవుతుందని చెప్పారు. దాని కోసం రూ. 3.80 లక్షల వరకు ఖర్చు వస్తుందని డాక్టర్లు చెప్పారు. నా భర్త రవీంద్ర రోజువారి కూలీగా పని చేస్తున్నాడు. తాను రోజంతా కష్టపడితే మాకు మూడు పూటల తిండికే సరిపోతుంది. పాప ఆరోగ్యం కోసం మందులు కొనడం సైతం ఎంతో కష్టంగా ఉంటోంది. గడిచిన ఐదు నెలలుగా ఆస్పత్రుల చుట్టూ తిరగడాకే మా దగ్గర డబ్బులు సరిపోలేదు. అప్పులు చేశాం. ఇక మాకు డబ్బులు ఇవ్వడానికి తెలిసిన వాళ్లెవరు మిగల్లేదు. సాయం చేసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి నా వేలు పట్టుకుని పాప ఏడుస్తుంటే గుండె తరుక్కుపోతుంది. పసిపాపకి ఎంత నొప్పిగా ఉందో.. నా వైపు చూస్తూ ఏడుస్తుంటే .. ఏమీ చేయలని మా నిస్సహాయ స్థితి తలచుకుంటే మాకే నరకంగా ఉంది. దయచేసి నా బిడ్డకు ఓ జీవితం ఇచ్చేందుకు మీ వంతు సహకారం అందివ్వండి. ఆపరేషన్కు అవసరమైన ఆర్థిక సాయం చేయండి. మీకు చేతులు జోడించి వేడుకుంటున్నాను. (అడ్వెర్టోరియల్) సాయం చేసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి -
అయ్యో దుర్గా.. పదిహేనేళ్లకే నీకు ఇన్ని కష్టాలా?
నా భర్త వికలాంగుడు, నాకు ఇద్దరు పిల్లలు. నేను పని చేస్తేనే మేం నలుగురం బతికేది. ఆస్తులు లేకపోయినా, మంచి ఉద్యోగాలు లేకపోయినా ఉన్నదాంట్లో మేము బాగానే ఉండేవాళ్లం. కానీ మూడేళ్ల వయసు నుంచే నా కూతురు దుర్గా భవానికి తరచు జ్వరం వస్తుండేది. ఆస్పత్రికి తీసుకెళ్తే కొద్ది రోజుల్లో తగ్గిపోయేది. కానీ పెరిగి పెద్దవుతున్నా మిగిలిన పిల్లలా పనులు చేయలేపోయేది. చిన్నచిన్న పనులకే త్వరగా అలసిపోయేది. పెరుగుతున్న కొద్ది తరచుగా జ్వరం రావడం, అలిసిపోతుండటంతో బిడ్డ ఎప్పుడూ ఏడుస్తూనే ఉండేది. దుర్గ భవాని తరుచు అనారోగ్యం బారిన ఎందుకు పడుతుందో తెలియక పోయేది. ఎందరు డాక్టర్ల దగ్గరికి తిప్పినా సమస్యకు పరిష్కారం దొరకలేదు. మరోపక్క ఇంట్లో పాప ఏడుపు ఆగడం లేదు. చివరకు తనకు పదిహేనేళ్లు వచ్చాక.. ఓ ఆస్పత్రిలో డాక్టరు అనేక రకాల పరీక్షలు చేసి.. చివరకు దుర్గకి కాంజెనిటల్ హార్ట్ డిసీజ్ ఉందని చెప్పారు. ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలని ఇప్పటికే చాలా ఆలస్యమైందన్నారు. ఇంకా ఆలస్యం చేస్తే పాప ప్రాణాలకే ప్రమాదమని హెచ్చరించాడు. డాక్టర్లు చెప్పినట్టుగా దుర్గ భవానికి గుండె ఆపరేషన్ చేయించాలంటే రూ.4,50,000 లక్షలు అవసరం. ఏ ఆధారం లేని నేను అంత డబ్బును కలలో కూడా ఊహించలేదు. కానీ ఆలస్యం అవుతున్న కొద్ది నా బిడ్డ చావుకు దగ్గరవుతోంది. ఓవైపు వికలాంగుడైన భర్త, ఇద్దరు పిల్లలు, ఇంటి పని చూసుకుంటున్నాను. కుటుంబం గడవడం కోసం ఇంట్లో పని చేసేది నేను ఒక్కదాన్నే. ఎప్పుడైనా రూపాయో అర్థనో మిగిలితే అవి కూడా దుర్గ ఆస్పత్రి ఖర్చులకే సరిపోయేవి కావు. సాయం చేసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి నా నిస్సహాయస్థితి వల్ల నా కూతురు చావుకు దగ్గరవుతోంది. ఆమె ఆపరేషన్కు అవసరమైన నాలుగున్నర లక్షల రూపాయలు సర్థుబాటు చేసే పరిస్థితి నాకు లేదు. దయచేసి నా బిడ్డ ప్రాణాలు కాపాడేందుకు మీ సహాయం కావాలి. ఆపరేషన్ జరిగేందుకు సాయం చేయండి. దుర్గకు మరో జన్మ ఇవ్వండి. (అడ్వెర్టోరియల్) సాయం చేసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి -
ఇప్పటికే ఓ బిడ్డను పోగొట్టుకున్నా.. మళ్లీ ఆ బాధ తట్టుకోలేను..
కన్మణి నర్సుగా పని చేస్తోంది. తన చేతుల మీదుగా ఎన్నో కాన్పులు చేసింది. ఎంతో మంది చిన్నారులను ఈ లోకంలోకి తీసుకు వచ్చింది. కానీ విధి వక్రించి 2019 ఆమెకు పుట్టిన బిడ్డ నిమిషాల్లోనే చనిపోయాడు. ఆ బాధతో కన్మణి నర్సు ఉద్యోగం మానేసి నిరంతరం బాధతోనే ఉండిపోయేది. ఐవీఎఫ్ పద్దతులు పాటిస్తూ మరోసారి గర్భవతి అయ్యింది కన్మణి. 2022 ఫిబ్రవరిలో ఆరు నెలలు నిండగానే ఎప్పుడెప్పుడు బిడ్డ ఈ లోకంలోకి వస్తాడా అని ఎదురు చూడసాగింది. ఇంతలో ఉన్నట్టుండి పొత్తి కడుపులో నొప్పి మొదలైంది. లోపల బిడ్డకు ఏం జరుగుతుందో అనే కంగారులో వెంటనే ఆస్పత్రికి వెళ్లారా దంపతులు. వెంటనే కాన్పు చేయకపోతే తల్లిబిడ్డలను ప్రమాదమని చెప్పారు డాక్టర్లు. నెలలు నిండకుండానే పుట్టడంతో బాబు ఆరోగ్యం విషమంగా మారింది. పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు రెండు నెలలుగా ఎన్ఐసీయూలోనే ఉన్నాడు. ఒక్కసారిగా కూడా తనివితీరా తమ చేతులతో బిడ్డను తాకింది లేదు, పట్టుకున్నది లేదు. సరైన వైద్యం అందివ్వకపోతే బాబు ప్రాణాలకే ప్రమాదమని డాక్టర్లు చెబుతున్నారు. సాయం చేసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి ఎన్ఐసీయూలో ఉంచి బాబుకు వైద్య చికిత్స అందించేందుకు రూ.20 లక్షల వరకు ఖర్చు వస్తుందని డాక్టర్లు చెప్పారు. కన్మణీ ప్రస్తుతం ఉద్యోగం చేయడం లేదు. ఆమె భర్త ప్రవీణ్ ప్రైవేటు ఉద్యోగి. చాలీచాలని జీతంతో బతుకుతున్న ఈ దంపతులకు రూ. 20 లక్షల డబ్బును సమకూర్చడం కష్టమైన పని. తొలికాన్పులో బిడ్డను కోల్పోయి జీవచ్ఛవంలా బతుకుతున్న కన్మణి, ఆమె బిడ్డను కాపాడేందుకు మీ వంతు సాయం అందివ్వండి. (అడ్వెర్టోరియల్) సాయం చేసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి -
నా బిడ్డ బతకడానికి ఒక అవకాశం ఇవ్వండి !
అమ్మా.. నొప్పిగా ఉందమ్మా.. ఇంజెక్షన్లు వేయోద్దని చెప్పమ్మా.. అంటూ నా కొడుకు బాధతో అడుగుతుంటే నా గుండెలు తరుక్కు పోతున్నాయి. వాడి బాధ చూడలేక పోతున్నాను. ఎందుకమ్మా ఇన్ని ఇంజెక్షన్లు ఇస్తున్నారు? ఎప్పుడు ఇంటికి వెళ్దామని ప్రశ్నిస్తుంటే.. దగ్గర సమాధానం లేదు. మూడేళ్లుగా నేను, నా భర్త ఇద్దరం, సయాన్ చుట్టే మా ప్రపంచం నిర్మించుకున్నాం. వాడు పుట్టినప్పటి నుంచి వాడు చేసే ప్రతీ అల్లరి పని మాకు ఎంతో ముచ్చటగొలిపేది. ఒక రోజు వాడికి స్నానం చేపిస్తుంటే కిడ్నీల దగ్గర ఏదో తేడాగా అనిపించింది. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లాం. రకరకాల పరీక్షలు చేసిన డాక్టర్లు సయాన్కి అరుదైన కిడ్నీ సంబంధిత క్యాన్సర్ వ్యాధి (విల్మ్స్ ట్యూమర్) ఉందని తేల్చారు. డాక్టర్లు చెప్పిన మాట వినగానే మేమిద్దరం కుప్పకూలిపోయాం. చిన్నారి సయాన్కి అంత భయంకరమైన వ్యాధి ఎందుకు వచ్చిందా అని తల్లడిల్లిపోయాం. మమ్మల్ని ఓదార్చిన డాక్టర్లు సయాన్ వ్యాధి నయం చేసే అవకాశం ఉందన్నారు. కొన్ని సర్జరీలు చేసి మందులు వాడితే తిరిగి ఆరోగ్యవంతుడు అవుతారని భరోసా ఇచ్చారు. అయితే వాటి కోసం రూ. 7 లక్షల వరకు ఖర్చు అవుతుందని చెప్పారు. సాయం చేసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి నా భర్త కాయకష్టం చేసుకుని బతికే మనిషి. ఒక్కసారి అంత డబ్బు ఎలా సర్దుబాటు చేసే అవకాశం మాకు లేదు. మరోవైపు కళ్లముందే కొడుకు రోజురోజుకి మృత్యువుకి దగ్గరవుతున్నాడు. వాడికేమైనా జరగరానిది జరిగితే జీవితాంతం నన్ను నేను క్షమించుకోలేను. ఈ క్షణంలో చేతులు జోడించి మిమ్మల్ని వేడుకుంటున్నాను. నా బిడ్డ బతికేందుకు మీ వంతు సాయం అందించండి. వాడికి కొత్త జీవితాన్ని ప్రసాదించండి. (అడ్వెర్టోరియల్) సాయం చేసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి -
నా జీవితంలో పొందలేనివి నా బిడ్డకి అందివ్వాలనుకున్నా.. కానీ ఇప్పుడు?
