Mutation
-
భూమి హక్కులకు ‘కొత్త చట్టం’!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, ఆస్తులపై హక్కులను నమోదు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త చట్టం తీసుకురానుంది. ఈ మేరకు ‘ది తెలంగాణ రికార్డ్ ఆఫ్ రైట్స్–2024’ పేరుతో రూపొందించిన ముసాయిదా బిల్లును ప్రజల ముందుకు తెచ్చింది. భూహక్కుల రికార్డులను ఎప్పటికప్పుడు సవరించడం, ఇప్పటివరకు పాస్బుక్లు రాని భూముల సమస్యలను పరిష్కరించడం, సర్వే చేసి కొత్తగా భూహ క్కుల రికార్డు తయారు చేసుకునే అధికారాన్ని కల్పించడమే ప్రధాన ఉద్దేశాలుగా ఈ చట్టాన్ని రూపొందిస్తున్నట్టు పేర్కొంది.రిజి్రస్టేషన్, మ్యుటేషన్, భూ ఆధార్, ఆబాదీలకు ప్రత్యేక హక్కుల రికార్డు, అప్పీల్, రివిజన్ వంటి సెక్షన్లను ముసాయి దా బిల్లులో ప్రతిపాదించారు. దీనిపై ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకున్నాక.. ప్రత్యేకంగా అసెంబ్లీ ని సమావేశపర్చి బిల్లుకు ఆమోదం తీసుకునే అవ కాశాలు ఉన్నాయని రెవెన్యూ వర్గాలు చెప్తున్నాయి. ⇒ భూమి హక్కుల బదలాయింపు కోసం 18 రకాల పద్ధతులు గుర్తించి.. వాటిలో ఏ రకంగా హక్కుల బదలాయింపు జరిగినా ‘రికార్డ్ ఆఫ్ రైట్స్ (ఆర్వోఆర్)’లో నమోదు చేయాల్సి ఉంటుంది. రిజిస్టర్డ్ దస్తావేజులు, వారసత్వం, భాగ పంపకాల ద్వారా హక్కుల బదలాయింపునకు పాత చట్టంలోని నిబంధనను కొనసాగించారు. ఈ పద్ధతుల్లో తహసీల్దారే రిజి్రస్టేషన్, మ్యుటేషన్ చేస్తారు. అయితే మ్యుటేషన్ చేసే సమయంలో విచారణ జరిపే వెసులుబాటు ఉంటుంది. ⇒ ఆ విచారణలో తప్పులేమైనా గుర్తిస్తే.. ఆయా కారణాలను వివరిస్తూ మ్యుటేషన్ నిలిపేయవచ్చు. ప్రస్తుత చట్టంలో ఈ అవకాశం లేదు. రిజిస్టర్డ్ దస్తావేజులు, భాగ పంపకాలు, వారసత్వ హక్కుల మ్యుటేషన్ను విచారించే అధికారం తహసీల్దార్లకు ఉంటుంది. మిగతా అంశాలకు సంబంధించి ఆర్డీవోకు అధికారం ఉంటుంది. ⇒ రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ చేసేటప్పుడు సర్వే మ్యాప్ తప్పనిసరి చేశారు. రిజిస్ట్రేషన్కు వెళ్లేవారు ఈ మ్యాప్ను తీసుకెళ్లాల్సి ఉంటుంది. భవిష్యత్తు వివాదాలకు చెక్ పెట్టేలా గతంలో లేని ఈ కొత్త నిబంధన తెస్తున్నారు. అయితే ప్రభుత్వం నిర్దేశించిన తేదీ తర్వాత (ఇందుకు అవసరమైన వ్యవస్థను తయారు చేసుకున్నాక) మాత్రమే ఈ మ్యాప్ తప్పనిసరి అవుతుందని బిల్లులో పొందుపరిచారు. ⇒ ఇప్పటికే తీసుకున్న సాదాబైనామా దరఖాస్తులను కొత్త చట్టం కింద చేసుకున్న దరఖాస్తులుగానే పరిగణించాలి. తద్వారా పెండింగ్లో ఉన్న 9.4లక్షల దరఖాస్తులు అలాగే కొనసాగుతాయి. వాటి పరిష్కార సమయంలో స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు కట్టాల్సిన అవసరం లేదు. అయితే కొత్తగా సాదాబైనామాల దరఖాస్తులను తీసుకుని పరిష్కరించే అధికారాన్ని ఈ బిల్లులో పొందుపరిచారు. కొత్త దరఖాస్తుల పరిష్కార సమయంలో మాత్రం స్టాంపు డ్యూటీ, రిజి్రస్టేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. సాదాబైనామాల పరిష్కార అధికారం గతంలో కలెక్టర్లకు ఉండగా.. కొత్త చట్టంలో ఆర్డీవోలకు అధికారాలిచ్చారు. ⇒ ప్రతి భూకమతానికి తాత్కాలిక, శాశ్వత భూదార్ (ప్రత్యేక గుర్తింపు సంఖ్య) ఇవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుత రికార్డులను పరిశీలించి తాత్కాలిక సంఖ్య ఇస్తారు. సర్వే తర్వాత శాశ్వత భూదార్ జారీ చేస్తారు. ఈ భూదార్కు సంబంధించిన మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం రూపొందిస్తుంది. ⇒ కొత్తగా గ్రామీణ ప్రాంత ఇంటి స్థలాలకు (ఆబాదీ) కూడా ప్రత్యేక హక్కుల రికార్డు తయారు చేయాలని బిల్లులో పొందుపరిచారు. భూదార్తోపాటు ఈ ఆబాదీల ఆర్వోఆర్కు అవసరమైన నిధులు కేంద్రం నుంచి తెచ్చుకోవచ్చు. గత చట్టంలో ఆర్వోఆర్ రికార్డుకు, గ్రామ పహాణీకి సంబంధం ఉండేదికాదు. ఈ కొత్త చట్టంలో.. హక్కుల బదలాయింపు జరగ్గానే గ్రామ పహాణీలో ఆ హక్కుల రికార్డును నమోదు చేసేలా నిబంధన విధించారు. ⇒ తహసీల్దార్లు, ఆర్డీవోలు చేసే రిజి్రస్టేషన్లు, మ్యుటేషన్లకు సంబంధించి వివాదాలు వస్తే.. అప్పీల్, రివిజన్కు కొత్త చట్టం అవకాశం ఇవ్వనుంది. కలెక్టర్లు లేదా అడిషనల్ కలెక్టర్లకు అప్పీల్ చేసుకోవచ్చు. తర్వాత సీసీఎల్ఏకు సెకండ్ అప్పీల్ చేసుకోవచ్చు. ఇది పాత చట్టంలో లేదు. ⇒ రివిజన్ మాత్రం రాష్ట్ర ప్రభుత్వం లేదా సీసీఎల్ఏ మాత్రమే చేయాలని బిల్లులో పొందుపరిచారు. గతంలో జాయింట్ కలెక్టర్లకు ఉన్న రివిజన్ అధికారాలను ఇప్పుడు సీసీఎల్ఏకు దఖలు పర్చారు. ఏదైనా రికార్డులో తప్పు జరిగిందని భావిస్తే.. సుమోటోగా తీసుకుని కూడా పరిష్కరించవచ్చు. అయితే అడిషనల్ కలెక్టర్ స్థాయి నుంచి ప్రభుత్వం వరకు అప్పీల్ లేదా రివిజన్లలో ఏ నిర్ణయం తీసుకున్నా లిఖితపూర్వక ఆదేశాలు ఇవ్వడాన్ని తప్పనిసరి చేశారు.2020 చట్టంలో ఈ అంశం లేదని.. కొత్త చట్టం అమల్లోకి వస్తే భూమి హక్కుల రికార్డుల వివాదాలన్నీ అప్పీలు, రివిజన్లతోనే పరిష్కారమవుతాయని రెవెన్యూ వర్గాలు చెప్తున్నాయి. యాజమాన్య హక్కుల వివాదాలు, భాగపంపకాల విషయంలో వివాదాలున్నప్పుడు మాత్రమే కోర్టులకు వెళ్లాల్సి ఉంటుందని, తద్వారా కోర్టులపై భారం తగ్గుతుందని అంటున్నాయి. రూపకల్పన కోసం విస్తృత కసరత్తు ‘రికార్డ్ ఆఫ్ రైట్స్–2024 చట్టం’è ముసాయిదా బిల్లు రూపకల్పన కోసం రెవెన్యూ వర్గాలు విస్తృతస్థాయిలో కసరత్తు చేశాయి. తెలంగాణలో ఇప్పటివరకు అమలైన 1936, 1948, 1971, 2020 నాటి చట్టాలను పరిశీలించి.. వాటి అమలు వల్ల వచి్చన ఫలితాలను బేరీజు వేసి కొత్త చట్టాన్ని రూపొందించారు. తెలంగాణలో ఆర్వోఆర్ చట్టాల అమలు చరిత్ర, ప్రస్తుత సమస్యలు, రాబోయే అవసరాలను అంచనా వేసి 20 సెక్షన్లతో ముసాయిదాను సిద్ధం చేశారు.ఈ క్రమంలో 18 రాష్ట్రాల్లోని ఆర్వోఆర్ చట్టాలను పరిశీలించడంతోపాటు బిహార్లో అమల్లో ఉన్న మ్యుటేషన్ చట్టాన్ని కూడా అధ్యయనం చేశారు. భూములకు ప్రత్యేక గుర్తింపు సంఖ్య (భూదార్), గ్రామీణ ప్రాంత ఆస్తుల రికార్డు తయారు చేయడం ద్వారా.. కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుకు అవసరమైన వెసులుబాటును కలి్పంచనున్నారు. ముసాయిదా రూపకల్పనలో భూచట్టాల నిపుణుడు ఎం.సునీల్కుమార్, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్, సీఎంఆర్వో పీడీ వి.లచి్చరెడ్డి కీలకపాత్ర పోషించారు. ప్రజల సలహాలు, సూచనలకు అవకాశం ఈ ముసాయిదా బిల్లుపై రాష్ట్ర ప్రజల నుంచి సలహాలు, సూచనలు తీసుకుంటామని రెవెన్యూ శాఖ వెల్లడించింది. సీసీఎల్ఏ వెబ్సైట్ ( ccla.telan gana.gov.in ) లో ఈ బిల్లును అందుబాటులో ఉంచుతున్నామని.. ఈ నెల 2వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ప్రభుత్వానికి అభిప్రాయాలు తెలియజేయాలని భూపరిపాలన ప్రధాన కమిషనర్ ఒక ప్రకటనలో కోరారు. ప్రజలు తమ సలహాలు, సూచనలను ror2024-rev@telangana.gov.in కు ఈ–మెయిల్ ద్వారా పంపవచ్చని.. లేదా ల్యాండ్ లీగల్ సెల్, సీసీఎల్ఏ కార్యాలయం, నాంపల్లి స్టేషన్రోడ్, అన్నపూర్ణ హోటల్ ఎదురుగా, అబిడ్స్, హైదరాబాద్–500001కు పోస్టు ద్వారా పంపవచ్చని వెల్లడించారు. -
పసిపిల్లలను నిద్రలోనే బలితీసుకుంటున్న ఎస్యూడీసీ!
అడుతూ పాడుతూ తిరుగుతున్న బిడ్డ ఉన్నట్టుండి కుప్పకూలిపోతే.. గాయం, వ్యాధి, ఆరోగ్య సమస్యలేవీ లేకున్నా కళ్లు మూస్తే? ఆ విషాదాన్ని వర్ణించడం కష్టం. తల్లిదండ్రులు ఎవరైనా ఆ నష్టాన్ని దిగమింగుకోలేరు కూడా. అయితే దురదృష్టకరమైన విషయం ఏమిటంటే... ప్రపంచవ్యాప్తంగా ఏటా ఇలాంటి ఘటనలు కొన్ని చోటు చేసుకుంటూండటం. సౌత్ ఇంగ్లాండ్లోని బాన్బరీలో ఇటీవలే 13 ఏళ్ల బాలుడు ఒకరు ఇలా ఆకస్మికంగా కుప్పకూలిపోయాడు. తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయాడు. ఎందుకిలా జరుగుతుంది? కారణాలేమిటి? నివారించే అవకాశం ఏదైనా ఉందా? ఊహూ... ప్రస్తుతానికి ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం నో అనే చెప్పాలి. సడన్ అన్ఎక్స్ప్లెయిన్డ్ డెత్ ఇన్ ఛైల్డ్హుడ్ (ఎస్యూడీసీ) అని పిలుస్తారు దీన్ని. పుట్టిన బిడ్డ మొదలుకొని 18 ఏళ్ల వయసు వారి వరకూ ఎవరికైనా ఎదురు కావచ్చు ఇలాంటి దుర్మరణం. బాన్బరీలో జరిగిన ఘటననే ఉదాహరణగా తీసుకుంటే...13 ఏళ్ల మాథ్యూ కౌలీ ముందురోజు రాత్రి... స్నేహితులతో వీడియో గేమ్ ఆడుకుని హాయిగా నిద్రపోయాడు. అలాగే శాశ్వతనిద్రలోకి జారుకున్నాడు. ఈ ఆకస్మిక మరణం అనేక ప్రశ్నల్ని లేవనెత్తింది. వైద్య పరీక్షల్లో, పోస్ట్మార్టంలోనూ మరణానికి కారణమేమిటన్నది స్పష్టం కాలేదు. ఎస్యూడీసీ అంటే... వైద్యుల అభిప్రాయం ప్రకారం, సడన్ అన్ ఎక్స్ప్లెయిన్డ్ డెత్ ఇన్ చైల్డ్ హుడ్ (SUDC) అంటారు. అకారణంగా ఆరోగ్యకరమైన పిల్లవాడు ఆకస్మికంగా ప్రాణాలు కోల్పోవడం. 2021 నాటి లెక్కల ప్రకారం ఒక్క అమెరికాలోనే దాదాపు 450 మంది ఎస్యూడీసీ బారిన పడ్డారు. ప్రపంచ వ్యాప్తంగానూ ఏటా 40 - 50 మంది పిల్లలు ప్రాణాలు కోల్పోతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. న్యూయార్క్ యూనివర్శిటీ గ్రాస్మన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్లోని వైద్యులు రిచర్డ్ ట్సీన్, ఓరిన్ డెవిన్స్కీ నేతృత్వంలో ఎస్యూడీసీకి కారణాలు తెలుసుకునేందుకు ఒక పరిశోధన జరిగింది కానీ ఫలితాలు మాత్రం అంత ఆశాజనకంగా ఏమీ లేవు. సుమారు 124 మంది ఎస్యూడీసీ బాధితుల శరీరాల నుంచి వారి తల్లిదండ్రుల నుంచి శాంపిల్స్ సేకరించి పరీక్షలు నిర్వహించారు. వీటిల్లో అనూహ్యంగా జరిగిన జన్యుపరమైన మార్పులు (ఉత్పరివర్తనాలు ఇంగ్లీషులో మ్యూటేషన్స్)లను గుర్తించారు. బాధితుల డీఎన్ఏలోని జన్యుపరమైన మార్పులు తల్లిదండ్రుల నుంచి సంక్రమించినవి కాకపోవడం గమనార్హం. ఇలా తల్లిదండ్రుల నుంచి కాకుండా స్వతంత్రంగా జరిగే జన్యుమార్పులను డీనోవో ఉత్పరివర్తనాలని పిలుస్తారు. డీనోవో ఉత్పరివర్తనాల విషయం ఇలా ఉంటే తల్లిదండ్రుల్లో ఉన్న కొన్ని ప్రమాదకరమైన జన్యు ఉత్పరివర్తనాల్లో 80 శాతం పిల్లలకూ సంక్రమించాయి. మొత్తం జన్యుమార్పుల్లో 11 ఉత్పరివర్తనాలు ఆరోగ్య సమస్యలకు కారణమవుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు. ఈ మార్పులు వందలో తొమ్మిది మంది మరణానికి కారణం కావచ్చునని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. కాల్షియం సిగ్నలింగ్లో మార్పు SUDCలో ముఖ్యమైన పాత్ర పోషిస్తోందని జన్యుపరమైన ప్రమాద కారకాలను పెంచుతుందని పరిశోధనల ఫలితాలు సూచిస్తున్నాయి. -
చిటికెలో ‘మ్యుటేషన్’
సాక్షి, అమరావతి: కృష్ణా జిల్లా మచిలీపట్నం మండలం అరిశేపల్లి గ్రామానికి చెందిన నంద్యాల తేజస్ ఒక ఎకరం పొలాన్ని కొనుగోలు చేశారు. బందరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లి తన పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. రిజిస్ట్రేషన్ జరిగిన వెంటనే రెవెన్యూ రికార్డుల్లో ఆయన పేరు నమోదైంది. ఒకే రోజు రిజిస్ట్రేషన్తో పాటు ఆటోమెటిక్గా మ్యుటేషన్ కూడా జరిగిపోయింది. సరళంగా ప్రక్రియ ఆస్తి ఒకరి పేరు మీద నుంచి మరొకరి పేరిట మారాలంటే కొద్ది రోజుల క్రితం వరకు పెద్ద ప్రహసనమే. తహశీల్దార్ కార్యాలయం చుట్టూ రోజుల తరబడి తిరిగినా మ్యుటేషన్ జరగక కొనుగోలుదారులు అవస్థలు పడాల్సి వచ్చేది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముందుచూపుతో ప్రవేశపెట్టిన విధానాలు, రెవెన్యూ సంస్కరణల ఫలితంగా ఇప్పుడు చాలా తేలిగ్గా ఆటో మ్యుటేషన్ జరిగిపోతోంది. వ్యవస్థలు వాటి పని అవి చేసుకుంటూ వెళుతున్నాయి. రిజిస్ట్రేషన్ జరిగిన వెంటనే ఆటోమేటిక్గా వెబ్ల్యాండ్లో యాజమాన్య హక్కుల బదలాయింపు జరుగుతోంది. ఎక్కడికి తిరగాల్సిన పనిలేకుండా ప్రభుత్వం కొత్తగా అమలు చేస్తున్న కార్డ్ ప్రైమ్ రిజిస్ట్రేషన్ల విధానంలో మ్యుటేషన్ ప్రక్రియ అత్యంత సరళంగా ముగుస్తోంది. ఎన్టీఆర్ జిల్లా నందిగామ, కృష్ణా జిల్లా మచిలీపట్నంలో రిజిస్ట్రేషన్లు, ఆటో మ్యుటేషన్ల తీరును ‘సాక్షి’ ప్రతినిధి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పూర్తయ్యేదాకా ఉత్కంఠే! స్థిరాస్థుల క్రయవిక్రయాలు జరిగిన తర్వాత వాటిని తమ పేరు మీదకు మార్చుకోవడం ఇన్నాళ్లూ క్లిష్టతరంగా ఉండేది. రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత మళ్లీ మ్యుటేషన్ కోసం రెవెన్యూ శాఖకు దరఖాస్తు చేసుకోవడం, ఆ ప్రక్రియ పూర్తయ్యేందుకు కొంత సమయం పట్టడంతో కొనుగోలుదారులకు కునుకు పట్టేది కాదు. ఆస్తిని రిజిష్టర్ చేసేది రిజిస్ట్రేషన్ శాఖ అయితే దాన్ని రెవెన్యూ రికార్డుల్లో అప్డేట్ చేసేది రెవెన్యూ శాఖ. రెండు శాఖల మధ్య సమన్వయం లేకపోవడం, ఏళ్ల తరబడి అదే విధానం కొనసాగడంతో రిజిస్ట్రేషన్ పూర్తయినా మ్యుటేషన్ కోసం నిరీక్షణ తప్పని పరిస్థితి. కొన్ని సందర్భాల్లో రిజిస్టర్ అయిన ఆస్తికి సంబంధించి వివాదాలు తలెత్తడంతో మ్యుటేషన్ జరిగేది కాదు. అవతవకలకు ఆస్కారం ఉండేది. సంక్లిష్టంగా ఉన్న మ్యుటేషన్ల విధానాన్ని సీఎం జగన్ ప్రభుత్వం సరళంగా మార్చింది. ఎంతోకాలం నుంచి కాగితాలకే పరిమితమైన ఆటో మ్యుటేషన్ ప్రతిపాదనను వాస్తవ రూపంలోకి తెచ్చి ప్రజల అవస్థలను తొలగించింది. రిజిస్ట్రేషన్ల శాఖకు వెబ్ల్యాండ్ అనుసంధానం నూతన విధానంలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ సాఫ్ట్వేర్ను, రెవెన్యూ శాఖ వెబ్ల్యాండ్ సాఫ్ట్వేర్ను అనుసంధానం చేశారు. దానికి ముందు రిజిస్ట్రేషన్ల శాఖ సాఫ్ట్వేర్ కార్డ్ స్థానంలో కార్డ్ ప్రైమ్ను ప్రవేశపెట్టారు. ఆటో మ్యుటేషన్తోపాటు ఆన్లైన్లోనే డాక్యుమెంట్ తయారు చేసుకోవడం, సర్వే నెంబర్ ఎంటర్ చేయగానే మార్కెట్ విలువ కనిపించడం, అందుకు తగ్గట్టుగా ఆన్లైన్లోనే చలానాలు కట్టడం, అనంతరం రిజిస్ట్రేషన్ కోసం స్లాట్ బుక్ చేసుకోవడం కార్డ్ ప్రైమ్ విధానంలో కొత్తగా అందుబాటులోకి వచ్చాయి. నిర్దేశించిన స్లాట్ ప్రకారం రిజిస్టార్ ఆఫీసు లేదంటే గ్రామ, వార్డు సచివాలయానికి వెళితే అక్కడ కొత్త విధానంలో వెంటనే రిజిస్ట్రేషన్తోపాటు ఆ వివరాల ప్రకారం ఆటోమేటిక్గా మ్యుటేషన్ జరిగిపోతోంది. మళ్లీ మ్యుటేషన్ కోసం ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవడం, రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. రిజిస్ట్రేషన్ చేసే సమయంలోనే అన్నింటినీ పక్కాగా నిర్థారిస్తారు. సబ్ రిజి్రస్టార్లు రెవెన్యూ రికార్డులను పూర్తిగా పరిశీలించి రిజిస్ట్రేషన్కు అనుమతిస్తారు. రిజిస్ట్రేషన్ జరగగానే రెవెన్యూ రికార్డుల్లో యాజమాన్య హక్కు దానంతట అదే మారిపోతుంది. త్వరలో అర్బన్ ప్రాంతాల్లోనూ కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో మూడు నెలల క్రితం నూతన విధానాన్ని ప్రయోగాత్మకంగా పరిశీలించారు. ప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు, గ్రామ, వార్డు సచివాలయాల్లో కొత్త విధానంలోనే రిజిస్ట్రేషన్లతోపాటు ఆటో మ్యుటేషన్లు జరుగుతున్నాయి. కొత్త విధానం వచ్చాక 26 జిల్లాల్లో ఇప్పటివరకు 7 వేలకుపైగా ఆటో మ్యుటేషన్లు జరిగాయి. వ్యవసాయ భూములకు సంబంధించి అమలవుతున్న ఆటో మ్యుటేషన్ విధానాన్ని త్వరలో అర్బన్ ప్రాంతాల్లోనూ అమలు చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. నగరాలు, పట్టణాల్లో ఆస్తుల రికార్డులు మున్సిపల్ శాఖ నిర్వహిస్తుండడంతో రిజిస్ట్రేషన్ల శాఖ అందుబాటులోకి తెచ్చిన కార్డ్ ప్రైమ్ సాఫ్ట్వేర్ను దానికి అనుసంధానించాల్సి ఉంది. ఇప్పటికే రిజిస్ట్రేషన్ల శాఖ అందుకు సిద్ధమవగా మున్సిపల్ శాఖ కసరత్తు చేస్తోంది. సులభతరం రిజిస్ట్రేషన్ సేవలతోపాటు మ్యుటేషన్ విధానాన్ని సులభతరం చేశాం. కార్డ్ ప్రైమ్ విధానంలో ఆటో మ్యుటేషన్ వెంటనే జరిగిపోతోంది. ఇందుకోసం రెవెన్యూ, రిజిస్ట్రేషన్ల శాఖల సాఫ్ట్వేర్లను పూర్తిగా మార్చాం. ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు కొత్త విధానాన్ని అమలు చేస్తున్నాం. రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ భూములకు ఆటో మ్యుటేషన్లు జరుగుతున్నాయి. మరికొద్ది రోజుల్లో అర్బన్ ఆస్తులకూ ఇదే విధానాన్ని తెచ్చే ప్రయత్నం జరుగుతోంది. రిజిస్ట్రేషన్ల విధానం, ఆటో మ్యుటేషన్ చాలా బాగా అమలవుతోంది. దుష్ప్రచారాలను నమ్మవద్దు. – వి రామకృష్ణ, కమిషనర్ అండ్ ఐజీ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ వెంటనే ఆన్లైన్లో.. మా గ్రామ సమీపంలో రెండు ఎకరాల వ్యవసాయ భూమిని కొనుగోలు చేశా. నందిగామ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ అరగంటలోనే పూర్తయింది. ఆ తర్వాత వెంటనే నా పేరు మీద ఆన్లైన్లో కూడా మారింది. ఇంతకుముందు ఆన్లైన్లో పేరు చేర్చాలంటే రిజిస్ట్రేషన్ పత్రాలతో ఎమ్మార్వో ఆఫీసు చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఇప్పుడు వెంటనే మ్యుటేషన్ జరగడం బాగుంది. – నల్లపోతుల నాగరాజు, నందిగామ మండలం, రాఘవాపురం తిరిగే తిప్పలు లేవు.. నా పేరుతో ఉన్న 33 సెంట్ల భూమిని నా కుమార్తె వెంకటేశ్వరమ్మ పేరిట రాశాను. రిజిస్ట్రేషన్ జరిగిన రోజే ఆమె పేరిట భూమి మారిపోయింది. ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన బాధ లేకుండా వెంటనే పని పూర్తయింది. – చల్లా ఆంజనేయులు, కొండూరు, నందిగామ మండలం. -
