living relationship
-
సహజీవన జంట కిరాతకం
దొడ్డబళ్లాపురం: పుట్టిన బిడ్డను శ్రద్ధగా పోషిస్తారు. కానీ ఈ కిరాతక జంట ఏమాత్రం కనికరం లేకుండా పురిట్లోనే చంపేసింది. ఇటీవల రామనగర పట్టణంలోని దయానంద సాగర్ ఆస్పత్రిలోని టాయిలెట్ కమోడ్లో నవజాత శిశువు మృతదేహం లభించిన కేసు తీవ్ర సంచలనం కలిగించడం తెలిసిందే. ఇది నేపాల్ జంట నిర్వాకమని పోలీసులు తేల్చారు. వారిని అరెస్టు చేశారు. నిందితులు అమృత కుమారి (21), సురేంద్ర మెహ్రా (22). ఆస్పత్రికి వచ్చి.. వివరాలు.. గత నెల 24న ఆస్పత్రిలోని టాయిలెట్ కమోడ్లో ఏదో అడ్డం పడిందని సిబ్బంది చెప్పడంతో పారిశుధ్య కార్మికులు యంత్రాలతో శుభ్రం చేశారు. ఈ సమయంలో అప్పుడే పుట్టిన శిశువు మృతదేహం బయటకు వచ్చింది. దీంతో విచారణ చేపట్టగా గుట్టు రట్టయింది. అమృత, సురేంద్రలు సమీపంలోని ఒక ఫ్యాక్టరీలో పని చేస్తూ, సహ జీవనం సాగిస్తున్నారు. అమృత గర్భం దాల్చగా కడుపునొప్పిగా ఉందంటూ ఆ రోజున ఆస్పత్రికి వచ్చింది. టాయిలెట్కు వెళ్లినప్పుడు అక్కడే బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయం ఎవరికీ చెప్పకుండా శిశువును కమోడ్లో వేసి ఫ్లష్ చేసింది. తరువాత ఇద్దరూ వెళ్లిపోయారు. సీసీ కెమెరాల చిత్రాల ఆధారంగా నిందితులను అరెస్టు చేసి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.#MenToo: మరో భార్యా బాధితుడి బలవన్మరణం -
రాజ్తరుణ్పై ఆధారాలతో మరో ఫిర్యాదు చేస్తా
మణికొండ: సినీ హీరో రాజ్తరుణ్ తనతో కలిసి లివింగ్ రిలేషన్లో ఉండటం, గుడిలో పెళ్లి చేసుకోవటం, నన్ను ఫోన్లో చంపేస్తానని బెదిరించిన రికార్డులు అన్నీ ఉన్నాయని, వాటన్నింటినీ జతచేస్తూ న్యాయవాదితో కలిసి త్వరలోనే నార్సింగి పోలీసులకు మరో ఫిర్యాదు చేస్తానని అతని మాజీ ప్రియురాలు లావణ్య అన్నారు. ఆదివారం ఆమె నగరంలో మీడియాతో మాట్లాడుతూ హీరోయిన్ మాల్వీ మల్హోత్రతో పరిచయం అయిన తరువాతనే రాజ్తరుణ్ పూర్తిగా మారిపోయాడన్నారు. తనను వదలించుకునేందుకు కట్టు కథలు అల్లుతున్నారన్నారు. గతంలో డ్రగ్స్ కేసుకు తనకు ఎలాంటి సంబంధం లేక పోయినా బలవంతంగా అందులో ఇరికించారని, త్వరలోనే తాను నిర్దోషిగా బయటకు వస్తానన్నారు. నార్సింగి పోలీసులు ఆధారాలు ఇవ్వాలని నోటీసు ఇచ్చారని, గతంలో తను ఇచి్చన ఫిర్యాదు సరిగా లేదనే విషయం తెలుసుకుని ప్రస్తుతం న్యాయవాదితో తయారు చేయించి పూర్తి ఆధారాలతో మరో ఫిర్యాదు ఇస్తానని ఆమె పేర్కొన్నారు. ఈ కేసు సంగతి ఎలా ఉన్నా తనకు వారి నుంచి ప్రాణహాని ఉందని, పోలీసులు తనకు రక్షణ కలి్పంచాలని ఆమె కోరింది. -
వివాహితతో సహజీవనం చేస్తూ చిత్రహింసలు
బంజారాహిల్స్: ఓ వివాహితతో సహజీవనం చేస్తూ ఆమెను అడ్డుగా పెట్టుకుని పలువురిని బెదిరించి కేసులు పెట్టించి డబ్బు దండుకునేందుకు యతి్నంచడమే కాకుండా ఆమెను తీవ్రంగా కొట్టిన ఘటనలో నిందితున్ని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. వివరాలు.. ఖమ్మం జిల్లా మధిర మండలం, సిరిపురం గ్రామానికి చెందిన కొనకంచి కిరణ్ కుమార్(34)పై పలువురిని బెదిరించిన ఘటనలో నగరంలోని పలు పోలీస్ స్టేషన్లల్లో 8 కేసులు నమోదై ఉన్నాయి. శ్రీ కృష్ణానగర్లో అద్దెకు ఉంటున్న కిరణ్ కుమార్ సమీపంలో ఒక ఇంట్లో పనిచేస్తున్న ఒక వివాహితతో రెండు సంవత్సరాక్రితం పరిచయం పెంచుకున్నాడు. నిన్ను, నీ పిల్లల బాగోగులు చూసుకుంటానంటూ చెప్పాడు. మాయమాటలతో ఆమెను లోబర్చుకున్నాడు. ఇటీవల పక్కింట్లో నివసిస్తున్న ఓ యువకుడితో ఆమె మాట్లాడుతుండగా చూసిన కిరణ్ కుమార్ జూబ్లీహిల్స్ పోలీసులకు ఆమెతో ఫిర్యాదు చేయించి తనపట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని చెప్పించాడు. సదరు యువకుడిని బ్లాక్మొయిల్ చేశాడు. ఇలాంటి అబద్ధాలు ఎందుకంటూ ఆమె కిరణ్ కుమార్ను నిలదీసింది. ఈ విషయంలో ఇద్దరి మధ్యా తీవ్ర వాద్వాదం జరిగింది. దీంతో కక్ష పెంచుకున్న కిరణ్ కుమార్ ఈ నెల 17న తన గదిలో తాళ్లతో ఆమెను మంచానికి కట్టేసి తీవ్రంగా కొట్టాడు. కడుపులో తన్నాడు. ఆమె విలవిలాడుతుండగానే అలాగే వదిలేసి పారిపోయాడు. కట్లు విప్పుకుని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడిపై జూబ్లీహిల్స్ పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. నిందితుడు గతంలో కూడా జైలుకు వెళ్లొచి్చనట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
కోర్టులో ప్రియుడికి షాకిచ్చిన ప్రియురాలు
నాకు అతని మీద ఎలాంటి రొమాంటిక్ ఫీలింగ్స్ లేవు. కేవలం ఓ అన్నలాంటోడు. నేను వెళ్లిపోతే చచ్చిపోతాడేమోనని అతనితో ఇంతకాలం కలిసి ఉన్నా.. అంటూ కోర్టులో ఆ యువతి ఇచ్చిన స్టేట్మెంట్ షాక్తో ఆ ప్రియుడికి దిమ్మతిరిగిపోయింది. ఆ షాక్లోనే జడ్జి ఛాంబర్లోకి వెళ్లి కత్తితో మణికట్టు కోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. సోమవారం కేరళ హైకోర్టులో ఈ ఘటన చోటు చేసుకుంది. త్రిస్సూర్ జిల్లాకు చెందిన విష్ణు(31).. నెల రోజులుగా 23 ఏళ్ల యువతితో ఒకే గదిలో ఉంటూ సహజీవనం చేస్తున్నాడు. తమ ప్రేమకు పేరెంట్స్ ఒప్పుకపోవడంతో తాను ఇంటి నుంచి వచ్చేశానని ఆమె అతనితో చెప్పిందట. అయితే తన కూతురు కనిపించకుండా పోయిందంటూ ఆమె తండ్రి హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశాడు. తన కూతురిని అక్రమంగా విష్ణు బంధించాడని పిటిషన్లో ఆరోపించాడాయన. దీంతో.. సోమవారం ఆ జంటను పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు. అయితే అప్పటిదాకా విష్ణు లేనిదే తాను ఉండలేనంటూ పోలీసులతో, మీడియా ముందు చెప్పుకొచ్చిన ఆ యువతి.. జడ్జి ముందు మాట మార్చింది. తనకు తన పేరెంట్స్ ముఖ్యమని, తాను తన కుటుంబంతోనే వెళ్లిపోతానని.. కేవలం విష్ణు మీద ఒక అన్నలా ఆప్యాయత ఉందేతప్ప మరేయితర ఫీలింగ్ లేదని, అతను బాగుండాలని కోరుకుంటున్నానని చెప్పుకొచ్చింది. దీంతో డివిజన్ బెంచ్ యువతిని ఇష్టప్రకారంగా వెళ్లిపోవచ్చని సూచిస్తూ.. విష్ణుని మందలించింది. అయితే ఆ ఊహించని పరిణామంతో బోరున విలపిస్తూ బయటకు వెళ్లిపోయిన విష్ణు.. ఓ కత్తితో జస్టిస్ అను శివరామన్ ఛాంబర్కు వెళ్లాడు. తన మణికట్టు కోసుకుని ఏడ్వసాగాడు. న్యాయమూర్తి అప్రమత్తం చేయడంతో పోలీసులు ఆ యువకుడిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఎపిసోడ్లో ఇంకో కొసమెరుపు ఏంటంటే.. విష్ణుకు అప్పటికే వివాహం అయ్యింది. అయితే.. సదరు యువతితో రిలేషన్షిప్లో ఉన్నాడని తెలిశాక భార్య అతన్ని వదిలేసి వెళ్లిపోయింది. -
శామీర్పేట ఘటన: అందమైన అమ్మాయిలకు ట్రాప్!
క్రైమ్: శామీర్పేట కాల్పుల ఘటన కేసును దర్యాప్తు చేపట్టిన పోలీసులకు.. మరో కొత్త విషయం తెలిసింది. మనోజ్, స్మితా గ్రంథిలు కలిసి పలు మోసాలకు పాల్పడ్డారు. యాక్టింగ్ పేరుతో అందమైన అమ్మాయిలను ట్రాప్ చేశారు. స్మిత ఇటీవలే ఓ సంపన్న యువతిని ట్రాప్ చేయగా.. ఇద్దరూ కలిసి సదరు యువతి నుంచి నుంచి రూ.50 లక్షలు వసూలు చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఒరాకిల్లో పని చేస్తూనే.. స్మిత మోసాలకు దిగింది. మనోజ్తో కలిసి బంజారాహిల్స్లో డెన్ ఏర్పాటు చేసింది. షాకన్యోరా సొల్యూషన్స్ పేరిట షెల్ కంపెనీలు ఏర్పాటు చేశారు. నిత్యం పార్టీలతో వీళ్లిద్దరూ బిజీ బిజీగా గడిపేవారు. అక్కడి నుంచి తారసపడిన అందమైన అమ్మాయిలకు అవకాశాల పేరిట వల వేయడం ప్రారంభించారు. ఈ తరుణంలో ఇప్పుడు కాల్పలు ఘటన తర్వాత వీళ్ల మోసాలు వెలుగు చూశాయి. దీంతో.. వీళిద్దరి అక్రమాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. స్మితా బాధితుల్లో ప్రముఖులు సైతం ఉన్నట్లు సమాచారం. మనోజ్ తండ్రి హల్ చల్ మనోజ్-స్మితల నడుమ వివాహేతర సంబంధం ఉందంటూ వస్తున్న కథనాలపై మనోజ్ తండ్రి మీడియాతో దురుసుగా స్పందించారు. అలాంటిదేం లేదని.. స్మితా గ్రంధి కేవలం ఎంప్లాయి మాత్రమేనని అంటున్నాడు. ఒకేచోట.. ఇద్దరూ సన్నిహితంగా ఉన్నంత మాత్రానా సంబంధం అంటగట్టడం సరికాదని.. పైగా స్మిత మనోజ్ కంటే వయసులో పెద్దదని ఆయన అంటున్నాడు. ఈ ఘటనపై న్యాయపోరాటం చేసి తీరతామని అంటున్నాడాయన. ఈ క్రమంలో శామీర్పేట పోలీస్ స్టేషన్ వద్ద హల్ చల్ చేశాడాయన. జరిగిన కథ.. శామీర్పేట్ సెలబ్రిటీ రిసార్ట్లోని విల్లాలో సిద్ధార్థ దాస్పై జరిగిన కాల్పుల కేసులో పోలీసులు దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. మూడేళ్లుగా సిద్ధార్ధ్దాస్ భార్యతో మనోజ్ సహజీవనం చేస్తున్నాడు. 2019లో భర్త సిద్ధార్ధ్ దాస్తో విడిపోయిన శ్వేతతో మనోజ్ వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. విడాకుల కోసం స్మిత కూకట్పల్లి కోర్టులో దరఖాస్తు చేసింది. దాంతో పాటు తాను నివాసం ఉంటున్న వైపు భర్త రాకుండా ఇంజక్షన్ ఆర్డర్ కూడా స్మిత తెచ్చుకుంది. మనోజ్తో కలిసి ఒక సాఫ్ట్వేర్ కంపెనీని ఏర్పాటు చేసిన స్మిత.. సెలబ్రిటీ రిసార్ట్స్లోని తాముంటున్న ఇంట్లోనే ఆఫీస్ ఏర్పాటు చేశారు. పిల్లలతో పాటు స్మిత, మనోజ్ కలిసి అక్కడే నివాసం ఉంటున్నారు. జులై 12న స్మిత కుమారుడు 17 ఏళ్ల బాలుడిని మనోజ్ కొట్టాడు. దీంతో ఆ బాలుడు అల్వాల్ సీడబ్ల్యుూసీలో ఫిర్యాదు చేశాడు. దీంతో 17 ఏళ్ల బాలుడిని సీడబ్ల్యూసీ తమ సంరక్షణలో ఉంచుకుంది. తనతో పాటు తన చెల్లెలును కూడా మనోజ్ వేధిస్తున్నారని సీడబ్ల్యుసీకి స్మిత కుమారుడు ఫిర్యాదు చేశాడు. దీంతో జులై 18న తమ ముందు పాపతో పాటు హాజరుకావాలని స్మితకు సీడబ్ల్యూసీ నోటీసులు జారీ చేసింది. అలాగే.. మనోజ్ చిత్రహింసల గురించి తండ్రి సిద్ధార్థ్కు కుమారుడు చెప్పాడు. దీంతో పాపను తీసుకెళ్లడానికి ఈ రోజు(శనివారం) ఉదయం సిద్ధార్థ్ దాస్ విల్లాకు చేరుకున్నాడు. సిద్ధార్థ వెంట పాపని పంపడం ఇష్టం లేక స్మిత అతడితో గొడవకు దిగింది. దీంతో ముగ్గురికి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం మనోజ్ ఎయిర్ గన్ తీసుకొని కాల్పులు జరిపాడు. సిద్ధార్థ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఆమ్స్ ఆక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎయిర్ గన్ను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. దాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. గన్లో మంద గుండు సామాగ్రి ఉందా అన్నది నిర్ధారించుకోవడానికి ఫోరెన్సిక్ ల్యాబ్ గన్ను పంపించారు. ఇదీ చదవండి: పతీ.. పత్నీ ఔర్ వో.. హైప్రొఫైల్ స్టోరీ ఇది -
మహిళతో సహజీవనం.. లైవ్లో కమెడియన్ ఆత్మహత్యాయత్నం!
బాలీవుడ్లో ప్రముఖ కామెడీ షో 'ది కపిల్ శర్మ షో' గురించి తెలియని వారు ఉండరు. టాలీవుడ్లోనూ ఈ షో గురించి చాలామందికి తెలుసు. ప్రముఖులతో సైతం నవ్వులు తెప్పించే ఈ షో ద్వారా కపిల్ శర్మ ఫేమస్ అయ్యారు. మరో హాస్యనటుడు తీర్థానంద రావు కూడా ఈ షోతోనే గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే తాజాగా కపిల్ శర్మ కో స్టార్ తీర్థానంద రావు ఆత్మహత్యాయత్నం చేశాడు. ఫేస్బుక్ లైవ్లో పాయిజన్ తాగి బలవన్మరణానికి యత్నించాడు. వెంటనే విషయం తెలుసుకున్న స్నేహితులు అతని ఇంటికి చేరుకున్నారు. అపస్మారక స్థితిలో ఉన్న తీర్థానందరావును ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతను చికిత్స పొందుతున్నారు. (ఇది చదవండి :వరుణ్ లావణ్య ఎంగేజ్మెంట్: బేబీ బంప్తో ఉపాసన, డ్రెస్ ఖరీదెంతో తెలుసా? ) మహిళతో సహజీవనం.. వేధింపులు అయితే తనతో సహజీవనం చేస్తున్న మహిళ డబ్బుల కోసం బ్లాక్ మెయిల్ చేస్తోందని తీర్థానంద రావు ఆరోపిస్తున్నారు. తన డబ్బులు లాక్కోవడానికి ప్రయత్నిస్తోందని.. ఆమె వల్ల రూ.4 లక్షల అప్పులు చేశానని చెప్పుకొచ్చారు. తనకు ఏదైనా జరిగితే ఆమెనే బాధ్యత వహించాలన్నారు. ఆమె వల్లే అప్పులు చేశా ఫేస్బుక్ లైవ్లో మాట్లాడుతూ.. 'తేడాది అక్టోబర్ నుంచి తాను ఓ మహిళతో తాను లైవ్-ఇన్ రిలేషన్షిప్లో ఉన్నా. ఇప్పటికే నాపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాని వెనుక ఉన్న కారణమేంటో తెలియదు. ఆమె తనను ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేస్తోంది. తన నుంచి డబ్బులు లాక్కోవడానికి ప్రయత్నిస్తోంది. ఆమె నాకు ఫోన్ చేసి కలవాలనుకుంటున్నట్లు చెబుతోంది. ఆమె వల్ల లక్షల రూపాయలు అప్పు చేశా.' అని అన్నారు. అయితే ఆ తర్వాత లైవ్ వీడియోను డిలీట్ చేసినట్లు సమాచారం. - కె.తారకరామ కుమార్ (ఇది చదవండి : పుట్టబోయే బిడ్డ కోసం ఉపాసన కీలక నిర్ణయం!) -
నూరేళ్ల పంటలో.. ఎన్నో వింతలు.. పెళ్లిళ్లు జరిగినా లేటు వయసులోనే!