నా జీవితంలో నేను సాధించలేనివి, పొందలేకపోయినవాటిని నా కూతురి అందివ్వాలనుకున్నాను. తాను బాగా చదువుకుని పెద్ద స్థాయికి చేరుకుంటుందని కలలు కన్నాను. అయితే మధ్యలోనే నా ఆశలు, నా కూతురి భవిష్యత్తు ప్రమాదంలో పడిపోయాయి. అమ్మా... నాకు తలనొప్పిగా ఉందంటూ రోజుల తరబడి చెబుతుండటంతో పదకొండేళ్ల కార్తీకను విజయవాడలోని ఆస్పత్రికి తీసుకెళ్లాం. తలనొప్పే కదా మాత్రలతో తగ్గిపోతుందని భావించాం. కానీ కార్తీకను పరీక్షించాకా ఆ వయస్సు పిల్లల్లో వచ్చే అరుదైన మెడుల్లాబ్లాస్టోమా అనే బ్రెయిన్ ట్యూమర్ వ్యాధి వచ్చినట్లు డాక్టర్లు చెప్పారు. తల నొప్పితో విలవిలాడుతున్న పాప బాధను చూడలేక ఇంట్లో ఉన్న బంగారం మొత్తం తాకట్టు పెట్టి వైద్యం చేయించాం. ఎన్ని ఆస్పత్రులు తిరిగినా ప్రయోజనం లేకపోవడంతో హైదరాబాద్కి వచ్చాం. ఇక్కడ పాప సమస్య పూర్తిగా నయం కావాలంటే సర్జరీ చేయాలని డాక్టర్లు చెప్పారు. దాని కోసం ఆరు లక్షల రూపాయల వరకు ఖర్చు వస్తుందన్నారు. ఇప్పటికే ఉన్నదంతా అమ్మేశాం, అప్పులు కూడా చేశాం. కరోనా వల్ల ఉన్న ఆటోరిక్షా కూడా పోయి ప్రస్తుతం లారీ మెకానిక్గా నా భర్త పని చేస్తూ కష్టంగా కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆటపాటలతో ఉల్లాసంగా ఉండాల్సిన నా బిడ్డ ఆస్పత్రి మంచంపై నొప్పికి విలవిలాడుతూ నిస్సత్తువగా మారిపోయింది. మరోవైపు చిన్న కూతురు నిహారిక విజయవాడలో బంధువుల ఇళ్లలో వదిలేసి వచ్చాం. ఫోన్ చేసినప్పుడల్లా.. అమ్మా, నాన్నా అక్కను ఎప్పుడు తీసుకు వస్తారని నిహారిక అడుగుతోంది. సహాయం చేసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి మా ఆర్థిక పరిస్థితి బిడ్డకు శాపంగా మారినందుకు బాధపడని రోజంటూ లేదు. మా పాపకు పునర్జన్మను ఇచ్చి ఆమె బంగారు భవిష్యత్తును అందించేందుకు మీ సాయాన్ని వేడుకుంటున్నాను. మా బిడ్డను బాధను తొలగించేందుకు ఆపరేషన్కి అవసరమైన రూ.6 లక్షలు సాయం చేయాలని కోరుతున్నాను సహాయం చేసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి -
అమ్మా..! నేను మళ్లీ ఆడుకోగలనా? వాడికి ఆ భయంకర నిజం ఎలా చెప్పను?
‘అమ్మా.. నేనింకా ఎన్నాళ్లు ఈ హాస్పిటల్లో ఉండాలి. ఇంటికెప్పుడు వెళ్దాం ? నా ఫ్రెండ్స్తో ఎప్పుడు ఆడుకోవాలి’ అంటూ నా కొడుకు అడుగుతుంటే జవాబు చెప్పడానికి నాకు మాటలు రావడం లేదు. పక్కకు తిరిగి వాడికి కనిపించకుండా కన్నీళ్లు రాల్చడం తప్ప మరో దారి కనిపించడం లేదు. సరైన సహాయం అందకుంటే నా కొడుకు మళ్లీ ఇంటికి వెళ్లడం అనేది జరగదు. ఎందుకంటే వాడి ఒంట్లో ప్రాణాలు తోడేసే భయంకరమైన వ్యాధి ఉంది. ఎనిమిది నెలల క్రితం జ్వరంగా ఉందనడంతో దగ్గర్లోని ఆస్పత్రికి తీసుకెళ్లాం. మందులు వాడిన ఆరోగ్యం బాగు కాలేదు సరికదా.. రోజురోజుకి వాడి పరిస్థితి మరింత దారుణంగా మారింది. దీంతో పెద్దాసుపత్రికి తీసుకెళ్లాం. అక్కడ పరీక్షించిన డాక్టర్లు సివియర్ ఎప్లాస్టిక్ అనీమియా అనే బ్లడ్ క్యాన్సర్ ఉన్నట్టుగా చెప్పారు. బిడ్డను కాపాడుకునేందుకు మా ఎమ్మెల్యే దగ్గరికి పోయాం, ఉన్న నగలన్నీ తాకట్టు పెట్టాం, తెలిసిన వాళ్ల దగ్గర అప్పులు చేశాం. అంతా కలిపి ఇప్పటి వరకు రూ. 10 లక్షల వరకు ఖర్చు చేశాం. బిడ్డ ఆరోగ్యం బాగు కావాలంటే ఇంకా కొన్ని థెరపీలు చేయాలని దానికి రూ.15 లక్షల వరకు ఖర్చు వస్తుందని డాక్టర్లు చెప్పారు. నా భర్త కూలి పని చేస్తే నెలకు వచ్చే సంపాదన రూ.7000. ఆ డబ్బులు మా తిండికే సరిపోతాయి. ఇప్పుడు బిడ్డ ఆస్పత్రి ఖర్చుల కోసం పదిహేను లక్షల రూపాయలు తెచ్చే దారి మాకు కనిపించడం లేదు. సాయం చేయాలంటే ఇక్కడ క్లిక్ చేయండి మరోవైపు చావు బతుకుల మధ్య ఆస్పత్రిలో ఉన్న నా కొడుకు, ఇంటికెప్పుడు వెళ్దామంటూ అడిగినప్పుడల్లా.. బదులు చెప్పలేక నేను, నా భర్త రోదిస్తూనే ఉన్నాం. మా నిస్సహాయ స్థితి వల్ల నా బిడ్డ రోజురోజుకు చావుకు దగ్గరవుతున్నాడు. ఇప్పుడు వాడిని కాపాడేందుకు మానవతామూర్తులు సాయం కావాలి. నా కొడుకు భవిష్యత్తు అందించేందుకు మీ వంతు సాయం చేయండి. చావుకు దగ్గరవుతున్న నా బిడ్డ ప్రాణాలకు కాపాడేందుకు అండగా నిలవండి. సాయం చేసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి -
సొంత కాళ్లపై నిలబడేందుకు పోరాడుతున్నాడు.. సాయం అందించండి..
