lahari
-
సముద్రమంత ఆత్మవిశ్వాసం
‘ఎగిసే అలలతో పోరాటం.. అమ్మాయిలకు సాధ్యమయ్యే పనేనా’ అనే చిన్నపాటి ఆలోచనలను కూడా దరిచేరనివ్వడం లేదు నవతరం. ఆకాశమే హద్దుగా నీటి మీదనే తమ కలలను సాకారం చేసుకుంటున్నారు. క్లిష్టమైన సెయిలింగ్ క్రీడా పోటీలలో తమ సత్తా చాటుతున్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్నారు. హైదరాబాద్ వాసులైన ఈ యువ సెయిలర్ల సాహసం ఎంతోమందికి స్ఫూర్తిని కలిగిస్తుంది.హైదరాబాద్ గచ్చిబౌలిలో ఉండే పూతన మాన్య రెడ్డి మొదట స్కూల్ స్థాయిలో స్విమ్మింగ్ నేర్చుకుంది. స్విమ్మింగ్ పోటీలో పాల్గొంటూ సెయిలింగ్పై ఆసక్తి కలిగి, శిక్షణ తీసుకోవడం మొదలుపెట్టింది. సెయిలింగ్కి అనుకూలమైన వాతావరణం కోసం గోవా, మైసూర్..లలో ప్రాక్టీస్ చేసింది. సీనియర్లు ఉపయోగించే బోటుకు మారి, జాతీయ స్థాయిలో ఇప్పటికే 5 పతకాలు సొంతం చేసుకుంది. షిల్లాంగ్ నేషనల్ ర్యాంకింగ్ రెగెట్టా, తెలంగాణ జాతీయ జూనియర్ రెగెట్టాలోనూ కాంస్యాలను సాధించింది. థాయ్లాండ్, పోర్చుగల్లో జరిగిన ప్రపంచ ఛాంపియన్షిప్లో భారత్ నుంచిప్రాతినిధ్యం వహించింది. ఇటీవల మలేషియాలోని లంకాగ్వి అంతర్జాతీయ సెయిలింగ్ పోటీలో పాల్గొని, బంగారు పతకాన్ని సాధించింది.సాహసాలు చేసే శక్తిని ఇస్తుంది ఈ క్రీడల్లో పాల్గొనడానికి చాలా శక్తి కావాలని, ఆరోగ్యసమస్యలు వస్తాయని, ఆడపిల్లలకు సరైనది కాదని చాలామంది నిరాశ పరిచారు. కానీ, సెయిలింగ్ ఎంత ఉత్సాహవంతమైన క్రీడనో, సాహసాన్ని ప్రదర్శించడమే కాదు సముద్రమంత ఆత్మవిశ్వాసాన్ని కూడా ఇస్తుందని తెలిసింది. అంతేకాదు భవిష్యత్తు ఎంతో ఉత్తమంగా మార్చుకునే అవకాశాలనూ ఇస్తుంది. ఒలింపిక్స్ సెయిలింగ్ పోటీలో పాల్గొని పతకాలని సాధించేందుకు కృషి చేస్తున్నాను. ట్రైనింగ్, పోటీలు.. అంటూ నీళ్లతోనే మా సావాసం కాబట్టి అందుకు తగిన వ్యాయామం, సమతుల ఆహారం పట్ల జాగ్రత్తలు తీసుకుంటాను. లెవన్త్ గ్రేడ్ చదువుతున్నాను. వాయిలెన్ మరో ఇష్టమైన హాబీ, స్కూల్ ఎన్జీవోలో యాక్టివ్ మెంబర్ని.– పూతన మాన్యరెడ్డినీళ్లు చూస్తే భయం వేసిందినాలుగేళ్ల క్రితం మా స్కూల్లో ‘సెయిలింగ్లో శిక్షణ ఇస్తున్నార’ని చెబితే, ఆసక్తితో నా పేరు ఇచ్చాను. మొదట నీళ్లను చూస్తే భయం వేసింది. కానీ, ఒక్కసారి నీటిలో ప్రయాణించాక, మరోసారి పాల్గొనేలా ఆసక్తి కలిగింది. సెయిలింగ్ ఖర్చుతో కూడుకున్న క్రీడ. యాట్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ మాకు సపోర్ట్ చేస్తోంది. మా అమ్మ వంటలు చేస్తూ మమ్మల్ని చదివిస్తోంది. మా చదువుకు క్రీడలు కూడా తోడయితే మరిన్ని విజయాలు సాధించవచ్చు.. అని తెలుసుకున్నాం. అందుకే ధైర్యంగా నీటి అలలపై మమ్మల్ని మేం నిరూపించుకుంటున్నాం.– కొమరవెల్లి దీక్షితఅక్కను చూసి...అక్కను చూసి నేనూ సెయిలింగ్ స్పోర్ట్స్లోకి వచ్చేశాను. అండర్–15 కేటగిరీలో పాల్గొంటున్నాను. మలేషియాలో జరిగిన సెయిలింగ్ పోటీలో వివిధ దేశాల నుంచి వచ్చిన 102 మంది సెయిలర్స్ పాల్గొన్నారు. ఒమన్లో జరిగిన పోటీలో రజత పతకం సాధించాను. – కొమరవెల్లి లహరిభారత్తో పాటు సౌత్కొరియాలలో జరిగిన అంతర్జాతీయ సెయిలింగ్ పోటీలో పాల్గొని స్వర్ణ, ర జిత పతకాలు సాధించిన ఈ అక్కాచెల్లెళ్లకు హైదరాబాద్లోని సెయిలింగ్ యాట్ క్లబ్ మద్దతునిస్తోంది.హైదరాబాద్ ఈస్ట్మారేడ్పల్లిలో ఉంటున్న ప్రీతి కొంగర ఓపెన్ డిగ్రీ చేస్తూ సీనియర్ సెయిలింగ్ స్పోర్ట్స్లో సంచనాలు సృష్టిస్తోంది. చైనాలో జరిగిన ఏషియన్ క్రీడలో పాల్గొంది. హైదరాబాద్, ముంబైలలో జరిగిన నేషనల్ ఛాంపియన్షిప్లలో రజత, స్వర్ణ పతకాలు సాధించింది.పేదరికం అడ్డుకాదు‘11 ఏళ్ల వయసులో సెయిలింగ్లోకి అడుగుపెట్టాను. సెయిలింగ్ అనేది చాలా ఓర్పుతో కూడుకున్న క్రీడ. దీనికి ఫిట్నెస్ చాలా అవసరం. ట్రైనింగ్లో భాగంగా రోజూ 4–5 గంటలుప్రాక్టీస్ చేస్తాను. ఈ క్రీడలో అబ్బాయిలు ఎంత కష్టపడాలో, అమ్మాయిలూ అంత కష్టపడాల్సిందే. అన్ని స్పోర్ట్స్ కన్నా ఇది చాలా భిన్నమైంది. సవాల్తో కూడుకున్నది. అందుకే సెయిలింగ్ని ఎంచుకున్నాను. ఏప్రిల్లో జరగబోయే ఒలింపిక్ సెయిలింగ్లో పాల్గొనడానికి శిక్షణ తీసుకుంటున్నాను.– ప్రీతి కొంగర– నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
ఉమెన్ పవర్ 2024: కాలాన్ని కట్టడి చేశారు
కాలం.. మరో నూతన అధ్యాయాన్ని ఆవిష్కరించడానికి సిద్ధమవుతోంది. జారిపోతున్న కాలపు క్షణాలను అపురూపంగా ఒడిసిపట్టుకొని ఉన్నతంగా ఎదిగినవారు కొందరు... ఉదాత్తంగా జీవనాన్ని మలుచుకున్నవారు ఇంకొందరు ఆర్థిక స్థితి గతులు ఎలా ఉన్నా వెనక్కి లాగే పరిస్థితులు ఏవైనా కాలానికి ఎదురు నిలిచి అవకాశాలను అందిపుచ్చుకుంటూ అత్యున్నతంగా ఎదిగిన కొందరు మహిళా మణుల కృషిని ఈ ఏడాది ‘సాక్షి ఫ్యామిలీ’ ఆవిష్కరించింది. ఆ గాథలను మరోమారు గుర్తుచేసుకుందాం. ఎదనిండా స్ఫూర్తిని నింపుకుందాం.డాక్టరమ్మ క్రీడా శిక్షణనిజామాబాద్ పట్టణంలో బాలికల క్రీడానైపుణ్యాలను చూసి, వారి కోసం తన పేరుతోనే 2019లో ఫుట్బాల్ అకాడమినీ ఏర్పాటు చేశారు డాక్టర్ శీలం కవితారెడ్డి. ఈ అకాడమీలో 41 మంది బాలికలకు కోచ్ పర్యవేక్షణలో శిక్షణ ఇస్తున్నారు. ఇంటర్, డిగ్రీ చదువుతున్న గ్రామీణ విద్యార్థులకు ఈ అకాడమీ లో ఉచిత వసతి, ఆహారం, దుస్తులు, వైద్యసేవలను అందిస్తున్నారు. ఇతర ప్రాంతాల్లో జరిగే టోర్నమెంట్లలో పాల్గొనే క్రీడాకారులకు అవసరమైన ఖర్చులన్నీ భరిస్తున్నారు. ఈ అకాడమీ నుంచి జాతీయ–అంతార్జాతీయ స్థాయికి ఎదిగిన క్రీడాకారులు ఉన్నారు.అమ్మాయిలను కాపాడుకుందాం..గ్రామీణ మహిళలను నిత్యం కలుస్తూ వారి సంక్షేమానికి కృషి చేస్తూ పరిష్కారాలను సూచిస్తూ మహిళా రైతుల అభివృద్ధికి చేయూతనిస్తున్నారు డాక్టర్ రుక్మిణారావు. హైదరాబాద్ వాసి అయిన ఈ సామాజిక కార్యకర్త డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ డైరెక్టర్గానూ, వందకు పైగా మహిళా రైతు సంఘాలతో కూడిన జాతీయ వేదిక ‘మకాం’ సహ వ్యవస్థాపకురాలిగానూ ఉన్నారు. నారీశక్తి పురస్కార గ్రహీత అయిన రుక్మిణీరావు ముప్పై ఏళ్లుగా ‘గ్రామ్య రిసోర్స్ సెంటర్ ఫర్ ఉమెన్’ ద్వారా తెలంగాణలోని ఆరు మండలాలో 800 మంది మహిళలు తమ జీవనోపాధిని మెరుగుపరుచుకోవడానికి, అలాగే ఆడపిల్లల పెంపంకం పట్ల వారి వైఖరిని పునరాలోచించడానికి కృషి చేస్తున్నారు.అమ్మలాంటి అన్నదాత కోసంసాయి ప్రియాంక చదువుకున్నది హైదరాబాద్లో. పోషకాహారం దాని ప్రభావిత అంశాల గురించి చర్చించడానికి 600 మంది ప్రతినిధులతో కొలంబోలో జరిగే అంతర్జాతీయ సదస్తులో పాల్గొనే అవకాశాన్ని పొందింది. ఖమ్మంవాసి అయిన పగడాల సాయి ప్రియాంక తల్లిదండ్రులిద్దరూ ప్రభుత్వ ఉద్యోగులే. కూతురికి వ్యవసాయ రంగంపై ఉన్న ఆసక్తిని గమనించి ప్రోత్సహించారు. తెలంగాణలోని రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా పరిధిలో ఉన్న గ్రామాలలో రైతులను కలిసి సేంద్రీయ వ్యవసాయ పద్ధతులను పరీక్షించింది. ఢిల్లీలోని ఐఏఆర్ఐ (ఇండియన్అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్)లో పీహెచ్డి చేస్తోంది. ప్రస్తుతం జహీరాబాద్ ‘కృషి విజ్ఞాన కేంద్రం’లో అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ సైంటిస్ట్గా పనిచేస్తోంది. విభిన్న ఆలోచనలు గల సాయి ప్రియాంక కొత్త దారిలో ప్రయాణించడమే కాదు, తన తోటివారి స్ఫూర్తిగా నిలుస్తోంది.సవాళ్లే పట్టాలెక్కించేదిదక్షిణ మధ్య రైల్వేలో ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్ (పిసిసిఎమ్)గా భారతీయ రైల్వే ట్రాఫిక్ సర్వీస్ సీనియర్ అధికారిగా కె.పద్మజ ఈ ఏడాది ఆగస్టులో నియమితులయ్యారు. 1991 ఐఆర్సిఆర్లో మొట్టమొదటి మహిళా పిసిసిఎమ్. ఉద్యోగంలో మహిళగా ఎదుర్కొన్న వివక్షను వివరించారు. ‘సమస్యలు వచ్చేదే మనల్ని ధైర్యంగా ఉంచడానికి. మనకు ఏం కావాలో స్పష్టత ఉంటే ఆ పని కూడా సులువు అవుతుంది’ అని తెలిపారు‘మారతాను’ అనుకుంటే మారథాన్ గెలిచినట్టే!జీవనశైలిని మార్చుకోవాలన్న ఒకే ఒక ఆలోచనతో ఇండియా ఫాసెస్ట్ మారథాన్ రన్నర్గా తనకై తాను ఓ గుర్తింపును సాధించారు కవితారెడ్డి. 50 ఏళ్ల వయసులో ఆరు ప్రపంచ మారథాన్లను పూర్తి చేసి, స్టార్ మెడల్స్ను సొంతం చేసుకున్నారు. హైదరాబాద్తో పాటు దేశంలోని అన్ని ప్రధాన నగరాలలో మారథాన్ రన్స్లో పాల్గొంటున్న కవితారెడ్డి పదేళ్ల క్రితం వరకు గృహిణిగా బాధ్యతల నిర్వహణలో ఉన్నారు. ఆరోగ్యకరమైన జీవనం కోసం జిమ్లో చేరి, అటు నుంచి మారథాన్ రన్నర్గా దేశ విదేశాల్లో మహిళల్లో క్రీడాస్ఫూర్తిని నింపుతున్నారు.