ఒరిజినల్ డాక్యుమెంట్లు తనిఖీ చేశాకే మ్యుటేషన్లు
సాక్షి, అమరావతి: మ్యుటేషన్లకు సంబంధించి ప్రభుత్వం కీలకమైన ఆదేశాలు జారీ చేసింది. భూములకు సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్లను తనిఖీ చేశాకే మ్యుటేషన్లు చేయాలని రెవెన్యూ యంత్రాంగాన్ని ఆదేశించింది. జిరాక్స్, ట్రూ కాపీలు, ఇతర అనధికారిక పత్రాల ఆధారంగా మ్యుటేషన్లు చేయవద్దని స్పష్టం చేసింది. వీటివల్ల వివాదాలు ఏర్పడుతున్న నేపథ్యంలో ఈ ఆదేశాలిచ్చింది. ఒరిజినల్ డాక్యుమెంట్లను తహసీల్దార్లు ధృవీకరించాలని చెప్పింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్లు, రెవెన్యూ యంత్రాంగానికి భూ పరిపాలన ప్రధాన కమిషనర్, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. సాయిప్రసాద్ సర్క్యులర్ జారీ చేశారు. తహశీల్దార్లు ప్రతి మ్యుటేషన్కు తప్పనిసరిగా సేల్ డీడ్ వంటి ఒరిజినల్ డాక్యుమెంట్లు, వాటి ఒరిజినల్ లింకు డాక్యుమెంట్లు, ఒరిజినల్ ఈసీతోపాటు దానికి సంబంధించిన ఇతర అధికారిక పత్రాలను పరిశీలించాలని స్పష్టం చేశారు. ఒరిజినల్ డాక్యుమెంట్లను పరిశీలించినట్లు తహసీల్దార్ ఆన్లైన్లో ధృవీకరించాలని (సర్టిఫై చేయాలి) ఆదేశించారు. రిజిస్ట్రేషన్ శాఖ సర్వర్ నుంచి ఆన్లైన్లో చూసే డాక్యుమెంట్లు తప్ప ఇతర ఏ సందర్భంలోనైనా ఈ విధానం పాటించాల్సిందేనని చెప్పారు. ఇండియన్ ఎవిడెన్స్ చట్టం ప్రకారం ఒరిజినల్ డాక్యుమెంట్లని ధృవీకరించకుండా చేసిన ఎలాంటి మ్యుటేషన్ లేదా ఆర్డర్ ఆమోదయోగ్యం కాదని తెలిపారు. రాష్ట్రంలో పలుచోట్ల తహశీల్దార్లు ఫొటో కాపీల ఆధారంగా మ్యుటేషన్లు చేయడం, అసలైన యజమానులు ఫిర్యాదుతో అవి సరైన పత్రాలు కావని నిర్థారణ అయిన నేపథ్యంలో హైకోర్టు సీరియస్గా స్పందించింది. దీంతో సీసీఎల్ఏ ఈ ఆదేశాలు జారీ చేశారు. రెవెన్యూ శాఖలోని చివరి వ్యక్తి నుంచి అన్ని స్థాయిల్లో ఈ నిబంధనలు పాటించాలని, దీనికి విరుద్ధంగా ఎవరైనా ఫొటో కాపీలు చూసి మ్యుటేషన్లు చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. యాక్ట్ 15 ఆఫ్ 2022 ప్రకారం క్రిమినల్ లా కింద ఎవరైనా ఆర్ఓఆర్ చట్టానికి విరుద్ధంగా ఆర్డర్లు ఇస్తే వారిని జిల్లా కలెక్టర్లు విచారించే అధికారం ఉందని తెలిపారు. -
ముగింపు దశకు కరోనా! అయినా నిర్లక్ష్యం వద్దు.. బూస్టర్ డోసు తీసుకోవాల్సిందే
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న తరుణంలో ఈసీఎంఆర్ మాజీ సైంటిస్ట్ డాక్టర్ రమన్ గంగాఖేడ్కర్ కీలక విషయాలు వెల్లడించారు. కరోనా వైరస్ ముగింపు దశకు చేరుకుందని, ప్రజలు తీవ్ర భయాందోళనకు గురికావాల్సిన అవసరంలేదని చెప్పారు. అయితే వైరస్ను నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తలు మాత్రం పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. కరోనా వైరస్ వివిధ రకాలుగా రూపాంతరం చెంది(మ్యుటేషన్లు) బలహీన పడుతోందని డా.గంగాఖేడ్కర్ పేర్కొన్నారు. ఇప్పుడు వైరస్ సోకిన వారికి స్వల్ప లక్షణాలే కన్పిస్తున్నాయని, తీవ్ర అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చేరాల్సిన సందర్భాలు చాలా తక్కువగా ఉంటున్నాయని చెప్పారు. ఇంకా కొన్ని మ్యూటేషన్ల అనంతరం కరోనా పూర్తిగా కనుమరుగయ్యే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఎక్స్బీబీ.1.16 వేరియంట్పై ఈ ఏడాది జనవరిలో తొలిసారి వెలుగుచూసిన ఎక్స్బీబీ.1.16 వేరియంట్ కూడా అంత ప్రమాదకరం కాదని డా.గంగాఖేడ్కర్ పేర్కొన్నారు. గత మూడు నెలల్లో దేశంలో కరోనా కేసులు ఆందోళనకర స్థాయిలో నమోదుకాకపోవడమే ఇందుకు నిదర్శనం అన్నారు. 'XBB.1.16 అనేది రీకాంబినెంట్ వైరస్. ఇది మానవ శరీరంలో అనుకోకుండా తయారవుతుంది. రెండు వేర్వేరు వేరియంట్లు మానవ శరీరంలోకి ప్రవేశించినప్పుడు, పునరుత్పత్తి సమయంలో జన్యు పదార్ధం మిక్స్అప్ అయినప్పుడు అవి తయారవుతాయి.' అని ఆయన వివరించారు. బూస్టర్ డోసులు, మాస్కులు దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నందున ఇంకా బూస్టర్ డోసు టీకా తీసుకోని వారు, ఆలస్యం చేసిన వారు ఎవరైనా ఉంటే వెంటనే తీసుకోవాలని డాక్టర్ సూచించారు. అలాగే ప్రజలు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని చెప్పారు. పిల్లలు అనారోగ్యానికి గురైతే వాళ్లను స్కూళ్లకు అసలు పంపవద్దని తల్లిదండ్రులకు సూచించారు. ఒకవేళ వారికి సోకింది కరోనా అయితే అది ఇతర విద్యార్థులకు, టీచర్లకు, సిబ్బంది సోకి మరింత మందికి వ్యాప్తి చెందుతుందని హెచ్చరించారు. చదవండి: మాక్డ్రిల్తో అప్రమత్తమైన భారత్.. కొత్తగా 5,676 కేసులు, 15 మరణాలు -
యూజర్ ఫ్రెండ్లీ అంటూ గొప్పలు.. ప్రజలకు తప్పని తిప్పలు
సాక్షి, హైదరాబాద్: కాగిత రహిత పాలనలో తమను మించిన వారు లేరని, అన్నీ ఆన్లైన్లోనే నిర్వహిస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న జీహెచ్ఎంసీ పరిస్థితి పైన పటారం.. లోన లొటారంలా మారింది. అన్నీ ఆన్లైన్ ద్వారానే అని చెబుతున్నప్పటికీ.. సవ్యంగా పనిచేయాల్సిన జీహెచ్ఎంసీ సర్వరే మొరాయిస్తుండటంతో వివిధ పనులు అవసరమైన వారు పడరాని పాట్లు పడుతున్నారు. జీహెచ్ఎంసీలోని వివిధ సేవలకు సంబంధించి ఇదివరకు ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో సదుపాయం ఉండేది. అంతేకాకుండా జీహెచ్ఎంసీ కార్యాలయాల్లోని సిటిజెన్ సర్వీస్ సెంటర్ల ద్వారా మ్యుటేషన్లు, బర్త్ సర్టిఫికెట్లు, ట్రేడ్లైసెన్సుల వంటి సేవలందేవి. ఇటీవలి కాలంలో ప్రజలు నేరుగా ఆన్లైన్ ద్వారా లేదా మీసేవా కేంద్రాల ద్వారా మాత్రమే సదరు సేవలు వినియోగించుకునేలా చేశారు. జీహెచ్ఎంసీలో వేళ్లూనుకుపోయిన అవినీతిని అరికట్టేందుకు అధికారులను కలిసే పనే లేకుండా యూజర్ఫ్రెండ్లీగా ఆన్లైన్ ద్వారానే ఈ సదుపాయాలు కల్పించినట్లు ప్రకటించారు. అంతవరకు బాగానే ఉంది కానీ, ఇంతకీ ప్రజలకు అంతరాయాల్లేకుండా సేవలందుతున్నాయా.. సాంకేతికంగా ఇబ్బందులెదురవుతున్నాయా ? వంటి విషయాలను మాత్రం ఉన్నతాధికారులు పట్టించుకోలేదు. దాంతో తరచూ సాంకేతిక సమస్యలతో పనులు కావడం లేదని ప్రజలు వాపోతున్నారు. మీసేవా కేంద్రాల ద్వారా సైతం అదే పరిస్థితని చెబుతున్నారు. కొత్త మ్యుటేషన్లు ఆటోమేటిక్గా జరుగుతున్నప్పటికీ, పాతవాటికి సంబంధించి ఇబ్బందులెదురవుతున్నాయి. జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు పొందాలనుకునేవారికీ ఇదే పరిస్థితి. ఇక టౌన్ప్లానింగ్లో అన్నీ ఆన్లైనే అని చెబుతున్నప్పటికీ, అధికారులను మచ్చిక చేసుకోకపోతే పనులు కావడం లేదనే ఆరోపణలున్నాయి. కొత్తగా ఇల్లు కుట్టుకున్న వారి ఆస్తిపన్నుకు సంబంధించిన సెల్ఫ్ అసెస్మెంట్ నుంచి దుకాణదారుల ట్రేడ్లైసెన్సుల వరకు అన్నీ ఆన్లైన్లోనే సదుపాయం కల్పించినప్పటికీ, తలెత్తుతున్న ఇబ్బందులు, ప్రజల ఫీడ్బ్యాక్ను తెలుసుకొని, ఎప్పటికప్పుడు పరిష్కరిస్తే సమస్యలుండవని హిమాయత్నగర్కు చెందిన రాకేశ్ అభిప్రాయపడ్డారు. మరోవైపు, ఉన్నతాధికారులు చేపట్టిన ‘ఆన్లైన్ మంత్ర’ వల్ల తమకు రావాల్సిన పై ఆదాయం రానందున జీహెచ్ఎంసీలోని కొందరు ఉద్యోగులే సమస్యలు సృష్టిస్తున్నారనే అనుమానాలు సైతం ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ, సదుపాయాలు అందుబాటులోకి తెచ్చిన యంత్రాంగం వినియోగం సైతం పరిశీలించి ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. (క్లిక్: హైదరాబాద్లో బోనాల జాతర.. తేదీలు ఖరారు) ఆన్లైన్ సేవలు.. ► సెల్ఫ్ అసెస్మెంట్స్ ► మ్యుటేషన్స్ ► బర్త్, డెత్ సర్టిఫికెట్ల జారీ ► ట్రేడ్ లైసెన్స్ నెలల తరబడి తిప్పుకుంటున్నారు రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడే మ్యుటేషన్ జరుగు తుందని చెబుతున్నప్పటికీ అమలు కావడం లేదు. సర్వర్డౌన్ పేరిట నెలల తరబడి తిప్ప డం సమంజసం కాదు. లోపాలెక్కడున్నాయో పరిశీలించి ఉన్నతాధికారులు తగిన చర్యలు తీసుకుని ప్రజల ఇబ్బందులు తొలగించాలి. – లక్ష్మణ్, ఉప్పల్ -
దారికొచ్చిన ‘ధరణి’..! వెబ్సైట్లో కొత్త ఆప్షన్లు
మోర్తాడ్ బాల్కొండ/నిజామాబాద్: వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్, తక్షణ మ్యుటేషన్ కోసం రూపొందించిన ధరణి వెబ్సైట్లో కొత్త ఆప్షన్లను ఇచ్చారు. ఫలితంగా కొంత కాలంగా పరిష్కారం కాని అనేక సమస్యలకు దారి చూపడానికి అవకాశం ఏర్పడిందని అధికార యంత్రాంగం చెబుతుంది. ధరణి వెబ్సైట్ అందుబాటులోకి వచ్చి ఏడాదిన్నర కాలం అవుతుంది. కొన్ని ఆప్షన్లను ఇవ్వడంతో కేవలం డిజిటల్ పట్టా పాసు పుస్తకం ఉండి ఎలాంటి తప్పు లు లేని భూమి పట్టా మార్పిడి మాత్రమే జరిగింది. చదవండి👉 Teenmar Mallanna: బీజేపీకి తీన్మార్ మల్లన్న గుడ్ పార్ట్–బీలో ఉన్న భూముల సమస్యలను పరిష్కరించి పట్టా పాసు పుస్తకాలను జారీ చేయడం, పట్టా మార్పిడి చేయడం వీలు పడలేదు. కొన్ని ఆప్షన్లు ఇచ్చి ప్రధాన ఆప్షన్లను ఇవ్వకపోవడంతో భూముల పట్టా మార్పిడి జరగకపోవడం, వివాదాలు పరిష్కారం కాకుండా ఉండిపోయాయి. ధరణిలో తాజాగా పాస్ బుక్కులలో పేర్ల మార్పు, భూమి స్వభావం, వర్గీకరణ, భూమి రకం, విస్తీర్ణం లెక్కలను సరి చేయడం, మిస్సింగ్ సర్వే నంబర్లను గుర్తించి వాటిని ఎక్కించడం, సబ్ డివిజన్ల చేర్పు, నేషనల్ ఖాతా నుంచి పట్టా భూమి మార్పు, భూమి అనుభవంలో మార్పులకు అవకాశం ఏర్పడింది. ఇలా పలురకాల ఆప్షన్లను ఇవ్వడంతో అనేక సమస్యలను త్వరితగతిన పరిష్కరించడానికి మా ర్గం సుగమమైందని తహసీల్దార్లు చెబుతున్నారు. చదవండి👉🏻 దయాకర్కు నోటీసులు.. మదన్మోహన్కు హెచ్చరిక కొత్త ఆప్షన్లను పరిశీలిస్తున్నాం ధరణిలో ఇచ్చిన కొత్త ఆప్షన్లను పరిశీలిస్తున్నాం. గతంలో పెండింగ్లో ఉన్న సమస్యలను ఎంత మేరకు పరిష్కరించవచ్చో క్షుణ్ణంగా పరిశీలించి చర్యలు తీసుకుంటాం. కొత్త ఆప్షన్లతో ప్రధాన సమస్యలు పరిష్కారం అవుతాయని ఆశిస్తున్నాం. – శ్రీధర్, తహసీల్దార్, మోర్తాడ్ -
Sakshi Cartoon: ఎలుకల నుండి మానవుల్లోకి ఒమిక్రాన్
ఎలుకల నుండి మానవుల్లోకి ఒమిక్రాన్ -
ఏపీ ప్రభుత్వం నూతన మార్గదర్శకాలు.. ఇక సులభంగా మ్యుటేషన్లు
సాక్షి, అమరావతి: భూ యాజమాన్య హక్కులకు సంబంధించి మ్యుటేషన్ల ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు ప్రభుత్వం నూతన మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ మేరకు పలు అంశాలపై కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, రెవెన్యూ అధికారులకు స్పష్టతనిస్తూ భూపరిపాలన ప్రధాన కమిషనర్(సీసీఎల్ఏ) సాయిప్రసాద్ ఆదేశాలు ఇచ్చారు. ముందే సబ్ డివిజన్ తప్పనిసరి మ్యుటేషన్కు దరఖాస్తు చేసుకున్న వారు దానికి ముందే సర్వే నెంబర్ను సబ్ డివిజన్ చేసుకోవడాన్ని తప్పనిసరి చేశారు. సబ్ డివిజన్ ప్రక్రియ పూర్తై రికార్డుల్లో సర్వే నెంబర్లు, పేర్లన్నీ ఆ ప్రకారం ఉన్నట్లు నిర్థారించుకున్న తర్వాతే మ్యుటేషన్ ప్రక్రియ ప్రారంభించాలని తహశీల్దార్లకు సూచించారు. పాస్బుక్ల జారీ కూడా మ్యుటేషన్ సమయంలోనే పూర్తి చేయాలని పేర్కొన్నారు. మ్యుటేషన్తోపాటు పాస్బుక్ కోసం దరఖాస్తు స్వీకరించి రెండింటినీ ఒకేసారి పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ భూములపై.. ప్రభుత్వ భూములను ఎట్టి పరిస్థితుల్లోనూ మ్యుటేషన్ చేయరాదని సూచించారు. కొన్ని ప్రత్యేక కేసుల్లో చేయాల్సి వచ్చినప్పుడు ఆ బాధ్యతను పూర్తిగా జాయింట్ కలెక్టర్లకు అప్పగించారు. అది కూడా కలెక్టర్ల నుంచి వచ్చిన ఫైలు ఆధారంగా చేయాలని స్పష్టం చేశారు. ఇప్పటివరకు తహశీల్దార్లకు ఉన్న ఈ అధికారాన్ని జేసీలకు బదలాయించారు. వారసత్వ వివాదాలకు సంబంధించి మ్యుటేషన్ల విషయంలో ఫ్యామిలీ సర్టిఫికెట్ను తహశీల్దార్ అదే సమయంలో ఇవ్వాలని నిర్దేశించారు. మ్యుటేషన్ చేసుకునే సమయంలోనే ఫ్యామిలీ సర్టిఫికెట్ను దరఖాస్తుదారుడు ఇచ్చినప్పుడు మళ్లీ ఆ కుటుంబం గురించి విచారణ చేయాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. చుక్కల భూములు, అసైన్డ్ మ్యుటేషన్పై స్పష్టత చుక్కల భూముల చట్టం వచ్చే నాటికి 12 సంవత్సరాలు దాటి సంబంధిత భూములు దరఖాస్తు చేసుకున్న వారి స్వాధీనంలోనే ఉన్నట్లు రికార్డుల ప్రకారం నిర్థారణ అయితే వాటికి మ్యుటేషన్ చేయవచ్చని సూచించారు. తీర్పులు వెలువడిన కేసులు, కోర్టు ద్వారా వేలం పాట నిర్వహించిన ఆస్తులను కొనుగోలు చేసిన వారికి వెంటనే యాజమాన్య హక్కులు కల్పించాలని కలెక్టర్లను ఆదేశించారు. అసైన్డ్ భూములకు సంబంధించి రికార్డుల్లో ఉన్న వ్యక్తులే మ్యుటేషన్కు దరఖాస్తు చేసుకుంటే చేయాలని, మూడో వ్యక్తి ఎవరైనా దరఖాస్తు చేస్తే తిరస్కరించాలని స్పష్టం చేశారు. భూముల రీ సర్వే పూర్తయిన చోట సర్వే పూర్తయినట్లు జారీ చేసే 13 నోటిఫికేషన్ ఇవ్వడానికి ముందే అప్పటివరకు ఉన్న మ్యుటేషన్ దరఖాస్తులను క్లియర్ చేయాలని నిర్దేశించారు. మ్యుటేషన్ దరఖాస్తులను చిన్న కారణాలతో తిరస్కరించకూడదని, ఎందుకు తిరస్కరించారో స్పష్టమైన కారణాలు చూపాలని, ఇంకా ఏ డాక్యుమెంట్లు కావాలో స్పష్టంగా పేర్కొనాలని సూచించారు. మ్యుటేషన్ కోసం వచ్చే దరఖాస్తుల్లో 45 శాతం తిరస్కారానికి గురవుతుండడంతో పలు అంశాలపై స్పష్టత ఇస్తూ ప్రభుత్వం ఈ మార్గదర్శకాలు జారీ చేసింది. -
కరోనా కొత్త మ్యూటెంట్.. ప్రకటించిన డబ్ల్యూహెచ్వో
New Covid Variant XE: ఒక వేవ్ ముగిసిందని, ఒక వేరియెంట్ ప్రభావం తగ్గిపోయిందని అనుకునేలోపు.. కొత్త వేరియెంట్, మ్యూటెంట్ తెర మీదకు వస్తోంది. తాజాగా కొత్తగా బయట పడిన కరోనా మ్యూటెంట్ పేరు చెప్పేసింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. ‘ఎక్స్ఈ’ గా పిలిచే ఈ కరోనా మ్యూటెంట్ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించింది. కొవిడ్-19 ఎక్స్ఈ Covid-19 XE.. మరింత వేగంగా వ్యాపించే గుణం ఉందని డబ్ల్యూహెచ్వో ప్రకటించింది. ఒమిక్రాన్ వేరియెంట్లో ఉప రకమైన బీఏ.2 (స్టెల్త్ కరోనా)ను ఇప్పటి వరకు అత్యంత వేగంగా వ్యాపించే వేరియంట్ గా భావిస్తున్నారు. అయితే.. స్టెల్త్ కరోనాతో పోలిస్తే ఎక్స్ఈ రకానికి 10 శాతం ఎక్కువ వేగంతో వ్యాపించే గుణం ఉందని గుర్తించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తన ఎపిడెమియోలాజికల్ నివేదికలో పేర్కొంది. ఇప్పటికీ ఒమిక్రాన్ ఉపకరం బీఏ.2 పలు దేశాల్లో విస్తరిస్తూనే ఉంది. అమెరికాలో కొత్తగా వెలుగు చూస్తున్న కేసుల్లో అత్యధికం ఈ రకానివే ఉంటున్నాయి. కానీ, ఎక్స్ఈ అన్నది రెండు రకాల హైబ్రిడ్ వెర్షన్. ఒమిక్రాన్ బీఏ.1, బీఏ.2 కలగలిసిన రూపం. ఇదిలా ఉంటే.. ఎక్స్ఈ రకాన్ని మొదటిసారిగా 2022 జనవరి 19న బ్రిటన్ లో గుర్తించారు. ప్రస్తుతానికి ఎక్స్ఈ కేసులు చాలా స్పల్ప స్థాయిలోనే ఉన్నాయట. అయితే ముందు ముందు పరిస్థితిని అంచనా వేయలేమని డబ్ల్యూహెచ్వో హెచ్చరిస్తోంది. ఇందులోనూ రకాలు! యూకే హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ అధ్యయనం ప్రకారం.. మూడు రకాల రీకాంబినెంట్ స్ట్రెయిన్లు ఎక్స్ డీ, ఎక్స్ఈ, ఎక్స్ఎఫ్ ప్రస్తుతం వ్యాప్తిలో ఉన్నాయి. గతంలో వెలుగు చూసిన రెండు ఉప రకాలతో కలసిన స్వరూపాన్ని రీకాంబినెంట్ గా చెబుతారు. ఇందులో ఎక్స్ డీ అన్నది.. డెల్టా, బీఏ.1 కలసిన రకం. ఎక్స్ఎఫ్ అన్నది డెల్టా, బీఏ.1 కలసిన మరొక రూపం. -
డెల్టా + ఒమిక్రాన్ = డెల్మిక్రాన్!!