అన్యోన్యంగా ఉంటే.. పెళ్లి నూరేళ్ల పంట! లేదంటే.. రోజూ ఒక తంటా! మాటా మాటా పెరిగితే... విడాకుల మంట! చిత్రంగా..వివాహం ఏడేడు జన్మల అనుబంధం అని నమ్మే భారతావనిలోనూ..సుప్రీంకోర్టు తీర్పు పుణ్యమా అని విడాకులు ఇప్పుడు క్షణాల మాటగా మారిపోయాయి. ఇంతోటి దానికి వివాహం ఎందుకు అనుకుంటున్నారో ఏమో కానీ మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా పెళ్లిళ్లే తగ్గిపోయాయి. అయ్యే ఆ కొద్ది వివాహాలు కూడా కాస్త లేటు వయసులో జరుగుతున్నాయి. లివ్ ఇన్ రిలేషన్షిప్లు పెరగడం ఇందుకు ఒక కారణంగా కన్పిస్తోంది. ఈ మూడు అంశాల వల్లే.. వైవాహిక వ్యవస్థ్థలో వచ్చిన ఈ మార్పులకు కారణాలేమిటని విశ్లేషిస్తే స్థూలంగా మూడు అంశాలు కనిపిస్తాయి. మొట్టమొదటగా చెప్పుకోవాల్సింది గర్భ నిరోధక సాధనాలు అందుబాటులో ఉండటం. రెండో అంశం పురుషులతో సమానంగా మహిళలు కూడా ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తుండటం. ఇక మూడో కారణం అన్ని దేశాల్లోనూ వైవాహిక వ్యవస్థకు సంబంధించిన చట్టాల్లో మార్పులు వస్తుండటం.. పెళ్లి కాని వారి హక్కుల పరిరక్షణనూ ప్రభుత్వాలు పరిగణనలోకి తీసుకోవడం. ఏ రకమైన కుటుంబం కావాలన్న దానిపై యువత స్పష్టమైన ఆలోచనలు కలిగి ఉండటం కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు. పలు దేశాల్లోని ప్రస్తుత పరిస్థితులను ఒకసారి చూద్దాం. చాలా దేశాల్లో అరుదుగానే పెళ్లిళ్లు.. అగ్రరాజ్యం అమెరికాలో గత వందేళ్లలో ఎన్నడూ చూడని స్థాయికి పెళ్లిళ్లు తగ్గిపోయాయి. 1920లో ప్రతి వెయ్యిమంది జనాభాకు ఒక ఏడాది కాలంలో పెళ్లి చేసుకునే వారి సంఖ్య 12 మంది దాకా ఉంటే, ఇది క్రమేపీ తగ్గుతూ 2018 నాటికి కేవలం ఏడుకు చేరుకోవడం గమనార్హం. దక్షిణ కొరియాలో ఆరుకు, ఆ్రస్టేలియాలో 5.2కు, లండన్లో 4.6కు, ఇటలీలో మరింత తక్కువగా అంటే 3.2కు చేరుకుంది. అయితే కొన్ని దేశాల్లో మాత్రం వివాహాలు పెరుగుతున్నాయి. చైనా, రష్యా, బంగ్లాదేశ్ వంటి దేశాల్లో ఇరవై ఏళ్ల క్రితంతో పోలిస్తే వివాహాలు ఎక్కువ అవుతున్నాయని అంతర్జాతీయ స్థాయి సంస్థల గణాంకాలు చెబుతున్నాయి. వయసు మీరుతున్నా... ‘ఏ వయసుకు ఆ ముచ్చట’ అంటారు పెద్దోళ్లు. కానీ ఇప్పుడు ఈ పరిస్థితి అస్సలు లేదు. దేశంలో యాభై ఏళ్ల క్రితం పదహారు, పదిహేడేళ్లకే పెళ్లిళ్లు జరిగిపోయి.. పిల్లల్ని కూడా కనేవారు. కానీ ఇప్పుడు? పాతికేళ్ల తరువాతే పెళ్లి గురించి ఆలోచన చేస్తున్నారు. చదువుసంధ్యలు పూర్తి చేసుకుని ఉద్యోగాల్లో స్థిరపడి.. నాలుగు రాళ్లు వెనకేసుకున్న తరువాత కానీ వివాహ బంధంలోకి అడుగుపెట్టరాదని అనుకుంటున్నారు. భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి. పెళ్లి చేసుకునే వయసు చాలా పెరిగిపోయింది. ముఖ్యంగా ధనిక దేశాల్లో.. మహిళల విషయంలో లేటు మ్యారేజీలు ఎక్కువవుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. స్వీడన్ను ఉదాహరణగా తీసుకుంటే 1990లలో సగటు పెళ్లీడు (మహిళలు) 28 ఏళ్లు కాగా.. 2017 నాటికి ఇది 34కు చేరింది. అయితే బంగ్లాదేశ్తో పాటు ఆఫ్రికాలోని పలు దేశాల్లో మాత్రం దశాబ్దాలుగా పెళ్లీడు అనేది చాలా తక్కువగా ఉండటం గమనార్హం. నైజర్లో 17 ఏళ్లకే ఆడపిల్లకు పెళ్లి చేసేస్తున్నారు. భారత్లో పెళ్లీడు 1992లో 19.20 ఏళ్లుగా ఉండేది. 2015 నాటికి ఇది 21.40కు చేరినట్లు గణాంకాలు చెబుతున్నాయి. విడాకుల్లో హెచ్చు తగ్గులు ఒకప్పుడు విడాకులంటే నలుగురిలో చర్చనీయాంశం. ఇప్పుడు పక్కింటిలోనూ పట్టించుకునే పరిస్థితి లేదు. అంత సాధారణమైపోయింది. దీన్ని బట్టి ప్రపంచం మొత్తమ్మీద విడాకులు పెరిగిపోయాయన్న అంచనాకు వస్తే మాత్రం తప్పులో కాలేసినట్లే. ఎందుకంటే విషయం అంత స్పష్టంగా ఏమీ లేదు. మొత్తంగా చూస్తే విడాకులు తీసుకునే వారి సంఖ్య పెరుగుతున్నప్పటికీ వివరాల లోతులకు వెళ్లిన కొద్దీ పరిస్థితుల్లో చాలా తేడాలు కనిపిస్తాయి. అమెరికాలో 1950 ప్రాంతంలో ప్రతి వెయ్యిమంది జనాభాకు విడాకుల శాతం 2.6గా ఉంటే యునైటెడ్ కింగ్డమ్లో కేవలం 0.70గా ఉండింది. 1980 నాటికి అమెరికాలో ఈ సంఖ్య రెట్టింపు కాగా ఆ తరువాత కాలంలో మాత్రం క్రమేపీ తగ్గుతూ వస్తోంది. 2018 నాటి లెక్కలు పరిశీలిస్తే విడాకుల సంఖ్య 2.90గా ఉన్నట్లు తెలుస్తోంది. కొరియా, నార్వే, యునైటెడ్ కింగ్డమ్లాంటి దేశాల్లోనూ విడాకులు తీసుకునే వారి సంఖ్య ఒక దశ వరకూ గణనీయంగా పెరిగి ఆ తరువాత తగ్గుతూ వస్తోంది. టర్కీ, ఐర్లాండ్, మెక్సికోలలో మాత్రం ఇప్పటికీ పెరుగుతూనే ఉండటం గమనార్హం. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే విడాకుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ ఒకప్పటితో పోలిస్తే ప్రస్తుతం చాలామంది ఎక్కువ కాలం కలిసి ఉన్న తరువాతే విడిపోతుండటం. అక్కడ ఎక్కువ.. ఇక్కడ తక్కువ విడాకులు ఏ దేశంలో ఎక్కువ.. ఏ దేశంలో తక్కువ అన్న విషయంలో పలు అధ్యయనాలు, సర్వేలు రకరకాల ఫలితాలు వెల్లడించినప్పటికీ.. భారత్ విషయంలో మాత్రం అన్ని అధ్యయనాలు ఏకగ్రీవంగా చెబుతున్న మాట.. ఇక్కడ విడాకులు శాతం ప్రపంచంలోనే అతి తక్కువ(1%) అని. ఈ అధ్యయనాల ప్రకారం తర్వాతి స్థానాల్లో వియత్నాం, ఇరాన్ వంటివి ఉన్నాయి. అత్యధిక విడాకుల కేసులు నమోదవుతున్న దేశాల్లో పోర్చుగల్, మాల్దీవులు, లక్సెంబర్గ్, స్పెయిన్, రష్యా, ఉక్రెయిన్ వంటివి ఉన్నాయి. కారణాలివే.. అక్రమ సంబంధాలు, ఆర్థిక ఇబ్బందులు, సరైన కమ్యూనికేషన్ లేక పోవడం, వాగ్వాదాలు, ఘర్షణలు, ఊబకాయం, వాస్తవికత లోపించిన అంచనాలు, సాన్నిహిత్యం లేకపోవడం, అసమాన్యత, హింస, అలవాట్లు వంటివి విడాకులు తీసుకునేందుకు ఉన్న సార్వజనీన కారణాలు. ఇక్కడ ఒక్కసారి కమిట్ అయితే అంతే.. ఒక్కసారి కమిట్ అయితే.. జీవితాంతం కలిసుండాల్సి వచ్చే దేశాలు రెండే రెండు. ఒకటి వాటికన్ సిటీ. రెండోది ఫిలిప్పీన్స్. ఇక్కడ చట్టపరంగా విడాకులు తీసుకునేందుకు అస్సలు అవకాశమే లేదు. కాకపోతే ఫిలిప్పీన్స్లో ముస్లింలు షరియా చట్టం కింద విడాకులు పొందే అవకాశముంది. సేమ్ సెక్స్ మ్యారేజెస్కూ విడాకులను వర్తింపజేసిన తొలి దేశంగా నెదర్లాండ్స్ 2000లో రికార్డు సృష్టించింది. తరువాతి కాలంలో ఇప్పటివరకు సుమారు 30 దేశాల్లో ఇదే తరహా చట్టాలు చేశారు. పెళ్లికి.. పిల్లలకు సంబంధం లేదు! వైవాహిక వ్యవస్థలో ఇటీవలి కాలంలో కనిపిస్తున్న అతిపెద్ద ట్రెండ్ పెళ్లికి, సంతానం కలిగి ఉండటానికి మధ్య సంబంధం లేకపోవడం. అంటే.. పిల్లల్ని కనాలనుకుంటే కనడం మినహా అందుకు పెళ్లి తప్పనిసరి అన్న భావన తొలగిపోతోందన్నమాట. మరీ ముఖ్యంగా ఈ ధోరణి ఆర్గనైజేషన్ ఫర్ ఎకనమిక్ కో ఆపరేషన్ అండ్ డెవలప్పెంట్ (ఓఈసీడీ) దేశాల్లో గణనీయంగా పెరిగిపోతోందని తెలుస్తోంది. సుమారు 38 దేశాలు సభ్యులుగా ఉన్న ఓఈసీడీలో పెళ్లి కాకుండా... లేదా సహజీవనం ద్వారా పిల్లల్ని కంటున్న వాళ్లు లేదా పెంచుకుంటున్న వారి శాతం 1960లతో పోలిస్తే ఎన్నో రెట్లు ఎక్కువైంది. కోస్టారికాలో సుమారు 70 శాతం మంది పిల్లల జననానికి పెళ్లిళ్లతో సంబంధం లేదు. ఇది మెక్సికోలో 65 శాతంగా, డెన్మార్క్లో 52 శాతంగా ఉంది. నెదర్లాండ్స్ (48), స్లొవేకియా (38), జర్మనీ (35) తరువాతి స్థానాల్లో ఉన్నాయి. గణాంకాలు అందుబాటులో ఉన్న దేశాల్లో చిట్టచివరన ఉన్నది కొరియా (1.9 శాతం). అమెరికాలోని న్యూయార్క్, మిసిసిపీ రాష్ట్రాల్లో భార్య లేదా భర్త అక్రమ సంబంధాలు కలిగి ఉన్నారని నిరూపించగలిగితే ‘ఏలియనేషన్’ ఆఫ్ అఫెక్షన్ కింద నష్టపరిహారం కోరుతూ కేసులేయవచ్చు. అల్యూటియాన్ దీవుల్లో పురుషులకు భార్యంటే మొహం మొత్తితే.. వస్తు మార్పిడి మాదిరిగా ఆహారం లేదా దుస్తుల కోసం వదిలించుకోవచ్చు! కెనడాకు పశ్చిమంగా... జపాన్కు తూర్పు దిక్కున ఉంటాయీ ద్వీపాలు. 99 ఏళ్ల వయసులో విడాకులు! 99 ఏళ్ల వయసులో విడాకులు తీసుకున్న వ్యక్తిగా 2011లో ఓ ఇటాలియన్ రికార్డు సృష్టించాడు. అరవై ఏళ్ల వైవాహిక జీవితం తరువాత భార్య తన ప్రియుడికి నలభై ఏళ్ల క్రితం రాసిన ప్రేమలేఖలు ఈయన కంటపడ్డాయి. అంతే 96 ఏళ్ల భార్యతో తెగతెంపులు చేసేసుకున్నాడు. 1934లో జరిగిన వీరి పెళ్లి.. 2011లో పెటాకులైంది. -కంచర్ల యాదగిరిరెడ్డి -
ఆ హీరోతో లివింగ్ టుగెదర్.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్
ప్రస్తుతం వెబ్ సీరీస్ క్వీన్గా వెలిగిపోతున్న నటి వాణిభోజన్. టీవీ యాంకర్గా జీవితాన్ని ప్రారంభించిన ఈమె ఆ తర్వాత బుల్లితెర నటిగా కొన్ని సీరియళ్లలో నటించింది. దీంతో సినిమాల్లో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. ఓ మై కడవులే చిత్రంతో మంచి పేరు తెచ్చుకున్న ఈ అమ్మడిని ఆ తర్వాత పలు అవకాశాలు వరించాయి. నటుడు విక్రమ్కు జంటగా కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో మహాన్ చిత్రంలో నటించింది. ఆ చిత్రంపై చాలా ఆశలు పెట్టుకుంది. అయితే చిత్రం విడుదలైన తర్వాత ఆమెకు నిరాశే ఎదురైంది. కారణం ఆమె పాత్రను పూర్తిగాఎడిటింగ్ పార్ట్కే పరిమితం చేశారు చిత్ర వర్గాలు. అదేవిధంగా వాణి భోజన్ నటించిన సినిమాలు ఆశించిన విజయాలు సాధించకపోవడంతో వాణి దృష్టి వెబ్సీరీస్పై పడింది. అలా తమిళ్ రాకర్స్ ట్రిపిల్స్ ఇరు ధృవం 2, తాజాగా సెంగళం వెబ్ సీరీస్లో నటించింది. కాగా వ్యక్తిగతంగా ఈమె ఒక నటుడితో ప్రేమ, లివింగ్ టు గెదర్ వంటి వార్తలు బాగానే ప్రచారంలో ఉన్నాయి. నటుడు జైతో లివింగ్ టుగెదర్లో ఉన్నట్టు ప్రచారం హోరెత్తింది. ఈమె కాల్షీట్స్ వ్యవహారం కూడా ఆయనే చూసుకునేవారని, ఇతరులెవరూ ఆమెతో సంప్రదించే అవకాశం కూడా ఉండేది కాదు అనే ప్రచారం జరిగింది. దీని వల్లే వాణిభోజన్కు సినిమా అవకాశాలు తగ్గిపోయాయి అని వార్తలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. అయితే నటుడు జైతో లివింగ్ టుగెదర్ ప్రచారాన్ని వాణి భోజన్ ఇప్పుడు ఖండిస్తూ ఉంది. దీని గురించి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆమె పేర్కొంటూ తాను, నటుడు జయ్ ట్రిపిల్స్ వెబ్సీరీస్లో నటించామని, అలాగని ఇలాంటి వార్తలు ప్రచారం చేస్తారా అంటూ ప్రశ్నించింది. జైతో రిలేషన్ షిప్ అన్నా బాధపడను కానీ లివింగ్ టుగెదర్లో ఉన్నాననడమే బాధిస్తుందని పేర్కొంది. తాను కష్టపడి బ్యాంకులోను తీసుకుని ఇల్లు కట్టుకుంటే సొంత ఇంట్లో నివశించకుండా ఎవరో ఒకరి ఇంట్లో అతనితో లీవింగ్ టుగెదర్లో ఉంటున్నానని రాయడం చీప్గా ఉందని వాణి భోజన్ ఆవేదనను వ్యక్తం చేసింది. -
సహజీవనానికి రిజిస్ట్రేషనా?.. సుప్రీం ఘాటు స్పందన
న్యూఢిల్లీ: దేశంలో సహజీవనం చేసే జంట.. తప్పనిసరిగా రిజిస్టర్ చేసుకుని గుర్తింపు పొందాలని, ఈ మేరకు నిబంధనల రూపకల్పన జరగాలంటూ దాఖలైన పిటిషన్ను సుప్రీం కోర్టు సోమవారం కొట్టేసింది. దీన్నొక మూర్ఖపు ఆలోచనగా అభివర్ణిస్తూ పిటిషన్ కొట్టేశారు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్. దేశంలో సహజీవనానికి గుర్తింపు ఉండాలని, ఈ మేరకు రిలేషన్షిప్లో ఉండే ప్రతీజంట రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేసుకోవాలని, అలాగే.. ఆ జంటలకు సామాజిక భద్రత కల్పించాలంటూ ఓ న్యాయవాది ప్రజాప్రయోజన వ్యాజ్యం(PIL) దాఖలు చేశారు. ఆ ఆలోచన ద్వారా సహజీవనంలో జరుగుతున్న నేరాల సంఖ్య తగ్గుతుందని అభిప్రాయపడ్డారు ఆ న్యాయవాది. అయితే.. ఈ పిటిషన్పై సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ ఘాటుగా స్పందించారు. ఎలాంటి విషయంతోనైనా ఇక్కడికి వస్తున్నారు. ఇలాంటి వాటిల్లో ఇకపై జరిమానాలు విధించడం మొదలుపెడతాం. ఏంటిది?.. రిజిస్ట్రేషనా? ఎవరితో? కేంద్ర ప్రభుత్వంతోనా? సహజీనవంలో ఉన్న జంటలతో కేంద్రం ప్రభుత్వానికి ఏం పని? ఏం సంబంధం అసలు? అంటూ చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ.. పిటిషన్ను డిస్మిస్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఏ ఉద్దేశంతో పిటిషన్ వేశారని న్యాయవాదిని సీజేఐ ప్రశ్నించగా.. సోషల్ సెక్యూరిటీ అనే సమాధానం ఇచ్చారాయన. ఒకానొక తరుణంలో న్యాయవాదిపై ఆగ్రహం వెల్లగక్కిన సీజేఐ.. పిటిషన్ను డిస్మిస్ చేశారు. ఢిల్లీలో శ్రద్ధా వాకర్ ఘటన.. ఆపై వరుసగా మరో నాలుగైదు సహజీవన జంటల తాలుకా నేరాలు వెలుగులోకి రావడంతో కేంద్రం తరపు నుంచి లివింగ్ రిలేషన్షిప్లపై రిజిస్ట్రేషన్, గైడ్లైన్స్ల కోసం తాను సుప్రీంను ఆశ్రయించినట్లు చెప్పారా న్యాయవాది. ఇదీ చదవండి: ఓటీటీ కంటెంట్పై కేంద్రం సీరియస్! -
Living Relations: పెళ్లి ఊసెత్తితే చాలు!