నెలలు నిండకుండానే బిడ్డ పుట్టడంతో ఏమైనా అనారోగ్య సమస్యలు వస్తాయా అనే కంగారు నాలో మొదలైంది. రోజులు గడుస్తున్నా బిడ్డ ఆరోగ్యంగా ఉండటం చిట్టిచేతులతో ఆడుకోవడం చూసి ముచ్చటపడేదాన్ని. అయితే నెలల వయసొచ్చినా తోటి వారితో పోల్చితే కదలడం, గొంతు నుంచి శబ్ధాలు రావడంలో తేడా కనిపించింది. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లాను. నేను భయపడినట్టే జరిగింది. అరుదగా వచ్చే జన్యు సంబంధమైన వ్యాధి కారణంగా నా బిడ్డ షాహిద్కి బ్రెయిన్, కండాలల్లో సమస్యలు తలెత్తుతున్నట్టు డాక్టర్లు చెప్పారు. ఉన్న ఆస్తులు అమ్ముకుని, అందిన కాడికి అప్పులు చేసి ఆస్పత్రుల చుట్టూ తిరిగాము. బ్రెయిన్కి అనేక ఆపరేషన్లు జరిగాయి. చివరకు షాహిద్ మాట్లాడుతుండటంతో మా కష్టాలు తొలగినట్టే భావించాం. కానీ ఇక్కడే మరో సమస్య ఎదురైంది. మాటలయితే వచ్చాయి కానీ కాళ్లు కదపలేని స్థితిలోనే ఉండిపోయాడు షాహిద్. ఇప్పుడు వాడికి పదమూడేళ్లు. ఇన్నేళ్లుగా లేచి నడవడటానికి అందరిలా ఉండటానికి వాడు చేయని ప్రయత్నం లేదు. బాధపడని క్షణం లేదు. అలా చేసే ప్రయత్నంలో దెబ్బలు తగలడం నొప్పితో విలవిలాడటం చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది. బిడ్డ కష్టాలు చూడలేక మళ్లీ ఆస్పత్రుల బాట పట్టాం. సాయం చేసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి రకరకాల పరీక్షలు చేశారు డాక్టర్లు. వరుసగా కొన్ని సర్జరీలు చేయడం ద్వారా షాహిద్ను నడిపించే వీలుందని చెప్పారు. అయితే ఈ ఆపరేషన్లకు రూ.3.20 లక్షల వరకు ఖర్చు వస్తుందన్నారు. పదమూడేళ్లుగా ఆస్పత్రుల చుట్టూ తిరిగే చేతిలో చిల్లిగవ్వ లేని స్థితిలో ఉన్నాం. నా భర్త గఫూర్ రోజువారి పనులకు వెళ్లి తెస్తేనే ఇంట్లో పొయ్యి వెలిగించేది. నా కొడుక్కి వాడి కాళ్ల మీద వాడు నిలబడి, అందరిలా బతికేందుకు మీ సహకారం కావాలి. షాహిద్ సర్జరీకి అవసరమైన సొమ్ము సమకూర్చేందుకు మీ వంతు సాయం చేయండి. సాయం చేసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి -
పెళ్లైన పదేళ్లకు పుట్టిన బిడ్డ.. పాలు తాగలేదు.. ఊపిరి తీసుకోలేదు
పెళ్లై పదేళ్లు గడిచినా మాకు పిల్లలు కలగలేదు. మా నిరీక్షణ ఫలించి మేము తల్లిదండ్రులయ్యాం. అయితే ఆ సంతోషం ఎంతో సేపు నిలవలేదు. పాలు తాగేందుకు పాప ఇబ్బంది పడుతుండటంతో డాక్టర్ల దగ్గరికి తీసుకెళ్లాం. రకరకాల పరీక్షలు చేసిన డాక్టర్లు, అన్నవాహికలో వ్రణం ఉన్నట్టుగా గుర్తించారు. దీంతో పాప తీసుకునే ఫీడ్ ఊపిరితిత్తుల్లోకి వెళ్తున్నట్టుగా చెప్పారు. లేకలేక పుట్టిన బిడ్డను కాపాడుకునేందుకు ఉన్న ఆస్తులన్నీ అమ్మేసి ఆపరేషన్ చేయించాం. ఇక బిడ్డ ఆరోగ్యానికి ఢోకా లేదనే నమ్మకంతో సంతోషంగా ఇంటికి చేరుకున్నాం. అవే మా జీవితంలో ఆనందంగా ఉన్న గడియలు. ఇలా ఇంటికి వచ్చామో లేదో సమస్య మళ్లీ మొదలైంది. ఊపిరి తీసుకోవడం పాపకు కష్టంగా మారింది. వెంటనే ఆస్పత్రికి వెళ్లాం. అక్కడి నుంచి ఎన్నో ఆస్పత్రుల చుట్టూ తిరుగుతూఎంతో మంది డాక్టర్లను కలిశాం. చివరకు పాప ఆరోగ్యం కుదుటపడాలంటే మరో ఆపరేషన్ చేయక తప్పదని డాక్టర్లు తేల్చి చెప్పారు. పాప ఆపరేషన్కి 20 లక్షల వరకు ఖర్చు వస్తుందన్నారను. మొదటి ఆపరేషన్ చేయించేందుకే ఉన్న నగలన్నీ తాకట్టు పెట్టేశాం. తెలిసివారందరి దగ్గరా అప్పులు చేశాం. ఆర్నెళ్లుగా ఆస్పత్రుల చుట్టూనే తిరుగుతూ ఉండటంతో ఆయన ఉద్యోగం కూడా చేయడం లేదు. ఇప్పుడు మా దగ్గర చిల్లిగవ్వ కూడా లేదు. సాయం చేసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి పాలు తాగడానికి, ఊపిరి తీసుకోవడానికి నా పసి పాపాయి ప్రతీ క్షణం ఇబ్బంది పడుతోంది. ఆమె ఒళ్లంతా సూదులు గుచ్చే ఉన్నాయి. ట్రీట్మెంట్ ఆగిపోయినా.. త్వరగా ఆపరేషన్ జరగకపోయినా పాప మాకు దక్కదు. అందుకే మెడికల్ ఎమర్జెన్సీలో ఫండ్ రైజింగ్ చేసే కెట్టోను సంప్రదించాం. పదేళ్ల తర్వాత పుట్టిన నా బిడ్డ ప్రాణాలు కాపాడేందుకు మీ వంతు సాయం చేయగలరు. ఆమె ఆపరేషన్ అయ్యే ఖర్చుకు మీవంతు సహయం చేయగలరు. సాయం చేసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి -
బతకడానికి పాప పోరాడుతోంది.. మీరు సాయం చేస్తారా ?
ఎందరో దేవుళ్లను మొక్కగా ఎన్నో పూజలు చేయగా.. చాన్నాళ్లకు పండండి పాపకి జన్మనిచ్చాను. ముద్దుగా మేఘ పిలుచుకున్నాను. కానీ వారం రోజులకే నా సంతోషం ఆవిరైంది. పాప పొట్ట ఉబ్బిపోయి శరీరం రంగులో మార్పు రావడంతో వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లాను. రకరకాల పరీక్షలు చేసిన డాక్టర్లు పాప శరీరంలో గాల్బ్లాడర్ పూర్తిగా వృద్ధి చెందలేదని చెప్పారు. మాకున్న కొద్ది ఆస్తులు, బంధువుల సాయంతో వెంటనే పాపని తమిళనాడు నుంచి ఢిల్లికి షిఫ్ట్ చేశాం. ఆపరేషన్ పూర్తయ్యింది. కానీ మాకు కొత్త కష్టాలు అప్పుడే మొదలయ్యాయి. పాప బతకాలంటే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఆపరేషన్ తప్పనిసరి అని డాక్టర్లు తేల్చి చెప్పారు. లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఆపరేషన్కు రూ. 22 లక్షల వరకు ఖర్చు అవుతుందని చెప్పారు. నా భర్త ఓ ప్రైవేటు కంపెని ఉద్యోగి. నెలకు రూ. 7,000లకు మించి జీతం రాదు. ఇప్పటికే ఆస్తులు, బంగారం అమ్మేశాం. బంధువులు చేతనైనంత సాయం చేశారు. సహాయం చేయాలంటే ఇక్కడ క్లిక్ చేయండి ఆపరేషన్ని ఆలస్యం అవుతున్న కొద్ది నా ముద్దుల చిన్నారి మేఘ ప్రాణాలకు ప్రమాదమని తెలుసు. కానీ నా కూతురు ప్రాణాలు దక్కించుకునేందుకు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాను. అందుకే నా పాప ప్రాణాలు కాపాడేందుకు మీ సాయం కోరుతున్నాను. మేఘ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఆపరేషన్కి మీ వంతు సాయం చేయండి. పాపకి కొత్త జీవితాన్ని అందించండి.(అడ్వెటోరియల్) సహాయం చేయాలంటే ఇక్కడ క్లిక్ చేయండి -
అయ్యో కార్తీక్ ! చేయని తప్పుకి 34 ఏళ్లుగా శిక్ష
చేయని తప్పుకి 34 ఏళ్లుగా శిక్ష అనుభవిస్తున్నాడు కార్తీక్. అవమానకరమైన ఆ శిక్షను తప్పించుకోవడానికి చిన్నప్పుడే బడి మానేశాడు, పెద్దయ్యాక పనికి వెళ్లడం కష్టంగా మారింది. చివరకు అతని జీవితమే ప్రమాదంలో పడింది. జన్యుపరమైన ఇబ్బందులతో పుట్టాడు కార్తీక్, చిన్నప్పటి నుంచే అతని ముఖంపై ట్యూమర్లు రావడం ప్రారంభమైంది. కూలి పని చేసుకునే తల్లిదండ్రులు వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. సర్జరీల కోసం తమ శక్తికి మించి ఖర్చు చేశారు. అయినా ట్యూమర్లు రావడం ఆగలేదు. చివరకు డబ్బుల్లేక ఆ ట్యూమర్లను అలానే వదిలేయాల్సిన దుస్థితి ఎదురైంది కార్తీక్కి అతని కుటుంబానికి ముఖంపై పెరిగిన ట్యూమర్లతో స్కూలుకి వెళ్లిన కార్తీక్ ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. తోటి విద్యార్థుల నుంచి అవమానాలు ఎదుర్కొలేక బడి మానేశాడు. ఆ తర్వాత అతనికి పని ఇవ్వడానికి ఎవరూ ఆసక్తి చూపేవారు కాదు. చివరకు ఆ ట్యూమర్లు పెరిగి పెద్దవిగా మారి అతని చూపుకు ప్రమాదం తెచ్చాయి. ఎడమ కంటి నుంచి ధారాగా నీరు కారుతోంది. స్థానిక డాక్టర్లు అతన్ని పట్టించుకోవడం మానేశారు. నరకప్రాయమైన జీవితాన్ని గడుపుతున్నాడు కార్తీక్ సాయం చేసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి ముప్పై నాలుగేళ్లుగా చూస్తున్న దుర్భర జీవితం నుంచి కార్తీక్కి విముక్తి కలగాలంటే పలు సర్జరీలు చేయాల్సిన అవసరం ఉంది. ఈ ఆపరేషన్లకు రూ. 40 లక్షల వరకు ఖర్చు వస్తుంది. అంత డబ్బు సర్థుబాటు చేసే స్థితిలో కార్తీక్ కుటుంబం లేదు. నిత్యం అవమానాలు, చీత్కరింపులు, అనారోగ్య సమస్యలతో క్షణక్షణం నరకం చూస్తున్న కార్తీక్కి ఇప్పుడీ ఆపరేషన్ ఒక్కటే దిక్కు. దీంతోనే అతను భవిష్యత్తులో అందరిలా సాధారణ జీవితం గడపగలడు. కార్తీక్కి చక్కని భవిష్యత్తు అందించేందుకు మీ వంతు సాయం చేయగలరు. (అడ్వెటోరియల్) సాయం చేసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి -
పెళ్లైన 20 ఏళ్లకు కాన్పు.. ప్రమాదంలో పసిబిడ్డ ప్రాణాలు
పెళ్లైన ఇరవై ఏళ్ల తర్వాత తల్లి కాబోతున్నాననే వార్త విని మేమిద్దరం ఎంతగానో సంతోషించాం. ఎప్పుడెప్పుడు మా ఇంట బోసినవ్వులు వినిపిస్తాయా అని ఎదురు చూస్తుండగానే కాన్పు జరిగింది. పుట్టిన బిడ్డ శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. దగ్గు, జలుబు చేయడం ఒళ్లంతా నీలి రంగులోకి మారిపోతుండటంతో వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లాం. నా చిన్నారికి అనేక పరీక్షలు చేశారు. చివరకు మా గుండెలు బద్దలయ్యే వార్త చెప్పారు డాక్టర్లు. కెనోటిక్ హార్ట్ డిఫెక్ట్, ఇంటర్వెంట్రిక్యూలమ్ సెప్టమ్ అనే గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్నట్టు చెప్పారు. బాబుకు ఓపెన్ హార్ట్ సర్జరీ చేయకుంటే ప్రాణాలకు ప్రమాదమంటూ వివరించారు. ఈ ఆపరేషన్ కోసం రూ. 10 లక్షల వరకు ఖర్చు అవుతుందన్నారు డాక్టర్లు. సాయం చేయాలంటే ఇక్కడ క్లిక్ చేయండి నా భర్త ట్రాక్టర్ డ్రైవరుగా పని చేస్తాడు. అతను తెచ్చే సంపాదనే మాకు ఆధారం. కరోనాతో గత రెండేళ్లుగా ఆయనకు పెద్దగా పని లేదు. పైగా పిల్లల కోసం ఐవీఎఫ్కి చాలా ఖర్చు అయ్యింది. ఉన్న నగలన్నీ అమ్మేశాను. అధిక వడ్డీలకు అప్పు తెచ్చాం. ఇప్పుడు మా బిడ్డ ఆపరేషన్కు డబ్బులు సర్థుబాటు చేయలేని స్థితిలో ఉన్నాం. పెళ్లైన 20 ఏళ్లకు మా కలలు నెరవేరి మా ఇంట సంతాన భాగ్యం కలిగింది. కానీ ఆ సంతోషం లేకుండానే గుండె జబ్బు నా బాబు ప్రాణాలకు ప్రమాదకరంగా మారింది. నా కొడుకు గుండె ఆపరేషన్కి మీ వంతు సాయం అందించండి. వాడి ప్రాణాలకు కాపాడండి. (అడ్వెటోరియల్) సాయం చేయాలంటే ఇక్కడ క్లిక్ చేయండి -
పసిపాప ప్రాణాలు దక్కాలంటే.. రూ.13 లక్షలు కావాలి
పిల్లలు కావాలంటూ ఆరేళ్లుగా నేను చేస్తున్న ప్రార్థనలు ఫలించాయి. 2021లో నేను గర్భం దాల్చినట్టు డాక్టర్లు చెప్పారు. అప్పటి నుంచి మా ఇంట్లో బోసి నవ్వులు ఎప్పుడు వినిపిస్తాయా అంటూ నేను నా భార్త ఎదురు చూడని రోజంటూ లేదు. నాకు ఆరో నెల ఉందనగా అకస్మాత్తుగా పొత్తి కడుపులో నొప్పులు మొదలయ్యాయి. వెంటనే నన్ను ఆస్పత్రికి తీసుకెళ్లారు. నా భర్త అమిత్ పని చేస్తున్న చోటు నుంచి వెంటనే ఆస్పత్రికి వచ్చాడు. (సాయం చేయాలంటే ఇక్కడ క్లిక్ చేయండి) కళ్లు తెరిచి చూసేరికి నాకు ప్రసవం జరిగిందని, ఆడబిడ్డ పుట్టిందని ఆస్పత్రి సిబ్బంది చెప్పారు. నా బిడ్డ కోసం ఆ గది అంతటా చూస్తుండగా నా భర్త గదిలోకి వచ్చాడు. నెలలు నిండ కుండానే ప్రసవం కావడం వల్ల పాప ఆరోగ్యం పరిస్థితి బాగా లేదన్నాడు. ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉంచి పాపకి చికిత్స అందిస్తున్నారని చెప్పారు. ఒక్కసారి నా బిడ్డను ఎత్తుకుని ముద్దు పెట్టుకుంటానంటూ నా భర్తను కోరాను. ప్రీ మెచ్యూర్ బేబీ అవడం వల్ల శిశువు పరిస్థితి చాలా డెలికేట్గా ఉందని, మనం ముట్టుకున్నా సరే ఆమె తట్టుకోలేదంటూ డాక్టర్లు చెప్పారు. పాప ఆరోగ్య పరిస్థితి సాధారణ స్థితికి చేరుకోవాలంటే ఐసీయూలో ఉంచి రెండు నెలలకు పైగా చికిత్స అందివ్వాలన్నారు డాక్టర్లు. పాప చికిత్సకి రూ. 13.22 లక్షల ఖర్చు వస్తుందని చెప్పారు. కారు వర్క్షాప్లో పని చేసే అమిత్ నెల సంపాదన మొత్తం రూ.10 వేలు దాటదు. అలాంటిది రూ.13 లక్షల రూపాయలు తేవడం మాకు అసాధ్యమైన పని. మా ఆర్థిక పరిస్థితి కారణంగా నా పసిపాప ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయి. నా బిడ్డ ఆరోగ్యం బాగుపడాలంటే ఖరీదైన వైద్యం చేయించక తప్పదు. పసిపాప ప్రాణాలు కాపాడేందుకు మీరు సహాయం కావాలి. (అడ్వెటోరియల్) సాయం చేయాలంటే ఇక్కడ క్లిక్ చేయండి -
అయ్యో కరీమా! నీకెన్ని కష్టాలమ్మా..
గత ఇరవై ఏళ్లలో నా కూతురు బాధను చూడని రోజు లేదు. పుట్టినప్పటి నుంచి ఏదో ఒక విచిత్రమైన సమస్యతో బాధపడుతోంది నా కూతురు కరీమా తబ్రేజ్ సుయివాలా. 2001లో జన్మించింది. ఆమెకు రెండేళ్లు వయస్సున్నప్పుడు భయంకరమైన చర్మవ్యాధి లక్షణాలు కన్పించాయి. ఆ వెంటనే వినికిడి సామర్థ్యాన్ని కోల్పోయింది. వినికిడి అండ్ స్పీచ్ థెరపీలు నాలుగేళ్లపాటు సాగాయి. ఆ సమయంలో ఆర్థిక పరిస్ధితి బాగలేకపోవడంతో ఏం చేయలేకపోయాం. దాంతో ఆమె వినికిడి సామర్థ్యాన్ని పూర్తిగా కోల్పోయింది. అప్పటికే సమస్యలతో ఉన్న కరీమాకు 2012లో మరోసారి కరీమాకు సైనస్ సమస్య వచ్చి పడింది. వైద్యులు దాని కోసం సినోనాసల్ పాలిపోసిస్ శస్త్రచికిత్స చేయాల్సి వచ్చింది. అప్పటికీ నయం కాకపోవడంతో రెండు సంవత్సరాల తర్వాత ఫంగల్ సైనసిటిస్ కోసం ఫంక్షనల్ ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ రెండు సార్లు చేయించుకుంది కరీమా. సాయం చేసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి. కరీమా ఆరోగ్యం బాగు పడేందుకు ఇప్పటికే ఇంట్లోని బంగారు ఆభరణాలను పూర్తిగా అమ్మేశౠం. ఇప్పుడు కొత్తగా కరీమాకు హైపర్ IgE సిండ్రోమ్ (HIES) ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. నా కూతురు చాలా అరుదైన ఇమ్యునో డిఫిషియెన్సీ వ్యాధి బాధపడుతోంది. ఈ వ్యాధి కారణంగా కరీమా ఊపిరితిత్తులు పూర్గిగా దెబ్బ తిన్నాయి. ఇప్పటికే ఒక దాంట్లో 3వ వంతు ఊపిరితిత్తిని తొలగించారు. ఇప్పుడు భయంకర వ్యాధి మరో ఊపిరితిత్తికి సంక్రమిస్తోంది. ఈ వ్యాధి నుంచి బయటపడలాంటే రెండు సంవత్సరాల పాటు మా అమ్మాయికి ఇంట్రావీనస్ ఇమ్యునోగ్లోబులిన్ థెరపీ (IVIG) చేయాలని వైద్యులు సిఫార్సు చేశారు. దీంతో పాటుగా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ను కూడా చేయించాలని సూచించారు. కరీమా చికిత్స నిమిత్తం ఒక్కో ఇంజెక్షన్కు రూ. 25,000 ఖర్చవుతుంది. ఇలాంటివి ప్రతి నెలా 8 అవసరం. ఈ చికిత్స కోసం సుమారు 50 లక్షల వరకు ఖర్చు అవుతుందని డాక్టర్లు వెల్లడించారు. ఎలాగైనా నా కూతురిని ఈ వ్యాధి నుంచి కాపాడేందుకు మేము శాయశక్తుల ప్రయత్నాలు చేస్తున్నాం. రాబోయే రోజులు కరీమాకు అత్యంత కీలకమైనవి డాక్లర్లు వెల్లడించారు. కరీమా కోసం ఇల్లు, ఆభరణాలు అన్ని అమ్మేసి, వీలైన దగ్గర అప్పులను కూడా చేశాం. మేము ఇప్పటి వరకు మా కుమార్తె చికిత్స కోసం రూ. 10 లక్షలకు పైగా ఖర్చు చేశాం. నా భర్త, తబ్రేజ్ ఒక సేల్స్మెన్గా పనిచేస్తాడు. అతని జీతం మొత్తం పూర్తిగా ఇంటి ఖర్చులకే అవుతోంది. మాకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు, వారిద్దరూ కరీమా కంటే చిన్నవారు. ఎలాగైనా మా కూతురిని కాపాడేందుకు మీ వంతు సహయం చేయగలరు. (అడ్వటోరియల్) -