ముంబై: కరోనా కట్టడికి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా మహమ్మారి మాత్రం సరికొత్త రూపాల్లో మానవాళిపై దండయాత్ర కొనసాగిస్తూనే ఉంది. తాజాగా బయటపడ్డ ఒమిక్రాన్ వల్ల పాశ్చాత్య దేశాలు విలవిల్లాడుతున్నాయని అందరూ భావిస్తున్నారు. ఇది ఒమిక్రాన్ ఒక్కదాని వల్ల జరగడం లేదని, డబుల్ వేరియంట్ వల్లనే ఈ కల్లోలం జరుగుతోందని నిపుణులు భావిస్తున్నారు. యూరప్, యూఎస్ సహా పశ్చిమాదిన కలకలం సృష్టిస్తున్నది ‘డెల్మిక్రాన్’ అనే డబుల్ వేరియంట్ అని, దీనికి డెల్టా తీవ్రత, ఒమిక్రాన్ వేగం ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2022లో కరోనా రహిత ప్రపంచాన్ని చూడొచ్చన్న ప్రజల ఆశలకు ఈ డెల్మిక్రాన్ వమ్ముచేసిందంటున్నారు. పశ్చిమ దేశాల్లో కేసుల సునామీకి ఇదే కారణమని కోవిడ్ పరిశోధకుడు డా. శశాంక్ జోషి అభిప్రాయపడ్డారు. ఆల్ఫా, బీటా లాగా డెల్మిక్రాన్ కరోనా కొత్త వేరియంట్ కాదని, ఇది ఇప్పటికే ఉన్న వేరియంట్ల కలయికతో ఏర్పడిందని వివరించారు. అంటే దీన్ని డబుల్ వేరియంట్గా చెప్పవచ్చు. ఇలాంటి డబుల్ వేరియంట్లు రూపొందడం చాలా అరుదుగా జరుగుతుంది. డెల్టా కేసులు భారత్లో ఈ ఏడాది సెకండ్ వేవ్కు కారణమయ్యాయి. తాజాగా ఒమిక్రాన్ భారత్లోకి ప్రవేశించింది. ఈ దశలో ఇండియాలో ఈ రెండు వేరియంట్ల కలయిక ఏ పరిణామాలకు దారితీస్తుందో వేచిచూడాల్సిఉందని జోషి చెప్పారు. డబుల్ ఇబ్బందులు వైరస్లో జరిగే మ్యుటేషన్లు(ఉత్పరివర్తనాలు) కొత్త వేరియంట్ ఏర్పడేందుకు కారణమవుతాయి. కానీ ఇలాంటి డబుల్ వేరియంట్లు ఇప్పటికే ఉన్న వేరియంట్ల కలయికతో రూపొందుతాయని సైంటిస్టులు వివరించారు. ఉదాహరణకు ఇప్పటికే డెల్టా వేరియంట్ సోకి కోలుకుంటున్న వ్యక్తికి ఒమిక్రాన్ సోకితే అతనిలో డెల్మిక్రాన్ రూపొందే అవకాశం ఉందన్నారు. డెల్మిక్రాన్లో అటు డెల్టా నుంచి తీవ్ర వ్యాధి కలిగించే లక్షణాలు, ఇటు ఒమిక్రాన్ నుంచి వేగంగా వ్యాపించే లక్షణం వచ్చాయి. అందుకే ఇది ప్రస్తుతం పాశ్చాత్య దేశాలను ముంచెత్తుతోంది. డెల్మిక్రాన్ సోకిన వారిలో అధిక జ్వరం, నిరంతర దగ్గు, వాసన లేదా రుచి కోల్పోవడం, తలనొప్పి, ముక్కుదిబ్బడ, గొంతులో గరగరలాంటి లక్షణాలను నిపుణులు గమనించారు. భారత్లో ఒమిక్రాన్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఇంతవరకు డెల్మిక్రాన్ వేరియంట్ జాడ మాత్రం భారత్లో లేదు. భారత వాతవరణానికి ఒమిక్రాన్ ఎలా స్పందిస్తుందోనని నిపుణులు ఆందోళనగా ఎదురుచూస్తున్నారు. కొందరు మాత్రం ఇండియాలో డెల్మిక్రాన్ ప్రమాదం ఉండకపోవచ్చని అంచనా వేస్తున్నారు. డెల్టా, ఒమిక్రాన్, డెల్మిక్రాన్.. ఏదైనా సరే టీకాలు తీసుకోవడం, సరైన నిబంధనలు పాటించడంతో దరిచేరకుండా జాగ్రత్త పడవచ్చని ఆరోగ్య నిపుణుల సూచన. -
Omicron Variant : గంటన్నరలో ఒమిక్రాన్ ఫలితం
న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఐఐటీ పరిశోధక బృందం గంటన్నరలో ఒమిక్రాన్ వేరియంట్ను గుర్తించే కొత్త పరీక్షా విధానాన్ని రూపొందించారు. ఆర్టీపీసీఆర్ ఆధారిత నిర్ధారణ పరీక్షతో కోవిడ్ కొత్త వేరియంట్ను వేగంగా గుర్తించవచ్చని అధికారులు తెలిపారు. ఒమిక్రాన్ను గుర్తించేందుకు జీనోమ్ స్వీకెన్సింగ్ను వాడుతున్నారు. దీని ఫలితాలు వచ్చేందుకు 3 రోజులు పడతుంది. ఈ నేపథ్యంలో ఐఐటీ ఢిల్లీకి చెందిన కుసుమా స్కూల్ ఆఫ్ బయలాజికల్ సైన్సెస్ రాపిడ్ స్క్రీనింగ్ పరీక్షను అభివృద్ధి చేసింది. ప్రస్తుతం ఈ పరీక్షకు పేటెంట్ తీసుకోవడం కోసం ఐఐటీ దరఖాస్తు చేసుకుంది. ఉత్పత్తి కోసం పారిశ్రామిక భాగస్వాములతో చర్చలు ప్రారంభించింది. ఒమిక్రాన్లో వేరియంట్లో మాత్రమే కనిపించే ప్రత్యేక ఉత్పరివర్తనాలను(మ్యుటేషన్లు) గుర్తించడంపై ఆధారపడి నిర్ధారణా పరీక్షను రూపొందించారు. ఎస్జీన్లో ఉండే మ్యుటేషన్లు పరీక్షలో బయటపడితే ఒమిక్రాన్గా నిర్ధారిస్తారు. సింథటిక్ డీఎన్ఏ ముక్కలను ఇందులో వాడతారు. కొత్త విధానంతో తొందరగా ఒమిక్రాన్ను గుర్తించవచ్చన్నారు. గతంలో కరోనాను తొందరగా, సులభంగా గుర్తించే పీసీఆర్ ఆధారిత పరీక్షను ఐఐటీ ఢిల్లీ రూపొందించింది. ఐసీఎంఆర్ అనుమతి లభించిన అనంతరం మార్కెట్లోకి విడుదల చేశారు. ఇప్పుడు ఒమిక్రాన్ వేరియంట్ను గుర్తించే పరీక్షకు అనుమతులు లభిస్తే మరింత విరివిగా, తొందరగా ఫలితాలు రాబట్టవచ్చని అధికారుల అంచనా. చదవండి: ‘నెల రోజులే ఎందుకు? రెండు, మూడు నెలలు బెనారస్లోనే ఉండాలి’ -
మ్యుటేషన్ మాయాజాలం
సాక్షి, అమరావతి: వారసత్వ భూముల యాజమాన్య హక్కులకు సంబంధించి మ్యుటేషన్ల లొసుగులతో దశాబ్దాలుగా ఎడతెగని వివాదాలతోపాటు ఖజానాకు భారీగా గండి పడుతోంది. రిజిస్టర్ డీడ్లు లేకుండానే రెవెన్యూ అధికారులు ఎడాపెడా మ్యుటేషన్లు చేసేస్తుండటంతో ఏటా దాదాపు రూ.800కోట్ల వరకు ఆదాయాన్ని ప్రభుత్వం కోల్పోతోంది. మరోవైపు సివిల్ వివాదాలు పెరుగుతుండటంతో సామాన్యులు సమస్యల్లో చిక్కుకుంటున్నారు. రాష్ట్ర డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) తాజాగా నిర్వహించిన తనిఖీల్లో ఈ వ్యవహారం బయటపడింది. రిజిస్టర్డ్ డీడ్ తప్పనిసరి.. హిందూ వారసత్వ చట్టం ప్రకారం వారసత్వ ఆస్తిని ఆ వారసుల పేరిట మ్యుటేషన్ చేయాలంటే పార్టీషన్ డీడ్ను తప్పనిసరిగా రిజిస్టర్ చేయించాలని ‘రిజిస్ట్రేషన్ చట్టం–1986’ స్పష్టం చేస్తోంది. ఒక వ్యవసాయ భూమి యజమాని మరణిస్తే ఆయన/ఆమె ఆస్తి వారసులకు చెందుతుంది. ఆ వ్యవసాయ భూములను వారు భాగాలుగా చేసుకుని తమ పేరిట మ్యుటేషన్ చేసుకుంటారు. అందుకోసం ముందుగా వారసులు ఆ ఆస్తిని పంపకాలు చేసుకునే ఒప్పందాన్ని అంటే తగిన స్టాంపు డ్యూటీ చెల్లించి పార్టీషన్ డీడ్ను రిజిస్టర్ చేయాలి. రిజిస్టర్డ్ పార్టీషన్ డీడ్ ఉంటేనే అందులో పేర్కొన్న మేరకు ఆ వ్యవసాయ భూములను వారసుల పేరిట తహసీల్దార్లు మ్యుటేషన్ చేయాలి. సర్క్యులర్ సాకుతో చట్ట విరుద్ధంగా... రాష్ట్రంలో దశాబ్దాలుగా రెవెన్యూ అధికారులు పార్టీషన్ డీడ్ లేకుండానే వ్యవసాయ భూములను మ్యుటేషన్ చేసేస్తున్నారు. 1989లో సర్వే, సెటిల్మెంట్స్ కమిషనర్ ఇచ్చిన ఓ సర్క్యులర్ను దీనికి సాకుగా చూపుతున్నారు. రిజిస్టర్డ్ పార్టీషన్ డీడ్ లేకపోయినా సరే తగిన స్టాంపు డ్యూటీ చెల్లిస్తే మ్యుటేషన్ చేయవచ్చని అప్పటి కమిషనర్ ఓ సర్క్యులర్ జారీ చేశారు. పార్టీషన్ డీడ్ను రిజిస్ట్రేషన్ చేయాలని చట్టం చెబుతుండగా అందుకు విరుద్ధంగా అప్పటి కమిషనర్ ఇచ్చిన సర్క్యులర్కు విలువ ఉండదని నిపుణులు పేర్కొంటున్నారు. చట్టం, సర్క్యులర్లో పరస్పర విరుద్ధ అంశాలు ఉన్నప్పుడు చట్టం చెప్పిందే పాటించాలని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. కాబట్టి ఆ సర్క్యులర్కు ఎలాంటి ప్రాధాన్యత లేదని స్పష్టమవుతోంది. పోనీ ఆ సర్క్యులర్లో పేర్కొన్నట్లుగా స్టాంపు డ్యూటీని కట్టించుకుంటున్నారా అంటే అదీ లేదు. కేవలం ఆ సర్క్యులర్ను సాకుగా చూపిస్తున్నారు కానీ అందులో అంశాన్ని తహసీల్దార్లు పాటించడం లేదన్నది స్పష్టమవుతోంది. ఏటా రూ.800 కోట్ల నష్టం... డీఆర్ఐ ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా తహసీల్దార్ కార్యాలయాల్లో మ్యుటేషన్ల తీరును పరిశీలించగా విస్మయకర వాస్తవాలు వెలుగు చూశాయి. 2020 ఆగస్టు నుంచి 2021 ఆగస్టు వరకు రాష్ట్రంలో 8,55,937 మ్యుటేషన్లు జరగ్గా కేవలం 68,239 మ్యుటేషన్లకే రిజిస్టర్డ్ పార్టీషన్ డీడ్లు ఉండటం గమనార్హం. అంటే నిబంధనలకు విరుద్ధంగా ఏకంగా 7,87,698 మ్యుటేషన్లు జరిగాయి. దీంతో స్టాంపు డ్యూటీ రూపంలో రావాల్సిన దాదాపు రూ.800 కోట్ల ఆదాయాన్ని ప్రభుత్వం కోల్పోయింది. ఒక్క ఏడాదిలోనేఇంద నష్టం వాటిల్లిందంటే 30 ఏళ్లుగా ఎంత ఆదాయాన్ని కోల్పోయిందో ఊహకే అందడం లేదు. దీనిపై డీఆర్ఐ సమగ్ర నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. పెరుగుతున్న న్యాయ వివాదాలు రిజిస్టర్డ్ పార్టీషన్ డీడ్లు లేకుండా ఎడాపెడా మ్యుటేషన్లు చేస్తుండటంతో సివిల్ వివాదాలు పెరుగుతున్నాయి. వారసుల మధ్య తదనంతర కాలంలో విభేదాలు తలెత్తుతుండటంతో న్యాయపరమైన చిక్కులు ఏర్పడుతున్నాయి. చాలా చోట్ల తప్పుడు పత్రాలతో, వారసులందరి సమ్మతితో నిమిత్తం లేకుండా రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. అదే రిజిస్టర్డ్ పార్టీషన్ డీడ్ల విధానాన్ని తప్పనిసరిగా అమలు చేస్తే సివిల్ వివాదాలను చాలా వరకు నివారించవచ్చని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. 2020 ఆగస్టు నుంచి 2021 ఆగస్టు వరకు మ్యుటేషన్ల వివరాలు -
కరోనా ఎందుకు మార్పు చెందుతోంది...
ఏడాదిన్నర కింద కరోనా వైరస్ దాడి మొదలైంది. ఏడాది కింద మొదటి వేవ్తో కలకలం సృష్టించింది. ఇటీవల రెండో వేవ్తో అతలాకుతలం చేసింది. త్వరలో మూడో వేవ్ వస్తోందన్న ఆందోళననూ రేకెత్తిస్తోంది. అంతా కరోనానే అయినా.. మొదట్లో వచ్చిన వైరస్ వేరియంట్ ఆల్ఫా, ఇప్పుడున్నది డెల్టా, మూడోవేవ్కు కారణమవుతాయన్నది డెల్టా ప్లస్. మరి అసలు వైరస్ ఇలా మ్యూటేట్ అవడం ఏమిటి? కారణాలు ఏమిటి? దీనివల్ల ప్రమాదం ఎంత? దేశంలో ప్రస్తుత పరిస్థితి ఏమిటన్నది తెలుసుకుందామా.. – సాక్షి సెంట్రల్ డెస్క్ వైరస్ మ్యుటేషన్లు, వేరియంట్లు ఏమిటి సాధారణంగా వైరస్లు పరిస్థితులకు అనుగుణంగా తరచూ వాటిల్లోని జన్యు, ప్రొటీన్ పదార్థాలను మార్చుకుంటూ ఉంటాయి. ఈ మార్పులనే మ్యుటేషన్లు అంటారు. జన్యు, ప్రొటీన్లలో జరిగిన మార్పులను బట్టి ఆ వైరస్ లక్షణాలు తీవ్రంగా మారడంగానీ, ఉన్న సామర్థ్యాన్ని కోల్పోవడం గానీ జరుగుతుంది. ఇలా మ్యుటేషన్లు జరిగిన వైరస్ రకాలనే వేరియంట్లు అంటారు. వైరస్ ఎంత ఎక్కువగా వ్యాప్తి చెందుతూ పోతుంటే.. అంత ఎక్కువగా మ్యుటేషన్లు చెంది కొత్త కొత్త వేరియంట్లు వస్తాయి. వీటిలో కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన వేరి యంట్లను ‘వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ (వీఓఐ)’గా.. ప్రమాదకరంగా మారే అవకాశమున్న వాటిని ‘వేరియంట్ ఆఫ్ కన్సర్న్ (వీఓసీ)’గా సూచిస్తున్నారు. కరోనా ఎందుకు మార్పు చెందుతోంది ►ప్రజలు కోవిడ్ నిబంధనలు సరిగా పాటించకపోవడం వల్ల విపరీతంగా వ్యాప్తి చెందే అవకాశం ఉండటం ►వ్యాపించిన కొద్దీ వైరస్ తన సామర్థ్యాన్ని పెంచుకునే ప్రయత్నం చేయడం ►భారీగా పునరుత్పత్తి చేసుకునే క్రమంలో వైరస్ విభజనలో తేడాలు ►ప్లాస్మా థెరపీ, వ్యాక్సిన్లు, మోనోక్లోనల్ యాంటీబాడీస్ వంటి చికిత్సలతో శరీరంలో ఏర్పడిన రోగనిరోధక శక్తిని ఎదుర్కొనేందుకు వైరస్ ప్రయత్నించడం. మ్యుటేషన్ల వల్ల ప్రమాదం ఎంత వరకు? ►వైరస్ ఇన్ఫెక్షన్ తీవ్ర స్థాయిలో ఉండటం ►వ్యాప్తి చెందే సామర్థ్యం పెరగడం ►రోగ నిరోధక వ్యవస్థ నుంచి తప్పించుకోవడం ►ఊపిరితిత్తుల కణాలకు మరింత సులువుగా అతుక్కునే సామర్థ్యం రావడం ►ఒకచోట ఉన్నవారందరికీ గుంపులుగా ఇన్ఫెక్ట్ కావడం ►మోనోక్లోనల్ యాంటీ బాడీస్ నుంచి తప్పించుకునే శక్తి సంతరించుకోవడం దేశంలో ‘కన్సర్న్’ వేరియంట్ల పరిస్థితి ఏమిటి? ►దేశవ్యాప్తంగా 35 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలోని 174 జిల్లాల్లో ప్రమాదకర కరోనా వేరియంట్లను గుర్తించారు. ►ముఖ్యంగా మహారాష్ట్ర, ఢిల్లీ, పంజాబ్, తెలంగాణ, పశ్చిమబెంగాల్, గుజరాత్లలో ఇవి ఎక్కువగా వ్యాప్తిలో ఉన్నాయి. ►40వేల శాంపిళ్లలో ప్రమాదకర వేరియంట్లపై చేసిన కమ్యూనిటీ స్టడీలో.. ఆల్ఫా వేరియంట్ కేసులు 3,969.. గామా రకం ఒకటి.. బీటా రకం 149.. డెల్టా, దాని అనుబంధ రకాల కేసులు 16,238 నమోదయ్యాయి. ►కరోనా కొత్త కేసుల్లో ‘వీఓసీ’ల శాతం మే రెండో వారంలో 10.31 శాతమే ఉండగా.. జూన్ 20 నాటికి ఏకంగా 51 శాతానికి పెరిగింది. అంటే ప్రమాదకర వేరియంట్ల వ్యాప్తి పెరుగుతోంది. డెల్టా వేరియంట్లు.. ప్రమాదం లెక్కలివీ.. దేశంలో కరోనా రెండో వేవ్కు ప్రధాన కారణమైన డెల్టా (బీ.1.617) వేరియంట్ మరికొన్ని మార్పులు చెంది.. మూడు సబ్ వేరియంట్లు గా మారింది. ఇందులో కప్పా (బీ.1.617.1), లంబ్డా (బీ.1.617.3)లను జాగ్రత్త పడాల్సిన ‘వీఓఐ’ రకాలుగా గుర్తించారు. మరొకటైన డెల్టా ప్లస్ (బీ.1.617.2 లేదా ఏవై.1) రకాన్ని ప్రమాదకరమైన ‘వీఓసీ’ రకంగా ప్రకటించారు. ►డెల్టా ప్లస్ వేరియంట్కు వ్యాప్తి చెందే లక్షణం, ఊపిరితిత్తుల్లోని కణాలకు అతుక్కునే సామర్థ్యం మరింత ఎక్కువ. వ్యాక్సిన్తో శరీరంలో ఏర్పడిన రోగ నిరోధక శక్తి నుంచి, మోనోక్లోనల్ యాంటీబాడీస్ నుంచి తప్పించుకునే సామర్థ్యం పెరిగింది. దేశంలో ‘డెల్టా ప్లస్’ కేసుల తీరు ►దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాల్లో కలిపి ఇప్పటివరకు 51 డెల్టా ప్లస్ కేసులను గుర్తించారు. ►ఐసీఎంఆర్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్ఐవీ) ల్యాబ్లలో ఈ వేరియంట్పై పరిశోధనలు చేస్తున్నారు. ►వ్యాక్సిన్ తీసుకున్నాక ఈ వేరియంట్ కరోనా సోకినవారి పరిస్థితి ఏమిటి, వ్యాక్సిన్ ప్రభా వం ఎంత వరకు ఉందన్నది కచ్చితంగా తేల్చేందుకు పలు ఆస్పత్రుల్లో అధ్యయనం జరుగుతోంది. ప్రమాదకర వేరియంట్ల నియంత్రణ ఎలా? దేశంలో ప్రమాదకర వేరియంట్లు విస్తరిం చకుండా కేంద్ర వైద్యారోగ్య శాఖ పలు సూచనలు చేసింది. ఈ తరహా కేసులు వచ్చిన ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించడం, బాధితులను ప్రత్యేకంగా ఐసోలేట్ చేసి, తగిన చికిత్స అందించడం, వారి కాంటా క్టులను క్వారంటైన్ చేయడం, ఆయా ప్రాంతాల్లో వ్యాక్సినేషన్ భారీగా చేపట్టడం వంటి చర్యలు చేపట్టాలని ఆదేశించింది. ►ప్రమాదకర వేరియంట్లు వచ్చిన జిల్లాలపై రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని, వైద్యారోగ్య సేవలను పెంచాలని సూచించింది. ►విస్తృతంగా కరోనా టెస్టులు చేయడం, పాజిటివ్ వచ్చిన వారి కాంటాక్టుల ట్రేసింగ్, శాంపిళ్లను జీనోమ్ సీక్వెన్సింగ్కు పంపడం, జనం గుంపులుగా ఉండకుండా చూడటం తప్పనిసరి అని స్పష్టం చేసింది. చదవండి: ‘రోగుల ఆశీర్వాదాలే మాకు యాంటీబాడీస్’ -
రిజిస్ట్రేషన్ ఆఫీస్లోనే.. మ్యుటేషన్
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయేతర ఆస్తుల మ్యుటేషన్ ప్రక్రియను సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనే పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ మేరకు గతంలో స్థానిక సంస్థలకు (మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీలు) ఉన్న మ్యుటేషన్ బాధ్యతలను రిజిస్ట్రేషన్ల శాఖకు బదలాయించింది. వారం రోజులుగా రాష్ట్రంలోని 141 సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ మ్యుటేషన్ ప్రక్రియను పైలట్ పద్ధతిన నిర్వహిస్తున్నారు. అయితే, ప్రస్తుతానికి పాత భవనాల మ్యుటేషన్ను మాత్రమే సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల్లో చేస్తుండగా.. ఖాళీ స్థలాలు, కొత్త భవనాల మ్యుటేషన్ను ఇంకా స్థానిక సంస్థల పరిధిలోనే ఉంచారు. సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనే మ్యుటేషన్ ప్రక్రియ కోసం జీహెచ్ఎంసీ, మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖల సర్వర్లతో రిజిస్ట్రేషన్ల శాఖ సర్వర్ను అనుసంధానం చేశారు. అయితే, జీహెచ్ఎంసీ, గ్రామాల్లోని భవనాలకు సంబంధించిన డేటా రిజిస్ట్రేషన్ల శాఖ వద్ద ఉన్న కార్డ్ డేటాతో సరిపోలుతోందని, ఈ రెండుచోట్ల ఇప్పటికే ఆస్తి పన్ను చెల్లించిన భవనాల మ్యుటేషన్కు ఎలాంటి ఇబ్బంది తలెత్తడం లేదని తెలుస్తోంది. కానీ, మున్సిపల్ శాఖ డాటాతో రిజిస్ట్రేషన్ల శాఖ డేటా సరిపోలడం లేదని, దీంతో కొత్త మున్సిపాలిటీల్లోని భవనాల మ్యుటేషన్కు ఇబ్బందులు వస్తోందని రిజిస్ట్రేషన్ల శాఖ వర్గాల సమాచారం. దీన్ని కూడా అధిగమించేందుకు మున్సిపల్, రిజిస్ట్రేషన్ వర్గాలు ప్రయత్నిస్తున్నాయని, ఈ సమస్య కూడా తీరితే సాధ్యాసాధ్యాలను బట్టి ఖాళీ స్థలాలు, కొత్త భవనాల మ్యుటేషన్ బాధ్యతలు కూడా రిజిస్ట్రేషన్ల శాఖకు అప్పగించే అంశాన్ని మ్యుటేషన్ అంటే.. ఆస్తి బదలాయింపు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ద్వారా జరిగితే ఆ ఆస్తిని సంక్రమణదారుడి పేరిట నమోదు చేయడమే మ్యుటేషన్ ప్రక్రియ. గతంలో ఏదైనా భూమి లేదా ఆస్తిపై క్రయ, విక్రయ లావాదేవీ జరిగితే ఆ లావాదేవీని సబ్రిజిస్ట్రార్లు రిజిస్ట్రేషన్ చేసేవారు. ఆ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఆధారంగా మ్యుటేషన్ కోసం పట్టణాల్లో అయితే మున్సిపాలిటీలు, గ్రామాల్లో అయితే పంచాయతీలకు వెళ్లేవారు. మ్యుటేషన్ కోసం మళ్లీ మీ సేవా కేంద్రంలో దరఖాస్తు చేసుకునేవారు. మీ సేవా కేంద్రం నుంచి దరఖాస్తు వచ్చిన తర్వాత స్థానిక సంస్థల అధికారులు పాత యజమాని, కొత్త యజమానికి సదరు ఆస్తి లేదా భూమిపై ఉన్న హక్కులు, భూమి/భవనం విస్తీర్ణం ఎంత ఉంది? ఎంత పన్ను చెల్లించాలి? చెల్లించారా లేదా, నిబంధనల ప్రకారం ఉన్నాయా? అనే అంశాలను పరిశీలించి అన్నీ సక్రమంగా ఉంటే సదరు ఆస్తిని రిజిస్ట్రేషన్ లావాదేవీలో ఉన్న సంక్రమణదారుడి పేరిట బదిలీ (మ్యుటేషన్) చేసేవారు. అయితే, ఈ మ్యుటేషన్ కోసం ఫీజును మాత్రం రిజిస్ట్రేషన్ సమయంలోనే చెల్లించేవారు. రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా మ్యుటేషన్ ఫీజు స్థానిక సంస్థలకు వెళ్లేది. మ్యుటేషన్ ఫీజు రిజిస్ట్రేషన్ సమయంలోనే చెల్లిస్తున్నారు కనుక మళ్లీ ప్రత్యేకంగా స్థానిక సంస్థలకు దరఖాస్తు చేసుకునే అవసరం లేకుండా సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనే మ్యుటేషన్ ప్రక్రియకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రిజిస్ట్రేషన్ లావాదేవీ పూర్తయిన తర్వాత ప్రాపర్టీ ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ నంబర్ (పీటీఐఎన్)ను నమోదు చేసి, సదరు భవనానికి సంబంధించిన వివరాలు, అన్ని రకాల అనుమతులు ఉన్నాయా.. లేదా.. ఉల్లంఘనలున్నాయా.. అనే అంశాలను పరిశీలించి మ్యుటేషన్ ప్రక్రియను నిర్వహిస్తున్నామని రిజిస్ట్రేషన్ల శాఖ వర్గాలు చెపుతున్నాయి.పరిశీలిస్తున్నామని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. -
మరో కొత్త వేరియంట్.. వాటితో పోలిస్తే మహా డేంజర్..!
సాక్షి, పుణె: భారత్లో కరోనా వైరస్ సెకండ్ వేవ్లో తీవ్రస్ధాయిలో విజృంభిస్తోంది. కరోనా వైరస్ మ్యుటేషన్ చెందడంతో కేసుల సంఖ్య విపరీతంగా పెరగడానికి ముఖ్యకారణమని పరిశోధకులు తెలిపారు. డెల్టా వేరియంట్గా పిలవబడే B.1.617.2 వేరియంట్ భారత్లో అత్యధిక ప్రభావం చూపిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. కాగా ప్రస్తుతం భారత్లో మరో కరోనా వైరస్ వేరియంట్ను పుణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్ఐవీ) గుర్తించారు. ఈ వేరియంట్ను అంతర్జాతీయ ప్రయాణికుల నుంచి సేకరించిన నమూనాల నుంచి B.1.1.28.2 వేరియంట్గా గుర్తించారు. ఎన్ఐవి నివేదిక ప్రకారం, బ్రెజిల్, యునైటెడ్ కింగ్డమ్ నుంచి భారత్కు వచ్చిన ప్రయాణికుల్లో కొత్త వేరియంట్ను కనుగొన్నారు. ఈ కొత్త వేరియంట్ తీవ్రమైన దుష్ప్రభావాలను కలిగించే అవకాశం ఉందని తమ నివేదికలో పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ వేరియంట్తో వైరస్ వ్యాప్తి మరింత అధికంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఈ వేరియంట్ ప్రస్తుతం ఉన్న టీకాలు ఎంతమేరకు సామర్థ్యాన్ని కల్టి ఉన్నాయనే విషయం కోసం , ఎక్కువగా పరీక్షించాల్సిన అవసరం ఉందని నివేదిక పేర్కొంది. కొత్త వేరియంట్ను ప్రయోగించిన ఎలుకల్లో శరీర బరువు ఒక్క సారిగా తగ్గిపోయిందని పరిశోధకులు తెలిపారు. అంతేకాకుండా శ్వాసకోశంలో సమస్యలు, ఊపిరితిత్తుల్లో గాయాలు ఏర్పడాయని పేర్కొన్నారు. కాగా, పది ప్రయోగశాలల సమూహమైన ఇన్సాకాగ్ (INSACOG) విస్తృత అధ్యయనం ప్రకారం, గత రెండు నెలల్లో భారత్లో కోవిడ్ -19 కేసుల పెరుగుదల SARS-CoV-2 కు చెందిన B.1.617 వేరియంట్ కారణమని తెలిపారు. ఇన్సకాగ్ ప్రకారం కరోనా వైరస్ B.1.1.7 వేరియంట్కు 'ఆల్ఫా' అని పేరు పెట్టారు. దీనిని మొదటిసారిగా యునైటెడ్ కింగ్ డమ్లో గుర్తించారు. ఈ వేరియంట్ గత ఒకటిన్నర నెలల్లో తీవ్రస్థాయిలో విజృంభించిందని ఇన్సాకాగ్ తెలిపింది. -
Coronavirus: డేంజరస్ డెల్టా ఒళ్లంతా తిష్ట!
