nallapareddy prasanna kumar reddy
-
అలాంటి నీచంగా మాట్లాడటం చంద్రబాబుకే సాధ్యం
-
వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిపై ఎమ్మెల్యే నల్లపు రెడ్డి ఫైర్
-
వైఎస్సార్సీపీలోకి భారీగా చేరికలు
-
వేమిరెడ్డి దంపతులకు ప్రసన్న కుమార్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్
-
వేమిరెడ్డి దంపతులకి ప్రసన్నకుమార్ రెడ్డి వార్నింగ్
-
సీఎం జగన్ కు బ్రహ్మరథం పడుతున్న నెల్లూరు ప్రజలు
-
వేమిరెడ్డి ప్రభాకరరెడ్డికి ప్రసన్నకుమార్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్
-
దశాబ్దాల కల నెరవేర్చిన సీఎం జగన్
-
షర్మిలకు చంద్రబాబు 2 వందల కోట్లు ఇచ్చాడు ?..షర్మిలపై నల్లపురెడ్డి ఫైర్
-
చంద్రబాబుకి ఇంక సిగ్గు రాదు..ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి కామెంట్స్
-
నారా భువనేశ్వరికి ఎమ్మెల్యే నల్లపురెడ్డి కౌంటర్
-
‘ఎన్టీఆర్ హయాంలో రామోజీతో ఇలాంటి ప్రచారమే!’
సాక్షి, నెల్లూరు: యెల్లో మీడియాలో తనపై జరుగుతున్న అసత్యప్రచారంపై కోవూరు(నెల్లూరు) ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్రెడ్డి మరోసారి స్పందించారు. ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆ పార్టీ ముఖ్యనేత అచ్చెన్నాయుడిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారాయన. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే లు అసంతృప్తిగా ఉన్నారంటూ టీడీపీ ప్రచారం చేసుకుంటోంది. కానీ, ఎమ్మెల్యేలు ఎవరూ టీడీపీతో టచ్లో లేరు. మునిగిపోతున్న టీడీపీకీ జీవం పోసుకునేందుకే ఇలాంటి అసత్య ప్రచారాలకు దిగారని ఎమ్మెల్యే ప్రసన్నకుమార్రెడ్డి పేర్కొన్నారు. చంద్రబాబు, ఆంబోతు అచ్చెన్నాయుడు డైరెక్షన్లోనే గోబెల్స్ ప్రచారం జరుగుతోందని మండిపడ్డారాయన. గతంలో ఎన్టీఆర్ హయాంలోనూ రామోజీరావును అడ్డంపెట్టుకుని ఇలాంటి ప్రచారాలు చంద్రబాబు చేయించాడని ప్రసన్నకుమార్ గుర్తు చేశారు. మంత్రి పదవి రాలేదని తాను అలిగినట్లు యెల్లో మీడియా ద్వారా అసత్య కథనాలు రాయిస్తున్నారని, రాసి పెట్టి ఉంటే పదవులు ఎక్కడికీ పోవని పేర్కొన్నారాయన. రాజకీయాల్లో వెనుకబడిన దళితులకు మంత్రి పదవులు ఇవ్వడం తప్పు అన్నచందాన చంద్రబాబు వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే ప్రసన్నకుమార్రెడ్డి తెలిపారు. ఇదీ చదవండి: టీడీపీ మాజీలకు గెలుపు దూరం, అందుకే ఈ డ్రామా -
‘నా చివరి రక్తపు బొట్టు వరకు జగన్తోనే ఉంటా’
సాక్షి, నెల్లూరు: పార్టీ మారాల్సిన అవసరం తనకు లేదని, చివరి రక్తపు బొట్టు వరకు సీఎం జగన్తోనే ఉంటానని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్రెడ్డి స్పష్టం చేశారు. కావాలనే తాను పార్టీ మారుతున్నట్లు కొందరు అసత్య ప్రచారం చేస్తున్నట్లు తెలిపారు. ఇదంతా చంద్రబాబు ఆడుతున్న మైండ్ గేమ్ అని ధ్వజమెత్తారు. అందులో భాగమే ఈ దుష్ప్రచారమని.. కొన్ని మీడియా సంస్థలను అడ్డుపెట్టుకుని ఇలా చేస్తున్నారని మండిపడ్డారు. కోవూరులో వేరే అభ్యర్థికి టికెట్ ఇచ్చినా తాను సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ఏదేమైనా జగన్తోనే తన పయనమని స్పష్టం చేశారు. -
వలంటీర్లను చూస్తే చంద్రబాబుకు వణుకు
కొడవలూరు(పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా): ‘ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తూ వారికి అన్ని విధాలుగా అండగా ఉన్న వలంటీర్ వ్యవస్థను చూసి ప్రతిపక్ష నేత చంద్రబాబుకు వణుకు పట్టుకుంది. అందుకే ఎల్లో మీడియాలో విష ప్రచారం చేయిస్తున్నాడు.’ అని కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి అన్నారు. మండలంలోని నార్తురాజుపాళెంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. వలంటీర్లు తమకు కేటాయించిన ప్రాంతంలో అర్హులకు పక్కాగా ప్రభుత్వ పథకాలందిస్తున్నట్లు చెప్పారు. కరోనా గడ్డు కాలంలో ప్రాణాలకు తెగించి క్షేత్రస్థాయిలో ఉండి అండగా నిలిచారన్నారు. వారి పనితీరును చూసి చంద్రబాబుకు భయం పట్టుకుందన్నారు. దీంతో ఎల్లో మీడియాలో దిగజారుడు రాతలు రాయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్కడో జరిగిన చిన్న పొరపాటును మొత్తం వలంటీర్ వ్యవస్థకు ఆపాదించి ఇష్టం వచ్చినట్లు రాయడం సబబేనా అని ప్రశ్నించారు. పలువురు ముఖ్యమంత్రులు ఈ వ్యవస్థ గురించి తెలుసుకుని ఆయా రాష్ట్రాల్లో అమలుకు శ్రీకారం చుడుతున్నారని చెప్పారు. ఎల్లో మీడియా పనికట్టుకుని వ్యతిరేక వార్తలు రాసినంత మాత్రాన ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తుందని బాబు పగటికలలు కంటున్నారని తెలిపారు. ప్రతి కుటుంబానికి రూ.లక్ష నుంచి రూ.10 లక్షల వరకు వివిధ పథకాల ద్వారా లబ్ధి చేకూరిందన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని వదులుకునేందుకు ప్రజలు సిద్ధంగా లేరని బాబు గుర్తించుకోవాలన్నారు. సమావేశంలో డీసీఎంఎస్ చైర్మన్ వీరి చలపతిరావు, వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ గంధం వెంకటశేషయ్య, జెడ్పీటీసీ పి.సరోజనమ్మ, ఎంపీపీ జి.జ్యోతి, సర్పంచ్లు బి.సుప్రియ, ఎన్.కామాక్షి, ఎంపీటీసీ పి.అనిల్కుమార్రెడ్డి, నాయకులు పాల్గొన్నారు. -
నాడు అవినీతి, నేడు పారదర్శక పాలన
కొడవలూరు : గత టీడీపీ ప్రభుత్వంలో ఇల్లు, స్థలం, పింఛన్ ఇలా ఏ పథకం పొందాలన్నా జన్మభూమి కమిటీలకు లంచం ఇవ్వాల్సిన పరిస్థితి ఉండేదని, నేడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వలంటీర్, సచివాలయ వ్యవస్థలను తీసుకొచ్చి పారదర్శక పాలన అందిస్తున్నట్లు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి తెలిపారు. కొడవలూరు ఇరిగేషన్ అతిథిగృహంలో కొడవలూరు, మానేగుంటపాడు గ్రామ వలంటీర్లతో ఆయన శనివారం సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జన్మభూమి కమిటీలు గ్రామ, మండలస్థాయి అధికారులను లెక్క చేసే వారు కాదని, అధికారులు అర్హులకు న్యాయం చేయాలన్నా చేయలేని పరిస్థతి ఉండేదని చెప్పారు. నేడు సీఎం జగన్మోహన్రెడ్డి వలంటీర్, సచివాలయ వ్యవస్థలను ఏర్పాటు చేసి సుపరిపాలనకు శ్రీకారం చుట్టారన్నారు. కొడవలూరులో రెండు చోట్ల సైడ్ డ్రెయిన్ల నిర్మాణం కోసం రూ.10 లక్షలు, మానేగుంటపాడులో సైడ్ డ్రెయిన్కు రూ.5 లక్షల ఎమ్మెల్యే నిధులు మంజూరు చేస్తున్నట్లు వివరించారు. కోవూరు నియోజకవర్గానికి గడిచిన రెండేళ్లలో సంక్షేమ పథకాల ద్వారా రూ.450 కోట్లను అందించడం జరిగిందన్నారు. అనంతరం ఓటీఎస్ లబి్ధదారులకు రిజి్రస్టేషన్ పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సుబ్రహ్మణ్యం, డీసీఎమ్మెస్ చైర్మన్ వీరి చలపతిరావు, వైఎస్సార్సీపీ మండల కనీ్వనర్ వెంకటశేషయ్య, సర్పంచ్లు పాలిచర్ల శ్రీనివాసులురెడ్డి, కామాక్షి, ఎంపీటీసీ సభ్యుడు ప్రతాప్, నాయకులు సునీతమ్మ, తిరుపతమ్మ, సుబ్బరామిరెడ్డి పాల్గొన్నారు. -