అన్నీ తానై... తానే నాన్నయివ్యవసాయం చేసే తండ్రి అనారోగ్యంతో చనిపోతే డిగ్రీ చదువుతున్న అతని చిన్న కూతురు అఖిల రైతుగా మారింది. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం నర్సాపురం గ్రామ వాసి అఖిల ఉన్న రెండెకరల భూమిని సాగు చేస్తూ అనారోగ్యంతో బాధపడుతున్న తల్లినీ, నాయినమ్మనూ సంరక్షిస్తోంది. ΄÷లం పనులకు ట్రాక్టర్ నడుపుతూ, వ్యవసాయం చేసుకుంటూ, పోటీ పరీక్షలకు సిద్ధపడుతోంది. తండ్రిలేని లోటును తీర్చుతూ కుటుంబానికి అండగా నిలబడింది. నానమ్మ గురించి రాస్తా!పన్నెండేళ్ల అమ్మాయి పదహారేళ్ల అమ్మాయి గురించి కథలుగా రాసి, దానిని బుక్గా అందరికి ముందుకు తీసుకువచ్చింది ఏడవ తరగతి చదువుతున్న అక్షయినీ రెడ్డి. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మనవరాలైన అక్షయినీ తాతయ్యలా ‘లా’ చేస్తాను, సమాజంలో ఉన్న గాధలను కథలుగా పరిచయం చేస్తాను, నానమ్మ గురించి రాస్తాను.. అంటూ తన భవిష్యత్తు లక్ష్యాలను మన ముందుంచింది. ఆటపాటలతో రోజులు గడిపేసే ఎంతో మంది పిల్లల మధ్య ఉంటూనే ప్రపంచంలో పేరొందిన రచయితల పుస్తకాలు చదువుతూ, క్రీడల్లో రాణిస్తూ తనకంటూ ఓ ప్రత్యేకమైన మార్గాన్ని రూపొందించుకుంటూ ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తోంది. చిన్నపిల్లలైనా పెద్ద కలలు కనవచ్చు అంటూ తన పుస్తకాన్ని చూపుతూ భావితరానికి చెబుతోంది.నీ ఆటే బంగారం శ్రీవల్లికరీంనగర్ వాసి శ్రీవల్లికి క్రికెట్ అంటే ఇష్టం. ఐదవ తరగతి చదువుతున్న రోజుల్లోనే హై స్కూల్ అబ్బాయిలతో కలిసి క్రెకెట్ ఆడటానికి వెళ్లింది. అందరూ ఆమెను చూసి వెటకారం గా నవ్వారు. వారి నవ్వులకు వెనకడుగు వేయకుండా విషయం పీటీటీ సర్కు చెప్పింది. శ్రీవల్లి ఇష్టం చూసిన పీఈటీ రహీం శ్రీవల్లి ఉత్సాహానికి మద్దతుగా నిలిచారు. తల్లిదండ్రులూ తమ ఆమోదం తెలిపారు. హైదరాబాద్లోని స్పోర్ట్స్ అకాడమీలో చేరి, నైపుణ్యాలను మెరుగుపరుచుకుంది. జాతీయ స్థాయి మహిళా క్రికెట్ జట్టులో తన సత్తా చాటుతోంది. చైతన్య లహరి బాసర ట్రిపుల్ ఐటీ ఆర్జీయూకేటీలో ఈసీఈ ఫైనలియర్ చదువుతోంది లహరి. కరాటేలో బ్లాక్బెల్ట్, కిక్ బాక్సింగ్లో ప్రావీణ్యం సాధించింది. ‘ఖేలో ఇండియా’లో ఉషూ ప్లేయర్గా సత్తా చాటింది. అత్యవసరంగా రక్తం అవసరం ఉన్నవారికి అందించేందుకు సిద్ధిపేటలో ‘లహరి బ్లడ్ ఫౌండేషన్’ ఏర్పాటు చేసింది. నేర్చుకున్న ఆత్మరక్షణ విద్యలను విద్యార్థినులకు నేర్పిస్తోంది. తోటి విద్యార్థులకు అండగా నిలిచేందుకు ‘హోప్ హౌజ్ ఫౌండేషన్’ కార్యక్రమం నిర్వహిస్తోంది. ఇటీవల బ్యాంకాక్లో నిర్వహించిన ‘ఏషియా యూత్ ఇంటర్నేషనల్ మోడల్ యునైటెడ్ నేషన్స్’ సదస్సుల్లో పాల్గొంది. తండ్రిలాగే సైన్యంలో చేరి దేశ సేవ చేయాలనేది లహరి లక్ష్యం.బస్తీ దొరసానిచెత్తను సేకరించే అమ్మాయి బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్ హోదాలో ఒక రోజు అధికారిణిగా పలు శాఖల విధులను స్వయంగా సందర్శించి, తెలుసుకుంది. హైదరాబాద్ దిల్సుఖ్నగర్లోని పిల్లిగుడెసెల బస్తీ వాసి అరిపిన జయలక్ష్మి. బస్తీల పిల్లల బాగు కోసం కృషి చేస్తోంది. తల్లిదండ్రులతో పాటు చేత్త సేకరణ పనిచేస్తూ, కాలేజీ చదువులు చదువుతూ, బస్తీ పిల్లలకు చదువులు చెబుతుంటుంది. కోవిడ్ సమయంలో యునిసెఫ్ నుంచి వాలెంటీర్గా పనిచేసింది. ఢిల్లీలో ఛేంజ్ మేకర్ అవార్డ్ తీసుకుంది. గాంధీ కింగ్ స్కాలర్షిప్కి దేశం మొత్తంలో పది మంది సెలక్ట్ అయితే వారిలో జయలక్ష్మి ఒకరు. ఇందులో భాగంగా కిందటేడాది అమెరికా వెళ్లి వచ్చింది. ఇప్పుడు డిగ్రీ చేస్తూ యుపీఎస్సీ సాధించాలని కృషి చేస్తోంది.టీచర్ కొలువిచ్చిన సి‘విల్’ పవర్వనపర్తి వాసి అయిన హుమేరా బేగం తండ్రి రోజువారీ కూలీగా హైదరాబాద్లో ఒక మదర్సాలో పనిచేసేవాడు. అమ్మ ఉర్దూ టీచర్గా కొంత కాలం పనిచేసింది. హుమేరా ఏడో తరగతిలో ఉన్నప్పుడు తండ్రి పక్షవాతం బారిన పడ్డాడు. తండ్రి అనారోగ్య ప్రభావం హుమేరా చదువుపై పడింది. పదవ తరగతి లో ఉండగా తండ్రి ఆరోగ్యం క్షీణించి మరణించాడు. హుమేరాకు సివిల్స్ సాధించాలన్నది కల. ఆర్థిక స్థితి లేక చదువును వదిలేయాల్సిన స్థితి. హుమేరాకు చదువుపై ఉండే ఆసక్తి, పట్టుదల ‘సేవ్ ద గర్ల్ చైల్డ్’ సంస్థ దృష్టికి చేరింది. ఆ సంస్థ ఆమె చదువుకు అండగా నిలబడింది. డీఎడ్పూర్తి చేసి ఎస్జీటీ ఉర్దూ టీచర్గా ఎంపిక అయ్యింది. దయనీయమైన పరిస్థితుల నుంచి టీచర్గా ఎదిగిన హుమేరా కృషి ఎంతో మందికి స్ఫూర్తినిస్తుంది. -
చైతన్య లహరి
చదువులో ‘శభాష్’ అనిపించుకున్న లహరి చదువే ప్రపంచం అనుకోలేదు. సమకాలీన సమాజం నుంచి కూడా ఎన్నో విషయాలను పాఠాలుగా నేర్చుకుంటోంది. విద్యార్థి దశ నుంచే సామాజిక స్పృహతో ముందడుగు వేస్తోంది.‘మన కోసం మనమే కాదు ఇతరుల కోసం మనం’ అనే స్పృహతో రకరకాల సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగం అవుతున్న సిద్దిపేట జిల్లా తడకపల్లికి చెందిన బండోజీ లహరి బ్యాంకాక్లో జరిగిన ‘ఏషియా యూత్ ఇంటర్నేషనల్ మోడల్ యునైటెడ్ నేషన్స్’ సదస్సులో ప్రసంగించింది...‘ఇది ఆడవాళ్లకు సాధ్యం కాదు’ అనే మాట ఎన్నోచోట్ల విన్నది లహరి. ‘ఎందుకు సాధ్యం కాదు?’ అని ధైర్యంగా అడిగే వయసు కాదు. అయితే చిన్న వయసులోనే రకరకాల సందర్భాలలో శక్తిమంతమైన మహిళల గురించి విన్న లహరికి ‘మహిళలకు సాధ్యం కానిది లేదు’ అనే సత్యం బోధపడింది.‘ప్రతిభావంతులతో పోటీ పడితే మనలోని ప్రతిభ కూడా మెరుగుపడుతుంది’ అనే పీటీ ఉష మాట ప్రభావంతో ఆటలపై ఆసక్తి పెంచుకుంది. ఎన్నో ఆటల్లో భాగం అయింది.మదర్ థెరెసా గురించి విన్నప్పుడల్లా ఆమె చేసిన అపారమైన సేవా కార్యక్రమాలలో ఏ కొంచెం చేసినా జీవితం ధన్యం అయినట్లే అనుకునేది. ‘ఇతరుల కోసం జీవించని జీవితం జీవితం కాదు’ అనే మదర్ మాట లహరి మనసులో నాటుకుపోవడమే కాదు సామాజికసేవా కార్యక్రమాలపై ఆసక్తి పెంచుకునేలా చేసింది. కరాటే...కిక్ బాక్సింగ్బాసర ట్రిపుల్ఐటీలో ఆర్జీయూకేటీలో ఈసీఈ ఫైనలియర్ చదువుతోంది లహరి. ఎప్పుడూ ఏదో నేర్చుకోవాలనే తపనతో ఉండే లహరి కరాటేలో బ్లాక్బెల్ట్ సాధించింది. కిక్ బాక్సింగ్లో ప్రాపావీణ్యం సాధించింది. ‘ఖేలో ఇండియా’లో ఉషూ ప్లేయర్గా సత్తా చాటింది.అత్యవసరంగా రక్తం అవసరమున్నవారికి సహాయం అందించేందుకు సిద్ధిపేటలో ‘లహరి బ్లడ్ ఫౌండేషన్ ’ ఏర్పాటు చేసింది. మిత్రులతో కలిసి రక్తదానాలు చేయడం, చేయించేలా ప్రోత్సహించడం చేస్తోంది. కోవిడ్ టైమ్లోనూ రిస్క్ తీసుకుని సేవలందించింది. తాను నేర్చుకున్న ఆత్మరక్షణ విద్యలను విద్యార్థినులకు నేర్పిస్తోంది. బాసర ఆర్జీయూకేటీలోనూ స్టూడెంట్ గవర్నింగ్ కౌన్సిల్ (ఎస్జీసీ) కౌన్సిల్ మెంబర్గా ఉంది. ట్రిపుల్ ఐటీలో ఆపదలో ఉన్న విద్యార్థులకు అండగా నిలిచేందుకు ఏర్పాటు చేసిన ఈ ‘హోప్హౌజ్ ఫౌండేషన్’’ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటోంది.ఇటీవల బ్యాంకాక్లో నిర్వహించిన ‘ఏషియా యూత్ ఇంటర్నేషనల్ మోడల్ యునైటెడ్ నేషన్స్’ సదస్సుల్లో పాల్గొంది. 36 దేశాల నుంచి 699 మంది పాల్గొన్న ఈ సదస్సుకు మన దేశం నుంచి హాజరైన అయిదుగురిలో లహరి ఒకరు. ఈ సదస్సులో ‘ఉమెన్ ట్రాఫికింగ్ అండ్ మైగ్రేషన్ స్మగ్లింగ్’ అనే అంశంపై మాట్లాడిందామె.నాన్నలాగే సైన్యంలో చేరి దేశసేవ చేయాలనేది లహరి లక్ష్యం. ఆమె లక్ష్యం నెరవేరాలని ఆశిద్దాం. లెట్స్ షేప్ ఏ బెటర్ వరల్డ్కొత్త ప్రదేశం అంటే భౌగోళిక విషయాల పరిచయం మాత్రమే కాదు. ఎన్నో విషయాలను తెలుసుకునే పుస్తక సముద్రం. ‘యూత్ సమ్మిట్’లో పాల్గొనడానికి బ్యాంకాక్కు వెళ్లిన లహరి ‘ఇక్కడ ప్రసంగించి వెళ్లిపోతే తన బాధ్యత పూర్తయిపోతుంది’ అనుకోలేదు. ఇటీవల థాయ్లాండ్లోని బ్యాంకాక్లో ‘లెట్స్ షేప్ ఏ బెటర్ వరల్డ్’ నినాదంతో మొదలైన అంతర్జాతీయ యువ సమ్మేళనంలో వివిధ దేశాల నుంచి వైబ్రెంట్ డెలిగేట్స్ పాల్గొన్నారు. పర్యావరణ సంక్షోభం నుంచి సాంస్కృతిక విశేషాల వరకు ఎన్నో అంశాలపై ఎంతోమంది డెలిగేట్స్తో లహరి మాట్లాడింది. ఉద్యమ ప్రయాణంలో వారి అనుభవాలతో స్ఫూర్తి పొందింది. ‘బ్యాంకాక్ సమ్మిట్లో పాల్గొనడం గొప్ప అనుభవం’ అంటుంది లహరి. – రాసం శ్రీధర్, సాక్షి, నిర్మల్ -
బుల్లితెర నటి లహరి కుమారుడి ఫస్ట్ బర్త్డే (ఫోటోలు)
-
కాస్ట్ లీ కారు కొన్న సీరియల్ బ్యూటీ లహరి (ఫొటోలు)
-
ఖరీదైన లగ్జరీ కారు కొన్న తెలుగు సీరియల్ బ్యూటీ.. రేటు ఎంతంటే?