డేటింగ్ మన కల్చర్లో భాగం కాదని మొత్తుకునే నోళ్లు ఒకవైపు.. భాగస్వాముల్ని సరిగ్గా అంచనా వేయకపోవడం, అర్థం చేసుకోకపోవడం వల్లే ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయంటూ వాదించే నోళ్లు మరోవైపు. దేశంలో వరుసగా వెలుగుచూస్తున్న ప్రియురాళ్ల హత్యోందతాలపై పోటాపోటీగా చర్చించుకుంటున్నాయి. ఎక్కడో పుట్టి.. పీకల లోతు ప్రేమలో మునిగిపోయి.. చివరకు పెళ్లి ఊసెత్తితే చాలు ప్రాణం తీసేంత గాఢతను సంతరించుకున్నాయి ఆ లవ్ క్రైమ్ కహానీలు. Shraddha Walkar Case.. శ్రద్ధా వాకర్ ఉదంతం ప్రేయసి శరీరాన్ని రంపంతో ముప్ఫై ఐదు ముక్కలు చేసి.. వాటిని ఫ్రిడ్జ్లో భద్రంగా కుక్కేసి.. వీలు దొరికినప్పుడల్లా దూరంగా పడేసి వచ్చినంత ప్రేమ అఫ్తాబ్ అమీన్ పూనావాలాది. 2022 మే 18వ తేదీన జరిగిన ఢిల్లీ మెహ్రౌలీలో జరిగిన ఈ దారుణం.. కొన్ని నెలలు(నవంబర్లో) ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పెళ్లి చేసుకోమని కోరిన ప్రేయసి శ్రద్ధా వాకర్ను అడ్డుతొలగించుకోవాలనే ప్రయత్నంలో.. తన శాడిజాన్ని ప్రదర్శించాడు 28 ఏళ్ల అఫ్తాబ్. ఆ చర్య ఎంత పైశాచికంగా ఉందో.. అతని మాటల్లోనే చెప్తుంటే పోలీసులు నివ్వెరపోయారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఉదంతం.. 6,629 పేజీల ఛార్జ్షీట్తో ఎంతో ప్రత్యేకత సంతరించుకుంది. పైగా లవ్ జిహాద్ కోణం కూడా తెర మీదకు వచ్చి.. రాజకీయ పరమైన దుమారానికి కూడా కారణమైంది. 2019లో డేటింగ్ ద్వారా శ్రద్ధా వాకర్, అఫ్తాబ్లు పరిచయం అయ్యారు. ముంబై నుంచి ఢిల్లీకి వెళ్లి ఒకే ఇంట్లో ఉంటూ వచ్చారు. ఇంట్లోవాళ్లకు వాళ్లు స్నేహితులిగా పరిచయం. ఒక్కటి అవుతామంటే శ్రద్ధా పేరెంట్స్ ఒప్పుకోలేదు. కోపంతో అతని చెంతకే చేరింది. కానీ, టైం ఒకేలా నడవలేదు. ఇంటి ఖర్చులు, ఇతర కారణాలతో ఇద్దరికీ గొడవలు అయ్యేవి. శ్రద్ధా ఉండగానే మరో యువతితో(యువతులతో) అఫ్తాబ్ చనువుగా మెదులుతూ వచ్చాడు. ఇది ఈ సంచలన కేసులో పోలీసులు వెల్లడించిన వివరాలు. ఇక రెండోది.. Nikki Yadav Case నిక్కీ యాదవ్ ఉదంతం అమ్మానాన్నలకు దూరంగా కోచింగ్ కోసం దేశ రాజధానిలో అడుగుపెట్టిన నిక్కీకి.. సాహిల్ గెహ్లాట్ పరిచయం.. స్నేహం ధైర్యాన్ని అందించింది. ఆ స్నేహమే తర్వాత ప్రేమైంది. ఇద్దరూ ఒకే కాలేజ్. కలిసి బతకాలని గ్రేటర్ నోయిడాలో ఒకే ఇంట్లో ఉంటూ సహజీవనం చేశారు. కానీ, ప్రియుడిపై పెంచుకున్న గుడ్డి నమ్మకం చివరికి ఆమె ఉసురు తీసింది. భారీగా కట్నం వస్తుందనే ఆశతో(తల్లిదండ్రుల ఒత్తిడి అనే కారణం కూడా) నిక్కీని వదిలించుకోవాలని సాహిల్ నిర్ణయించుకున్నాడు. హడావిడిగా ఒక్కరోజు గ్యాప్లోనే ఓ యువతితో నిశ్చితార్థం, వివాహానికి రెడీ అయ్యాడు సాహిల్. విషయం నిక్కీకి చేరింది. తాను ఉండగానే మరో యువతితో వివాహానికి సిద్ధపడిన ప్రియుడి మోసాన్ని ఆమె తట్టుకోలేకపోయింది. సరిగ్గా పెళ్లినాడే తన పరిస్థితి ఏంటని? నిలదీసింది. ప్రియురాలి కోపాన్ని తట్టుకోలేక ఫోన్ డేటా కేబుల్ను మెడకు బిగించి హత్య చేశాడు. ఆపై కారులో శవంతోనే 40 కిలోమీటర్లు చక్కర్లు కొట్టాడు. చివరకు నజాఫ్గఢ్లోని తన సొంత ధాబాలోని ఫ్రిడ్జ్లో ఆమె శవాన్ని భద్రపరిచాడు. సీసీ టీవీ ఫుటేజీ ద్వారా ఘటన వెలుగులోకి వచ్చింది. ఫ్రిబవరి 9-10వ తేదీల నడుమ ఈ ఘటన జరగ్గా.. ప్రేమకు సూచికైన ప్రేమికుల దినోత్సవం నాడే ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. మూడో ఉదంతం.. Megha Case మేఘ ఉదంతం మూడేళ్ల ప్రేమ.. ఆరు నెలల సహజీవనం.. నెలరోజులుగా భార్యభర్తలమని చెప్పుకుని ఒకే ఇంట్లో కాపురం!. దేశ వాణిజ్య రాజధాని ముంబైకి చేరువలో చోటుచేసుకుంది ఈ దారుణం. ప్రియుడు ఏ పని చేయకుండా సోమరిగా తిరుగుతున్న ఆమె భరించింది. అతని కోసమే తాను పని చేస్తూ.. ఇల్లు అద్దెకు తీసుకుని పోషిస్తూ వచ్చింది మేఘ. ఎందుకంటే.. హార్ధిక్ షా అంటే ఆమెకు అంత గాఢమైన ప్రేమ. వీలైనంత త్వరగా మూడు ముళ్లతో అతనితో దాంపత్యమనే కొత్త జీవితం ప్రారంభించాలని కలలు కనింది. కానీ, ఆ మూర్ఖుడు పెళ్లి ఊసు ఎత్తేసరికి భరించలేకపోయాడు. శారీరక సంబంధంతో ఇలాగే కలిసి ఉందామంటూ తరచూ కూతలు కూశాడు. ఆమె భరించలేక గొడవ పడుతూ వచ్చింది. ఫిబ్రవరి 15వ తేదీన మరోసారి గొడవ జరిగింది. కోపం తట్టుకోలేక.. ఆమెను గొంతు నులిమి హత్య చేశాడు. ఆపై ప్రియురాలి శవాన్ని బెడ్ కింద ఉండే బాక్స్లో భద్రపరిచాడు. ఆ బేవార్స్ ఆలోచన అక్కడితోనే ఆగిపోలేదు. ఇంట్లోని సామాన్లను అమ్మేసుకుని.. ఆ డబ్బుతో ఊరి నుంచి ఊడాయించే యత్నం చేశాడు. పనిలో పనిగా.. కర్ణాటకలో ఉండే మేఘ పిన్నికి ఫోన్ చేసి.. తాను మేఘాను హత్యచేసినట్లు.. ఆత్మహత్యచేసుకోనున్నట్లు చెప్పాడు. ఆమె వెంటనే తెలిసినవాళ్ల సాయంతో పాల్ఘడ్ జిల్లా (మహారాష్ట్ర) పోలీసులను అప్రమత్తం చేయించింది. ఇంటి తలుపు పగులగొట్టిన పోలీసులకు బెడ్ బాక్స్లో మేఘా మృతదేహం లభించింది. అలాగే పక్కా ప్లాన్తో పారిపోవాలని యత్నించిన హార్థిక్ను మధ్యప్రదేశ్ నాగ్డా రైల్వే స్టేషన్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చివరగా.. తాజాగా వెలుగుచూసిన మరో ఉదంతం. మహారాష్ట్ర థానే జిల్లా నేవీ ముంబైలో జరిగింది. కాకపోతే ఇది కాస్త ముదురు కహానీ. అతనికి 40.. ఆమెకు 35. ఆల్రెడీ వివాహం అయిన ఆమె, మరో వ్యక్తితో చెట్టాపట్టాలేసుకుని తిరిగింది. భర్త నుంచి విడిపోయి.. ప్రియుడిని పెళ్లి చేసుకుని కొత్త జీవితం ప్రారంభించాలనుకుంది. కానీ, ప్రియుడు ఆమెను శారీరక సుఖం తీర్చే బొమ్మగా భావించాడు. మాట్లాడుకుందాం రమ్మని పిలిచాడు. చున్నీని మెడకు బిగించి ఉరేసి చంపాడు. నిందితుడి పేరు రాజ్కుమార్ బాబురామ్ పాల్. బాధితురాలు వివాహం చేసుకుందాం అనే సరికి ఆమెను చంపి.. శవాన్ని పొదల్లో పడేశాడు. భర్త ఫిర్యాదుతో విషయం వెలుగులోకి వచ్చింది. గురువారం ఈ ఘటన చోటు చేసుకుంది. -
ఆరేళ్లుగా నక్కి.. ఆఖరికి చిక్కి
సాక్షి, ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): సహజీవనం చేస్తున్న మహిళను హత్య చేసిన కేసులో ఆరేళ్లుగా పరారీలో ఉన్న రాజమహేంద్రవరం సుబ్బారావునగర్కు చెందిన తొండపు నాగప్రసాద్(ప్రసాద్)ను శుక్రవారం రాత్రి అరెస్టు చేసినట్లు త్రీటౌన్ ఇన్స్పెక్టర్ జి.మధుబాబు తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నం మండలం రామన్నపాలేనికి చెందిన పేరుబోయిన శివభవాని (మృతురాలు) 2008లో మొదటిభర్త చనిపోవడంతో కుమార్తెను తీసుకుని బతుకుతెరువు నిమిత్తం రాజమహేంద్రవరం వచ్చింది. ప్రభుత్వాసుపత్రిలో గర్భిణులు, రోగులకు సేవలందిస్తూ వారిచ్చే డబ్బులతో తన కుమార్తెతో కలసి జీవిస్తుండేది. శివభవానికి కార్ డ్రైవర్ తొండపు నాగప్రసాద్తో పరిచయం ఏర్పడింది. నాగప్రసాద్ భార్యకు ఓ ప్రమాదంలో మతిస్థిమితం పోయింది. దీంతో 2014 నుంచి శివభవాని, తన కుమార్తెతో కలసి నాగప్రసాద్ ఇంట్లోనే కాపురం ఉన్నారు. అనంతరం ఆ ఇల్లు అమ్మేయడంతో పక్కనే ఉన్న సంజీవయ్యనగర్లో అద్దెకు వెళ్లారు. 2017 మార్చి 2న శివభవాని ఇంట్లో మృతిచెంది ఉంది. మృతురాలి తల్లి పేరుబోయిన కొవ్వాడమ్మ, బంధువులు వచ్చి చూడగా శివభవాని పీకకోసి ఉంది. ముందురోజు తమకు గొడవ జరగడంతో ఆమె పీక కోసుకుని ఆత్మహత్యకు పాల్పడిందని నాగప్రసాద్ అందరినీ నమ్మించాడు. దీంతో బంధువులు శివభవాని మృతదేహాన్ని స్వగ్రామం తీసుకువెళ్లి దహన సంస్కారాలు జరిపించారు. అంత్యక్రియలు పూర్తయిన రెండు వారాల తరువాత మృతురాలి సోదరుడు వెంకటేష్కు నాగప్రసాద్ ఫోన్ చేసి మీచెల్లి తనకు తానుగా పీక కోసుకుని ఆత్మహత్య చేసుకోలేదని, తరచూ డబ్బులు కోసం వేధిస్తుందని అందుకే తానే చంపేశానని తెలిపాడు. దీంతో ఈ విషయమై 21 రోజుల అనంతరం మృతురాలి తల్లి కొవ్వాడమ్మ త్రీటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అప్పటి ఇన్స్పెక్టర్ సీహెచ్ రామకోటేశ్వరరావు కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి నాగప్రసాద్ పరారీలో ఉండగా, ప్రస్తుత త్రీటౌన్ ఇన్స్పెక్టర్ జి.మధుబాబు, సెంట్రల్ జోన్ డీఎస్పీ జేవీ సంతోష్ పర్యవేక్షణలో సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి నిందితుడిని అరెస్టు చేశారు. రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరుపరిచారు. నిందితుడిని అరెస్ట్ చేయడంలో ప్రతిభ చూపిన త్రీటౌన్ పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్స్ బీఎంవీవీ భానుమూర్తి, జె.సుబ్బారావు, క్రైమ్ కానిస్టేబుళ్లు కె.వెంకటేశ్వరరావు, బి.విజయకుమార్లను సెంట్రల్ జోన్ డీఎస్పీ జేవీ సంతోష్ అభినందించారు. (చదవండి: సీఎం జగన్ మాటిచ్చారు.. నెరవేర్చారు’) -
సహజీవనం చేస్తున్న ప్రియుడు మోసం.. వివాహిత..
సాక్షి, అన్నమయ్య(మదనపల్లె): సహజీవనం చేస్తున్న ప్రియుడు మోసం చేశాడని మనస్తాపంతో ఓ వివాహిత ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటన గురువారం పట్టణంలో జరిగింది. స్థానిక తొట్లివీధిలో ఉంటున్న మహబూబ్బాషా కుమార్తె షాహీనా(30)కు కొంతకాలం క్రితం భర్త చనిపోవడంతో ఒంటరిగా జీవిస్తోంది. ఏడాదిక్రితం కదిరికి చెందిన అమీన్ ఆమెకు పరిచయమయ్యాడు. పరిచయం కాస్తా ప్రేమగా మారి కదిరిలో ఇద్దరూ కలిసి సహజీవనం చేశారు. ఈక్రమంలో అమీన్ తల్లిదండ్రులకు విషయం తెలియడం, షాహీనాను పెళ్లిచేసుకునేందుకు నిరాకరించడంతో ఆమె అక్కడి నుంచి మదనపల్లెలోని తల్లిదండ్రుల వద్దకు చేరుకుంది. గురువారం ఉదయం ఫినాయిల్ తాగింది. గమనించిన కుటుంబసభ్యులు జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చదవండి: (బద్వేలులో దారుణం.. ప్రియుడితో కలిసి సహజీవనం చేస్తూ..) -
ఢిల్లీలో దారుణ ఘటన.. యువతిని 35ముక్కలుగా..
-
షాకింగ్: సహజీవనం, ప్రియురాలి మృతదేహాన్ని 35 ముక్కలుగా కోసి..