చంద్రబాబు చిల్లర రాజకీయాలు చేస్తున్నారు: నల్లపరెడ్డి
-
ఎంతటి వారైనా ఉపేక్షించం: ఆనం హెచ్చరిక
సాక్షి, నెల్లూరు (కలువాయి): గిరిజన కుటుంబానికి దక్కాల్సిన ప్రభుత్వ సహాయంలో ఎవరు అవకతవకలకు పాల్పడి ఉన్నా, వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి హెచ్చరించారు. రమణయ్య అనే వ్యక్తి మృతిచెందగా వైఎస్సార్ భీమా పథకం కింద బాధిత కుటుంబానికి అందాల్సిన రూ.2 లక్షలను స్థానిక పెద్దలు, అధికారులు కలిసి దుర్వినియోగం చేశారు. దీనిపై ఆదివారం సాక్షిలో ‘మనుషులా.. రాబంధులా!’ అనే శీర్షికన కథనం ప్రచురితమైంది. ఈ విషయంపై ఎమ్మెల్యే ఆనం స్పందించారు. బాధిత కుటుంబానికి పూర్తిన్యాయం చేస్తామని, అండగా ఉంటానని హామీ ఇచ్చారు. దీనికి కారకులైన వారిపై తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. (మనుషులా.. రాబంధులా!) ఈ వ్యవహారంపై తక్షణమే విచారణ జరిపి నివేదిక అందించాలని ఎమ్మెల్యే కలువాయి ఎంపీడీఓ సింగయ్యను ఆదేశించారు. ఆయన స్పందించి వెలుగు అధికారులను గ్రామానికి పంపి విచారణ చేయించారు. ఎంపీడీఓ మాట్లాడుతూ ఎమ్మెల్యే ఆదేశాల మేరకు విచారణ జరుపుతున్నామన్నారు. పొదుపు రుణానికి కట్టేందుకు అని పక్కన పెట్టిన రూ.80 వేలు, అప్పు కింద గ్రామానికి చెందిన ఒక వ్యక్తి జమ చేసుకున్న రూ.60 వేలు రెండురోజుల్లో వసూలు చేసి రమణయ్య కుమార్తెల బ్యాంకు ఖాతాలో జమ చేస్తామన్నారు. వారు నగదు తక్షణమే చెల్లించకుంటే చర్యలు తీసుకుంటామన్నారు. రమణయ్య చిన్న కుమార్తె స్వాతికి దివ్యాంగ పింఛన్ మంజూరు చేయించేందుకు కృషి చేస్తామన్నారు. రమణయ్య కుటుంబానికి రూ.లక్ష సాయం – కోవూరు ఎమ్మెల్యే ప్రసన్నకుమార్రెడ్డి కలువాయి: ‘మనుషులా.. రాబంధులా’ శీర్షికన ప్రచురితమైన కథనానికి కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి స్పందించారు. నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డి మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఆ రమణయ్య కుటుంబానికి రూ.లక్ష సాయం అందించనున్నట్లు ప్రకటించారు. ఆదివారం సాయంత్రం ఆయన సాక్షితో మాట్లాడుతూ రెండు, మూడురోజుల్లో రమణయ్య పిల్లల పేరున నగదును బ్యాంకు ఖాతాలో జమ చేస్తామన్నారు. రమణయ్య కుటుంబానికి జరిగిన అన్యాయ్యాన్ని కలెక్టర్, గూడూరు సబ్ కలెక్టర్, ఆత్మకూరు ఆర్డీఓల దృష్టికి తీసుకెళ్లడంతోపాటు ప్రభుత్వపరంగా ఆదుకోవాలని కోరామన్నారు. వారికి ప్రభుత్వ స్థలం ఇచ్చి, రమణయ్య చిన్న కుమార్తె స్వాతికి దివ్యాంగ పింఛన్ మంజూరు చేసేలా చర్యలు కలెక్టర్ను కోరానన్నారు. -
మనబడి నాడు నేడుతో పాఠశాలను అభివృద్ధిచేస్తాం
-
చంద్రబాబు డైరెక్షన్.. కన్నా యాక్షన్
సాక్షి, కోవూరు: ‘బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అబద్ధాల కోరు. చంద్రబాబునాయుడు డైరెక్షన్లోనే ఆయన యాక్షన్ చేస్తున్నారు’ అని కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి అన్నారు. మండలంలోని పడుగుపాడు గ్రామంలో ఆయన ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బీజేపీ విధివిధానాలు కన్నాకు తెలియదని, అలాంటి వ్యక్తి చేతికి బీజేపీ రాష్ట్ర బాధ్యతలు అప్పగించడం దారుణమన్నారు. రాష్ట్రంలో, జిల్లాలో బీజేపీ నాయకులంటే తమకు, తమ పార్టీ నాయకులకు గౌరవం ఉందన్నారు. అయితే లక్ష్మీనారాయణ వంటి వ్యక్తుల వల్ల ఆ గౌరవం సన్నగిల్లుతోందన్నారు. కన్నాకు గుంటూరులో రౌడీగా ముద్ర ఉందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామ సచివాలయాలు, గ్రామ వలంటీర్ల విధివిధానాలను అపహాస్యం చేస్తూ కన్నా రాష్ట్ర గవర్నర్కు వినతిపత్రం ఇవ్వడం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. చంద్రబాబు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారన్నారు. ఖజానాను ఖాళీ చేసి అప్పుల ఊబిని తమ పార్టీకి అప్పగించడం జరిగిందన్నారు. దానిని ఒక సవాల్గా స్వీకరించి ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించి రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు తీసుకువెళ్లేందుకు సీఎం వైఎస్ జగన్ ప్రయత్నిస్తున్నారన్నారు. ఇతర దేశాల ప్రతినిధులతో పారిశ్రామికవేత్తలతో సమావేశాలు ఏర్పాటుచేసి ఏ ప్రాంతంలో ఎటువంటి పరిశ్రమలు ఏర్పాటుచేయాలనే ఆలోచనతో ముందుకెళుతున్నట్లు చెప్పారు. చంద్రబాబు లాంటి నీచరాజకీయాలు చేసే వ్యక్తితో కన్నా చేయి కలపడం దారుణమన్నారు. చంద్రబాబు, కన్నా వల్ల రాష్ట్ర ప్రజలకు ఏమి ఒరగదన్నారు. ఎవరెన్ని డ్రామాలు ఆడినా రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోలేరన్నారు. ఎస్సీ, ఎస్టీలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, దీంతో లక్షలాదిమందికి లబ్ధి చేకూరుతుందన్నారు. సమావేశంలో కాటంరెడ్డి దినేష్రెడ్డి, ఆర్.మల్లికార్జున్రెడ్డి, డి.నిరంజన్బాబురెడ్డి, మండల కన్వీనర్ నలుబోలు సుబ్బారెడ్డి, ఎస్కే అహ్మద్, సొసైటీ అధ్యక్షులు ములుమూడి సుబ్బరామిరెడ్డి, ఎస్.నరసింహులురెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
జగన్పై హత్యాయత్నంలో చంద్రబాబు హస్తం
సాక్షి,విడవలూరు(నెల్లూర్): ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై జరిగిన హత్యాయత్నంలో సీఎం చంద్రబాబు, డీజీపీల హస్తం ఉన్నట్లుందని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా విడవలూరు మండలంలోని జాన్పేట, ఎస్సీవాడకు చెందినవారు పెద్ద ఎత్తున ఆదివారం వైఎస్సార్సీపీలో చేరారు. ఈ సందర్భంగా ప్రసన్నకుమార్రెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్పై జరిగిన హత్యాయత్నం కేసులో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరారు. కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించి. వాస్తవాలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. రుణాలు మాఫీ చేస్తానని చెప్పి.. చివరకు డ్వాక్రా అక్కచెల్లెమ్మలను చంద్రబాబు నిండా ముంచేశారని మండిపడ్డారు. చంద్రబాబు ఘరానా మోసగాడన్నారు. భూ పంపిణీ చేయబోతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రగల్భాలు పలికిందని.. అసలు భూ పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందే దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి అని గుర్తు చేశారు. చంద్రబాబుకు కౌంట్డౌన్ ప్రారంభమైందని.. వచ్చే ఎన్నికల్లో ఘోర ఓటమి తప్పదన్నారు. జగన్ సీఎం అయితేనే రాజన్న రాజ్యం సాధ్యమన్నారు. -