కళ్లెదుటే ఓ కొడుకు చనిపోయాడు.. ఇప్పుడు ప్రమాదంలో మరో బిడ్డ ప్రాణాలు
మాది వ్యవసాయ కుటుంబం. ఉన్న కొద్ది పాటి భూమినే నమ్ముకుని బతుకుతున్నాం. పెళ్లైన చాలా ఏళ్లకు ఓ బిడ్డ కలిగాడు. వాడు ఎదిగి బడికి పోతున్నప్పుడు చూస్తుంటే ముచ్చటేసేది. బాగా చదువుకుని వృద్ధిలోకి వస్తాడనే నమ్మకం కలిగేది. ఎప్పటిలాగే స్కూల్కి వెళ్లిన నా కొడుకు మళ్లీ ఇంటికి రాలేదు. బడి దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో నా పదమూడేళ్ల బిడ్డ చనిపోయాడు. సాయం చేయాలంటే ఇక్కడ క్లిక్ చేయండి ఎదిగొస్తున్న కొడుకు కళ్ల ముందే చనిపోతే పడే బాధ మాటల్లో వర్ణించలేం. ఎటు చూసినా, ఏం చేసినా నా కొడుకే కళ్ల ముందు కదలాడేవాడు. వాడి జ్ఞాపకాలు మరిచిపోవడం కష్టమైంది మా ఇద్దరికి. అలా నిరాశలోనే గడిచిపోతున్న మా జీవితంలో.. మరోసారి నేను తల్లి కాబోతున్నాను అనే వార్త వినగానే వెలుగు నిండింది. నెలలు ఎప్పుడు నిండుతాయా? మరోసారి మా ఇంట్లో బోసి నవ్వులు ఎప్పుడు వినిపిస్తాయా ? అని గంపెడాశతో ఎదురు చూస్తుండగా, ఉన్నట్టుండి పొత్తి కడుపులో నొప్పి మొదలైంది. వెంటనే ఆస్పత్రికి వెళ్లాం. మాకు మరోసారి మగ బిడ్డ పుట్టాడని డాక్టర్లు చెప్పినప్పుడు కొండంత సంతోషం కలిగింది. కానీ అది ఎక్కువ సేపు నిలవలేదు. నెలలు నిండకుండానే పుట్టడంతో బిడ్డ ఆరోగ్యం బాగాలేదని డాక్టర్లు చెప్పారు. వెంటనే ఎన్ఐసీయూ వార్డుకి తరలించారు. సాధారణంగా అప్పుడే పుట్టిన బిడ్డలు 2.5 కేజీల నుంచి 4.5 కేజీలు ఉంటే నా బిడ్డ కేవలం 1.1 కేజీనే ఉన్నాడు. ఊపిరి తీసుకోవడానికే కష్టపడుతున్నాడు. వాణ్ని చూస్తే గుండె తరుక్కుపోతుంది. ఎన్ఐసీయూలో ఉన్న నా కొడుకును చూడటానికి వెళ్లినప్పుడు నా కళ్ల వెంబడి నీళ్లు ధారగా కారుతూనే ఉన్నాయి. కొడుకు ఒంటి నిండా సూదులు గుచ్చి ఉన్నాయి. పైపులు అమర్చి ఉన్నాయి. వాడి కంటి కొనల నుంచి నీరు కారుతోంది. ఎంత యాతన అనుభవిస్తున్నాడో బిడ్డ అనిపించింది. నా బిడ్డ ఆరోగ్యం మెరుగవ్వాలంటే ఎన్ఐసీయూలో ఉంచి వైద్యం చేయాలని డాక్టర్లు చెప్పారు. మొత్తంగా రూ. 8 లక్షల ఖర్చు వస్తుందన్నారు. ఏ ఆస్తులు లేని మాకు డాక్టర్లు చెప్పిన రూ.8 లక్షలు ఎక్కడి నుంచి తేవాలో అర్థం కావడం లేదు. అప్పటికే బిడ్డ ఆస్పత్రికి ఖర్చులకు రూ.5 లక్షల వరకు ఖర్చు చేశాం. పదమూడేళ్ల కొడుకు కళ్ల ముందే చనిపోతే వచ్చే కష్టం ఏంటో నాకు తెలుసు.. ఇప్పుడు రెండో బిడ్డ ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయి. నా కొడుకు కాపాడే దిక్కెవరని ఏడుస్తుంటే మెడికల్ ఎమర్జెన్సీలో ఫండ్ రైజింగ్ చేసే కెట్టో గురించి తెలిసింది. ఓ బిడ్డను కోల్పోయి పుట్టెడు దుఖంలో ఉన్నాను. నా చిన్నారి తండ్రి ప్రాణాలు కాపాడేందుకు మీ వంతు సాయం చేయండి. ఆపదలో మీరు చేసే సాయం నా బిడ్డ ప్రాణాలను కాపాడుతుంది. వాడికి భవిష్యత్తును అందిస్తుంది. (అడ్వెటోరియల్) సాయం చేయాలంటే ఇక్కడ క్లిక్ చేయండి -
‘బిడ్డ బాధ చూస్తే గుండె తరుక్కుపోతుంది.. కాపాడండి’
పొద్దున అనగా తినకుండా ఆయన బయటకు వెళ్లాడు. ఎర్రటి ఎండలో వాడిపోయిన ముఖంతో ఇంట్లో అడుగు పెట్టాడయన. నీళ్లేమైనా తాగుతావా అంటూ ఎదురెళ్లా ? నా ప్రశ్నకు బదులివ్వకుండా .. ఇంట్లో విలువైన వస్తువులేమి ఉన్నాయంటూ అడిగాడు. నా మెడలో తాళి బొట్టు తప్ప ఏం లేవని బదులిచ్చా. అది కాకుండా ఏమీ లేవా అంటూ మరోసారి అడిగాడు. లేవంటూనే చెప్పాను... చివరకు కనీసం నీళ్లయినా తాగకుండా మెడలో తాళి బొట్టు తీసుకుని బటయకు వెళ్లాడాయన.. ఈ ఒక్క రోజే కాదు ఆ విషయం తెలిసన మరుక్షణం నుంచి మా ఇంట్లో నుంచి సంతోషం బటయకు వెళ్లింది. బాధ, ఏడుపు, నిరాశలే ఇక్కడ గూడు కట్టుకున్నాయి. హేమంత్ మా కలల పంట. వాడు పుట్టినప్పటి నుంచి మా ఇళ్లు చీకు చింతా లేకుండా గడిచిపోతుంది. కరోనా కావడంతో స్కూల్ కి కూడా వెళ్లకుండా ఇంట్లోనే ఉండేవాడు. వాడి అల్లరి పనులతో ఇల్లంతా సందడిగా ఉండేది. కానీ రెండు నెలల క్రితం బిడ్డకి జ్వరం వచ్చింది. ఒళ్లంతా కాలిపోతుంది. ఒంట్లో ఎముకలన్నీ మెలి పెడుతున్న బాధతో విలవిలాడిపోతున్నాడు కొడుకు. వెంటనే ఆలస్యం చేయకుండా ఆస్పత్రికి తీసుకెళ్లాం. సాయం చేయాలంటే ఇక్కడ క్లిక్ చేయండి మా ఊరిలో హేమంత్ని పరిశీలించిన డాక్టర్లు జ్వరానికి మాత్రలు ఇచ్చారు. కానీ బాబుకు వచ్చిన సమస్య ఏంటో తమకు అర్థం కావట్లేదన్నారు. చెన్నై వెళ్లి పెద్దాసుపత్రిలో చూపించాలన్నారు. మరునాడే చెన్నై బస్సెక్కాం. ఉదయం నుంచి పరీక్ష వెనుక పరీక్షలు చేస్తున్నారు ఆస్పత్రిలో. సూదులతో గుచ్చి రక్తం శాంపిల్స్ తీసుకుంటున్నారు. బిడ్డ బాధ చూస్తే గుండె తరుక్కుపోతుంది. ఏ దారుణమైన నిజం వినాల్సి వస్తుందో అని క్షణక్షణం ఆందోళనలతో నిండిపోయింది మనసు. కాళ్లు వణుకుతుండగానే డాక్టరు గదిలోకి వెళ్లాం. హేమంత్ రిపోర్టులు చేతిలో పట్టుకున్న డాక్టరు మా వైపు తిరిగాడు.. ‘మీ బాబుకి బ్రెయిన్ ట్యూమర్ ఉంది. వైద్య పరిభాషలో మెడుల్లోబ్లాస్టోమా అంటారు. అతనికి ఈ క్షణం నుంచే రేడియేషన్ చికిత్స అందివ్వాలి, రక్తమార్పిడి చేయాలి వీటికి తగ్గట్టు సపోర్టివ్ ట్రీట్మెంట్ ఇవ్వాలి లేదంటే ప్రాణాలకే ప్రమాదం’ అని చెప్పారు. ఆయన ఒక్కో మాటకు మా ఇద్దరి గుండెలు ముక్కలయ్యాయి. దేవుడా నా కొడుక్కి ఎందుకింత కష్టం ఇచ్చావ్ అనుకుంటూ ఇంటికి వచ్చాం. హేమంత్ తిరిగి ఆరోగ్యవంతుడు అవ్వాలంటే డాక్టరు చెప్పినట్టుగా చికిత్స అందివ్వాలి. దానికి రూ.10 లక్షల ఖర్చు వస్తుంది. ఇప్పటికే ఇంట్లో ఉన్న విలువైన వస్తువులన్నీ అమ్మి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నాం. ఆఖరికి మెడలో మంగళ సూత్రం కూడా అమ్మేశాను. నా భర్త ఆటో డ్రైవరుగా పని చేస్తాడు. ఆయన సంపద మూడు పూటలా తిండికే సరిపోతుంది. పది లక్షల రూపాయలు ఎక్కడి నుంచి తెచ్చేది ? బ్రెయిన్ ట్యూమర్ పెడుతున్న ఇబ్బందులో బిడ్డ పడే యాతన చూస్తూంటే కన్నీళ్లు ఆగడం లేదు. పది లక్షల రూపాయలు సమకూర్చలేని మా అసమర్థత వల్ల చిన్నారి హేమంత్ ప్రాణాలు గాలిలో దీపంలా మారాయి. ఈ తరుణంలో మెడికల్ ఎమర్జెన్సీలో ఫండ్ రైజింగ్ చేసే కెట్టో గురించి తెలిసింది. మా హేమంత్ ప్రాణాలు కాపాడేందుకు మీ వంతు సహకారం అందివ్వండి. మీరు చేసే సాయం ఓ నిండు ప్రాణాలను కాపాడుతుంది. (అడ్వెటోరియల్) -
ఇంటికి పెద్ద దిక్కు అంటివి.. అయ్యో ! నీకే ఎందుకిలా జరిగింది బిడ్డా..