ఒక జంట ఇంట్లోంచి పారిపోయి సహజీవనం చేశారు. పెళ్లి ప్రస్తావన వచ్చేటప్పటికీ ఇద్దరి మధ్య పెద్ద గొడవయ్యేది. ఆ గొడవ కాస్త దారుణమైన హత్యకు దారితీసింది. ఈ దారుణ ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం...అఫ్తాబ్ అమీన్ పూనావల్ల అనే యువకుడు 26 ఏళ్ల శ్రద్ధా అనే అమ్మాయితో సహజీనం చేస్తున్నాడు. శ్రద్ధా ముంబైలోని ఒక మల్టీనేషనల్ కంపెనీ కాల్ సెంటర్లో పనిచేస్తోంది. అక్కడే పూనావల్లతో పరిచయం ఏర్పడింది. వీరి స్నేహం ఇద్దరూ డేటింగ్ చేసుకునేంత వరకు వచ్చింది. వీళ్లిద్దరి వ్యవహారం శ్రద్ధ వాళ్ల కుటుంబసభ్యులకు నచ్చలేదు. దీంతో వారు ఇంట్లోంచి పారిపోయి ఢిల్లీలోని మెహ్రౌలీలో ఒక ప్లాట్కి మకాం మార్చి అక్కడే కలిసి ఉంటున్నారు. ఐతే గత కొద్దిరోజులుగా ఆమె నుంచి కుటుంబసభ్యులకు కాల్స్ రావడం లేదు. దీంతో అనుమానం వచ్చిన శ్రద్ధా తండ్రి వికాశ్ మదన్ ఢిల్లీ వచ్చి ఆమె గురించి వాకాబు చేస్తూ...ఆమె ఫ్లాట్ వద్దకు వచ్చి చూడగా తాళం వేసి ఉంది. దీంతో ఆయన పోలీసులుకు తన కూతురు కనిపించడం లేదంటూ పూనావల్లపై ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేయడం ప్రారంభించారు. పోలీసులు పూనావల్ల కోసం తీవ్రంగా గాలించి అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. విచారణలో అతను చెప్పిన విషయాలు విని పోలీసులు షాక్ అయ్యారు. విచారణలో పూనావ్లల...తనని శ్రద్ధ తరచూ పెళ్లిచేసుకోమని పోరు పెడుతున్నట్లు తెలిపాడు. పెళ్లి విషయమై ఇద్దరు గొడవపడినట్లు తెలిపాడు. ఐతే ఒకరోజు ఆ గొడవ తారస్థాయికి చేరుకోవడంతో తాను కోపంతో శ్రద్ధా గొంతుకోసి హతమార్చినట్లు తెలిపాడు. ఆ తర్వాత ఆమె మృతదేహాన్ని 35 ముక్కలుగా కోసి ఒక ఫ్రిజ్ కొనుక్కుని మరీ భద్రపర్చినట్లు తెలిపాడు. ఆ తర్వాత ఆ ముక్కలను పడేసేందుకు రోజు తెల్లవారుజామున 2 గంటలకు వెళ్లి వేర్వేరు ప్రాంతాల్లోపడేసి వచ్చినట్లు చెప్పాడు. దీంతో ఈ కేసు మర్డర్ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. (చదవండి: మారణాయుధాలతో వచ్చి, అక్షితపై దాడిచేసి...) -
పెళ్లైన విషయం దాచి.. ఒకేసారి ఇద్దరు విద్యార్థినిలతో సహజీవనం
సాక్షి, చెన్నై: తనకు వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్న సంగతిని దాచడమే కాకుండా.. ఒకే సమయంలో ఇద్దరు పాఠశాల విద్యార్థులను కిడ్నాప్ చేసి, ఓ ఇంట్లో ఉంచి సహజీవనం చేస్తున్న యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. కన్యాకుమారి జిల్లా కాట్టాతురై సమీపంలో కుట్టకులి కాలనీకి చెందిన విను (22) ఫ్లంబర్గా పని చే స్తున్నాడు. ఇతనికి వివాహమై ఇద్దరు పిల్లలు ఉ న్నారు. ఈ క్రమంలో విను మార్దాండం కాపుకాడు ప్రాంతానికి చెందిన ఓ ప్లస్–2 విద్యార్థిని ప్రేమించాడు. అలాగే ఆమె స్నేహితురాలైన తిరువిట్టా కేసవపురానికి చెందిన మరో ప్లస్–2 విద్యార్థినికి కూడా మాయమాటలు చెప్పి ఇద్దరిని కిడ్నాప్ చేశాడు. విద్యార్థినుల తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యా దు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. విచారణలో ఈ ముగ్గురు చెన్నై తిరువణ్ణామలైలోని ఓ ఇంట్లో అద్దెకు తీసుకుని కాపురం చేస్తున్నట్లు తెలిసింది. దీంతో పోలీసులు విద్యార్థినులను విడిపించి, నిందితుడు వినును అరెస్టు చేశారు. చదవండి: జూనియర్ ఆర్టిస్ట్ల ప్రేమాయణం.. నాలుగేళ్లు ఒకరితో.. నాలుగు నెలలు మరొకరితో.. -
అతడికి 19.. ఆమెకు 56.. పెళ్లికి సిద్ధమైన జంట
బ్యాంకాక్: ప్రేమ గుడ్డిది, దానికి వయసు, పరిధి, దూరం వంటి వాటితో సంబంధం ఉండదు అనే డైలాగులు చాలా సినిమాల్లో వినే ఉంటాం. దానిని థాయ్లాండ్కు చెందిన ఓ జంట నిజం చేసి చూపుతోంది. ఇద్దరి మధ్య 37 ఏళ్ల వయసు తేడా ఉంది. అయినప్పటికీ.. 19 ఏళ్ల యువకుడు, 56 ఏళ్ల మహిళను పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. ఆమెతో నిశ్చితార్థం సైతం చేసుకున్నాడటా! ప్రస్తుతం వారి ప్రేమ, పెళ్లి అంశం ప్రపంచవ్యాప్తంగా చర్చినీయాంశంగా మారింది. ఉత్తర థాయ్లాండ్లోని సఖోన్ నఖోన్ రాష్ట్రానికి చెందిన 19 ఏళ్ల వుతిచాయ్ చంతరాజ్ అనే యువకుడు, 56 ఏళ్ల వయసు ఉన్న జన్లా నమువాన్గ్రాక్ అనే మహిళను పెళ్లి చేసుకోబోతున్నాడు. అతని 10 ఏళ్ల వయసున్నప్పుడు ఆమెను కలిశాడు. ఇరువురు ఇరుగుపొరుగు ఇంట్లోనే ఉండేవారు. ఈ క్రమంలో ఇంటిని శుభ్రం చేసేందుకు తనకు సాయం చేయమని వుతిచాయ్ని కోరేది మహిళ. ఇలా.. చిన్న చిన్న పనుల్లో సాయంగా ఉంటుండంతో ఇరువురి మధ్య స్నేహం ఏర్పడింది. ఆ తర్వాత ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. 37 ఏళ్ల వయసు తేడా ఉన్నప్పటికీ గత రెండేళ్లుగా వారు సహజీవనం చేస్తున్నారు. ‘రెండేళ్లుగా జల్నాతో ఉంటున్నాను. ఒకరు హాయిగా జీవించేలా చేయొచ్చని నా జీవితంలో తొలిసారి తెలుసుకున్నా. పాడైపోయిన ఆమె ఇంటిని చూశాను. ఆ తర్వాత ఆమెకు మంచి జీవితం అందించాలని ఆలోచించాను. ఆమె చాలా కష్టపడి పని చేసే వ్యక్తి, నిజాయితీగా ఉంటుంది. ఆమెను నేను ఆరాధిస్తాను.’ అని పేర్కొన్నాడు. మరోవైపు.. వయసులో తేడా పట్ల వారు ఆందోళన చెందటం లేదు. ఇంటర్వ్యూలు, బహిరంగంగా తమ బంధాన్ని వెల్లడించటంలో ఎలాంటి ఇబ్బందులు పడటం లేదు. నగరంలో బయటకి వెళ్లినప్పుడు చేతులు పట్టుకుని, ముద్దులు పెట్టుకుంటూ సరదాగా కనిపిస్తున్నారు కూడా. అయితే.. జల్నా తన భర్తతో విడిపోయింది. ఆమెకు ముగ్గురు 30 ఏళ్లకుపైగా వయసున్న పిల్లలు ఉన్నారు. వుతిచాయ్ తనలో యువతిననే ఆలోచన కలిగించాడని చెబుతోంది. ‘వుతిచాయ్ నాకు ఒక సూపర్ హీరో. ప్రతి రోజు నాకు సాయం చేస్తాడు.అతను పెద్దవాడయ్యాక మా ఇరువురి మధ్య భావాలు మొదలయ్యాయి.’ అని పేర్కొంది జల్నా. త్వరలోనే పెళ్లి చేసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిపింది. ఇదీ చదవండి: వీడియో: చెంప దెబ్బకు డెలివరీబాయ్ ఇచ్చిన రియాక్షన్.. మరీ వయొలెంట్గా ఉందే! -
భర్తతో విడిపోయి మరో వ్యక్తితో సహజీవనం.. చివరికి షాకింగ్ ట్విస్ట్
కాకినాడ క్రైం: సహజీవనం చేసిన వ్యక్తి పలు దఫాలుగా రూ.1.5 లక్షలు తీసుకుని తనను మోసం చేశాడని పేర్కొంటూ ఓ మహిళ పోలీసులను ఆశ్రయించింది. పోలీసుల కథనం ప్రకారం.. కాకినాడ సాంబమూర్తినగర్కు చెందిన హీనా ఖాతున్ భర్తతో విడిపోయి వేరుగా ఉంటోంది. పాయరోటీ బండి పెట్టి జీవనం సాగిస్తోంది. దుమ్ములపేటలో నివాసం ఉంటున్న విజయభాస్కర్ 18 నెలల క్రితం ఆమెకు పరిచయమయ్యాడు. చదవండి: నిత్య పెళ్లికూతురు.. ఒకరు కాదు ఏకంగా ఆరుగురితో ఆ పరిచయం వారి సహజీవనానికి దారి తీసింది. ఈ నేపథ్యంలో విజయభాస్కర్ అవసరాల కోసం పలు దఫాలుగా ఖాతున్ రూ.1.5 లక్షలు ఇచ్చింది. కొద్ది రోజుల క్రితం నుంచి విజయ భాస్కర్ తనకు కనిపించకుండా పరారయ్యాడని పేర్కొంటూ ఆమె పోలీసులను ఆశ్రయించింది. కాకినాడ పోర్టు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. -
ఆ నటుడితో సహజీవనం.. అవకాశాలు కోల్పోయిన హీరోయిన్!
తమిళసినిమా: కోలీవుడ్లో కథానాయికగా ఎదుగుతున్న నటి వాణి భోజన్. యాంకర్గా జీవితాన్ని ప్రారంభించి ఆ తరువాత బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చి ఇక్కడ మంచి గుర్తింపును తెచ్చుకుని ఆపై సినీ రంగప్రవేశం చేసిన నటి ఈ బ్యటీ..ఓ మై కడవులే చిత్రంలో రెండో హీరోయిన్గా పరిచయమై తొలి చిత్రంతోనే మంచి పేరు తెచ్చుకుంది. ఆ తరువాత పలు చిత్రాల్లో నటించే అవకాశాలను అందుకుంటూ వస్తోంది. ఇటీవల తమిళ్ రాకర్స్ అనే వెబ్సిరీస్లోనూ నటించింది. అయితే ఇప్పటీకి సోలో హీరోయిన్గా నటనకు అవకాశం ఉన్న మంచి పాత్రలో నటించిన దాఖలాలు లేవనే చెప్పాలి. అయినా వార్తల్లో మాత్రం బాగానే నానుతోంది. నటుడు జైతో సహజీవనం చేస్తున్నట్లు ఇప్పటికే ప్రచారం గొల్లుమంటోంది. ఇవాళ రేపు సహజీవనం అనేది సహజంగా మారిపోయింది. అలాంటివారు నయనతార విఘ్నేష్ శివన్ మాదిరి కాస్త ఆలస్యమైనా పెళ్లి పీటలు ఎక్కితే స్వాగతించవచ్చు. అలాకాకుండా కొన్నాళ్లు కలిసి జీవించి ఆ తరువాత బ్రేకప్ అంటేనే సమస్య. ఇప్పుడు వాణి భోజన్ పరిస్థితి ఇదేననే టాక్ స్ప్రెడ్ అవుతోంది. ఈ అమ్మడు నటుడు జైతో సహజీవనం చేయడం వలన ఆమె జీవితం మొత్తం ఆయన చేతిలోకి వెళ్లిపోయిందని, దర్శక, నిర్మాతలు ఆమెను కలిసే పరిస్థితి లేదని, ఆమెకు సంబంధించిన ఏ విషయాన్ని అయినా జైతోనే సంప్రదించాల్సిన పరిస్థితి నెలకొందనే ప్రచారం సామాజిక మాద్యమాలలో హోరెత్తుతోంది. దీంతో వాణిభోజన్ పలు అవకాశాలను కోల్పోతున్నట్లు సమాచారం. ఇదంతా సహించలేక ఆమె జైకు బైబై చెప్పినట్లు కూడా ప్రచారం వైరల్ అవుతోంది. అయితే ఇందులో నిజం ఎంత అన్నది వాణి భోజన్నిగాని, జై గాని స్పందించే వరకు తెలిసే అవకాశం లేదు. అయితే నటుడు జై, నటి అంజలిలో విషయంలో కూడా ఇంతకుముందు ఇలాంటి ప్రచారమే జరిగిందన్నది గమనార్హం. -
సహజీవనం చేసి.. రేప్ కేసులు పెడితే ఎలా?
న్యూఢిల్లీ: తమంతట తాముగా ఇష్టపూర్వక సహజీవనం చేసి.. అవి బెడిసి కొట్టడం, విభేధాల కారణంగా అత్యాచారం ఫిర్యాదులు చేయడం సరికాదని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. ఓ కేసులో నిందితుడికి ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ.. ద్విసభ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో ఫిర్యాదు చేసిన వ్యక్తి.. తనంతట తానే ఇష్టపూర్వకంగా అవతలి వ్యక్తితో సహజీవనం చేసింది. పైగా 21 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఆమె అతనితో బంధంలోకి అడుగు పెట్టింది. నాలుగేళ్ల తర్వాత ఇప్పుడు లైంగికంగా లోబర్చుకున్నాడని, దాడికి పాల్పడ్డాడని చెబుతోంది. ఇష్టపూర్వకంగానే ఆమె అతనితో బంధం కొనసాగించినట్లు ఒప్పుకుంది. కాబట్టి.. అత్యాచారం కింద ఐపీసీ 376(2)(n) ప్రకారం అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి కారణం కాదు అని జస్టిస్ హేమంత్ గుప్తా, జస్టిస్ విక్రమ్ నాథ్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. దేశంలో ఇలాంటి కేసులు చాలానే న్యాయస్థానాల ముందుకు వస్తున్నాయి. పూర్తి ఇష్టంతోనే పరస్పర అంగీకారంతోనే వాళ్లు కలిసి ఉంటున్నారు. వివాహంతో సంబంధం లేకుండా పిల్లల్ని కంటున్నారు. తీరా గొడవలు జరిగితే చాలూ.. ఇలా అత్యాచారం, లైంగిక దాడులంటూ న్యాయం కోసం కోర్టు మెట్లు ఎక్కుతున్నారు. ఇది తీవ్రంగా పరిగణించాల్సిన విషయం. సరైన పద్ధతి కాదు అంటూ బెంచ్ వ్యాఖ్యానించింది. ఈ మేరకు రాజస్థాన్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను తోసిపుచ్చుతూ.. నిందితుడికి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అయితే.. బెయిల్ మంజూరు అయినప్పటికీ దర్యాప్తు మాత్రం యథాతథంగా కొనసాగాలని సుప్రీం బెంచ్, రాజస్థాన్ పోలీసులకు సూచించింది. -
ప్రేమించి పెళ్లి చేసుకుని.. మరో వివాహితతో సహజీవనం
వారిద్దరూ వివాహితులే. ఇద్దరికీ కుటుంబాలున్నాయి. అతను వీఆర్ఓగా పనిచేస్తుండగా...ఆమె సచివాలయ ఉద్యోగి. కానీ ఇద్దరూ ప్రేమ పేరుతో దారితప్పారు. సహజీవనం చేస్తూ... రెండు కుటుంబాల్లో చిచ్చుపెట్టారు. సహచరులను, సంతానాన్ని శోకంలో ముంచారు. అనైతికమని తెలిసీ అదే కావాలంటూ పట్టుబడుతున్నారు. ఫలితంగా సచివాలయ ఉద్యోగికి తాళికట్టిన భర్త... వీఆర్ఓతో జీవితం పంచుకున్న భార్య మమత జీవితాలు ప్రశ్నార్థకమయ్యాయి. సాక్షి, పుట్టపర్తి: ఆయనో ప్రభుత్వ ఉద్యోగి. పైగా ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరు కూతుళ్లు పుట్టాక... మరో వివాహితతో సహజీవనం చేస్తున్నాడు. అడ్డుతప్పించుకునేందుకు భార్యను వేధిస్తున్నాడు. అయినప్పటికీ తన భర్తతోనే కలిసి ఉండేలా చూడాలంటూ ఆ మహిళ పోలీసులను, అధికారులను వేడుకుంటోంది. కూలి పనులు చేసుకుంటూ పిల్లలను పోషించుకుంటోంది. ప్రేమ పెళ్లి...పిల్లలు పుట్టాక లొల్లి.. కొత్తచెరువు మండలం కొడపగానపల్లికి చెందిన ఒంటికొండ రామ్మోహన్ వీఆర్ఓగా పుట్టపర్తి మండలం చెర్లోపల్లిలో విధులు నిర్వర్తిస్తున్నారు. సొంత గ్రామానికే చెందిన మమతను ప్రేమించి 2015 ఫిబ్రవరి 13న బుక్కపట్నం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో వివాహం చేసుకున్నారు. వీరికి యస్మిత, యక్షిత సంతానం. వీరి సంసారం సాఫీగా సాగుతున్న తరుణంలో రామ్మోహన్ దారి తప్పాడు. 2021 సెప్టెంబరు నుంచి భార్యకు దూరంగా ఉంటున్నారు. సచివాలయంలో ఉద్యోగం చేస్తున్న మరో వివాహితతో పరిచయం పెంచుకుని ఆమెతో సహజీవనం చేస్తున్నాడు. చదవండి: (వివాహమైనా ప్రియుడితో సన్నిహితంగా.. ఆహారంలో విషంపెట్టి..) ఆ మహిళ భర్త సంబంధీకులు గొడవకు దిగినా... రామ్మోహన్ తీరులో మార్పు రాలేదు. పైగాతన భార్య, పిల్లలను వదిలేసేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో విడాకులకు అంగీకరించాలని భార్య మమతపై ఒత్తిడి తేగా, ఆమె ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్యకు యత్నించింది. ఆ తర్వాత ఉన్నతాధికారులను కలిసి తన గోడు వెళ్లబోసుకుంది. ఏ ఒక్కరూ స్పందించకపోవడంతో 2022 మార్చి 2న కొత్త చెరువు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎఫ్ఐఆర్ నమోదు చేసి చేతులు దులుపుకున్న పోలీసులు.. ఆమెకు ఎలాంటి న్యాయమూ చేయలేకపోయారు. కనీసం రామ్మోహన్ను స్టేషన్కు కూడా పిలిపించలేకపోయారు. ఈ క్రమంలోనే ఏప్రిల్ 11న మమత మరోసారి ‘స్పందన’లో తన గోడు వెళ్లబోసుకుని న్యాయం కోసం ఎదురుచూస్తోంది. నా భర్త దగ్గరకు చేర్చండి నా ఇద్దరు పిల్లలు అనాథలుగా మారరాదు. మాకు బతుకు తెరువు కావాలి. నా భర్తకు కౌన్సెలింగ్ ఇచ్చి అతని దగ్గరకు చేర్చండి. నా భర్తతో సహజీవనం చేస్తున్న వివాహిత భర్తకూ న్యాయం చేయండి. ఆ ఇద్దరి సంతోషం కోసం రెండు కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయి. ఇప్పటికే చాలా సార్లు పోలీసు స్టేషన్లు, కలెక్టర్ కార్యాలయాలు తిరిగాను. ఎవరూ న్యాయం చేయలేదు. నాకు విడాకులు అవసరం లేదు. నా భర్తతో కలిసి జీవించాలని ఉంది. – మమత -
సహజీవనం చేసి.. తల్లిని చేశాడు.. ఆస్తిలో భాగం కావాలి.. తర్వాత ఏం జరిగిందంటే?