సినిమా నటీనటులతో పోలిస్తే సీరియల్ యాక్టర్స్ కూడా ఈ మధ్య మంచి క్రేజ్ సంపాదిస్తున్నారు. ఓవైపు యాక్టింగ్ చేస్తూ మరోవైపు యూట్యూబ్, షోలు చేస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నారు. ఈ క్రమంలోనే కొత్త ఇల్లు, కార్లు కొనేస్తున్నారు. ఇప్పటికే పలువురు సీరియల్ బ్యూటీస్ దగ్గర లగ్జరీ కార్లు ఉన్నాయి. ఈ లిస్టులో నటి లహరి కూడా చేరింది.(ఇదీ చదవండి: 'కల్కి' సీక్వెల్లో ప్రభాస్ పాత్ర చనిపోతుంది.. సీరియల్ కృష్ణుడు జోస్యం)'మొగలిరేకులు', గృహలక్ష్మి తదితర సీరియల్స్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న లహరి.. ప్రస్తుతం ఒకటో రెండో సీరియల్స్ చేస్తోంది. మరోవైపు యూట్యూబ్ ఛానెల్లోనూ వీడియోస్ చేస్తూ బాగానే సంపాదిస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా బెంబ్ ఈ-క్లాస్ కారు కొనుగోలు చేసింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలని తన ఇన్ స్టాలోనే పోస్ట్ చేసింది.ఇకపోతే ఈ కారు ధర మార్కెట్లో రూ.90 లక్షలకు పైనే ఉంది. ఎంత లేదన్నా ఇతరత్రా ఖర్చులతో కలిపి రూ.కోటికి పైనే ఉండొచ్చు. తెలుగు సీరియల్ నటి ఇంత లగ్జరీ కారు కొనడం అంటే మామూలు విషయం కాదని చెప్పొచ్చు.(ఇదీ చదవండి: ప్రభాస్ 'స్పిరిట్' కోసం కొరియన్ విలన్... సెట్ అయితే మాత్రం!) View this post on Instagram A post shared by Strikers (@strikersinsta) -
హీరోగా యూట్యూబర్ నిఖిల్.. సంగీత్ సినిమా లాంఛ్ (ఫోటోలు)
-
Actress Lahari Son Cradle Ceremon: బుల్లితెర నటి లహరి తనయుడి బారసాల ఫంక్షన్ (ఫోటోలు)
-
పండంటి బిడ్డకు జన్మనిచ్చిన బుల్లితెర నటి..వీడియో వైరల్!
సీరియల్స్తో బాగా ఫేమస్ అయిన నటి లహరి. మొగలి రేకులు నుంచి గృహలక్ష్మి వరకు పలు సీరియల్స్లో భిన్నరకాల పాత్రలు చేస్తూ మెప్పిస్తూ వస్తోంది. పెళ్లి తర్వాత నటనకు కాస్త గ్యాప్ ఇచ్చింది లహరి. గతంలోనే గర్భం దాల్చినట్లు సోషల్ ద్వారా పంచుకుంది. అంతే కాకుండా ఎప్పటికప్పుడు అప్ డేట్స్ ఇస్తూ అభిమానులతో టచ్లోనే ఉంటోంది. ఇటీవలే తొమ్మిదినెలలో సీమంతం జరిగిన వేడుకను సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. (ఇది చదవండి: తొమ్మిదవ నెల గర్భంతో లహరి, సీమంతం ఫోటోలు వైరల్) తాజాగా మరో క్రేజీ వార్తను అభిమానులతో పంచుకుంది. తనకు మగబిడ్డ జన్మించినట్లు వెల్లడించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఓ వీడియోను పోస్ట్ చేసింది. తాను ప్రసవించిన ఆస్పత్రిలో కేక్ కట్ చేస్తూ ఈ విషయాన్ని తెలిపింది. ఇది చూసిన అభిమానులు ఆమెకు అభినందనలు తెలుపుతున్నారు. (ఇది చదవండి: బేబీ బంప్తో బుల్లితెర నటి.. సోషల్ మీడియాలో వైరల్!) View this post on Instagram A post shared by Lahari Arundhati Vishnuvazhala (@lahari_actress) -
Lahari Baby Shower Photos : బుల్లితెర నటి లహరి సీమంతం.. ఫోటోలు వైరల్
-
తొమ్మిదవ నెల గర్భంతో లహరి, సీమంతం ఫోటోలు వైరల్
సీరియల్స్తో బాగా ఫేమస్ అయిన నటి లహరి. మొగలి రేకులు నుంచి గృహలక్ష్మి వరకు పలు సీరియల్స్లో భిన్నరకాల పాత్రలు చేస్తూ మెప్పిస్తూ వస్తోంది. అయితే ఇటీవల నటనకు కాస్త గ్యాప్ ఇచ్చింది లహరి. తను గర్భం దాల్చడం వల్లే యాక్టింగ్కు విరామం పలికింది. గత నెలలో లహరి సీమంతం వేడుకను ఇంటిసభ్యులు ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ సీమంతానికి బుల్లితెర తారలు హాజరై కాబోయే తల్లిని మనసారా ఆశీర్వదించారు. ప్రస్తుతం లహరికి తొమ్మిదవ నెల కావడంతో స్నేహితులంతా కలిసి మరోసారి సీమంతం ఫంక్షన్ చేశారు. ఈ వేడుకలో లహరి ఎల్లో డ్రెస్లో మెరిసిపోయింది. దీనిపై రెడ్ కోట్ ధరించింది. ఆమె భర్త లహరికి మ్యాచ్ అయ్యేలా రెడ్ జాకెట్ ఉన్న బ్లూ డ్రెస్ ధరించాడు. ప్రస్తుతం లహరి సీమంతం ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇకపోతే ప్రెగ్నెన్సీ జర్నీకి సంబంధించిన ఫోటోలను, వీడియోలను లహరి ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటోంది. పుట్టబోయే బిడ్డ కోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసుకుంది. దుస్తులు, బ్యాగులు, బెడ్.. ఇలా అన్నింటినీ ముందుగానే సమకూర్చుకుంది. వీటికి సంబంధించిన వీడియోలను సైతం తన యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ చేసింది. మరికొద్ది రోజుల్లో డెలివరీ ఉండటంతో లహరికి అభిమానులు ముందస్తు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. View this post on Instagram A post shared by S W A T (@glamsoulwidbeauty) View this post on Instagram A post shared by Lahari Arundhati Vishnuvazhala (@lahari_actress) చదవండి: ప్రియుడి కోసం పేరు మార్చుకున్న నటి, పెళ్లయిపోయిందా? -
లహరి హత్యలో వల్లభ్రెడ్డి అరెస్ట్.. దర్యాప్తులో సంచలన విషయాలు..
సాక్షి, హైదరాబాద్: నల్లగొండకు చెందిన కాంగ్రెస్ నేత రంగసాయిరెడ్డి కుమారుడు వల్లభ్రెడ్డి అరెస్ట్ అయ్యాడు. వల్లభ్రెడ్డి భార్య లహరిని హత్య చేసిన కేసులో ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక, లహరి మృతి కేసు దర్యాప్తు సంచలనంగా మారింది. లహరి మృతిని వల్లభ్రెడ్డి గుండెపోటుగా చిత్రీకరించి పోలీసులను తప్పుదోవ పట్టించినట్టు గుర్తించారు. వివరాల ప్రకారం.. హిమాయత్నగర్కు చెందిన లహరి మృతి వివాదాస్పదంగా మారింది. ఈ కేసు దర్యాప్తులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. లహరిని హత్య చేసిన వల్లభ్రెడ్డి ఆమె మృతిని గుండెపోటుగా చిత్రీకరించినట్టు తెలిసింది. అనంతరం, ఎవరికీ అనుమానం రాకుండా అంత్యక్రియలు పూర్తి చేశాడు. దినకర్మకు 10వేల మందికి భోజనాలు కూడా పెట్టాడు వల్లభ్ రెడ్డి. కాగా, తాజాగా ఆమె పోస్టుమార్టం నివేదికలో హత్యా కోణం బయటపడింది. ఈ సందర్భంగా లహరికి ఇంటర్నల్ గాయాలైనట్టు వైద్యులు గుర్తించారు. పొట్టలో రెండు లీటర్ల బ్లడ్ బ్లీడింగ్ జరిగినట్టు వైద్యులు స్పష్టం చేశారు. కాగా, కొద్ది రోజులుగా లహరి, వల్లభ్రెడ్డి మధ్య గొడవలు జరుగుతున్నట్టు సమాచారం. ఈ క్రమంలో లహరితో వాగ్వాదం సందర్భంగా వల్లభ్.. ఆమె తలను గోడకు కొట్టడంతో తీవ్రగాయాలయ్యాయి. ఇక, వల్లభ్రెడ్డిని రిమాండ్లోకి తీసుకున్నారు పోలీసులు. దీనిపై దర్యాప్తు కొనసాగుతున్నట్టు నారాయణగూడ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. కాగా, హత్య కేసు స్థానికంగా, రాజకీయాంగా కలకలం సృష్టిస్తోంది. ఇక, లహరి పేరెంట్స్పై కూడా వల్లభ్రెడ్డి ఒత్తిడి తెచ్చినట్టు సమాచారం. ఇది కూడా చదవండి: సత్తెనపల్లి: తీవ్ర విషాదం నింపిన గోవా ట్రిప్ -
గుండెపోటుతో కాదు..గాయాల వల్లే.. భర్త వల్లభ్రెడ్డి అరెస్టు
హైదరాబాద్: హిమాయత్నగర్కు చెందిన వివాహిత లహరి మృతి వివాదాస్పదంగా మారింది. కొద్దిరోజుల క్రితం ఆమె గుండెపోటుతో మృతిచెందిందని లహరి తండ్రి జైపాల్రెడ్డికి సమాచారం అందింది. తాజాగా ఆమె గుండెపోటుతో కాదని.. తలపై, శరీరంపై గాయాలవ్వడం వల్లే మృతి చెందిందంటూ వైద్యులు ధృవీకరించారు. దీంతో ఈ వ్యవహారంలో మొదట నుంచి అనుమానంగా ఉన్న ఆమె భర్త వల్లభ్రెడ్డిని నారాయణగూడ పోలీసులు బుధవారం నల్లగొండలో అరెస్టు చేశారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే...హిమాయత్నగర్కు చెందిన జైపాల్రెడ్డి పెద్ద కుమార్తె లహరికి గత ఏడాది నల్లగొండ జిల్లాకు చెందిన వల్లభ్రెడ్డితో వివాహం జరిగింది. ఈ నెల 15వ తేదీన లహరి గుండెపోటుకు గురై మృతిచెందినట్లు జైపాల్రెడ్డికి సమాచారం అందింది. దీనిపై అదేరోజు తన కుమార్తె మరణంపై అనుమానం లేదంటూనే..తన కుమార్తె మృతికి కారకులైన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలంటూ జైపాల్రెడ్డి నారాయణగూడ పోలీసులకు రెండు విధాలుగా ఫిర్యాదు చేశాడు. దీనిపై 174 సీఆర్పీసీ కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. లహరి తలకు బలమైన గాయాలయ్యాయని, అందువల్లే మృతిచెందిందని పోస్టుమార్టం రిపోర్టులో వెల్లడైంది. దీంతో లహరి భర్త వల్లభ్రెడ్డిని పోలీసులు బుధవారం నల్లగొండలో అరెస్టు చేసి నగరానికి తీసుకొచ్చారు. అనంతరం రిమాండ్కు పంపినట్లు నారాయణగూడ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తెలిపారు -
పెళ్లైన 15 నెలలకే విషాదం.. గుండెపోటుతో లహరి మృతి
నల్గొండ: నిడమనూరు మండలం తుమ్మడము గ్రామానికి చెందిన యడవెల్లి లహరి (28) గుండె పోటుతో శుక్రవారం ఉదయం హైదరాబాద్ లో మృతి చెందింది. తుమ్మ డం గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు , మాజీ ఎంపీపీ యడవెల్లి రంగశాయి రెడ్డి తనయుడు వల్లభ్ రెడ్డి భార్య లహరి. హైదరాబాద్ లో శుక్రవారం ఉదయం అందరూ టిఫిన్ చేశారు. టిఫిన్ చేసిన కొద్ది సేపటికి వేరే రూమ్ కు వెళ్తుండగా ఒక్కసారిగా కుప్పకూలి పడి పోయింది. కుటుంబ సభ్యులు వెంటనే హాస్పిటల్ కు తీసుకెళ్తుండగా మృతి చెందినట్లు తెలిపారు. నల్లగొండ జిల్లా డిండి మండలం నేరెడుకొమ్ము గ్రామానికి చెందిన లహరి కు యడవెల్లి వల్లభ్ రెడ్డి తో గత సంవత్సరం ఏప్రిల్ లో వివాహం జర్పించారు. వివాహం జరిగి 15 నెలలకే లహరి మృతి చెందడం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. వివిధ పార్టీలకు చెందిన నాయకులు లహరి మృతి పట్ల తీవ్ర సంతాపం తెలిపారు. లహరి అంత్యక్రియలు నిడమానూరు మండలం తుమ్మడం గ్రామంలో శనివారం ఉదయం 10-12 గంటల మధ్య నిర్వహించనున్నారు. -
బేబీ బంప్తో బుల్లితెర నటి.. సోషల్ మీడియాలో వైరల్!
ప్రముఖ బుల్లితెర నటి లహరి పేరును టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన పనిలేదు. మొగలి రేకులు, ముద్దుబిడ్డ వంటి సీరియల్స్తో ఫేమ్ తెచ్చుకుంది. సీరియల్స్తో పాటు టీవి షోస్, సినిమాల్లోనూ నటించింది. ప్రస్తుతం ఇంటింటికి గృహలక్ష్మి అనే సీరియల్లో నటిస్తోంది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అప్ డేట్స్ ఇస్తూ అభిమానులతో టచ్లో ఉంటున్నారు. తాజాగా లహరి షేర్ చేసిన పిక్స్ తెగ వైరలవుతున్నాయి. (ఇది చదవండి: సీక్రెట్గా రెండో పెళ్లి చేసుకున్న నటి, కొడుకు సమక్షంలోనే.. ) అయితే పెళ్లి తర్వాత కాస్తా నటనకు కాస్త గ్యాప్ ఇచ్చిన లహరి ప్రెగ్నెన్సీ ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇటీవలే సీమంతం వేడుక జరుపుకుంది బుల్లితెర భామ. తాజాగా బేబీబంప్తో ఫోటోలను తన ఇన్స్టాలో పంచుకున్నారు. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. (ఇది చదవండి: వాల్తేరు వీరయ్య భామకు అరుదైన అవార్డ్.. ఆడేసుకుంటున్న నెటిజన్స్!) View this post on Instagram A post shared by Lahari Arundhati Vishnuvazhala (@lahari_actress) -
ఘనంగా బుల్లితెర నటి సీమంతం.. సోషల్ మీడియాలో వైరల్!