ఇంటి చుట్టూ పొగమంచు వీడనే లేదు. చలికి ఒళ్లంతా గజగజ వణుకుతోంది. అంతటి చలిలోనే అమ్మా వెళ్లొస్తా.. అంటూ వర్క్షాప్కి బయల్దేరుతున్న నా కొడుకు సన్బర్ఖాన్ని చూస్తేందే మనసంతా బాధతో నిండిపోయింది. ఇంత చలిలో బయటకు వద్దు.. ఇంట్లోనే ఉండిపో అని చెప్పాలని నోటి దాకా వచ్చిన మాటలను బయటకు రానీయలేదు. ఎందుకంటే వాడు పనికి వెళ్లక తప్పని పరిస్థితి మా కుటుంబానిది. ఫర్జానా పుట్టినప్పుడు మా ఇంట్లో ఆనందానికి అవధుల్లేవ్. కొంత కాలానికే సన్బర్ఖాన్, ఆ తర్వాత రెహాన్ పుట్టారు. అంతా సజావుగా సాగిపోతున్న సమయంలో వాళ్ల నాన్న మాకు దూరమయ్యాడు. ఆయన చనిపోయినప్పటి నుంచి కుటుంబ బాధ్యతంతా నా మీదే పడింది. కుట్టు పని చేస్తే వచ్చే రూ.2000లే మా కుటుంబానికి ఆధారం. అక్కా పెళ్లికి తమ్ముడి చదువుకి అండగా ఉండేందుకు పదేళ్ల వయసులోనే బడి మానేసి వర్క్షాప్కి వెళ్తున్నాడు సన్బర్ఖాన్. చలిలో వణుకుతూ బయటకు పోయిన బిడ్డ ఎలా ఉన్నాడో అనే ఆలోచన తొలిచేస్తుండగా... తెలియని నంబర్ నుంచి ఫోన్ వస్తే లిఫ్ట్ చేశాను. వర్క్షాప్కి వెళ్లిన సన్బర్ఖాన్కి యాక్సిడెంట్ అయ్యిందని, అతన్ని ఆస్పత్రి చేర్చారని డాక్టర్లు చెప్పారు. ఏం జరిగిందో ఏమో అని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఆస్పత్రికి వెళ్లాను. అప్పటికే సన్బర్ఖాన్ని ఎమర్జెన్సీ వార్డుకి తరలించారు. ప్రమాదం కారణంగా ఇంటర్నల్ బ్లీడింగ్ జరిగిందని.. సన్బర్ఖాన్ కిడ్నీలు, జీర్ణవ్యవస్థకి బలమైన గాయాలు అయినట్టు డాక్టర్లు చెప్పారు. అయితే సకాలంలో ఆస్పత్రికి తీసుకురావడం వల్ల ప్రాణాలకు ప్రమాదం తప్పిందని డాక్టర్లు చెప్పారు. వారం రోజుల తర్వాత ఆస్పత్రి నుంచి డిస్చార్జ్ అయ్యాం. ఆస్పత్రి నుంచి వచ్చిన తర్వాత కొన్ని రోజులకు.. నొప్పి భరించలేక మంచంలోనే పడి ఏడుస్తున్న సన్బర్ కనిపించాడు. ఏం చేయాలో పాలుపోలేదు. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లాను. అక్కడ రకరకాల పరీక్షలు చేసిన డాక్టర్లు ఇంటర్నల్ ఇన్ఫెక్షన్ వచ్చినట్టు చెప్పారు. మరో 25 రోజులు పాటు ఆస్పత్రిలోనే ఉంచి ఖరీదైన వైద్యం చేయాలన్నారు. అందు కోసం రూ. 12 లక్షల వరకు ఖర్చు వస్తుందన్నారు. వైద్య చికిత్స అందకపోతే ప్రాణాలు దక్కవన్నారు. బిడ్డలను చదివించే ఆర్థిక స్థోమత లేక పన్నెండేళ్ల పిల్లాడు పనికి పోతున్నా ఆపలేని దుస్థితి నాది. మూడు పూటల ఇంటిల్లిపాది తిండి తినడమే కష్టం మాకు. ఐనప్పటికీ సన్బర్ ఆపరేషన్ కోసం అమ్మాయి పెళ్లి కోసం దాచిన కొన్ని నగలు కూడా అమ్మేశాను. ఇప్పుడు ఊపిరి తప్ప మా కుటుంబం దగ్గర ఇంకేం లేదు. మరీ సన్బర్ఖాన్ కాపాడుకునేది ఎలా? ఇన్ఫెక్షన్తో ప్రతీ రోజు నా కొడుకు పడుతున్న బాధ చూస్తూ తల్లిగా తట్టుకోలేకపోతున్నా. నా నిస్సహాయత వల్ల నా పిల్లలకు వచ్చిన పరిస్థితి తలచుకుంటే కన్నీరు ఆగడం లేదు. వెక్కివెక్కి ఏడుస్తున్న నాకు, మెడికల్ ఎమర్జెన్సీలో ఫండ్ రైజ్ చేసే కెట్టో సంస్థ గురించి తెలిసింది. వెంటనే వారిని సంప్రదించాను. నా కొడుకు సన్బర్ ఖాన్ ప్రాణాలు కాపాడేందుకు మీ వంతు సాయం చేయండి. నా కొడుక్కి కొత్త జీవితాన్ని అందించండి. (అడ్వెటోరియల్) సాయం చేసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి -
సత్యశరణ్.. చిన్ని వయస్సులోనే నీకెన్ని కష్టాలు కన్నా..!
మూడు నెలల నుంచి నా ప్రపంచమంతా నా పిల్లాడి చూట్టే తిరుగుతుంది. వాడు ఈ లోకంలోకి వచ్చాక మా జీవితమే మారిపోయింది. వాడి బోసి నవ్వులు చూస్తూ మురిసిపోవడం మాకు రోజువారీ పనిగా మారింది. కానీ గత కొన్ని రోజులుగా వాడు పాలు తాగడం లేదు, నిద్ర పోవడం లేదు, శ్వాస భారంగా తీసుకుంటున్నాడు. బోసి నవ్వులు వాడి పసి మోము నుంచి ఎందుకు దూరమవుతున్నాయి? నా భర్త కూలిగా పని చేస్తుంటే నేను ఇంటి పనులకే పరిమితమయ్యాను. మాకు లేకలేక కలిగిన కొడుక్కి సత్యశరణ్గా పేరు పెట్టుకుని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాం. మాకు పెద్దగా సిరి సంపదలు లేకపోయినా సత్య రాకతో సంతోషానికి లోటు లేకుండా గడుపుతున్నాం. ఉన్నట్టుండి సత్య బరువు తగ్గడం మొదలైంది. ఆ వయస్సు పిల్లలతో పోల్చితే బలహీనంగా కనిపిస్తున్నాడు. పాలు కూడా తాగడం తగ్గించాడు. నిద్ర పోవడం లేదు. ఏ కాసేపో పడుకున్నా.. అంతలోనే ఉలిక్కపడుతున్నాడు. శ్వాస తీసుకోవడానికి కష్టపడుతున్నాడు. బిడ్డకు ఏదో కష్టం వచ్చిందనిపించి ఆలస్యం చేయకుండా వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లాను. ఆస్పత్రిలో రకరకాల టెస్టులు చేసిన డాక్టర్లు నా బిడ్డకు గుండెకు సంబంధించిన వ్యాధి ఉందని తేల్చారు. లార్జ్ పీడీఏ విత్ ఫీచర్స్ ఆఫ్ కంజెస్టివ్ ఫెయిల్యూర్ అనే సమస్య ఉందన్నారు. ఆపరేషన్ చేసి ఈ సమస్యను తొలగించవ్చని చెప్పారు. అందుకు రూ. 5 లక్షల వరకు ఖర్చు వస్తుందని చెప్పారు. మాకు పెద్ద ఆస్తిపాస్తులు లేవు. నా భర్త కూలి. లోన్లు, అప్పులు కూడా తెచ్చే పరిస్థితి లేదు. ఉన్నదాంట్లోనే విలువైన వస్తులు అమ్మగా వచ్చిన డబ్బులు ఆస్పత్రి ఖర్చులకే సరిపోయాయి. బిడ్డ ఆపరేషన్ చేయాలంటే రూ. 5 లక్షలు కావాలి. ఆలస్యమయ్యే ప్రతీ రోజు నా కొడుకు ప్రమాదానికి మరింత చేరువ అవుతున్నట్టే. అది తలచుకుంటే గుండె తరుక్కు పోతుంది. గుండె సమస్యతో సత్య పడుతున్న ఇబ్బందులు చూస్తుంటే కంట నీరు ఆగడం లేదు. ఇదే సమయంలో మెడికల్ ఎమర్జెన్సీలో ఫండ్ రైజింగ్ చేసే కెట్టో గురించి తెలిసింది. మా చిన్నారి సత్య శరణ్ ఆపరేషన్కి అవసరమైన సాయం చేయండి. వాడి ప్రాణాలను కాపాడండి. (అడ్వటోరియల్) సాయం చేసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి -
‘నాకు ఇద్దరు కొడుకులు.. అందులో ప్రమాదంలో ఒకరి ప్రాణం’
అమ్మా.. ఇంటికి తీసుకెళ్లమ్మా.. నాకు ఇక్కడ ఉండబుద్ది కావడం లేదు. ఇంట్లో అన్నయ్యతో అడుకోవాలని ఉందమ్మా అంటూ ఒక్కతీరుగా బతిమాలుతున్నాడు రమేశ్. కానీ అతనికి ఎలా చెప్పను? ఇప్పుడు ఇంటికి తీసుకెళ్లే పరిస్థితిలో లేనని ! అప్పుడు ఐదేళ్లు నిండిన నా కొడుకు రమేశ్ మళ్లీ ఇంటి ముఖం చూడగలడా? పిల్లలే ప్రపంచం నా భర్త ఆది నెలంత కష్టపడి పని చేస్తే వచ్చే డబ్బులు నాకు. నా ఇద్దరు పిల్లలకు ఉండటానికి ఇళ్లు , తినడానికి తిండికి సరిపోతుంది. ఆస్థిపాస్తులు లేవన్న దిగులు మాకు పెద్దగా లేదు. ఎందుకంటే ఆటపాటలతో ఇంటికి అందం తెచ్చే ఇద్దరు పిల్లలు మాకు ఉన్నారు. వాళ్ల అల్లరితో మా ఇంట్లో ఎప్పుడు పండగే అన్నట్టుగా ఉండేది. ఆస్పత్రికి వెళితే నా చిన్న కొడుకు రమేశ్ కొంత కాలంగా నీరసంగా ఉంటున్నాడు. పదేపదే జ్వరం వచ్చి పోతుంది. దగ్గరల్లో డాక్టరుకు చూపిస్తే నయమవడం లేదు. అందుకే విశాఖపట్నం తీసుకుపోయాను. అక్కడ రమేశ్కు మరికొన్ని పరీక్షలు చేసిన డాక్టర్లు గుండె పగిలే వార్తను చెప్పారు. బోన్మ్యారో తప్పనిసరి రమేశ్ హెల్త్ రిపోర్టులు పరిశీలించిన డాక్టర్లు.. ‘ అక్యూట్ లింఫోబ్లాస్టిక్ లుకేమియా’ అనే క్యాన్సర్ వ్యాధి ఉన్నట్టుగా చెప్పారు. ఈ వ్యాధి నయం కావాలంటే మజ్జా మార్పిడి (హాప్లో- ఐడెంటికల్ అల్లోజెనిక్ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ / బోన్మ్యారో, స్టెమ్సెల్ ట్రాన్స్ప్లాంటేషన్) ఆపరేషన్ చేయాలని చెప్పారు. ట్రీట్మెంట్కి రూ. 20 లక్షలు రమేశ్ ప్రాణాలు దక్కాలంటే తాము సూచించిన ట్రీట్మెంట్ చేయక తప్పదని డాక్టర్లు చెప్పారు. ఈ ట్రీట్మెంట్కి 30 రోజుల సమయం పడుతుందని, అందుకు రూ. 20 లక్షల వరకు ఖర్చు వస్తుందని చెప్పారు. ఎలాగైనా నా బిడ్డ ప్రాణాలు దక్కించుకోవాలని పొదుపు చేసిన డబ్బులు, లోనుగా తీసుకున్న నగదుతో పాటు తెలసిన అందరి దగ్గర చేబదులు తీసుకున్నాం. అంతా ట్రీట్మెంట్కే ఖర్చయి పోయింది. కాపాడండి ఇప్పుడు రమేశ్ ప్రాణాలు దక్కాలన్నా .. ఐదేళ్ల వయస్సు ఉన్న వాడు రేపటి భవిష్యత్తును చూడాలన్నా ఖరీదైన ట్రీట్మెంట్ చేయించకతప్పదు. కానీ ఇప్పుడు అంత ఖర్చుతో ట్రీట్మెంట్ చేయించే స్థోమత మాకు లేదు. అలా అని నా బిడ్డను చూస్తూ.. చూస్తూ.. చావు ఒడికి చేర్చలేను. అప్పుడే మెడికల్ ఎమర్జెన్సీలో ఫండ్ రైజ్ చేసే కెట్టో గురించి తెలిసి, వారిని కలిశాను. నా బిడ్డ ప్రాణాలు కాపాడేందుకు మీ వంతు సాయం చేయండి. రమేశ్కి రేపటి రోజులను అందించండి. కొడిగట్టుకుపోతున్న వాడి ప్రాణాలను కాపాడండి. (అడ్వటోరియల్) సాయం చేయాలంటే ఇక్కడ క్లిక్ చేయండి -
‘దేవుడా.. ఏంటీ నాకీ శిక్ష ? నా కాళ్లపై నేను నిలబడలేనా?’