గోరంట్ల(శ్రీసత్యసాయి జిల్లా): మహిళను మోసగించిన ఓ వ్యక్తిపై మండల పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. సీఐ సుబ్బారాయుడు తెలిపిన మేరకు.. గోరంట్లకు చెందిన ట్రాన్స్కో ఏఈ ప్రభాకర్ గతేడాది మేలో మృతి చెందారు. ఈయన మరణించిన కొన్నిరోజులకే.. తనతో సహజీవనం చేసి ఇద్దరు పిల్లలకు తల్లిని చేశాడంటూ మండలంలోని కరావులపల్లికి చెందిన సంధ్యాబాయి ప్రభాకర్ భార్య రుక్మిణీదేవితో వచ్చి వాపోయింది. చదవండి: బాలుడు పాడుపని.. ఇంటర్ బాలికను ఇంటికి తీసుకెళ్లి.. ఆస్తిలో తనకూ భాగం కావాలని వాగ్వాదానికి దిగి ప్రభాకర్కు చెందిన ఒక ఇంట్లో దిగింది. ఆమెను ఎలాగైనా ఇంటి నుంచి ఖాళీ చేయిస్తానని అయితే, తనకు రూ.5 లక్షలు ఇవ్వాలని గోరంట్లకు చెందిన గాండ్ల జగన్ చెప్పడంతో రుక్మిణీదేవి ఆ మేరకు డబ్బు అందజేసింది. ఎన్నిరోజులైనా సమస్యను పరిష్కరించకపోవడంతో డబ్బు వెనక్కివ్వాలని గాండ్ల జగన్ను మంగళవారం రుక్మిణీ దేవి నిలదీసింది. ఆయన బెదిరింపులకు దిగడంతో పోలీసులను ఆశ్రయించింది. మహిళ ఫిర్యాదు మేరకు జగన్పై ఐపీసీ 420, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. -
యువతితో రౌడీషీటర్ సహజీవనం.. అసలు ఏం జరిగిందో కానీ చివరికి..
పాయకాపురం(విజయవాడ రూరల్): వాంబేకాలనీలో నివాసం ఉంటున్న రౌడీషీటర్ ఓయా బాను శంకర్ అలియాస్ టోనీ (25) మంగళవారం తెల్లవారుజామున ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. వాంబేకాలనీ హెచ్ బ్లాక్లో అద్దెకు ఉంటున్న శంకర్ ట్యాటూస్ వేస్తుంటాడు. మూడు నెలల నుంచి అనూష అనే అమ్మాయితో సహజీవనం చేస్తున్నాడు. సోమవారం రాత్రి మద్యం విషయంలో వీరిరువురి మధ్య గొడవ జరిగింది. చదవండి: కొత్త గర్ల్ఫ్రెండ్తో కెమెరా కంటికి చిక్కిన ఎలాన్ మస్క్ దీంతో అనూష అతనిపై అలిగి ఇంటి బయటకు వచ్చి పడుకుంది. దీంతో శంకర్ తలుపులు మూసుకొని చున్నీతో ఫ్యాన్రాడ్ కు ఉరివేసుకొన్నాడు. అర్ధరాత్రి తర్వాత అనూష మూసి ఉన్న తలుపుతీసే ప్రయత్నం చేయగా.. రాకపోవడంతో ఆమె మృతుని తమ్ముడు రామకృష్ణకు ఫోనులో సమాచారం అందజేసింది. అతను కిటికీలో నుంచి చూడగా శంకర్ ఉరివేసుకొన్నట్టు గమనించి పగులకొట్టి లోపలికి వెళ్లాడు. అన్నను కిందికి దించి, ఆటోలో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా అప్పటికే అతను మృతిచెందాడు. మృతుని తమ్ముడు రామకృష్ణ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
యుగ పురుషుడు.. ముగ్గురితో 15 ఏళ్లుగా సహజీవనం.. ఆ తర్వాత..
ముగ్గురు మహిళలతో 15 ఏళ్లుగా ఓ వ్యక్తి సహజీవనం చేశాడు. ఆయనకు ఆరుగురు పిల్లలు ఉండగా.. తాజాగా పిల్లల ఎదుటే ఒకే వేదికపై సదరు వ్యక్తి ఆ ముగ్గురు మహిళలను పెళ్లి చేసుకున్నాడు. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ ఘటన మధ్యప్రదేశ్లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. అలీరాజపూర్లోని గిరిజిన తెగకు చెందిన సమర్థ్ మౌర్య(42) 15 సంవత్సరాలుగా ముగ్గురు మహిళలతో సహజీవనం చేస్తున్నాడు. తాజాగా వారిని పెళ్లి చేసుకున్నాడు. ఈ సందర్బంగా మౌర్య మాట్లాడుతూ.. 2003లో మొదటి భాగస్వామితో పరిచయం ఏర్పడినట్టు తెలిపాడు. అనంతరం మరో ఇద్దరితో కలిసి సహజీవనం చేస్తున్నానని అన్నాడు. ఏప్రిల్ 30వ తేదీన ఒకే మండపంలో నాన్బాయి, మేళా, సక్రీలను పెళ్లి చేసుకున్నానని పేర్కొన్నాడు. 15 ஆண்டுகள் 3 பெண்களுடன் லிவிங் டுகெதர்.. 6 குழந்தைகள் முன்னிலையில் நடைபெற்ற திருமணம்..! #MadhyaPradesh | #Alirajpur | #LiveInRelationship pic.twitter.com/lUVxNdwkuX — Polimer News (@polimernews) May 3, 2022 ఇదిలా ఉండగా.. తమ సంప్రదాయం ప్రకారం తనకు వివాహం జరిగే వరకు ఏ కార్యక్రమానికి కూడా మౌర్యను అనుమతించలేదని అన్నాడు. కాగా, వీరి వివాహానికి గ్రామస్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. Madhya Pradesh: A man living in a live-in relationship with three women entered into a wedlock with all the three in the presence of the entire village. The wedding took place in Nanpur village in the tribal-dominated Alirajpur district. pic.twitter.com/oePIwFb5ss — Free Press Journal (@fpjindia) May 2, 2022 -
ఒంగోలులో యువతుల సహజీవనం.. ఆ వీడియోలు చూసి..
సాక్షి, ఒంగోలు: ప్రకాశం జిల్లా ఒంగోలులో ఇద్దరు యువతుల సహజీవనం వివాదాస్పదంగా మారింది. దీనిపై ఓ యువతి తల్లి స్పందిస్తూ ఇద్దరు అమ్మాయిలు(సుమలత, రమ్య) వివాహం చేసుకున్నారంటూ ఒంగోలు వన్ టౌన్ పోలీసులను ఆశ్రయించింది. అయితే పోలీసులు ఈ ఘటనపై యువతులను వివరణ కోరగా.. తమ మధ్య అలాంటి సంబంధం ఏదీ లేదంటున్నారు. మేము ఇద్దరం అక్కా చెల్లెల్లా కలిసి మెలసి జీవిస్తున్నామన్నారు. రమ్యకు మేనమామతో ఆమె తల్లి నాగమణి వివాహం చేసేందుకు సిద్దమవ్వడంతో ఆ పెళ్లి ఇష్టం లేక రమ్య తన వద్ద ఉంటోందని సుమలత పేర్కొంది. కేవలం టిక్ టాక్లో రమ్య తాను కలిసి వివాహం చేసుకుంటున్నట్లు నటించిన వీడియోలు చూసి అదే నిజమైన పెళ్లిగా భావిస్తూ తమ మధ్య ఏదో సంబంధం ఉన్నట్లు అపోహపడుతోందని తెలిపింది. ఇదిలా ఉండగా సుమలత నివాసంలో పనిచేసే ఆయా మాత్రం వీరిద్దరు పెళ్లి చేసుకున్న విషయం వాస్తవమేనని చెబుతోంది. ఇద్దరు మహిళల వివాహంపై తాను మందలించడంతో తనను ఇంటి పనుల్లో నుంచి తొలగిస్తామని చెప్పారని తెలిపింది. దీంతో అసలు నిజం ఏంటనే విషయంపై పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు. చదవండి: (ప్రేమ వివాహం: ఐదు నెలల తర్వాత గ్రామానికి వచ్చి.. ఊరు శివార్లలో..) -
మూడేళ్లు సహజీవనం.. ఇపుడు దూరంగా ఉంటోందని..
సాక్షి, హైదరాబాద్(భాగ్యనగర్ కాలనీ): తనతో సహజీవనం చేసి..కొన్నేళ్లుగా దూరంగా ఉంచుతోందని కోపం పెంచుకున్న ఓ వ్యక్తి మహిళపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. కూకట్పల్లి పోలీసులు తెల్పిన వివరాల మేరకు ప్రకాష్ నగర్లో నివాసం ఉంటున్న వెంకటలక్ష్మి నాచారంలోని ఈఎస్ఐ ఆస్పత్రిలో స్వీపర్ గా పనిచేస్తుంది. జగద్గిరిగుట్టలో నివాసం ఉంటున్న వెంకటేశ్ అనే వ్యక్తితో ఆమె మూడేళ్లు సహజీవనం చేసింది. కొద్దిరోజులుగా మనస్పర్థలు రావడంతో వీరు విడివిడిగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో వెంకటలక్ష్మిపై కోపం పెంచుకున్న వెంకటేశ్ బుధవారం రాత్రి 8 గంటల సమయంలో ప్రకాష్ నగర్లోని ఆమె నివాసానికి వచ్చి గొడవపడ్డాడు. అనంతరం ఆమెపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. దీంతో వెంకట్ లక్ష్మి తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతురాలి వివరాలు సేకరించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఈ ఘటనలో వెంకటేశ్ సైతం తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. చదవండి: (లైంగిక దాడికి గురైన బాలికకు శిశువు జననం) -
ఒకే కాలేజీ.. ఫేస్బుక్లో దగ్గరై సహజీవనం.. పవిత్రకు నిజం తెలిసి..
సాక్షి, కేపీహెచ్బీకాలనీ: ప్రేమించానంటూ, పెళ్లి చేసుకుంటానంటూ నమ్మించిన ఓ యువకుడు ప్రేయసితో సహజీవనం చేసి పెళ్లి చేసుకోకపోవడంతో ఆవేదనకు గురైన ఆ యువతి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన స్థానిక స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ నర్సింహులు తెలిపిన వివరాలు.. భద్రాద్రి కొత్తగూడెంకు చెందిన కొండా నారాయణ కూతురు పవిత్ర ఉపాధి కోసం నగరానికి వచ్చి కూకట్పల్లి హౌసింగ్బోర్డు కాలనీలో నివాసం ఉంటోంది. అయితే ఆమెతో పాటు ఒకే కాలేజీలో చదువుకున్న ఖమ్మం జిల్లాకు చెందిన బండి గౌతమ్తో ఫేస్బుక్ ద్వారా పరిచయం పెరిగింది. పరిచయం కాస్తా ప్రేమకు దారితీసింది. దీంతో పవిత్రను పెళ్లి చేసుకుంటానని నమ్మించిన గౌతమ్ ఆమెతో సంవత్సర కాలంగా సహజీవనం చేస్తున్నాడు. తన తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. అయితే ఇటీవల గౌతమ్కు వేరే అమ్మాయితో పెళ్లి సంబంధం కుదిరిన విషయం తెలుసుకున్న పవిత్ర అతడిని నిలదీసింది. దీంతో పెద్దల ఒత్తిడితోనే పెళ్లికి ఒప్పుకున్నానని అతడు పేర్కొన్నాడు. చదవండి: (Hyderabad: వ్యభిచార గృహం గుట్టు రట్టు.. సోదరుడి ఇంట్లోనే..) పెద్దలను ఎదిరించి పవిత్రనే పెళ్లి చేసుకుంటానంటూ ఆమెతోనే సహజీవనం సాగిస్తున్నాడు. అయితే శుక్రవారం మధ్యాహ్నం గౌతమ్.. పవిత్ర తండ్రికి ఫోన్చేసి పవిత్ర ఆత్మహత్య చేసుకుంటానని చెబుతుందంటూ సమాచారం ఇచ్చాడు. కొద్దిసేపటికి తిరిగి ఫోన్చేసి పవిత్ర సీలింగ్ ఫ్యాన్కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుందని చెప్పాడు. దీంతో పవిత్ర కుటుంబీకులు హుటాహుటిన నగరానికి వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పవిత్ర ఆత్మహత్యకు గౌతమ్ కారణమంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: (Hyderabad: ముగ్గురు యువతుల అదృశ్యం.. షాకింగ్ ఏంటంటే..) -
వివాహేతర సంబంధం.. ప్రశ్నిస్తోందనే హత్య!