ప్రముఖ బుల్లితెర నటి లహరి తెలుగువారి సుపరిచితమే. మొగలి రేకులు, ముద్దుబిడ్డ వంటి సీరియల్స్తో ఫేమ్ తెచ్చుకుంది. సీరియల్స్తో పాటు టీవి షోస్, సినిమాల్లోనూ మెప్పించింది. ప్రస్తుతం ఇంటింటికి గృహలక్ష్మి అనే సీరియల్లో నటిస్తోంది. అయితే పెళ్లి తర్వాత కాస్తా నటనకు కాస్త గ్యాప్ ఇచ్చిన లహరి ప్రెగ్నెన్సీ ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ప్రస్తుతం ప్రెగ్నెన్సీతో ఉన్న లహరి సీమంతం వేడుక ఇటీవలే ఘనంగా నిర్వహించారు. (ఇది చదవండి: థియేటర్లో లైంగిక వేధింపులు.. ఏం చేయాలో అర్థం కాలేదు: స్టార్ హీరోయిన్) కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో జరిగిన ఈ వేడుకను పలువురు బుల్లితెర నటీనటులు పాల్గొన్నారు. ఓ యూట్యూబ్ ఛానెల్ కూడా నడుపుతున్న సీమంతానికి సంబంధించిన అప్డేట్స్ను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకున్నారు. లహరి సీమంతం వేడుకకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. (ఇది చదవండి: సీతగా నన్నే ఎందుకు ఎంపిక చేశారంటే: కృతి సనన్) -
రోడ్డెక్కిన ఆర్టీసీ లహరి ఏసీ స్లీపర్ బస్సులు.. స్పెషల్ ఫీచర్స్ ఇవే..!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ తొలిసారి ప్రీమియం కేటగిరీ స్లీపర్ బస్సులను ప్రారంభించింది. ప్రయాణికుల సౌకర్యార్థం కోసం అత్యాధునిక హంగులతో కొత్తగా అందుబాటులోకి తీసుకొచ్చిన లహరి ఏసీ స్లీపర్ బస్సుల ప్రారంభోత్సవం హైదరాబాద్లోని ఎల్బీనగర్లో సోమవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, సంస్థ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్, ఎండీ వీసీ సజ్జనర్ తదితరులు పాల్గొన్నారు. వీరంతా కలిసి లహరి బస్సులను జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. టీఎస్ఆర్టీసీ అత్యాధునిక హంగులతో కొత్త బస్సులను అందుబాటులోకి తీసుకురావడం శుభపరిణామన్నారు. ఇటీవల 756 సూపర్ లగ్జరీ బస్సులను కొనుగోలు చేసిందని, వాటికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందన్నారు. ప్రజారవాణా వ్యవస్థను ప్రజలు మంచిగా ఆదరిస్తున్నారని, టీఎస్ఆర్టీసీ బస్సులు సురక్షితంగా గమ్యస్థానాలకు చేరవేస్తాయనే గొప్ప నమ్మకాన్ని కూడగట్టుకుందని చెప్పారు. సంస్థను లాభాల బాటపట్టించేందుకు యాజమాన్యం వినూత్న ఆలోచనలను చేస్తోందని, సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటుందన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రైవేట్కు ధీటుగా అమ్మఒడి అనుభూతి ట్యాగ్ లైన్' పేరుతో లహరి ఏసీ స్లీపర్ బస్సులను అందుబాటులోకి తీసుకువచ్చిందని, వీటిని ప్రజలు మంచిగా ఆదరించాలని కోరారు. త్వరలోనే ఎలక్ట్రిక్ బస్సులనూ సమకూర్చుకుంటుందన్నారు. టీఎస్ఆర్టీసీని ప్రజలకు మరింతగా చేరువచేయడంలో సంస్థ ఎండీ వీసీ సజ్జనర్ చేస్తోన్న కృషిని అభినందించారు. అలాగే, పేదల కనీస ప్రయాణ అవసరాలను తీర్చడంలో ప్రజా రవాణా వ్యవస్థ ప్రముఖ పాత్ర పోషిస్తోందన్నారు. చదవండి: డబుల్ ఇంజన్ అంటే మోదీ-అదానీ: మంత్రి కేటీఆర్ ప్రయాణికులకు శుభవార్త! 16 కొత్త ఏసీ స్లీపర్ బస్సులు రేపటి నుండి అందుబాటులోకి వస్తున్నాయి. రాష్ట్రంలో తొలిసారిగా వీటిని #TSRTC వాడకంలోకి తెస్తోంది. LB Nagar లో సోమవారం ఉదయం 9.30 గంటలకు ఈ బస్సులను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు ప్రారంభిస్తారు. #NewACSleeperBuses pic.twitter.com/WBrFy37xmt — VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) March 26, 2023 టీఎస్ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్ మాట్లాడుతూ.. తొలిసారిగా అందుబాటులోకి తెస్తోన్న ఏసీ స్లీపర్ బస్సుల్లో ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలను కల్పించడం జరిగిందన్నారు. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని బస్సుల్లో ట్రాకింగ్ సిస్టంతో పాటు పానిక్ బటన్ సదుపాయాన్ని కల్పించామని చెప్పారు. 12 మీటర్ల పొడవు గల ఏసీ స్లీపర్ బస్సుల్లో లోయర్ 15, అప్పర్ 15తో 30 బెర్తుల సామర్థ్యం ఉందన్నారు. ఈ బస్సుల్లో ఉచిత వైఫై సౌకర్యం కూడా అందుబాటులో ఉందని తెలిపారు. టీఎస్ఆర్టీసీ లాభాల బాట పట్టేందుకు ప్రతి పౌరుడు సహకరించి సంస్థను ఆదరించాలని కోరారు. ప్రజల సంక్షేమం కోసమే ప్రజా రవాణా వ్యవస్థ ఉందనే విషయం మరచి పోవద్దన్నారు. సంస్థ ఎండీ వీ సజ్జనర్ మాట్లాడుతూ.. ప్రయాణికుల సౌకర్యార్థం 630 సూపర్ లగ్జరీ బస్సులను, 130 డీలక్స్ బస్సులను ఇప్పటికే అందుబాటులోకి తీసుకువచ్చామని చెప్పారు. సుదూర ప్రాంతాలకు వెళ్లే వారికోసం ఏసీ స్లీపర్ బస్సులను వాడకంలోకి తెస్తున్నామని వివరించారు. త్వరలోనే మరో 100 ఏసీ స్లీపర్ బస్సులను ప్రారంభిస్తామని పేర్కొన్నారు. పర్యావరణ హితం కోసం ఎలక్ట్రిక్ వాహనాలను అందుబాటులోకి తెస్తున్నామని చెప్పారు. వాటిని ఏప్రిల్లో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. తొలిసారిగా హైదరాబాద్-విజయవాడ మార్గంలో 50 ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు రాబోతున్నాయని తెలిపారు. కొత్తగా అందుబాటులోకి వచ్చిన లహరి బస్సుల్లో సీట్లను www.tsrtconline.in లో బుక్ చేసుకోవాలని ఆయన సూచించారు. టెండర్ ద్వారా అశోక్ లేలాండ్ కంపెనీ నుంచి ఈ బస్సులను కొన్నారు. ఈ స్లీపర్ బస్సులను తొలుత హైదరాబాద్ నుంచి ఐదు నగరాలకు తిప్పనున్నారు. మియాపూర్, ఎంజీబీఎస్ల నుంచి బెంగళూరుకు, హుబ్లీకి, బీహెచ్ఈఎల్, ఎంజీబీఎస్ల నుంచి విశాఖపట్నం, తిరుపతి, చెన్నైలకు నడుపుతారు. గరుడ ప్లస్ కంటే ఈ బస్సుల్లో టికెట్ ధర 30 శాతం వరకు ఎక్కువగా ఉండనుంది. రైలు మూడో ఏసీ శ్రేణి టికెట్ ధరకు ఇంచుమించు సమంగా వీటి టికెట్ ధరలను ఖరారు చేశారు. లహరి స్లీపర్ బస్సుల్లో 30 బెర్తులు ఉంటాయి. మంచినీటి సీసా హోల్డర్, మొబైల్ చార్జింగ్ సాకెట్తోపాటు ఉచిత వైఫై వసతి ఉంటుంది. ఈ బస్సుల్లో మూడు సీసీ కెమెరాలు, పానిక్ బటన్, రేర్ వ్యూ కెమెరా, ఎల్ఈడీ సూచిక బోర్డులుంటాయి. ప్రారంభోత్సవ ఆఫర్.. ఈ కొత్త సర్వీసులను ప్రారంభిస్తున్న సందర్భంగా తొలుత కొన్ని రోజుల పాటు టికెట్ ధరల్లో తగ్గింపును అమలు చేస్తున్నారు. కర్ణాటక రాష్ట్రంలోని ప్రాంతాలకు వెళ్లే సర్వీసుల్లో 20 శాతం, ఇతర రూట్లలో తిరిగే బస్సుల్లో 15 శాతం మేర టికెట్ ధరలను తగ్గించనున్నారు. డైనమిక్ ఫేర్ విధానం ప్రారంభం.. డైనమిక్ టికెట్ ఫేర్ విధానం కూడా సోమవారం నుంచే ఆర్టీసీ ప్రారంభించింది తొలిసారి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల తరహాలో డిమాండ్ ఆధారంగా టికెట్ ధరలను సవరిస్తారు. డిమాండ్ ఎక్కువగా ఉండే సమయాల్లో టికెట్ ధర ఎక్కువగా, డిమాండ్ లేని సమయాల్లో తక్కువగా ఉంటుంది. గరిష్టంగా 25 శాతానికి మించకుండా పెంచుతారు, కనిష్టంగా 20 శాతానికి తగ్గకుండా ధరలు తగ్గిస్తారు. తనంతట తానుగా పరిస్థితి ఆధారంగా సిస్టమే ధరలను మార్చుకునే సాఫ్ట్వేర్ను సిద్ధం చేశారు. ఇందుకు ఓ ప్రైవేటు సాఫ్ట్వేర్ డెవలపింగ్ సంస్థతో ఒప్పందం చేసుకున్నారు. దాదాపు నెల రోజుల కసరత్తు తర్వాత ఆ విధానం సిద్ధం కావటంతో సోమవారం నుంచి దాన్ని ప్రారంభిస్తున్నారు. దీంతో దూరప్రాంతాలకు వెళ్లే సర్వీసుల్లో టికెట్ ధరలు ఇక గంటగంటకు మారనున్నాయి. లహరి స్లీపర్ సర్వీసుల్లో కూడా ఇదే విధానం అమలుకానుంది. -
తెలంగాణ ఆర్టీసీ స్లీపర్ బస్సులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ తొలిసారి ప్రీమియం కేటగిరీ స్లీపర్ బస్సులను ప్రారంభిస్తోంది. లహరి పేరుతో రోడ్డెక్కుతున్న ఈ బస్సుల్లో తొలుత 10 సర్వీసులను సోమవారం ఉదయం ప్రారంభిస్తోంది. మరో ఆరు బస్సులను రెండు మూడు రోజుల్లో నడపనున్నారు. ఇప్పటికే అద్దె ప్రాతిపదికన ప్రైవేటు వ్యక్తుల నుంచి తీసుకున్న సర్వీసులతో పాటు సొంతంగా కొన్న బస్సులను ప్రారంభిస్తోంది. టెండర్ ద్వారా అశోక్ లేలాండ్ కంపెనీ నుంచి ఈ బస్సులను కొన్నారు. ఈ స్లీపర్ బస్సులను తొలుత హైదరాబాద్ నుంచి ఐదు నగరాలకు తిప్పనున్నారు. మియాపూర్, ఎంజీబీఎస్ల నుంచి బెంగళూరుకు, హుబ్లీకి, బీహెచ్ఈఎల్, ఎంజీబీఎస్ల నుంచి విశాఖపట్నం, తిరుపతి, చెన్నైలకు నడుపుతారు. గరుడ ప్లస్ కంటే ఈ బస్సుల్లో టికెట్ ధర 30 శాతం వరకు ఎక్కువగా ఉండనుంది. రైలు మూడో ఏసీ శ్రేణి టికెట్ ధరకు ఇంచుమించు సమంగా వీటి టికెట్ ధరలను ఖరారు చేశారు. లహరి స్లీపర్ బస్సుల్లో 30 బెర్తులు ఉంటాయి. మంచినీటి సీసా హోల్డర్, మొబైల్ చార్జింగ్ సాకెట్తోపాటు ఉచిత వైఫై వసతి ఉంటుంది. ఈ బస్సుల్లో మూడు సీసీ కెమెరాలు, పానిక్ బటన్, రేర్ వ్యూ కెమెరా, ఎల్ఈడీ సూచిక బోర్డులుంటాయి. ప్రారంభోత్సవ ఆఫర్.. ఈ కొత్త సర్వీసులను ప్రారంభిస్తున్న సందర్భంగా తొలుత కొన్ని రోజుల పాటు టికెట్ ధరల్లో తగ్గింపును అమలు చేస్తున్నారు. కర్ణాటక రాష్ట్రంలోని ప్రాంతాలకు వెళ్లే సర్వీసుల్లో 20 శాతం, ఇతర రూట్లలో తిరిగే బస్సుల్లో 15 శాతం మేర టికెట్ ధరలను తగ్గించనున్నారు. డైనమిక్ ఫేర్ విధానం ప్రారంభం.. డైనమిక్ టికెట్ ఫేర్ విధానాన్ని కూడా సోమవారం నుంచే ఆర్టీసీ ప్రారంభిస్తోంది. తొలిసారి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల తరహాలో డిమాండ్ ఆధారంగా టికెట్ ధరలను సవరిస్తారు. డిమాండ్ ఎక్కువగా ఉండే సమయాల్లో టికెట్ ధర ఎక్కువగా, డిమాండ్ లేని సమయాల్లో తక్కువగా ఉంటుంది. గరిష్టంగా 25 శాతానికి మించకుండా పెంచుతారు, కనిష్టంగా 20 శాతానికి తగ్గకుండా ధరలు తగ్గిస్తారు. తనంతట తానుగా పరిస్థితి ఆధారంగా సిస్టమే ధరలను మార్చుకునే సాఫ్ట్వేర్ను సిద్ధం చేశారు. ఇందుకు ఓ ప్రైవేటు సాఫ్ట్వేర్ డెవలపింగ్ సంస్థతో ఒప్పందం చేసుకున్నారు. దాదాపు నెల రోజుల కసరత్తు తర్వాత ఆ విధానం సిద్ధం కావటంతో సోమవారం నుంచి దాన్ని ప్రారంభిస్తున్నారు. దీంతో దూరప్రాంతాలకు వెళ్లే సర్వీసుల్లో టికెట్ ధరలు ఇక గంటగంటకు మారనున్నాయి. లహరి స్లీపర్ సర్వీసుల్లో కూడా ఇదే విధానం అమలుకానుంది. -
సకల చరాచర జగత్తుకు లయకారుడు పరమేశ్వరుడు
-
ప్రాణం తీసిన చలిమంట.. సోషల్ మీడియాలో పోస్ట్తో..