నా పేరు నగేశ్. కర్నాటకలోని శివమొగ్గ జిల్లాలో మా ఊరు ఉంది. పేరుకు శివమొగ్గ అని జిల్లా పేరు చెప్పాను. కానీ నాకంటూ సొంత ఇళ్లు , సొంత కుటుంబం, సొంత ఊరంటూ లేదు. నాకు ఐదేళ్ల వయస్సుప్పుడే నా తల్లిదండ్రులు చనిపోయారు. అప్పటి నుంచి ఫుట్పాత్లే నా ఇళ్లుగా మారాయి. ఒక్క పూట తిండి దొరక్క కన్నీళ్లతో కడుపు నింపుకున్న రోజులు ఉన్నాయి. తల్లిదండ్రులు లేక దారి తెన్ను లేకుండా గడిచిపోతున్న నా జీవితానికి సుమనహళ్లి ట్రస్టు రూపంలో ఓ భరోసా దొరికింది. ఉండటానికి ఇళ్లు, తినడానికి తిండి లేని నన్ను ఓ అనాథ ఆశ్రమంలో చేర్చింది. అక్కడే నా అంటూ లేని నా వాలాంటి వాళ్లతో ఓ కుటుంబం ఏర్పడింది. పెద్దయ్యాక ఏదైనా పని చేసి కడుపు నిండా ఇష్టమైన తిండి తినాలని, మంచి బట్టలు కట్టుకోవాలని, గౌరవంగా జీవించాలని అనుకునే వాడిని టీనేజీలో ఉన్నప్పుడే నా కాలి చర్మం మీద చిన్న కురుపులు వచ్చాయి. మూడు పూటల తిండి దొరకడమే అదృష్టమనుకునే ఆ సమయంలో కాలిపై వచ్చిన చిన్న కురుపులను పట్టించుకోలేదు. చూస్తుండగానే అది అలా పెరిగి పెద్దదయ్యింది. 2018 వచ్చే సరికి నడవడం కష్టం అనిపించే స్థాయికి నా కాళ్లు వాచిపోయాయి. ట్రస్టు సభ్యుల సహాకారం మరికొందరు మనసున్న మనుషుల సాయంతో ఆస్పత్రికి వెళ్లాను. అక్కడ నన్ను పరిశీలించిన డాక్టర్లు నాకు వచ్చిన ఆరోగ్య సమస్యని లింఫెడెమా ఎలిఫెన్షియాసిస్గా తేల్చారు. ఈ సమస్య కారణంగా అడుగు తీసి అడుగు వేయడం భారంగా ఉండేది. చూడటానికి నా కాళ్లు ఎంతో వికారంగా కనిపించేవి. ఒక వయస్సు వచ్చాక పని చేసుకుని గౌరవంగా బతుకుదామని ఎవరి దగ్గరికి వెళ్లినా నా కాళ్లను చూసి పని ఇచ్చే వారు కాదు. ఇదే సమయంలో నా పాదాల నుంచి పై వరకు కాళ్లంతా బాగా వాచి పోయాయి. మంచానికే పరిమితమయ్యే దుస్థితిలోకి జారిపోయాను. నా సమస్యను గమనించిన డాక్టర్లు ఓ పరిష్కారం చెప్పారు. కాళ్లు సాధారణ స్థితికి రావాలంటే మూడు సార్లు ఆపరేషన్ చేయడంతో పాటు మెడిసిన్స్ వాడాలన్నారు. దీని కోసం రూ. 30,00,000 (ముప్పై లక్షలు) ఖర్చు వస్తుందన్నారు. భోజనం చేయడమే గగనం అనిపించే నాకు అంత డబ్బు సమకూర్చుకోవడం కలలో కూడా సాధ్యమయ్యే పని కాదు. కానీ తల్లిదండ్రులు లేని స్థితి నుంచి ఈ రోజు వరకు బతికి ఉన్నానంటే.. దానికి కారణం ఈ సమాజం నాపై చూపించిన ప్రేమ, కరుణ. ట్రస్టు , అనాథ శరణాలయం రూపాల్లో ఆ దైవం నాకు ఏదో రకంగా సాయం అందిస్తూనే ఉన్నాడు. అందుకే మరోసారి నా ఆపరేషన్కి అవసరం అయ్యే డబ్బులను సాయంగా అందివ్వమని కెట్టో ద్వారా మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఆపరేషన్ చేసుకుని బాగైన తర్వాత ఏదైనా పని చేసుకుని గౌరవంగా బతకాలని ఆశపడుతున్నాను. (అడ్వర్టోరియల్) సాయం చేయాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి -
‘నా బిడ్డ ప్రాణం కాపాడండి’
బెంగళూరు సమీప గ్రామానికి చెందిన కృష్ణప్ప నేత పనిచేసేవాడు. నెలకు రూ. 6000ను సంపాదించే కృష్ణప్పకు, గౌరమ్మతో వివాహం జరిగింది. వీరికి వివాహమై ఏడాది కావస్తుంది. కృష్ణప్ప భార్య గర్భం దాల్చడంతో ఇరువురు సంతోషంతో మునిగిపోయారు. డిసెంబర్ మొదటి వారంలో మా ఇంట్లోకి మరో వ్యక్తి వస్తారానే ఆనందంతో ఉప్పొంగిపోయారు. దురదృష్టవశాత్తూ గౌరమ్మ నెలలు నిండకుండానే బిడ్డకు జన్మనిచ్చింది. సాధారణ నవజాత శిశువు సుమారు 3.5 కేజీల బరువు ఉంటారు. 30 వారాలలోపే గౌరమ్మ బిడ్డకు జన్మనివ్వడంతో శిశువు కేవలం 1.2 కిలోల బరువుతో పుట్టాడు. ఇప్పడు అదే శిశువు ప్రాణాలమీదకు వచ్చింది. ఆ బిడ్డను కాపాడేందుకు దంపతులు చేయరాని ప్రయత్నాలను చేస్తున్నారు. ఎలాగైనా తమ బిడ్డను బతికించాలనే ఆశతో వైద్యులను కలిశారు. వైద్యులు బిడ్డను కాపాడుకోవాలంటే 30 రోజుల పాటు ఆసుపత్రిలో ఉండాలని వైద్యులు సూచించారు. శిశువు వైద్యం కోసం గౌరమ్మ, కృష్ణప్ప దంపతులు ఇప్పటివరకు రూ.2 లక్షల వరకు అప్పుచేయాల్సి వచ్చింది. కొన్ని రోజులపాటు ఆసుపత్రితో ఉంటే మా బిడ్డను రక్షించుకోవచ్చునని వైద్యులు అన్నారు. అందుకుగాను వైద్యం కోసం ఇంకా రూ. 5 లక్షలు అవసరమవుతాయని వైద్యులు తెలిపారు. మా బిడ్డను రక్షించడం కోసం మీ తోచినంతా సహాయం చేయగలరని ఆశిస్తున్నాము. (అడ్వటోరియల్) సాయం చేసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి -
‘మాటలు రాకపోయినా.. వాడి బాధ ఏంటో నాకు తెలుసు’
పొద్దున అనగా బటయకు వెళ్లిన మనిషి ఎప్పుడు ఇంటికి వస్తాడా అని ఆలోచిస్తూ దిగాలుగా కూర్చున్నాను. పాలేమైనా పట్టాలేమో అని ఊయల్లో ఉన్న పిల్లాడి వైపు చూస్తూ కడుపుపై నిమిరాను. అలా నా చేతి వేలు శరీరాన్ని తాకిందో లేదో ఆరు నెలల వయసున్న నా కొడుకు తన చిట్టి చేతులతో నా వేలుని గట్టిగా పట్టుకున్నాడు. వాడికి మాటలు రావు, కానీ నా వేలిని వాడలా గట్టిగా పట్టుకోవడానికి గల కారణం నాకు తెలుసు. ‘అమ్మా... నొప్పి భరించ లేక పోతున్నా.. ఏదైనా చేయమ్మా’ అంటున్నాడు నా బిడ్డ. మాయదారి జబ్బు వల్ల ఆ పసిప్రాణం నొప్పితో విలవిలాడుతోంది. నేను బినీషా, నా భర్త పేరు లిబిష్. మారి కేరళలోని కోజికోడ్. మాకిద్దరు పిల్లలు. కూలి పని చేస్తూ నెలకు రూ.5000 సంపాదిస్తూ నా భర్త కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. డబ్బులు లేకపోయినా పిల్లలే మా ఆస్తిగా భావించాం. మూడో బిడ్డగా విహాన్ మా కుటుంబంలో ఓ భాగమయ్యాడు. అయితే వాడికి రెండు నెలలు వయసప్పుడు ఆగకుండా గుక్కపట్టి ఏడుస్తున్నాడు. కడుబు దగ్గర వాపు కూడా కనిపిచింది. అంతే వెంటనే వాడిని ఆస్పత్రికి తీసుకెళ్లాం. వివిధ పరీక్షలు చేసిన డాక్టర్లు విహాన్కి డీకాంపన్సేటెడ్ క్రానిక్ లివర్ డిసీజ్ ఉన్నట్టుగా నిర్థారించారు. బైలరీ ఆర్టేసియా అనే అరుదైన ఈ వ్యాధి కారణంగా పేగుల్లోకి చేరాల్సిన బైల్ కాలేయంలోనే ఉండిపోతుంది. దీని వల్ల కాలేయం వాచి.. చివరకు మరణం సంభవించవచ్చని వివరించారు. లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయడం మంచిదని, దానికి రూ. 