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ సెకండ్వేవ్లో వ్యాప్తి చెందిన డెల్టా వేరియంట్ శరీరంలోని కీలక భాగాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. బి.1.617.2 కోడ్తో ఉన్న వేరియంట్ను డెల్టాగా పిలుస్తున్నారు. ప్రస్తుతం దేశంలో ఎక్కువగా వ్యాప్తి చెందిన ఈ వేరియంట్ మానవ శరీరంలోకి ప్రవేశించాక అవయవాలపై వేగంగా ప్రభావాన్ని చూపడంతో ఎక్కువ మంది ఆస్పత్రుల్లో చేరాల్సి వస్తోంది. కరోనా మొదటి దశతో పోలిస్తే రెండో దశలో ఎక్కువ మంది ఆస్పత్రిపాలయ్యారు. అస్వస్థతకు గురైన వారిలో చాలా మంది మరణం అంచులవరకు వెళ్లి వచ్చారు. కొందరిలో అవయవాలు దెబ్బతినగా, మరికొందరు జీవితకాల వ్యాధులైన బీపీ, షుగర్ బారినపడ్డారు. మొదటి దశ, రెండో దశలో ఆస్పత్రిలో చేరి.. వారు ఎదుర్కొన్న సమస్యలు, వైరస్ ప్రభావం తదితర అంశాలపై రిషికేష్లోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్) పరిశోధన చేసింది. దీనికి ప్రత్యేకంగా కొన్ని కేటగిరీల రోగులను ఎంపిక చేసుకుని పరిశీలించి ఆ నివేదికను విడుదల చేసింది. అన్ని అవయవాలపైనా ప్రభావం... మొదటి దశ కోవిడ్ వ్యాప్తి సమయంలో ఎక్కువ మంది శ్వాసకోశ సమస్యలు, ఊపిరితిత్తుల్లో ఇన్ఫె„క్షన్ రావడంతో ఆస్పత్రులకు పరుగులు తీశారు. కానీ, రెండో దశ తీవ్రత ఎక్కువగా ఉంది. ఊపిరితిత్తులతో పాటు మూత్రపిండాలు, కాలేయం, మెదడు తదితర కీలకమైన అవయవాలపై వైరస్ ప్రతాపాన్ని చూపింది. వీలైనంత ఎక్కువ మార్గాలను ఏర్పాటు చేసుకుని వైరస్ వ్యాప్తి చెందిన శరీరాన్ని గుల్ల చేసింది. మొదటి దశతో పోలిస్తే రెండో దశలో మూత్రపిండాలపై ప్రభావం ఆరు రెట్లు అధికంగా ఉంది. కాలేయంపై చూపిన ప్రభావం గతేడాది కంటే రెండు రెట్లు ఎక్కువ. లివర్లోకి వైరస్ వ్యాప్తి చెందడంతో ఆ అవయవం విడుదల చేసే ఎంజైమ్స్ రెట్టింపు చేసి సామర్థ్యాన్ని తగ్గించినట్లు గుర్తించారు. దేశంలో కోవిడ్ బారినపడ్డ 70 శాతం మందిలో డెల్టా వేరియంట్ ఉన్నట్లు ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ వివరించింది. బి.1.617.2 రకానికి చెందిన ఈ వేరియంట్ దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే తరహాలో తీవ్ర ప్రభావాన్ని చూపింది. డెల్టా వేరియంట్ తెల్ల రక్తకణాల్లోని లింపోసైట్లపై తీవ్ర ప్రభావం చూపడంతో ఎక్కువ మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ వేరియంట్ వైరస్ వ్యాప్తిని ముందుగా లక్షణాలతో గుర్తించి చికిత్స తీసుకున్న వారు ఇంటివద్దే కోలుకుంటుండగా... కాస్త నిర్లక్ష్యం చేసినా ఆస్పత్రికి వెళ్లాల్సిన పరిస్థితి వస్తోంది. దీని నియంత్రణకు వైద్యులు శ్రమించాల్సి వస్తోంది. మొదటి దశ, రెండో దశలో సివియర్ పేషంట్లలో పరిస్థితి ఇలా(గణాంకాలు శాతాల్లో)... కేటగిరీ మొదటి దశ రెండో దశ ఎస్పీఓ2 సగటు 92 85.5 ఫీవర్ 30 85 దగ్గు 14 78 గొంతులో గరగర 11 05 దమ్ము 15 80 నీరసం 9.5 19.6 లూస్మోషన్స్ 11 5 ► మొదటిదశ చికిత్సలో స్టెరాయిడ్లను 4 శాతం మందికే వాడగా... రెండో దశకు వచ్చే సరికి 72 శాతం మందికి ఇచ్చారు. ఇక యాంటిబయోటిక్స్ వినియోగం రెట్టింపు అయ్యింది. ►బాక్టీరియల్ న్యుమోనియా 1.1 శాతం నుంచి 9 శాతానికి పెరగగా, సివియర్ వైరస్ న్యుమోనియా 6 శాతం నుంచి ఏకంగా 49 శాతానికి ఎగబాకింది. ►సీటీ స్కాన్లో స్కోర్ గతేడాది కంటే ఈసారి భారీగా పెరుగుదల నమోదైంది. డెల్టా వేరియంట్ వ్యాప్తి చెందిన ఎక్కువ మందిలో ఊపిరితిత్తులపై ప్రభావాన్ని చూపడంతో ఆక్సిజన్ స్థాయిలు భారీగా పడిపోయాయి. కరోనా తొలి దశలో 12 శాతం మందికే ఆక్సిజన్ సప్లిమెంట్ అవసరంపడగా... రెండో దశలో ఏకంగా 82 శాతానికి పెరిగింది. రెమిడెసివిర్ వినియోగం మొదటి దశలో ఒక శాతం కంటే తక్కువ ఉండగా... ప్రస్తుతం ఆస్పత్రిలో చేరిన 12 శాతం మంది వినియోగించారు. సివియర్ కోవిడ్తో ఆస్పత్రుల్లో చేరిన వారిలో గతేడాది 90 శాతం మంది డిశ్చార్జ్ కాగా.. సెకండ్ వేవ్లో 71శాతం మందే డిశ్చార్జ్ అయినట్లు గుర్తించారు. ఈ లెక్కన మొదటి దశలో నమోదైన మరణాల రేటుతో పోలిస్తే రెండో దశలో మరణాల రేటు మూడు రెట్లు పెరిగినట్లు తెలుస్తోంది. గతేడాది ఆస్పత్రుల్లో చేరిన వారిలో 2.6 శాతం మందికే వెంటిలేటర్ అవసరపడగా ఈసారి 41 శాతానికి పెరిగినట్లు పరిశీలనలో తేలింది. పరిశోధన సాగిందిలా... మొదటి దశ కోవిడ్కు సంబంధించి గత ఏడాది ఏప్రిల్, మే, జూన్లలో ఎయిమ్స్లో అడ్మిట్ అయిన 106 మంది రోగులు.. రెండో దశ తీవ్రంగా ఉన్న ఈ ఏడాది మార్చి, ఏప్రిల్, మేలో చేరిన 104 మందిపై పరిశీలన చేశారు. మైల్డ్, మోడరేట్, సివియర్ కేటగిరీలుగా కోవిడ్ను విభజించి.. వీరిలో వైరస్ చూపిన ప్రభావం, అందించిన చికిత్సను పరిశీలించారు. తొలి దశలో లక్షణాలు లేకున్నా ఆస్పత్రుల్లో చేరగా.. ప్రస్తుతం మోడరేట్ స్టేజి దాటే క్రమం, సివియారిటీకి వచ్చిన తర్వాతే ఆస్పత్రుల్లో చేరారు. . తొలిదశలో 37.5% మందే ఆస్పత్రుల్లో చేరగా.. ప్రస్తుతం 70% మంది చేరారు. గతేడాది ఆస్పత్రుల్లో చేరిన వారి సగటు వయసు 37 యేళ్లు కాగా, ప్రస్తుతం 50.5 యేళ్లు. -
ఎయిడ్స్ పేషెంట్లో 216రోజులుగా కరోనా!
డర్బన్: దక్షిణాఫ్రికా పరిశోధకులు ఒక ఆసక్తికరమైన కేసును వెలుగులోకి తెచ్చారు. ఎయిడ్స్ వ్యాధితో బాధపడుతున్న ఓ మహిళ శరీరంలో 216 రోజులుగా కరోనా వైరస్ పాతుకుపోయిన విషయాన్ని గుర్తించారు. అంతేకాదు ఆమె శరీరంలో ఆ వైరస్ 32 సార్లు మ్యూటేషన్స్కి గురైందని, అది ప్రమాదకరమైన వేరియెంట్లకు దారితీసిందని నిర్ధారించారు. ఈ కేసు గురించి మెడ్ఆర్గ్జివ్ మెడికల్ జర్నల్ ప్రముఖంగా ప్రచురించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ముప్పై ఆరేళ్ల ఆ మహిళ 2006లో హెచ్ఐవీ బారిన పడింది. అప్పటి నుంచి ఆమె ఒంట్లో రోగనిరోధక శక్తి క్షీణిస్తూ వస్తోంది. కిందటి ఏడాది సెప్టెంబర్లో ఆమె కరోనా బారిన పడింది. అయితే ఇన్నిరోజులుగా ఆమె శరీరంలో వైరస్ రకరకాల మార్పులు చెందింది. ఆ మ్యూటెంట్స్ వల్ల ఏర్పడిన వేరియెంట్స్(ఆమెవల్ల) ఇతరులకు సోకింది, లేనిది అనేదానిపై ఒక స్పష్టతకి రాలేకపోతున్నారు. క్వాజులూ నటాల్ ప్రాంతంలో ప్రతీ నలుగురిలో ఒకరికి కొత్త వేరియెంట్ లక్షణాలు కనిపిస్తున్నాయి. కానీ, ఈ మహిళ కేసులో ఇన్నిసార్లు మార్పులు కలగడం, ప్రమాదకరమైన వేరియెంట్ల పుట్టుకకు కారణం కావడం ఆందోళన కలిగిస్తోందని రీసెర్చర్లు చెప్తున్నారు. కారణం ఇదే.. సాధారణంగా ఇమ్యూనిటీ లెవల్ తక్కువగా ఉన్నవాళ్లలో కరోనా వైరస్ ఎక్కువ కాలం ఉంటుంది. హెచ్ఐవీ అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉన్న పేషెంట్లలోనూ ఇది జరుగుతుంది. దక్షిణాఫ్రికా ఎయిడ్స్ పేషెంట్ కేసులో బాధిత మహిళకు కరోనా సోకినప్పుడు మైల్డ్ సింప్టమ్స్ మాత్రమే ఉన్నాయట. అయితే అప్పటి నుంచి ఇప్పటిదాకా వైరస్ ఆమె శరీరంలో సజీవంగా ఉండడం ఆశ్చర్యం కలిగిస్తోందని డర్బన్కి చెందిన జెనెటిసిస్ట్ టులియో డె ఒలివెయిరా తెలిపారు. త్వరగా ట్రీట్మెంట్ ఈ పరిశోధనతో హెచ్ఐవీ బారినపడ్డవాళ్లు.. మరిన్ని రకాల కరోనా వైరస్ వేరియెంట్లను వ్యాపింపజేసే అవకాశం ఉందన్న వాదనకు బలం చేకూరిందని రీసెర్చర్లు చెబుతున్నారు. ‘‘హెచ్ఐవీ బారినపడ్డవాళ్లను ట్రేస్ చేసి గుర్తించి, ఇమ్యూనిటీ పెంపొందించేలా మంచి మందులు, సరైన పోషకాహారం అందించాలని, కరోనా బారినపడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని.. ఒకవేళ కరోనా సోకినా మంచి ట్రీట్మెంట్ అందించడం ద్వారా నష్ట తీవ్రతను తగ్గించవచ్చ’’ని టులియో చెప్పారు. ఇక భారత్లో సుమారు పది లక్షల మంది హెచ్ఐవీ పేషెంట్లకు సరైన ట్రీట్మెంట్ అందట్లేదని, వీళ్లకు గనుక కరోనా సోకితే పరిస్థితి ఘోరంగా మారొచ్చని ఈ రీసెర్చ్ స్టడీలో పరిశోధకులు అభిప్రాయపడ్డారు. చదవండి: తెలంగాణలో కండోమ్ కొనేందుకు సిగ్గు -
Corona Virus: మూడింట ఒకటి... ‘మహా’ డేంజర్!
సాక్షి, హైదరాబాద్: డబుల్ మ్యుటేషన్గా పేరుపొందిన మహారాష్ట్ర వేరియంట్ కరోనా వైరస్ ఇప్పుడు దేశాన్ని వణికిస్తోంది. అత్యంత వేగంగా వ్యాప్తి చెందే గుణమున్న ఈ వైరస్ ఇప్పుడు దేశంలో విస్తృత ప్రభావాన్ని చూపుతోంది. ప్రస్తుతం దేశంలో నమోదవుతున్న కోవిడ్–19 పాజిటివ్ల్లో ప్రతి మూడింట్లో ఒకటి మహారాష్ట్ర వేరియంట్ ఉంటోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) చెబుతోంది. వివిధ దేశాల్లో వైరస్ వ్యాప్తి, తీవ్రత తదితర అంశాలపై తాజాగా డబ్ల్యూహెచ్ఓ నివేదిక విడుదల చేసింది. ఇందులో మహారాష్ట్ర వేరియంట్ను ప్రస్తావించింది. ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా పది రకాల వేరియంట్లు ప్రభావవంతంగా ఉన్నాయని డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది. ఈ పదింట్లో కేవలం మూడు (యూకే, బ్రెజిల్, దక్షిణాఫ్రికా) మాత్రమే అత్యంత ప్రభావవంతమైనవని, మిగతా ఏడు సాధారణమైనవని తెలిపింది. తాజా జాబితాలోకి మహారాష్ట్ర వేరియంట్ను జతచేస్తూ అత్యంత ప్రభావవంతమైన వేరియంట్లలో ఇది నాలుగోదని వెల్లడించింది. మళ్లీ మూడురకాలుగా మారి.. జన్యు విశ్లేషణ ఆధారంగా వైరస్ వేరియంట్లను ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వేస్తోంది. ఈ క్రమంలో ఏప్రిల్ నుంచి మే 11 వరకు దాదాపు 44 దేశాల్లో 4,500 నమూనాలు పరిశీలించగా ఇందులో మహారాష్ట్ర వేరియంట్ (బి.1.617) ఎక్కువగా ఉన్నట్లు డబ్ల్యూహెచ్ఓ గుర్తించింది. ప్రస్తుతం డబుల్ మ్యుటెంట్ వైరస్ మళ్లీ మూడు రకాలుగా రూపాంతరం చెంది వ్యాప్తి చెందుతోంది. ఇందులో మొదటి రకం 34 దేశాల్లో, రెండో రకం 31 దేశాల్లో ప్రభావవంతంగా ఉండగా... మూడో రకం అతి తక్కువగా 4 దేశాల్లో కనిపించినట్లు చెబుతోంది. ఈ వైరస్ను తొలుత గత అక్టోబర్లోనే గుర్తించినప్పటికీ క్రమంగా మార్పు చెందుతూ ఈ ఏడాది ఫిబ్రవరి నెలాఖరు నుంచి వేగంగా వ్యాప్తి చెందుతూ వస్తోంది. ఏప్రిల్ ఆఖరి వారం నుంచి ఈ నెల 11 నాటికి గుర్తించిన పాజిటివ్ కేసుల్లో మొదటి రకం వైరస్ 21 శాతం ప్రభావవంతంగా ఉంది. రెండో రకం వైరస్ 7 శాతం, మూడో రకం 5 శాతం ప్రభావవంతంగా ఉన్నట్లు పరిశీలన చెబుతోంది. ప్రస్తుతం దేశంలో నమోదవుతున్న పాజిటివ్ కేసుల్లో మొత్తంగా మహారాష్ట్ర వేరియంట్ 33 శాతం ఉంది. ఇంట్లో ఒకరికి వైరస్ సోకితే క్రమంగా ఇంటిల్లిపాదికి వేగంగా అంటుకోవడంతో కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. దేశంలో వ్యాప్తికి కారణాలివే... దేశంలో వైరస్ వ్యాప్తికి అజాగ్రత్తలు, నిర్లక్ష్యమే కారణమని ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా నివేదికలో ప్రస్తావించింది. గత రెండు నెలల్లో దేశవ్యాప్తంగా పలుచోట్ల ఎన్నికల మాస్ మీటింగ్స్ పేరిట జనసమూహాలు విచ్చలవిడిగా జరిగాయి. వీటితోపాటు ఎన్నికలు లేని ఒకట్రెండు రాష్ట్రాల్లో మతపరమైన సమూహాలు పెద్ద ఎత్తున చేరడం లాంటివి చోటుచేసుకున్నాయి. కరోనా వ్యాప్తిపై హెచ్చరికలు చేస్తున్నప్పటికీ.. చాలామంది జాగ్రత్తలు తీసుకోకుండా నిర్లక్ష్యాన్ని ప్రదర్శించారు. లాక్డౌన్ అనంతరం అన్ని రంగాలు తెరుచుకుని సాధారణ స్థితికి చేరుకోవడంతో కార్యకలాపాలు యథావిధిగా సాగుతున్న సమయంలో మాస్కుల వినియోగం సరిగా లేకపోవడం, భౌతికదూరాన్ని పాటించకపోవడం వైరస్ వ్యాప్తికి కారణంగా మారినట్లు చెప్పింది. దూకుడుతో దాడి... మహారాష్ట్ర వేరియంట్ సోకిన వారిలో ఆరోగ్యక్షీణత వేగంగా కనిపిస్తున్నట్లు డబ్ల్యూహెచ్ఓ పరిశీలన చెబుతోంది. మోనోక్లోనల్ యాంటీబాడీస్ ఈ వైరస్పై ఎలాంటి ప్రభావాన్ని చూపడం లేదు. దీంతో ఆ రకం ప్లాస్మా థెరపీ కూడా ఏమాత్రం పనిచేయడం లేదు. ఈ వైరస్ శరీరంలోకి ప్రవేశించిన తర్వాత ప్రధానంగా యాన్జియోటెన్సిన్ కన్వర్టింగ్ ఎంజైమ్2 (ఏసీఈ2)పై దాడి ప్రారంభిస్తుంది. శరీరంలోకి ప్రవేశించడమే తరువాయి దూకుడుతో రంగంలోకి దిగుతున్న ఈ వైరస్ ఏసీఈ2 ఎక్కువగా ఉన్న ఊపిరితిత్తులపై ప్రభావం మొదలు పెడుతోంది. దీంతో ఈ వైరస్ సోకిన వారిలో ఎక్కువగా శ్వాససంబంధిత సమస్యలే ముందుగా వస్తున్నాయి. ఆక్సిజన్ స్థాయిలు పడిపోవడంతోపాటు ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్కు కారణమవుతోంది. క్రమంగా దగ్గు రావడం, తీవ్రమైన జ్వరం రోజుల తరబడి ఉండడం, హైఫీవర్ రావడంలాంటి లక్షణాలకు కారణమవుతోంది. న్యుమోనియా వృద్ధి చెందడంతోపాటు ఊపిరితిత్తులు పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ వైరస్ కడుపులోకి చేరిన వెంటనే డయేరియా మొదలవుతుంది. విపరీతమైన వాంతులు, విరేచనాలతో శరీరం డీహైడ్రేట్ అయ్యి క్రమంగా ఇతర అవయవాల పనితీరుపై పెనుభారం పడుతుంది. వ్యాక్సిన్తో ఎదుర్కోవచ్చు మహారాష్ట్ర వేరియంట్ ప్రమాదకారి అయినప్పటికీ వ్యాక్సిన్తో ఎదుర్కోవచ్చని తెలుస్తోంది. నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాల పరిధిలో వ్యాక్సిన్ తీసుకున్న వారు కూడా కోవిడ్–19 బారిన పడ్డారు. అయితే ఇందులో 93 శాతం మందిలో ఊపిరితిత్తులపై ఈ రకం వైరస్ ఎలాంటి ప్రభావం చూపలేదని మా పరిశీలనలో గుర్తించాం. అదేవిధంగా వ్యాక్సిన్ తీసుకోని 85 శాతం మందిలో సగం మందికి ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ గుర్తించాం. అంటే మన టీకా పనితీరు ఇక్కడ కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, ప్రతి లబ్ధిదారుడు స్లాట్ బుక్ చేసుకుని టీకా వేయించుకోవాలి. –డాక్టర్ కిరణ్ మాదల, అసోసియేట్ ప్రొఫేసర్, ప్రభుత్వ వైద్య కళాశాల, నిజామాబాద్ 44 దేశాల్లో... ప్రపంచ ఆరోగ్య సంస్థ జన్యు విశ్లేషణ ఆధారంగా వైరస్ వేరియంట్లను అంచనా వేస్తుంది. దాదాపు 44 దేశాల్లో 4,500 నమూనాలు పరిశీలించగా ఇందులో మహారాష్ట్ర వేరియంట్ (బి.1.617) ఎక్కువగా ఉన్నట్లు గుర్తించింది. దూకుడెక్కువ.. డబుల్ మ్యుటేషన్గా పేరొందిన మహారాష్ట్ర వేరియంట్ కరోనా వైరస్ ఇప్పుడు దేశాన్ని వణికిస్తోంది. అత్యంత వేగంగా వ్యాప్తి చెందే గుణమున్న ఈ వైరస్ ఇప్పుడు విస్తృత ప్రభావాన్ని చూపుతోంది. నంబర్ 4.. ప్రపంచంలో అత్యంత ప్రభావవంతమైన వేరియంట్లు ఇప్పటివరకు మూడు (యూకే, బ్రెజిల్, దక్షిణాఫ్రికా) ఉండగా, ఈ జాబితాలో నాలుగోదిగా మహారాష్ట్ర వేరియంట్ చేరింది. ఇంటిల్లిపాదికీ.. ఇంట్లో ఒకరికి సోకితే ఇంటిల్లిపాదికీ వేగంగా అంటుకుంటోంది. దీంతో కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఈ వైరస్ శరీరంలోకి ప్రవేశించడమే తరువాయి.. ఊపిరితిత్తులపై ప్రభావం మొదలు పెడుతోంది. -
యూకే వేరియంట్తోనే సమస్య!
‘దేశంలో ప్రస్తుతం యూకే వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. గత కొంత కాలంగా డబుల్ మ్యూటెంట్ వేగంగా వ్యాప్తి చెందినా, ప్రస్తుతం యూకే రూపాంతరితమే సమస్యగా మారింది. ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరించడమే సెకండ్ వేవ్ ఉధృతికి ప్రధాన కారణం..’అని సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్ రాకేశ్ మిశ్రా ‘సాక్షి’కి తెలిపారు. ప్ర: దేశంలో కోవిడ్ కేసుల సంఖ్య రోజుకు నాలుగు లక్షలకు చేరువ అవుతోంది. తొలిదశలో వైరస్ వ్యాప్తిని సమర్థంగా అడ్డుకున్న మనం రెండోసారి మాత్రం విఫలమయ్యాం. ఇందుకు కారణాలేమిటి? జ: కోవిడ్–19 వ్యాప్తి నిరోధానికి అవసరమైన చర్యలు చేపట్టడంలో ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరించడమే అతిపెద్ద కారణం. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, తరచూ చేతులు శుభ్రం చేసుకోవడం అత్యవసరమని, ఈ జాగ్రత్తలన్నీ కొనసాగించాలని చాలాకాలంగా శాస్త్రవేత్తలు హెచ్చరిస్తూనే ఉన్నా పట్టించుకోకపోవడం వల్లనే ఈ సమస్య వచ్చిపడింది. పాఠశాలలు, కళాశాలలు త్వరగా తెరవడం, ఎన్నికల ర్యాలీలకు అనుమతించడం, బార్లు, పబ్బులు, సినిమాహాళ్లు పనిచేసేందుకు అనుమతులివ్వడం కూడా కారణమేనని చెప్పాలి. ఈ నేపథ్యంలోనే రూపాంతరిత వైరస్ వేగంగా వ్యాప్తి చెందేందుకు అవకాశం ఏర్పడింది. అదృష్టం ఏమిటంటే.. యూకే, భారత్ డబుల్ మ్యూటెంట్ వైరస్లకు ఇతర జీవుల ద్వారా వ్యాపించే శక్తి అలవడలేదు. అదే జరిగి ఉంటే సమస్య మరింత జటిలమయ్యేది. ప్ర: దేశంలో ఏ రూపాంతరిత వైరస్ ఎక్కువ వ్యాప్తిలో ఉంది? జ: ప్రధానంగా మూడు (యూకే, డబుల్ (కాలిఫోర్నియా), బెంగాల్) రూపాంతరిత వైరస్లు ఉన్నాయి. వీటి నుంచి మరోసారి జన్యుమార్పులకు గురైన ఇంకో వైరస్ కూడా వ్యాప్తిలో ఉంది. దీన్నే ట్రిపుల్ మ్యూటేటెడ్ అని పిలుస్తున్నారు. మహారాష్ట్రలో నమోదవుతున్న కేసుల్లో పదిశాతం ఈ వైరస్వే. కొమ్ములో ఉండే ఒకే ఒక్క తేడా డబుల్, ట్రిపుల్ మ్యూటేటెడ్లను వేరు చేస్తుంది. బెంగాల్లో 20 శాతం కేసులకు కారణమవుతున్న రూపాంతరిత వైరస్ బలహీనపడుతోందని, త్వరలో కనిపించకుండా పోతుందని అంచనా వేస్తున్నాం. డబుల్ మ్యూటెంట్ వైరస్ను గత ఏడాది డిసెంబర్లోనే గుర్తించినా..మన నిర్లక్ష్యం కారణంగా గత కొంతకాలంగా అది వేగంగా వ్యాప్తి చెందింది. డబుల్, ట్రిపుల్ మ్యూటెంట్ వైరస్లలో జన్యుపరమైన మార్పులు చెప్పుకోదగ్గ స్థాయిలో ఉన్నప్పటికీ వాటి వల్ల ప్రమాదమేమీ లేకపోవడం ఊరటనిచ్చే అంశం. దేశంలో ప్రస్తుతం యూకే రూపాంతరితమే ఎక్కువగా వ్యాప్తిలో ఉంది. అదే సమయంలో వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరు వెరైటీలు తమ ప్రభావాన్ని చూపిస్తున్నాయని తెలుస్తోంది. సీసీఎంబీలో రూపాంతరితాల జన్యుక్రమ నమోదు జరుగుతోంది. ఇప్పటివరకూ పరిశీలించిన నమూనాల్లో యూకే రూపాంతరితం 12 – 15 శాతం ఉండగా.. డబుల్ మ్యూటెంట్ 20 శాతం నమూనాల్లో కనిపించింది. మిగిలిన 70 శాతంలో వేర్వేరు రకాల ఉనికిని గుర్తించాము. ప్ర: రెండో దఫా కేసులు శిఖరస్థాయికి చేరేదెన్నడు? మూడో దఫా ఉండే అవకాశం ఉందా? జ: దేశ విదేశాల్లో చేసిన అధ్యయనాలన్నీ భారత్లో మే రెండు, మూడో వారాల్లో కేసులు శిఖరస్థాయికి చేరతాయని, ఆ తర్వాత వేగంగా తగ్గిపోతాయని చెబుతున్నాయి. మళ్లీ జూన్ తర్వాత కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగే అవకాశం ఉందని పేర్కొంటున్నాయి. తీవ్రత తక్కువగా ఉంటుందంటున్న ఈ దశను మూడో దఫా అని కూడా అనలేము. నిజానికి ఈ మూడోదఫా గురించి ఎవరికీ స్పష్టమైన సమాచారం లేదు. ప్రస్తుతం రోజువారీ ఎన్ని కేసులు నమోదవుతున్నాయి? అన్న అంశంపై ఆధారపడి ఈ అంచనాలు రూపొందాయి. శిఖర స్థాయికి చేరే క్రమంలో రోజువారీ కేసుల సంఖ్య ఐదు నుంచి పది లక్షలకు చేరుకునే అవకాశం ఉంది. ప్రభుత్వ లెక్కల్లోకి ఎక్కని కేసులు దీనికి అదనంగా భావించాలి. కేసులకు సంబంధించి పూర్తిస్థాయి సమాచారం అందని పరిస్థితుల్లో అంచనాలు వేయడం అంత సులభమేమీ కాదు. కానీ మే నెల మూడో వారానికల్లా అత్యధిక స్థాయిలో కేసులు నమోదై ఆ తర్వాత తక్కువ కాలంలోనే ఆ సంఖ్య పతనమవుతుందని అనుకుంటున్నాం. అప్పటివరకూ పరిస్థితిని అదుపులో ఉంచేందుకు మాస్కులేసుకోవడం, తరచూ చేతులు కడుక్కోవడం, భౌతిక దూరం పాటించడం వంటివి మరింత కఠినంగా కొనసాగించాల్సి ఉంటుంది. వీలైనన్ని ఎక్కువ పరీక్షలు చేయడం, అందుబాటులో ఉన్న వైరస్ నమూనాల జన్యుక్రమాన్ని వేగంగా నమోదు చేయడం చాలా అవసరం. తద్వారా కొత్త రూపాంతరితాలను ఎప్పటికప్పుడు గుర్తించే వీలేర్పడుతుంది. జన్యుక్రమ నమోదు ద్వారా కొత్త టీకాలు, మందులను అభివృద్ధి చేయవచ్చు. ప్రభుత్వం ఈ పనులన్నీ తగిన వేగంతో చేస్తుందని అనుకున్నా.. ప్రజలు తమవంతు కర్తవ్యాన్ని నిర్వర్తిస్తేనే దేశం నుంచి కరోనా వైరస్ను తరిమి కొట్టగలం. – సాక్షి, హైదరాబాద్. -
కరోనా వైరస్: వామ్మో! డబుల్ కాదు.. ట్రిపుల్..!