సాక్షి, నెల్లూరు(వెంకటాచలం): చలి కాచుకునేందుకు వేసిన మంట ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. మంటలు అంటుకుని ఇద్దరు చిన్నపిల్లలు, కాపాడేందుకు వెళ్లిన తల్లి గాయపడ్డారు. రెండేళ్ల వయసున్న చిన్నకుమార్తె చికిత్స పొందుతూ మృతిచెందింది. ఈ విషయం బుధవారం సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో బయట పడింది. అయితే పోలీసులు గోప్యంగా ఉంచడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మండలంలోని కంటేపల్లి గ్రామానికి చెందిన మానికల రవికృష్ణ పెయింట్ పని చేస్తుంటాడు. అతడికి భార్య నాగభూషణమ్మ, కుమార్తెలు లహరిశ్రీ, శ్రీవర్ష (2) ఉన్నారు. ఈనెల 16వ తేదీన తెల్లవారుజామున నాగభూషణమ్మ థిన్నర్ వాడి ఇంటి ముందు చలిమంట వేసింది. కుమార్తెలు చలి కాచుకుంటుండగా ఆమె సమీపంలో ముగ్గు వేస్తోంది. రవికృష్ణ కూడా అక్కడ ఉన్నాడు. కాగా మంట ఆరిపోతుండడంతో లహరిశ్రీ థిన్నర్ పోసింది. దీంతో ఒక్కసారిగా మంటలు పెద్దఎత్తున చెలరేగి లహరిశ్రీ, శ్రీవర్ష శరీరానికి అంటుకున్నాయి. తల్లి చూసి వారిని కాపాడేందుకు ప్రయత్నించింది. ఈక్రమంలో ముగ్గురూ తీవ్రంగా గాయపడ్డారు. రవికృష్ణ, స్థానికులు వెంటనే 108 అంబులెన్స్కు సమాచారం అందించారు. 108 సిబ్బంది ముగ్గురిని చికిత్స నిమిత్తం నెల్లూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన పిల్లలను మెరుగైన చికిత్స కోసం చెన్నైకి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శ్రీవర్ష మంగళవారం సాయంత్రం మృతిచెందింది. ఈ విషయాన్ని పోలీసులు గోప్యంగా ఉంచారు. అయితే కొందరు వ్యక్తులు బాధిత గిరిజన కుటుంబాన్ని ఆదుకోవాలన్న లక్ష్యంతో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టగా వైరలైంది. కాగా ఇది పెద్ద విషయం కాదన్నట్లుగా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పత్రికలు, మీడియాకు తెలియజేసి ఉంటే బాధితులకు సాయం అందేదని చెబుతున్నారు. చలి కాచుకునేందుకు వేసిన మంట చిన్నారిని బలి తీసుకోవడం, మరో బాలిక, తల్లి గాయాలపాలవడంతో కంటేపల్లి గిరిజన కాలనీలో విషాదం నెలకొంది. -
TSRTC: ఏపీకి స్పెషల్ స్లీపర్ బస్సులు.. ఛార్జీలు ఎంతంటే?
సాక్షి, హైదరాబాద్: సంక్రాంతి పండుగ సంబురాలు ప్రారంభమయ్యాయి. న్యూ ఇయర్ ముగిసిన వెంటనే జనాలు పండుగ కోసం స్పెషల్ ప్లాన్స్ రెడీ చేసుకుంటున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరవాసులు సిటీ నుంచి తమ స్వగ్రామాలకు వెళ్లేందుకు ఇప్పటి నుంచే ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో బస్సులు, రైళ్లలో టికెట్స్ అడ్వాన్స్ బుకింగ్స్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. సంక్రాంతి పండుగ కోసం తెలంగాణ ఆర్టీసీ సైతం రెడీ అయ్యింది. ఈ ఏడాది పండుగ కోసం ఆర్టీసీ స్పెషల్ బస్సులను సిద్ధం చేసింది. పండుగకు ముందే స్లీపర్ బస్సులను టీఎస్ఆర్టీసీ ప్రారంభించనుంది. ప్రయాణికులను ఆకర్షించే విధంగా లహరి నాన్ ఏసీ స్లీపర్ బస్సులను సిద్ధం చేసింది. సంక్రాంతికి 10 లహరి స్లీపర్ బస్సులను హైదరాబాద్ నుండి కాకినాడ, విజయవాడకు నడుపనుంది. ఇక, ఈ బస్సుల్లో మాములు ఆర్టీసీ బస్సుల్లో ఉన్న విధంగానే సాధారణ ఛార్జీలే తీసుకోనున్నట్టు తెలుస్తోంది. రాబోయే రోజుల్లో మరిన్ని బస్సులు కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్టు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పష్టం చేశారు. ప్రయాణికుల సౌకర్యార్థం బస్సులను మేకింగ్ చేసినట్టు ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. -
తెలంగాణ ఆర్టీసీలో మొదలైన సంక్రాంతి పండుగ
-
సమ్మోహనం... లహరి కూచిపూడి అరంగేట్రం
వాషింగ్టన్: తెలుగు నేలపై ప్రాణం పోసుకున్న కూచిపూడి నాట్యం ఖండాంతరాలు దాటి తన ఉనికిని చాటుకుంటూనే ఉంది. అమెరికాలో స్థిరపడిన భారతీయ కుటుంబాలు తమ పిల్లలకు శాస్త్రీయ నృత్యాలను నేర్పిస్తూ సంస్కృతిని పరిరక్షిస్తున్నారు. జార్జియా రాష్ట్రం అట్లాంటాలో 17 ఏళ్ల లహరి పిసికె ప్రదర్శించిన కూచిపూడి ఆరంగేట్రం స్థానిక అమెరికన్లతో పాటు అహూతులైన తెలుగు వారిని విశేషంగా ఆకట్టుకుంది. అట్లాంటాలో పలు సాఫ్ట్ వేర్ సంస్థలు నిర్వహిస్తున్న వేణు కుమార్ రెడ్డి పిసికె, వాసవి దంపతుల కుమార్తె లహరి 8వ ఏట నుంచే అభ్యాసం ప్రారంభించి ఆదివారం నాడు తొలి అరంగేట్రం ప్రదర్శనతో అందరినీ అలరించింది. కూచిపూడిలోని అత్యంత కఠినమైన 100 రకాలు పాద ముద్రలు, శిల్ప సదృశ్య దేహ భంగిమలు, హస్త ముద్రలు, కళ్ల కదలికలతో ముఖంలో అనేక భావాలను పలికించి ప్రశంసలు పొందింది. విఘ్నేశ్వర, నటరాజ పూజలతో మొదలైన నాట్య ప్రదర్శన నాలుగు గంటల పాటు నిర్విరామంగా సాగింది. చదవండి👉🏻అదే భారత్ గొప్పతనం.. ‘సాక్షి’తో సద్గురు తల్లిదండ్రులు వేణు కుమార్ రెడ్డి పిసికె, వాసవిలతో.. లహరి వేణు స్వగ్రామం నల్లొండ జిల్లాలోని అల్వాల గ్రామం. 25 ఏళ్ల క్రితం అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) అనుబంధ సంస్థ అయిన అమెరికా క్రికెట్ బోర్డు వ్యవస్థాపక సభ్యుడిగా ఆయన కొనసాగుతున్నారు. చదవండి👉🏻మొసలిని పెళ్లాడిన మేయర్.. దాన్ని ముద్దుపెట్టుకుంటూ ఫోటోకు పోజులు -
Bigg Boss 5 Telugu: అసలు బిగ్బాస్లో ఏం జరుగుతోంది?
అమ్మాయిలు అబ్బాయిలతో మాట్లాడకూడదా? అమ్మాయిలు అబ్బాయిలతో మాట్లాడటం తప్పా? ‘హగ్’ ఇచ్చిపుచ్చుకోవడం తప్పా? ‘బిగ్బాస్ 5’లో కంటెస్టెంట్లు ఎలాంటి ప్రవర్తనతో ఉండాలో జడ్జిమెంట్స్ జరుగుతున్నాయి. ఈ జడ్జిమెంట్స్ చేస్తున్నది అమ్మాయిలే కావడం గమనార్హం. అసలు బిగ్బాస్లో ఏం జరుగుతోంది? ఇన్నేళ్ల స్త్రీ ఉద్యమాలు, మహిళా చైతన్యం, జెండర్ సెన్సిటివిటి ప్రయత్నాలు... ఇవన్నీ చాలామంది సెలబ్రిటీల వరకూ చేరినట్టు లేదు. స్త్రీ, పురుషుల వ్యక్తిగతాల ప్రస్తావన ఎంత చేయాలో కూడా తెలుస్తున్నట్టు లేదు. నటుడు నాగార్జున యాంకర్గా పని చేస్తున్న ‘బిగ్బాస్ 5’లో కీచులాటలు ఇదే విషయాన్ని రుజువు చేస్తున్నాయి. ఇంతకు మునుపు లేని తకరార్లు కనిపిస్తున్నాయి. ఒక ఎపిసోడ్లో కంటెస్టెంట్లు రవి, కాజల్లు రిపోర్టర్లుగా మారి ప్రతి కంటెస్టెంట్ తో ‘హౌస్ లో ఎవరు భార్య, ఎవరు ప్రియురాలు, ఎవరు పని మనిషి’గా ఉండాలనుకుంటున్నారు అని అడిగితే ‘పనిమనిషి’గా అందరూ మహిళా కంటెస్టెంట్ల పేర్లే చెప్పారు, సరదాగానే. వీరందరికీ ‘పనిమనిషి’ స్త్రీయే. ఒక్కరు కూడా ‘పనివాడు’ కోరలేదు... ఫలానా మగ కంటెస్టెంట్ను పనివాడుగా పెట్టుకుంటాను అనలేదు. ‘ఇంటి పని’, ‘పని మనిషి’ స్త్రీకే కేటాయించబడుతోంది ఇంకా. (చదవండి: మిడ్నైట్ హగ్.. అడ్డంగా బుక్కైన రవి, వీడియో వైరల్) బిగ్బాస్ హౌస్లో వంట విషయం కూడా ప్రతిసారి స్త్రీల వ్యవహారంగా మారుతూ ఉంటుంది. మగ కంటెస్టెంట్లు హౌస్కు సంబంధించిన ఇతర పని పంచుకున్నా వంటను స్త్రీల పనిగానే స్టీరియోటైప్ చేస్తూ వెళ్లడం కొనసాగుతోంది. గత బిగ్బాస్ షో లో నటుడు బాలాజీ వంట పని చేశాడు. ఎన్.టి.ఆర్ బిర్యానీ వండాడు. మగవారిని వంటకు ప్రోత్సహించే ఇలాంటి చర్యలు తక్కువయ్యాయి. ఇక సోమవారం (సెప్టెంబర్ 20) నామినేషన్ సందర్భంగా నటి ప్రియ కొన్ని అభ్యంతర కరమైన వ్యాఖ్యలు చేసింది. నటి లహరి కేవలం అబ్బాయిలతోనే మాట్లాడుతోందని ఫిర్యాదు. యాంకర్ రవికి హగ్ ఇస్తూ కనిపించిందని మరో ఫిర్యాదు. ఈమె ఈ రెండు మాటలను ‘క్యాజువల్’గా కాక ‘ఫిర్యాదు’ టోన్తో ‘చేయకూడని’ పనిగా చెప్పడంతో హౌస్లోని అందరూ హతాశులయ్యారు. బిగ్బాస్ హౌస్లో హగ్ ఇవ్వడం సర్వసాధారణమే అయినా ప్రియా చెప్పిన తీరు ‘నింద’ ను వేసేలా, ‘కంట్రోల్’ చేసేలా దానికి లహరి సంజాయిషీ ఇవ్వాల్సి వచ్చేట్టుగా మార్చింది. అమ్మాయిలు పూర్తిగా అబ్బాయిలతో మాట్లాడటం, స్నేహం చేయడం తప్పు అనే ధోరణిని నటి ప్రియ వ్యక్తపరిచింది. ఇంకా ఆమె ‘లహరి సింగిల్ కనుక ఆమె ఎలా అయినా వ్యవహరించవచ్చు... కాని రవి వివాహితుడు కనుక అలా చేయడానికి లేదు’ అని వ్యక్తిగత ప్రవర్తనలు ఎలా ఉండాలో తీర్పులు వ్యక్తం చేసింది. దాంతో నెటిజన్లు భారీగా ప్రియను ట్రోల్ చేస్తున్నారు. -
బిగ్బాస్: మిడ్నైట్ హగ్.. అడ్డంగా బుక్కైన రవి, వీడియో వైరల్