సాక్షి, కందుకూరు: లింగసముద్రంలో అత్యంత దారుణంగా హత్యకు గురైన విద్యార్థిని ప్రశాంతి(15) హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని, ఆర్థిక లావాదేవీలను ప్రశ్నిస్తుందనే కారణంతో తల్లితో సహజీవనం చేస్తున్న శ్రీకాంత్ అనే వ్యక్తే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తేల్చారు. ఈ మేరకు శనివారం స్థానిక కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ కండే శ్రీనివాసులు కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. డీఎస్పీ కథనం ప్రకారం.. వేటపాలేనికి చెందిన ఈసునూరి మాధవి 15 ఏళ్లుగా లింగసముద్రం మండలం తిమ్మారెడ్డిపాలెంలో ఏఎన్ఎంగా పనిస్తోంది. విభేదాల కారణంగా భర్తతో పాటు ఇతర కుటుంబ సభ్యులకు దూరంగా కూతురు ప్రశాంతితో కలిసి లింగసముద్రతో నివాసం ఉంటోంది. తన ఇంటి కింద పోర్షన్లో నివాసం ఉంటున్న జంగారెడ్డిపాలేనికి చెందిన వివాహితుడైన సుంకర శ్రీకాంత్తో ఏర్పడిన పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. ప్రస్తుతం ఇద్దరూ కలిసి సహజీవనం సాగిస్తున్నారు. చదవండి: కూతురు కర్కశం.. కన్నతల్లి అని కనికరం లేకుండా.. దీనికి శ్రీకాంత్ కుటుంబ సభ్యుల నుంచి కూడా ఎటువంటి అభ్యంతరం లేకపోవడంతో కలిసే జీవిస్తున్నారు. మాధవికి వచ్చే జీతాన్ని సైతం శ్రీకాంత్ కాజేయడం, ఆమె అకౌంట్లోని డబ్బులు డ్రా చేసుకొని తన అవసరాలు తీర్చుకోవడం శ్రీకాంత్కు పరిపాటిగా మారింది. ఈ విషయంలో ప్రశాంతి ఇటీవల తల్లిని ప్రశ్నించడం ప్రారంభించింది. 10వ తరగతి పూర్తి చేసిన ప్రశాంతి మంచి మార్కులతో నూజివీడు ట్రిపుల్ ఐటీలో సీటు సాధించింది. అక్కడ రూ.60 వేలు కట్టాల్సి వచ్చింది. మాధవి ఆ డబ్బును శ్రీకాంత్ను అడిగింది. ప్రశాంతి ఉంటే మాధవితో తన సంబంధం కొనసాగదని, ఆర్థిక విషయాల్లో తన బాగోతం బయటపడుతుందని భావించిన శ్రీకాంత్ ప్రశాంతిని చంపేందుకు నిర్ణయించుకున్నాడు. ఈ నెల 23వ తేదీన ఉదయం 7గంటల సమయంలో ఇంట్లో నిద్రపోతున్న ప్రశాంతిని గొంతునులుమి చంపేశాడు. చదవండి: ఆయుర్వేద మెడిసిన్ పేరిట అమెజాన్ ద్వారా భారీగా గంజాయి రవాణా శవాన్ని ఏం చేయాలో తెలియక ఆ రోజంతా ఇంట్లోనే ఉంచుకున్నారు. అర్ధరాత్రి సమయంలో తన స్నేహితుడైన గురుబ్రహ్నం, మాధవి, శ్రీకాంత్ కలిసి అటవీ ప్రాంతానికి శవాన్ని తరలించి పెట్రోల్, డీజిల్ పోసి తలగబెట్టారు. మరుసటి రోజు వెళ్లి శవం పూర్తిగా కాలకపోవడంతో మట్టివేసి కప్పి వచ్చారు. తల్లి సహకారంతోనే... ప్రశాంతి కనిపించకపోవడంతో అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు మాధవి, శ్రీకాంత్లను అదుపులోకి తీసుకొని ప్రశ్నించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు శ్రీకాంత్ తల్లి ధనమ్మ ప్రోత్సాహం కూడా ఉంది. మాధవితో వివాహేతర సంబంధం కొనసాగింపు, ప్రశాంతిని హత్యచేసి తగలబెట్టడం వరకు శ్రీకాంత్కు ఆయన తల్లి ధనమ్మ సహకరించినట్లు పోలీసులు తేల్చారు. -
Banjara Hills: సహజీవనం.. విషాదం
బంజారాహిల్స్: తనకంటే మూడేళ్లు పెద్దదైన యువతిని ప్రేమించి సహజీవనం చేస్తూ మూడు రోజులు గడవకముందే విభేదాలు పొడసూపి ఇద్దరూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా దురదృష్టవశాత్తు బాలుడు మృతి చెందాడు. ఈ ఘటన జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల సమాచారం మేరకు... యూసుఫ్గూడ సమీపలలోని యాదగిరి నగర్లో నివసించే బి.బాలాజీ(17) ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. అదే ప్రాంతంలో అద్దెకుంటూ సినిమాల్లో అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేస్తున్న బి.నీలిమ అలియాస్ అమ్ము(20)తో ఏర్పడిన పరిచయం ప్రేమకు దారి తీసింది. ఇద్దరూ కొద్ది రోజులుగా జవహర్నగర్లో గది అద్దెకు తీసుకొని సహజీవనం చేస్తున్నారు. వారం క్రితం గదిలోనే పెళ్లి చేసుకున్నారు. ఇంకో వారం రోజులు గడిస్తే 17 ఏళ్ల వయసు వచ్చే క్రమంలో బాలాజీకి ఆ యువతితో గొడవలు మొదలయ్యాయి. శనివారం తెల్లవారుజామున ఇద్దరూ ఆత్మహత్య చేసుకోవాలని భావించారు. ఈ మేరకు బాలాజీ ఫ్యాన్కు ఉరేసుకొగా నీలిమ చున్నీతో మెడకు బిగించుకొని ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించింది. బాలాజీ మృతి చెందిగా ఆమె స్వల్ప గాయాలతో బయటపడింది. మృతుడి తండ్రి ఏఆర్ ఏఎస్ఐగా పని చేస్తున్నాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: లాక్డౌన్ వేళ.. ఇంటింటా హింస.. ఇంతింతా కాదు! -
'ఆ నటుడితో డేటింగ్లో ఉన్నా.. చూద్దాం ఎంత వరకు వెళ్తుందో'
నియా శర్మ..హిందీ టీవీ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. తాజాగా ఈ బ్యూటీ టీవీ నటుడు రాహుల్ సుధీర్తో డేటింగ్ చేస్తున్నట్లు బీటౌన్లో పుకార్లు వినిపిస్తున్నాయి. దీనిపై ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె..తన రిలేషన్ షిప్పై స్పందించింది. 'లాంగ్ రిలేషన్లో ఉందామని ఎన్నిసార్లు ప్రయత్నించినా చాలాసార్లు నాకు నిరాశే ఎదురైంది. అందుకే ఇప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నా. నేను ఇతడే నా లైఫ్ పార్టనర్ అని ఖచ్చితంగా నమ్మినప్పుడే మీడియాతో వెల్లడిస్తా. ఎందుకంటే చాలామంది జంటలు మీడియా, సోషల్ మీడియాలో పాపులర్ అయిన జంటలు విడిపోవడం దగ్గర్నుంచి చూశా. అలా అని వాళ్లని కించపరచడం నా ఉద్దేశం కాదు. కానీ నేను పెళ్లి చేసుకునే వ్యక్తి విషయాలు చాలా ప్రైవసీగా ఉంచాలనుకుంటున్నా. చాలా కాలం నుంచి తనతో డేటింగ్లో ఉన్నా.. చూద్దాం ఇది ఎంత వరకు ఎళ్తుందో'.. అని నియా శర్మ తన లివింగ్ రిలేషన్షిప్ స్టేటస్ గురించి వెల్లడించింది. ఇప్పటివరకు డేట్ చేసిన వాళ్లలో ఇదే లాంగ్ రిలేషన్ అని చెప్పింది. బ్యాక్లెస్ టాప్తో వయ్యారంగా డ్యాన్స్.. ఇక యాక్టింగ్లోనే కాదు, అందాల ఆరబోతలో ఓ మాత్రం వెనకడుగు వేయని నియా శర్మ తాజాగా మరోసారి ఇంటర్నెట్ను షేక్ చేసింది. ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోషూట్లతో మతి పోగోట్టే ఈ భామ లేటెస్ట్గా ఓ డ్యాన్స్ వీడియోను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. దీనికి బ్లాక్ లేదా వైట్..మధ్యలో ఏదీ ఉండకూడదు అంటూ ఓ క్యాప్షన్ను జత చేసింది. బ్యాక్లెస్ టాప్తో నడుమును వయ్యారంగా కదిలిస్తూ హాట్ పెర్ఫార్మన్స్తో కుర్రాల మతులు పోగొడుతుంది ఈ భామ. ఇప్పటికే నియా చేసిన ఈ డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్గా మారింది. నియా సహనటుడు అడా ఖాన్ సైతం ఈ అమ్మడి డ్యాన్స్కు హాట్ అంటూ కామెంట్ చేశాడు. వీడియో షేర్ చేసిన కొద్ది సేపట్లోనే నెటిజన్లు లక్షల కొద్దీ లైకుల వర్షం కురిపిస్తున్నారు. ఇక టీవీ నటుడు రవి దూబెతో జమాయి 2.0 అనే వెబ్ సిరీస్లో నియా శర్మ నటించిన సంగతి తెలిసిందే. వెండితెర మీద ముద్దులు, హగ్గులు ఇచ్చుకునే ఈ జంట వెబ్సిరీస్లోనూ రెచ్చిపోయారు. అండర్ వాటర్లో లిప్లాక్ సీన్లలోనూ నటించారు. చివరగా ఖత్రోన్ కే ఖిలాడి మేడ్ ఇన్ అనే సీరియల్లో నియా శర్మ కనిపించింది. చదవండి : (అతడు బెస్ట్ కిస్సర్, అంతా ఆమె వల్లే సాధ్యం!) (సహజీవనం : బాయ్ఫ్రెండ్కి బ్రేకప్ చెప్పేసిన నటి) View this post on Instagram A post shared by Nia Sharma (@niasharma90) -
సహజీవనం : బాయ్ఫ్రెండ్కి బ్రేకప్ చెప్పేసిన నటి
మాజీ ప్రపంచ సుందరి, బాలీవుడ్ నటి సుస్మిత సేన్ బాయ్ఫ్రెండ్ రోహ్మాన్ షాల్తో డేటింగ్లో ఉన్న సంగతి తెలిసిందే. గత కొన్ని నెలలుగా లివింగ్ రిలేషన్షిప్ను కొనసాగిస్తున్న ఈ జంట అనూహ్యంగా బ్రేకప్ చెప్పుకున్నట్లు బీ-టౌన్లో టాక్ వినిపిస్తుంది. ఇందుకు సుస్మిత పెట్టిన ఓ పోస్ట్ ఫ్యాన్స్ను కలవరపాటుకు గురిచేస్తుంది. సమస్య ఏంటంటే..అతడు మారుతాడని మహిళ భావిస్తుంది. కానీ అతడు మారడు. పురుషులు ఎన్ని తప్పులు చేసినా క్షమిస్తుంది. కానీ అతడిని వదిలి వెళ్లదు అనుకుంటాడు. కానీ ఈ కథలో నీతి ఏంటంటే అతడు ఎప్పటికీ మారడు. ఆమె వెళ్లిపోతుంది' అని సుస్మితా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ పోస్ట్ వైరల్గా మారింది. (సుస్మితతో పెళ్లి.. ప్రియుడి కామెంట్) అంతేకాకుండా తన ఇద్దరు కూతుళ్లతో దిగిన ఫోటోను కూడా సుస్మిత షేర్ చేస్తూ..ఒకరికొకరం ఎప్పటికీ వెన్నంటే ఉంటామంటూ ఓ క్యాప్షన్ను జోడించింది. ఇందులో రోహ్మన్ లేకపోవడంతో వీరిద్దరూ బ్రేకప్ చెప్పేసుకున్నారని, ఇక కన్మఫర్మేషన్ ఒకటే మిగిలిందంటూ పలువురు కామెంట్లు పెడుతున్నారు. కాగా తనకంటే 15 ఏళ్లు చిన్నవాడైన కశ్మీర్ మోడల్తో సుస్మిత ప్రేమలో పడిన సంగతి తెలిసిందే. ఇదే ఇదే విషయాన్ని ప్రేమకు చిహ్నమైన తాజ్ మహాల్ దగ్గర దిగిన పిక్ ఇన్స్టాలో షేర్ చేసి అధికారికంగా ప్రకటించారు కూడా. అంతేకాకుండా ఎప్పటికప్పుడు తమ బంధాన్ని తెలియజేస్తూ వారు దిగిన ఫోటోలను అభిమానుల కోసం షేర్ చేస్తుంటారీ జంట. ఇటీవలె సుస్మిత పేరును ప్రియుడు రోహ్మాన్ పచ్చబొట్టు వేయించుకున్నాడు. (విడాకులపై స్పందించిన సుష్మితా సేన్ సోదరుడు) View this post on Instagram A post shared by Sushmita Sen (@sushmitasen47) View this post on Instagram A post shared by Sushmita Sen (@sushmitasen47) -
పౌర స్వేచ్ఛకు పట్టం
యుక్త వయసొచ్చిన జంట కలిసి జీవించాలని నిర్ణయించుకున్నప్పుడు అందులో జోక్యం చేసుకునే హక్కు ఎవరికీ లేదంటూ బుధవారం అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పు హర్షించదగ్గది. ఈ తీర్పు ద్వారా పౌర స్వేచ్ఛకు మరోసారి ఉన్నత న్యాయస్థానం పట్టం కట్టింది. ప్రత్యేక వివాహ చట్టంలోని 30 రోజుల నోటీసు గడువు నిబంధన తప్పనిసరి కాదని, ఐచ్ఛికం మాత్రమేనని న్యాయస్థానం స్పష్టం చేసింది. తమకిచ్చే నోటీసును ప్రచురించటం అవసరమో కాదో ఆ జంట తెలిపితే దాని ప్రకారం వ్యవహరించాలని వివరించింది. నోటీసు బహిరంగపరచటం వల్ల పెళ్లాడే జంట విష యంలో అన్యుల జోక్యం ఎక్కువైందని ధర్మాసనం భావించింది. మన దేశంలో వివిధ మతాలవారికి వేర్వేరు వివాహ చట్టాలున్నాయి. అయితే కుల, మతాల్లో విశ్వాసం లేనివారికీ లేదా వేర్వేరు మతా లకు చెందిన జంటలకు, తల్లిదండ్రుల అభీష్టానికి వ్యతిరేకంగా పెళ్లాడదల్చుకున్నవారికి వర్తించే విధంగా 1954లో ప్రత్యేక వివాహ చట్టం అమల్లోకొచ్చింది. ద్రవిడ ఉద్యమం జోరుగా వున్న సమ యంలో వివాహ సంబంధమైన ఆచారాలు, సంప్రదాయాలు పాటించకుండా బహిరంగ వేదికలపై కేవలం దండలు మార్చుకుని అనేక జంటలు ఒక్కటయ్యాయి. అలాంటి దంపతుల మధ్య కాలం గడిచాక విభేదాలు రావటం, మహిళ జీవితం అనిశ్చితిలో పడటం పర్యవసానంగా ఇలాంటి చట్టం వుండటం అవసరమని ప్రభుత్వం భావించింది. అయితే ప్రత్యేక వివాహ చట్టం నిస్సహాయులైన మహిళలకు తోడ్పడినా, దానివల్ల కొత్త సమస్యలు పుట్టుకొచ్చాయి. పెళ్లాడదల్చుకున్నవారు దర ఖాస్తు ఇచ్చాక వివాహ నమోదు అధికారి 30 రోజుల నోటీసు ఇవ్వాలని, ఎవరైనా అభ్యంతరాలు వ్యక్తం చేస్తే వాటిని పరిగణనలోకి తీసుకున్నాక మాత్రమే వివాహాన్ని నమోదు చేసుకుని జంటకు ధ్రువీకరణ పత్రం అందజేయాలని ఆ నిబంధన నిర్దేశిస్తోంది. ఆచరణలో ఇది అనేక సమస్యల్ని సృష్టిస్తోంది. అంతవరకూ తమ తమ తల్లిదండ్రుల వద్ద వుండే జంట సహజంగానే నోటీసు పంప టానికి ఆ చిరునామాలు ఇవ్వాల్సివుంటుంది. దాని కాపీ నోటీసు బోర్డులో కూడా పెడతారు. ఇంటి కొచ్చే నోటీసును తల్లిదండ్రుల కంటబడకుండా చేయటం సాధ్యమవుతున్నా, రిజిస్ట్రేషన్ ఆఫీసు వద్ద ప్రదర్శించే నోటీసుతో జంటకు తిప్పలొచ్చిపడుతున్నాయి. ఛాందసవాదులు ఆ నోటీసుల్లో వున్న చిరునామాలు చూసి నేరుగా అక్కడికి పోయి సమాచారం ఇవ్వటం లేదా ఫోన్ చేసి చెప్పటం రివాజ వుతోంది. దాంతో ఇరు కుటుంబాలవారూ యువతీయువకుల్ని నిర్బంధంలో వుంచుతున్నారు. ఛాందసవాదుల వేధింపులు సరేసరి. పైగా నిబంధన ప్రకారం పెళ్లికి ముగ్గురు సాక్షులుండాలి. వివా హంపై 30 రోజుల్లో అభ్యంతరాలు వ్యక్తమైన పక్షంలో వారొచ్చి వాంగ్మూలం ఇవ్వాలి. దీంతో సాక్షు లుగా వుండటానికి అనేకులు సంశయిస్తారు. హైకోర్టు తీర్పు పర్యవసానంగా నోటీసు నిబంధన తమకు సమ్మతం కాదని తెలియజేస్తే వివాహ నమోదు అధికారి ఇతరత్రా గుర్తింపు పత్రాల ఆధా రంగా వారి వివాహాన్ని నమోదు చేయాల్సివుంటుంది. అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తాజా తీర్పు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంతో విలువైనది. నిరుడు నవంబర్ 24న ఇదే కోర్టు యుక్తవయసొచ్చినవారికి తమ జీవిత భాగస్వామిని ఎంచుకునే స్వేచ్ఛ వుంటుందని, అందులో జోక్యం చేసుకోవటం రాజ్యాంగంలోని 21వ అధికరణను ఉల్లంఘించటమే నని స్పష్టం చేసింది. సరిగ్గా అదే రోజు ‘పెళ్లి కోసం మతం మార్చుకోవటాన్ని’ నిరోధిస్తూ యూపీ ప్రభుత్వం ఆర్డినెన్సు తీసుకొచ్చింది. భిన్న మతాలకు చెందిన జంటలో ఎవరో ఒకరు అవతలివారి మతానికి మారుతున్నట్టు ప్రకటించటం, అందుకు అనుగుణంగా తమ పేరు మార్చుకోవటం రివాజు అవుతున్నందున ఆర్డినెన్సు అవసరమైందని ప్రభుత్వం తెలిపింది. మతాంతర వివాహాలను నిరో ధించే ఉద్దేశంతోనే దాన్ని తీసుకొచ్చారని స్పష్టమవుతూనే వుంది. ఇప్పుడు ప్రత్యేక వివాహ చట్టం విషయంలో ఇచ్చిన తీర్పు ప్రేమికుల జంటకుండే రాజ్యాంగపరమైన హక్కును మరోసారి తేటతెల్లం చేసింది. ఆర్డినెన్సు వచ్చాక యూపీలో మతాంతర వివాహం చేసుకునే జంటలకు వేధింపులు ఎక్కు వయ్యాయి. మూడేళ్లక్రితం పెళ్లి చేసుకున్న జంటలను సైతం పోలీసులు అరెస్టు చేసి జైళ్లకు పంపారు. ఆర్డినెన్సు ప్రకారం నేరం రుజువైతే పదేళ్లవరకూ జైలు శిక్ష పడుతుంది. వాస్తవానికి మతాంతర, కులాంతర వివాహాలు చేసుకునే జంటలు మన దేశంలో చాలా స్వల్పం. ఆ కొద్దిమందికీ కూడా ప్రత్యేక వివాహ చట్టం నిబంధనలు అవరోధంగా వున్నాయని, వాటి కార ణంగా ఆ జంటలు వేధింపులు ఎదుర్కొనవలసి వస్తున్నదని 2012లో లా కమిషన్ నివేదిక తెలి పింది. వివాహంతో ఒక్కటవుదామనుకునే వారిపై ఎటూ కుటుంబాల ఒత్తిడి వుంటుంది. తల్లిదండ్రుల్లో అత్యధికులు తాము ఎంపిక చేసినవారినే పిల్లలు జీవిత భాగస్వాములుగా అంగీకరించాలని ఆశిస్తారు. అందుకు అంగీకరించని పిల్లలపై వారి ఆగ్రహావేశాలూ సర్వసాధారణమే. కానీ బల వంతంగా తాము అనుకున్నవారితో పెళ్లి జరిపించటానికి ప్రయత్నించటం... కక్షలకు పోయి హతమార్చేందుకు వెనకాడకపోవటం ఇటీవల పెరిగింది. పిల్లల చర్యతో తమ పరువు పోయిందని ఆ తల్లిదండ్రులు భావించటమే కారణం. ఇది ఆందోళక కలిగించే ధోరణి. ఇది చాలదన్నట్టు అందులో తలదూర్చాలని యూపీ సర్కారుతోపాటు మరికొన్ని బీజేపీ ప్రభుత్వాలు నిర్ణయించటం దారుణం. యూపీ, ఉత్తరాఖండ్ ప్రభుత్వాల ఆర్డినెన్సులపై ఇప్పుడు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ నేపథ్యంలో యుక్తవయసొచ్చిన జంట వివాహ నిర్ణయంలో రాజ్యం లేదా రాజ్యేతర శక్తుల జోక్యం ప్రాథమిక హక్కుల ఉల్లంఘనేనని అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇవ్వటం మెచ్చదగ్గది. రెండేళ్లక్రితం కేరళకు చెందిన హదియా కేసులో సుప్రీంకోర్టు సైతం ఇటువంటి తీర్పే ఇచ్చింది. ఒక అంశంలో న్యాయస్థానాలు పదే పదే íß తబోధ చేయాల్సిరావటం, బాధ్యతగల ప్రభుత్వాలే వాటిని పెడచెవిన పెడుతుండటం విచారకరం. -
సహజీవనం: నడిరోడ్డుపై కాల్చి పడేసి..
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో దారుణం జరిగింది. సహజీవనం చేస్తున్న మహిళను గన్తో కాల్చి రోడ్డుపై పడేసిన ఘటన ఢిల్లీ శివార్లలోని అలీపూర్ ప్రాంతంలో వెలుగుచూసింది. డీసీపీ గౌరవ్ శర్మ తెలిపిన వివరాల ప్రకారం.. 'లాహోరీ గేట్ ఎస్ఐగా పనిచేస్తున్న సందీప్ దహియా భార్యతో విడిపోయాడు. ఈ క్రమంలో అతను మరో మహిళతో సంవత్సర కాలంగా సహజీవనం చేస్తున్నాడు. వీరివురు ఆదివారం రోజున కారులో ప్రయాణిస్తుండగా వారి మధ్య ఓ విషయంలో వివాదం తలెత్తింది. (హేమంత్ హత్యకేసు.. పోలీసుల పిటిషన్) దీంతో ఆమెను గన్తో కాల్చి రోడ్డు మీద పడేసి వెళ్లిపోయాడు. అయితే ప్రాణాపాయస్థితిలో ఉన్న మహిళను ఆ ప్రాంతంలో విధులు నిర్వర్తిస్తున్న మరో సబ్ ఇన్స్పెక్టర్ జైవీర్ ఓ ప్రైవేట్ వాహనంలో సమీప ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాధిత మహిళ ఆస్పత్రిలో కోలుకుంటోంది. ఆమె ఆరోగ్యం స్థిరంగా ఉంది. ఎస్సై జవీర్ వెంటనే స్పందించడం వల్లే ఆమె ప్రాణాలతో బయటపడింది. ఎస్సై సందీప్ దహియా తనపై కాల్పులు జరిపినట్లు ఆమె చెప్పింది. దీంతో ఎస్సై సందీప్పై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నాం' అని డీసీపీ తెలిపారు. (వివాహేతర సంబంధం: మెడలో చెప్పులతో) -
భార్యకు విడాకులు.. గాయనితో 9 ఏళ్లుగా
దక్షిణాదిన తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న సంగీత దర్శకుడు గోపీ సుందర్. తన దైన శైలీలో బాణీలను అందిస్తూ సంగీత ప్రియులను ఆకట్టుకుంటున్నాడు. ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’తో టాలీవుడ్లో మ్యూజిక్ కంపోజర్గా అరంగేట్రం చేసిన గోపీ ‘గీతా గోవిందం’ చిత్రంతో ప్రత్యేక గుర్తింపు పొందాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా మారి మిగతా సంగీత దర్శకులకు తీవ్రమైన పోటీని ఇస్తున్నాడు. అయితే ఇప్పటివరకు గోపీ సుందర్ వృత్తిపరమైన జీవితం గురించే అందరికీ తెలుసు. కానీ తాజాగా ఆయన ఇన్స్టాలో షేర్ చేసిని పోస్ట్తో అతడి వ్యక్తిగత జీవితం తెలసుకోవడానికి నెటిజన్లు తెగ ఆసక్తిచూపిస్తున్నారు. 2001లో గోపీసుందర్కు ప్రియ అనే యువతితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే మనస్పర్థలు తలెత్తడంతో గోపీసుందర్ తన భార్య నుంచి విడాకులు కావాలిన కోర్టును ఆశ్రయించాడు. అయితే విడాకులు ఇచ్చేందుకు ఆయన భార్య ప్రియ కూడా సమ్మతంగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే యువ గాయని అభయ హిరణ్మయితో గోపీ సుందర్ ప్రేమలో పడ్డాడు. గోపీ- హిరణ్మయిలు తొమ్మిదేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. ఈ విషయాన్ని వేర్వేరు సందర్భాల్లో వీరిద్దరూ అధికారికంగా తెలిపారు. ‘నా ఉనికికి నువ్వే కారణం’ అంటూ హిరన్మయితో కలిసి దిగన ఫోటోను తన ఇన్స్టాలో పోస్ట్ చేశాడు గోపీ సుందర్. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఇక గోపీ సుందర్ స్వరపరిచిన అనేక పాటలను హిరణ్మయి ఆలపించిన విషయం తెలిసిందే. చదవండి: అప్పుడు దిమాక్ ఖరాబ్.. ఇప్పుడు డింఛక్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కౌశల్ View this post on Instagram You are the reason I exist ❤️ A post shared by Gopi Sundar Official (@gopisundar__official) on May 12, 2020 at 11:25pm PDT -
సహజీవనం చేస్తున్నందుకు దారుణంగా హత్య
సాక్షి, హైదరాబాద్: మహిళతో సహజీవనం చేస్తున్న యువకుడిని కొంతమంది కర్రలతో కొట్టి దారుణంగా హత్య చేసిన సంఘటన కుషాయిగూడ పోలీస్స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది. సోమవారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనతో స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు. మంగళవారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏఎస్రావునగర్ డివిజన్, మహేశ్నగర్ గాయత్రి అపార్టుమెంట్లో ఓ మహిళ తన 9 సంవత్సరాల కొడుకు, తల్లితో కలిసి నివాసముంటోంది. భర్తను వదిలేసిన ఈమె యూసుఫ్గూడ నుంచి నెలన్నర క్రితమే ఇక్కడికి వచ్చింది. ఇదిలావుండగా రంగారెడ్డి జిల్లా, బాషామోనిగూడేనికి చెందిన గుర్రం శివారెడ్డి(30) ప్రైవేటు ఉద్యోగం చేసుకుంటు కొత్తపేట మార్గదర్శి కాలనీలో ఉంటున్నాడు. సదరు మహిళ శివారెడ్డితో నాలుగు సంవత్సరాలుగా సహజీవనం చేస్తోంది. శివారెడ్డి తరచుగా మహేశ్నగర్కు వచ్చి వెళ్తుంటాడు. సోమవారం కూడా శివారెడ్డి ఇక్కడికి వచ్చాడు. అదే సమయంలో సదరు మహిళ సోదరుడు తన భార్యతో కలిసి మహేశ్నగర్లోని సోదరి వద్దకు రాగా మహిళ సోదరుడుకి శివారెడ్డికి గొడవ జరిగింది. మద్యం మత్తులో ఉన్న శివారెడ్డిపై దాడి చేసి బయటకు గెంటేశారు. ఆ సమయంలో శివారెడ్డి వంటిపై లుంగీ మాత్రమే ఉంది. దీంతో బట్టల కోసమని తిరిగి ఫ్లాట్ వద్దకు వెళ్లగా లుంగీ కూడా లాగేసి కొంతమంది కర్రలతో శివారెడ్డిపై దాడి చేశారు. దాడిలో తల పగిలి కింద పడిపోయాడు. రోడ్డుపై పడివున్న శివారెడ్డిని పక్కనే ఉన్న పొదల్లో పడేశారు. శివారెడ్డి మృతదేహం ఇదంతా గమనించిన స్థానికులు భయాందోళనలకు గురై పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు రక్తపు మడుగులో పడి ఉన్న శివారెడ్డిని పరిశీలించగా అప్పటికే మృతి చెందాడు. ఘటన స్థలాన్ని డీసీపీ నారాయణరెడ్డి, ఏసీపీ శివకుమార్, ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ పరిశీలించారు. క్లూస్టీం, డాగ్ స్క్వాడ్తో ఆధారాలు సేకరించిన పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు. -
‘ఖాకీ’ రాసలీలలు గుట్టురట్టు!
సాక్షి, కర్నూలు : కోడుమూరు పోలీస్స్టేషన్లో పనిచేస్తున్న కానిస్టేబుల్ ఓ మహిళతో సాగిస్తున్న రాసలీలలు గుట్టురట్టయ్యాయి. కర్నూలు శివారులోని కోడుమూరు రోడ్డులోని రాజీవ్ గృహకల్పలోని మూడవ అంతస్థులో గదిని అద్దెకు తీసుకుని కోడుమూరు పట్టణానికి చెందిన మహిళతో కొంతకాలంగా సహజీవనం చేస్తున్నాడు. ఈ విషయం భర్తకు తెలిసింది. బుధవారం కానిస్టేబుల్ ఆన్డ్యూటీలోనే ఉంటూ కర్నూలుకు వచ్చి ఫోన్ చేసి మహిళను పిలిపించుకుని గదిలో ఉండగా ఇరుగుపొరుగు వారు గదికి తాళం వేసి బంధించి నాల్గవ పట్టణ పోలీసులకు పట్టించారు. కానిస్టేబుల్గా పనిచేస్తూ తప్పుడు వ్యవహారానికి పాల్పడటంపై కాలనీ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే పోలీసు పరువు పోతుందన్న ఉద్దేశంతో కొద్దిసేపు అతనిని స్టేషన్లో ఉంచుకుని గుట్టుచప్పుడు కాకుండా వదిలేశారు. ప్రేమ జంటను బెదిరించిన కేసులో రౌడీషీట్ కర్నూలు శివారులోని జగన్నాథగట్టు వద్ద ప్రేమ జంటను బెదిరించి బంగారు నగలను లాక్కోవడమే కాక అత్యాచారానికి పాల్పడినట్లు గతంలో ఇతనిపై ఆరోపణలు ఉన్నాయి. తాలూకా పోలీస్స్టేషన్లో పనిచేసేటప్పుడు జగన్నాథగట్టు వద్ద ప్రేమ జంటలను బెదిరించడం, డబ్బులు, బంగారు నగలు లాక్కోవడం వంటి నేరాలకు పాల్పడి సస్పెండ్కు గురైనట్లు సమాచారం. వ్యభిచారం, మోటర్సైకిళ్ల దొంగతనం వంటి పలు నేరాలకు పాల్పడి సస్పెన్షన్కు గురికావడమే కాక కొంతకాలం వీఆర్లో ఉండి ఏడాది క్రితం కోడుమూరుకు బదిలీపై వెళ్లారు. అక్కడ పనిచేసే ఓ ఏఎస్ఐతో కానిస్టేబుల్కు విభేదాలు ఉన్నాయి. కోడుమూరు పట్టణానికి చెందిన మహిళతో రాజీవ్ గృహకల్పలో ఉన్నట్లు ఏఎస్ఐ స్వయంగా భర్తకు సమాచారం ఇచ్చి పట్టించినట్లు పోలీసు శాఖలో చర్చ జరుగుతోంది. అయితే ఎలాంటి కేసు నమోదు చేయకుండా అతనిని పోలీసులు వదిలేయడంపై కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
'మా డాడీ మాకు కావాలి'
మానకొండూరు (కరీంనగర్) : ఓ కానిస్టేబుల్ తనకు భార్య, పిల్లలు ఉండగానే మరో మహిళతో సహజీవనం చేస్తుండడంతో... పిల్లలు 'మా డాడీ మాకు కావాలి' అంటూ ఆందోళనకు దిగారు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండల కేంద్రంలో శుక్రవారం చోటుచేసుకుంది. కనకయ్య అనే వ్యక్తి కరీంనగర్లో కానిస్టేబుల్గా పనిచేస్తూ మానకొండూరులో నివాసం ఉంటున్నాడు. కనకయ్యకు భార్య శారద, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరి మధ్య విబేధాలు రావడంతో ఒకే చోట పక్క పక్క ఇళ్లల్లో ఉంటున్నారు. ఈ క్రమంలో కనకయ్య... అనురాధ అనే మరో మహిళతో సహజీవనం చేస్తున్నాడు. దీంతో శారద, ఆమె పిల్లలు ఇద్దరు సోమవారం మహిళా సంఘాల వారి సాయంతో కనకయ్య ఇంటి ముందు ఆందోళనకు దిగారు. 'మా డాడీ మాకు కావాలి' అంటూ కనకయ్య పిల్లలు ఫ్లకార్డులను చేత్తో పట్టుకుని నిరసన తెలిపారు. అక్రమ సంబంధాన్ని అరికట్టాలి, భార్య ఉండగా మరో స్త్రీ ఎందుకు అనే నినాదాలు రాసి ఉన్న ఫ్లకార్డులను పట్టుకుని కొందరు మహిళలు ధర్నాకు దిగారు. ఆ తర్వాత ఆగ్రహంతో ఇంటి లోపల ఉన్న అనురాధను బయటకు తీసుకొచ్చి దాడి చేసి కొట్టారు. ఈలోగా పోలీసులు అక్కడకు చేరుకుని.. న్యాయ మార్గంలో వెళ్లాలని, ఇలా దాడి చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించడంతో వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు. -
సహజీవనం చేస్తున్న యువతితో గొడవపడి...
హైదరాబాద్: సహజీవనం చేస్తున్న మహిళతో గొడవపడి ఓ యువకుడు ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన పంజగుట్ట పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు... కృష్ణా జిల్లా విజయవాడకు చెందిన మహ్మద్ రఫీ (29) పోలీస్ శాఖలో అటెండర్గా విధులు నిర్వహించేవాడు. అయితే ఏడాదిన్నర కిందట సస్పెండ్ అయ్యాడు. రఫీకి కరీంనగర్కు చెందిన కవిత అనే బీ-ఫార్మసీ చదివిన మహిళ పరిచయమైంది. వీరిద్దరూ ప్రేమించుకుని గత రెండు సంవత్సరాలుగా పంజగుట్ట దుర్గానగర్లో ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. ఇద్దరి మధ్య స్వల్ప గొడవలు జరగడంతో గురువారం కవిత తన ఇంటికి వెళ్లిపోయేందుకు సిద్ధపడింది. రఫీ వద్దని వారించినా వినకపోవడంతో చున్నీతో ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. ఇంటి బయట ఉన్న కవిత ఈ విషయాన్ని గమనించి గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి తలుపు పగులగొట్టి అతన్ని కిందకు దింపి సోమాజిగూడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం రఫీ ఆరోగ్యం విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
ఆ నటుడు నన్ను మోసం చేశాడు: నటి హేమ
హైదరాబాద్ : ఓ తమిళ నటుడు తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని సినీ నటి, నిర్మాత హేమలత అలియాస్ హేమ వెల్లడించింది. పోలీసులకు, సినీ పెద్దలకు ఫిర్యాదు చేసినా ఇప్పటివరకూ అతనిపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ... వరంగల్ జిల్లా నర్సింహులపేట మండలం పెద్దనాగారంలో పుట్టి పెరిగానని, సినిమాలపై మక్కువతో తెలుగులో అవకాశాలు రాక 2011లో చెన్నై వెళ్లినట్టు తెలిపింది. ప్రకటనల్లో, సినిమాల్లో నటించి, ఓ నిర్మాణ సంస్థను స్థాపించినట్టు తెలిపింది. దాని ద్వారా రెండు సినిమాలు తీశానని, తెలుగు, తమిళ సినిమాల్లో నటించినట్టు వెల్లడించింది. ఈ క్రమంలో 2014 జనవరి నెలలో తమిళ హీరో ఇళయరాజా తనకు పరిచయమయ్యాడని, పరిచయం ప్రేమగా మారి రెండు సంవత్సరాలు సహజీవనం చేసినట్లు తెలిపింది. 2015లో తన ఇంట్లోనే ఇద్దరం వివాహం చేసుకున్నట్టు పేర్కొంది. ఈ విషయం ఇళయరాజా కుటుంబ సభ్యులకు, తన కుటుంబ సభ్యులకు తెలుసునని చెప్పింది. ఇళయరాజా సోదరుడి వివాహం అయిన తర్వాత బహిరంగంగా పెళ్లి జరిపిద్దామని నమ్మబలికాడని.. అంతలోపు గర్భం దాలిస్తే అబార్షన్ కూడా చేయించినట్లు తెలిపింది. 2015 సెప్టెంబర్ 3వ తేదీన ఇళయరాజా ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదని ఆవేదన వ్యక్తం చేసింది. అయితే అతనికి వేరే యువతితో వివాహం నిశ్చయమైందని ఫేస్బుక్ ద్వారా తెలుసుకుని తమిళనాడులోని మధురవాయిల్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు చెప్పింది. కాగా ఇళయరాజా కుటుంబానికి రాజకీయ అండ ఉండడంతో పోలీసులు పట్టించుకోవడం లేదని హేమ ఆరోపించింది. హైదరాబాద్లో కూడా పోలీసులకు ఫిర్యాదు చేశానని, పోలీసు ఉన్నతాధికారులను కలిసినా ప్రయోజనం లేదని, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు స్పందించి తనకు న్యాయం చేయాలని వేడుకుంది. ఈ కార్యక్రమంలో ద్రావిడ దేశం వ్యవస్థాపక అధ్యక్షులు వి.కృష్ణారావు పాల్గొన్నారు. -
ప్రియురాలు తిట్టిందని..