ఆరు దాటితే కమీషన్ల లెక్కల్లో చంద్రబాబు
సాక్షి, కోవూరు: సీఎం చంద్రబాబు మంచి నాటకాలరాయుడని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి అన్నారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరు మండలం వేగూరు రామాపురంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు ఇటీవల విలేకరులతో మాట్లాడుతూ.. తాను ఉదయం ఒక జొన్న ఇడ్లీ, టీ, మధ్యాహ్నం రాగిసంగటి, సాయంత్రం ఒక పండు, ఒక గుడ్డు ఆహారంగా తీసుకుంటానని చెప్పారన్నారు. అయితే సాయంత్రం ఆరు గంటలు దాటితే తండ్రీకొడుకులు కూర్చొని రోజువారీ కలెక్షన్లు, కమీషన్ల లెక్కలు చూసుకుంటూ కడుపు నింపుకుంటున్నారని విమర్శించారు. 2014–15 ఆర్థిక సంవత్సరంలో చంద్రబాబు పర్యటనల కోసం ప్రైవేట్ హెలికాప్టర్కు రూ.14.33 కోట్లు ఖర్చు చేయడాన్ని కాగ్ విమర్శించిందని చెప్పారు. రిజిస్ట్రేషన్, రెవెన్యూ, ఎక్సైజ్ శాఖల్లో అంతులేని అక్రమాలు జరిగినట్లు కాగ్ తన నివేదికలో పేర్కొందన్నారు. దీనికి ప్రధాన కారకులు సీఎం చంద్రబాబేనని చెప్పారు. నెల్లూరు జిల్లాలో నీరు–చెట్టు కార్యక్రమంలో చోటుచేసుకున్న అక్రమాలను సాక్ష్యాధారాలతో బయటపెట్టినా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం దారుణమని మండిపడ్డారు. సైకోలా ప్రవర్తిస్తున్న ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్జాంగ్ ఉన్కు సీఎం చంద్రబాబుకు తేడా లేదన్నారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ నలబోలు సుబ్బారెడ్డి, జిల్లా నాయకులు మల్లికార్జునరెడ్డి, నిరంజన్ బాబురెడ్డి, నరసింహులురెడ్డి, సుబ్బరామిరెడ్డి, సర్పంచ్ దేవేంద్రమ్మ పాల్గొన్నారు. -
హోదా కోసం నేరుగా పోరాడు
పవన్ కళ్యాణ్కు వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్రెడ్డి హితవు అనుమసముద్రంపేట: జనసేవ అధినేత పవన్కళ్యాణ్ దాగుడు మూతలు ఆడితే కుదరదని, హోదా కోసం నేరుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పోరాడాలని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఆయన, కుటుంబ సభ్యులతో కలిసి ఏఎస్పేట లోని శ్రీహజ్రత్, అమ్మాజీల దర్గా సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. దర్గా సజ్జాదానషీన్ హఫజ్పాషా ప్రార్థనలు చేసి శ్రీహజ్రత్ వారి శేష వస్త్రాన్ని అందజేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పవన్ తిరుపతిలో హడావుడిగా సమావేశం పెట్టి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తే ప్రజలు నమ్మరన్నారు. బైట ప్రసంగాలు లోపల లాలూచీ పడకుండా హోదా సాధించేందుకు సీఎం, పీఎంల ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడితే తమ పార్టీ కూడా అందుకు మద్దతు తెలుపుతుందన్నారు. వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పెట్టిన గడప గడపకు కార్యక్రమంలో ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సమస్యలు తెలుపుతున్నారన్నారు. కార్యక్రమంలో ఆయన కుమారుడు రజిత్కుమార్రెడ్డి, భార్య గీతమ్మ, కోడలు పూజ, పార్టీ రాష్ట్ర యూత్ కార్యదర్శి కలువల శంకర్రెడ్డి, పార్టీ మండల ప్రచార కార్యదర్శి పఠాన్ ఖాదర్బాషా పాల్గొన్నారు. -
'ఆరుగురు ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు'
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ప్రస్తుతం పశ్చాత్తాపడుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కాకాని గోవర్ధన్ రెడ్డి, ప్రతాప్ కుమార్ రెడ్డి, సంజీవయ్య అన్నారు. ఆరుగురు ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నారని వారు మంగళవారమిక్కడ తెలిపారు. అయితే వారి వివరాలు చెప్పాలని విలేకర్లు అడగగా, సమయం వచ్చినప్పుడు తామే బయటపెడతామని వారు పేర్కొన్నారు. రాజ్యసభకు టీడీపీ నాలుగో అభ్యర్థిని నిలబెట్టినా వైఎస్ఆర్ సీపీ అభ్యర్థి విజయ సాయిరెడ్డిదే విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. కాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలుపొందిన 17మంది టీడీపీలో చేరిన విషయం తెలిసిందే. రాజ్యసభకు నాలుగో అభ్యర్థి విషయంలో ఫిరాయింపు ఎమ్మెల్యేలతో చంద్రబాబు నాయుడు నిన్న సమావేశం అయ్యారు. అయితే ఇదే అంశంపై చర్చించేందుకు వారిని ముందుగా తిరుపతి, ఆ తర్వాత విజయవాడ, అనంతరం హైదరాబాద్ అంటూ తిప్పుతున్నారు. ఇక చంద్రబాబుతో భేటీ సమయంలో వారి సెల్ఫోన్లు కూడా సెక్యూరిటీ సిబ్బంది తీసుకున్న తర్వాతే లోనికి అనుమతించినట్లు తెలుస్తోంది. వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబుకు ఎన్టీఆర్కు భారత రత్న ఇవ్వడం ఇష్టం లేదన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబ సభ్యులను విమర్శించేందుకే మహానాడు నిర్వహించినట్లు ఉందని ఎద్దేవా చేశారు. పేదల గుండెల్లో ఉన్న వైఎస్ఆర్ సీపీని ఏమీ చేయలేరని నల్లపరెడ్డి అన్నారు. రాజధాని పేరుతో జరుగుతున్న అవినీతికి మాత్రమే తాము వ్యతిరేకమన్నారు. -
'మాఫియా డాన్లా వ్యవహరిస్తున్న చంద్రబాబు'
నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాఫియా డాన్లా వ్యవహరిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఆరోపించారు. బుధవారం నెల్లూరులో ఎన్ ప్రసన్న కుమార్రెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ... తన పార్టీ అనుచరులతో అక్రమాలు చేయిస్తూ చంద్రబాబు మాఫియా సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్నారని విమర్శించారు. కాల్ మనీ వ్యవహారంపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. -
రాజీనామా చేయలేదు..జగన్తోనే ఉంటా
హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినట్లు వచ్చిన వార్తలను నెల్లూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఖండించారు. పార్టీకి రాజీనామా చేసే ప్రసక్తే లేదని, చివరి వరకూ వైఎస్ జగన్ వెంటే ఉంటానని ఆయన స్పష్టం చేశారు. తాను పార్టీకి రాజీనామా చేసి ఆ లేఖను ఫ్యాక్స్ చేసినట్లు కొన్ని మీడియా ఛానల్స్ అసత్య ప్రచారం చేస్తున్నాయన్నారు. నల్లపరెడ్డి బుధవారం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ' నేను పార్టీకి రాజీనామా చేయలేదు. రాజీనామా లేఖను పార్టీ ఆఫీసుకు పంపించినట్లు, రాజీనామా చేసినట్లు చెప్పారు. ఏ రాజీనామా లేఖను పంపలేదు. ఫ్యాక్స్ చేయలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతాను. ఏబీఎన్ ఛానల్కు చెందిన హైదరాబాద్ రిపోర్టర్ ఈరోజు ఉదయం నేను రాజీనామా లేఖను వైఎస్ జగన్కు ఫ్యాక్స్ చేసినట్లు చెబుతున్నాడు. నెల్లూరు రిపోర్టర్ను లైవ్లోకి తీసుకుని అడిగితే... నేను రాజీనామా చేయలేదు, ఫ్యాక్స్ చేయలేదని చెప్పాడు. అయినా ఇటువంటి అసత్య ప్రచారాలు ఎందుకు. ఏదైనా ఉంటే నన్నే అడిగితే నేను చెబుతాను. ఏదైనా చేస్తే మీఅందరికీ చెప్పే చేస్తాను. జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తానని నేను అనలేదు. నాకు రాజీనామా చేసే యోచనలేదు. మా మధ్య విభేదాలు లేవు. జగన్మోహన్ రెడ్డిగారు నన్ను తిట్టినట్లు...ఆంధ్రజ్యోతి వాళ్లు విన్నారేమో...నాకు అయితే తెలియదు. ఆయన నన్ను ఎప్పుడూ గౌరవంగా చూస్తారు. ...నా చివరి రక్తపు బొట్టు వరకూ వైఎస్ఆర్ సీపీలోనే కొనసాగుతాను. 2012లో ఏ మాట అయితే చెప్పానో... ఇప్పటికీ అదే మాటకు కట్టుబడి ఉంటాను. అన్ని విషయాలు మా నాయకుడితో మాట్లాడుకుంటాను' అని అన్నారు. చంద్రబాబు నాయుడు...ఎంపీటీసీలను సంతలో సరుకులను కొన్నట్లు కొంటున్నారని నల్లపరెడ్డి మండిపడ్డారు. -
చంద్రబాబు ఊసరవెల్లి
నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి ఇందుకూరుపేట: ఊసరవెల్లి రంగులు మార్చిన తరహాలో సీఎం చంద్రబాబు మాటలు మార్చే నేర్పరి అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి అన్నారు. పార్టీ అనుబంధ విభాగాల మండల అధ్యక్షుల నిమాయక ప్రక్రియను జగదేవిపేటలోని పిడూరు సునీల్రెడ్డి నివాసంలో శనివారం నిర్వహించారు. ప్రసన్నకుమార్రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో వ్యవసాయ రుణాలన్నీ మాఫీ చేస్తానన్న చంద్రబాబు ఇప్పుడు మాట మారుస్తున్నారన్నారు. పంట రుణాలు మాత్రమే మాఫీ చేస్తానని, అది కూడా ఒక్కో ఇంటికి రూ.1.5 లక్ష మాత్రమేనని పేర్కొనడం దారుణమన్నారు. అధికారంలోకి వచ్చాక ఆయన డొంక తిరుగుడు మాటలు మాట్లాడుతూ రైతుల్ని మోసం చేస్తున్నారని మండిపడ్డారు. రైతులు బ్యాంకుల నుంచి పొందిన స్వల్ప, దీర్ఘకాలిక, ప్రాసెసింగ్ తదితర రుణాలన్నీ వ్యవసాయ రుణాల కిందకే వస్తాయన్నారు. ఆంధ్రప్రదేశ్లో చాలా తెలివైన వ్యక్తినని, సీఈఓనని ప్రచారం చేసుకునే చంద్రబాబుకు వ్యవసాయ రుణాలకు, పంట రుణాలకు తేడా తెలియకపోవడం విచిత్రంగా ఉందన్నారు. రుణాలు కట్టవద్దని, తాకట్టుపెట్టిన నగలు, డాక్యుమెంట్లు ఇంటికి వస్తాయని ఆయన చెప్పిన మాటలు నమ్మి రైతులు నిలువున మోసపోయారన్నారు. వడ్డీల భారం పడటమే కాక పంటలు నష్టపోయిన పలువురు బీమా సౌకర్యం సైతం కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశౠరు. ఇచ్చిన హామీలన్నీ తుంగలో తొక్కి ఇప్పుడు ఆర్థిక సమస్యలంటూ వాటిని నెరవేర్చకుండా అందరినీ వంచిస్తున్నారని ధ్వజమెత్తారు. అధికారులు కూడా నాటకాలాడుతున్నారన్నారు. నెల్లూరులో జరిగిన జన్మభూమి కార్యక్రమానికి వైఎస్సార్సీపీ కార్పొరేటర్ హాజరైతే లాఠీలతో కొట్టించి బయటకు నెట్టించేసిన ఓ ఇన్స్పెక్టర్ వాడరాని భాష వాడారన్నారు. ఆయన చరిత్ర అంతా సేకరించి ఉన్నతాధికాారులకు నివేదించానన్నారు. కొడవలూరు ఎంపీడీఓ కూడా అలాగే ఉన్నారన్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా సుమారు రూ.15 లక్షల నుంచి నుంచి రూ.20 లక్షల వరకు అవినీతి జరిగిందన్నారు. అధికారుల్లో 60 శాతం మంది నిజాయితీగా వ్యవహరిస్తుండగా 40 శాతం మంది పచ్చా చొక్కాలు వేసుకుని పనిచేస్తున్నారన్నారు. అలాంటి వారికి వైఎస్సార్సీపీ తగిన గుణపాఠం చెబుతుందన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు గొల్లపల్లి విజయ్కుమార్, మండల అధ్యక్షుడు మావులూరు శ్రీనివాసులురెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు బీవీ రమణయ్య, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు ప్రసన్నశ్రావణ్కుమార్, గూడూరు ప్రభాకర్రెడ్డి, కొళ్లపూడి శ్రీనివాసులురెడ్డి పాల్గొన్నారు. -
ప్రజాప్రతినిధులపై దాడులా..?
నెల్లూరు (సెంట్రల్): టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కొందరు పోలీసుల తీరు దారుణంగా తయారైందని, చంద్రబాబు కోసమే పనిచేస్తున్నట్లు వ్యవహరిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరులోని 52వ డివిజన్లో వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు, నాయకులపై గురువారం పోలీసుల తీరు భయభ్రాంతులకు గురిచేసేలా ఉందన్నారు. పోలీసుల తీరును నిరసిస్తూ శుక్రవారం ఆయన ఎస్పీ సెంథిల్కుమార్కు లేఖ రాశారు. ‘అసలు ఏం జరుగుతోంది..ప్రజాస్వామ్యంలో ఉన్నామా’ అని ప్రశ్నించారు. కొందరి తీరు పోలీసు వ్యవస్థకే సిగ్గుచేటుగా ఉందన్నారు. ప్రజల తీర్పును బట్టి ప్రభుత్వాలు మారుతుంటాయని, అధికారులు మాత్రం నిజాయితీగా వ్యవహరించాలన్నారు. కింది స్థాయి అధికారుల తీరు సరిగా లేదని, టీడీపీ నేతలకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారన్నారు. గురువారం రంగనాయకులపేటలో జరిగిన కార్యక్రమానికి ఎమ్మెల్యే అనిల్ వెంట వెళ్లిన కార్పొరేటర్లతో ఇన్ స్పెక్టర్ వెంకటరత్నం అమానుషంగా వ్యవహరించారన్నారు. అక్కడ ఎలాంటి గొడవ జరగకపోయినా ఇన్స్పెక్టర్ రెచ్చగొట్టి గందరగోళం సృష్టించారన్నారు. కార్పొరేటర్లు అనే గౌర వం లేకుండా దుర్బాషలాడుతూ చొక్కా లు పట్టుకుని ఈడ్చుకెళ్లారన్నారు. ఆయన తన హోదాను మరిచి టీడీపీకి దాసోహమైనట్టు వ్యవహరించడం అభ్యంతరకరమన్నారు. ఈ ఘటనపై విచారణ జరిపి ఇన్స్పెక్టర్ వెంకటరత్నంపై చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు. అధికార పార్టీ నేతల అండతో జులుం టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆ పార్టీ నేతల అండతో పోలీసులు జులుం ప్రదర్శిస్తున్నారని ప్రసన్నకుమార్రెడ్డి లేఖలో పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ శ్రేణులు ఏ తప్పు చేయకపోయినా తప్పుడు కేసులు పెట్టి ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు. చంద్రబాబు మీద పోలీసులకు అంత ప్రేమ ఉంటే ఉద్యోగాలకు రాజీనామా చేసి టీడీపీలో చేరిపోవాలంటూ ఘాటుగా స్పందించారు. ఎస్పీగా మీరు తీసుకుంటున్న నిర్ణయాలు మంచి పేరు తెచ్చిపెట్టాయని, కింది స్థాయి అధికారుల తీరు మాత్రం పోలీసు శాఖకు చెడ్డపేరు తెస్తోందన్నారు. ఈ పరిస్థితిని సరిదిద్దాలని కోరారు. టీడీపీ అధికారం చేపట్టినప్పటికి ఇద్దరు ఎంపీలు, ఏడుగురు ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్మన్ను గెలిపించి ప్రజలు తమ వెంటే ఉన్నారన్నారు. అధికార పార్టీ అండతో పెడుతున్న అక్రమ కేసులు, చేస్తున్న దౌర్జన్యాలను అరికట్టి న్యాయాన్ని రక్షించకపోతే ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఆయన లేఖలో పేర్కొన్నారు. -
ఒక్క హామీనీ నెరవేర్చని బాబు: వైఎస్సార్సీపీ
* వైఎస్సార్సీపీ నేతలు * విజయసాయిరెడ్డి, ఉమ్మారెడ్డి ధ్వజం సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ‘అధికారం కోసం సాధ్యంకాని హామీలను గుప్పించారు. ఏ వర్గాన్నీ వదలకుండా వాన కురిసినట్లు వరాలు కురిపిం చారు. ప్రభుత్వం ఏర్పడిన ఐదునెలల్లో ఒక్క హా మీనైనా నెరవేర్చినట్లు నిరూపించగలవా? ఒక్క రైతుకైనా.. ఒక్క సంఘానికైనా రుణం మాఫీ చేశావా?’ అని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు విజయసాయిరెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు సీఎం చంద్రబాబును ప్రశ్నించారు. నెల్లూరులో మంగళవారం వైఎస్సార్సీపీ సమీక్ష సమావేశం నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి విజయసాయిరెడ్డి, ఉమ్మారెడ్డిలతో పాటు రాష్ట్ర ఎస్సీసెల్ అధ్యక్షుడు మేరుగ నాగార్జున, రాష్ట్ర ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు గౌతంరెడ్డి, రాష్ట్ర వాలంటీర్ల విభాగం అధ్యక్షుడు, చం ద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి, విద్యార్థి విభాగం అధ్యక్షుడు సలాంబాబు, జిల్లా ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి, కాకాణి గోవర్ధన్రెడ్డి, అనిల్కుమార్యాదవ్, రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి, పాశం సునీల్, కిలివేటి సంజీవ య్య, జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, డిప్యూటీ మేయర్ ద్వారకానాథ్, పార్టీ సీఈసీ సభ్యుడు ఎల్లసిరి గోపాల్రెడ్డి, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు అనితమ్మ హాజరయ్యారు. విజయసాయిరెడ్డి మాట్లాడుతూ రైతుల రుణాల న్నీ మాఫీ చేస్తానన్న బాబు మాట మార్చి పంట రుణాలు మాఫీ అని చెబుతున్నారన్నారు. బ్యాం కర్ల సమావేశంలో రోజుకోమాట చెబుతూ కాల యాపన చేస్తున్నారన్నారు. బాబు నిర్లక్ష్య వైఖరి, రాష్ట్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై వచ్చేనెల 5న మండల కేంద్రాల్లో ధర్నాలు నిర్వహించనున్నట్లు విజయసారుురెడ్డి ప్రకటించారు. రైతు లు, బ్యాంకర్ల మధ్య మంచి సంబంధాలు ఉండేవని, బాబు వచ్చాక ఆ సంబంధాలు తెగిపోయాయని ఉమ్మారెడ్డి విమర్శించారు. మహానేత వైఎస్ఆర్ని టార్గెట్ చేస్తూ 7 శ్వేతపత్రాలను విడుదల చేసిన చంద్రబాబు.. ఇప్పుడు తాను ఇచ్చిన హామీలు, రుణాల మాఫీపై క్యాలెండర్ విడుదల చేయాలని ఉమ్మారెడ్డి డిమాండ్ చేశా రు. నాటి వైఎస్ పాలన.. నేటి బాబు పాలనను బేరీజు వేసుకుంటే ఎవరు ఎటువంటి వారో ప్రజ లకు అర్థమవుతుందన్నారు. వైఎస్ పాలనలో లబ్ధి పొందని కుటుంబం అంటూ లేదని గుర్తుచేశారు. టీడీపీకి ఓటేసిన వారంతా తప్పుచేశామని బాధపడుతున్నారని, వారికివే చివరి ఎన్నికలని చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి అన్నారు. పల్లెల్లో టీడీపీకి చెందిన చోటా నాయకుడు కూడా ప్రజలకు అడ్డంకిగా మారారని, అందువల్ల ఈసారి వారికి గూబ గుయ్యిమనేలా బుద్ధి చెప్పాలని అన్నారు. సమావేశంలో మేరుగ నాగార్జున, గౌతంరెడ్డి కూడా ప్రసంగించారు. -
పింఛన్ల తొలగింపుపై ఉద్యమిస్తాం
పొదలకూరు: పింఛన్ల తొలగింపుపై తమ పార్టీ ఉద్యమిస్తుందని వైఎస్సార్సీపీ జిల్లా నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి వెల్లడించారు. స్థానిక ఆర్అండ్బీ అతిథిగృహంలో శనివారం సర్వేపల్లి, నెల్లూరు నగర ఎమ్మెల్యేలు కాకాణి గోవర్ధన్రెడ్డి, పి.అనిల్కుమార్ యాదవ్తో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో పింఛన్ల ఏరివేత పెరిగిందన్నారు. తమకు చాలా మంది ఫోన్లు చేసి పింఛన్ తొలగించినట్టు వాపోతున్నారన్నారు. పింఛన్ల తొలగింపుపై వైఎస్సార్సీపీ అవిశ్రాంతంగా పోరాడుతుందని హెచ్చరించారు. పింఛన్ల పంపిణీలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు తీరని అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్రెడ్డి మాట్లాడుతూ త్వరలో పార్టీ జిల్లా అధ్యక్షుని ఆధ్వర్యంలో సర్వేపల్లి నియోజకవర్గంలో కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేస్తానన్నారు. పార్టీని ముందుకు నడిపించేందుకు ప్రసన్నకుమార్రెడ్డి కృషి చేస్తున్నారన్నారు. పింఛన్ల ఎంపిక ప్రక్రియ నియంతృత్వ ధోరణిని తలపిస్తోందని విమర్శించారు. కమిటీల్లో సర్పంచులు, ఎంపీపీలు వైఎస్సార్సీపీకి చెందినవారు ఉన్నా వారిని నామమాత్రులను చేశారని విరుచుకుపడ్డారు. సామాజిక కార్యకర్తలు, పొదుపు సభ్యుల పేరుతో టీడీపీ కార్యకర్తలను కమిటీల్లో నియమించుకుని ఇష్టానుసారం పింఛన్ల లబ్ధిదారులను గుర్తించారన్నారు. అధికారులు సైతం చోద్యం చేస్తున్నారే తప్ప పేదలకు న్యాయం చేసే దిశగా చర్యలు తీసుకోలేకపోతున్నారన్నారు. ఏ కారణాలతో పింఛన్ తొలగిస్తున్నారో అధికారులు పరిశీలించాలన్నారు. కమిటీలో టీడీపీ సభ్యులు తొలగించమంటే తొలగిస్తున్నట్టు ఆరోపించారు. దివంగత ముఖ్యమంత్రి వైస్ రాజశేఖర్రెడ్డి పార్టీలతో సంబంధం లేకుండా ప్రతిఒక్కరికీ పింఛన్లను అందజేసినట్టు గుర్తుచేశారు. ప్రజలతో కలిసి పోరాటం చేస్తామన్నారు. నెల్లూరు నగర ఎమ్మెల్యే పి.అనిల్కుమార్ యాదవ్ మాట్లాడుతూ నెల్లూరు కార్పొరేషన్లో కొందరు కార్పొరేటర్లు ఇళ్లవద్దే పింఛన్ల ఎంపిక ప్రక్రియ చేపట్టడం దారుణమన్నారు. ప్రభుత్వం టీడీపీ కార్యకర్తలకు పింఛన్లు ఇప్పించుకునేందుకే కమిటీలను నియమించిందని విమర్శించారు. పేదలకు అన్యాయం జరిగితే నిలదీస్తామన్నారు. తొలిసారిగా నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి జిల్లాపార్టీ అధ్యక్షుని హోదాలో పొదలకూరుకు రావడంతో స్థానిక నాయకులు, కార్యకర్తలు ఘనంగా సత్కరించారు. విలేకర్ల సమావేశంలో పొదలకూరు ఎంపీపీ కోనం బ్రహ్మయ్య, సర్పంచులు తెనాలి నిర్మలమ్మ, బచ్చల సురేష్కుమార్రెడ్డి, పార్టీ మండల కన్వీనర్ పెదమల్లు రమణారెడ్డి, వైఎస్సార్సీపీ స్టీరింగ్ కమిటీ సభ్యుడు బిరదవోలు శ్రీకాంత్రెడ్డి, చిల్లకూరు బాలకృష్ణారెడ్డి, నెల్లూరు నగర కార్పొరేటర్ రూప్కుమార్ యాదవ్ పాల్గొన్నారు. -
ప్రతిపక్షం గొంతు నొక్కేస్తున్నారు
బుచ్చిరెడ్డిపాళెం : అసెంబ్లీలో ప్రజల తరఫున మాట్లాడకుండా స్పీకర్ కోడెల శివప్రసాద్ ప్రధాన ప్రతిపక్షం గొంతు నొక్కేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి అన్నారు. వవ్వేరు బ్యాంకు చైర్మన్ సూరా శ్రీనివాసులురెడ్డి అతిథి గృహంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజా సమస్యలపై తమ నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి మాట్లాడే సమయంలో మైక్ కట్ చేయడం దారుణమన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన శాసనసభ స్పీకర్ అసెంబ్లీని అపహాస్యం చేస్తున్నారన్నారు. పార్టీల కతీతంగా వ్యవహరించాల్సిన స్పీకర్ అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించి అసెంబ్లీ గౌరవాన్ని బంగాళాఖాతంలో పడేశారన్నారు. ప్రధాన ప్రతిపక్షానికి మాట్లాడే అవకాశం ఇవ్వాలన్నారు. విదేశాలకు వెళ్లి టీడీపీని పొగడ్తలతో ముంచి, అసెంబ్లీలో అధికార పార్టీకి తొత్తుగా వ్యవహరించి కోడెల స్పీకర్ పదవికే మచ్చతెచ్చారన్నారు. గతంలో అయ్యదేవర కాళేశ్వరరావు వంటి ఎందరో మహానుభావులు స్పీకర్లుగా పనిచేశారన్నారు. వారందరూ హూందాగా వ్యవహరించి, ప్రతిపక్షానికి మాట్లాడే అవకాశం ఇచ్చి, ప్రభుత్వంతో సమాధానాలు చెప్పించారన్నారు. నేడు నేరారోపణలు, క్రిమినల్ కేసులున్న వ్యక్తులను స్పీకర్ స్థానంలో కూర్చోపెట్టి ఆ స్థానాన్ని మలినం చేస్తున్నారన్నారు. హత్యారాజకీయాలతో కూడిన మనస్తత్వం చంద్రబాబునాయుడిదన్నారు. ఎన్టీఆర్ను పదవి నుంచి దించే సమయంలో అప్పట్లో స్పీకర్గా ఉన్న యనమల రామకృష్ణుడును మభ్యపెట్టి, తన మామను వెన్నుపోటు పొడిచిన ఘనత చంద్రబాబుకే దక్కిందన్నారు. ఇప్పటికైనా స్పీకర్ కోడెల శివప్రసాద్ పసుపుచొక్కాను వీడి, అసెంబ్లీలో ఎలా నడుచుకోవాలో టీడీపీ శాసనభ్యులకు వివరించాలని ఆయన తెలిపారు. టీడీ పీ జిల్లా నాయకులకు ఉలికిపాటు ఎందుకో? అసెంబ్లీలో జరిగిన విషయాలపై టీడీపీ జిల్లా నాయకులు ఎందుకు ఉలిక్కి పడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. అనవసరంగా నిందారోపణలు చేస్తుంటే ఊరుకోవాలా అని ఆయన ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో వవ్వేరు బ్యాంకు చైర్మన్ సూరా శ్రీనివాసులు రెడ్డి, పార్టీ బుచ్చిరెడ్డిపాళెం, ఇందుకూరుపేట మండల కన్వీనర్లు టంగుటూరు మల్లికార్జున్రెడ్డి, మావులూరు శ్రీనివాసులు రెడ్డి, నాపా వెంకటేశ్వర్లునాయుడు, కలువ బాలశంకర్రెడ్డి, ఎంపీటీసీ సభ్యులు నరసింహరావు, ఈదూరు బాబు, నాయకులు చెర్లో సతీష్రెడ్డి, అనపల్లి ఉదయ్భాస్కర్, యామాల మోహన్, పిడుగు మధు తదితరులు పాల్గొన్నారు. -
ప్రసన్న కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో 'నరకాసుర వధ'
నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు ఎన్నికల నేపథ్యంలో ఇచ్చిన హమీలను వెంటనే అమలు చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మాజీ ఎమ్మెల్యే ఎన్.ప్రసన్నకుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హమీలు అమలు చేయకుండా చంద్రబాబు కాలయాపన చేస్తున్నారని ఆయన ఆరోపించారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే రైతు,డ్వాక్రా మహిళల రుణమాఫీకి సంబంధించిన దస్త్రంపై తొలి సంతకం చేస్తానని చెప్పి... ఆ తర్వాత మాట మార్చిన ఘనుడు చంద్రబాబు అంటూ ప్రసన్నకుమార్ రెడ్డి ఎద్దేవా చేశారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కొవ్వురు జాతీయ రహదారిపై ప్రసన్నకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో చంద్రబాబు దిష్టిబొమ్మను దగ్దం చేశారు. ఆ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో రైతులు, డ్వాక్రా మహిళలు, వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రైతులు, డ్వాక్రా మహిళల రుణమాఫీపై చంద్రబాబు అనుసరిస్తున్న వైఖరీకి నిరసన తెలుపుతు నరకాసుర వధ కార్యక్రమాన్ని మూడు రోజుల పాటు నిర్వహించాలని బుధవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం పిలుపునిచ్చారు. ఈ సందర్బంగా గురువారం నుంచి మూడో రోజుల పాటు నరకాసుర వధ రాష్ట్రవ్యాప్తంగా జరుగనుంది. అందులోభాగంగా రెండు రోజైన నేడు రాష్ట్రవ్యాప్తంగా నరకాసుర వధ జరుగుతుంది. -
రుణమాఫీపై కాలయాపన చేయడం దారుణం
నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి కోట: రైతుల రుణమాఫీ హామీ అమలుపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కాలయాపన చేయడం దారుణమని కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి అన్నారు. కోటమ్మ మహోత్సవాల్లో పాల్గొనేందుకు గురువారం కోటకు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబుకు నీతినిజాయితీల కంటే పదవే ముఖ్యమని ఆరోపించారు. అబద్ధపు వాగ్దానాలతో గద్దెనెక్కిన చంద్రబాబు స్పష్టత లేని నిర్ణయాలతో ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారన్నారు. ఎన్నికల హామీల్లో భాగంగా రైతులకు సంబంధించి అన్ని రుణాలను పూర్తిగా మాఫీ చేస్తామని ప్రకటించారన్నారు. ఆ హామీని నమ్మి ప్రజలు ఓట్లేశారన్నారు. గెలిచిన తర్వాత ప్రజలకు ముఖం చాటేస్తున్నారన్నారు. రుణమాఫీకి పరిమితులు రూపొందిస్తూ కమిటీలతో కాలయాపన చేస్తున్నారన్నాన్నారు. తీసుకున్న రుణం మాఫీ కాక కొత్తరుణం పొందలేక రైతులు ఒత్తిడికి గురవుతున్నారని తెలిపారు. మరో వైపు బ్యాంకర్లు రైతులకు నోటీసులు పంపుతున్నారన్నారు. మూడు రోజులుగా చంద్రబాబు వెల్లడిస్తున్న విషయాలు వివిధ పత్రికల్లో వస్తున్న వార్తలను చూసి రైతుల కన్నీరుమున్నీరవుతున్నారన్నారు. చిన్న రైతులెవరో, పెద్ద రైతులెవరో అర్థంగాక తలలు పట్టుకుంటున్నారన్నారు. తొమ్మిదేళ్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబు ప్రజలను తప్పుదోవ పట్టించడం దారుణమన్నారు. రైతురుణాలను ఆంక్షలు లేకుండా పూర్తిగా మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. డ్వాక్రా, చేనేత రుణాలనూ మాఫీ చేయాలన్నారు. నిరుద్యోగ భృతి రూ.రెండువేలు, వ్యవసాయానికి తొమ్మిది గంటల కరెంటు, ఇంటికో ఉద్యోగం కూడా ఇవ్వాలన్నారు. చంద్రబాబు చిత్తశుద్ధితో పరిపాలన కొనసాగిస్తే వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వానికి పూర్తిగా సహకరిస్తామని తెలిపారు. ప్రజావ్యతిరేక విధానాలను కొనసాగిస్తే ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తామన్నారు. రాష్ట్ర విభజన సమయంలో రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలన్నదే తెలుగు ప్రజల మనోగతమన్నారు. రాజధాని విషయంలో అన్ని ప్రాంతాల ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. ఉద్యోగుల కాలపరిమితిని 58 నుంచి 60 ఏళ్లకు పెంచిన బాబు, నిరుద్యోగుల విషయంలో నోరుమెదపకుండా ఉండడం శోచనీయమన్నారు. ప్రసన్నకుమార్రెడ్డి వెంట మండల కన్వీనర్ నల్లపరెడ్డి వినోద్కుమార్రెడ్డి, కోట సర్పంచ్ రాఘవయ్య, జగదీష్కుమార్రెడ్డి, నర్రమాల వెంకటరమణయ్య, పలువురు ఎంపీటీసీ సభ్యులు ఉన్నారు. -
ఏడాదిలోపే టీడీపీకి అధికారం గల్లంతు