19 లక్షల ఖర్చు వస్తుందని చెప్పారు. అంత డబ్బు మా దగ్గర లేదు కాబట్టి మరో మార్గం చూడమని డాక్టర్లకు కోరాం. మా పరిస్థితి అర్థం చేసుకున్న డాక్టర్లు విహాన్కి కసాయ్ ప్రొసీడర్లో వైద్యం అందించారు. కాలేయంలో పేరుకు పోయిన బైల్ని వైద్య పరంగా బయటకు పోయేలా వైద్యం అందివ్వడం మొదలు పెట్టారు డాక్టర్లు. విహాన్ ఆరోగ్యం కొద్దిగా మెరుగవుతున్నట్టే అనిపించింది. వైద్యం కోసం ఇంట్లో నగలను, ఉన్న కొద్దీ ఆస్తులను ఆమ్మేసి రూ. 5 లక్షల వరకు ఖర్చు చేశాం. ఇక పరిస్థితి చక్కబడుతుందనే నమ్మకం కలగడం మొదలైంది. కానీ మాకు నిరాశే ఎదురైంది. మళ్లీ సమస్య మొదటి కొచ్చింది. మరోసారి విహాన్ను పరీక్షించిన వైద్యలు లివర్ ట్రాన్ప్లాంటేషన్ ఒక్కటే మార్గమని తేల్చి చెప్పారు. నా లివర్ విహాన్కు మ్యాచ్ అవుతుంది డాక్టర్లు నిర్థారించారు. అయితే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఆపరేషన్కి రూ.19 లక్షలు కావాలి. లివర్ ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా ఆపరేషన్కి అయ్యే ఖర్చు భరించే స్థోమత మాకు లేదు. అప్పుడే మెడికల్ ఎమర్జెన్సీలో ఫండ్ రైజింగ్ చేసే కెట్టో గురించి తెలిసింది. రోజులు గడిచే కొద్ది విహాన్ మృత్యువుకి చేరువ అవుతున్నాడు. విహాన్కి ఆపరేషన్ జరిగేందుకు మీ వంతు సాయం అందించండి. వాడికి నొప్పితో విలవిలాడుతున్న ఆ ప్రాణాలకు ఓ భవిష్యత్తును ఇవ్వండి.(అడ్వటోరియల్) సాయం చేసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి -
ఈ దీపికను ఆదుకోరూ..
నా మనవరాలి పేరు దీపిక. పేరుకు తగ్గట్టే చిన్నప్పటి నుంచి తన చుట్టూ ఉన్న చీకటిని దగ్గరికి రానిచ్చేది కాదు. నెలల పాపగా ఉన్నప్పుడే అనారోగ్యంతో తల్లిని కోల్పోయింది. అప్పటి నుంచి నేను అమ్మమ్మగా కాకుండా ఓ తల్లిలా దీపికను పెంచుతూ వస్తున్నాను. ఎప్పుడైనా మా అమ్మ ఎలా ఉండేదని తను అడిగితే దుఃఖం కట్టలు తెంచుకునేది. నా బాధ చూడలేక అమ్మలేకపోతే నువ్వున్నాకు కదా అమ్మమ్మ అంటూ నన్ను ఓదార్చేది. దురదృష్టం మరోసారి దీపికను వెక్కిరించింది. నిండా పదేళ్లు కూడా నిండకముందే క్యాన్సర్ వ్యాధితో దీపిక తండ్రి కూడా కాలం చేశాడు. అప్పటి నుంచి తల్లిదండ్రి అన్నీ నేను అయి ఆమెను సాకుతున్నాను. వయసు మీద పడుతున్నా దీపిక భవిష్యత్తు కోసమే కాయకష్టం చేసి పెంచుకుంటున్నాను. కానీ ఇంతలోనే మరో కష్టం వచ్చి మా మీద పడింది. ఉన్నట్టుండి దీపికకు ఒంట్లో బాగుండటం తేదని ఆస్పత్రికి తీసుకెళ్లాను. అక్కడ రకరకాల పరీక్షలు చేసిన డాక్టర్లు సివియర్ నిమోనియా హైపోటానిక్ క్వాడ్రిపెరాసిస్ పెరాసిస్ వచ్చిదంటూ చెప్పారు. నెమ్మదిగా కండరాలు చచ్చుబడిపోయి పక్షవాతం వస్తుందని డాక్టర్లు వివరించారు. ఆ సమస్య రాకుండా ఉండేందుకు వ్యాధి తగ్గేందుకు మందుకు రాసిచ్చారు. మందులు వాడినా రోగం తగ్గలేదు.. మరింతగా పెరిగింది. దీపిక నడవలేని, ఏమీ తినలేని స్థితికి చేరుకుంది. ఆఖరికి శ్వాస తీసుకోవడం కూడా కష్టంగా మారిపోయింది. మంచానికే పరిమితమైంది. వెంటనే ఆస్పత్రికి తీసుకొచ్చాను. కొన్ని రోజులుగా ఇక్కడే చికిత్స అందిస్తున్నాను. కానీ ఈ రోగం నయం కావాలంటే నెలల తరబడి వైద్యం చేయాలని డాక్టర్లు చెప్పారు. వైద్య చికిత్సకు రూ.6,00,000 లక్షల వరకు ఖర్చు వస్తుందని చెప్పారు. నా భర్త ఎప్పుడో చనిపోయాడు. ఒక్కగానొక్క కూతురు కూడా చాన్నాళ్ల క్రితమే చనిపోయింది. కూలి పని చేసుకుంటూ నా మనవరాలిని చదివిస్తూ ఆమె భవిష్యత్తే లోకంగా బతుకున్నాను. కానీ ఇంతలో నా మనవరాలికే పెద్ద కష్టం వచ్చింది. ఆమె వైద్యానికి అయ్యే ఆరు లక్షల రూపాయాలను నేను ఎక్కడి నుంచి తేగలను. అప్పుడే ఆస్పత్రిలో మెడికల్ ఎమర్జెన్సీలో ఆదుకునే కెట్టో గురించి తెలిసింది. నా మనవరాలు దీపిక ప్రాణాలు కాపాడేందుకు మీ వంతు సాయం చేయండి. సాయం చేసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి -
లేకలేక పుట్టిన బిడ్డకి ఎంత కష్టం వచ్చింది
రమ్య, ప్రశాంత్లది చూడచక్కని జంట. పెళ్లై చాన్నాళ్లయినా పెద్దగా గొడవలు లేవు. భార్య మనసెరిగి ప్రవర్తించే భర్త. అతని సంపాదనకు తగ్గట్టుగా ఇంటిని గుట్టుగా నడిపించే ఆమె. అయితే వారికి తీరని లోటు సంతానలేమి. గతంలో రమ్యకి రెండు సార్లు గర్భస్రావం కూడా జరగడంతో ఇక పిల్లలు పుట్టరనే నిరాశ వారిని ఆవహించింది. ఆ సమయంలో వాళ్లిద్దరికి ఓ శుభవార్త తెలిసింది. మూడోసారి నెల తప్పింది మొదలు రమ్యను కంటికి రెప్పలా చూసుకుంటున్నారు ప్రశాంత్. అడినవి, అడగనివి అన్ని ఆమె చెంతకే తీసుకొస్తున్నాడు. పుట్టబోయే బిడ్డను తలచుకుని ప్రతీ క్షణం కలలు కంటున్నారు ఆ జంట. రమ్యకి ఆరో నెల ఉండగానే పొత్తి కడుపులో నొప్పులు మొదలయ్యాయి. ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పుడే మగ కవలలకి జన్మనిచ్చింది రమ్య. నెలలు నిండకుండానే పుట్టడంతో ఇద్దరి పిల్లల ఆరోగ్య పరిస్థితి బాగాలేదు. ముఖ్యంగా రెండో కవల పిల్లాడు కిలో కంటే తక్కువ బరువుతో పుట్టాడు. అప్పటి నుంచి ఆరోగ్య సమస్యలు ఆ బిడ్డను వెంటాడుతూనే ఉన్నాయి. ఊపిరి పీల్చుకోవడానికి, ప్రాణాలు నిలుపుకోవడానికి ప్రతీక్షణం అవస్థలు పడుతూనే ఉన్నాడు. రమ్య రెండో మగ బిడ్డకి పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు వైరల్ నిమోనియా సోకినట్టుగా గుర్తించారు. అంతేకాదు అప్పర్ లోబ్ కోలాప్స్ అయినట్టు కూడా వైద్య పరీక్షల్లో తేలింది. బాబు ఆరోగ్య పరిస్థితి క్రిటికల్గా ఉందని, ఆస్పత్రిలో అబ్జర్వేషన్లో ఉంచి చికిత్స అందివ్వాలన్నారు. వైద్య చికిత్సకు రూ.25 లక్షల వరకు ఖర్చు వస్తుందన్నారు డాక్టర్లు. ప్రశాంత్ నెలంతా కష్టపడి పని చేస్తే వచ్చే ఆదాయం రూ.10,000లు మించదు. అలాంటిది బిడ్డల వైద్య చికిత్స నిమిత్తం రూ. 25,00,000 నగదు తేవడం వారికి సాధ్యం కాని పని. ఈ సమయంలో మెడికల్ ఎమర్జెన్సీలో ఫండ్ రైజింగ్ చేసే కెట్టోని సంప్రదించారు. ప్రశాంతి,రమ్యల బాబు ప్రాణాలు నిలిపేందుకు మీ వంతు సాయం చేయండి. సాయం చేసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి