Motorcycles
-
ఓలా ఈ–బైక్ 501 కిలోమీటర్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఓలా ఎలక్ట్రిక్ తాజాగా రోడ్స్టర్ ఎక్స్ సిరీస్తో మోటార్సైకిల్స్ విభాగంలోకి ప్రవేశించింది. రోడ్స్టర్ ఎక్స్, రోడ్స్టర్ ఎక్స్ ప్లస్ మోడళ్లను ఆవిష్కరించింది. ధర రూ.74,999 నుంచి ప్రారంభమై రూ.1,54,999 వరకు ఉంది. వాహనం పరుగెడుతున్నప్పుడు కూడా చార్జింగ్ అవుతుంది. ఐపీ67 రేటెడ్ బ్యాటరీ, స్మార్ట్ కనెక్టివిటీతో 4.3 అంగుళాల ఎల్సీడీ, ఫ్రంట్ డిస్క్ బ్రేక్, రివర్స్ మోడ్ వంటి ఏర్పాటు ఉంది. గరిష్ట పవర్ 7–11 కిలోవాట్ ఉంది. నిర్వహణ వ్యయం రూ.500.. రోడ్స్టర్ ఎక్స్ సిరీస్లో వేరియంట్నుబట్టి 2.5–4.5 కిలోవాట్ అవర్ బ్యాటరీ పొందుపరిచారు. ఒకసారి చార్జింగ్తో 140–252 కిలోమీటర్లు పరిగెడుతుంది. గరిష్ట వేగం గంటకు 105–118 కిలోమీటర్లు. రోడ్స్టర్ ఎక్స్ ప్లస్ సిరీస్లో 4.5–9.1 కిలోవాట్ అవర్ బ్యాటరీ ఏర్పాటు చేశారు. ఒకసారి చార్జింగ్తో 252–501 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. గరిష్ట వేగం గంటకు 125 కిలోమీటర్లు. నెలవారీ నిర్వహణ వ్యయం పెట్రోల్ బైక్కు రూ.4,000 అయితే రోడ్స్టర్ ఎక్స్తో రూ.500 మాత్రమేనని ఓలా తెలిపింది. మార్చిలో డెలివరీలు ఉంటాయి. మరో రెండు మోడల్స్.. రోడ్స్టర్, రోడ్స్టర్ ప్రో మోడల్స్లో సైతం కంపెనీ పలు వేరియంట్లను రూపొందిస్తోంది. రోడ్స్టర్లో 3.5–6 కిలోవాట్ అవర్ బ్యాటరీ ఉంది. ఒకసారి చార్జింగ్తో 151–248 కి.మీ. ప్రయాణిస్తాయి. గరిష్ట వేగం గంటకు 116–126 కిలోమీటర్లు. ధర రూ.1,04,999 నుంచి రూ.1,39,999 వరకు ఉంది. అలాగే రోడ్స్టర్ ప్రో సిరీస్లో 8–16 కిలోవాట్ అవర్ బ్యాటరీ పొందుపరిచారు. ఒకసారి చార్జింగ్తో 316–579 కిలోమీటర్లు పరుగు తీస్తాయి. గరిష్ట వేగం గంటకు 154–194 కిలోమీటర్లు. ధర రూ.1,99,999 నుంచి రూ.2,49,999 వరకు ఉంది. డెలివరీలు 2026 జనవరి నుంచి మొదలవుతాయి. -
చౌకగా ప్రీమియం మోటార్ సైకిళ్లు
అమెరికాతో వాణిజ్య ఉద్రిక్తతలను తగ్గించే లక్ష్యంతో భారత ప్రభుత్వం దిగుమతి చేసుకునే మోటార్ సైకిళ్లపై బేసిక్ కస్టమ్స్ సుంకాలను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. కేంద్ర బడ్జెట్ 2025లో భాగంగా హార్లే డేవిడ్సన్, ట్రయంఫ్, సుజుకీ వంటి బ్రాండ్ల ప్రీమియం మోటార్ సైకిళ్లపై సుంకాలను 5-20 శాతం తగ్గిస్తున్నట్లు తెలిపారు.దిగుమతి సుంకాల తగ్గింపు అమెరికా నుంచి వస్తున్న వస్తువులపై డిమాండ్ స్థిరంగా కొనసాగించేదిగా ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశ టారిఫ్ విధానాలను, హార్లే డేవిడ్సన్ దిగుమతులకు సంబంధించి విమర్శించారు. భారత్ను ‘టారిఫ్ కింగ్’గా అభివర్ణించిన ట్రంప్.. అమెరికా వస్తువులపై సుంకాలు తగ్గించాలని పదేపదే పిలుపునిచ్చారు.కొత్త విధానం ప్రకారం 1600 సీసీ వరకు ఇంజిన్ సామర్థ్యం ఉన్న మోటార్ సైకిళ్లపై గతంలో ఉన్న 50 శాతం నుంచి 40 శాతానికి కస్టమ్స్ డ్యూటీని తగ్గించారు. 1600 సీసీ కంటే ఎక్కువ ఇంజిన్ సామర్థ్యం ఉన్న మోటార్ సైకిళ్లపై సుంకాన్ని 50 శాతం నుంచి 30 శాతానికి తగ్గించారు. దీంతోపాటు సెమీ నాక్ డౌన్ (ఎస్కేడీ-తయారీదారు ప్లాంట్లో పాక్షికంగా అసెంబుల్ చేసిన వాహనం(లైట్ మోటార్ సైకిళ్లు లేదా కార్లు)), పూర్తిగా నాక్ డౌన్ (సీకేడీ-తయారీదారు ప్లాంట్ వద్దే పూర్తిగా విడి భాగాలుగా చేయడం) యూనిట్లపై సుంకాలను కూడా తగ్గించారు.ఇదీ చదవండి: రూ.13 లక్షలు ఆదాయం ఉంటే ట్యాక్స్ ఇలా..ఈ చర్య భారతీయ వినియోగదారులకు ప్రీమియం మోటార్ సైకిళ్లను మరింత చౌకగా మారుస్తుందని, ఈ హై-ఎండ్ బ్రాండ్ల అమ్మకాలను పెంచుతుందని భావిస్తున్నారు. అమెరికా లేవనెత్తిన వాణిజ్య ఫిర్యాదులను పరిష్కరించడానికి, ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలను మెరుగుపరచడానికి భారతదేశం సుముఖంగా ఉందని ఈ నిర్ణయం సూచిస్తుంది. కస్టమ్స్ సుంకాల తగ్గింపు దేశీయ తయారీని ప్రోత్సహించడానికి, విదేశీ ఉత్పత్తులకు మార్కెట్ అవకాశాన్ని పెంచే విస్తృత వ్యూహంలో భాగం. -
అర్థం కాని.. అత్యద్భుతమైన మోటార్సైకిల్స్ (ఫోటోలు)
-
విదేశాల్లో మేడిన్ ఇండియా టూవీలర్ల జోరు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయంగా తయారైన ద్విచక్ర వాహనాల ఎగుమతులు ఈ ఏడాది ఏప్రిల్–జూలైలో 12.48 లక్షల యూనిట్లు నమోదయ్యాయి. అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 14 శాతం వృద్ధి నమోదు కావడం విశేషం. దేశీయంగా అమ్మకాలు తగ్గుతున్న నేపథ్యంలో తయారీ కంపెనీలకు కాస్త ఊరట కలిగించే విషయం. అలాగే టూవీలర్ల తయారీ విషయంలో భారత్ అనుసరిస్తున్న నాణ్యత, భద్రత ప్రమాణాలకు ఈ గణాంకాలు నిదర్శనం. 2024 జూలైతో ముగిసిన నాలుగు నెలల్లో మోటార్సైకిళ్లు 13 శాతం వృద్ధితో 10,40,226 యూనిట్లు వివిధ దేశాలకు సరఫరా అయ్యాయి. మొత్తం ఎగుమతుల్లో వీటి వాటా ఏకంగా 83 శాతానికి ఎగసింది. స్కూటర్ల ఎగుమతులు 21 శాతం అధికమై 2,06,006 యూనిట్లుగా ఉంది. టూవీలర్స్ ఎగుమతుల్లో బజాజ్ ఆటో, టీవీఎస్ మోటార్ కో, హోండా మోటార్సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా, ఇండియా యమహా మోటార్, హీరో మోటోకార్ప్, సుజుకీ మోటార్సైకిల్ ఇండియా టాప్లో కొనసాగుతున్నాయి. అగ్రస్థానంలో బజాజ్.. ద్విచక్ర వాహనాల ఎగుమతుల్లో బజాజ్ ఆటో అగ్రస్థానంలో నిలిచింది. ఈ కంపెనీ 5 శాతం వృద్ధితో ఏప్రిల్–జూలైలో 4,97,114 యూనిట్లు నమోదు చేసింది. ఇందులో 4,97,112 యూనిట్లు మోటార్సైకిళ్లు ఉండడం గమనార్హం. టీవీఎస్ మోటార్ కో 14 శాతం వృద్ధితో 3,13,453 యూనిట్లతో రెండవ స్థానంలో కొనసాగుతోంది. హోండా మోటార్స్ అండ్ స్కూటర్స్ 76 శాతం దూసుకెళ్లి 1,82,542 యూనిట్లు, ఇండియా యమహా మోటార్ 28 శాతం అధికమై 79,082 యూనిట్లు, హీరో మోటోకార్ప్ 33 శాతం ఎగసి 73,731 యూనిట్లను విదేశాలకు సరఫరా చేశాయి. సుజుకీ మోటార్సైకిల్ ఇండియా 30 శాతం క్షీణించి 64,103 యూనిట్లు, రాయల్ ఎన్ఫీల్డ్ 2 శాతం వృద్ధితో 28,278 యూనిట్లు, పియాజియో వెహికిల్స్ 56 శాతం దూసుకెళ్లి 9,673 యూనిట్ల ఎగుమతులను సాధించాయి. బైక్స్లో బజాజ్ ఆటో, టీవీఎస్ మోటార్ కో, హోండా, స్కూటర్స్లో హోండా, టీవీఎస్ మోటార్, ఇండియా యమహా మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి. -
ఓలా ఈ–బైక్స్ వచ్చేశాయ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీలో ఉన్న ఓలా ఎలక్ట్రిక్ మోటార్సైకిల్స్ విభాగంలోకి ప్రవేశించింది. రోడ్స్టర్, రోడ్స్టర్ ఎక్స్, రోడ్స్టర్ ప్రో వేరియంట్లను ప్రవేశపెట్టింది. 2.5–16 కిలోవాట్ అవర్ బ్యాటరీ సామర్థ్యంతో తయారయ్యాయి. ధర రూ.74,999 నుంచి మొదలై రూ.2,49,999 వరకు ఉంది. 2025 దీపావళి నుంచి డెలివరీలు ప్రారంభం అవుతాయి. ఒకసారి చార్జింగ్తో వేరియంట్నుబట్టి 200 నుంచి 579 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని కంపెనీ తెలిపింది. టాప్ స్పీడ్ గంటకు 124–194 కిలోమీటర్లు. కాగా, క్విక్ కామర్స్లోకి ఓలా ఎంట్రీ ఇచ్చింది. ఇందుకోసం ఓలా క్యాబ్స్ కాస్తా ఓలా కన్జూమర్ అయింది. అలాగే ఓలా పే పేరుతో యూపీఐ సేవలను సైతం కంపెనీ ఆవిష్కరించింది. అనుబంధ కంపెనీ కృత్రిమ్ ఏఐ 2026 నాటికి ఏఐ చిప్ను ప్రవేశపెట్టనుంది. -
భారత్లోకి బీఎస్ఏ ఎంట్రీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మహీంద్రా గ్రూప్నకు చెందిన మోటార్సైకిల్స్ బ్రాండ్ బీఎస్ఏ భారత్లో అడుగుపెట్టింది. గోల్డ్స్టార్ 650 మోడల్తో ఎంట్రీ ఇచి్చంది. ధర ఎక్స్షోరూంలో రూ.2.99 లక్షల నుంచి రూ.3.34 లక్షల వరకు ఉంది. 45.6 పీఎస్ పవర్, 55 ఎన్ఎం టార్క్తో 652 సీసీ లిక్విడ్ కూల్డ్ ఇంజన్, 5 స్పీడ్ ట్రాన్స్మిషన్తో తయారైంది. 12 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్, బ్రెంబో బ్రేక్స్, డ్యూయల్ చానెల్ ఏబీఎస్, 12వీ సాకెట్, యూఎస్బీ చార్జింగ్ పోర్ట్ వంటి హంగులు ఉన్నాయి. డెలివరీలు ప్రారంభం అయ్యాయి. పాతతరం ద్విచక్ర వాహన తయారీ దిగ్గజాల్లో బీఎస్ఏ ఒకటి. మహీంద్రా గ్రూప్ కంపెనీ క్లాసిక్ లెజెండ్స్ 2016లో బీఎస్ఏను కైవసం చేసుకుంది. యూకే సంస్థ బమింగమ్ స్మాల్ ఆమ్స్ కంపెనీ (బీఎస్ఏ) 1861లో ప్రారంభం అయింది. తొలి బైక్ను 1910లో విడుదల చేసింది. -
వాహనాల ధర ఎందుకు పెరుగుతుందో తెలుసా..?
పుణే, బిజినెస్ బ్యూరో: కాలుష్యాన్ని కట్టడి చేసే పేరిట అతి నియంత్రణలు, అధిక స్థాయి జీఎస్టీలను అమలు చేయడం వల్లే వాహనాల రేట్లకు రెక్కలు వచ్చాయని బజాజ్ ఆటో ఎండీ రాజీవ్ బజాజ్ వ్యాఖ్యానించారు. బ్రెజిల్ వంటి దేశాల్లో మోటార్సైకిళ్లపై పన్నులు 8–14 శాతం శ్రేణిలో ఉండగా దేశీయంగా మాత్రం అత్యధికంగా 28 శాతం జీఎస్టీ ఉంటోందని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో వాహనాల ధరలను తగ్గించే పరిస్థితి ఉండటం లేదని, దీంతో నిర్వహణ వ్యయాలైనా తగ్గే విధంగా వాహనాలను రూపొందించడం ద్వారా కొనుగోలుదారులకు కొంతైనా ఊరటనిచ్చే ప్రయత్నం జరుగుతోందని బజాజ్ చెప్పారు. 125 సీసీ పైగా సామర్ధ్యం ఉండే స్పోర్ట్స్ మోటార్సైకిళ్ల విభాగంలో తమకు ముప్ఫై రెండు శాతం మేర వాటా ఉందని, దీన్ని మరింతగా పెంచుకునే దిశగా డబుల్ ఇంజిన్ సర్కార్ నినాదం తరహాలో డబుల్ ఇంజిన్ కారోబార్ (కార్యకలాపాలు) వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లు రాజీవ్ చెప్పారు.బజాజ్ పల్సర్ 400 ధర రూ. 1,85,000బజాజ్ ఆటో తాజాగా పల్సర్ ఎన్ఎస్ 400జీ మోటార్సైకిల్ను ఆవిష్కరించింది. ప్రారంభ ఆఫర్ కింద దీని ధర రూ. 1,85,000గా (ఢిల్లీ ఎక్స్షోరూం) ఉంటుంది. డెలివరీలు జూన్ మొదటివారం నుంచి ప్రారంభమవుతాయని సంస్థ ఎండీ రాజీవ్ బజాజ్ తెలిపారు. స్పోర్ట్స్ సెగ్మెంట్లో తమ స్థానాన్ని మరింత పటిష్టం చేసుకునేందుకు ఇది తోడ్పడగలదని ఆయన పేర్కొన్నారు. ఇప్పటివరకు పల్సర్ బైకులు 1.80 కోట్ల పైచిలుకు అమ్ముడైనట్లు బజాజ్ వివరించారు. పరిమిత కాలం పాటు వర్తించే ఆఫర్ కింద కొత్త పల్సర్ను రూ. 5,000కే బుక్ చేసుకోవచ్చు. నాలుగు రంగుల్లో ఇది లభిస్తుంది. శక్తివంతమైన 373 సీసీ ఇంజిన్, 6 స్పీడ్ గేర్ బాక్స్, ఎల్రక్టానిక్ థ్రోటిల్ తదితర ప్రత్యేకతలు ఇందులో ఉంటాయి. సీఎన్జీ మోటార్సైకిల్ను జూన్ 18న ఆవిష్కరించనున్నామని రాజీవ్ చెప్పారు. ఇది ప్రపంచంలోనే తొలి సీఎన్జీ బైక్ అన్నారు. -
సీఎన్జీ బైక్పై బజాజ్ ఆటో కసరత్తు
పుణే: పర్యావరణ అనుకూల సీఎన్జీ ఇంధనంతో నడిచే మోటార్సైకిళ్ల తయారీపై ద్విచక్ర వాహనాల దిగ్గజం బజాజ్ ఆటో కసరత్తు చేస్తోంది. జూన్ కల్లా ఈ బైకు మార్కెట్లోకి రాగలదని కంపెనీ ఎండీ రాజీవ్ బజాజ్ తెలిపారు. మైలేజీని కోరుకునే కస్టమర్ల కోసం రూపొందిస్తున్న ఈ వాహనాన్ని వేరే బ్రాండ్ కింద ప్రవేశపెట్టనున్నట్లు వివరించారు. వచ్చే అయిదేళ్లలో కార్పొరేట్ సామాజిక బాధ్యతా కార్యక్రమాలపై (సీఎస్ఆర్) రూ. 5,000 కోట్లు వెచి్చంచనున్నట్లు ప్రకటించిన సందర్భంగా ఆయన ఈ విషయం వెల్లడించారు. పెట్రోల్తో నడిచే మోటర్సైకిళ్లతో పోలిస్తే దీని ధర కొంత అధికంగా ఉండవచ్చని అంచనా. కస్టమర్ల సౌకర్యార్ధం పెట్రోల్, సీఎన్జీ ఇంధనాల ఆప్షన్లు ఉండేలా ట్యాంకును ప్రత్యేకంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉండటం వల్ల తయారీ కోసం మరింత ఎక్కువగా వెచి్చంచాల్సి రానుండటమే ఇందుకు కారణం. గ్రూప్నకు చెందిన అన్ని సీఎస్ఆర్, సేవా కార్యక్రమాలను ’బజాజ్ బియాండ్’ పేరిట సంస్థ నిర్వహించనుంది. దీని కింద ప్రధానంగా నైపుణ్యాల్లో శిక్షణ కలి్పంచడంపై దృష్టి పెట్టనుంది. -
ఈవీ రంగంలోకి హీరో మోటోకార్ప్, వందల కోట్ల పెట్టుబడులు
ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం హీరో మోటోకార్ప్ ఎలక్ట్రిక్ వెహికల్స్పై దృష్టి సారించింది. కొనుగోలు దారులకు అభిరుచికి అనుగుణంగా ఈవీ వెహికల్స్ను తయారు చేయనుంది. ఇందుకోసం అమెరికాకు చెందిన జీరో మోటార్ సైకిల్స్తో జత కలిసింది. ఆ సంస్థలో రూ.490కోట్లు పెట్టుబడులు పెడుతున్నట్లు హీరో మోటోకార్ప్ తెలిపింది. తద్వారా హీరో మోటోకార్ప్, జీరో మోటార్లు సంయుక్తంగా ఈవీ వెహికల్స్ను విడుదల చేయనున్నాయి. ప్రపంచంలోనే లార్జెస్ట్ టూవీలర్ తయారీ సంస్థగా పేరొందిన జీరో మోటార్స్ వెహిలక్స్, పవర్ ట్రైన్లను తయారు చేస్తుంది. తొలి బైక్ విడుదల మరోవైపు హీరో మోటోకార్ప్ మొబిలిటీ బ్రాండ్ విడా భాగస్వామ్యంతో అక్టోబర్ 7 తొలి ఎలక్ట్రిక్ బైక్ను విడుదల చేయనుంది. ఎలక్ట్రిక్ టూ వీలర్ కంపెనీ ఏథర్ ఎనర్జీలో 35 శాతానికి పైగా వాటా ఉన్న హీరో మోటాకార్ప్.. తాజాగా జీరో మోటార్స్లో పెట్టుబడులు పెడుతున్నట్లు ప్రకటించింది. ఆ ప్రకటనతో ఇన్వెస్టర్లు అప్రమత్తమయ్యారు. దీంతో గురువారం బీఎస్ఈలో కంపెనీ షేర్లు 2.11 శాతం తగ్గి రూ.2,534.20 వద్ద ముగిశాయి. -
మోటో వ్లాగర్లకు శుభవార్త..ఐఓసీ అదిరిపోయే బిజినెస్ ఐడియా!
న్యూఢిల్లీ: ఇంధన రిటైలింగ్లో పోటీ తీవ్రమవుతుండటంతో ప్రభుత్వ రంగ దిగ్గజం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) కొత్త అవకాశాలను అన్వేషిస్తోంది. ఇందులో భాగంగా హిమాలయాలకు బైక్లపై సాహసయాత్రలు చేసే పర్యాటకులను ఆకర్షించేందుకు ప్రత్యేకంగా బైకర్స్ కేఫ్లను ఏర్పాటు చేస్తోంది. సిమ్లాలో తొలి కేఫ్ను ప్రారంభించామని, త్వరలో చండీగఢ్–మనాలీ రూట్లో కూడా వీటిని ఏర్పాటు చేస్తామని కంపెనీ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. సిమ్లా శివార్లలోని షోగి దగ్గర్లో ఒక పెట్రోల్ బంకులో ఖాళీ స్థలం ఉండటంతో దాన్ని బైకర్స్ కేఫ్గా మార్చినట్లు పేర్కొన్నారు. ఇందులో వైఫైతో పాటు బైకర్లు విశ్రాంతి తీసుకునేందుకు, మోటర్సైకిళ్లను పార్కింగ్ చేసుకునేందుకు, చిన్నపాటి రిపేర్లు మొదలైన వాటికోసం ప్రత్యేక సదుపాయాలు కల్పించినట్లు చెప్పారు. అలాగే, లిప్ గార్డ్, సన్స్క్రీన్ లోషన్, గ్లవ్స్, రెయిన్ కోట్లు, టార్పాలిన్ మొదలైన వాటిని కూడా విక్రయిస్తున్నట్లు అధికారి పేర్కొన్నారు. సాధారణంగా బైకర్ల యాత్రలు ఢిల్లీ నుంచి లడఖ్ వరకూ వివిధ మార్గాల్లో ఏటా జూన్ తొలి వారంలో మొదలై అక్టోబర్ ప్రథమార్ధం వరకూ కొనసాగుతుంటాయి. -
బైక్పై చిన్నారులతో వెళ్తున్నారా? అయితే, జాగ్రత్త!
న్యూఢిల్లీ: నాలుగేళ్లలోపు చిన్నారులు ప్రయాణించే మోటార్ బైక్ వేగం గంటకు 40 కిలోమీటర్లకు మించరాదని కేంద్రం ప్రతిపాదించింది. దీంతో పాటు, 9 నెలల నుంచి 4 ఏళ్లలోపు చిన్నారులైతే తప్పని సరిగా హెల్మెట్ ఉండేలా వాహనదారు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది. దీంతోపాటు, వాహన చోదకుడు ఆ చిన్నారిని సేఫ్టీ పట్టీతో తన వీపునకు తగిలించుకోవాలని పేర్కొంది. దీనివల్ల, చిన్నారి మెడ, తలభాగాలకు పూర్తి రక్షణ కల్పించినట్లు అవుతుందని వివరించింది. దృఢమైన, తేలికపాటి, నీటిలో తడవని, అవసరానికి అనుగుణంగా సరి చేసుకోదగ్గ, కనీసం 30 కిలోల బరువును మోయగలిగే నైలాన్తో ఆ పట్టీ తయారయినదై ఉండాలని తెలిపింది. ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే చిన్నారుల భద్రతే లక్ష్యంగా ఈ ప్రతిపాదనలను రూపొందించినట్లు కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖ తెలిపింది. అభ్యంతరాలు, సూచనలు తెలియజేయాల్సిందిగా ప్రజలను కోరింది. (చదవండి: రెండు రోజులు తర్వాత పుట్టింటికి .. బావిలో శవాలుగా తేలిన తల్లీ, కూతురు) -
బ్యాటరీతో నడవనున్న హీరో స్ప్లెండర్ బైక్
భారతదేశంలో ఎక్కువగా అమ్ముడుపోయే ద్విచక్ర వాహనం ఏదైనా ఉంది అంటే అది హీరో స్ప్లెండర్ అని చెప్పుకోవాలి. ఈ బైక్ ధర, నిర్వహణ ఖర్చు చాలా తక్కువగా ఉంటుంది. అందుకే సామాన్య ప్రజలు ఎక్కువగా కొనడానికి ఇష్ట పడతారు. అయితే, గత కొన్ని నెలల నుంచి పెట్రోల్ ధర భారీగా పెరగడంతో సామాన్యుడు ద్విచక్ర వాహనాన్ని బయటకు తీయాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సి వస్తుంది. అయితే, ఇలాంటి భాదలు తరిమికొట్టడానికి హీరో స్ప్లెండర్ బైక్ కోసం ఈవీ కన్వర్షన్ కిట్ ను మార్కెట్లోకి విడుదల చేశారు. (చదవండి: Tesla: భారత్లో ఆన్లైన్ ద్వారా కార్ల అమ్మకం!) తమకు ఇష్టమైన బైక్ లో ఈ ఎలక్ట్రిక్ కిట్ ఇన్ స్టాల్ చేయడం ద్వారా డబ్బును ఆదా చేసుకోవచ్చు. ఈ ఎలక్ట్రిక్ కిట్ ను ఆర్ టీఓ కూడా ఆమోదించింది. మహారాష్ట్రలోని థానే కేంద్రంగా పనిచేస్తున్న ఈవీ స్టార్టప్ కంపెనీ గోగోఏ1 ఇటీవల దీనిని లాంఛ్ చేసింది, దీని ధర రూ.35,000. అయితే, అసలు మొత్తంతో పాటు రూ.6,300 జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. అలాగే, బ్యాటరీ ఖర్చును విడిగా చెల్లించాల్సి ఉంటుంది. మొత్తం మీద ఈవీ కన్వర్షన్ కిట్, బ్యాటరీ ధర రూ.95,000. హీరో స్ప్లెండర్ బైక్ తో పాటు దీనిని కొనడానికి అదనంగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. కంపెనీ తన కిట్ పై 3 సంవత్సరాల వారెంటీని కూడా అందిస్తోంది. రష్లేన్ ప్రకారం, గోగోఎ1 సింగిల్ ఛార్జ్ పై 151 కిలోమీటర్ల వరకు వెళ్లగలదు. ప్రస్తుతం, భారతదేశంలోని ప్రముఖ కంపెనీలు ఇటువంటి ఎలక్ట్రిక్ బైక్ లను ఇంకా లాంఛ్ చేయలేదు. అయితే, పెట్రోల్ వేరియెంట్లు భారీగా అమ్ముడు అవుతున్నాయి. ఇటువంటి పరిస్థితిలో గోగోఎ1 సంస్థ ప్రజల ముందు మంచి ఆప్షన్ ఉంచింది. కాకపోతే ఇది చాలా ఖరీదైనది అని ప్రజలు భావిస్తున్నారు. రాబోయే కాలంలో హీరో, బజాజ్, హోండా, యమహా సహా పలు ద్విచక్ర వాహనాల కంపెనీలు ఎలక్ట్రిక్ బైక్ లను విడుదల చేయనున్నాయి. -
ఇండియన్ మోటార్సైకిల్ ‘చీఫ్’
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ద్విచక్ర వాహన తయారీలో ఉన్న ఇండియన్ మోటార్సైకిల్ సరికొత్త చీఫ్ శ్రేణి మోటార్సైకిల్స్ను భారత్లో ప్రవేశపెట్టింది. ఎక్స్షోరూంలో ధర రూ.20.75 లక్షల నుంచి ప్రారంభం. 2022 చీఫ్ శ్రేణిలో చీఫ్ డార్క్ హార్స్, ఇండియన్ చీఫ్ బాబర్ డార్క్ హార్స్, ఇండియన్ సూపర్ చీఫ్ లిమిటెడ్ మోడల్స్ ఉన్నాయి. 1,890 సీసీ ఎయిర్ కూల్డ్ ఇంజన్ పొందుపరిచారు. 15.1 లీటర్ ఫ్యూయల్ ట్యాంక్, ప్రీలోడ్ అడ్జెస్టేబుల్ రేర్ షాక్స్, డ్యూయల్ ఎగ్జాస్ట్, ఎల్ఈడీ లైటింగ్, కీలెస్ ఇగ్నిషన్, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్, సర్క్యులర్ టచ్ స్క్రీన్ రైడ్ కమాండ్ సిస్టమ్ వంటి హంగులు ఉన్నాయి. చదవండి : ఎలక్ట్రిక్ బైక్ ఐడియా..భలే ఉంది కదూ! -
ఒక్క రోజులో లక్ష స్కూటర్ల విక్రయం
న్యూఢిల్లీ: ద్విచక్ర వాహన పరిశ్రమలో మార్కెట్ లీడర్ హీరో మోటోకార్ప్ గత వారం 10వ వార్షికోత్సవం సందర్భంగా ఒక్క రోజు లక్ష యూనిట్లకు పైగా రిటైల్ చేసినట్లు తెలిపింది. ఆగస్టు 9నతో మా ప్రయాణం పదేళ్లు పూర్తి చేసుకుందని.. హీరో మోటోకార్ప్లో ఇదొక మైలురాయి అని కంపెనీ సేల్స్ హెడ్ నవీన్ చౌహాన్ తెలిపారు. దేశీయ, గ్లోబల్ మార్కెట్లలో పండుగలు లేని సమయంలో కూడా కస్టమర్లు ఈ స్థాయిలో ఒకే రోజు రికార్డ్ స్థాయిలో కొనుగోళ్లు జరపడం ఇదే ప్రథమమని చెప్పారు. కొత్తగా విడుదల చేసిన మాస్ట్రో ఎడ్జ్ 125, డెస్టినీ, ప్లెజర్ 110 స్కూటర్లకు అధిక డిమాండ్తో పాటు ఇతర బైక్స్లు రోజు వారీ సగటు కంటే రెట్టింపు అమ్మకాలు జరిపాయని తెలిపారు. చదవండి : సాఫ్ట్వేర్ సంస్థ (24)7.ఏఐ భారీ నియామకాలు -
ఎలక్ట్రిక్ బైక్ ఐడియా.. భలే ఉంది కదూ!
ఒంటెద్దు బళ్లు చూశాం గాని, ఒంటిచక్రం బండేమిటి? ఇదేదో సర్కస్ వ్యవహారం కాబోలనుకుంటున్నారా? ఇక్కడ ఫొటోలో కనిపిస్తున్న వాహనం అచ్చంగా ఒంటిచక్రం బండి. ఇది మోనోవీల్ ఎలక్ట్రిక్ బైక్. హోండా కంపెనీకి చెందిన డిజైనర్ నాషో ఆల్ఫోన్సో గార్షియా దీనికి రూపకల్పన చేశాడు. ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే నగరాల్లో ఇరుకిరుకు సందుల్లో కూడా తేలికగా ప్రయాణాలు సాగించడానికి ఈ వాహనం భేషుగ్గా ఉపయోగపడుతుందని గార్షియా చెబుతున్నాడు. దీనిని నడపడం పెద్దకష్టమేమీ కాదు. ఇందులో కాళ్లు మోపడానికి ఉండేచోటులో నిలుచుని, స్టార్ట్ చేస్తే చాలు. పడిపోతుందేమోననే భయం అక్కర్లేదు. ఇది పూర్తిగా సెల్ఫ్బ్యాలెన్సింగ్ వాహనం. హోండా సంస్థ ప్రస్తుతానికి దీనిని నమూనాగా మాత్రమే తయారు చేసింది. దీనిపై మరిన్ని పరీక్షలు విజయవంతమైతే, పూర్తిస్థాయి ఉత్పాదన ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. -
దేశీ ప్రీమియం బైక్స్ మార్కెట్పై బెనెల్లీ దృష్టి
ముంబై: ఇటాలియన్ సూపర్బైకుల తయారీ సంస్థ బెనెల్లీ భారత ప్రీమియం మోటార్ సైకిళ్ల మార్కెట్పై దృష్టి సారించింది. ఈ ఏడాది చివరిలోగా 250 – 500సీసీ సిగ్మెంట్లో మూడు బైకుల విడుదల లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా బెనెల్లీ 502సీ పవర్ క్రూజర్ బైకుల ప్రీ–బుకింగ్స్లను ఇటీవలే ప్రారంభించింది. ఈ నెలలో డెలవరీలను చేయనుంది. అలాగే దేశవ్యాప్తంగా డీలర్షిప్ నెట్వర్క్ను బలోపేతం చేసుకోవాలని భావిస్తోంది. ప్రీమియం టూ–వీలర్ సిగ్మెంట్లో 250–500 సీసీ శ్రేణి బైకుల అధిక డిమాండ్ ఉన్నందున ఈ విభాగపు మార్కెట్పై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు బెనెల్లీ భారత విభాగపు ఎండీ జబాక్ తెలిపారు. ఈ కంపెనీకి చెందిన భారత పోర్ట్ఫోలియోలో 500 సీసీ విభాగానికి చెందిన టీఆర్కే 502, టీఆర్కే 502 ఎక్స్తో పాటు లియోన్సినో, 374 సీసీ ఇంపీరియల్ అనే మూడు మోడళ్లు ఉన్నాయి. తెలంగాణకు చెందిన మహవీర్ గ్రూప్కు అనుబంధ ఆదిశ్వర్ ఆటో రైడ్ సంయుక్త భాగస్వామ్యంలో 2018లో ఒక తయారీ యూనిట్ను హైదరాబాద్లో ప్రారంభించి తిరిగి భారత మార్కెట్లోకి ప్రవేశించింది. -
1971 వార్ విజయానికి గుర్తుగా జావా స్పెషల్ ఎడిషన్ బైక్స్
ప్రముఖ వాహన తయారీ కంపెనీ జావా మోటార్ సైకిల్స్ 1971లో పాకిస్తాన్ తో జరిగిన యుద్దంలో భారత్ సాధించిన విజయానికి గుర్తుగా జావా బ్రాండ్లో ఖాకీ, మిడ్నైట్ గ్రే రంగులను పరిచయం చేసింది. భారత్లో సైనిక చిహ్నంతో మోటార్ సైకిల్స్ అందుబాటులోకి రావడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి అని కంపెనీ తెలిపింది. "50 సంవత్సరాల క్రితం భారత సాయుధ దళాలు దురాక్రమణకు అడ్డుగా నిలిచాయి. చరిత్రలో జరిగిన అతి తక్కువ గొప్ప యుద్ధాలలో అద్భుతమైన విజయాన్ని సాధించాయి. 1971 వార్ విక్టరీ 50 సంవత్సరాలను పురస్కరించుకొని #SwarnimVijayVarsh జరుపుకోవడం మాకు గర్వంగా ఉంది" అని జావా మోటార్ సైకిల్స్ ట్విట్టర్ లో తెలిపింది. మాతృ భూమిని రక్షించడానికి సైనికులు చూపిన ధైర్యం, త్యాగాలను ఈ బైక్ పై ఉన్న భారత సైనిక చిహ్నం గుర్తు చేస్తుందని వివరించింది. మహీంద్రా అండ్ మహీంద్రా ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా జావా బృందాన్ని అభినందించారు ఈ స్పెషల్ ఎడిషన్ బైక్ ధర హైదరాబాద్ ఎక్స్షోరూంలో రూ.1.96 లక్షలుగా ఉంది. కస్టమర్లు కంపెనీ వెబ్ సైట్ ద్వారా స్పెషల్ ఎడిషన్ మోటార్ సైకిల్ ని ఆన్ లైన్ లో బుక్ చేసుకోవచ్చు. -
బైక్ ధరలను పెంచేసిన హీరో మోటో
సాక్షి,ముంబై: దేశీయ అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ బైక్ లవర్స్కి షాకిచ్చింది. వచ్చే నెలనుంచి తన మోటార్ సైకిళ్ల ధరలను పెంచుతున్నట్టు ప్రకటించింది. పెరుగుతున్న ఇన్పుట్ ఖర్చులరీత్యా తమ అన్ని మోడళ్ల బైక్లు, స్కూటర్ల ధరలను పెంచాల్సి వస్తోందని ప్రకటించింది. సవరించిన ధరలు అన్ని షోరూంలలో 2021 ఏప్రిల్ 1 నుండి అమల్లోకి వస్తాయని ఎక్స్ఛేంజీలకిచ్చిన సమాచారంలో సంస్థ వెల్లడించింది. (మారుతి కార్ల ధరలకు రెక్కలు) వినియోగదారుల మీద తక్కువ భారం పడేలా, తమ ఖర్చులను తగ్గించుకునే కార్యక్రమాన్ని వేగవంతం చేసినట్టు హీర మోటో తెలిపింది. అయితే ధరల పెరుగుదల పరిమాణంపై కంపెనీ నిర్దిష్ట వివరాలు ఇవ్వలేదు. కానీ, ఈ పెరుగుదల రూ .2500 వరకు ఉంటుందని, మోడల్, నిర్దిష్ట మార్కెట్ ఆధారంగా ఉంటుందని హీరో తెలిపింది. కాగా అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇన్పుట్ ఖర్చుల భారం నేపథ్యంలో అన్నిమోడళ్ల కార్ల ధరలను పెంచుతున్నట్టు మంగళవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. -
సరికొత్తగా టీవీఎస్ అపాచీ బైక్ : ధర?
సాక్షి, ముంబై: టీవీఎస్ మోటార్ కొత్త అపాచీ బైక్ను మార్కెట్లో విడుదల చేసింది. 2021 టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 4వీ మోటార్సైకిల్ను బుధవారం విడుదల చేసినట్లు రెగ్యులేటరీ ఫైలింగ్లో కంపెనీ తెలిపింది. ఈ కొత్త బైక్ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉండనుంది. డిస్క్ వేరియంట్ ధర రూ.1,10,320,డ్రమ్ వేరియంట్ ధర రూ.1,07,270 (ఎక్స్షోరూం, న్యూఢిల్లీ ధరలు) గా కంపెనీ నిర్ణయించింది. రేసింగ్ రెడ్, నైట్ బ్లాక్, మెటాలిక్ బ్లూ మొత్తం మూడు రంగుల్లో అందుబాటులో ఉండనున్నట్లు కంపెనీ వెల్లడించింది. టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 4వీ కొత్త బూక్లో 159.7 సీసీ సింగిల్ సిలిండర్, 4 వాల్వ్, ఆయిల్ కూల్డ్ అధునాతన ఇంజీన్ అమర్చినట్టు తెలిపింది. ఇది 9,250 ఆర్పీఎం వద్ద 17.38 హెచ్పీ శక్తిని, 7,250 ఆర్పీఎం వద్ద 14.73 ఎన్ఎం టార్క్ని ప్రొడ్యూస్ చేస్తుంది. కిల్ కార్బన్ ఫైబర్ నమూనాతో సరికొత్త డ్యూయల్ టోన్ సీటు,ఎ ల్ఈడీ హెడ్ల్యాంప్, క్లా స్టైల్డ్ పొజిషన్ ల్యాంప్లు ఇతర కీలక ఫీచర్లతో ప్రీమియం లుక్తో ఆకట్టుకోనుంది. ఫైవ్ స్పీడ్ సూపర్-స్లిక్ గేర్బాక్స్ కలిగిన ఈ బైక్ ఈ సెగ్మెంట్లో అత్యంత శక్తిమంతమైన రైడింగ్ అనుభూతినిస్తుందని టీవీఎస్ మోటార్ కంపెనీ హెడ్ (మార్కెటింగ్) ప్రీమియం మోటార్ సైకిల్స్ మేఘశ్యామ్ దిఘోలే వెల్లడించారు. అలాగే పాత అపాచీల వెర్షన్లతో పోలిస్తే ఈ కొత్త బైక్ రెండు కిలోల బరువు తక్కువ ఉంటుంది. డిస్క్ వేరియంట్ 147 కిలోల బరువు, డ్రమ్ వేరియంట్ 145 కిలోల బరువు ఉంటుంది. -
అక్కడ టూ వీలర్స్పై పూర్తి నిషేధం
వియన్నా : ఆస్ట్రియా రాజధాని వియన్నా సిటీ సెంటర్లో అన్ని రకాల మోటారు సైకిళ్లను నిషేధించాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. వియన్నాను మోటార్ సైకిల్ ఫ్రీ సెంటర్గా మార్చాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసకున్నారు. ఆస్ట్రియాలోనే అత్యధిక జనాభా కలిగిన వియన్నా ప్రాంతం యూరోప్ ఖండంలోనే అద్భుతమైన రహదార్లను కలిగి ఉండి టూ వీలర్ ప్రయాణాలకు అనువుగా ఉంటుంది. కాగా ఆస్ట్రియాలోని టైరోల్ రాష్ట్రంలో కొద్దికాలం కిందట పర్యావరణం కాపాడడంపై మోటారు సైకిళ్లపై నిషేధం విధించారు. తాజాగా వియన్నాలో కూడా దీనిని అమలు చేయనున్నారు. అయితే టైరోల్ ప్రాంతంలో ఉన్న నిషేధానికి భిన్నంగా ఇక్కడ అమలు చేయనున్నారు. అందుకు వియన్నాలో ప్రఖ్యాత మోటారు సైకిల్ బ్రాండ్ కెటిఎమ్ తన మద్దతు తెలిపింది. ('తండ్రిగా వాడి కోరికను తీర్చా') అన్ని రకాల టూ వీలర్స్ అంటే పర్యావరణానికి అనువుగా ఉండే బ్యాటరీ, ఎలక్ట్రికల్ చార్జింగ్తో నడిచే అన్ని రకాల వాహనాలను పూర్తిగా నిషేధం విధించనున్నారు.ఇప్పటికే వియాన్నా ప్రాంతంలో అత్యధికులు ద్విచక్ర వాహనాల నుంచి ఎలక్ట్రికల్ వాహనాలకు మారారు. అంతేగాక ఎలక్ట్రిక్ ప్యాసింజర్ కార్లను కూడా అక్కడి పౌరులు విస్తృతంగా అంగీకరించారు. అయితే మోటారు వాహనాలను పూర్తిగా నిషేధించాలని చేపట్టిన చర్యలపై వాహనదారులు ఆలక్ష్యం వహించడంతో స్థానిక అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో వియన్నా సిటీ సెంటర్లో బైక్ పార్కింగ్లో ఉన్న వాహనాలపై కూడా ఈ నిషేధం వర్తించనుంది. అయితే సిటీ సెంటర్ వెలుపల ఉన్న రింగ్రోడ్డుపై మాత్రం అన్ని రకాల ప్రైవేట్ కార్లు, వాన్లు, మోటార్ సైకిళ్లు ఆ మార్గాన్ని ఉపయోగించుకోవడానికి అనుమతులు ఇచ్చింది. వియన్నా సిటీ సెంటర్లో నివసించే వ్యక్తులు, ప్రైవేట్ గ్యారేజీలో పనిచేసే వాళ్లకు మాత్రం ఫ్రీ రోడ్లో తిరిగే అవకాశంతో పాటు వాహన పార్కింగ్కు అనుమతులిచ్చారు. -
బీఎండబ్ల్యూ సూపర్ బైక్స్ లాంచ్
సాక్షి, న్యూఢిల్లీ: జర్మనీ లగ్జరీ మోటార్సైకిల్ తయారీ సంస్థ బీఎండబ్ల్యూ మోట్రాడ్ ఇండియా కొత్త ఎఫ్ 900 ఆర్, ఎఫ్ 900 ఎక్స్ఆర్ బైక్లను దేశంలో విడుదల చేసింది. ఎఫ్900 ఆర్ను సింగిల్ స్టాండర్డ్ వేరియంట్లో లాంచ్ చేయగా , ఎక్స్ ఆర్ మోడల్ను స్టాండర్డ్, ప్రో వేరియంట్లలో అందుబాటులో వుంటాయి. ఈ రెండు బైక్లను జర్మనీలోని కంపెనీ ఫ్యాక్టరీల నుండి దిగుమతి చేస్తోంది. ఎఫ్ 900 ఆర్ ధర రూ .9.90 లక్షలు కాగా, ఎఫ్ 900 ఎక్స్ఆర్ స్టాండర్డ్ ధర, రూ .10.50 లక్షలు. ప్రో వేరియంట్ (ఎక్స్షోరూమ్, న్యూఢిల్లీ) ధర రూ.11. 50 లక్షలుగా నిర్ణయించింది. (ఒప్పో ఫైండ్ ఎక్స్ 2 నియో లాంచ్.. ధర ఎంతంటే?) ఈ రెండు బైక్లను 'రెయిన్' 'రోడ్' రైడింగ్ మోడ్లతో లాంచ్ చేసింది. అంతేకాదు ఈ రెండు బైక్లలో తొలిసారిగా ప్లాస్టిక్-వెల్డెడ్ ఇంధన ట్యాంకులను అమర్చింది. ఇదే ఆసక్తికరమైన హైలైట్. ప్రపంచంలోనే అత్యుత్తమ ప్రీమియం మోటార్సైకిళ్లను భారతదేశానికి తీసుకువచ్చామనీ, మిడ్ రేంజ్ విభాగంలో ఆకర్షణీయమైన విలువతోయూజర్లను ఆకట్టుకుంటాయని బీఎండబ్ల్యూ గ్రూప్ ఇండియా యాక్టింగ్ ప్రెసిడెంట్ అర్లిండో టీక్సీరా అన్నారు ఎఫ్ 900 ఆర్ లో 13-లీటర్ ఇంధన ట్యాంక్ను, ఎఫ్ 900 ఎక్స్ ఆర్15.5 లీటర్ ట్యాంకును ఇచ్చింది. వీటిల్లో బీఎండబ్ల్యూ మోట్రాడ్ కనెక్టివిటీతో 6.5 అంగుళాల కలర్ టిఎఫ్టి స్క్రీన్ను అమర్చింది. ఇంకా యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబీఎస్), ఆటోమేటిక్ స్టెబిలిటీ కంట్రోల్ , యాంటీ-హోపింగ్ క్లచ్ , కాస్ట్ అల్యూమినియం వీల్స్ , ఆల్-ఎల్ఇడి హెడ్ల్యాంప్ లాంటి సేఫ్టీ ఫీచర్లున్నాయి. ఇవి 8500 ఆర్పిఎమ్ వద్ద 105 హెచ్పి పవర్ను, 6500 ఆర్పిఎమ్ వద్ద గరిష్టంగా 92 ఎన్ఎమ్ టార్క్ను అందిస్తాయి. కేవలం 3.6 సెకన్లలో గంటకు 0-100 కిమీ వేగం పుంజుకుంటాయి. గంటకు 200 కి.మీ గరిష్ట వేగాన్ని అందుకుంటాయి. ఈ సూపర్ బైక్లు కవా సాకి వెర్సిస్ 1000, డుకాటీ మల్టీస్ట్రాడా 950 వంటి వాటికి గట్టిపోటీ ఇవ్వనున్నాయని మార్కెట్ వర్గాల అంచనా. -
న్యూ ఇయర్ గిఫ్ట్ : హీరోమోటో కొత్త బైక్
సాక్షి,ముంబై : హీరోమోటో కొత్త ఏడాదిలో సరికొత్త బైక్ను లాంచ్ చేసింది.100సీసీ సెగ్మెంట్లో బీఎస్-6 నిబంధనలకు అనుగుణంగా తన తొలి మోటార్ సైకిల్ తీసుకొచ్చింది. హెచ్ఎఫ్ డీలక్స్ పేరుతో తీసుకొచ్చిన ఈ బైక్ ప్రారంభ ధరను రూ. 55925 గా నిర్ణయించింది. 2020 ఏప్రిల్ నుంచి కొత్త ఉద్గార నిబంధనలు అమలుకానున్న నేపథ్యంలో కంపెనీ బీఎస్-6 ఉత్పత్తుల పోర్ట్ఫోలియోలో వేగం పెంచింది. హీరో బైక్స్ లవర్స్కు కొత్త సంవత్సరం బహుమతిని అందించింది. తన పాపులర్, ఐకానిక్ మోటారుసైకిల్ హెచ్ఎఫ్ డీలక్స్ బైక్ బీఎస్-6 మోడల్ను రెండు వేరియంట్లలో లాంచ్ చేసింది. సెల్ఫ్-స్టార్ట్ అల్లాయ్-వీల్ వేరియంట్ ధర రూ. 55,925 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ), సెల్ఫ్-స్టార్ట్ అల్లాయ్-వీల్ ఐ3ఎస్ వేరియంట్ రూ.57,250 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) వద్ద దేశంలోని హీరో మోటోకార్ప్ షోరూమ్లలో జనవరి 2020 ప్రారంభం నుండి అందుబాటులో వుంటాయని హీరోమోటో ఒకప్రకటనలో వెల్లడించింది. -
బీఎండబ్ల్యూ మోటొరాడ్ కొత్త బైక్లు
ముంబై: జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ కంపెనీ బీఎండబ్ల్యూకు చెందిన ప్రీమియం మోటార్సైకిల్ విభాగం ‘బీఎండబ్ల్యూ మోటొరాడ్’ తాజాగా భారత్లో రెండు అధునాతన బైక్లను ప్రవేశపెట్టింది. ‘బీఎండబ్ల్యూ ఆర్ 1250 ఆర్, బీఎండబ్ల్యూ ఆర్ 1250 ఆర్టీ’ పేర్లతో వీటిని మంగళవారం విడుదలచేసింది. ఈ నూతన సూపర్ బైక్ల ధరల శ్రేణి వరుసగా రూ. 15.95 లక్షలు, రూ. 22.50 లక్షలుగా నిర్ణయించింది. రెండు మోడళ్లలో 1,254 సీసీ ఇంజిన్లను అమర్చింది. ఆటోమేటిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ఏఎస్సీ), యాంటీ–లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబీఎస్ ప్రో) వంటి అధునాతన ఫీచర్లు వీటిలో ఉన్నట్లు వెల్లడించింది. -
ఆ గోల్డెన్ బైక్స్ మళ్లీ వస్తున్నాయ్!
సాక్షి, ముంబై: భారతీయ ద్విచక్ర వాహన మార్కెట్లోకి మరో గోల్డెన్ బైక్స్ రీఎంట్రీ ఇవ్వబోతున్నాయి. ఈ మేరకు సోషల్ మీడియాలో పలు సంకేతాలు సందడి చేస్తున్నాయి. 2020 ఆటో ఎక్స్పో నాటికి ఈ బైక్స్ పరిచేయాలని కంపెనీ యోచిస్తోందట. ఈ కంపెనీ పేరే యెజ్డీ మోటార్ సైకిల్స్. మహీంద్ర అండ్ మహీంద్ర సొంతమైన ఈ క్లాసిక్ కంపెనీ తన ఐకానిక్ యెజ్డీ బైక్లను తిరిగి లాంచ్ చేస్తోంది. ప్రధానంగా ఇటీవల భారత మార్కెట్లో రీఎంట్రీ ఇచ్చిన జావా బైక్లు హల్చల్ చేస్తున్న నేపథ్యంలో కంపెనీ తాజా నిర్ణయం తీసుకుంది. లాంచింగ్పై కచ్చితమైన తేదీని ప్రకటించకపోయినప్పటికీ, భారత బైక్ మార్కెట్ను ఏలిన యెజ్డీ మోటార్ సైకిల్స్ బైక్స్ అధికారిక పేజీ ప్రస్తుతం యాక్టివ్గా ఉంది. ఈ పేజీలో కొన్ని వివరాలను కూడా పొందుపర్చింది. అలాగే ఆఫీషియల్ ట్విటర్, ఇన్స్టాగ్రామ్ తదితర సోషల్ మీడియా ప్లాట్ఫాంలు యెజ్డీ బైక్ల లాంచింగ్పై స్పష్టమైన సంకేతాలని నిస్తున్నాయి. -
మార్కెట్లోకి సుజుకీ ‘ఇన్ట్రూడర్’ 2019 ఎడిషన్
ముంబై: వాహన తయారీ కంపెనీ సుజుకీ మోటార్సైకిల్ ఇండియా.. తన ‘ఇన్ట్రూడర్’ క్రూయిజర్ బైక్లో నూతన ఎడిషన్ను శుక్రవారం మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. అధునాతన గేర్ షిఫ్ట్ డిజైన్, అభివృద్ధిపరిచిన బ్రేక్ పెడల్ వంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీతో అందుబాటులోకి వచ్చిన ఈ బైక్ ధర రూ.1.08 లక్షలుగా కంపెనీ తెలిపింది. ‘స్టాండర్డ్ ఏబీఎస్, 155సీసీ ఇంజిన్, పూర్తి డిజిటల్ ఉపకరణాలతో ఈ బైక్ విడుదలైంది. క్రూయిజర్ను ఇష్టపడే యువతకు ఈ అడ్వాన్స్డ్ వెర్షన్ సరిగ్గా సరిపడే మోటార్సైకిల్గా భావిస్తున్నాం’ అని ఎస్ఎంఐపీఎల్ వైస్ ప్రెసిడెంట్ దేవశిష్ హన్డా అన్నారు. -
మళ్లీ వచ్చింది... జావా!
ముంబై: గంభీరమైన సౌండుతో, ఠీవికి మారుపేరుగా దేశీ రోడ్లపై ఒకప్పుడు దర్జాగా తిరుగాడిన జావా మోటార్సైకిల్ బ్రాండ్.. మళ్లీ వాహన ప్రియుల కోసం వచ్చేసింది. పారిశ్రామిక దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా అనుబంధ సంస్థ క్లాసిక్ లెజెండ్స్ దాదాపు రెండు దశాబ్దాల తర్వాత దీన్ని మరోసారి భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. జావా ఫోర్టీ టూ, జావా, జావా పెరక్ పేరిట మూడు మోడల్స్ను దేశీ మార్కెట్లో గురువారం ఆవిష్కరించింది. 293 సీసీ సామర్థ్యంతో పనిచేసే ఈ బైక్ల ధర రూ.1.55 లక్షల నుంచి రూ.1.89 లక్షల దాకా ఉంది. తమ ద్విచక్ర వాహనాల విభాగానికి జావా సరైన జోడీగా మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా చెప్పారు. ‘సాధారణ వాహనాల్లా కాకుండా ఇది చాలా ప్రీమియం సెగ్మెంట్కి సంబంధించిన బైక్. జావాకి ఒక గొప్ప చరిత్ర, పేరు ఉన్నాయి. దాన్ని నిలబెట్టుకోవడంపైనే ప్రస్తుతం మా దృష్టంతా పెట్టాం. అమ్మకాల పరిమాణం గురించి పెద్దగా లక్ష్యాలేమీ నిర్దేశించుకోలేదు‘ అని ఆయన వివరించారు. ప్రస్తుతానికి దేశీ మార్కెట్పైనే దృష్టి పెట్టామని, ఎగుమతులకు కూడా అవకాశాలు ఉన్నాయని మహీంద్రా పేర్కొన్నారు. ఇండోర్లో తయారీ..: దేశీయంగా ప్రీమియం మోటార్సైకిల్ మార్కెట్ గణనీయంగా వృద్ధి చెందుతున్న నేపథ్యంలో జావాను మళ్లీ తీసుకురావడానికి ఇదే సరైన సమయంగా భావించినట్లు క్లాసిక్ లెజెండ్స్ సీఈవో ఆశీష్ జోషి పేర్కొన్నారు. గురువారం నుంచి ఆన్లైన్లో జావా బుకింగ్స్ ప్రారంభించామని, డిసెంబర్ 7 నుంచి కస్టమర్లకు అందించనున్నామని తెలియజేశారు. ప్రస్తుతం మధ్యప్రదేశ్లోని ఇండోర్ దగ్గర పిఠంపూర్లో ఉన్న మహీంద్రా తయారీ ప్లాంటులో ఈ బైక్లను ఉత్పత్తి చేస్తున్నారు. ఏటా 5 లక్షల బైక్ల తయారీ సామర్థ్యం ఉన్నట్లు ఫి క్యాపిటల్ మేనేజ్మెంట్ వ్యవస్థాపకుడు అనుపమ్ తరేజా వెల్లడించారు. క్లాసిక్ లెజెండ్స్లో మహీంద్రా గ్రూప్నకు 60 శాతం వాటాలు ఉండగా, మిగతావి రుస్తుంజీ గ్రూప్, ఫి క్యాపిటల్ మేనేజ్మెంట్ వద్ద ఉన్నాయి. జావా చరిత్ర ఇదీ.. మోటార్ సైకిలంటే.. మూడు దశాబ్దాల క్రితం దాకా జావా, రాయల్ ఎన్ఫీల్డ్, యెజ్డీ, రాజ్దూత్ బైకుల పేర్లే ఎక్కువగా వినిపించేవి. ప్రస్తుతం రాయల్ ఎన్ఫీల్డ్కి ఉన్న క్రేజ్కన్నా ఎక్కువే అప్పట్లో జావాకి ఉండేది. కానీ ఆ తర్వాత జపాన్ కంపెనీల బైకులు భారత మార్కెట్ను ముంచెత్తిన తర్వాత ఇవి కనుమరుగయ్యాయి. మళ్లీ 2016లో దేశీ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా భారత ఉపఖండంలో జావా మోటార్సైకిల్స్ తయారీ, విక్రయానికి లైసెన్సు తీసుకుంది. కానీ రెండేళ్ల పాటు ఎలాంటి ఊసు లేదు. నాలుగు నెలల క్రితం జావాను ప్రవేశపెడుతున్నామంటూ మహీంద్రా ప్రకటించిన తర్వాత ఇది మళ్లీ జీవం పోసుకుంది. రాయల్ ఎన్ఫీల్డ్ 350కి పోటీగా బరిలోకి దిగింది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన మరిన్ని విశేషాలు.. ►చెకోస్లొవేకియాకి చెందిన ఫ్రాటిసెక్ జానెసెక్ 1929లో జావా మోటార్సైకిల్ను రూపొందించారు. అప్పట్లో వాండరర్ అనే మోటార్సైకిల్ సంస్థను కొనుగోలు చేసిన జానెసెక్.. తన పేరులోని తొలి అక్షరాన్ని వాండరర్లోని మొదటి అక్షరాన్ని కలిపి జావా అని కొత్త బైక్కు పేరు పెట్టారు. మొదట్లో 500 సీసీ బైక్స్ మాత్రమే తయారు చేసినా.. ఆ తర్వాత జనసామాన్యానికి చేరువయ్యే ఉద్దేశంతో 175 సీసీ బైక్లను, అటు పైన 250, 350 సీసీ బైక్లను రూపొందించారు. ► 1960లలో జావా మోటార్సైకిల్స్ భారత్లోకి ప్రవేశించాయి. రుస్తుం, ఫారూఖ్ ఇరానీలు ఏర్పాటు చేసిన ఐడియల్ జావా సంస్థ వీటిని దిగుమతి చేసుకుని విక్రయించేది. అనతికాలంలోనే బాగా పటిష్టమైన బైక్లుగా ఇవి ప్రాచుర్యంలోకి వచ్చాయి. ఇక్కడి డిమాండ్ను గుర్తించి అప్పట్లో మైసూర్లో తయారీ ప్లాంటును కూడా ఏర్పాటు చేశారు. 1961–71 మధ్య కాలంలో జావా కంపెనీ నుంచి లైసెన్సు తీసుకుని ఐడియల్ జావా వీటిని ఇక్కడ తయారు చేసేది. అటుపై 1971 నుంచి జావా సాంకేతిక సహకారంతో ఐడియల్ జావా కంపెనీ కొత్తగా యెజ్డీ పేరిట మోటార్సైకిల్స్ను విక్రయించింది. ఆ తర్వాత యూరప్లో పలు ప్రాంతాల్లో జావా మోటార్సైకిల్స్ తయారీ కొనసాగినప్పటికీ.. 1996లో భారత్లో కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఇన్నాళ్లకు మళ్లీ మొదలయ్యాయి. -
యూత్ కోసం హీరో ఎక్స్ట్రీమ్ 200ఆర్
న్యూఢిల్లీ: హీరో మోటోకార్ప్ మరోసారి ప్రీమియం మోటార్ సైకిల్ విభాగంలోకి అడుగుపెట్టింది. ప్రత్యేకించి యువతను లక్ష్యించి... 200సీసీ సెగ్మెంట్లో సరికొత్త ప్రీమియం బైక్ను సోమవారం మార్కెట్లోకి విడుదల చేసింది. ‘ఎక్స్ట్రీమ్ 200ఆర్’ పేరిట అందుబాటులోకి వచ్చిన ఈ టూవీలర్ను యాంటీ లాక్ బ్రేక్ సిస్టమ్, ఎయిర్ కూల్డ్ ఇంజిన్ టెక్నాలజీతో రూపొందించినట్లు కంపెనీ తెలిపింది. ఢిల్లీలో దీని ఎక్స్–షోరూం ధర రూ.89,900. పండుగల సీజన్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ కొత్త బైక్ ద్వారా అమ్మకాలు గణనీయంగా పెరిగి మార్కెట్ వాటా బలపడుతుందని భావిస్తున్నట్లు హీరో మోటోకార్ప్ సీఈఓ పవన్ ముంజాల్ చెప్పారు. 200సీసీ విభాగంలో మార్కెట్ వాటా పెంచుకోవడంలో భాగంగా ఎక్స్పల్స్ 200 వంటి పలు మోడళ్లను విడుదలచేయనున్నామని ఆయన వెల్లడించారు. -
రాయల్ ఎన్ఫీల్డ్ కొత బైక్స్ లాంచ్
సాక్షి, న్యూఢిల్లీ: లగ్జరీ టూవీలర్ మేకర్ రాయల్ ఎన్ఫీల్డ్ రెండు కొత్త బైక్లను లాంచ్ చేసింది. థండర్ బర్డ్ 350ఎక్స్, థండర్ బర్డ్ 500ఎక్స్ పేరుతో వీటిని విడుదల చేసింది. థండర్ బర్డ్ 350ఎక్స్ ధర రూ. 1.56 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభధరగా ఉండగా 500 ఎక్స్ (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధర రూ. 1.98 లక్షలుగా ఉంది. కొత్త కాస్మొటిక్ అప్గ్రేడ్స్ తో యువ బైకర్లే లక్ష్యంగా వీటిని భారత మార్కెట్లో అందుబాటులోకి తెచ్చింది. రెండింటిలోనూ డే టైం ఎల్ఈడీ లైట్లను, ఇంటిగ్రెటెడ్ హెడ్ ల్యాంప్, ఎల్ఈడీ టైయిల్ ల్యాంప్ను అమర్చింది. చిన్న హ్యాండిల్ బార్లను మార్చడంతోపాటు కొత్త 9 స్పోక్ అల్లాయ్ వీల్స్, ట్యూబ్లైస్ టైర్లు జోడించింది. అలాగే అదనంగా బ్లూ, ఆరెంజ్ సహా నాలుగులు రంగల్లో ఇవి లభ్యం కానున్నాయి. 350 ఎక్స్ ఫీచర్లు 346 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ 5 స్పీడ్ గేర్బాక్స్ 5,250ఆర్పీఎం వద్ద 19.8బీహెచ్పీ 4000 ఆర్పీఎం 28 ఎన్ఎం పీక్ టార్క్ అందిస్తుంది 500ఎక్స్ ఫీచర్లు 499 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజీన్ 5 స్పీడ్ గేర్బాక్స్ 5.250 ఆర్పీఎం వద్ద 27.2 బీహెచ్పీ 4,000 ఆర్పీఎం వద్ద 41.3 ఎన్ఎం గరిష్ట టార్క్ అందిస్తుంది. -
కారు ప్రమాదాల కంటే అవే చాలా డేంజర్
యువత రయ్..రయ్మని మోటార్ సైకిళ్లపై దూసుకు పోతుంటారు. ఇక్కడ కూడా బ్రేక్ వేయకుండా పరుగులు పెడుతుంటారు. కానీ అదే స్పీడులో ప్రమాదం జరిగితే ఇక అంతే సంగతులు. తాజాగా కెనడా పరిశోధకులు నిర్వహించిన ఓ సర్వేలో కారు ప్రమాదాల కంటే, మోటార్ సైకిల్ క్రాష్లే తీవ్రమైన గాయాలకు, మరణాలు, విస్తృతమైన వైద్య ఖర్చులకు కారణమవుతున్నాయని పేర్కొంది. మోటార్ సైకిల్ ప్రమాదాల ద్వారా గాయాల పాలైన 26,831 మంది పేషెంట్లు, కారు ప్రమాదాల్లో గాయపడిన 2,81,826 మంది డేటాపై రీసెర్చర్లు అధ్యయనం చేశారు. మొత్తంగా మోటార్సైకిల్ క్రాష్ల ద్వారా గాయపడిన రేటు, కారు క్రాష్ల ద్వారా గాయపడిన రేటు కంటే మూడింతలు ఎక్కువగా ఉందని పరిశోధకులు గుర్తించింది. మోటార్సైకిల్ ప్రమాదాల ద్వారా అయిన దారుణమైన గాయాలు పదింతలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొంది. మోటార్సైకిల్ క్రాష్ల సగటు వ్యయం 5,825 కెనడా డాలర్లు కాగ, కారు ప్రమాదాల వ్యయం 2,995 డాలర్లు. మోటార్సైకిల్ ప్రమాదాలు చాలా డేంజరస్ అని, ఇంకా చాలా ఖర్చుతో కూడుకుని ఉంటాయని సన్నీబ్రూక్ హాస్పిటల్, ది యూనివర్సిటీ ఆఫ్ టోరెంటో డాక్టర్ డానియెల్ పింకస్ తెలిపారు. 2007 నుంచి 2013 మధ్యలో మోటార్సైకిల్ లేదా కారు ప్రమాదాలతో ఆసుపత్రిలో ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్లలో చేరిన ఓంటారియో రెసిడెంట్ల మెడికల్ రికార్డులను పరిశోధకులు పరిశీలించారు. ఈ రెండు వాహనాల ద్వారా జరిగిన ప్రమాదాలకు మెడికల్ ఖర్చులు ఎంత అవుతున్నాయో విశ్లేషించారు. -
బీజేపీ కార్యకర్తలకు మోటార్ సైకిళ్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో బీజేపీ కార్యకలాపాల విస్తరణకు పూర్తికాలం వెచ్చించి పనిచేసే కార్యకర్తలకు మోటార్ సైకిళ్లను అందజేయనున్నారు. ఇందుకు ఉద్దేశించిన 150 మోటార్ సైకిళ్లు ఉత్తర ప్రదేశ్ నుంచి బుధవారం హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ కార్యాలయానికి చేరుకున్నాయి. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పనిచేసే ఫుల్టైమర్లతో పాటు 31 జిల్లాలకు పూర్తికాలం కార్యకర్త లుగా (ఇన్చార్జులుగా) నియమించే వారికి ఈ బైకులను పంపిణీ చేయనున్నారు. ఆయా శాసనసభ నియోజకవర్గాల్లో పని చేసేందుకు 86 మంది ఫుల్టైం కార్యకర్తలను ఇప్పటికే ఎంపిక చేసి.. వారికి వర్క్షాపులు, శిక్షణ కార్యక్రమాలను పూర్తి చేశామని కార్యవిస్తారక్ యోజన రాష్ట్ర ఇన్చార్జి కాసం వెంకటేశ్వర్లు ‘సాక్షి’కి తెలిపారు. ఏడాది నుంచి రెండేళ్లపాటు పనిచేసే వారికే ఈ బైకులను అందజేసి, వారికి కేటాయించిన నియోజకవర్గాల్లో పూర్తికాలం పని చేసేందుకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. -
దొంగల దండుకు సంకెళ్లు
♦ 41 దొంగతనాలు చేసిన తొమ్మిది మంది అరెస్టు ♦ అద్దంకి, ఒంగోలు, కనిగిరి పోలీసు సర్కిళ్ల పరిధిలో చోరీలు ♦ 17 మోటారు సైకి ళ్లు, రెండు ఆటోల స్వాధీనం ♦ 330 కిలోల కాపర్, అల్యూమినియం కూడా.. ♦ చోరీ సొత్తు విలువ అక్షరాలా రూ.14.50 లక్షలు ♦ వివరాలు వెల్లడించిన ఎస్పీ ఒంగోలు క్రైం : జిల్లాలోని పలు ప్రాంతాల్లో జరిగిన 41 దొంగతనాలకు సంబంధించి 9 మంది నిందితులను సోమవారం అరె స్టు చేసినట్లు ఎస్పీ డాక్టర్ సీఎం త్రివిక్రమ్వర్మ తెలిపారు. స్థానిక ఒంగోలు ఒన్టౌన్ పోలీసుస్టేషన్లో ఒంగోలు డీఎస్పీ గుంటుపల్లి శ్రీనివాసరావు, సీసీఎస్ డీఎస్పీ కేశన వెంకటేశ్వరరావు, కందుకూరు డీఎస్పీ కె.ఎస్.ప్రకాశరావు, దర్శి డీఎస్పీ వి.రాంబాబులతో కలిసి సోమవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలను ఆయన వెల్లడించారు. ఒంగోలు, అద్దంకి, కనిగిరి పోలీసు సర్కిళ్ల పరిధిలో 9 మంది చోరీలకు పాల్పడినట్లు ఎస్పీ వివరించారు. నేరాలకు పాల్పడిన వారిలో అంతర్ జిల్లాల దొంగలు ఐదుగురు ఉన్నారని, వారు కృష్ణా జిల్లా నందిగామకు చెందిన ముక్కు గోపి, కురిచేడు మండలం బోదనంపాడుకు చెందిన నంబూరి మరియదాసు, బల్లికురవ మండలం కొత్తూరుకు చెందిన తన్నీరు నరసింహారావు, అద్దంకి నంబూరివారిపాలేనికి చెందిన కరసాల నాగేశ్వరరావు, కనిగిరి మండలం కొత్తపల్లికి చెందిన అల్లు బాలయ్యలతో పాటు మరో నలుగురిని అరెస్టు చేశామని ఎస్పీ వెల్లడిం చారు. మిగిలిన వివరాలు ఆయన మాటల్లోనే.. కెమెరాలనూ వదలని దొంగలు అంతర్ జిల్లా దొంగ నంబూరి మరియదాస్ ఒంటరిగా వెళ్లి కెమెరాలు అపహరిస్తుంటాడు. తన మోటారు సైకిల్పై చిన్న లగేజీ వేసుకొని ఫొటో స్టూడియోలకు వెళ్లి అర్జంటుగా పెళ్లి ఫొటోలు తీయాలని, ఫొటోగ్రాఫర్ను పంపాలని కోరతాడు. తనతో ఫొటోగ్రాఫర్ను తీసుకెళ్తాడు. ఏదో ఒక గ్రామానికి తీసుకెళ్లి బైకుపై ఉన్న లగేజీని ఒక ఇంట్లో పెట్టమని చెబుతాడు. లగేజీ తీసుకెళ్లేటప్పుడు ఫొటోగ్రాఫర్ వద్ద ఉన్న కెమెరాను ఇతనికి ఇచ్చి వెళ్తాడు. అంతే ఆ లగేజీ లోపల పెట్టి వచ్చేలోపు కెమెరాతో బైకుపై ఉడాయిస్తాడు. ఈ విధంగా 2014 జూలై, సెప్టెంబర్, అక్టోబర్, 2016 ఏప్రిల్, జూలై మాసాల్లో అద్దంకిలో రెండు, జె.పంగులూరు, సంతనూతలపాడులో, బేస్తవారిపేట, నర్సరావుపేటల్లో ఒక్కొక్కటి చొప్పున కెమెరాలు మాయం చేశాడు. మరియదాస్ మరో ముగ్గురు తన్నీరు నరిసింహారావు, కరసాల నాగేశ్వరరావు, అల్లు బాలయ్యలను కలుపుకొని దొంగతనాలు, దోపిడీలు చేయటం ప్రారంభించాడు. అద్దంకి పట్టణంలో గతేడాది, ఈ ఏడాదిలో మూడిళ్లల్లో పగలు, రాత్రి అనే తేడా లేకుండా దొంగతనాలు చేశారు. ఆ ఇళ్లలో 9 సవర్ల బంగారు ఆభరణాలు, రూ.30 వేల నగదు కాజేశారు. అదే విధంగా గతేడాది అక్టోబర్లో అద్దంకిలోని ఒక ఇంట్లోకి చొరబడి దొంగతనానికి పాల్పడగా ఇంట్లోని మహిళ ప్రతిఘటించింది. ఆమెను కత్తితో పొడిచి పారిపోయారు. ఒక్కరే 11 సెల్ఫోన్ల అపహరణ కృష్ణా జిల్లా నందిగామ మండలం మాగల్లుకు చెందిన అంతర్ జిల్లా దొంగ అద్దంకి, మేదరమిట్ల ప్రాంతాల్లో 11 సెల్ఫోన్లు అపహరించాడు. వాటిలో మేదరమెట్లలోని సెల్ఫోన్ షాపునకు చెందిన షట్టర్ను పగులగొట్టి 10 సెల్ఫోన్లు, అద్దంకిలో ఒక సెల్ఫోన్ను దొంగిలించాడు. అద్దంకి, జె.పంగులూరు ప్రాంతాల్లో మూడు బైకులు కాజేశాడు. సెల్ఫోన్ల, మోటారు సైకిళ్లతో పాటు ఇతని వద్ద నుంచి 9 సవర్ల బంగారు ఆభరణాలు, 6 కెమెరాలు స్వాధీనం చేసుకున్నారు. చోరీ సొత్తు విలువ రూ.5 లక్షలు ఉంటుంది. ట్రాన్స్ఫార్మర్ల దొంగలు కూడా.. పొలాల్లో ఉన్న వ్యవసాయ విద్యుత్ ట్రాన్ ్సఫార్మర్లే లక్ష్యంగా జిల్లాలోని ముగ్గురు దొంగతనాలకు పాల్పడుతున్నారు. పెద్దారవీడు మండలం శివాపురానికి చెందిన బోగుల వెంకటేశ్వర్లు, కనిగిరి ఎన్జీఓ కాలనీకి చెందిన పడిదపు కొండలు, దర్శి మండలం రాజపల్లికి చెందిన బచ్చలకూరపాటి రత్తయ్యలు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను పగులగొట్టి కాపర్, అల్యూమినియాన్ని విక్రయించారు. వీళ్ల ముగ్గురూ ఈ ఏడాదిలోనే 20 ట్రాన్స్ఫార్మర్లను పగులగొట్టారు. కనిగిరి, వెలిగండ్ల, హనుమంతునిపాడు, పీసీపల్లి, పొదిలి, కొనకనమిట్ల, దొనకొండ పోలీసుస్టేషన్ల పరిధిలో ఇలాంటి దొంగతనాలకు పాల్పడ్డారు. వీరి నుంచి 330 కిలోల కాపర్, అల్యూమినియం వైర్లను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం వాటి విలువ రూ.3.30 లక్షలు. నిందితులను పట్టుకుని అత్యంత చాకచక్యంగా కేసులను ఛేదించిన ఒంగోలు, దర్శి, కందుకూరు, సీసీఎస్ డీఎస్పీలను ఎస్పీ త్రివిక్రమ్వర్మ ప్రత్యేకంగా అభినందించారు. ఒక్కడే 14 బైకులు, రెండు ఆటోలు అపహరణ ఒంగోలు నగరాన్ని లక్ష్యంగా చేసుకుని గోగు శివశంకర్ అనే దొంగ మొత్తం 14 మోటారు సైకిళ్లు, రెండు ఆటోలను రెండే ళ్లలో అపహరించాడు. చీమకుర్తి మండలం నాయుడుపాలేనికి చెందిన గోగు శివశంకర్ కేవలం పగటి పూట మాత్రమే దొంగతనాలకు పాల్పడుతుంటాడు. షాపింగ్ మాల్స్, రోడ్లు, ఇంటి ముందు తాళం వేసి ఉన్న మోటారు సైకిళ్లను మారు తాళాలతో లేదా తాళాలు పగులగొట్టి బైకులు మాయం చేస్తుంటాడు. ఒంగోలు ఒన్టౌన్, టూటౌన్, తాలూకా పోలీసుస్టేషన్ల పరిధిలో 2015, 2016 సంవత్సరాల్లో కేవలం మే, జూన్ మాసాల్లో మాత్రమే 14 మోటారు సైకిళ్లను అపహరించాడు. అదేవిధంగా ఒంగోలు టూటౌన్, తాలూకా పోలీసుస్టేషన్ల పరిధిలో రెండు ఆటోలను కూడా దొంగిలించినట్లు తేలింది. వీటి మొత్తం విలువ దాదాపు రూ.6.20 లక్షలు ఉంటుంది. -
హెచ్పీ లూబ్రికెంట్స్ నుంచి సింథటిక్ ఇంజిన్ ఆయిల్
హైదరాబాద్: హెచ్పీ లూబ్రికెంట్స్ కంపెనీ మోటార్ సైకిళ్ల కోసం కొత్తగా ప్రీమియం సింధటిక్ ఆయిల్ను అందుబాటులోకి తెచ్చింది. హెచ్పీ రేసర్ 4 సింథ్ 10డబ్ల్యూ 30 పేరుతో అందిస్తున్న ఈ సింథటిక్ ఇంజిన్ ఆయిల్ బైక్ల ఇంజిన్లకు తగిన రక్షణను ఇస్తుందని హెచ్పీ లూబ్రికెంట్స్ కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. అధునాతన ఎగ్జాస్ ఎమిషన్ కంట్రోల్ టెక్నాలజీతో ఈ ఇంజిన్ ఆయిల్ను రూపొందించామని పేర్కొంది. దేశీయంగా, అంతర్జాతీయంగా తయారైన అన్ని రకాల మోటార్బైక్లకు ఈ ఇంజిన్ ఆయిల్ను వాడవచ్చని ప్రకటనలో వివరించింది.a -
విచిత్రవిహారం
కస్టమైజ్డ్గా తీర్చిదిద్దిన మోటార్ సైకిల్స్లో బెస్ట్ కస్టమైజ్డ్ని ఎంపిక చేసేందుకు హార్లీ డేవిడ్సన్ కంపెనీ ప్రతీ ఏటా ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించే రాక్ రైడర్స్ కాంటెస్ట్కు సౌత్ ఇండియా నుంచి కొచ్చిన్ తర్వాత ఎంపికైన బైక్ మన సిటీదే కావడం విశేషం. దీంతో ఈ బైక్ని డిజైన్ చేసిన ఇద్దరు యువకులు అకస్మాత్తుగా లైమ్లైట్లోకి వచ్చారు. ముంబయిలో అక్టోబరు 30 నుంచి 2రోజులు కొనసాగే ఈ పోటీకి ఎంపికైన లేటెస్ట్ హార్లీ డేవిడ్సన్ బైక్ను కస్టమైజ్ చేసిన వీరిద్దరూ.. మోటార్ సైకిల్స్, హెల్మెట్స్ తమకు కాన్వాస్ అంటున్నారు. లుక్ కాదు వర్క్ బాగుండాలి... వీరు ఇంజినీర్లు మాత్రమే కాదు రైడర్స్ కూడా. అందుకే బైక్ లుక్ అదిరిపోవడం అంటే... దాని పనితీరు మందగించడం కాదంటారీ ఫ్రెండ్స్. హార్లీ బైక్స్లో అవార్డులు గెలుచుకున్న దాదాపు డజను బైక్స్కు వీరు పెయింట్ చేశారు. ‘ఒక బైక్ ఓనర్ హైదరాబాద్ మీద తన ఇష్టాన్ని బైక్ ద్వారా ప్రదర్శించాలనుకున్నాడు. మేం దాన్ని పుల్ఫిల్ చేశాం. బైకర్స్ తమ అభిరుచుల్ని, ఇష్టాఇష్టాల్ని బైక్స్ ద్వారా ప్రదర్శించుకునేందుకు సహకరించడమే మా ధ్యేయం. ఇప్పటికి దాదాపు 120 బైక్స్కి ఆర్ట్వర్క్ చేశాం. దేశవ్యాప్తంగా పంజాబ్, దిల్లీ, జమ్మూ కశ్మీర్ల నుంచి కూడా మాకు కస్టమర్స్ వస్తుంటారు’ అని చెప్పారీ ద్వయం. బాడీ మీద టాటూ వేయించుకోవడం బైక్ మీద పెయింటింగ్ సేమ్ అంటున్న వీరు.. కస్టమైజేషన్కు కనీసం 3వారాల సమయం, రూ.50 వేల పైనా వ్యయం అవుతుందంటున్నారు. ఏదేమైనా వైవిధ్యమైన రంగాన్ని ఎంచుకుని రాణిస్తున్న ఈ యువత మన సిటీ తరఫున విన్నర్స్గా తిరిగి రావాలని ఆశిస్తూ.. ఆల్ ది బెస్ట్. కాంటెస్ట్కు ఎంపికైన బైక్కు మేం అమర్చిన హంగులివే... కస్టమైజేషన్కు వీలయ్యే బైక్స్లో స్ట్రీట్ 750 హార్లీ డేవిడ్సన్ బైక్ ది బెస్ట్. మేం చాలా బైక్స్ మోడిఫై చేశాం. కాని పూర్తిస్థాయిలో మోడిఫికేషన్ చేసిన హార్లీ బైక్ ఇదే. గ్లాస్ ఊల్తో చేసిన హ్యాండ్మేడ్ మఫ్లర్స్ ద్వారా దీని సౌండ్ని ఫ్యాబ్యులస్గా మార్చాం. ట్విన్ ఎగ్జాస్ట్ సిస్టమ్ అమర్చాం. విండ్ షీల్డ్ జత చేశాం. డిటచబుల్ లెదర్ బెల్ట్స్తో ఎంత లగేజీ అయినా క్యారీ చేసేందుకు వీలు కల్పించాం. క్రేజీగా అనిపించే ఎల్ఈడీ లైటింగ్స్ చేర్చాం. వీటన్నింటితో పాటు మాకే ప్రత్యేకమైన పెయింటింగ్ను అద్దాం. ‘ఒకప్పుడు ఐటీ ఉద్యోగులం. ఆఫీస్ నాలుగ్గోడలను మించి లైఫ్ ఎదగాలనే ఆశ. దాంతో పాటే మోటార్ బైక్ ప్రియత్వం కూడా ఉంది. యూకే, యూఎస్లలో కన పడే హై ఎండ్ బైక్స్లా మా బైక్స్ను కూడా కస్టమైజ్ చేసుకోవాలని ట్రై చేశాం’’ అంటూ గుర్తు చేసుకున్నారు ఈస్ట్ ఇండియా మోటార్ సైకిల్ రెవల్యూషన్(ఐమోర్ కస్టమ్స్) నిర్వాహకులు మృత్యుంజయ్, సైకత్ బసు. వీరిలో మృత్యుంజయ ఒడిశా, సైకత్ కోల్కతా నుంచి వచ్చి సిటీలో స్థిరపడ్డారు. పెయింట్కు పేటెంట్... వీళ్లిద్దరికీ ఫైనార్ట్స్లో చిన్నప్పటి నుంచి ప్రవేశముంది. తమ బైక్స్ని కొత్తగా కనిపించేలా చేయాలనే ఆరాటంతో నచ్చిన బొమ్మలు దాని మీద పెయింట్ చేశారు. దీంతో ఎక్కడ వీళ్ల మోటార్ సైకిల్ ఆపినా... జనం కాంప్లిమెంట్స్ ఇవ్వడం, ఫొటోలు తీయడం, తమ బైక్స్పైన కూడా ఆర్ట్ వర్క్ చేయమని అడగడం చేసేవారు. ‘ఆ తర్వాత అదే మమ్మల్ని ఈ ప్రొఫెషన్లోకి తీసుకొచ్చింది. బైక్స్తో పాటు హెల్మెట్స్పై కూడా పెయింటింగ్ చేయడం ప్రారంభించాం. ఉద్యోగాలు వదిలేసి ఐదేళ్ల క్రితం దీనిని పూర్తిస్థాయి ప్రొఫెషన్గా మార్చుకున్నాం. పూర్తి కస్టమైజేషన్కు విస్తరించాం’’అంటూ చెప్పారీ యువ చిత్రకారులు. మాదాపూర్లోని సర్వే ఆఫ్ ఇండియా కాలనీలో విశాలమైన షెడ్ని వీరు తమ ఆర్ట్ వర్క్కు అనుగుణంగా తీర్చిదిద్దుకున్నారు. -
తెలంగాణలో రీగల్రాఫ్టర్ సూపర్ బైక్స్ ప్లాంట్
-
తసదుఖ్ఖమూ... పేగుశోకమూ వద్దు!
మన హైదరాబాద్ రోడ్ల మీద నేను బైక్ నడుపుతున్నప్పుడు, నా పక్క నుంచి అత్యంత వేగంతో కుర్రాళ్లు రయ్ రయ్ మంటూ మోటారుసైకిళ్ల మీద దూసుకుపోతుంటారు. వాళ్లనలా చూస్తుంటే ఓ పక్క చూడ ముచ్చటగానూ ఉంటుంది, మరో పక్క గుండె గుబగుబలాడుతుంటుంది. ఆ బైకుల స్పీడుకు యువత హుషారెత్తిపోతుంది. ఆ బండ్ల జోరు మోతతో రోడ్డు హోరొత్తిపోతుంది. పక్కన వెళ్లేవాళ్లు ఠారెత్తిపోతారు. ఓ హుషార్పైన వాడు బండిని ఏటవాలుగా అటూఇటూ గబగబా ఒంచుతూ... కట్స్ కొడుతూ పోతుంటే ఆ కట్స్ ఏ తల్లి పేగును కట్ చేస్తాయోనంటూ ‘ఏ తల్లిబిడ్డో... హమ్మనా బిడ్డో, పదిలం కొడుకో, జర భద్రం కొడుకో...’ అంటుంది దారినపోయే ఓ అమ్మ. చిన్నతనంలో చిన్నారి కొడుకు చేసే అల్లరికీ, విన్యాసాలకు గిరికీలు కొట్టే కన్నతండ్రి పేగులు పడ్డ మెలికల్లా తన వాహనంతో గిరికీల మీద గిరికీలు కొట్టిస్తుంటాడా కుర్రాడు. కానీ... మనం హైదరాబాద్ యూత్ కదా... కాస్త సాలార్జంగ్నూ... వాళ్ల నాన్ననూ ఓసారి గుర్తు తెచ్చుకుంటే మంచిదేమో అనిపిస్తుంటుంది నాకు. మీకు గుర్తులేకపోతే నేను గుర్తు చేస్తా వినండి. సాలార్జంగ్ అంటే ఇప్పుడు మ్యూజియమ్లోని వస్తువులను సమీకరించిన మూడో సాలార్జంగ్ గారి తాతగారైన మొదటి సాలార్జంగ్ అన్నమాట. ఆయన పేరు మీర్ తురాబ్ అలీఖాన్. వాళ్ల నాన్న కూడా నవాబుగారి పేషీలో ప్రధానమంత్రే. చిన్నప్పుడు తురాబ్ అలీఖాన్ ఆరోగ్యం బాగాలేకపోతే వాళ్లనాన్న మొక్కుకుంటాడు. ఆ మొక్కు పేరు ‘తసద్దుఖ్’. ‘తురాబ్ అలీ ప్రాణం పోయేలాగుంది కదా. దేవుడా ఏ ప్రాణమైతేనేం నీకు కావాల్సింది ఒక ప్రాణం. నేనన్నీ చూసి, అనుభవించిన వాణ్ణి. కాబట్టి చిన్నారి తురాబ్ ప్రాణాన్ని వదిలేసి నా ప్రాణాన్ని తీసుకో’ అని అర్థించడమే ఆ మొక్కు. తసద్దుఖ్ఖు మొక్కు ఫలించిందో ఏమోగానీ... తురాబ్ అలీ బతికాడు. వాళ్ల నాన్న మరణించాడు. ఆ తర్వాత సదరు తురాబ్ అలీ ఖాన్గారు... సాలార్జంగ్-1 పేరుతో ఏ మంత్రీ నిర్వహించలేనంత ఘనంగా, అది కూడా అత్యంత సమర్థంగా మూడు పదుల ఏళ్ల పాటు కార్యనిర్వాహకత్వం చేశాడు. తురాబ్ పొరబాటున అప్పుడే చనిపోయి ఉంటే ఈ కీర్తి దక్కి ఉండేది కాదు కదా. ఏమో ఏ యువకుడిలో ఏ తురాబున్నాడో? ఏ నవాబున్నాడో?! బండ్ల మీద రివ్వురివ్వున దూసుకుపోయే యువకులకు ఓ తండ్రి చేసే విజ్ఞప్తి ఇది. మీరు మీ వాహనాన్ని దూకిస్తున్నప్పుడు, జర్కిస్తున్నప్పుడూ మీ తండ్రి కూడా మొదటి సాలార్జంగ్లాగే ‘తసద్దుఖ్ఖు’ మొక్కు మొక్కుతూ ఉంటాడేమో. తమకు దుఃఖం కలిగించవద్దని కోరుతూ ఉంటారేమో! తమ బిడ్డలకు ఆ పరిస్థితి వస్తుందని తెలియక అజహరుద్దీన్, కోట శ్రీనివాసరావు, బాబూమోహన్ లాంటి వారు ఆ మొక్కులు మొక్కలేదేమో! కానీ తెలిసుంటే మొక్కి ఉండేవారేమో! వాళ్లంటే సెలిబ్రిటీలు కాబట్టి విషయం వాళ్ల కొడుకుల యాక్సిడెంట్ల సంగతి మనకు తెలిసింది. మనకు తెలియనివాళ్లు ఎందరు గిరికీల మెలికల్లో చిక్కుబడి... వాళ్ల తండ్రి మొక్కుబడి తీర్చుకోవాల్సి వస్తుందో! అందుకే మీ తండ్రికి తసదుఖ్ఖమూ వద్దు... మీ తల్లికి పుత్రశోకమూ వద్దు. ఇది నా మాట కాదు... సాక్షాత్తూ మొదటి సాలార్జంగ్ తండ్రి మొక్కిన మొక్కు వెనక ఉన్న మానవీయ మౌనవాక్కు! -యాసీన్ -
సాహసం మా పథం
నాంపల్లిలోని సరోజినీనాయుడు వనితా మహా విద్యాలయలో మంగళవారం వార్షిక క్రీడోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినులు వివిధ సాహస కృత్యాలు, విన్యాసాలు ప్రదర్శించారు. నృత్యాలతో అలరించారు. చేతులపై మోటార్ సైకిళ్లు నడిపించుకొని అబ్బురపరిచారు. కరాటే ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. -
బీటెక్ దొంగ!
7 మోటార్ సైకిళ్లు స్వాధీనం : నిందితుడి అరెస్ట్ కొలిమిగుండ్ల: తనో బీటెక్ చదివిన యువకుడు. జల్సాలకు అలవాటు పడి అప్పుల పాలయ్యాడు. వాటిని తీర్చేందుకు మోటార్ సైకిళ్ల దొంగ అవతారమెత్తాడు. చివరకు పోలీసులకు చిక్కాడు. మంగళవారం నిందితుడిని అరెస్ట్ చేసి ఏడు బైక్లు స్వాధీనం చేసుకున్నట్టు ఎస్ఐ నీలకంఠేశ్వర్ విలేకరులకు తెలిపారు. ఆయన కథనం మేరకు.. కనకాద్రిపల్లెకు చెందిన వెంకటశివ ప్రతాప్రెడ్డి బీటెక్ చదివాడు. అతను ఓ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. జీవనోపాధి కోసం అనంతపురం జిల్లా తాడిపత్రిలో సెల్పాయింట్ నిర్వహించేవాడు. జల్సాలకు అలవాటు పడటంతో ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో బైక్ల దొంగ అవతారం ఎత్తాడు. కొలిమిగుండ్లకు చెందిన మరో దొంగ ఉదయ్కుమార్తో పరిచయం పెంచుకున్నాడు. ఆ తర్వాత నంద్యాల, తాడిపత్రి, ప్రొద్దుటూరుతో పాటు కొలిమిగుండ్లలో మొత్తం ఏడు బైక్లు చోరీ చేశారు. ఇటీవలనే ఉదయ్కుమార్ కొలిమిగుండ్లలో బైక్ చోరీ చేసి బుగ్గలో తిరుగుతుండగా తాడిపత్రి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ప్రతాప్రెడ్డి కోసం పోలీసుల బృందంగా గాలించింది. మంగళవారం అంకిరెడ్డిపల్లె సమీపంలోని విద్యుత్ సబ్స్టేషన్ సమీపంలో అతడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి బనగానపల్లె మెజిస్ట్రేట్ ముందు హాజరు పరచగా రిమాండ్కు ఆదేశించారు. ఏఎస్ఐ సలాంఖాన్, హెడ్కానిస్టేబుల్ పురుషోత్తంరావు, కానిస్టేబుళ్లు అలీఖాన్, మహేష్నాయక్, హోంగార్డు వెంకటేష్ పాల్గొన్నారు. -
కొసరు పనులు ఇంకెన్నాళ్లకు?
అమలాపురం :జాతీయ రహదారి-216లో వైనతేయ గోదావరిపై బోడసకుర్రు - పాశర్లపూడిల మధ్య తలపెట్టిన వంతెన ఎనిమిదేళ్లయినా ఇంకా పూర్తి కాలేదు. మొన్నటి ఎన్నికల్లో లబ్ధి పొందాలన్న దుగ్ధతో అప్పటి అమలాపురం ఎంపీ జీవీ హర్షకుమార్ గత మార్చి 8నే వంతెనను ప్రారంభించేసినా.. అప్రోచ్రోడ్డు.. రెయిలింగ్ వంటి పనులు ఇంకా నత్తనడకనే సాగుతున్నాయి. పనులు పూర్తి కాకుండానే ‘ప్రారంభించేసిన’ సమయంలో నెల రోజుల్లో పనులు పూర్తి చేస్తామన్న జాతీయ రహదారి సంస్థ, కాంట్రాక్టు సంస్థ గామన్ అధికారుల మాట నీటిమూటే అయింది. రూ.70.50 కోట్ల అంచనా వ్యయంతో 2006లో ఈ వంతెన నిర్మాణం మొదలైంది. నిర్ణీత గడువు ప్రకారం 2010 ఏప్రిల్ 25 నాటికి నిర్మాణం పూర్తి కావాల్సి ఉంది. వివాదాల కారణంగా పనులు తొలి నుంచీ మందకొడిగానే సాగాయి. ఈ ఏడాది మార్చి నాటికి వంతెన పనులు 90 శాతం పూర్తయ్యాయి. వంతెనపైరహదారి నిర్మాణం, ఇరువైపులా అప్రోచ్రోడ్డు, రైలింగ్ పనులు మాత్రమే అసంపూర్తిగా ఉండిపోయాయి. ఎన్నికల నిబంధనావళి అమలులోకి వచ్చినా, రాజకీయ ప్రయోజనం కోసం దాన్ని బేఖాతరు చేస్తూ అప్పటి ఎంపీ హర్షకుమార్ వంతెనను అనధికారికంగా ఆరంభించారు. అప్పటి నుంచీ మోటార్ సైకిళ్లు, ఆటోలు, కార్లే కాక లారీల వంటి భారీ వాహనాలు కూడా వంతెన మీదుగా ప్రయాణిస్తున్నాయి. వంతెనపై రోడ్డు నిర్మాణం పూర్తయినా, అప్రోచ్రోడ్డు పనులు అసంపూర్తిగానే ఉన్నాయి. పాశర్లపూడి వైపు రెయిలింగ్ పూర్తికాగా, బోడసకుర్రు వైపు పనులు ఇంకా మొదలు కాలేదు. అప్రోచ్రోడ్డు సైతం ఒక లేయర్ తారు మాత్రమే వేసి వదిలేశారు. అసంపూర్తి పనులను కేవలం వారం, పది రోజుల్లో పూర్తిచేసే అవకాశమున్నా, గత ఆరు నెలలుగా పూర్తి చేయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అప్రోచ్ పనుల సబ్ కాంట్రాక్టర్కు, గామన్కు మధ్య ఆర్థిక లావాదేవీలే జాప్యానికి కారణమని తెలుస్తోంది. ఆర్టీసీ బస్సులు నడిచేదెప్పుడు ? పనులు పూర్తి కాకున్నా.. వంతెనపై లారీల వంటి వాహనాల రాకపోకలు మొదలైనా ఆర్టీసీ యాజమాన్యం మాత్రం బస్సులు నడపడం లేదు. ఈ వంతెన వల్ల అమలాపురం - తాటిపాకల మధ్య దూరం గణనీయంగా తగ్గుతుంది. జిల్లాలోని కత్తిపూడి - కృష్ణాజిల్లా పామర్రు మధ్య ఉన్న 216 జాతీయ రహదారికి ఈ వంతెన అనుసంధానంగా ఉంది. వంతెనపై బస్సుల రాకపోకలు మొదలైతే కాకినాడ, విశాఖపట్నం నుంచి పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం, భీమవరం, ఆకివీడు, కృష్ణాజిల్లా కైకలూరు, పామర్రు, మచిలీపట్నానికి ఇది దగ్గర దారి అవుతుంది. అమలాపురం నుంచి రాజోలు దీవిలోని పలు గ్రామాలకు దగ్గర దారవుతుంది. ప్రసిద్ధి చెందిన అప్పనపల్లి బాలబాలాజీ ఆలయానికి అమలాపురం, ముమ్మిడివరం, అయినవిల్లి, కాకినాడ పరిసర ప్రాంతాల నుంచి నిత్యం వందలాది భక్తులు వెళుతుంటారు. వీరు బస్సుల ద్వారా రాకపోకలు సాగించాలంటే అమలాపురం నుంచి తాటిపాక సెంటర్ చేరుకుని అక్కడ నుంచి బస్సు లేదా ఆటోల్లో అప్పనపల్లి వెళ్లాల్సి వస్తోంది. ఇది ఇబ్బంది కావడంతో చాలా మంది అమలాపురం నుంచి ఆటోల మీద అప్పనపల్లి చేరుకుంటున్నారు. అప్పనపల్లి పరిసర ప్రాంత వాసులు సైతం ప్రయాణాల కోసం ఆటోలపై ఆధారపడుతున్నారు. వంతెనపై బస్సుల రాకపోకలు ఆరంభమైతే అటు రాజోలు, ఇటు అమలాపురం డిపోలకు ఆదాయం పెరుగుతుంది. అయితే ఇప్పటి వరకూ సర్వీసులు ఎలా నడపాలనే దానిపై ఆర్టీసీ సర్వే కూడా చేపట్టకపోవడం గమనార్హం. ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు, జిల్లా, ఎన్హెచ్ అధికార యంత్రాంగం నిర్లక్ష్యం వల్లే వంతెన పనులు పూర్తి కాలేదని స్థానికులు విమర్శిస్తున్నారు. ఆరునెలల క్రితం ప్రారంభించేసిన వారధిని ఇప్పటికైనా పూర్తిస్థాయిలో వినియోగంలోకి తేవాలని కోరుతున్నారు. -
ఉన్మాదమో.. ఉక్రోషమో
తణుకు క్రైం :తణుకు బ్యాంకు కాలనీలోని నం బర్-15 మునిసిపల్ పాఠశాల వెనుక వైపున గల రెండతస్తుల అపార్ట్మెం ట్లో పార్క్ చేసిన మోటార్ సైకిళ్లకు మంగళవారం అర్ధరాత్రి దాటాక గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. ఈ ఘటనలో ఆరు మోటార్ సైకిళ్లు దహనమయ్యూయి. వాటి ట్యాంకులు పేల డంతో పెద్దఎత్తున శబ్దాలొచ్చాయి. వివరాల్లోకి వెళితే... బ్యాంకు కాలనీలోని అపార్ట్మెంట్ గ్రౌండ్ ఫ్లోర్లో ఒక ఫ్లాట్, మొదటి, రెండు అంతస్తుల్లో నాలుగు ఫ్లాట్లలో ఐదు కుటుంబాల వారు నివాసం ఉంటున్నారు. ఎప్పటిలానే మోటారు సైకిళ్లను గ్రౌండ్ ఫ్లోర్లో పార్కింగ్ చేసుకుని ఎవరి ఫ్లాట్లలో వారు నిద్రిస్తున్నారు. అర్ధరాత్రి దాటాక శబ్దాలు రావడంతో గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటున్న వారు బయటకొచ్చారు. పెద్దఎత్తున మంటలు ఎగసిపడటంతో వారంతా హాహాకారాలు చేస్తూ మం టల్ని దాటుకుని పిల్లాపాపలతో బయట కొచ్చేశారు. అదే సమయంలో నిద్రలేచిన మొదటి, రెండో అంతస్తుల్లోని వారు బయటకొచ్చి చూడగా మంటలు, పొగ కమ్మేశారుు. విపరీతమైన వేడి వచ్చింది. మొదటి అంతస్తులో ఉంటు న్న వారంతా పక్కింటి బాత్రూమ్ పైకి.. అక్కడి నుంచి కిందకు దూకి బయటపడ్డారు. రెండో అంతస్తులోని వారు బయటకు వచ్చే మార్గం లేకపోవడంతో కొందరు అపార్ట్మెంట్ పైకి వెళ్లిపోగా, కొందరు కిందకు దూకేశారు. అలా దూకిన వారిలో కొందరికి గాయూలయ్యూరుు. మంటల్ని ఆర్పేందుకు వెళ్లిన ఇజ్జురోతు సత్యనారాయణ జారిపడిపోవడంతో అతడి చేతి ఎముకలు విరిగాయి. మంటలు, మోటార్ సైకిళ్ల ట్యాంకుల పేలుడు ధాటికి గ్రౌండ్ఫ్లోర్ స్లాబ్ పెచ్చులు ఊడి బీటలు తీసింది. అపార్ట్మెంట్ మొత్తం మసిబారింది. కొంతసేపటికి తేరుకున్న అపార్ట్మెంట్వాసులు, స్థానికులు నీళ్లుపోసి మంట లను అదుపుచేశారు. లేకపోతే పక్కనే ఉన్న విద్యుత్ మీటర్లు అంటుకుని తీవ్ర నష్టం జరిగిఉండేది. సమాచారం అందుకున్న అగ్నిమాపక అధికారి రామలింగేశ్వరరావు, సిబ్బంది అపార్ట్మెంట్ వద్దకు చేరుకుని సహాయక చర్యల్లో పాల్గొన్నారు. దహనమైన వాహనాల విలువ సుమారుగా రూ.2 లక్షలు ఉం టుందని రామలింగేశ్వరరావు చెప్పారు. విద్యుత్ సిబ్బంది సైతం వెంటనే ఘటనా స్థలానికి వచ్చి సరఫరా నిలిపివేశారు. తణుకు సీఐ కె.గోవిందరావు, పట్టణ ఎస్సై అల్లు దుర్గారావు, రూరల్ ఎస్సై కొప్పిశెట్టి గంగాధరరావు ఘటనా ప్రాంతాన్ని పరిశీలించారు. ఆగంతకుడి పనేనా ! ఘటనా స్థలంలో లభించిన ఆనవాళ్లు.. ఈ ఘటనకు ముందు కాలనీలోని అదే ప్రాంతంలో మరొక ఇంటి వద్ద ఆగంతకుడు గోడదూకి పారిపోవడాన్ని బట్టి చూస్తే ఇది ఎవరో కావాలని చేసిన పనేనని స్థానికులు భావిస్తున్నారు. ఈ ఘటనకు ముందు బ్యాంకు కాలనీలోని యల్లారమ్మ ఆల యం గేటును ఎవరో బాదడం.. ఆ తరువాత గుడి ఎదురింట్లో మోటార్ సైకిళ్ల వద్ద అలికిడి వినిపించడంతో ఆ ఇంట్లోని వారు బయటకొచ్చి చూశారు. పొడవుగా.. సన్నగా ఉన్న ఓ యువకుడు ఆలయం ఎదురింట్లోని మోటార్ సైకిళ్ల వద్ద ఏదో చేయబోతున్నాడని గమనించి కేకలు వేశారు. దీంతో అతడు పారిపోయూడు. అరగంట తరువాత పక్కవీధిలోని అపార్ట్మెంట్లో మంటలు, పొగ రావడం చూశామని అగంతకుడిని చూసినవారు పోలీసులకు చెప్పారు. మోటార్ సైకిళ్ల దహనం ఆ ఆగంతకుడి పనేనేమోనని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇదిలావుండగా, మోటార్ సైకిళ్లు దహనమైన కొద్ది నిమిషాలకే ఆ యువకుడు అపార్ట్మెంట్ ఎదుట ప్రత్యక్షమయ్యూడు. దీంతో అతణ్ణి పోలీసులు అదుపులోకి తీసుకుని ఆరా తీస్తున్నారు. ఆ యువకుడి గత చరిత్ర, ఇటీవల కాలంలో అతని వ్యవహారశైలి అనుమానాస్పదంగా ఉండటంతో దీనికి కారణం అతడేనేమోననే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అపార్ట్మెంట్లో అన్ని వాహనాలకు సైడ్ స్టాండ్ వేసి ఉండగా మొదటి వాహనం మాత్రం పడిపోయి ఉంది. ఆగంతకుడు ఆ వాహనాన్ని పడగొట్టి అందులోంచి పెట్రోల్ తీసి నిప్పుపెట్టి ఉంటాడని భావిస్తున్నారు. ఈ ఘటనకు పాల్పడింది ఎవరు.. ఉన్మాదంతో చేసిన పనా లేక మరేదైనా కారణం ఉందా అనేది ఇంకా వెల్లడి కాలేదు. రెండో అంతస్తు నుంచి దూకేశాం మేం రెండో అంతస్తులో ఉంటున్నాం. శబ్దాలు, అరుపులు విని నిద్రలేచాం. బయటకొచ్చి చూస్తే పొగ కమ్మేసి ఉంది. మొదటి అంతస్తులోకి వెళ్లగా ఆ ప్రాంతమంతా పొగ కమ్మేయడంతో మెట్లు కనిపించలేదు. దీంతో పైనుంచి కిందకు దూకేశాం. నాకున్న రెండు మోటార్ సైకిళ్లు కాలిపోతుంటే ఒకదానిని పక్కకు లాగాను. అరుునా అది 50 శాతం కాలిపోరుుంది. మంటలను ఆర్పేందుకు నీళ్లు మోసే క్రమంలో కాలు జారి పడిపోయూను. మోచేయి విరిగిపోయింది. ఆపరేషన్ పడుతుందని డాక్టర్లు చెప్పారు. మా పైఅంతస్తులో ఉండే మహిళ కూడా కంగారుతో మొదటి అంతస్తు నుంచి కిందకు దూకేయడంతో ఆమె కాలికి గాయమైంది. పిల్లల మొహాలకు మసిపట్టేసి ఉండటం చూసి భయపడిపోయాం. ఏమైపోతామో అనుకున్నాం. - ఇజ్జురోతు సత్యనారాయణ, అపార్ట్మెంట్ వాసి -
జావా డే
మోటార్ సైకిల్స్.. బైక్స్ ఏ పేరుతో పిలిచినా ఆ పదం యువతలో ఉత్సాహాన్ని ఉరకలెత్తిస్తుంది. వారికి ఎప్పటికీ బోర్ కొట్టనిది ఫ్యాషన్ బైక్ రైడింగ్. నాలుగైదు దశాబ్దాల క్రితం జావా బైక్లదే హవా. అత్యాధునిక, విలాసవంతమైన బైక్లు ఎన్ని మార్కెట్లోకి వచ్చినా తాము యంగ్గా ఉన్నప్పుడు నడిపిన బైక్ను చాలా మంది ఇప్పటికీ వదిలిపెట్టలేదు. జూలై రెండో ఆదివారం ప్రపంచ జావా బైక్ డేను హైదరాబాద్ జావా బైకర్స్ అసోసియేషన్ సభ్యులు దక్కన్ క్లబ్లో ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. 74 మంది జావా ఓనర్లు తమ బైక్లతో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అసోసియేషన్ వ్యవస్థాపకుడు జయ్వీర్రావ్ ‘జావా’తో తనకున్న అనుబంధాన్ని సిటీ ప్లస్తో పంచుకున్నారు. అమీర్పేట్ న్యూ సెయింట్ కాలేజీలో బీఎస్సీ చదివే రోజుల్లో అంటే 1970లో తొలిసారి జావా కొనుక్కున్నా. ఆ రోజుల్లో జావాపై కాలేజీకి వెళ్తుంటే ఆ మజాయే వేరు. చక్కర్లు కొట్టే కొద్దీ దానిపై ఇష్టం మరింత పెరిగేది. అలా 1971,72,74, 96ల్లో నాలుగు బైక్లు కొన్నా. ఇప్పుడు కూడా సిటీలో జావాపై షికారు చేయడం నాకెంతో ఇష్టం. నాతోపాటు జావా బైక్లు కొన్న వారందరినీ ఒకేచోట చేర్చాలనే ఉద్దేశంతో జావా బైక్స్ అసోసియేషన్ స్థాపించా. దాదాపు 500 మందికి పైగా బైక్లు నగరంలో ఉన్నాయి. ప్రతి నెలా రెండో ఆదివారం జావా బైక్లపై నగర శివార్లకు జాయ్రైడ్ వెళ్తాం. 1996 లోనే జావా బైక్ల ఉత్పత్తి ఆగిపోయింది. అప్పట్లో సికింద్రాబాద్లో బైక్ షోరూమ్, రిపేర్ కేంద్రాలుండేవి. ఇప్పుడు బయట మెకానిక్లు ద్వారా బైక్ బాగు చేయిస్తున్నాం. స్పేర్ పార్ట్స్ అవసరమైతే ఇంటర్నెట్, ఫేస్బుక్ల ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న జావా అసోసియేషన్లను అప్రోచ్ అయి సేకరిస్తాం. బెంగళూరు, కూర్గ్ నగరాల్లో జరిగే బైక్ ఉత్సవాలకు కూడా హైదరాబాద్ తరఫున పలుమార్లు హాజరయ్యా. రిచర్డ్రాజు, బాలిపటేల్ నాకు మంచి బైక్ మిత్రులు. 56 ఏళ్ల వయస్సులో నేను బైక్ ఎక్కినా కుర్రవాడినే. నా బైక్ను రూ.3 వేలు పెట్టికొన్నా.. 2స్ట్రోక్ బైక్. ఎల్. సుమన్