నెల్లూరు : తెలుగుదేశం పార్టీ ఏడాదిలోపే అధికారం కోల్పోవడం ఖాయమని కోవూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అన్నారు. 2015 ఏప్రిల్ నుంచి జూన్ నెలాఖరులోపు టీడీపీ ప్రభుత్వం పతనం కాయమన్నారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో అమలుకు సాధ్యం కాని హామీలు ఇచ్చిన చంద్రబాబు నాయుడు అవి నెరవేర్చే అవకాశం లేదన్నారు. బాబుకు ఓట్లు ఎందుకు వేశామా... అని ప్రజలు ఇప్పటికే బాధపడుతున్నారన్నారు. చంద్రబాబు జిత్తులమారి నక్క అని ఎద్దేవా చేశారు. ఇచ్చిన హామీలను నెరవేర్చే ప్రసక్తే లేకపోవడంతో గ్రామాల్లోకి వచ్చే ఎమ్మెల్యేలపై ప్రజలు తిరుగుబాటు బావుటా ఎగురవేస్తారని నల్లపరెడ్డి వ్యాఖ్యానించారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో మధ్యంతర ఎన్నికలు వచ్చే అవకాశం ఉందన్నారు. మధ్యంతర ఎన్నికల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఘన విజయం సాధించి అధికారం చేపట్టడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. -
సీలింగ్ ఫ్యాన్ టీం రెఢీ
సాక్షి,నెల్లూరు: సీలింగ్ ఫ్యాన్ టీం రెడీ అయింది. ఇన్నాళ్లు పార్టీ కోసం పనిచేసిన సమన్వయకర్తలనే పార్లమెంట్, శాసనసభ అభ్యర్థులుగా వైఎస్సార్సీపీ ఎన్నికల బరిలో నిలిపింది. ఈ మేరకు అధిష్టానం సోమవారం జాబితాను వెల్లడించింది. విశ్వసనీయతకు, నమ్మకానికి పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పెద్దపీట వేశారు. తనను నమ్ముకున్న వారికి, పార్టీ అభివృద్ధికి కృషి చేసిన వారికి టికెట్లు ఇచ్చి విశ్వాసాన్ని చాటారు. తొలి నుంచి పార్టీ కోసం అంకితభావంతో పనిచేసిన వారికి టికెట్లు దక్కాయి. నెల్లూరు సిటీ నుంచి యువకుడైన డాక్టర్ పి.అనిల్కుమార్ యాదవ్కు, నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి కోటంరెడ్డి శ్రీధర్రెడ్డికి టికెట్ లభించింది. ఇక జిల్లాలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు కోవూరు నుంచి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి, ఉదయగిరి నుంచి మేకపాటి చంద్రశేఖరరెడ్డినే తిరిగి ఖరారు చేశారు. సర్వేపల్లి నుంచి వైఎస్సార్సీపీ సీఈసీ సభ్యుడు కాకాణి గోవర్ధన్రెడ్డి, ఆత్మకూరు నుంచి మేకపాటి గౌతమ్రెడ్డి ఎన్నికల బరిలో దిగనున్నారు. సూళ్లూరుపేట, గూడూరు నుంచి కిలివేటి సంజీవయ్య, పాశం సునీల్కుమార్ను ఎంపిక చేశారు. కావలి నుంచి రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి, వెంకటగిరి అభ్యర్థిగా కొమ్మి లక్ష్మయ్యనాయుడును ఎంపిక చేశారు. ఇక నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గం అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి పేరును ఖరారు చేశారు. తిరుపతి పార్లమెంట్ అభ్యర్థిగా వరప్రసాద్కు టికెట్ లభించింది. వైఎస్సార్సీపీ అభ్యర్థుల నామినేషన్లు నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా మేకపాటి రాజమోహన్రెడ్డి ఈ నెల 17న కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ వేయనున్నారు. తిరుపతి ఎంపీ అభ్యర్థి వరప్రసాద్ ఈ నెల 16న జెడ్పీలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ వైఎస్సార్సీపీ అభ్యర్థి కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి ఈ నెల 16న నెల్లూరు ఆర్డీఓ కార్యాలయంలో నామినేషన్ వేయనున్నారు. సర్వేపల్లి అభ్యర్థి కాకాణి గోవర్ధన్రెడ్డి ఈ నెల 16న వెంకటాచలం తహశీల్దార్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. కోవూరు అభ్యర్థిగా నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి ఈ నెల 15న కోవూరు తహశీల్దార్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఆత్మకూరు అభ్యర్థి మేకపాటి గౌతమ్రెడ్డి ఈ నెల 16న ఆత్మకూరు ఆర్డీఓ కార్యాలయంలో నామినేషన్ వేయనున్నారు. ఉదయగిరి అభ్యర్థిగా మేకపాటి చంద్రశేఖరరెడ్డి ఈ నెల 17న ఉదయగిరి తహశీల్దార్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. గూడూరు అభ్యర్థిగా పాశం సునీల్కుమార్ ఈ నెల 17న గూడూరు ఆర్డీఓ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. సూళ్లూరుపేట అభ్యర్థిగా కిలివేటి సంజీవయ్య ఈ నెల 16న తహశీల్దార్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. వెంకటగిరి అభ్యర్థిగా కొమ్మి లక్ష్మయ్యనాయుడు ఈ నెల 16న వెంకటగిరి తహశీల్దార్ కార్యాలయంలో నామినేషన్ వేయనున్నారు. కావలి అభ్యర్థిగా రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి ఈ నెల 16న కావలి ఆర్డీఓ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేయ నున్నారు. -
వైఎస్సార్ గుండె చప్పుడే మేనిఫెస్టో
కోవూరు, న్యూస్లైన్: మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి గుండె చప్పుడే వైఎస్సార్సీపీ ప్రకటించిన మేనిఫెస్టో అని కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి అన్నారు. కోవూరులోని అన్ని ఆలయాలు, చర్చిలు, మసీదుల్లో సోమవారం ఆయన ప్రత్యేక పూజలు, ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుతం ప్రజలు రేషన్కార్డులు, ఆరోగ్యశ్రీ, ఆధార్కార్డులు, పింఛన్ల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారన్నారు. ఇలాంటి సమస్యలను 24 గంటల్లో పరిష్కరించేలా తమ నేత జగన్మోహన్రెడ్డి ప్రణాళిక రూపొందించారన్నారు. అందుకోసం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి గ్రామంలో ప్రత్యేక కార్యాలయం ఏర్పాటు చేస్తారని చెప్పారు. దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయాల్లో దూపదీప నైవేద్యాలకు ప్రతి నెలా ప్రస్తుతం ఇస్తున్న రూ.2,500ను రూ.5 వేలకు పెంచుతామన్నారు. అర్చకులకు ఆరోగ్యశ్రీ వర్తింపజేయడంతో పాటు ఇల్లు, భూములు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. నిరుద్యోగులైన మైనార్టీ యువతకు స్వయం ఉపాధి కల్పిం చేందుకు రూ.5 లక్షలు వరకు వడ్డీ లేని రుణం మంజూరు చేస్తామన్నారు. మహిళలకు సంబంధించిన కేసులను త్వరితగతిన విచారించి, బాధితులకు సత్వర న్యాయం చేసేందుకు చర్యలు చేపడతామన్నారు. ఎల్కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందించేందుకు ప్రణాళిక సిద్ధమైందన్నారు. ప్రతి విద్యార్థి ఉన్నత చదువులు చదవాలనే లక్ష్యంతో ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేస్తామన్నారు. దళిత క్రైస్తవులందరినీ ఎస్సీలుగా గుర్తిస్తామన్నారు. మద్యం పంచేది లేదు ఎన్నికల్లో తాము ఎట్టి పరిస్థితుల్లో మద్యం పంపిణీ చేయబోమని ప్రసన్నకుమార్రెడ్డి స్పష్టం చేశారు. మహిళలందరూ సమష్టిగా మద్యంపై పోరాడాలని పిలుపునిచ్చారు. మద్యం పంచేందుకు గ్రామాలకు వచ్చే నాయకులను తరిమికొట్టాలని సూచించారు. కోవూరులో పోటీ చేయనున్న టీడీపీ అభ్యర్థి భారీ ఎత్తున