ఢిల్లీ: భారత్లో రోజు నమోదవుతున్న కరోనా కేసులను చూసి పరిశోధకులు ఒక్కింతా విస్మయానికి గురవుతున్నారు. దేశంలో సుమారు రోజు మూడు లక్షల పైగా కరోనా కేసులు, 2వేలకు పైగా మరణాలు సంభవిస్తున్నాయి. పరిశోధకులు భారత్లో కరోనా డబుల్ మ్యూటేషన్ ఉన్నట్లుగా తొలుత భావించగా, ప్రస్తుతం భారత్లో కరోనా ట్రిపుల్ మ్యూటేషన్ కూడా ఉందని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. ఈ ట్రిపుల్ మ్యూటేషన్ వలనే భారీ ఎత్తున కరోనా కేసులు నమోదవుతున్నాయని పేర్కొన్నారు. ట్రిపుల్ మ్యూటేషన్లో మూడు కోవిడ్ స్ట్రెయిన్లు కలిపి కొత్త వేరియంట్గా మారాయని భావిస్తున్నారు. మహారాష్ట్ర, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్లో నమోదైన కేసుల్లో ట్రిపుల్ మ్యూటేంట్ కనిపించిందని పరిశోధకులు తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా కొత్త వేరియంట్లు కనిపిస్తూనే ఉన్నాయని సైంటిస్టులు పేర్కొన్నారు. ‘ట్రిపుల్ మ్యూటేంట్తో వైరస్ చాలా వేగంగా వ్యాప్తి చెందుతుంది. దాంతో పాటు వెంటనే అనారోగ్యానికి గురయ్యేలా చేస్తోంద’ని మెక్ గిల్ యూనివర్సిటీ ఎపిడమియాలజీ ప్రొఫెసర్ మధుకర్ తెలిపారు. ఈ మ్యూటేషన్లకు సరిపోయే వ్యాక్సిన్లు మనం ఇంప్రూవ్ చేసుకోవాలన్నారు. ప్రస్తుతం నమోదవుతున్న కరోనా కేసుల్లో (జీనోమ్ సీక్వెన్స్) జన్యు శ్రేణిలను కేవలం ఒక శాతం కంటే తక్కువగా స్టడీ చేస్తున్నామన్నారు. ఇది భారత్కు పెను సవాల్గా మారనుందని తెలిపారు. ట్రిపుల్ మ్యుటేషన్ ఎంత వరకు ప్రభావం చూపనుంది..! డబుల్ మ్యూటేషన్తో కరోనా వైరస్ వ్యాప్తి అధికంగా ఉంది. దేశంలో కరోనా మొదటి వేవ్లో పది మందిల్లో ఒకరు లేదా ఇద్దరికి వైరస్ వ్యాప్తి చెందగా, ప్రస్తుత డబుల్ మ్యూటేషన్తో వైరస్ వ్యాప్తి ఎనిమిదికి చేరింది. డబుల్ మ్యూటేషన్తో చివరికి చిన్న పిల్లలు కూడా వైరస్ బారిన పడుతున్నారు. ట్రిపుల్ మ్యూటేషన్ అంతకుమించి వేగంగా వ్యాప్తి చెందుతుందని భావిస్తున్నారు. ప్రస్తుతం ట్రిపుల్ మ్యూటేషన్స్ ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులను పెంచుతున్నాయి. ప్రస్తుతానికి వైరస్ జెనోమ్ను స్టడీ చేయడానికి 10 ల్యాబ్లు మాత్రమే ఉన్నాయి. చదవండి: కొత్తరకం వైరస్పై కొవాగ్జిన్ సమర్థవంతంగా పనిచేస్తుంది: ఐసీఎంఆర్ -
కొత్త స్ట్రెయిన్లతో ‘దడ’.. తెలంగాణకు పొంచివున్న ముప్పు
సాక్షి, హైదరాబాద్: ఇప్పుడిప్పుడే కరోనా కేసులు తగ్గుతున్నాయని, వ్యాక్సిన్ పుణ్యమాని ఇక వైరస్ నిర్వీర్యం అవుతుందన్న భావనలో ఉండగా... మహారాష్ట్ర ముప్పు వణికిస్తోంది. అక్కడ పుట్టుకొచ్చిన రెండు కొత్త స్ట్రెయిన్లు దడ పుట్టిస్తున్నాయి. దేశంలో కేరళ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, పంజాబ్ రాష్ట్రాల్లో కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. మొన్న మొన్నటివరకు యూకే కొత్త స్ట్రెయిన్తో గజగజ వణికిపోయాం. దక్షిణాఫ్రికా స్ట్రెయిన్తోనూ ఆందోళనకు గురయ్యాం. ఇప్పుడు మహారాష్ట్రలో పుట్టుకొచ్చిన రెండు కొత్త కరోనా వేరియంట్లతో వైరస్ వ్యాప్తి వేగంగా జరుగుతోంది. అంతేకాదు మొదటి వేరియంట్కు భిన్నంగా ఈ కొత్త స్ట్రెయిన్లు రోగులపై పంజా విసురుతున్నాయి. మొదట్లో వచ్చిన స్ట్రెయిన్ల వల్ల వారం పది రోజులకు కొందరి ఊపిరితిత్తుల్లో నిమ్ము చేరగా, ఇప్పుడు ఒకట్రెండు రోజులకే నిమ్ము చేరి పరిస్థితి సీరియస్ అవుతోంది. ఈ స్ట్రెయిన్లు ఇతర రాష్ట్రాలకు పాకితే పరిస్థితి ఏంటనే ఆందోళన అందరినీ వేధిస్తోంది. మహారాష్ట్రలో కొత్త స్ట్రెయిన్లు ఉన్నట్లు నిర్థారణ కావడంతో, సరిహద్దు రాష్ట్రం కర్ణాటక ప్రజా రవాణా వ్యవస్థలపైనా, ప్రయాణికుల రాకపోకలపైనా ఆంక్షలు విధించింది. మనదగ్గరి నుంచీ పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్రకు నిత్యం రాకపోకలు అధికంగా ఉంటాయి. కానీ తెలంగాణ వైద్య యంత్రాంగం మాత్రం ఇప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. అమరావతి, యావత్మాల్ జిల్లాల్లో పుట్టిన స్ట్రెయిన్లు మొదటి విడత కరోనాతో మహారాష్ట్ర అతలాకుతలమైంది. దేశంలో అత్యధికంగా అక్కడే కేసులు నమోదయ్యాయి. ఇప్పుడక్కడ మళ్లీ కరోనా కొత్త రూపంలో రాజుకుంది. మరో రెండు కొత్త స్ట్రెయిన్లు పుట్టుకొచ్చాయి. మహారాష్ట్రలో కోవిడ్ నియంత్రణ చర్యలు దేశంలోనే అధ్వానంగా ఉన్నాయని ఇటీవలి ఇండియన్ ఎకనమిక్ సర్వే తేల్చి చెప్పింది. అక్కడి అమరావతి జిల్లాలో నిత్యం వెయ్యి కేసుల వరకు నమోదు అవుతున్నాయి. దీంతో అక్కడ కరోనా వచ్చిన నలుగురు రోగులపై జన్యు విశ్లేషణ చేశారు. వారిలో కొత్తగా ఇ–484క్యూ అనే మ్యుటేషన్ను కనుగొన్నారు. ప్రమాదకరమైన దక్షిణాఫ్రికా వేరియంట్ ఇ–484కే అనే మ్యుటేషన్కు దగ్గరగా ఈ కొత్త వేరియంట్లో జన్యు మార్పులు కనిపించాయి. అలాగే అదే రాష్ట్రం యావత్మాల్ జిల్లాలో నలుగురిపై జన్యు విశ్లేషణ చేస్తే, గతంలో దక్షిణాది రాష్ట్రాల్లో కనిపించిన ఎన్–440కే మ్యుటేషన్కు దగ్గరగా ఉందని తేల్చారు. కేసుల వ్యాప్తిని ఆపకపోతే, ఇలాగే కొత్త స్ట్రెయిన్లు పుట్టుకొస్తాయని, మళ్లీ దేశమంతా విస్తరించే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దేశంలో 31 జిల్లాల్లో భారీగా కేసులు దేశంలో 718 జిల్లాలకు గాను, 31 జిల్లాల్లో రోజుకు 100కు పైగా కేసులు వస్తున్నాయి. అందులో కేరళలో మొత్తం 13 జిల్లాల్లో 100కు పైగా కేసులు నమోదవుతున్నాయి. మహారాష్ట్రలోనూ 13 జిల్లాల్లో 100కు పైగా కొత్త కేసులు వస్తున్నాయి. 20వ తేదీన అమరావతి జిల్లాలో ఒకేరోజు వెయ్యి కేసులు నమోదయ్యాయి. పుణే, ముంబై, థానే, నాగ్పూర్, అమరావతి జిల్లాల్లో రోజుకు 500కు పైగా నమోదవుతున్నాయి. గత వారంలో కేరళలో ప్రతి పది లక్షల జనాభాలో 750 మందికి కొత్తగా వైరస్ సోకింది. ఈ సంఖ్య దేశంలోనే ఎక్కువ. అలాగే మహారాష్ట్రలో పది లక్షల జనాభాకు గత వారంలో 250 మందికి వైరస్ సోకింది. దేశవ్యాప్తంగా తీసుకుంటే సగటున ప్రతి పది లక్షల్లో గత వారంలో 60 మందికి కరోనా సోకింది. తెలంగాణలో 40 మందికి సోకినట్లు నిర్ధారణ అయింది. అయితే కేరళలో పంచాయతీ ఎన్నికలు, ఓనం పండుగ తర్వాత భారీగా కేసులు పెరిగాయి. అప్పటి నుంచి అదే ట్రెండ్ కొనసాగుతోంది. మరిన్ని కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చే ప్రమాదం మహారాష్ట్రలో లాగా ఇతర ప్రాంతాల్లోనూ కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చే ప్రమాదముంది. మహారాష్ట్రలో రెండు కొత్త కరోనా వేరియంట్లు ప్రమాదకరంగా ఉన్నాయి. ఇతర ప్రాంతాల్లో కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్నాయా లేదా అన్నదానిపై జన్యు విశ్లేషణ చేయాలి. కరోనా వ్యాక్సిన్ అందరికీ అందాకే ప్రమాదం పోతుంది. అందువల్ల జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి. జనవరిలో దేశంలో ప్రతి వంద కేసుల్లో ఐదింటిపై జన్యువిశ్లేషణ చేయాలనుకున్నారు. కానీ అది పూర్తిస్థాయిలో జరగలేదు. ఇప్పటివరకు దేశంలో 8 వేల జన్యు విశ్లేషణలు చేశారు. అంటే 1,250 కేసుల్లో ఒక దానికి జన్యు విశ్లేషణ చేశారు. యూకేలో ప్రతీ 10 కేసుల్లో ఒకదానికి, ప్రపంచంలో ప్రతి 200కు ఒక జన్యు విశ్లేషణ చేశారు. – డాక్టర్ కిరణ్ మాదల, క్రిటికల్ కేర్ విభాగాధిపతి, నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ వేగంగా విస్తరణ... ఇప్పటివరకు దేశంలో ఉన్న కరోనా మ్యుటేషన్ల వల్ల వైరస్ వ్యాప్తి జరిగిన దానికంటే... కొత్త వేరియంట్లు మరింత వేగంగా విస్తరిస్తున్నాయి. అంతేకాదు సాధారణ మ్యుటేషన్ సోకిన కరోనా రోగుల్లో కొందరిలో ఊపిరితిత్తుల్లో నిమ్ము వారం పది రోజుల్లో వస్తే, ప్రస్తుతం అమరావతి కొత్త వేరియంట్ల రోగుల ఊపిరితిత్తుల్లో ఒకట్రెండు రోజుల్లోనే నిమ్ము వచ్చినట్లు జన్యు విశ్లేషణలో తేలింది. నాగ్పూర్ నుంచి ఔరంగాబాద్ మధ్య రహదారి కనెక్టివిటీ ఎక్కువగా ఉండటం వల్ల భారీగా కేసులు నమోదవుతున్నాయని అంచనా. -
భారత్లో కరోనా రూపాంతరాలు ఎన్నో తెలుసా..?
సాక్షి, హైదరాబాద్: ఒకటి, రెండు కాదు.. భారత్లో ఉన్న కరోనా వైరస్ రూపాంతరాలు ఎన్నో తెలుసా..? ఏకంగా 5 వేల పైమాటే. అవును ఈ విషయాన్ని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులార్ బయాలజీ (సీసీఎంబీ) వెల్లడించింది. సీసీఎంబీ శాస్త్రవేత్తలు ఇటీవల ప్రచురించిన పరిశోధనా వ్యాసం ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. గతేడాది జనవరి నుంచి ఇప్పటివరకు దేశంలో 5 వేల కంటే ఎక్కువ కరోనా వైరస్లు రూపాంతరం చెందడం ఆందోళన కలిగిస్తోంది. వీటిల్లో వేగంగా వ్యాప్తి చెందగల ఎన్–501–వై, నాశనం చేసేందుకు ఎక్కువ యాంటీబాడీలు అవసరమయ్యే ఈ–484–కేలు కూడా ఉన్నాయి. విస్తృత స్థాయిలో జన్యుక్రమాలను నమోదు చేయకపోవడం వల్ల ఇలాంటివి తక్కువ సంఖ్యలో కనిపిస్తున్నాయని సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్ రాకేశ్ మిశ్రా శుక్రవారం ఓ ప్రకటనలో వివరించారు. కొన్ని రూపాంతర వైరస్లు కొన్ని రాష్ట్రాల్లో ఎక్కువగా వ్యాప్తి చెందుతున్నాయని, ఎన్–440–కే రకం దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కువగా ఉందని వివరించారు. వైరస్ వ్యాప్తిని అర్థం చేసుకునేందుకు నిఘా ముమ్మరం చేయాలని, కొత్త రూపాంతరాలను వేగంగాగుర్తిస్తే.. అంతే వేగంగా చికి త్సపద్ధతులను అభివృద్ధి చేయొచ్చని వివరించారు. జూన్ కల్లా మార్పు.. ఏడాదిలోనే భారత్లో అన్ని రకాల రూపాంతరాలు ఎలా పరిణామం చెందాయన్న అంశాన్ని సీసీఎంబీ శాస్త్రవేత్తలు తాజా అధ్యయనంలో వివరించారు. గతేడాది జూన్ నాటికి దేశంలో కొంచెం నెమ్మదిగా వ్యాప్తి చెందుతుందనుకున్న ‘ఏ3ఐ’ స్థానంలో ప్రపంచవ్యాప్తంగా ఎక్కువచోట్ల ఉన్న ‘ఏ2ఏ’ రూపాంతరం వచ్చేసింది. ఇటీవల వెలుగు చూసిన రూపాంతరాల్లో వైరస్ కొమ్ములోనే ఎక్కువ జన్యుమార్పులు చోటు చేసుకున్నట్లు శాస్త్రవేత్త డాక్టర్ దివ్య తేజ్ సౌపాటి తెలిపారు. దేశంలో గుర్తించిన కొన్ని రూపాంతర వైరస్లు పదేపదే వ్యాధికి కారణం అవుతున్నాయని తాము గుర్తించినట్లు తెలిపారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 6,400 వైరస్ జన్యుక్రమాలు మాత్రమే నమోదై ఉన్నాయని, వీటిల్లోనే 5 వేల కంటే ఎక్కువ రూపాంతరాలు ఉన్నాయని అంచనా. కోవిడ్ బారిన పడ్డ వారిలో కనీసం 5 శాతం మందిలోని వైరస్ జన్యుక్రమాలను నమోదు చేసేందుకు కేంద్రం కార్యక్రమం చేపట్టిందని, ఇది వ్యాధి నియంత్రణ, చికిత్సల్లో కీలకం కానుందని డాక్టర్ సురభి శ్రీవాస్తవ తెలిపారు. -
నో డ్యూ ఉంటేనే రిజిస్ట్రేషన్లు
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ కోసం ధరణి పోర్టల్ ద్వారా సబ్ రిజిస్ట్రార్కు దరఖాస్తు చేసుకోవడానికి ముందు తప్పనిసరిగా సంబంధిత మున్సిపాలిటీ/మున్సిపల్ కార్పొరేషన్తో పాటు సంబంధిత విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం) నుంచి ‘నో డ్యూ’సర్టిఫికెట్ పొందాలని రాష్ట్ర ప్రభుత్వం కొత్త నిబంధన తీసుకొ చ్చింది. రిజిస్ట్రేషన్ దస్తావేజు ద్వారా వ్యవసాయేతర ఆస్తి యాజమాన్య హక్కుల బదిలీ చేయాలని కోరుకున్నా, విక్రయం, కానుక, తనఖా, బదిలీ చేయాలనుకున్నా ఈ నిబంధన వర్తి స్తుందని స్పష్టం చేసింది. దరఖాస్తు దారుడు తన వీలును బట్టి అందు బాటులో ఉన్న తేదీ, సమయం కోసం ధరణి పోర్టల్ ద్వారా సబ్ రిజిస్ట్రార్కు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆస్తి పన్నులు, ఇతర బకాయిలేవీ లేవని మున్సిపాలిటీ/కార్పొరేషన్ నుంచి, విద్యుత్ బిల్లుల బకాయిలు ఏవీ లేవని డిస్కంల నుంచి నో డ్యూ సర్టిఫికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. రాతపూర్వకంగా దరఖాస్తు చేసుకున్న 4 రోజుల్లోగా పురపాలికలు, డిస్కంలు నో డ్యూ సర్టిఫికెట్ ఇవ్వడంలో విఫలమైతే.. జారీ చేసినట్లే పరిగణిస్తారు. ధరణి పోర్టల్ ద్వారా మున్సిపాలిటీలు/మున్సిపల్ కార్పొరేషన్లలో వ్యవసాయేతర ఆస్తుల మ్యూటేషన్ ప్రక్రియకు సంబంధించిన నిబంధనలు–2020ను ప్రకటిస్తూ రాష్ట్ర పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్కుమార్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. జీహెచ్ఎంసీ మినహా రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లకు ఈ నిబంధనలు వర్తించనున్నాయి. ఉత్తర్వుల్లోని ముఖ్యాంశాలు.. ► వ్యవసాయేతర ఆస్తుల విక్రయం, తనఖా, గిఫ్టు, మార్పిడి (ఎక్స్చేంజ్)కి జరిపే రిజిస్ట్రేషన్, హక్కుల రికార్డు(రికార్డ్స్ ఆఫ్ రైట్స్)ల్లో యాజమాన్య మార్పుల ప్రక్రియ చేపట్టాలి. ► రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకున్న వ్యక్తికి సబ్ రిజిస్ట్రార్ తేదీ, సమయం కేటాయించి, ఈ వివరాలను అతడికి తెలపాలి. ఇందుకు సంబంధించిన వివరాలను నిర్దేశిత నమూనాలో రిజిస్టర్లో పొందుపర్చాలి. ► దస్తావేజు రిజిస్ట్రేషన్ రోజు సబ్ రిజిస్ట్రార్ రిజిస్ట్రేషన్ నిర్వహించి, నిర్దేశిత మ్యుటేషన్ చార్జీలు తీసుకున్న తర్వాత ఈ మేరకు సంబంధిత మున్సిపాలిటీ/మున్సిపల్ కార్పొరేషన్కు సంబంధించిన హక్కుల రిజిస్టర్లో తక్షణమే యాజమాన్య హక్కులు మార్పు చేయాలి. విక్రయం, గిఫ్టు, ఎక్స్చేంజీ ద్వారా ఆస్తి బదిలీ చేస్తున్న వ్యక్తి ఖాతా నుంచి ఆస్తిని తొలగించి, బదిలీ చేయించుకున్న వ్యక్తి ఖాతాలో జమ చేయడం ద్వారా తక్షణ మ్యుటేషన్ పూర్తి చేయాలి. ► తనఖా అయితే, ధరణిలో తనఖా లావాదేవీ వివరాలను రికార్డు చేయాలి. ► ఆస్తి రిజిస్ట్రేషన్లో భాగంగానే మ్యుటేషన్ జరగాలి. హక్కుల రికార్డుల్లోని వివరాలు.. ► మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలోని వ్యవసాయేతర ఆస్తులపై హక్కుల రికార్డులను ధరణి పోర్టల్లో డిజిటల్ రూపంలో తయారు చేసి నిర్వహిస్తారు. ఈ రికార్డుల్లో ఈ వివరాలుంటాయి. ► మున్సిపాలిటీలు/మున్సిపల్ కార్పొరేషన్లు నిర్వహించే ఆస్తుల రిజిస్టర్ ప్రకారం ఆస్తి యజమాని పేరు, సదరు ఆస్తిపై వారసత్వం కలిగిన కుటుంబ సభ్యుల పేర్లు. ► ప్రాంతం (లొకేషన్) వివరాలు, రకం, వినియోగం, విస్తీర్ణం ► ఆస్తి యజమాని, కుటుంబసభ్యుల గుర్తింపును రుజువు చేసేందుకు అవసరమైన ఇతర వివరాలు. ► ప్రతి మున్సిపాలిటీ/మున్సిపల్ కార్పొరేషన్ తన అధీనంలోని వ్యవసాయేతర ఆస్తుల వివరాలను నిర్దేశిత ఫార్మాట్లో ధరణి పోర్టల్లో పొందుపర్చాలి. ఇందుకు ఒకేసారి అవకాశం ఉంటుంది. ► ప్రతి మున్సిపాలిటీ/మున్సిపల్ కార్పొరేషన్ జారీ చేసే ప్రతి భవన నిర్మాణ అనుమతి, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు, లేఅవుట్, ప్లాట్ల అనుమతులను నిర్దేశిత ఫార్మాట్లో ధరణి పోర్టల్లో పొందుపర్చాలి. ప్రభుత్వ ఆస్తులకు వర్తించదు... ► కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన లేదా వీటి నియంత్రణ పరిధిలో ఉన్న వ్యవసాయేతర ఆస్తులకు ఈ నిబంధనలు వర్తించవు. -
అరగంటలో ‘మ్యుటేషన్’
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలోని వ్యవసాయే తర ఆస్తులు, భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ అరగంటలో పూర్తయ్యేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ధరణి పోర్టల్లోని ఎరుపు రంగు విండో ద్వారా రిజిస్ట్రేషన్తోపాటు మ్యుటేషన్ కూడా వేగంగా పూర్తయ్యేలా రూపొందించిన సాఫ్ట్వేర్ను ఇందుకోసం ఉపయోగించనుంది. రాష్ట్రంలోని 141 సబ్ రిజిస్ట్రార్ కార్యాల యాల్లో ఈ నెల 23 నుంచి ఈ సేవలు అందు బాటులోకి రానున్నాయి. గ్రామ పంచా యతీలు, మున్సిపల్ కార్యాలయాలకు వెళ్లే అవసరం లేకుండానే సబ్ రిజిస్ట్రార్ కార్యాల యాల్లోనే మ్యుటేషన్లు పూర్తి కానున్నాయి. సరళీకృత ఫార్మాట్లో.. వ్యవసాయేతర భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ కోసం సులభతరమైన, సరళీకృత విధానాన్ని ప్రభుత్వం అందుబాటులోకి తెస్తోంది. ఈ విధానం ప్రకారం భూములు, ఆస్తుల హక్కుల మార్పిడి, క్రయవిక్రయ రిజిస్ట్రేషన్ లావాదేవీల కోసం ధరణి పోర్టల్లోని ఎరుపు రంగు విండో (నాన్ అగ్రికల్చర్)ను క్లిక్ చేసిన తర్వాత వచ్చే పేజీలో ‘సిటిజన్ స్లాట్ బుకింగ్’ ఆప్షన్ను ఎంచుకోవాల్సి ఉంటుంది. సిటిజన్ లాగిన్ పేజీలో మొబైల్ నంబర్ నమోదు చేయగానే వచ్చే పాస్వర్డ్ను ఎంటర్ చేయాలి. ఆ తర్వాత డాక్యుమెంట్ నంబర్, క్రయ, విక్రయదారులకు సంబంధించిన వ్యక్తిగత సమాచారం నమోదు చేయాలి. స్లాట్ బుక్ కాగానే అమ్మకందారుడు లేదా కొనుగోలుదారుడి మొబైల్ నంబర్కు సమాచారం వస్తుంది. ఆ సమాచారం ప్రకారం అమ్మకందారులు, కొనుగోలుదారులు, సాక్షులు రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు వెళ్లాల్సి ఉంటుంది. అప్పుడు స్లాట్ బుకింగ్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ దస్తావేజుకు సంబంధించిన డేటా ఎంట్రీ చేస్తారు. నిర్దేశిత స్టాంపు డ్యూటీ, ఇతర చార్జీలను ఆన్లైన్లో ఈ–చలాన్ విధానంలో చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత సాక్షులు, క్రయ, విక్రయదారుల వివరాలు, బయోమెట్రిక్ ఆధారాలను డేటా ఎంట్రీ ఆపరేటర్ తీసుకుంటారు. ఇది పూర్తికాగానే సబ్ రిజిస్ట్రార్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభిస్తారు. డేటా ఎంట్రీ ఆపరేటర్లు మళ్లీ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లను స్కాన్ చేసి అప్లోడ్ చేస్తారు. వెంటనే మ్యుటేషన్ సిగ్నేచర్ కోసం సబ్ రిజిస్ట్రార్కు పంపిస్తారు. ఈ సంతకం చేయడంతోనే సదరు భూమి లేదా ఆస్తి రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ ప్రక్రియ పూర్తవుతుంది. నేటి నుంచి ట్రయల్ రన్ .. బీఆర్కేఆర్ భవన్లో ఏర్పాటు చేసిన ధరణి వార్రూంలో వ్యవసాయేతర భూములు, ఆస్తులకు సంబంధించి రోజుకు 10 రిజిస్ట్రేషన్ల చొప్పున మూడు రోజులపాటు అధికారులు ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. ధరణి సాఫ్ట్వేర్ పనితీరును పరిశీలించనున్నారు. ఈ నెల 23న నుంచి స్లాట్ బుకింగ్ ద్వారా పూర్తిస్థాయిలో సేవలను అందుబాటులోకి తీసుకురానున్నారు. -
వ్యవసాయేతర ఆస్తులకు..మెరూన్ పాస్బుక్
సాక్షి, హైదరాబాద్: దేశంలో తొలిసారిగా తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయేతర ఆస్తులు కలిగివున్న ప్రజలందరికీ ముదురు ఎరుపు (మెరూన్) రంగు పట్టాదార్ పాస్బుక్స్ జారీచేయను న్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ప్రకటించారు. ప్రజల దీర్ఘకాలిక, విశాల ప్రయోజనాలను ఆశించి ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. భూ వివాదాలు, ఘర్షణల నుండి ప్రజలను శాశ్వతంగా రక్షించడం కోసం, ఆస్తులకు పక్కా హక్కులు కల్పించడం కోసం ఈ పాస్ పుస్తకాలను జారీ చేస్తున్నట్లు íసీఎం చెప్పారు. కొత్తగా అమల్లోకి తెస్తున్న విప్లవాత్మక రెవెన్యూ చట్టంతో పేద, మధ్య తరగతి సహా ప్రజలందరి ఆస్తులకు పూర్తిస్థాయి రక్షణ కల్పించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమ న్నారు. రెవెన్యూ చట్టం అమలు, ధరణి పోర్టల్లో వ్యవసాయేతర ఆస్తుల నమోదు అంశాలపై బుధవారం ప్రగతిభవన్లో నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షలో సీఎం పలు కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. ధరణి పోర్టల్ రూపకల్పనలో కాస్త ఆలస్యమైనా పర్వాలేదు కానీ... పోర్టల్ ప్రారంభమైన తర్వాతే వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల రిజిస్టేషన్ ప్రక్రియ జరుగుతుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. సాదాబైనామాలకు చివరి అవకాశం గ్రామీణ ప్రాంతాల్లో భూముల కొనుగోళ్ల పరస్పర మార్పిడికి సంబంధించిన సాదాబైనామాలను ఉచితంగా మ్యుటేషన్ చేయించే ప్రక్రియకు చివరిసారిగా త్వరలో అవకాశం కల్పించనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. దీనికి సంబంధించిన వివరాలు ఒకటి రెండు రోజుల్లో ప్రకటిస్తామని , భవిష్యత్తులో ఇక సాదాబైనామాలను అనుమతించే ప్రశ్నే లేదని సీఎం తెలిపారు. అయితే ధరణి పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, ఇంకా వివాదాలు ఉంటే కోర్టులో తేల్చుకోవాల్సి ఉంటుందని సీఎం వివరించారు. పేదల ఇళ్లు క్రమబద్ధీకరణ.. నిరుపేద ప్రజలు ఎన్నో ఏళ్లుగా వుంటున్న ఇండ్ల స్థలాలను పూర్తిస్థాయిలో రెగ్యులరైజ్ చేయనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. దీనివల్ల నిరుపేదల ఇంటి స్థలాలకు రక్షణ ఏర్పడడమే కాకుండా, ఆ ఆస్తుల మీద బ్యాంకు రుణాలు తీసుకునే వెసులుబాటు కలుగుతుందని పేర్కొన్నారు. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల పరిధిలోని వ్యవసాయ భూముల్లో నిర్మించుకున్న ఇండ్లు, ఇతర ఆస్తులకు ఉచితంగా నాలా కన్వర్షన్ చేయనున్నట్లు సీఎం ప్రకటించారు. వ్యవసాయ భూముల వద్ద నిర్మించుకున్న ఇండ్లు తదితర ఆస్తుల విస్తీర్ణాన్ని వ్యవసాయ కేటగిరి నుంచి తొలగించే విషయంలో ప్రజలకు సర్పంచులు, ఎంíపీటీసీలు, గ్రామ కార్యదర్శులు, మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, సిబ్బంది పూర్తి స్థాయిలో సహకరించాలని, ఎంపీఓలు పర్యవేక్షించాలని సూచించారు. మ్యుటేషన్ తప్పనిసరి.. ఉచితం ఆస్తుల మ్యుటేషన్ ఇప్పుడు చేయించుకోకపోతే భవిష్యత్తులో ఆస్తులను తమ పిల్లలకు బదిలీ చేసే విషయంలో ప్రమాదం తలెత్తే అవకాశం వుందని ముఖ్యమంత్రి కేసీఆర్ హెచ్చరించారు. గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పోరేషన్ల పరిధిలోని ఇండ్లు, ప్లాట్లు, ఫ్లాట్లు, వ్యవసాయ భూముల దగ్గర నిర్మించుకున్న, బావుల కాడి ఇండ్లు, ఫామ్ హౌజ్లు తదితర వ్యవసాయేతర ఆస్తులన్నింటినీ ఒక్క పైసా చెల్లించకుండా ఉచితంగా ఆన్లైన్లో ఎన్రోల్ (మ్యుటేషన్) చేయించుకోవాలని సీఎం రాష్ట్ర ప్రజలకు విజప్తి చేశారు. గ్రామాలు, మున్సిపాలిటీల్లోని ప్రతీ ఇంటి వివరాలు ఆన్లైన్లో నమోదు కావాలి, ఇంటికి నెంబర్ కేటాయించాలి, పన్నులు వసూలు చేయాలి అని సీఎం ఆదేశించారు. ఎండోమెంట్, వక్ఫ్, ఎఫ్టీఎల్, నాలా, యూఎల్సీ భూముల్లో నిర్మించుకున్న ఇండ్లకు మ్యుటేషన్ వర్తించదని సీఎం స్పష్టం చేశారు. ఇకముందు ఒక ఇంచు భూమి బదిలీ కావాలంటే కూడా... ధరణి పోర్టల్ ద్వారా మాత్రమే రిజిస్ట్రేషన్ జరుగుతుందని సీఎం తెలిపారు. అందుకే వ్యవసాయేతర ఆస్తుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయించుకోవాలని సీఎం ప్రజలను కోరారు. ఆస్తుల మ్యుటేషన్కు, ఎల్ఆర్ఎస్కు ఎలాంటి సంబంధం లేదని, ఇండ్లు ఎలా నిర్మించారనేది పంచాయతీరాజ్, మున్సిపల్ చట్టాలకు, నిబంధనలకు లోబడే వుంటుందని సీఎం వివరించారు. భవిష్యత్లో ఆస్తుల నమోదు ప్రక్రియ, క్రమబద్ధీకరణ, ఉచిత నాలా కన్వర్షన్ చేయడం... ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండదని, ఇదే చివరి అవకాశమని సీఎం తెలిపారు. ఈ సమావేశంలో మంత్రులు కె.టి.రామారావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. నోటరీ, జీ.వో 58, 59 స్థలాల ఉచిత క్రమబద్ధీకరణ రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఉన్న నోటరీ, జీవో 58, 59 పరిధిలోని పేదల ఇండ్లను ఉచితంగా క్రమబద్దీకరించనున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. దీనికి సంబంధించిన వివరాలు ఒకటి రెండు రోజుల్లో జీవో ద్వారా వెల్లడించనున్నట్లు వివరించారు. రెవెన్యూ చట్టం అమలు, ధరణి పోర్టల్ రూపకల్పన, వ్యవసాయేత్తర ఆస్తుల ఆన్లైన్ నమోదు, నోటరీ, జీవో 58, 59 ఆస్తుల ఉచిత క్రమబద్దీకరణ తదితర అంశాలపై గ్రేటర్ హైదరాబాద్తో పాటు రాష్ట్రంలోని మున్సిపల్ కార్పోరేషన్ల పరిధిలోని ఎమ్మెల్యేలు, మేయర్లతో సీఎం కేసీఆర్ గురువారం ప్రగతిభవన్లో సమావేశం కానున్నారు. -
10 రెట్లు ప్రమాదకరంగా మారిన వైరస్!