బిగ్బాస్ హౌస్లో ప్రియ వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి. లహరిని నామినేట్ చేసిన ప్రియ.. రవి, లహరి అర్థరాత్రి సమయంలో రెస్ట్ రూమ్లో హగ్ చేసుకున్నారని, ఆమె ఎక్కువగా మగాళ్లతోనే తిరుగుతుందంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. అయితే అది నార్మల్ హగ్గేనని, రవిని నేను బ్రో అని పిలుస్తానని , మా మధ్య వేరే ఉద్దేశం లేదని కుండబద్దలు కొట్టింది లహరి. రవి కూడా అలాంటి రాంగ్ స్టెట్మెంట్స్ ఎలా ఇస్తావంటూ ప్రియపై ఫైర్ అయ్యాడు. (చదవండి: రవి, లహరి మిడ్నైట్ హగ్ ఇష్యూ.. యాంకర్ భార్య షాకింగ్ కామెంట్) తన కూతురికి ఈ విషయం అర్థమయితే ఎలా ఉంటుందంటూ ఎమోషనల్ అయ్యాడు కూడా. ఇక లహరి కూడా ఒక నేషనల్ మీడియాలో ఇలాంటి మాటలు ఎలా మాట్లాడుతారంటూ భావోద్వేగానికి లోనైంది. ప్రియ మాత్రం తాను చూసిందే చెప్పానంటూనే రవి, లహరిలకు సారీ చెప్పింది. అయితే ఈ ఇష్యూ ఇంతటితో ఆగలేదని తాజా ప్రోమో చూస్తే అర్థమవుతుంది. అందులో ప్రియ ఎందుకు ఆ కామెంట్ చెప్పిందో వివరించింది. గొడవ జరగడానికి ముందు రవి తనకు ఎం చెప్పాడో ఆ విషయాన్ని లహరితో షేర్ చేసుకుంది ప్రియ. లహరి బిగ్ బాస్ తరువాత యాంకర్గా నిలదొక్కుకోవడానికి ట్రై చేస్తుందని.. అందుకే నా వెంట పడుతుందనే అనుమానం ఉందని ప్రియతో అన్నాడు రవి. అంతేకాదు హౌస్లో అంతమంది పెళ్లి కాని వాళ్లు ఉన్నప్పటికీ ఆమె తన వెంటే పడుతుందని.. ఎక్కడికి వెళ్లినా తనతో వస్తుందని.. ఆమెకు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదంటూ రవి తనతో చెప్పిన మాటలను ఉన్నది ఉన్నట్లుగా లహరికి వివరించింది ప్రియ. దీంతో లహరి డైరెక్ట్గా వచ్చి రవిని నిలదీసింది. దీంతో షాకైన రవి.. ‘అక్కా నేను అసలు సింగిల్ మెన్ అనే పదాన్ని ఉపయోగించలేదు.. నేను నీతో అలా చెప్పలేదు’ అని ప్రియతో వాదనకు దిగాడు. అయితే ప్రియ మాత్రం నువ్ అన్నావ్ బ్రో అని కన్నీళ్లు పెట్టుకుంటూ చెప్పింది. ఆ తరువాత తనని బ్యాడ్ చేయడానికే ప్రియ ఇలా అంటుందంటూ లహరికి చెప్పాడు రవి. Lol 😂😂😂#BiggBossTelugu5 https://t.co/vAyUID78MD pic.twitter.com/TB0edqWllg — S. (@sahithi_123) September 21, 2021 అయితే లహరి గురించి ప్రియతో రవి చెప్పిన మాటలు నిజమేనని నిన్నటి బిగ్బాస్ ఎపిసోడ్ చూసిన ప్రతి ఒక్కరి అర్థమవుతంది. తాజాగా లహరి గురించి రవి మాట్లాడిని మాటలకు తాలుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అందో రవి నిజంగా లహరిపై బ్యాడ్ కామెంట్స్ చేశాడు. అయితే అతని ఉద్దేశం ఎలా ఉన్నప్పటికీ ప్రియతో అలా చెప్పడం, ప్రియ అదే విషయానికి కొంచెం మసాలా దట్టించి నామినేషన్ ప్రక్రియలో అందరి ముందు నోరు విప్పడం.. వివాదానికి దారి తీసింది. అయితే నిన్నటి వరకు ప్రియని తిట్టుకున్న వాళ్లంతా తాజా వీడియో చూసి రవిని కూడా ట్రోల్ చేస్తున్నారు. మరి ఈ మిడ్నైట్ హగ్ గొడవ ఎక్కడి దారి తీసిందో తెలియాలంటే నేటి ఎపిసోడ్ చూడాల్సిందే. -
రవి, లహరి మిడ్నైట్ హగ్ ఇష్యూ.. యాంకర్ భార్య షాకింగ్ కామెంట్
బిగ్బాస్ హౌస్లో నిన్న రాత్రి ప్రియ చేసిన వ్యాఖ్యలు దూమారం లేపాయి. లహరి ఎప్పుడూ అబ్బాయిలతోనే తిరుగుతుందని, అర్థరాత్రి రవి, ఆమె హగ్ చేసుకున్నారంటూ ప్రియ షాకింగ్ విషయాలను వెల్లడించిది.ఆమె వ్యాఖ్యలపై లహరి, రవితో పాటు మిగతా ఇంటి సభ్యులు కూడా ఓ రేంజ్లో మండిపడ్డారు. లహరి అయితే నేషనల్ మీడియాలో ఇలాంటి తప్పుడు ఆరోపణలు ఎలా చేస్తావంటూ ప్రియపై సీరియస్ అయింది. తన కూతురుకు ఈ వ్యాఖ్యలు అర్థం అయితే ఎలా ఉంటుందంటూ రవి ఫైర్ అయ్యాడు. ఆడపిల్లలతో మాట్లాడేటప్పుడు పద్ధతిగా మాట్లాడండి, ఒక మనిషికి హగ్గిస్తే బూతు కాదని హితవు పలికాడు సన్నీ. ఇలా బిగ్బాస్ హౌస్లోని ప్రతి ఒక్కరు ప్రియ వ్యాఖ్యలను తప్పుబట్టారు. ప్రస్తుతం ఈ గొడవ ఇంకా పెద్దదైనట్లు కనిపిస్తోంది. సోషల్ మీడియాలో సైతం ప్రస్తుతం ఇది హాట్ టాపిగ్గా మారింది. తాజాగా ఈ వ్యాఖ్యలపై రవి భార్య సోషల్ మీడియా వేదికగా స్పందించింది. (చదవండి: ఆమె బిగ్బాస్ షోకు పనికి రాదు: ఉమా దేవి) చాలామంది ఈ ఇష్యూపై స్పందిస్తూ నాకు చాలా మెసేజ్లు పెడుతున్నారు. నాపై చూపిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు. నేను బాగానే ఉన్నాను. మీ మద్దతు తెలియజేస్తున్నందుకు చాలా పెద్ద థాంక్స్.నేను రవి చాలా డిఫికల్ట్ పరిస్థితుల్ని ఫేస్ చేశాం.. కానీ మా బంధాన్ని విడగొట్టలేరు. మా మధ్య చెరగని నమ్మకం మమ్మల్ని మరింత బలోపేతం చేసింది. అంటూ తన ఇన్స్టాలో ఓ పోస్ట్ పెట్టింది. అయితే నిత్య పోస్ట్పై రవి అభిమానులు స్పందిస్తూ.. ఖచ్చితంగా అన్నయ్య టైటిల్ గెలుస్తాడు.. భార్య అంటే మీలా ఉండాలి.. నిజమైన ప్రేమ అంటే మీదే. ప్రియని ఈ వారం ఎలిమినేట్ చేయాల్సిందే అంటూ కామెంట్లు పెడుతున్నారు. View this post on Instagram A post shared by Nitya Saxena (@nitya.saxena1186) -
‘జాంబీ రెడ్డి’లో అలరించనున్న లహరి షరీ
ఇంద్ర సినిమాలో జూనియర్ ఇంద్రసేనా రెడ్డిగా తొడకొట్టిన తేజ సజ్జా హీరోగా టాలీవుడ్లో ఎంట్రీ ఇస్తున్న చిత్రం జాంబీ రెడ్డి. ఆనంది, దక్ష నగార్కర్ హీరోయిన్స్గా నటిస్తున్నారు. యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 5 ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. జాంబీరెడ్డి సినిమాలో లహరి షరీ కీలక పాత్రలో కనిపించనున్నారు. బుల్లితెర ద్వారా సినిమా రంగంలోకి అడుగుపెట్టిన లహరికి ఈ సినిమా మంచి పేరును తెచ్చిపెట్టనుందనడంలో సందేహం లేదు. టీవీ ప్రెజెంటర్గా కెరీర్ ప్రారంభించిన లహరి పలు ఛానల్లో వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఆ తరువాత తన టాలెంట్తో అనేక సినిమాల్లో నటించి ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించింది. 2017లో వచ్చిన అర్జున్ రెడ్డి ద్వారా సిల్వర్ స్క్రీన్కు పరిచయమయ్యారు లహరి. అందులో అమాయక నర్సుగా నటించి అందరి మన్ననలు పొందారు. చదవండి: కరోనా నేపథ్యంలో జాంబీ రెడ్డి తరువాత మళ్లీ రావా (2017 ), పటేల్ సార్ (2017), పేపర్ బాయ్ (2018), శ్రీనివాస కళ్యాణం (2018), అజ్ఞాతవాసి(2018) తిప్పర మీసం (2019) సినిమాల్లో ఆకట్టుకున్న లహరి ఇప్పుడు జాంబీ రెడ్డి ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ చిత్రంలో లహరి షరీ పాత్ర కీలకం కావడంతో ఇది ఆమె కెరీర్లో పెద్ద హిట్గా నిలవబోతుందనడంలో ఆశ్చర్యం లేదు. కాగా జాంబీ రెడ్డి ట్రైలర్ను ఇటీవల ప్రభాస్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆపిల్ స్టూడియోస్ బ్యానర్పై రూపొందుతున్న ఈ జాంబీ రెడ్డి సినిమాకు రాజశేఖర్ వర్మ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మార్క్ కే రాబిన్ సంగీతం అందిస్తున్నారు. ఆనందీ, దక్ష నగర్కర్, గెటప్ శ్రీను, పృథ్వీ, రఘు బాబు, అన్న పూర్ణమ్మ, కిరీటి, హరితేజ, మహేష్ విట్ట ఇతర పాత్రల్లో నటించారు. కరోనా వైరస్ చుట్టూ తిరిగే ఈ కథను కర్నూలులో తీశారు. మహమ్మారిని కట్టడి చేయడంలో కర్నూలు ప్రజలు ఎలా బయటపడ్డారనేది చిత్రం. లాహరి షరీ ప్రస్తుతం కన్నడ సినిమా ‘గ్రామ’లో నటిస్తున్నారు. హేమంత్ కుమార్ రూపొందిస్తున్న ఈ సినిమాలో ఆమె కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాతో తనకు మంచి బ్రేక్ వస్తుందని లాహరి షరీ నమ్మకంగా ఉన్నారు. మున్ముందు మరింత బిజీ అవుతానని ఆమె ఆశిస్తున్నారు. -
సంజయ్ వర్మ.. కథ మొదలైంది
ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి శిష్యుడు సాయికృష్ణ కేవీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కథ మొదలైంది’ చిత్రం హైదరాబాద్లో ఆరంభమైంది. సంజయ్ వర్మ హీరోగా, లహరి, సంజనా చౌదరి, దర్శిని హీరోయిన్లుగా నటిస్తున్నారు. సీనియర్ నటుడు సురేష్ కీలక పాత్ర పోషిస్తున్నారు. తమటం కుమార్ రెడ్డి, సన్నిధి ప్రసాద్, టి. రమేష్ నిర్మిస్తున్నారు. దేవుని పటాలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి తమటం కుమార్ రెడ్డి క్లాప్ ఇచ్చారు. నటుడు సురేష్ మాట్లాడుతూ– ‘‘చాలా రోజుల తర్వాత మంచి కథ విన్నాను. సంజయ్కి కెరీర్ ఆరంభంలోనే ఇంత మంచి కథ లభించడం చాలా అదృష్టంగా చెప్పుకోవాలి’’ అన్నారు. ‘‘ఒక చిన్న విరామం, ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ చిత్రాల్లో హీరోగా నటించిన సంజయ్ వర్మ ఇందులో హీరోగా నటిస్తున్నారు. సింగిల్ షెడ్యూల్లో చిత్రీకరణ పూర్తి చేస్తాం’’ అన్నారు తమటం కుమార్ రెడ్డి. ‘‘సమాజంలో జరిగే సంఘటనల నుంచి స్ఫూర్తి పొంది చేస్తున్న కామెడీ, సస్పెన్స్ థ్రిల్లర్ ఇది’’ అన్నారు సాయికృష్ణ కేవీ. -
ఆట.. పాట.. చైతన్యం
కళాకారులకు లాక్డౌన్ అడ్డుగాలేదు... ఒంట్లోకి, ఇంట్లోకి కరోనా రానివ్వకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి.. ఆ వైరస్ తెచ్చినlకష్టం కలకాలం ఉండదని.. ఏకాంతంలో ఉంటూ సమష్టి బాధ్యతలో పాలుపంచుకోవాలనే చైతన్యాన్ని కళనే మాధ్యమంగా వాట్సప్, యూట్యూబ్ వేదికల ద్వారా పంచుతున్నారు ఈ అక్కాచెల్లెళ్లు లహరి, లక్ష్మీప్రియ.. ఈ అక్కాచెల్లెళ్లు ఇద్దరూ కూచిపూడి కళాకారులే. అక్క లహరి.. హైదరాబాద్లోని పొట్టిశ్రీరాములు తెలుగు యూనివర్శిటీలో కూచిపూడిలో పోస్ట్గ్రాడ్యుయేషన్ చేస్తోంది. చెల్లి.. లక్ష్మీప్రియది డ్యాన్స్లోనే డిగ్రీ. సమయం, సందర్భానుసారం ప్రదర్శనలిచ్చే వీరు ఇప్పుడు దానిని కూచిపూడిలోకి కన్వర్ట్ చేశారు.. కరోనా వ్యాప్తిని ఎలా నిరోధించాలో చెప్పడానికి. చేతులు శుభ్రంగా కడుక్కోవడం... అత్యవసరమై బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు మనిషికి మనిషికి మధ్య కనీస దూరం పాటించడం... వంటి జాగ్రత్తలను కూచిపూడి నాట్యరూపంలో చెప్తూ వీరు తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘జనతా కర్ఫ్యూ పాటించిన ఆదివారం.. ఊరికే ఇంట్లో కూర్చోని ఏం చేయాలా అని అనుకుంటూండగా ఈ ఆలోచన తట్టింది. అప్పటికప్పుడు ఈ మూడు జాగ్రత్తలకు కొరియోగ్రఫీ చేసి. చెల్లి, నేను కలిసి డ్యాన్స్ చేశాం. ఆ వీడియో ను ముందు తెలిసినవాళ్లకే పంపాం. బాగుంది... కరోనామీద అవేర్నెస్ కల్పించే వీడియో ఇది. అందరికీ తెలియాలి.. అని మా ఫ్రెండ్స్.. తెలిసినవాళ్లు.. సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. అలా అది వైరల్ అయింది’ చెప్పింది లహరి. అందరికీ చేరే మీడియం.. ‘సామాజిక సమస్యల మీద ప్రజల్లో అవగాహన తీసుకురావడానికి ఇలాంటి కళారూపాలు ఎంతో ఉపయోగపడ్తాయి. నేను డ్యాన్స్స్కూల్ నడుపుతున్నాను. స్త్రీ శక్తి, మహిళా సమస్యలకు సంబంధించిన అంశాలను తీసుకొని డాన్స్ కంపోజ్ చేసి నా సంస్థలోని పిల్లలతో ప్రదర్శనలిప్పిస్తుంటాను. దీనివల్ల డ్యాన్స్ చేసిన పిల్లలూ తమ హక్కులను ఎలా కాపాడుకోవాలో.. ఆత్మరక్షణ ఎలా చేసుకోవాలో తెలుసుకుంటారు. అందుకే ఏ మాత్రం అవకాశం దొరికినా.. ఈ కళను సామాజిక చైతన్యానికి సాధనంగా ఉపయోగించుకుంటూంటాను’ వివరించింది లహరి. పాటిస్తే దక్కేవి ప్రాణాలే.. కనోనాను అడ్డుకోవడానికి ప్రభుత్వం చెప్తున్న సూచనలు, చేస్తున్న హెచ్చరికలు పెడచెవిన పెట్టకండి. ప్రమాదంలో పడకండి.. సూచనలు పాటిస్తే దక్కేవి మన ప్రాణాలే.. ఏకాంతం లో ఉంటూ సమష్టి బాధ్యతలో పాలుపంచుకోండి అనే సారంతో యూట్యూబ్లో ఒక పాట బాగా వైరల్ అవుతోంది. ఆ పాటను పాడింది ఈ అక్కాచెల్లెళ్లే. అక్క పేరు జాహ్నవి.. చెల్లి లాస్య. టీవీలో రియాలిటీ షోస్ చూసేవాళ్లకు ఈ ఇద్దరూ సుపరిచితులు. 2017.. పాడుతా తీయగా విన్నర్ జాహ్నవి. జీ సరిగమలు లిటిల్ చాంప్స్ ఫైనలిస్ట్ లాస్య. ప్రతివారం.. ఆ వారంలో జరిగిన సంఘటన.. లేదా ఆ వారంలో బాగా పాపులర్ అయిన అంశం మీద ఇలా పాటను రికార్డ్ చేసి ‘జాహ్నవి సింగర్’ అనే యూట్యూబ్ చానల్లో పోస్ట్ చేయడం వీరి హాబీ. అలా ఈసారి... ప్రపంచాన్నే వణికిస్తోన్న కరోనాకు చెక్ పెట్టడానికి ఈ పాట పాడారు. ‘మా పాట మాకే కాదు పదిమందికీ మేలు చేయాలి కదా.. అందుకే ఇలాంటి వాటినీ పాడుతూంటాం’ అంటుంది పదిహేనేళ్ల జాహ్నవి. ఈ పాటను రాసింది వాళ్లమ్మ చోడవరపు లక్ష్మీశ్రీ. ఇదొక్కటే కాదు... వారం వారం ‘జాహ్నవి సింగర్’ యూట్యూబ్ చానల్లో అప్లోడ్ అయ్యే ప్రతి పాటా ఆమే రాస్తారు. ‘ఆట, పాట, చదువు ఎంత ముఖ్యమో .. తోటివారితో సఖ్యంగా ఉండడం.. సమాజం పట్ల బాధ్యతగా నడుచుకోవడమూ అంతే ముఖ్యమని, దీన్ని నేర్పాల్సిన బాధ్యత అమ్మగా నాదేననీ నమ్ముతా’ అంటారు లక్ష్మీశ్రీ. వీరే కాదు జానపద కళాకారులు నల్గొండ గద్దర్ నర్సిరెడ్డి, సాయిచంద్, ప్రముఖ చిత్రకారులు కూడా తమ పాటలు, బొమ్మలతో ప్రజల్లో చైతన్యం పెంచేందుకు కృషిచేస్తున్నారు. -
మలి సంధ్యలో మతాబుల వెలుగులు
సాక్షి, హైదరాబాద్: అనాథలు, వృద్ధులకు స్వచ్ఛందంగా సేవలు అందిస్తున్న ‘వి ఫర్ ఆర్ఫాన్’ సంస్థ మరోసారి దాతృత్వాన్ని చాటుకుంది. కుటుంబ సభ్యుల నిరాదరణకు లోనై వృద్ధాశ్రమంలో అనాథలుగా కాలం వెళ్లదీస్తున్న దీనుల కళ్లలో కాంతులు నింపింది. ఉప్పల్ సమీపం నారపల్లిలో ఉన్న లహరి వృద్ధాశ్రమంలో శనివారం వి ఫర్ ఆర్ఫాన్ సభ్యులు దీపావళి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వృద్ధులు, అనాథ పిల్లలతో దీపావళి పండుగ జరిపించి వారి మోముల్లో చిరునవ్వులు పూయించారు. అంతేకాదు 25 మంది వృద్ధులకు కొత్త బట్టలు అందించారు. స్వయంగా వృద్ధులకు మిఠాయిలు తినిపించి, వారి చేత దీపావళి బాణసంచా కాల్పించి సంతోషాలు పంచారు. తమకెంతో ఇష్టమైన బిర్యానీని కూడా స్వయంగా తినిపించి సొంత కుటుంబ సభ్యుల్లా ఆప్యాయత చూపడంతో వృద్ధులు కరిగిపోయారు. అందరూ ఉన్న అనాథల్లా గడుపుతున్న తమకు పండుగ ఆనందాన్ని పంచిన వారిని నిండు మనసుతో ఆశీర్వదించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ఎంబీసీ డీఎస్టీ నవనిర్మాణ సమితి రాష్ట్ర కన్వీనర్ బెల్లాపు దుర్గారావు అతిథిగా హాజరయ్యారు. చేర్యాల రాకేశ్, చేర్యాల విద్య, యోగిత, ఛార్మ్స్ సంపత్, హరీశ్, మాట్రిక్స్ రమేశ్, బేగంపేట రాజు, సుశీల్, ముకేశ్, కిరణ్, జైహింద్, చందుభాయ్, దుర్గాప్రసాద్, సింగిరాల శ్రవణ్కుమార్, నర్సింగ్, దొప్పల నరేశ్ తదితరులు స్వచ్ఛందంగా సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు. -
సాయిలహరి.. నృత్యమయూరి..
తూర్పుగోదావరి, కరప (కాకినాడ రూరల్): కూచిపూడి నృత్యంలో ప్రతిభ చూపుతూ, అందరి మన్ననలూ అందుకోవడమే కాకుండా అనేక అవార్డులు, రివార్డులు సొంతం చేసుకుంటోంది కరప గ్రామానికి చెందిన దేవగుప్తాపు సాయిలహరి. గ్రామస్థాయి నుంచి జాతీయ స్థాయి వరకూ నృత్య ప్రదర్శనలిచ్చి పలువురి ప్రశంసలందుకుంటోంది. తృతీయ జాతీయ స్థాయి నంది నాట్య మహోత్సవంలో భాగంగా గత నెల 24న తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో జరిగిన పోటీల్లో పాల్గొన్న సాయిలహరి గరుడ నాట్య నంది అవార్డును అందుకుంది. దేవగుప్తాపు సాంబశివరావు, అరుణల కుమార్తె సాయిలహరి. చిన్ననాటి నుంచీ సంప్రదాయ కూచిపూడి నాట్యంపై మక్కువ పెంచుకుంది. ఆమె అభిరుచిని గమనించిన తల్లిదండ్రులు కూడా చదువుతోపాటు కూచిపూడి కూడా నేర్పించేందుకు హైదరాబాద్లోని మంజీరా నృత్య అకాడమీలో చేర్పించారు. పదేళ్లపాటు గురువు రేణుకా ప్రభాకర్ సాయిలహరికి కూచిపూడి నాట్యంలో శిక్షణ ఇచ్చారు. సికింద్రాబాద్లోని గణేష్ ఆలయంలో సాయిలహరి ఆరంగేట్రం చేసింది. అక్కడి నుంచి ఆమె కూచిపూడి నృత్యప్రస్థానం మొదలైంది. ఉభయ తెలుగు రాష్ట్రాలతోపాటు ఢిల్లీ, హరిద్వార్, రిషీకేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో ఎన్నో ప్రదర్శనలిచ్చి భళా అనిపించుకుంది. ఇప్పటివరకూ 150కి పైగా ప్రదర్శనలిచ్చి, తెలుగువారి ఖ్యాతిని, కూచిపూడి విశిష్టతను దేశం నలుదిశలా వ్యాప్తి చేస్తోంది. గత నెలలో తిరుపతి మహతి ఆడిటోరియంలో జరిగిన జాతీయ స్థాయి నాట్య మహోత్సవంలో 100 మంది కళాకారులు పాల్గొనగా, మంజీరా అకాడమీ నుంచి సాయిలహరి బృందం గ్రూప్, సోలో విభాగాల్లో ప్రదర్శనలు ఇచ్చింది. ఈ ప్రదర్శనలో సాయిలహరి ప్రతిభ చూపి గరుడ నాట్య నంది అవార్డు కైవసం చేసుకుంది. సాయిలహరి పొందిన అవార్డులు బాలసుధాకర్ ఉగాది పురస్కారం, యువతరంగాలు, తెలంగాణ రికార్డు బుక్, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్, వరల్డ్ కల్చరల్ ఫెస్టివల్, సూపర్కిడ్స్ రికార్డు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ అవార్డు, అఖిల భారత కూచిపూడి నాట్య కళామందిర్ అవార్డు, రత్న ఉగాది పురస్కారం, సూర్య విద్యానికేతన్ అవార్డు, తెలంగాణ టూరిజం అవార్డు, ఆలిండియా క్లాసికల్ డ్యాన్స్ అవార్డు, సిలికానాంధ్ర రికార్డు, రాధామాధవ రసరంజని అవార్డు, కాకినాడ బీచ్ ఫెస్టివల్లో వరుసగా మూడేళ్లు పురస్కారాలు, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డు, సౌత్ ఇండియా డ్యాన్స్ అకాడమీ అవార్డు, తెలుగు వెలుగు కల్చరల్ అవార్డు, లయన్స్ క్లబ్ అవార్డులను సాయిలహరి ఇప్పటివరకూ అందుకుంది. వీటితోపాటు అనేక నగదు పురస్కారాలు కూడా అందుకుంది. హైదరాబాద్లోని వివిధ దేవాలయాలు, ఉభయ గోదావరి జిల్లాల్లో ఎన్నో ప్రదర్శనలిచ్చింది. తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే.. కూచిపూడి నాట్యంలో ఇన్ని అవార్డులు రావడానికి తల్లిదండ్రులు ఇస్తున్న ప్రోత్సాహం ఒక ఎత్తయితే, గురుమణి రేణుకా ప్రభాకర్ ఇచ్చిన శిక్షణే ప్రధాన కారణం. తాతయ్య, నాన్నమ్మలు వీరభద్రరావు, నాగలక్ష్మి, బాబాయ్ మూర్తి తోడ్పాటు కూడా మరువలేను. భవిష్యత్తులో అంతర్జాతీయ స్థాయిలో ప్రదర్శనలు ఇచ్చి, తెలుగువారికే సొంతమైన కూచిపూడి ఖ్యాతిని దశదిశలా వ్యాపింపజేయడమే జీవిత లక్ష్యం.– సాయిలహరి -
‘ట్రెండ్స్ లైఫ్స్టైల్ ’ ఎగ్జిబిషన్
-
ఈ బంధం.. మానవత్వం
‘రక్తం నీటి కంటే చిక్కనైనది, అందుకే రక్త సంబంధం ముందు మరే బంధమూ నిలవలేదు’..ఇదీ ఇప్పటి వరకు మనం నమ్ముతున్న నిజం. ఇప్పుడు మరో నిజం ఈ నానుడిని తుడిచి పెట్టేసింది. కుటుంబ బంధం చేయలేని పనిని ఆఫీస్లో సహోద్యోగి చేసింది. కొలీగ్ మార్షనీల్ సిన్హా కోసం కిడ్నీ ఇచ్చేసింది దితీ లాహిరి! మార్షనీల్ సిన్హాది జార్ఖండ్లోని బొకారో. ఆమె బెంగళూరులో ఐటీసీ ఇన్ఫోటెక్లో ఉద్యోగి. ఆమె తరచూ అనారోగ్యం పాలవుతుంటే మొదట్లో పెద్దగా పట్టించుకోలేదు. కానీ కిడ్నీలు విఫలమయ్యాయని తెలిసినప్పుడు అందరూ దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఆమె అలాగే ఉద్యోగం చేస్తోంది. ఐదేళ్లు గడిచిపోయాయి. మార్షనీల్ మనోధైర్యానికి ఆశ్చర్యపోయారు. క్రమంగా ఆమె ఆరోగ్యం క్షీణించసాగింది. ఆఫీస్లో పూర్తి సమయం సీట్లో కూర్చోవడం కూడా కష్టంగా మారింది. అప్పుడు ఆమెకు వర్క్ ఫ్రమ్ హోమ్ (ఇంటి నుంచి ఆఫీస్ పని చేయడానికి)కు అనుమతించింది సంస్థ. సొంతూరు బొకారోకి వెళ్లి పోయి ఇంటి నుంచే ఉద్యోగం చేసింది మార్షనీల్. ఆమెకి అప్పగించిన ప్రాజెక్ట్ గురించి తరచూ ఫోన్లో కాంటాక్ట్లో ఉండేది దితీ లాహిరి. మార్షనీల్ డయాలసిస్ చేయించుకుంటూ కూడా ఆఫీస్ పని చేస్తోందని తెలిసినప్పుడు లాహిరి కదిలిపోయింది. అప్పుడడిగింది మార్షనీల్ని పూర్తి వివరాలు చెప్పమని. మార్షనీల్కి కిడ్నీ మార్పిడి ఆపరేషన్ చేయాలని చెప్పారట డాక్టర్లు! ఆమెకు కిడ్నీ ఇవ్వడానికి తల్లిదండ్రులు సిద్ధంగా ఉన్నారు, కానీ వాళ్లిద్దరికీ ఆరోగ్య సమస్యలున్నాయి. కాబట్టి కిడ్నీ ఇవ్వగలిగిన పరిస్థితి కాదు వారిది. ఇక మిగిలింది మార్షనీల్ అక్క. ఆమె కూడా సిద్ధంగానే ఉంది. అయితే అత్తగారింట్లో ససేమిరా అన్నారు. ఆ ఇంటికి కోడలయ్యాక ఇక ఆమె దేహం మీద అధికారాలు కూడా తమవే అన్నట్లుంది వాళ్ల ధోరణి. మార్షనీల్ సోషల్ మీడియాలోను, ప్రధాన మీడియాలోనూ కిడ్నీ దాతల కోసం అభ్యర్థించింది. ప్రయత్నాలైతే జరిగాయి కానీ కిడ్నీ ఇచ్చే దాత దొరకలేదు. అదీ ఆమె పరిస్థితి. అప్పుడు మార్షనీల్ మెడికల్ రిపోర్టులను తెప్పించుకుని తనకు తెలిసిన డాక్టర్ను సంప్రదించింది లాహిరి. ఆ డాక్టర్ కూడా కిడ్నీ మార్పిడి ఒక్కటే మార్గమని చెప్పడంతో.. తన కిడ్నీ ఇవ్వడానికి సిద్ధమైంది! నిబంధనలు కఠినతరం మార్షనీల్ కోసం కిడ్నీ ఇచ్చే దాత దొరకడమే కష్టం అనుకున్నారు అప్పటి వరకు. ప్రభుత్వ నిబంధనలు ఎంత కఠినంగా ఉన్నాయనేది లాహిరి కిడ్నీ ఇవ్వడానికి సిద్ధమైన తర్వాత తెలిసింది. రక్తసంబంధీకులు కాకుండా మరెవరి నుంచయినా కిడ్నీ తీసుకోవాల్సి వస్తే లెక్కకు మించినన్ని నియమాలు. అంతకంటే ఎక్కువ దర్యాప్తులు. అవయవాల అక్రమ రవాణా చాపకింద నీరులా విస్తరించిన నేపథ్యంలో నిబంధనలు ఎక్కువయ్యాయి. తాను స్వచ్ఛందంగానే కిడ్నీ ఇవ్వదలచుకున్నట్లు పోలీసులకు అఫిడవిట్ దాఖలు చేసింది లాహిరి. ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ఎదుట వాంగ్మూలం ఇచ్చింది. కలెక్టర్కు తనకు సంబంధించిన పూర్తి వివరాల డాక్యుమెంట్లను సమర్పించింది. మున్సిపల్ కార్పొరేషన్, పోలీస్ వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేసింది. ఇందుకోసం తొమ్మిది నెలలు పట్టింది. ఇవన్నీ పూర్తి చేసుకుని హాస్పిటల్కు వెళ్లిన తరవాత అక్కడ ‘తన కిడ్నీని మార్షనీల్ కోసం ఇవ్వదలుచుకున్నానని, డాక్టర్లు తన దేహం నుంచి కిడ్నీ తీసుకోవడానికి తనకు ఎటువంటి అభ్యంతరం లేదు’ అని సంతకం చేసింది. ఇదంతా పూర్తయి ఈ నెల మూడవ తేదీన కోల్కతాలోని ఫోర్టిస్ హాస్పిటల్ అండ్ కిడ్నీ ఇన్స్టిట్యూట్లో లాహిరికి, మార్షనీల్కి సర్జరీ జరిగింది. ఆపరేషన్ విజయవంతమైందని, ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని, త్వరగా కోలుకుంటున్నారని ప్రకటించారు డాక్టర్లు. అమ్మను చూస్తున్నాను మార్షనీల్ ఎంతో తెలివైన అమ్మాయి. చక్కటి వ్యక్తిత్తం ఆమెది. ఎంతో భవిష్యత్తు ఉన్న అమ్మాయి అనారోగ్యం పాలవడం బాధనిపించింది. అలా దయనీయ స్థితిలో ప్రాణాలు పోతాయని తెలిసీ చూస్తూ ఊరుకోలేకపోయాను. నా నిర్ణయం విన్న వెంటనే అమ్మానాన్న విచిత్రంగా చూశారు. మా అమ్మ స్కూలు టీచరుగా పనిచేసి రిటైరైంది. ఆమె త్వరగానే అర్థం చేసుకుంది. మరో విషయం ఏమిటంటే... అమ్మ చాలా ఏళ్లుగా ఒక కిడ్నీతోనే జీవిస్తోంది. మా కంటే చురుగ్గా ఉంటుంది కూడా. అందుకే నాకు ఆరోగ్యం పట్ల భయం లేదు. – దితీ లాహిరి, ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్, ఇన్ఫోటెక్, బెంగళూరు – మంజీర -
సౌందర్య లహరి
బాలతారగా వెండితెరపై ‘అర్జున్’ చిత్రంలో కనిపించారు లహరి. ఆ తర్వాత ‘చక్రవాకం’తో సీరియల్ ప్రేక్షకులకు చేరువయ్యారు. బుల్లితెర ‘సౌందర్య’గా గుర్తింపు పొందారు. ప్రస్తుతం ‘ఋతుగీతం’ టెలీ సీరియల్తో తెలుగువారి హృదయాలను దోచుకుంటున్నారు. ఈ ‘సౌందర్య లహరి’తో సాక్షి ‘ఫ్యామిలీ’ ప్రతినిధి సంభాషణలోని విశేషాలివి. ప్రారంభం లహరి ఏడో తరగతి చదువుతుండగా ‘అర్జున్’ సినిమాలో నటించడానికి డ్యాన్స్ టీచర్తో కలసి సెట్స్కి వెళ్లారు. అలా ఆమె యాక్టింగ్ కెరీర్ మొదలైంది. ఆ సమయంలో దూరదర్శన్లో ప్రసారం అవుతున్న ‘బాలమందిరం’ కార్యక్రమానికి యాంకరింగ్ చేశారు. తరవాత కొన్నాళ్లు స్టడీస్ మీదే దృష్టి పెట్టారు. పదో తరగతి సెలవుల్లో మళ్లీ ఆమె అభినయ ప్రయాణం మొదలైంది. పునః ప్రారంభం సెలవుల్లో బోర్గా ఉంటోందని అమ్మతో అన్నప్పుడు, కూతుర్ని ఆమె ఓ టీవీ చానల్ ఆడిషన్స్కి తీసుకెళ్లారు. కొన్నాళ్ల తర్వాత వాళ్లు ఏకంగా యాంకరింగ్కి పిలిచారు. ఆ తరవాత జీ టీవీలోనూ లహరి యాంకరింగ్ చేయడం మొదలుపెట్టారు. ఈ ప్రోగ్రామ్స్ చేసే టైమ్లోనే ఆమె ఫొటోలు మంజులానాయుడుకు చేరాయి. వాళ్ల ప్రొడక్షన్లో ‘చక్రవాకం’ సీరియల్కి ఆమెను తీసుకున్నారు. ఆ సీరియల్ హిట్ అయిన సంగతి తెలిసిందే. అప్పుడు లహరి ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నారు. తర్వాత మళ్లీ వాళ్ల ప్రొడక్షన్లోనే వచ్చిన ‘మొగలిరేకులు’, ‘శ్రావణ సమీరాలు’ సీరియల్స్లో చేశారు. ఇంకా గుణ్ణం గంగరాజు ‘రాధ మధు’, అన్నపూర్ణ వారి ‘పుట్టింటి పట్టుచీర’, ‘సావిరõ ’లలో నటించారు. చేశారు. ప్రస్తుతం ఋతుగీతం (ఋతురాగాలు – 2)లో చేస్తున్నారు. నటనకు గుర్తింపు ‘కల్యాణ తిలకం’లో లహరి డ్యూయల్ రోల్ చేశారు. ఆ సీరియల్కి చాలా అవార్డులు అందుకున్నారు. ‘ముద్దుబిడ్డ’కు కూడా అవార్డులు వచ్చాయి. ‘రాధ మధు’ సీరియల్కి నంది అవార్డు వచ్చింది! ‘పక్కింటి అమ్మాయి, అత్తో అత్తమ్మ కూతురో, మమతల కోవెల, గోకులంలో సీత ఇలా అనేక సీరియల్స్లో ఆమెకు గుర్తింపు వచ్చింది. ‘‘పాజిటివ్ రోల్ వేసినా, నెగిటివ్ రోల్ వేసినా నన్ను టీవీ ప్రేక్షకులు రిసీవ్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంటుంది’’ అంటారు లహరి. ఇప్పటిదాకా 16 సీరియల్స్కి పైగా చేశారు. నటి సౌందర్య పోలికలు ఉండడంతో బుల్లి తెర సౌందర్యగా కూడా ఆమె ప్రత్యేకమైన గుర్తింపు పొందారు. ఇంట్లో ఉన్నట్లే ఒక పక్క సీరియల్స్ చేస్తూనే కొన్ని సినిమాలలో కూడా నటించారు లహరి. కందిరీగ, డాన్ సీను. ఆరెంజ్, గ్రీకు వీరుడు, రారా కృష్ణయ్యా (సెకండ్ హీరోయిన్) వాటిల్లో కొన్ని. ‘‘సినిమాల కంటె సీరియల్స్లో నటించడమే సౌకర్యంగా అనిపిస్తుంది. ఇంటి నుంచి బయలుదేరి షూటింగ్ స్పాట్కి వెళ్లినా అక్కడ కూడా ఇంట్లో ఉన్న భావనే కలుగుతుంది’’ అంటారు లహరి. ‘సూపర్’, ‘నర్తనశాల’ వంటి టీవీ షోలకు యాంకరింగ్గా చేయడం గురించి ‘డిఫరెంట్∙జర్నీ. నైస్ ఫీలింగ్’ అంటారు. లహరి పదో తరగతి వరకు డాన్బాస్కో హైస్కూల్లో చదివారు. బీటెక్ మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో, మాస్టర్స్.. హైదరాబాద్ ట్రిపుల్ ఐటీలో చేశారు. లహరి.. ఓన్లీ డాటర్. పేరెంట్స్ పాత్రే కీలకం ఒక రంగంలో రాణించాలంటే తల్లిదండ్రుల ప్రోత్సాహం ప్రధానం. లహరికి కూడా పేరెంట్స్ మంచి సపోర్టివ్గా ఉన్నారు. ‘‘మా అమ్మ లక్ష్మీమణి, నాన్న విశ్వనాథం ఇద్దరూ నన్ను బాగా ప్రోత్సహిస్తున్నారు. నేను ఒక ప్రాజెక్టు చేస్తున్నాను అనగానే అమ్మ నాతో వస్తుంది. లొకేషన్ చూసుకుంటుంది. ఆ తరవాత నన్ను ఒంటరిగా పంపుతుంది. అమ్మకు కుదరకపోతే నాన్న వస్తారు. నా కెరీర్ ఇంత జాలీగా వెళ్లిపోతోందంటే వాళ్ల వల్లే. లొకేషన్లో అందరూ మా పేరెంట్స్ గురించి ముందర అడుగుతారు’’ అని చెబుతున్న లహరి, అమ్మ తన పర్సనల్ డైరెక్టర్ అంటారు. ఆమె సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగి. కూతురి పర్సనల్ మేకప్, డ్రెస్సింగ్, యాక్టింగ్ అన్నిట్లోనూ ఆమే గైడ్ చేస్తారు సెంట్రల్ గవర్నమెంటు ఉద్యోగి అయిన లక్ష్మీమణి. -
లహరికి రజతం
జాతీయ స్థాయి స్నూకర్, బిలియర్డ్స్ టోర్నీ సాక్షి, హైదరాబాద్: జాతీయ స్థాయి స్నూకర్, బిలియర్డ్స్ చాంపియన్షిప్లో రాష్ట్రానికి చెందిన క్రీడాకారిణి ఐ. లహరి సత్తా చాటింది. పుణేలో జరిగిన ఈ టోర్నీలో రెండు పతకాలను సాధించింది. జూనియర్ బాలికల స్నూకర్ ఈవెంట్లో రజతం సాధించిన లహరి... బిలియర్డ్స్ ఈవెంట్లో కాంస్యాన్ని దక్కించుకుంది. గురువారం జరిగిన స్నూకర్ ఫైనల్లో కీరత్ భండాల్ (ఢిల్లీ) (2-1) 28-50, 52-36, 48-45తో లహరి (తెలంగాణ)పై గెలుపొందింది. బిలియర్డ్స్ ఈవెంట్లో మూడోస్థానం కోసం జరిగిన పోటీలో లహరి 113- 73తో కీర్తన (కర్ణాటక)ను ఓడించి పతకాన్ని గెలుచుకుంది. -
చిన్నారి గొంతు నులిమి దోపిడీ
రూ. లక్ష నగదు, 30 తులాల బంగారం అపహరణ... ఓటేసేందుకు వెళ్తే ఇల్లు దోచేశారు తల్లిదండ్రులు ఓటు వేసేందుకు వెళ్లగా.. ఇంట్లో ఉన్న పిల్లలను బెదిరించి రూ. లక్ష నగదుతోపాటు, 30 తులాల బంగారాన్ని దోచేశారు. స్థానిక శాంతినగర్ గౌరవ్ గార్డెన్స్ సమీపంలోని ఓ ఇంట్లో కాంట్రాక్టర్ రఘునాథరెడ్డి, సుజాత దంపతులు నివసిస్తున్నారు. ఆదివారం మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో తమ పిల్లలు లహరి (12), జస్వంత్ (7)లను ఇంట్లో వదిలి, ఓటు వేసేందుకు సమీపంలోని పోలింగ్ కేంద్రానికి వెళ్లారు. కొద్దిసేపటికి ఎవరో తలుపు తట్టడంతో వచ్చింది ఎవరంటూ లహరి ఆరా తీసింది. ‘ఏసీ రిపేర్ చేయడానికి వచ్చానని.. మమ్మీ, డాడీ ఓటు వేసేందుకు వెళుతూ ఎదురు వచ్చారని, తలుపులు తీయాలని అతను కోరాడు. దీంతో ఆ చిన్నారి తండ్రికి ఫోన్ చేసేందుకు ప్రయత్నిస్తూనే తలుపులు తీసి బయటకు వచ్చింది. బయటే వేచి ఉన్న అగంతకుడు అమె గొంతు పట్టుకుని నులుముతూ లోపలి గదిలోకి తీసుకెళ్లి బెదిరించడంతో, ఆమె తమ్ముడు జస్వంత్ బీరువా తాళాలు ఇచ్చేశాడు. బీరువా తెరిచి.. 30 తులాల బంగారు నగలు, రూ. లక్ష నగదు తీసుకుని దుండగుడు ఉడాయించాడు. ఇంటికి తిరిగి వచ్చిన తల్లిదండ్రులు విషయం తెలుసుకుని సమాచారం అందించడంతో త్రీటౌన్ పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఇంతకు ముందు ఎప్పుడూ అతడిని చూడలేదని చిన్నారి చెబుతోంది.