బంజారాహిల్స్ : 'పనీపాటా లేకుండా నేను సంపాదించిన సొమ్ముతో తిని పడుకుంటున్నావ్' అంటూ సహజీవనం చేస్తున్న ప్రియురాలు తిట్టడంతో మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఉరేసుకున్నాడు. ఈ ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అంబర్పేట చాకలి బస్తీకి చెందిన కె.లోకేష్(28), మీరా అనే యువతి కొన్ని రోజులుగా సహజీవనం చేస్తూ యూసుఫ్గూడలో ఉంటున్నారు. మీరా ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తోంది. లోకేష్ నిరుద్యోగి. గత కొద్దిరోజులుగా ఉద్యోగం కోసం వెతుకుతున్నా లోకేష్కు ఫలితం దక్కటం లేదు. దీనికి తోడు ఉద్యోగం సద్యోగం లేకుండా తిరుగుతున్నావంటూ రోజూ మీరా సూటిపోటి మాటలతో వేధిస్తోంది. భరించలేక శుక్రవారం రాత్రి లోకేష్ తన గదిలో ఫ్యాన్కు చీరతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తండ్రి కె.రాజు ఫిర్యాదు మేరకు శనివారం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
పోలీసులకు 'దృశ్యం' చూపిస్తున్నాడు
బంజారాహిల్స్ : పెళ్లి చేసుకోమని నిలదీసిందనే కోపంతో సహజీవనం చేస్తున్న యువతిని ముక్కలుగా నరికి పారేసినట్లు నిందితుడు చెబుతున్నా పోలీసులకు ఒక్క ఆధారం కూడా దొరకటం లేదు. దీంతో నిందితుడి మాటలను నమ్మాలో వద్దో తెలియక పోలీసులు నానాతంటాలు పడుతున్నారు. ఘటన పూర్తి వివరాల్లోకి వెళ్తే...బంజారాహిల్స్ రోడ్ నంబర్-2లోని ఇందిరానగర్లో ఆగస్టు 4వ తేదీన రమణకుమారి అనే యువతిని హత్య చేసి దేహాన్ని ముక్కలుగా చేసి నగరంలో వివిధ ప్రాంతాల్లో పడేసినట్లు దుర్గా విజయ్బాబు అనే వ్యక్తి పోలీసులకు వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే గత నాలుగు రోజులుగా విజయవాడ పోలీసులు నగరానికి వచ్చి అతడు చెప్పినట్లుగా జానకమ్మ తోట, గుట్టల బేగంపేటలో యువతి అవశేషాల కోసం గాలిస్తున్నా ఒక్క ఆధారమూ దొరకలేదు. గుట్టల బేగంపేటలో మొండెం ఉంచిన సూట్కేస్ను పడేసినట్లు నిందితుడు పేర్కొనగా అక్కడ ఎలాంటి సూట్కేస్ కనిపించలేదు. ఇక తల, కాళ్లూ,చేతులు ప్లాస్టిక్ కవర్లో చుట్టి జానకమ్మ తోటలో పడేసినట్లు చెప్పగా శుక్రవారం రాత్రంతా జూబ్లీహిల్స్ పోలీసుల బందోబస్తు మధ్య విజయవాడ పోలీసులు జేసీబీల సాయంతో రాళ్లను పక్కకు జరిపించి కనీసం ఎముకలైనా దొరుకుతాయేమోనని జల్లెడ పట్టినా ఎలాంటి క్లూ దొరకలేదు. అసలు రమణకుమారి హత్యకు గురైందా? విజయ్బాబు కథలు అల్లుతున్నాడా? అన్నది సస్పెన్స్గా మారింది. నిందితుడు విజయవాడ పోలీసులను, బంజారాహిల్స్ పోలీసులను అయోమయానికి గురి చేస్తున్నట్లు సమాచారం. ఇంతకీ రమణకుమారి ఏమైందన్న దానిపై పోలీసులకు అంతు చిక్కకుండా ఉంది. ఈ కేసులో ముందుకు తీసుకెళ్లాలంటే మృతదేహం లేకుండా దర్యాప్తు ప్రారంభించడం(కార్పస్ డెలిక్టి) ఒక్కటే విజయవాడ పోలీసుల ముందున్న మార్గం. ఒకవేళ బాధితుడు కోర్టును ఆశ్రయిస్తే తప్పనిసరిగా రమణకుమారి వివరాలను పోలీసులు కోర్టుకు వెల్లడించాల్సి ఉంటుంది. ఏ ఒక్క ఆధారం లేకుండా ఏం చేయాలో పోలీసులకు పాలుపోవడం లేదు. నిందితుడు ఈ కేసు నుంచి తప్పించుకోవడానికే పోలీసులకు 'దృశ్యం' సినిమా కథను చవిచూపిస్తున్నట్లు పోలీసులే అనుమానిస్తున్నారు. ఇక ఈ కేసు ఎటు వైపు నుంచి ఎటు వెళ్తుందో వేచి చూడాల్సి ఉంది. -
బంజారాహిల్స్లో మహిళ దారుణ హత్య
కత్తితో దాడి చేసి ముక్కలుగా కోసి సూట్కేసులో కుక్కేసిన వైనం యువతి అదృశ్యంపై విజయువాడలో కేసు నిందితుడి అరెస్టుతో వెలుగులోకి.. హైదరాబాద్: పట్టపగలు శవాన్ని ముక్కలు ముక్కలుగా కోశాడు.. మూటల్లో కుక్కాడు.. దర్జాగా బైక్పైనే మూటలు తీసుకెళ్లి నిర్మానుష్య ప్రాంతాల్లో పాడేశాడు. ఇంత జరిగినా చుట్టుపక్కల వారికి గాని, స్థానిక పోలీసులకు గాని విషయం తెలియలేదు. అంతేకాదు మర్డర్ చేసిన నిందితుడు పలానా చోట మహిళను ముక్కలుగా నరికానని చెప్పేవరకూ స్థానిక పోలీసుల దృష్టికీ ఈ విషయం రాలేదు. సంచలనం సృ ష్టించిన ఈ ఘటన బంజారాహిల్స్లో చోటు చేసుకుంది. విజయవాడకు చెందిన దుర్గావిజ య్బాబు(40) బంజారాహిల్స్ రోడ్ నం.2 లోని ఇందిరానగర్లో నివాసముంటూ నందినగర్ సమీపంలోని ఓ బిల్డర్ వద్ద డ్రైవర్గా పని చేస్తుండేవాడు. తూర్పుగోదావరి జిల్లా రాజ మండ్రి లలితానగర్కు చెందిన వేల్పూరి రమణకుమారి(35)తో రెండేళ్ల నుంచి పరిచయం పెంచుకొని సహజీవనం చేస్తున్నాడు. అప్పటికే ఆయనకు భార్య పద్మావతి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఎన్నిసార్లు అడిగినా అంగీకరించకపోవడంతో.. విజ య్బాబు తనను వేధిస్తున్నాడంటూ రమణకుమారి రాజమండ్రి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది. పోలీసులు విచారణ నిమిత్తం విజయ్బాబును పిలవగా తాను రమణకుమారిని పెళ్లి చేసుకుంటానని చెప్పి విడుదలయ్యాడు. ఈ ఏడాది ఆగస్టు 3వ తేదీన హైదరాబాద్లో పెళ్లి చేసుకుందామని రమణకుమారిని నమ్మించి తీసుకొచ్చి ఇందిరానగర్లోని అద్దె గదిలో ఉంచాడు. పథకం ప్రకారమే...: ఆగస్టు 4న ఉదయం 10 గంటల సమయంలో అప్పటికే వేసుకున్న పథకం ప్రకారం విజయ్బాబు మాంసం నరికే కత్తితో రమణకుమారి తలపై బలంగా బాదాడు. ఆమె కుప్పకూలడంతో మెడను నరికాడు. రెండుకాళ్లు నరికి మొండెం ను ఓ సూట్కేస్లో, కాళ్లు, తలను వుూటల్లో చుట్టి తన బైక్పై యూసుఫ్గూడ సమీపంలోని జానకమ్మ తోటలో కాళ్లు, తల ఉన్న కవర్ను పడేసి మొండెం ఉంచిన సూట్కేస్ను మాదాపూర్ గుట్టల బేగంపేట నిర్మానుష్య ప్రాంతంలో వేసి పరారయ్యాడు. రెండు నెలలు గడుస్తున్నా తన సోదరి ఆచూకీ తెలియకపోయేసరికి రమణకుమారి అక్క పద్మావతి విజయవాడ సత్యనారాయణపురం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు విచారించగా ఆగస్టు 3న విజయ్బాబుతో హైదరాబాద్ వెళ్లినట్లు తేలింది. విజయ్బాబును విచారించగా రమణకుమారిని తానే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. ఇదే కేసు విషయంలో సత్యనారాయణపురం ఎస్ఐ నరేష్కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు నిందితుడిని విచారణ నిమిత్తం తీసుకొచ్చి ఇందిరానగర్లో హత్య జరిగిన ప్రాంతంలో దర్యాప్తు చేశారు. వివరాలను బంజారాహిల్స్ పోలీసులకు తెలిపారు. కాగా, పట్టపగలు ఇందిరానగర్లో దారుణ హత్య జరిగినా బంజారాహిల్స్ పోలీసులకు సమాచారమే లేదు. -
సహజీవనం పేరుతో మోసం చేసిన వ్యక్తిపై కేసు
హైదరాబాద్: ఉద్యోగంతో పాటు వ్యాపారంలో వాటా ఇస్తానని మాయమాటలతో నమ్మబలికి సహజీవనం చేసి మోసానికి పాల్పడిన వ్యక్తితో పాటు అతనికి సహకరించిన మరో ఏడుగురిపై కోర్టు ద్వారా మాదాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. బాధితురాలు.. 25వ మెట్రోపాలిటన్ కోర్టు ద్వారా ఇచ్చిన ఫిర్యాదులోని అంశాలను సీఐ నర్సింహులు వివరించారు. నిజాంపేటలో నివాసముండే సంకు రమణ(33) హబ్సిగూడలోని ఫార్చూన్ బటర్ఫ్లై సిటీ రియల్ఎస్టేట్ కార్యాలయంలో ఏజీఎంగా పని చేస్తున్నాడు. నింబోలి అడ్డలో నివాసం ఉండే ఓ వివాహిత(27) ఫార్చూన్ బటర్ ఫ్లై సిటీ సంస్థలో మార్కెటింగ్ మేనేజర్గా చేరింది. 2014 నుంచి మాదాపూర్లోని అయ్యప్ప సోసైటీలో మరో బ్రాంచ్ కార్యాలయాన్ని ప్రారంభించారు. మార్కెటింగ్ మేనేజర్ను ఆ రోజు నుంచి అక్కడే విధులు నిర్వహించాలని రమణ చెప్పాడు. రోజూ ఉదయం 10 నుంచి సాయంత్రం 7 గంటల వరకు రమణ కార్యాలయంలోనే ఉండేవాడు. కారులో తీసుకెళ్తూ వివాహితతో అన్యోన్యంగా మెలిగాడు. జీతంతో పాటు చేసే వ్యాపారంలో 50 శాతం వాటా ఇస్తానని, రూ. 25 లక్షలు డిపాజిట్ చేస్తానని, ఐదేళ్ల కొడుకును డిగ్రీ వరకు తానే చదివిస్తానని నమ్మబలికాడు. మహరాణిలా చూసుకుంటానని, భర్తకు విడాకులు ఇప్పిస్తానని మాయమాటలు చెప్పాడు. కార్యాలయానికి సమీపంలోనే అయ్యప్ప సొసైటీలో మరో ఫ్లాట్ అద్దెకు తీసుకొని మార్కెటింగ్ మేనేజర్ను అక్కడే ఉంచాడు. వీకెండ్లో ఆమె ఫ్లాట్లోనే రాత్రి వేళల్లో ఉంటూ సహజీవనం చేస్తూ, రిసార్ట్స్లలో తిప్పాడు. ఆమె గర్భం దాల్చడంతో మత్తు ఇచ్చి గర్భస్రావం అయ్యేటట్లు చేశాడు. బలవంతంగా మద్యం తాగించేవాడు. భార్య జానకీ పాటు సహ ఉద్యోగులు కిరణ్, రాజేష్, వాసు, రవి, మధు, రాములు సహజీవనం విషయం బయటికి చెబితే చంపేస్తామని బెదిరించారు. జీతంతోపాటు కమిషన్ రూ.5 లక్షలు రావాల్సి ఉంది. ఈలోగా సెప్టెంబర్ 30వ తేదీ నుంచి ఫ్లాట్ అద్దె గడువు ముగియడంతో యజమాని ఖాళీ చేయాలని బాధితురాలితో చెప్పాడు. దీంతో ఆమె రమణను ఫోన్లో ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు. సెప్టెంబర్ 26న మాదాపూర్ పోలీస్ స్టేషన్కు వెళ్లగా వినాయక నిమజ్జనంలో పోలీసులు ఉండటంతో ఆమె కోర్టును ఆశ్రయించింది. సంకు రమణతో పాటు అతనికి సహకరించిన కూకట్పల్లికి చెందిన కిరణ్(40), రాజేష్(32), వాసు(32), రవి(33)లతో పాటు ప్రధాన నిందితుడి భార్య జానకి అలియాస్ ధనలక్ష్మి(29), మధు(30), రాము(29)లపై కోర్టు ద్వారా ఐపీసీ 420, 313, 376, 506, రెడ్విత్-34 సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేసినట్లు సీఐ వివరించారు. నిందితులు పరారీలో ఉన్నారని, వారి కోసం గాలిస్తున్నామన్నారు. బాధితురాలు శుక్రవారం మాదాపూర్ పోలీస్ స్టేషన్కు విచ్చేశారు. మీడియాతో మాట్లాడేందుకు ఆమె నిరాకరించారు. ఆమె నుంచి సీఐ వివరాలు సేకరించి గచ్చిబౌలిలోని మహిళా పోలీస్స్టేషన్కు పంపించారు. సీఐ సునీత బాధితురాలి నుంచి మరిన్ని వివరాలను సేకరించారు. దాదాపు ఏడాదిపాటు సహజీవనం చేసి మోసగించినట్లు ఆమె పోలీసులకు తెలిపినట్లు సమాచారం. -
ప్రియుడిని రోకలిబండతో అంతం చేసింది
మైలవరం (కృష్ణా జిల్లా) : సహజీవనం చేస్తున్న వ్యక్తిని ఓ మహిళ రోకలిబండతో హత్య చేసింది. కృష్ణా జిల్లా రెడ్డిగూడెం మండలం ముచ్చెనపల్లి గ్రామంలో ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన శాంతకుమార్ (30) అనే మహిళ జి.కొండూరు మండలానికి చెందిన పొనుసూరి బాబూ రాజేంద్ర ప్రసంగి (38) అనే వ్యక్తితో కొన్నాళ్లుగా సహజీవనం చేస్తోంది. జి.కొండూరు వెళ్లిపోదామని ప్రసంగి ఒత్తిడి తేవడంతో ఆగ్రహించిన శాంతకుమార్ మంగళవారం మధ్యాహ్నం తన ఇంటి వద్దే ప్రియుడి తలపై రోకలి బండతో రెండు సార్లు మోదింది. తీవ్రంగా గాయపడిన ప్రసంగి అక్కడే ప్రాణాలు విడిచాడు. ఈ ఘటన తర్వాత శాంతకుమార్ రెడ్డిగూడెం పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయింది. -
ఒకరితో సహజీవనం.. మరొకరితో పెళ్లికి యత్నం
మదనపల్లె (చిత్తూరు) : ఓ యువతితో సహజీవనం చేస్తూ మరో యవతితో పెళ్లికి సిద్ధమైన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన చిత్తూరు జిల్లా మదనపల్లె మండలంలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మండల కేంద్రానికి చెందిన ఓ యవతితో అదే ప్రాంతానికి చెందిన వెంకటేశ్ నాయక్ సహజీవనం చేస్తున్నాడు. అయితే ఆమెకు తెలియకుండా మరో యవతితో పెళ్లికి సిద్ధమయ్యాడు. విషయం తెలుసుకున్న బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి పరారీలో ఉన్న నిందితుడికి కోసం గాలింపు చేపట్టారు.