కౌలాలంపూర్: కరోనా వైరస్ ప్రపంచ దేశాలను అల్లకల్లోలం చేస్తోంది. భారత్లో 26 లక్షలకు పైగా కేసులు నమోదు కాగా.. 50 వేలకు పైగా మరణించారు. మహమ్మారిని కట్టడి చేయగల వ్యాక్సిన్ కోసం ప్రపంచ దేశాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. రష్యా ఇప్పటికే వ్యాక్సిన్ను ప్రకటించడమే కాక ఉత్పత్తిని కూడా ప్రారంభించింది. ఈ నేపథ్యంలో మలేషియాలో వెలుగు చూసిన కొన్ని కరోనా కేసులు ప్రపంచ దేశాలకు మరో నూతన సవాలు విసురుతున్నాయి. తాజాగా మలేషియాలో కరోనా వైరస్ కొత్త జాతిని గుర్తించిన శాస్త్రవేత్తలు, ఇది ప్రస్తుతం ఉన్న వైరస్ కంటే 10 రెట్లు ప్రమాదకరమైనదిగా వెల్లడించారు. మలేషియాలో తాజాగా వెలుగు చూసిన కొన్ని కేసుల్లో వేగంగా వ్యాప్తి చెందేలా కరోనా వైరస్ మార్పుకు గురయినట్లు సంకేతాలు వెలువడుతున్నాయని అమెరికా అంటువ్యాధి నిపుణుడు డాక్టర్ ఆంథోనీ ఫౌసీ హెచ్చరించారు. (కరోనా పడగ నీడలో 200 రోజులు) ఇలా పరివర్తనం(మార్పు) చెందిన కరోనా వైరస్కు ‘డీ614జీ’గా నామకరణం చేశారు. ఇందుకు సంబంధించి బ్లూమ్బర్గ్ ఓ నివేదిక విడుదల చేసింది. మలేషియాలోని ఓ రెస్టారెంట్ యజమాని నుంచి ప్రారంభైన క్లస్టర్లో 45 కేసులు వెలుగు చూడగా.. వాటిలో మూడు కేసులలో ఈ ‘డీ614జీ’గా పిలవబడే పరివర్తన కరోనా వైరస్ను గుర్తించారు. సదరు రెస్టారెంట్ యజమాని ఇండియా నుంచి మలేషియా వచ్చి.. 14 రోజుల క్వారంటైన్ నిబంధనను ఉల్లంఘించాడు. అతడి రెస్టారెంట్ కేంద్రంగా 45 కేసులు వెలుగు చూడటంతో మలేషియా ప్రభుత్వం అతడికి ఐదు నెలల జైలు శిక్షతో పాటు జరిమానాను కూడా విధించింది. ఇక బ్లూమ్బర్గ్ నివేదికలో హెల్త్ డైరెక్టర్ జనరల్ నూర్ హిషమ్ అబ్దుల్లా ‘కరోనా వైరస్ పరివర్తనానికి(మ్యూటేషన్) గురవుతుంది. ఫలితంగా వ్యాక్సిన్ల అభివృద్ధికై ఇప్పటి వరకూ ఉన్న అధ్యయనాలు అసంపూర్తిగా లేదా అసమర్థంగా ఉండవచ్చు’ అని అభిప్రాయపడ్డారు. అంతేకాక ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ‘ఎందుకంటే పరివర్తనానికి గురైన కరోనా వైరస్ ప్రస్తుతం మలేషియాలోనే వెలుగు చూసింది. ఈ సంక్రమణ గొలుసును విచ్ఛిన్న చేయాలంటే ప్రజల సహకారం చాలా అవసరం’ అని హిషామ్ ఆదివారం ఫేస్బుక్ వేదికగా జనాలను కోరారు. అంతేకకా ఫిలిప్పీన్స్ నుంచి తిరిగి వచ్చిన వ్యక్తులతో సంబంధం ఉన్న మరో క్లస్టర్లో కూడా ఈ జాతి కనుగొనబడిందన్నారు. (వైరస్ గుట్టు తెలిసింది!) గత ఏడాది డిసెంబర్లో చైనాలోని వుహాన్లో కరోనా వైరస్ మొదటిసారిగా వెలుగుచూసింది. అప్పటి నుంచి శాస్త్రవేత్తలు కరోనావైరస్ జన్యు పదార్ధంలో ఉత్పరివర్తనలు, మార్పులను గుర్తించారు. ఐరోపా, అమెరికాల్లో వైరస్ మ్యుటేషన్కు గురైనప్పటికి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ జాతి మరింత తీవ్రమైన అనారోగ్యానికి దారితీస్తుందని నిరూపించేందుకు ఎలాంటి ఆధారాలు లేవని తెలిపింది. అదేవిదంగా సెల్ ప్రెస్లో ప్రచురితమైన ఒక పత్రిక, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్న వ్యాక్సిన్ల పనితీరుపై మ్యుటేషన్ పెద్ద ప్రభావాన్ని చూపే అవకాశం లేదని నివేదించింది. (సగం పనిచేసే వ్యాక్సిన్ వచ్చినా చాలు) -
ఇప్పుడు మ్యుటేషన్ మహా సులువు
► విశాఖ జిల్లా పెందుర్తి మండలం ముదపాక గ్రామానికి చెందిన శియాద్రి ఈశ్వరమ్మ నుంచి దొరపల్లి నరసమ్మ గత జూన్ 6న భూమి కొనుగోలు చేశారు. నరసమ్మ తహసీల్దారు కార్యాలయానికి వెళ్లనేలేదు. అయినా.. ఆమె కొనుగోలు చేసిన భూమిపై ఆమెకు యాజమాన్య హక్కులు బదలాయిస్తూ ఈనెల 7న రెవెన్యూ అధికారులు వెబ్ల్యాండ్లో నమోదు చేశారు. ► వైఎస్సార్ జిల్లా రాజంపేట మండలం పోలి గ్రామానికి చెందిన కొవ్వూరు వెంకట సుబ్బయ్య తన గ్రామంలో భూమిని గత నెలలో కొనుగోలు చేశారు. 16 రోజుల్లోనే రెవెన్యూ అధికారులు వెబ్ల్యాండ్లో మ్యుటేషన్ ప్రక్రియ పూర్తిచేశారు. ► అలాగే, కృష్ణాజిల్లా ముదినేపల్లి మండలం పెదగొన్నూరు గ్రామానికి చెందిన కలిదిండి లక్ష్మి నుంచి కలిదిండి నగేష్ గత నెల ఒకటో తేదీన 3.75 ఎకరాల భూమి కొనుగోలు చేశారు. తహసీల్దార్ ఆఫీసుకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే అధికారులు భూమిని మ్యుటేషన్ చేశారు. సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా అమల్లోకి తెచ్చిన ఆటో మ్యుటేషన్ విధానం విప్లవాత్మక మార్పు తెచ్చిందనడానికి ఇవి ఉదాహరణలు మాత్రమే. విక్రయ రిజిస్ట్రేషన్లు జరిగిన వెంటనే కొనుగోలుదారుల పేరుతో భూ యాజమాన్య హక్కులు బదలాయించాలని ప్రభుత్వం తీసుకున్న సాహసోపేత నిర్ణయం సత్ఫలితాలిస్తోంది. గతంలో కొనుగోలుదారులు, వారసత్వంగా, భాగ పరిష్కారం ద్వారా భూమి సంక్రమించిన వారు రెవెన్యూ రికార్డులైన భూ అనుభవ పత్రం (అడంగల్), భూయాజమాన్య హక్కు పత్రం (1బి)లో తమ పేర్ల నమోదు కోసం అధికారుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. రెవెన్యూ సిబ్బందికి ముడుపులు ఇవ్వనిదే మార్పులు (మ్యుటేషన్లు) జరిగేవి కావు. ఈ పరిస్థితిని మార్చడం కోసమే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సర్కారు ఆటో మ్యుటేషన్ విధానం తెచ్చింది. దరఖాస్తు చేయాల్సిన అవసరం లేకుండానే రిజిస్ట్రేషన్ జరిగిన నెల రోజుల్లోగా రెవెన్యూ రికార్డుల్లోని హక్కుదారులు/అనుభవదారుల కాలమ్లో కొనుగోలుదారుల పేర్లు నమోదు చేసే ఆటో మ్యుటేషన్ ప్రక్రియను గత ఫిబ్రవరి 11న సీఎం లాంఛంగా ప్రారంభించారు. అనంతరం అధికారులు ఇందుకు సంబంధించిన నియమ నిబంధనలు జారీచేశారు. ఆటో మ్యుటేషన్ అంటే.. భూమిని ఎవరైనా కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేయించుకుంటే అమ్మకందారు నిజమైన హక్కుదారేనా? లేక వేరేవారి ఆస్తిని మోసపూరితంగా రిజిస్ట్రేషన్ చేశారా? సదరు ఆస్తిపై వేరెవరికైనా హక్కులు ఉన్నాయా? అనే అంశాలపై విచారణ జరిపి అన్నీ సక్రమంగా ఉంటే ఆస్తి కొనుగోలుదారు పేరుతో బదలాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనినే ఆటో మ్యుటేషన్ అంటారు. ప్రభుత్వం విధించిన నెలరోజుల గడువులోగా అధికారులు ఈ ప్రక్రియ పూర్తిచేయకపోతే.. తహసీల్దారు అంగీకారం లేకపోయినా అంగీకరించినట్లుగానే పరిగణించి కొనుగోలుదారు పేరుతో మ్యుటేషన్ పూర్తవుతుంది. దీనినే డీమ్డ్ మ్యుటేషన్ అంటారు. ఆటో మ్యుటేషన్ అమలు ఎలాగంటే.. ► మ్యుటేషన్ కోసం ఎవరూ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరంలేదు. తహసీల్దారు కార్యాలయం గడప తొక్కాల్సిన పనీలేదు. రిజిస్ట్రేషన్ వివరాల ప్రకారం వాకబు చేసి రెవెన్యూ అధికారులు రికార్డులు సవరించాలనేది ప్రభుత్వ విధానం. ► సాధారణంగా సబ్ రిజిస్ట్రారు కార్యాలయాల్లో నిత్యం వివిధ రూపాల్లో స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లు జరుగుతుంటాయి. ► ఆస్తి రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన వారి సర్టిఫికెట్లు (ఆధార్ కార్డు, వెబ్ల్యాండ్ డేటా) అన్నీ పరిశీలించి వాస్తవ హక్కుదారులే విక్రయిస్తున్నారని నిర్ధారించుకున్న తర్వాతే సబ్ రిజిస్ట్రారు రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిచేస్తారు. ఏదైనా అనుమానం వస్తే పెండింగ్లో పెడతారు. ► ఇలా రిజిస్ట్రేషన్ జరిగిన వెంటనే ఆస్తి యజమాని కాలమ్లో అమ్మిన వారి పేరును తొలగించి కొనుగోలుదారు పేరును సబ్ రిజిస్ట్రారు నమోదుచేస్తారు. ► తహసీల్దారు ఎస్ఆర్వో (సబ్ రిజిస్ట్రారు ఆఫీసు) లాగిన్ ఓపెన్ చేయగానే మార్పులు కనిపిస్తాయి. ► వీటిని తహసీల్దారు తాత్కాలికంగా ఆమోదించగానే సదరు ఆస్తి విక్రయ రిజిస్ట్రేషన్పై అభ్యంతరాలను ఆహ్వానిస్తూ ఫారం–8 జారీ అవుతుంది. దానిని గ్రామ సచివాలయంలో ప్రదర్శిస్తారు. ► అభ్యంతరాల సమర్పణకు 15 రోజుల గడువు ఉంటుంది. ఈ సమయంలోనే సచివాలయ సర్వేయరు సదరు భూమిని పరిశీలించి రుసుం చెల్లించిన వారికి సబ్ డివిజన్ చేసి సరిహద్దులు ఖరారుచేసి మండల సర్వేయరు లాగిన్కు నివేదిక పంపుతారు. మండల సర్వేయరు పరిశీలించి ఆమోదిస్తారు. ► 15 రోజుల్లో అభ్యంతరాలు రాని పక్షంలో వీఆర్ఓ, ఆర్ఐ అదే విషయాన్ని తహసీల్దారు లాగిన్కు పంపుతారు. తహసీల్దారు ఆమోదించగానే రెవెన్యూ రికార్డుల్లో మార్పులు జరిగిపోతాయి. మ్యుటేషన్ను ఆమోదిస్తూ ఫారం–14 జారీచేస్తారు. ► వెబ్ల్యాండ్లో మ్యుటేషన్ పూర్తికాగానే కొత్త యజమాని అయిన కొనుగోలుదారులు మీభూమి వెబ్ పోర్టల్ నుంచి ఇ–పట్టాదారు పాసు పుస్తకం, ఇ–టైటిల్ డీడ్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ► ఈ మొత్తం ప్రక్రియలో అవకతవకలు, అక్రమాల నియంత్రణకు ప్రభుత్వం ప్రతీదశలోనూ ఆస్తి యజమానులు, కొనుగోలుదారులకు ఎస్సెమ్మెస్లు పంపించే విధానం అమలుచేస్తోంది. రాష్ట్రస్థాయిలో బృందం పర్యవేక్షణ తహసీల్దార్లు తిరస్కరించిన వాటిని ఆర్డీవో పరిశీలించాలి. అంతేకాక.. రాష్ట్ర భూ పరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) ఆఫీసులో ప్రత్యేకంగా ఒక బృందాన్ని పెట్టాం. ప్రతి తిరస్కృత మ్యుటేషన్ను ఈ బృందం పరిశీలించి నివేదిక ఇస్తుంది. తనది కాని ఆస్తిని వేరేవారు విక్రయించి ఉంటే కచ్చితంగా మ్యుటేషన్ను తిరస్కరించడంతోపాటు తప్పుడు రిజిస్ట్రేషన్ చేసిన వ్యక్తిపై కేసులు కూడా పెడతాం. – చెరుకూరి శ్రీధర్, జాయింట్ కమిషనర్, సీసీఎల్ఏ -
మ్యుటేషన్..ఇక సులువే!
ఎల్.ఎన్.పేట, టెక్కలి, ఆమదాలవలస: స్థిరాస్తి రిజిస్ట్రేషన్ల ద్వారా భూమి హక్కులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చింది. భూములతో పాటు ఇతర స్థిరాస్తుల క్రయ విక్రయాలు జరిగిన సందర్భంలో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కీలక పాత్ర పోషిస్తుంది. రిజి స్ట్రేషన్ల తర్వాత భూమి ఓనర్షిప్ మార్పుల కోసం కొనుగోలు చేసిన యజమాని రెవెన్యూ (తహసీల్దారు కార్యాలయం) అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగేవారు. ఇలా అయినా సవాలక్ష ఆంక్షలు చూపించి భూ యజమానులు సహనాన్ని కోల్పోయేలా చే యడం పరిపాటిగా ఉండేది. ఇక నుంచి రోజుల తరబడి రెవె న్యూ అధికారుల చుట్టూ తిరగాల్సిన పనిలేకుండా భూమి ఓనర్షిప్ మార్పును ప్రభుత్వం సులభతరం చేసింది. రిజిస్ట్రేషన్ పరిభాషలో దీన్నే ‘ఆటో మ్యుటేషన్’ అంటారు. సీసీఎల్ఏ ద్వారా ఉత్తర్వులు ఈ ఆటో మ్యుటేషన్ ప్రక్రియ రాష్ట్ర వ్యాప్తంగా అమలయ్యేలా సీసీఎల్ఏ ఈ ఏడాది ఫిబ్రవరి 20న ప్రత్యేక సర్క్యులర్ను ప్ర భుత్వం జారీ చేసింది. దీని ప్రకారం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ జరిగిన వెంటనే భూమి ఓనర్షిప్ (మ్యుటేషన్) మార్చేలా ఈ విధానం అమల్లోకి తీసుకువచ్చారు. రిజిస్ట్రేషన్ జరిగిన తర్వాత భూమికి ఆయా మండలాల తహసీల్దార్లు విచారణ నిర్వహించి నిర్ధారణ కూడా చేపడతారు. దీని కోసం ఆర్ఓఆర్ యాక్టు–1971కి సవరణలు చేయటం ద్వారా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టారు. ఈ ప్రక్రియ పూర్తిగా ఎలక్ట్రానికల్లీ మెయిన్టెయిన్డ్ రెవెన్యూ రికార్డ్స్(వెబ్ల్యాండ్) మీద ఆధారపడి ఉంటుంది. ఈ ఆటో మ్యుటేషన్ ప్రక్రియ రెండు పద్ధతుల ద్వారా జరుగుతుంది. ఒకటి సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలో, రెండోది తహసీల్దారు కార్యాలయంలో చేపడతారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో జరిగే ప్రక్రియ భూముల క్రయ విక్రయాలు జరిగిన తర్వాత వ్యవసాయ భూమిని కలిగిన వ్యక్తి దాన్ని అమ్మడం కోసం(విక్రయం), భాగాలు చేయటం (పార్టీషన్–కుటుంబ సభ్యుల మధ్య వాటాలు), బహుమతి(గిఫ్ట్) ఇవ్వటం కోసం గానీ సబ్ రిజిస్టార్ కార్యాలయాన్ని సందర్శిస్తాడు. అందులో భాగంగా వెబ్ల్యాండ్ 1–బి తప్పనిసరిగా సరిచూసుకుని రిజిస్ట్రేషన్ చేస్తారు. – తన కార్యాలయానికి వచ్చిన అమ్మకందారు, కొనుగోలుదారుల ఈ–కేవైసీని సబ్ రిజి స్ట్రార్ నిర్ధారణ చేసుకుంటారు. – అమ్మకందారుడు తీసుకువచ్చిన భూములకు సంబంధించి వెబ్ల్యాండ్ రికార్డ్స్తో పోల్చి చూస్తారు. – రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిన వెంటనే సబ్ రిజిస్ట్రార్ తన కార్యాలయంలో తాత్కాలిక మ్యుటేషన్ తన డిజిటల్ సంతకం ద్వారా చేస్తారు. – తాత్కాలిక మ్యుటేషన్ పూర్తయిన వెంటనే సంబంధిత రికార్డు తహసీల్దారు కార్యాలయంలో ఉండే వెబ్ల్యాండ్కు తదుపరి ప్రక్రియ ద్వారా పంపుతారు. – ఈ విధంగా తాత్కాలిక మ్యుటేషన్ జరిగిన వెంటనే అమ్మకం, కొనుగోలు దారులు ఇద్దరికీ ఎస్ఎంఎస్ అలెర్ట్ కూడా వెళుతుంది. – కొనుగోలుదారుడు ఒకవేళ సర్వే సబ్ డివిజన్ చేయించాలనుకుంటే తగిన ఫీజును గ్రామ సచివాలయం, మీ–సేవ వద్ద చెల్లించవచ్చు. తహసీల్దారు కార్యాలయం వద్ద జరిగే ప్రక్రియ.. సబ్ రిజిస్ట్రార్ కార్యాయంలో రిజిస్ట్రేషన్ పూర్తయిన వెంటనే అక్కడ నుంచి తహసీల్దారు కార్యాలయానికి ఆన్లైన్ ద్వారా తాత్కాలిక మ్యుటేషన్ కోసం వస్తుంది. ఫారం–8ను జనరేట్ చేసి ఆయా గ్రామ పంచాయతీ, సచివాలయ నోటీస్ బోర్డులో ఉంచుతారు. 15 రోజుల్లో వీటికి సంబంధించిన అభ్యంతరాలు వస్తే వాటిని పరిగణలోకి తీసుకుని విచారిస్తారు. – రిజిస్ట్రేషన్ జరిగిన 15 రోజుల్లో మొత్తం ప్రక్రియ పూర్తి చేయాలి. ఇందుకోసం గ్రామ రెవెన్యూ అధికారి ఏడు రోజుల్లో, ఆర్ఐ, డిటీలు మూడు రోజుల్లో విచారణ పూర్తి చేయాలి. – ప్రొవిజనల్ మ్యుటేషన్ రికార్డును ఫీల్డ్ మీద విచారణ కోసం, నోషనల్ సబ్ డివిజన్ను ఎఫ్ఎంబీ, ఫీల్డ్ మీద మార్కింగ్ చేయటం కోసం సంబంధిత గ్రామ సర్వేయర్కి పంపుతారు. ఈ ప్రక్రియ మొత్తం 15 రోజుల్లో పూర్తి చేయాలి. – విచారణ చేసిన డ్రాఫ్ట్ సబ్ డివిజన్ రికార్డును గ్రామ సర్వేయర్, మండల సర్వేయర్ ద్వారా తహసీల్దార్ అప్రూవల్ కోసం పంపుతారు. ఇలా వచ్చిన సబ్ డివిజన్ రికార్డులు ఫీల్డ్ రిపోర్టు, అభ్యంతరాలు పరిశీలించిన మీదట అంగీకరించటమా, తిరస్కరించటమా అన్నది స్పీకింగ్ ఆర్డర్ ద్వారా జారీ చేస్తారు. తద్వారా తదుపరి ప్రక్రియను వెబ్ల్యాండ్ ద్వారా పూర్తి చేస్తారు. – సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి వచ్చిన తాత్కాలిక మ్యుటేషన్పై 30 రోజుల్లో ఎలాంటి చర్యలు తీసుకోకపోతే డీమ్డ్ మ్యుటేషన్ అవుతుంది. – తహసీల్దారు కార్యాలయంలో మ్యుటేషన్ పూర్తయిన వెంటనే అమ్మకందారుడు, కొనుగోలుదారుడికి ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం వెళుతుంది. అప్పుడు కొనుగోలుదారుడు ఈ–పాస్ బుక్, టైటిల్ డీడ్, సబ్ డివిజన్ రికార్డును మీ భూమి పోర్టల్ ద్వారా తీసుకోవచ్చు. ఇబ్బంది కలగకుండా.. భూమి హక్కుదారునికి ఇబ్బంది కలగకుండా ఆటో మ్యుటేషన్ విధానం ఎంతగానో ఉపయోగపడుతుంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత మీ–సేవ కేంద్రంలో ఈ–పాస్ బుక్ కోసం దరఖాస్తు చేసుకునేవారు. కొత్తవిధానంలో అలా చేయాల్సిన అవసరం లేకుండా పోయింది. రిజిస్ట్రార్ కార్యాలయం నుంచే ఆన్లైన్లో వివరాలు వస్తున్నాయి. వీటిని పరిశీలించి ఓనర్షిప్ మార్చి ఈ–పాస్ పుస్తకం కోసం సిఫార్స్ చేస్తున్నాం, ఈ విధానం రైతులకు, అధికారులకు ఎంతో సులువైనదిగా ఉంది. – రషీద్ అహ్మద్, ఉప తహశీల్దారు, ఎల్ఎన్ పేట రిజిస్ట్రేషన్ విధానంలో కొత్త మార్పులు రిజిస్ట్రేషన్ విధానంలో కొత్త మార్పులు చోటు చేసుకున్నాయి. కొనుగోలుదారులకు మేలు జరిగేలా రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఆటో మ్యుటేషన్ విధానంలో భూమి రిజిస్ట్రేషన్ జరిగిన తర్వాత వివరాలు తెలియజేస్తూ తహశీల్దారు కార్యాలయానికి నివేదికను ఆన్లైన్లో పంపిస్తాం. భూమి ఓనర్ పేరు, వివరాలు తహసీల్దారు కార్యాలయంలో 15 రోజుల వ్యవధిలోనే మార్పులు జరుగుతాయి. గతంలో భూమి హక్కు పొందాలంటే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనేవారు ఇప్పుడు సులభతరం అయింది. – బి.లక్ష్మీనారాయణ, సబ్ రిజిస్ట్రార్, పాతపట్నం -
వైరస్ మార్పు చెందుతోందా?
న్యూఢిల్లీ: దేశంలో గత రెండు నెలలుగా వ్యాప్తి చెందుతోన్న కరోనా వైరస్లో ఏదైనా మార్పు (మ్యుటేషన్) జరిగిందా అనే విషయాన్ని అధ్యయనం చేయడానికి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ యోచిస్తోంది. సార్స్–కోవిడ్2 తన రూపం మార్చుకుందా అనే విషయాన్ని తెలుసుకోవడం వల్ల దానికి విరుగుడుగా కనుగొనే వ్యాక్సిన్ సమర్థవంతంగా పనిచేస్తోందా లేదా అనే విషయాన్ని నిర్ధారించుకోవడానికి ఉపయోగపడు తుందని దేశంలోనే అత్యున్నత వైద్య పరిశోధనా సంస్థ సీనియర్ శాస్త్రవేత్త వెల్లడించారు. (లాక్డౌన్ : మాకు వర్క్ ఫ్రం హోమ్ బాగుంది) ఈ అధ్యయనం ద్వారా వైరస్ మరింత బలంగా వృద్ధిచెందుతోందా? మరింత త్వరగా వ్యాప్తిచెందుతోందా అనే విషయం తెలుస్తుంది. కరోనా వైరస్ మార్పుచెందిందా? లేదా అనే విషయాన్ని అంచనావేయడానికి కోవిడ్–19 రోగుల నుంచి నమూనాలు సేకరించి పరీక్ష చేస్తారు. ఇతర దేశాలతో పోల్చినప్పుడు భారత దేశంలో కరోనా వైరస్ వ్యాప్తిలో గరిష్ట వ్యత్యాసం 0.2 నుంచి 0.9 మధ్యలో ఉన్నట్టు గ్లోబల్ ఇనీషియేటివ్ ఆన్ షేరింగ్ ఆల్ ఇన్ఫ్లూయెంజా డేటా(జీఐఎస్ఏడీ)ని బట్టి తెలుస్తోందని మరో శాస్త్రవేత్త వెల్లడించారు. (‘ఆరోగ్యసేతు గోప్యతపై అనుమానం’) ఇతర దేశాల నుంచి వచ్చేవారి ద్వారా భారత్లోకి వివిధ రకాల కరోనా వైరస్లు వచ్చే అవకాశం ఉంది. మొత్తం మూడు రకాలైన వైరస్లు దేశంలో ఉన్నట్టు గుర్తించారు. ఒకటి వూహాన్ నుంచి వచ్చిందీ, మరొకటి ఇటలీ నుంచి, మరో వైరస్ ఇరాన్ నుంచి వచ్చిన రకం. అయితే ఇరాన్ నుంచి వచ్చిన వైరస్ మాత్రం చైనా వైరస్ని పోలి ఉంది. అయితే మనదేశంలోకి ప్రవేశించిన వైరస్ ప్రధాన లక్షణాలను కనుక్కోవడానికి ఇంకా కొంత సమయం పడుతుందనీ, అయితే అన్నిరకాల వైరస్లలో ఒకేరకం ఎంజైములు ఉండడం వల్ల టీకాలు సమర్థవంతంగానే పనిచేస్తాయని భావిస్తున్నారు. (ఆ మూడు జిల్లాల్లో.. 50 శాతానికి పైగా రికవరీ) భారత్లో ఈ వైరస్ మూడు నెలలుగా ఉన్నప్పటికీ త్వరగా మార్పులకు గురికాలేదనీ ఐసీఎంఆర్లోని ఎపిడెమాలజీ అండ్ కమ్యూని కబుల్ డిసీజెస్ హెడ్ డాక్టర్ రమణ ఆర్.గంగాఖేద్కర్ గతంలో తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తోన్న ప్రాణాంతక వైరస్ నివారణకు వ్యాక్సిన్ కనుగొనేందుకు ఆరు భారతీయ కంపెనీలు పనిచేస్తున్నాయి. దాదాపు 70 వాక్సిన్లు పరీక్షించగా మూడు మాత్రం క్లినికల్ ట్రయల్స్ దశకు చేరాయి. అయితే 2021 కన్నా ముందు వ్యాక్సిన్ ప్రజల వినియోగానికి రాకపోవచ్చునని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. (ఇన్ఫెక్షన్లు తేల్చేందుకే ఎక్కువ పరీక్షలు) -
ఖతర్నాక్ కరోనా.. డాక్టర్లే షాకయ్యేలా?
సాక్షి, హైదరాబాద్ : కరోనా వైరస్ ఎవరికీ అంతుచిక్కకుండా ఎప్పటి కప్పుడు మార్పు చెందుతోంది. శాస్త్రవేత్తలు దాని గురించి ఓ అంచనాకు వచ్చేలోపే, మరో కొత్త లక్షణంతో వెలుగు చూస్తోంది. ఒకప్పుడు చలి ప్రాంతాల్లోనే బతుకుందన్న భావనను పటాపంచలు చేసి.. ఎంత వేడిలోనైనా బతకగలనని నిరూపిస్తోంది. ఇలా కరోనా ఖతర్నాక్గా వ్యవహరిస్తోంది. దాని తీరును చూసి శాస్త్రవేత్తలే ముక్కున వేలేసుకుంటున్నారు. అది ఇలా వ్యవ హరిస్తుండటంతో దానికి తగ్గట్లే ప్రభుత్వాలు నిర్ణ యాలు తీసుకుంటున్నాయి. మొన్నటి వరకు కరోనా వైరస్ సోకిన 2 నుంచి 14 రోజుల్లోపే లక్షణాలు బయటపడతాయని భావించారు. దానికి తగ్గట్లు వైరస్ లక్షణాలున్న వారితో తిరిగిన వారిని, కరోనా సోకి డిశ్చార్జి అయిన వారిని, అనుమానితులను 14 రోజుల పాటు క్వారంటైన్లో లేదా ఐసోలేషన్లో ఉంచేవారు. కానీ ఇప్పుడు దాని స్వరూపం మార్చు కుంది. పాజిటివ్ వ్యక్తితో తిరిగిన వారికి 14 రోజుల తర్వాత కూడా లక్షణాలు బయటపడ్డాయి. 14 నుంచి 28 రోజుల మధ్య కూడా అనేక మందికి కరోనా లక్షణాలు బయటపడ్డాయి. అందుకే కరోనా పాజిటివ్ కాంటాక్టులను, డిశ్చార్జి అయిన వారిని ఇక నుంచి 28 రోజుల పాటు క్వారంటైన్లోనే ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. 100 నుంచి 120 మందిలో అలాగే శుక్రవారం నాటికి రాష్ట్రంలో 983 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో అత్యధికంగా హైదరాబాద్, సూర్యాపేట, గద్వాల, వికారాబాద్, నిజామాబాద్, వరంగల్ అర్బన్, కరీంనగర్ జిల్లాల్లోనే నమోదయ్యాయి. ఇటీవల వైద్య, ఆరోగ్య శాఖ ప్రభుత్వానికి అందజేసిన నివేదిక ప్రకారం విదేశాల నుంచి 25,937 మంది రాగా, వారిలో 32 మందికి పాజిటివ్ వచ్చింది. వారితో కాంటాక్ట్ అయిన వారు 918 కాగా, వారిలో 18 మందికి కరోనా సోకింది. ఇక మర్కజ్కు వెళ్లొచ్చిన వారు 1,345 మంది కాగా, వారిలో 237 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. మర్కజ్ వెళ్లివచ్చిన వారితో కాంటాక్ట్ అయిన వారు 3,193 మంది కాగా, వారిలో 537 మందికి కరోనా సోకిందని పేర్కొంది. డాక్టర్లే షాకయ్యేలా..? విచిత్రమేంటంటే రాష్ట్రంలో పాజిటివ్ వచ్చిన వారిలో దాదాపు 100 నుంచి 120 మంది వరకు 14 రోజుల తర్వాత కరోనా లక్షణాలు బయటపడ్డాయి. కొందరికి 20 రోజులకు, మరికొందరికి 22 రోజులకు, ఒకరిద్దరికైతే 28 రోజులకు కూడా కరోనా లక్షణాలు బయటపడ్డాయి. కరీంనగర్కు చెందిన ఒక కాంటాక్ట్ వ్యక్తికి మొదట నెగెటివ్ వచ్చింది. 28 రోజులకు మరోసారి పరీక్షిస్తే పాజిటివ్ వచ్చింది. దీంతో డాక్టర్లు షాక్ అయ్యారు. అందుకే ఇక నుంచి కాంటాక్ట్ వ్యక్తులైనా, అనుమానిత లక్షణాలున్న వారైనా, పాజిటివ్తో చికిత్స పొంది డిశ్చార్జి అయిన వారైనా తప్పనిసరిగా 28 రోజుల వరకు క్వారంటైన్లో ఉండాల్సిందే. క్వారంటైన్ కాలాన్ని పెంచడంతో, ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే క్వారంటైన్ కేంద్రాల్లో వసతులను పెంచనున్నారు. క్వారంటైన్ కాలం రెట్టింపు కావడంతో వసతులు, ఆహారం కల్పించాల్సి ఉంటుంది. ఈ నెల 18 నాటికి సర్కారు ఆధ్వర్యంలో 33 జిల్లాల్లో 121 క్వారంటైన్ సెంటర్లు పనిచేస్తున్నాయి. ఎలాంటి లక్షణాలు లేకుండానే.. కరోనా వచ్చిన మొదట్లో జ్వరం, ముక్కు కారటం, దగ్గు తదితర లక్షణాలుంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. అది వాస్తవమే కానీ ఎలాంటి లక్షణాలు లేకుండా 90 వరకు పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వైద్య, ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. ఇలాంటి కేసులు చాలావరకు సూర్యాపేటలో నమోదైనట్లు వెల్లడించాయి. లక్షణాలు లేకుండా కరోనా ఉంటే గుర్తించడం ఎలాగన్న ఆందోళన ప్రజల్లోనూ నెలకొంది. -
బల్దియాపై ‘నజర్’
అవినీతి, అక్రమాలకు కేరాఫ్గా నిలిచిన మెదక్ మున్సిపాలిటీపై ఏసీబీ నజర్ వేసింది. మ్యుటేషన్లో అక్రమాలకు సంబంధించి ‘సాక్షి’లో ఇటీవల ‘మున్సిపాలిటీలో మాయ’ శీర్షికన కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. దీంతోపాటు మెదక్ బల్దియాపై గతంలో అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఇంటెలిజెన్స్తోపాటు అవినీతి నిరోధకశాఖ అధికారులు దృష్టిసారించినట్లు తెలుస్తోంది. మరోవైపు గత నెలలో పలువురు ఏసీబీ అధికారులు మెదక్కు స్వయంగా వచ్చి గుట్టుచప్పుడు కాకుండా విచారణ చేపట్టినట్లు సమాచారం. వారు ఎందుకోసం వచ్చారు, దేనిపైనా విచారణ చేశారు. వంటి అంశాలు మాత్రం వెలుగులోకి రాలేదు. సాక్షి, మెదక్: మ్యుటేషన్లలో పలువురు మున్సిపల్ రెవెన్యూ అధికారుల దందాపై ఫిర్యాదులు అందడంతోనే ఏసీబీ అధికారులు వచ్చారనే చర్చ జిల్లాలో జోరుగా సాగుతోంది. తాజాగా ఇటీవల అక్రమ మ్యుటేషన్ల వ్యవహారం వెలుగులోకి వచ్చిన క్రమంలో కమిషనర్ బదిలీ కావడం.. ఏసీబీ, ఇంటెలిజెన్స్ అధికారుల ఆరా.. వంటి సంఘటనలు బల్దియా వర్గాల్లో గుబులు రేపుతున్నాయి. రెవెన్యూ విభాగం టార్గెట్గా.. మెదక్ మున్సిపాలిటీ పరిధిలో కోట్లాది రూపాయల విలువైన భూములు ఉండగా.. రియల్ వ్యాపారం జోరుగా సాగుతోంది. ఈ క్రమంలో నాలుగైదేళ్లుగా మ్యుటేషన్లకు సంబంధించి దందా కొనసాగుతోంది. అవినీతికి అలవాటు పడిన పలువురు మున్సిపల్ రెవెన్యూ విభాగం అధికారులు పనికోరేటు చొప్పున ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. అన్ని సరిగ్గా ఉన్న పక్షంలో మ్యుటేషన్కు ఒక రేట్ ఫిక్స్ చేసి వసూలు చేసేవారని వినికిడి. ఇదేక్రమంలో పలు భూములకు సంబంధించి లొసుగులను ఆసరాగా చేసుకుని దందా నడిపించినట్లు తెలుస్తోంది. ఎలాంటి పత్రాలు లేకున్నా.. అన్నీ తామై వ్యవహరించి చక్కబెట్టినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కొందరు బాధితులు ఏసీబీని ఆశ్రయించినట్లు సమాచారం. రెవెన్యూ విభాగం టార్గెట్గా పథకం ప్రకారం అవినీతి నిరోధక శాఖ అధికారులు గత నెలలో మెదక్కు రాగా.. ఈ సమాచారం లీక్ అయినట్లు తెలుస్తోంది. దీంతో ఆ రోజు అధికారులు తప్పించుకున్నట్లు సమాచారం. దొంగచాటు మ్యుటేషన్లతో.. తాజాగా ఇటీవల మాన్యువల్లో ఒకరి పేరు.. ఆన్లైన్లో మరొకరి పేరుతో మ్యుటేషన్ చేయగా వెలుగులోకి వచ్చింది. నిబంధనల ప్రకారం ప్రజెంట్ ఆక్యుపయ్యర్ పేరు మీద ఉన్న ఇంటిని మరొకరి పేరుపై మార్పిడి చేయడానికి వీల్లేదు. కానీ.. అంతా జరిగిపోయింది. అధికారులే సూత్రధారులుగా నిలిచిన ఈ వ్యవహారంలో చాలా మొత్తంలో డబ్బులు చేతులు మారినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఏసీబీ మళ్లీ దృష్టిసారించినట్లు తెలుస్తోంది. మరోవైపు మున్సిపాలిటీ పరిధిలో ఎలాంటి పత్రాలు లేని ఇళ్లు చాలా ఉన్నట్లు అధికారిక వర్గాల సమాచారం. ఎలాంటి పత్రాలు లేకుండా కేవలం కరెంట్, నల్లా కనెక్షన్లు తీసుకున్న అందరినీ అధికారులు ప్రజెంట్ ఆక్యుపయ్యర్లో పెట్టారు. వీటిలో సైతం దొంగచాటు మ్యుటేషన్ల బాగోతమే నడిచినట్లు చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో ఇంటెలిజెన్స్ అధికారులు సైతం రంగంలోకి దిగి ఆరా తీస్తున్నట్లు తెలిసింది. కలెక్టర్ దృష్టి సారించేనా..? అక్రమ మ్యుటేషన్ల బాగోతం వెలుగులోకి వచ్చినా.. ఉన్నతాధికారులు నామమాత్రంగా వ్యవహరిస్తుండడంపై ప్రజల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అప్పటి రెవెన్యూ అధికారులకు కేవలం మెమోలు జారీ చేసి.. చేతులు దులుపుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏసీబీ, ఇంటెలిజెన్స్ రంగంలోకి దిగిన నేపథ్యంలో మున్సిపాలిటీ ప్రత్యేకాధికారి, కలెక్టర్ ధర్మారెడ్డి ఇప్పటికైనా ప్రత్యేక దృష్టి సారించి అక్రమార్కులపై వేటు వేయాలని ప్రజలు కోరుతున్నారు. -
జన్యుమార్పిడితో కొలెస్ట్రాల్కు కళ్లెం?
జన్యుమార్పిడి టెక్నాలజీ ద్వారా కోతుల్లో కొలెస్ట్రాల్ మోతాదులను గణనీయంగా తగ్గించడంలో పెన్సిల్వేనియా యూనివర్శిటీ శాస్త్రవేత్తలు విజయం సాధించారు. అన్నీ సవ్యంగా సాగితే ఇంకో పదేళ్లలో ఇదే పద్ధతిని ఉపయోగించి ఊబకాయంతో పాటు అనేక ఇతర సమస్యలకు చెక్ పెట్టవచ్చునని శాస్త్రవేత్తలు అంటున్నారు. మన కాలేయానికి చెడు కొలెస్ట్రాల్ను తొలగించే శక్తి సహజసిద్ధంగానే ఉన్నప్పటికీ పీసీఎస్కే 9 అనే ప్రొటీన్ ఈ ప్రక్రియను అడ్డుకుంటూ ఉంటుంది. ఫలితంగా రక్తంలో చెడు కొలెస్ట్రాల్ ఎక్కువవుతూంటుంది. ఈ ప్రొటీన్పై ఇప్పటికే బోలెడన్ని పరిశోధనలు జరిగాయి. ఈ నేపథ్యంలో పెన్సిల్వేనియా యూనివర్శిటీ శాస్త్రవేత్తలు కోతులపై కొని ప్రయోగాలు చేశారు. పీసీఎస్కే 9 ప్రొటీన్ను ఉత్పత్తి చేసే జన్యువును పనిచేయకుండా చేసినప్పుడు ఈ కోతుల రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ సగానికిపైగా తగ్గినట్లు తెలిసింది. జన్యువును పనిచేయకుండా చేసేందుకు శాస్త్రవేత్తలు ఎంజైమ్ ఆధారిత మెగా న్యూక్లియస్ ఆధారిత టెక్నాలజీని ఉయోగించడం విశేషం. అయితే ఈ ప్రయోగాల్లో కొన్ని అనుకోని దుష్ప్రభావాలు కనిపించిన నేపథ్యంలో శాస్త్రవేత్తలు విస్తృత స్థాయి పరిశోధనలకు ప్రయత్నిస్తున్నారు. అన్నీ సవ్యంగా సాగితే ఇంకో పదేళ్లలో ఇది సాధ్యం కావచ్చునని, తద్వారా కొన్ని అరుదైన గుండెజబ్బులతో పాటు ఇతర వ్యాధులకు మెరుగైన చికిత్స లభించే అవకాశముందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త లిలి వాంగ్ తెలిపారు. -
ఆస్తుల మ్యుటేషన్ ఇక ఈజీ
ప్రాపర్టీ రిజిస్టర్ను రూపొందించిన పురపాలక శాఖ ⇒ ఇంటి నంబర్తో క్షణాల్లో వివరాలన్నీ తెలుసుకోవచ్చు ⇒ వెబ్సైట్లో యజమాని, ఆస్తి ఫొటోలు, వివాదాల వివరాలు ⇒ గుర్తింపు కార్డు, సేల్ డీడ్ సమర్పిస్తే ట్రేడ్ లైసెన్స్ జారీ ⇒ వెల్లడించిన పురపాలక శాఖ డైరెక్టర్ శ్రీదేవి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని నగరాలు, పట్టణాల్లో ప్రైవేటు భవనాలు, ఇళ్లు, భూములు తదితర ఆస్తులకు సంబంధించిన సమగ్ర ప్రాపర్టీ రిజిస్టర్ పురపాలికల వారీగా రూపొందించామని రాష్ట్ర పురపాలక శాఖ డైరెక్టర్ డాక్టర్ టీకే శ్రీదేవి తెలిపారు. ఇంటి నంబర్ ఆధారంగా ఆస్తి యజమాని పేరు, ఆస్తికి సంబంధించిన ఫొటోలు, జియో మ్యాపింగ్ లింక్, ఏవైనా ఆస్తి వివాదాలు ఉంటే దానికి సంబంధించిన సమాచారాన్ని పురపా లక శాఖ వెబ్సైట్లో క్షణాల్లో తెలుసుకోవచ్చ న్నారు. జీహెచ్ఎంసీ మినహాయిస్తే రాష్ట్రంలో 12.5 లక్షల ప్రైవేటు ఆస్తులున్నాయని, ఇప్పటి వరకు 11 లక్షల ఆస్తులకు సంబంధించిన సమాచారాన్ని ప్రాపర్టీ రిజిస్టర్లో పొందుపరిచామని చెప్పారు. రాష్ట్రంలో ఉన్న 72 పురపాలికల పరిధిలో గల ప్రైవేటు స్థలాల రిజిస్టర్ను సైతం రూపొందించామన్నారు. సరళీకృత వ్యాపారం(ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్/ఈఓడీబీ) సంస్కరణల అమల్లో భాగంగా నాలుగు నెలలుగా కసరత్తు చేసి ఈ కొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చామన్నారు. రాష్ట్రంలోని పురపాలికల కమిషనర్లతో మంగళవారం ఆమె పురపాలక శాఖ డైరెక్టరేట్లో సమీక్ష నిర్వహించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. అందుబాటులోకి ‘సిటిజన్ బడ్డీ’ ట్రేడ్ లైసెన్స్ల జారీ, ఇళ్ల నిర్మాణ అనుమతులు, కుళాయి కనెక్షన్లు తదితర సేవలను మధ్యవర్తుల ప్రమేయం లేకుండా పురపాలికల్లో సత్వరంగా అందించేందుకు మూడు విధానాలను అమలు చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగా ‘సిటిజన్ బడ్డీ’మొబైల్ యాప్ను ప్రవేశపెట్టామని, ఇప్పటికే 18 వేల మంది ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకున్నారని, 10 వేల మంది క్రియాశీలకంగా వినియోగిస్తున్నారని తెలిపారు. పురపాలికల్లోని పౌర సేవా కేంద్రాలు, మీ–సేవా కేంద్రాలతో పాటు పురపాలక శాఖ వెబ్సైట్ ద్వారా నేరుగా దరఖాస్తు చేసుకుని పై సేవలు పొందవచ్చన్నారు. నిర్దేశించిన గడువులోగా అన్ని సేవలందిస్తామని, జాప్యం చేసే అధికారులపై ‘టీఎస్–ఐపాస్’తరహాలో చర్యలు తీసుకుంటామన్నారు. గుర్తింపు కార్డు, సేల్ డీడ్ను సమర్పిస్తే చాలు కొత్త పరిశ్రమలు, వ్యాపారాల ఏర్పాటుకు ట్రేడ్ లైసెన్స్లు జారీ చేస్తామన్నారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే 15 రోజుల్లో భవన నిర్మాణ అనుమతులు జారీ చేస్తామని చెప్పారు. దరఖాస్తు పురోగతి స్థితిని ఆన్లైన్లో ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చని, దరఖాస్తులో సమాచార లోపముంటే ఆన్లైన్లో సరిదిద్దుకోవచ్చని తెలిపారు. సత్వరం ఆస్తుల మ్యుటేషన్ పూర్తి.. సాధారణ పౌరులతో పాటు పరిశ్ర మల స్థాపన, వ్యాపార అవసరాల కోసం ఆస్తులు కొనుగోలు చేసే వారికి ఈ సమా చారం ఉపయుక్తంగా ఉంటుందని శ్రీదేవి చెప్పారు. యాజమాన్య హక్కుల మార్పి డికి, ఆస్తుల మ్యుటేషన్ను సత్వ రం పూర్తి చేసేందుకు ప్రాపర్టీ రిజిస్టర్ ఉపయోగ పడుతుందన్నారు. యాజమాన్య హక్కు లకు సంబంధించిన కోర్టు కేసుల వివ రాలు ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ శాఖ వద్దే ఉండేవని, పురపాలికలు, రెవెన్యూ శాఖల వద్ద లేకపోవడంతో నగరాలు, పట్టణాల్లో ఆస్తులు కొనుగోలు చేసేందుకు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ప్రాపర్టీ రిజిస్ట్రర్తో ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందన్నారు. -
పేద్ద భారం..
♦ మ్యూటేషన్ ఫీజు 4 రెట్లు పెంపు ♦ ఆస్తుల పేరు మార్పిడిపై విధింపు ♦ ఆమోదం తెలిపిన గ్రేటర్ స్టాండింగ్ కమిటీ ♦ త్వరలో రిజిస్ట్రేషన్ శాఖకు నిర్ణయ ఉత్తర్వులు ♦ ఆందోళనలో ఆస్తుల కొనుగోలుదారులు వరంగల్ అర్బన్ : ఆస్తుల కొనుగోలుదారులపై ‘మహా’ భారం పడింది. మ్యూటేషన్(ఆస్తుల పేరు మార్పిడి) ఫీజులను నాలుగు రెట్లు పెంచుతూ గ్రేటర్ మునిసిపల్ కార్పొరేషన్(జీడబ్ల్యూఎంసీ) స్టాండింగ్ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆమోదముద్ర కూడా వేసింది. వరంగల్ మహా నగర పాలక సంస్థ పరిధిలో పెద్ద ఎత్తున భవనాలు, ఖాళీ స్థలాల కొనుగోళ్లు, అమ్మకాలు జరుగుతుంటాయి. రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా జరిగిన కార్యకలాపాలకు సంబంధించి ఆస్తుల పేరు మార్పిడి ప్రక్రియ గ్రేటర్ ద్వారా కొనసాగుతోంది. గతంలో రిజిస్ట్రేషన్ దస్తావేజులతో పేరు మార్పిడి కోసం గ్రేటర్ కార్పొరేషన్లో ఫీజులు చెల్లించి దరఖాస్తు చేసేవారు. అయితే ఎనిమిది నెలల కాలంగా పారదర్శకత, సమయ పాలన, సమన్వయ లోపం వంటి తదితర సమస్యల తలెత్తాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర పురపాలక శాఖ నిబంధనలను సడలించింది. రిజిస్ట్రేషన్ శాఖలో కొనుగోళ్లు, అమ్మకాలు జరిగిన క్రమంలో ఆస్తుల పేరు మార్పిడి కోసం కూడా ఆ శాఖలోనే ఫీజులు వసూలు చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ దస్తావేజుల్లో ఉన్న ఆస్తి విలువలో 0.20 శాతం అంటే రూ.లక్షకు రూ.200 చొప్పున రిజిస్ట్రేషన్ శాఖలోనే ఫీజు వసూలు చేస్తున్నారు. అక్కడి నుంచి గ్రేటర్ కార్పొరేషన్కు పేరు మార్పిడి కోసం బదలాయిస్తున్నారు. ఆస్తుల దస్తావేజుల ఆధారంగా కార్పొరేషన్ పన్నుల విభాగం సిబ్బంది క్షేత్రస్థాయిలో విచారణ చేసి పేరు మార్పిడి చేస్తున్నారు. ఈ క్రమంలో ఆస్తుల పేరు మార్పిడి ఫీజును పెంచుతూ గ్రేటర్ వరంగల్ మునిసిపల్ స్టాండింగ్ కమిటీ నిర్ణయం తీసుకుంది. 0.20 శాతం నుంచి 1.0 శాతానికి పెంచింది. త్వరలో నిర్ణయ ఉత్తర్వులను రిజిస్ట్రేషన్కు శాఖకు అందించనున్నారు. కొనుగోలుదారుల్లో ఆందోళన మొన్నటివరకు రూ.లక్షకు రూ.200 చెల్లించాల్సి ఉండగా, తాజాగా పెంచిన ఫీజులతో రూ.1,000 చెల్లించాల్సి వస్తుంది. దీన్ని ఆస్తుల కొనుగోలుదారులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆస్తులకు సంబంధించి అమ్మకాలు, కొనుగోళ్లు నిత్యం సాగుతుంటాయి. ఈ నేపథ్యంలో ప్రతిసారి పేరు మార్పిడిపై రూ.లక్షకు రూ.వెయ్యి చొప్పన చెల్లించడం భారమని ఆందోళన చెందుతున్నారు. మ్యుటేషన్ ఫీజు పెంపుపై పునరాలోచించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. గ్రేటర్ కార్పొరేషన్ పాలక, అధికార వర్గాలు మాత్రం గ్రేటర్ హైదరాబాద్లో ఎన్నో ఏళ్లుగా ఒక శాతం ఫీజు వసూలు చేస్తున్నారని, ఈ మేరకు వరంగల్ పరిధిలో పెంచినట్లు పేర్కొంటున్నారు. -
రెవెన్యూ సేవలు బంద్
ముదురిన మ్యుటేషన్ లొల్లి డిజిటల్ కీ సరెండర్ చేసిన తహసీల్దార్లు సాంకేతిక సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ ముకరంపుర: జిల్లాలో రెవెన్యూ సేవలు నిలిచిపోయాయి. ఆ శాఖలో మ్యుటేషన్ (ఆస్తి మార్పిడి) లొల్లి ముదురుతోంది. క్షేత్రస్థాయిలో వెబ్ల్యాండ్లో సాంకేతిక సమస్యలు పరిష్కారమయ్యే వరకు ప్రభుత్వం ఇచ్చిన డిజిటల్ కీని వినియోగించకూడదని తెలంగాణ తహసీల్దార్లు అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్ణయించింది. మ్యుటేషన్లలో జాప్యం విషయమై ‘‘మండల కార్యాలయాల్లో యూజ్లెస్ ఫెల్లోస్ ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మ్యుటేషన్ రాకెట్ నడుస్తోంది’’ అంటూ సీసీఎల్ఏ రేమండ్పీటర్ చేసిన వాఖ్యలపై తహసీల్దార్లు నిరసన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర తహసీల్దార్ల సంఘం పిలుపునిచ్చిన నేపథ్యంలో శుక్రవారం తహసీల్దార్ల సంఘం జిల్లా అధ్యక్షుడు బైరం పద్మయ్య ఆధ్వర్యంలో కలెక్టర్ నీతూప్రసాద్ను కలిసి వినతిపత్రం సమర్పించారు. జిల్లావ్యాప్తంగా తహసీల్దార్లందరూ శుక్రవారం సంబంధిత ఆర్డీవోలకు డిజిటల్ కీ అందజేశారు. ఫలితంగా జిల్లాలో తహసీల్దార్ల డిజిటల్ కీతో సంబంధముండే, మీ సేవల ద్వారా జరిగే సేవలన్నీ నిలిచిపోయాయి. ప్రధానంగా అన్ని రకాల సర్టిఫికెట్లు, పహనీ నకల్, మ్యుటేషన్, కౌలురైతు కార్డులు, పాసుబుక్కులు అందే అవకాశం లేకుండా పోయింది. ఇటీవలే జిల్లాలో మ్యుటేషన్పై నిర్లక్ష్యం చేసిన 31 మంది తహసీల్దార్లకు కలెక్టర్ నీతూప్రసాద్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. వారం రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించారు. అయితే గత నాలుగైదు నెలలుగా వెబ్ల్యాండ్లో సాంకేతిక సమస్యల కారణంగా రైతులకు పహనీలు ఇవ్వడంలో అంతరాయం కలుగుతోందని, దీంతో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని, సబ్ రిజిస్ట్రార్ నుంచి వచ్చిన దరఖాస్తులను, మీ సేవ నుంచి వచ్చిన మ్యుటేషన్ దరఖాస్తులను పరిష్కరించలేకపోతున్నామని తహసీల్దార్లు కలెక్టర్కు విన్నవించారు. రైతులకు పాసుపుస్తకాలను మ్యానువల్గా ఇవ్వకూడదన్న ఆదేశాలతో వెబ్ల్యాండ్లో తలెత్తిన సాంకేతిక సమస్యతో పాసుపుస్తకాలను రైతులకు సకాలంలో అందించలేకపోతున్నామని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే రాష్ట్ర కార్యవర్గ నిర్ణయం మేరకు డిజిటల్ కీలను అందజేస్తున్నామని, సాంకేతిక సమస్యలను త్వరతిగతిన పరిష్కరించాలని కోరారు. కొత్త విధానంలోనూ సమస్యలు.. గతంలో గ్రామ పంచాయతీలో రైతులు కొనుగోలు చేసిన భూములను రిజిస్ట్రేషన్ అయిన తర్వాత సదరు ఆస్తిహక్కు మార్పిడి కోసం మళ్లీ తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి దరఖాస్తు చేసుకోవాల్సి వచ్చేది. ఈ సమయంలో రిజిస్ట్రేషన్ దస్తావేజులను జతపరిచేవారు. వీఆర్వోలు ఒక నోటీసు జారీ చేసి ఆ భూమి కొనుగోలుపై ఎవరికీ అభ్యంతరాలు లేవని ధ్రువీకరించిన తర్వాత మ్యుటేషన్ చేసేవారు. ఈ విధానంలో లోపాలు, అధికారులు ముప్పుతిప్పలు, మామూళ్ల వ్యవహారం జోరుగా సాగేదన్న విమర్శలున్నాయి. అయితే గత జూన్ ఒకటి నుంచి సర్కారు కొత్త విధానాన్ని అమలు చేస్తోంది. వారసత్వంగా దక్కిన భూములను పదిరోజుల్లో, సేల్, గిఫ్ట్, పార్టిషన్, రాటిఫికేషన్తో పాటుగా సాధారణ రిజిస్ట్రేషన్ ద్వారా చేసిన భూములకు 15 రోజుల్లోగా మ్యూటేషన్ చేసి పాసుపుస్తకాలు జారీ చేయాలన్న విధానాన్ని రూపొందించారు. ఇందుకోసం సబ్రిజిస్ట్రార్ కార్యాలయం, మండల రెవెన్యూ కార్యాలయం వెబ్సైట్లను అనుసంధానించారు. రిజిస్ట్రేషన్ అయిన వెంటనే ఆ వివరాలు తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లిపోతాయి. సదరు పత్రాల ఆధారంగా రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించిన 15 రోజుల్లో మ్యూటేషన్ చేయాలి. ఈ విషయాన్ని ఆన్లైన్లో సదరు అధికారులు ధ్రువీకరించాలి. కానీ జిల్లాలో వెబ్ల్యాండ్లో సాంకేతిక సమస్యల కారణంగా తీవ్ర జాప్యం జరిగింది. ఇది పూర్తిగా అధికారుల నిర్లక్ష్యమేనని ఉన్నతాధికారులు పేర్కొంటుండగా, తమ తప్పేమీ లేదని తహసీల్దార్లు చెబుతున్నారు. జిల్లాలోని 31 మండలాల్లో 383 మ్యుటేషన్లు పెండింగ్లో ఉన్నాయని గుర్తించారు. రెవెన్యూ రికార్డుల కంప్యూటరీకరణ నేపథ్యంలో పాసుపుస్తకాల జారీని ప్రభుత్వం నిలిపివేసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జిల్లాలో 55 వేల పట్టాదారు పాసుపుస్తకాలను రెవెన్యూ యంత్రాంగం ముద్రించింది. ఇప్పటివరకు 28 వేల మంది రైతులకు అందజేయగా 2.01 లక్షల ఫిర్యాదులు పెండింగ్లో ఉన్నాయి. వీటన్నింటినీ కంప్యూటరీకరించడం అధికారులకు సవాల్గా మారింది. వెబ్ల్యాండ్ సాంకేతిక సమస్యలు, ఉన్నతాధికారుల మందలింపులు, తహసీల్దార్ల నిరసనలు ఎలా ఉన్నా... మధ్యలో రైతులు, ప్రజలు నలిగిపోతున్నారని పలువురు పేర్కొంటున్నారు. హుజూరాబాద్ సీఐపై చర్య తీసుకోవాలి ప్రస్తుతం భీమదేవరపల్లి మండలం వంగరలో పనిచేస్తున్న వీఆర్వో వేణును చట్ట విరుద్ధంగా అరెస్ట్ చేసిన హుజూరాబాద్ సీఐ రమణమూర్తిపై చర్య తీసుకోవాలని తహసీల్దార్ల సంఘం, వీఆర్వోల సంఘం సంయుక్తంగా కలెక్టర్ను కోరారు. 2012లో హుజూరాబాద్ మండలంలో వీఆర్వోగా పనిచేసిన కాలంలో ఓ రైతు రిజిస్టర్ డాక్యుమెంట్ను జమాబందీ అమలుకు దరఖాస్తు చేసుకోగా విచారణలో మోకాపై ఉండి ఎలాంటి అభ్యంతరాలు లేకపోవడంతో మ్యుటేషన్ చేయించడం జరిగిందన్నారు. ఈ విషయమై తాజాగా సదరు భూమిని అమ్మిన వ్యక్తి ఫిర్యాదు చేయడంతో రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ నకిలీదని తేలిందన్నారు. తప్పుదారి పట్టించిన వ్యక్తిని అరెస్ట్ చేయాల్సిన పోలీసులు ఆర్డీవో, తహసీల్దార్, కలెక్టర్ అనుమతి లేకుండా ఆర్వోఆర్ చట్టాన్ని ఉల్లంఘించి వీఆర్వోపై చర్య తీసుకున్నారని పేర్కొన్నారు. తప్పులుంటే ఉన్నతాధికారులు శాఖాపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని, పోలీసుల అత్యుత్సాహం తగదన్నారు. కలెక్టర్కు వినతిపత్రం సమర్పించిన వారిలో తహసీల్దార్ల సంఘం జిల్లా అధ్యక్షుడు బైరం పద్మయ్య, కార్యదర్శి మధుసూదన్, తహసీల్దార్లు ఈశ్వరయ్య, మహేశ్వర్, వెంకట్రెడ్డి, రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎస్.శ్రీనివాస్, శ్రావణ్, వీఆర్వోల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుర్రాల రాజేందర్, జిల్లా అధ్యక్షుడు నూకల శంకర్, నాయిని కనకరాజు, వేల్పుల రాజయ్య, చంద్రమోహన్, అన్వర్, రజని, శ్రీనివాస్రెడ్డి ఉన్నారు. -
‘మాయా’ల్యాండ్!
– వెబ్ల్యాండ్ నిర్వహణ అస్తవ్యస్తం – రాత్రికి రాత్రే మారిపోతున్న భూముల వివరాలు – పెరుగుతున్న వివాదాలు – పేరుకుపోతున్న మ్యూటేషన్ దర ఖాస్తులు – మండల కేంద్రమైన వెల్దుర్తికి చెందిన చింతకాలయ రామాంజనమ్మకు సర్వేనెం.831లో 2.60 ఎకరాల భూమి ఉంది. ఇది వారసత్వంగా సంక్రమించింది. రెండు నెలల క్రితం వరకు వెబ్ల్యాండ్లో భూమి వివరాలు రామాంజనమ్మ పేరుమీదనే ఉన్నాయి. తర్వాత వెబ్ల్యాండ్లోని వివరాలను పరిశీలిస్తే రామాంజనమ్మ స్థానంలో ఇతర సామాజిక వర్గానికి చెందిన రైతు ఉన్నారు. ఇది రెవెన్యూ అధికారుల లీల. దీంతో సంబంధిత మహిళా రైతు లబోదిబోమంటున్నారు. – ప్యాపిలి మండలం రాచర్ల రెవెన్యూ గ్రామంలోని సర్వే నెం.1–2లో 2ఎకరాల భూమిని నేరడుచెర్ల గ్రామానికిచెందిన ఓబులేసు, ఓబులవెంకటరాములు చెరో ఎకరాకొన్నారు. మేనెల చివరి వారంలో ప్యాపిలి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించుకొని వెంటనే మ్యూటేషన్ కోసం అన్ని డాక్యుమెంట్లతో మీ సేవ కేంద్రంలో దరఖాస్తు చేసుకున్నారు. అప్లికేషన్ నెంబరు ఎంయూ 011602375627 మ్యూటేషన్కు నెల రోజుల్లో చేయాలి. 50 రోజులు గడిచినా పట్టించుకోలేదు. .. ఈ రెండు ఘటనలే కాదు. జిల్లాలో ఇలాంటివి అనేకం ఉన్నాయి. ఒకవైపు వెల్ల్యాండ్లోని వివరాలు రాత్రికి రాత్రే మారిపోతున్నాయి. మరోవైపు మ్యూటేషన్ల కో సం రైతులు తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కర్నూలు (అగ్రికల్చర్) మ్యూటేషన్లకు, వెబ్ల్యాండ్లో సవరణల కోసం మీ సేవా కేంద్రాల్లో రైతులు దరఖాస్తు చేసుకుంటున్నారు. వీటిని సంబంధిత తహసీల్దార్లు నిర్ణీత గడువులోగా పరిష్కరించాల్సి ఉంది. గడువు దాటినా పట్టించుకోకపోవడంతో రైతులు పడుతున్న ఇక్కట్లు అన్నీ..ఇన్నీ కావు. తీరా అధికారులు వాటిని తిరస్కరిస్తూ చేతులు దులుపుకుంటున్నారు. భూములు కొనుగోలు చేస్తే సబ్ రిజిస్ట్రార్కార్యాలయాలో రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. ఆ తర్వాత రెవెన్యూ రికార్డుల్లో మార్పులు చేసుకోవాలి. వీటినే మ్యూటేషన్లు అంటారు. మ్యూటేషన్ జరుగకపోతే భూములు కొన్న రెవెన్యూ రికార్డుల్లో వారి వివరాలు నమోదు కావు. మ్యూటేషన్ల కోసం మీ సేవా కేంద్రాల ద్వారా దాదాపు 56 వేల దరఖాస్తులు వచ్చాయి. మామూళ్లు ముట్టచెబితే 24 గంటల్లోనే మార్పులు జరుగుతాయి. లేకపోతే నిర్ణీత గడువు దాటినా మార్పులు జరగవు. చివరికి తిరస్కరణ అస్త్రాన్ని ప్రయోగిస్తారు. 56 వేలకుపైగా మ్యూటేషన్ దరఖాస్తులు ఉంటే 30 వేల వరకు తిరస్కరించారు. దీన్నిబట్టి చూస్తే రైతులు ఇక్కట్లు ఏ స్థాయిలో ఉన్నాయో తెలుస్తోంది. గడువు తీరినా పరిష్కారానికి నోచుకోని దరఖాస్తులు 10వేలకుపైగా ఉన్నాయి. భూములు కొనుగోలు చేసినపుడు రెవెన్యూ రికార్డుల్లో అంటే వెబ్ల్యాండ్ మార్పులు జరగకపోతే ఎటువంటి ప్రయోజనం ఉండదు. అమ్మిన వారి వివరాలే ఉంటాయి. మ్యూటేషన్లను ఎప్పటికప్పుడు పరిష్కరించాల్సి ఉన్నా పట్టించుకోడం లేదు. మ్యూటేషన్ల సమస్యలను అధిగమించేందుకు ఆటోమేటిక్ మ్యూటేషన్ల విధానాలన్ని అమలులోకి తీసుకురావాలని ప్రయత్నించినా ఎప్పటికప్పుడు వాయిదా పడుతోంది. ప్రజాసాధికార సర్వే కారణంగా ఆటోమేటిక్ మ్యూటేషన్ల అమలు రెండు నెలల వాయిదా పడింది. అడ్డుగోలుగా అక్రమాలు.. భూ వివరాలు ఆన్లైన్లోకి వచ్చిన తర్వాత రెవెన్యూ సిబ్బంది అడ్డుగోలుగా అక్రమాలకు పాల్పడుతున్నారు.రాత్రికి, రాత్రే రైతుల తలరాతలు మారుస్తున్నారు. తహసీల్దార్ల డిజిటల్ సిగ్నేచర్ కీలను కంప్యూటర్ ఆపరేటర్లకు అప్పగించడంతో అడ్డుగోలుగా అక్రమాలకు పాల్పడుతున్నారు. ఎలాంటి ఆధారాలు లేకపోయినా మామూళ్లు పొంది ఆన్లైన్లో వివరాలు తారుమారు చేస్తున్న అధికారులు నిజమైన భూమి యజమానులు వచ్చి అన్ని వివరాలు చూపించినా పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇటువంటి సమస్యలు జిల్లాలో కోకొల్లలుగా ఉన్నాయి. వెబ్ల్యాండ్లో భూముల వివరాల సవరణకోసం 75 వేలకుపైగా దరఖాస్తులు మీ– సేవ కేంద్రాల ద్వారా వచ్చాయి. వీటిలో రెవెన్యూ అధికారులు 45 వేల వరకు తిరస్కరించారు.1 5 వేల దరఖాస్తులు గడువు తీరినా పట్టించుకున్న దాఖలాలు లేవు. అడ్డుగోలుగా వెబ్ల్యాండ్లోని భూముల వివరాలను మార్పులు చేస్తుండటం వల్ల భూ వివాదాలు పెరుగుతున్నాయి. రాత్రికి రాత్రే వెబ్ల్యాండ్లో మార్పులు చేయడం, సబ్ రిజిస్ట్రార్లను మామూళ్లతో లొంగదీసుకొని రిజిస్ట్రేషన్లు చేయించుకోవడంతో రైతుల పరిస్థితి దయనీయంగా తయారు అయింది. -
మ్యూటేషన్ తూచ్..!
► తప్పు తెలుసుకుని వెనక్కి.. ► ఓపెన్ ఆక్షన్పైనేమేయర్ దృష్టి దండిగా ఆదాయం ► వస్తుందని అంచనా వస్త్రలతలో ఒక్కో షాపునకు అద్దె రూ.7వేలు చెల్లిస్తున్నారు. రూ.13వేల చొప్పున కట్టాల్సిందిగా నగరపాలక సంస్థ డిమాండ్కు వ్యాపారులు స్పందించడం లేదు.ఎన్టీఆర్ షాపింగ్ కాంప్లెక్స్లో ఒక్కో షాపునకు గుడ్విల్గా రూ.10 లక్షలు చెల్లించేందుకు వ్యాపారులు సిద్ధంగా ఉన్నారు. మ్యూటేషన్ (పేరు మార్పు) కింద 30 నెలల అద్దె వసూలు చేస్తే ఒక్కో షాపునకు రూ.3 లక్షలు మాత్రమే వసూలవుతోంది. రాజధాని నేపథ్యంలో విజయవాడలో వ్యాపారాలు పెరిగాయి. షాపులకు డిమాండ్ ఏర్పడింది. దీన్ని సొమ్ము చేసుకోవాలనే యోచనలో పాలకులు ఉన్నారు. ఇప్పటివరకూ ప్రచారంలో ఉన్న మ్యూటేషన్కు తూచ్ చెప్పి ఓపెన్ ఆక్షన్ దిశగా పావులు కదుపు తున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. న్యాయ, సాంకేతిక ఇబ్బందులపై అధ్యయనం చేసిన తరువాత ఓ నిర్ణయానికి రావాలని మేయర్ కోనేరు శ్రీధర్ అధికారులకు సూచించినట్లు సమాచారం. విజయవాడ సెంట్రల్ : నగరపాలక సంస్థకు చెందిన 64 షాపింగ్ కాంప్లెక్స్ల్లో 3,400 షాపులు ఉన్నాయి. షాపుల లీజు అగ్రిమెంట్ ఒకరి పేరున ఉంటే ప్రస్తుతం వ్యాపారం చేస్తున్న వారు మరొకరు. 80 శాతం షాపుల్లో ఇదే పరిస్థితి. ఈ క్రమంలో మ్యూటేషన్ కింద 30 నెలల అద్దె వసూలు చేయాలని, తద్వారా నగరపాలక సంస్థకు సుమారు రూ.3కోట్ల నుంచి రూ.5కోట్లు ఆదాయం వస్తుందని అంచనా. ఈ ప్రతిపాదనకు మొదట్లో స్టాండింగ్ కమిటీ పచ్చజెండా ఊపింది. ఆ తరువాత ఏమైందంటే.. ఎన్టీఆర్ షాపింగ్ కాంప్లెక్స్లో గుడ్విల్ ద్వారా ఎక్కువ ఆదాయం వస్తోందని, మ్యూటేషన్ వల్ల నష్టపోతామంటూ స్టాండింగ్ కమిటీ సభ్యుడు కాకుమల్లికార్జున యాదవ్ సూచించారు. దీనిని పెద్దగా పట్టించుకోని మేయర్ కార్పొరేషన్కు సంబంధించిన అన్ని షాపుల నుంచి మ్యూటేషన్ వసూలు చేయాల్సిందిగా ఎస్టేట్ అధికారులను ఆదేశించారు. తొలి విడతగా 547 షాపుల నుంచి 30 నెలల అద్దె వసూలు చేయాలని నిర్ణయించారు. మ్యూటేషన్ పేరుతో కొందరు భారీగా మామూళ్లు వసూళ్లు చేస్తున్నారంటూ స్టాండింగ్ కమిటీలో రగడ మొదలైంది. ఈ విషయంలో పశ్చిమ నియోజకవర్గ టీడీపీలోని కొందరి పేర్లు వినిపించడంతో అల్లరైపోయింది. దీన్ని తాత్కాలికంగా వాయిదా వేయాల్సిందిగా మేయర్ సూచించారు. ఓపెన్ ఆక్షనే బెటర్ ఎన్టీఆర్ షాపింగ్ కాంప్లెక్స్ పై భాగంలో 111 షాపులు నూతనంగా నిర్మించాలని మేయర్ నిర్ణయించారు. ఇందుకు రూ.11 కోట్లు ఖర్చవుతుందని అంచనా. షాపులు కేటాయించడం ద్వారా వచ్చే గుడ్విల్తోనే దీనిని నిర్మించాలని నిర్ణయించారు. మార్కెట్ రేటు ప్రకారం ఒక్కో షాపునకు రూ.10 లక్షల వరకు గుడ్విల్గా చెల్లించేందుకు వ్యాపారులు ముందుకొచ్చారు. ఆ ప్రాంతంలో గుడ్విల్ రూ.10లక్షలు ఉంటే పాత షాపులకు మ్యూటేషన్ కింద రూ.3 లక్షలు వసూలు చేస్తున్నామన్న విషయం అప్పుడు కానీ పాలకులకు బోధపడలేదు. వస్త్రలతలోని 280 షాపులకు ప్రస్తుతం నామమాత్రపు అద్దె మాత్రమే వసూలవుతోంది. ఇదే పరిస్థితి మిగతా షాపింగ్ కాంప్లెక్సుల్లోనూ ఉంది. నగరపాలక సంస్థ షాపింగ్ కాంప్లెక్స్ల్లోని షాపులన్నింటికీ ఓపెన్ ఆక్షన్ నిర్వహిస్తే భారీగా ఆదాయం సమకూరే అవకాశం ఉందన్నది మేయర్ అంచనా. ఆ దిశగా ఆయన పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. మామూళ్ల రచ్చ మ్యూటేషన్పై స్టాండింగ్ కమిటీ సభ్యులు వర్సెస్ మేయర్ మధ్య కోల్డ్వార్ జరుగుతోంది. చేయి చాస్తున్నారని పరస్పర ఆరోపణలు గుప్పిం చుకున్నారు. చివరికి ఈ మామూళ్ల వ్యవహారం పార్టీ అధిష్టానం వరకూ వెళ్లింది. స్టాండింగ్ కమిటీ సభ్యులే స్వయంగా మేయర్పై ఎంపీ, ఎమ్మెల్యేలకు ఫిర్యాదు చేయడంతో రచ్చ బహిర్గతమైంది. ఈ పరిణామాల నేపథ్యంలో మ్యూటేషన్ను పక్కన పెట్టేసి ఓపెన్ ఆక్షన్కు వెళ్లడం ద్వారా కార్పొరేషన్కు ఆదాయంతో పాటు పార్టీలో ప్రత్యర్థుల్ని దెబ్బతీయొచ్చ న్నది మేయర్ వ్యూహంగా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆచరణలో ఇది ఎంతమేర సాధ్యమవుతుందో వేచి చూడాలి.