మద్యం పంపిణీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారన్నారు. కొడవలూరు, బుచ్చిరెడ్డిపాళెం, కోవూరు మండలాల్లో ఆయన అనుచరులకే బ్రాందీషాపులు ఉన్నాయని, మద్యం కోసం ఆయా దుకాణాల్లో ఇప్పటికే రూ.2 కోట్లు డిపాజిట్ చేశారని చెప్పారు. ఆ నేత అనుచరుడు ఇటీవల కొడవలూరు మండలంలో మద్యం పంపిణీ చేస్తూ ఎక్సైజ్ అధికారులకు పట్టుబడ్డారన్నారు. వారిపై ఎన్నికల అధికారులు విచారణ జరిపి, సంబంధిత దుకాణాలపై చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ ములుమూడి వినోద్కుమార్రెడ్డి, పచ్చిపాల రాధాకృష్ణయ్య, నిరంజన్బాబురెడ్డి, తాటిపర్తి విజయ, రామిరెడ్డి మల్లికార్జునరెడ్డి, మోడెం శ్రీనివాసులురెడ్డి, సీతారామిరెడ్డి, సర్పంచ్ కూట్ల ఉమ, గడ్డం రమణమ్మ, ఇంతా మల్లారెడ్డి, దినేష్రెడ్డి, కృపావతి, జ్యోత్స్న, మంచి శ్రీనివాసులు, పుచ్చలపల్లి శ్రీనివాసులు, సుధీర్రెడ్డి మారంరెడ్డి వంశీ, నందు, నలుబోలు సుబ్బారెడ్డి, తిరుపతిరెడ్డి, జనార్దన్రెడ్డి, మల్లికార్జున్, హరిప్రసాద్రెడ్డి పాల్గొన్నారు. -
అభినవ రావణాసురుడు చంద్రబాబు
లంకను రావణాసురుడు నాశనం చేసిన విధంగా టీడీపీ అధినేత చంద్రబాబు తన దుష్ట ఆలోచనలతో రాష్ట్రాన్ని నాశనం చేశాడని కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి అన్నారు. గురువారం కోట లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బాబు లేఖ ఇస్తేనే సోనియాగాంధీ నిరంకుశంగా రాష్ట్రాన్ని విభజించారన్నారు. విభజన పాపం కాంగ్రెస్, టీడీపీ, బీజేపీదేనన్నారు. తెలుగుజాతిని విడగొట్టి బాబు, కిరణ్ చరిత్ర హీనులుగా మిగిలారన్నారు. ప్రజలంతా రోడ్డుమీదకు చేరి ఉద్యమం హోరెత్తుతున్న సమయంలోను ‘జైసమైక్యాంధ్ర’ అని ఒక్కసారి కూడా అనని బాబు ఏ ముఖం పెట్టుకుని తెలుగు ప్రజలను ఓట్లడుగుతారని ప్రశ్నించారు. ఈ రోజు టీడీపీ తోడుదొంగల పార్టీగా మారిందన్నారు. కాంగ్రెస్ నాయకులకు పిలిచి పార్టీలో చేర్చుకుంటున్న బాబును ప్రజలు ఎలా విశ్వసిస్తారన్నారు. తొమ్మిదేళ్ల రాక్షసపాలనలో ప్రజలను ముప్పుతిప్పలు పెట్టిన బాబు ఈనాడు రాష్ట్రాన్ని విభజించి సింగపూర్ చేస్తానంటూ వాగ్దానాలు చేస్తున్నాడన్నారు. ఎన్ని పిట్ట కథలు చెప్పినా ప్రజలు బాబును నమ్మరన్నారు. బీజేపీతో చెలిమికి ప్రయత్నిస్తున్న టీడీపీని ఆ పార్టీ నాయకులను ప్రజలు తరిమితరిమి కొట్టి బంగాళాఖాతంలో కలిపేసే రోజు వస్తుందన్నారు. ప్రజలు అమాయకులు కాదని తమ ప్రతాపాన్ని రానున్న ఎన్నికల్లో చూపిస్తారన్నారు. ఒక్క వైఎస్సార్సీపీ మాత్రమే చివరి వరకు సమైక్యవాదానికి కట్టుబడి పోరాడిందన్నారు. సీమాంధ్రకు కాబోయే తొలి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అని అన్నారు. సీమాంధ్ర అభివృద్ధి జగన్మోహన్రెడ్డికే సాధ్యమని చెప్పారు. తెలంగాణలోనూ వైఎస్సార్సీపీ మెరుగైన స్థానాలు సాధిస్తుందన్నారు. కోట, వాకాడు, చిట్టమూరు మండలాల్లో ఇతర పార్టీల నుంచి వైఎస్సార్సీపీలోకి వలసలు పెరిగాయన్నారు. అందరితో మాట్లాడి పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. పార్టీలో ప్రతి కార్యకర్తకు తగిన ప్రాధాన్యం ఉంటుందన్నారు. ఈ సమావేశంలో తిన్నెలపూడి సొసైటీ అధ్యక్షుడు నల్లపరెడ్డి రవీంద్రనాథ్రెడ్డి, పార్టీ మండల కన్వీనర్ వినోద్కుమార్రెడ్డి, కోట సర్పంచ్ రాఘవయ్య, జగదీష్కుమార్రెడ్డి పాల్గొన్నారు. -
రూ.3.31 కోట్లతో గిరిజన కాలనీల అభివృద్ధి
బుచ్చిరెడ్డిపాళెం, న్యూస్లైన్: కోవూరు నియోజకవర్గంలోని బుచ్చిరెడ్డిపాళెం, కొడవలూరు, విడవలూరు మండలాల్లోని గిరిజనకాలనీల్లో రూ.3.31 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. బుచ్చిరెడ్డిపాళెం మండలం కాగులపాడు గిరిజనకాలనీకి రూ.83లక్షలు, జొన్నవాడ గిరిజన కాలనీకి రూ.44లక్షలు, ఇస్కపాళెం పంచాయతీ వడ్డిపాళెం గిరిజన కాలనీకి రూ.46లక్షలు మంజూరైనట్లు చెప్పారు. కొడవలూరు మండలం యల్లాయపాళెం తేళ్లమిట్ట గిరిజనకాలనీకి రూ.51.44 లక్షలు విడుదలైనట్లు తెలిపారు. విడవలూరు మండలం బుసగాడిపాళెం గిరిజనకాలనీకి రూ.1.5 కోట్లు మంజూరైనట్లు వివరించారు. ఈ నిధులతో గృహనిర్మాణ శాఖ ఆధ్వర్యంలో సిమెంట్రోడ్లు, డ్రెయినేజీలు నిర్మించనున్నట్లు తెలిపారు. వీటికి సంబంధించిన టెండర్ల ప్రక్రియ పూర్తయిందన్నారు. త్వరలో పనులు ప్రారంభించనున్నట్లు చెప్పారు. అలాగే కోవూరు, ఇందుకూరుపేట మండలాల్లోని గిరిజన కాలనీలకు సంబంధించిన ప్రతిపాదనలు పంపామని, త్వరలో ఆయా మండలాలకు సంబంధించిన నిధులు మంజూరవుతాయని తెలిపారు. అభివృద్ధి పనులకు నిధులు విడుదల చేసిన గృహనిర్మాణ శాఖ అధికారులకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. -
మహిళాసాధికారిత వైఎస్సార్ చలువే: ప్రసన్నకుమార్రెడ్డి
కొడవలూరు, న్యూస్లైన్: దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి చలువతోనే మహిళా సాధికారిత జరిగిందని కోవూరు ఎమ్మెలే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి అన్నారు. మండలంలోని బసవాయపాళెం, రామాపురం పంచాయతీల్లో సోమవారం ఆయన పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబుకు ఎన్నికల సమయంలోనే మహిళలు గుర్తొస్తారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు తన తొమ్మిదేళ్ల పాలనలో మహిళలను ఇబ్బందులు, అవమానాలకు గురిచేశారన్నారు. బహిరంగ సభలకు మహిళలు రాకుంటే, బస్సులు పెట్టి డ్వాక్రా మహిళలను తరలించింది నిజం కాదా అని ప్రశ్నించారు. అయితే మహిళలు తీసుకున్న రుణాలపై కనీసం వడ్డీని మాఫీ చేయలేదన్నారు. మహిళలకు 33 శాతం అసెంబ్లీలో సీట్లు కేటాయించాలని తీర్మానం చేసిన చంద్రబాబు, పార్లమెంట్ ఆమోదానికి వేచిచూడకుండా మహిళలకు సీట్లు ఎందుకు ఇవ్వలేదని ఆయన ప్రశ్నించారు. ఎన్డీఏ ప్రభుత్వంలో గ్యాస్ ధరలు పెరిగినప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా రూపాయి సబ్సిడీ ఇచ్చిన దాఖలాలు లేవన్నారు. 1994 వరకు మహిళలు సాధించిన మద్యపాన నిషేధాన్ని సీఎంగా బాధ్యలు చేపట్టిన తరువాత ఎత్తివేసిన చరిత్ర నీది కాదా అని బాబును ప్రశ్నించారు. మహిళల అభివృద్ధికి నాడు ఎన్టీఆర్ కృషి చేస్తే మరణించేవరకు మహిళల కోసం సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారన్నారు. 1994 నుంచి 2004 వరకు మద్యపాన నిషేధాన్ని ఎత్తివేసి ప్రజల జీవితాలతో చెలగాటమాడిన చంద్రబాబు, నేడు బూటకపు మాటలు చెప్పి ప్రజలను మభ్యపెట్టడమేనన్నారు. తాను సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే మద్యపాన నిషేధంపై తొలిసంతకం చేస్తానని బాబు చెప్పడం హాస్యాస్పదమన్నారు. గ్రామాల్లో టీ దుకాణాల్లో బెల్టుదుకాణాలు పెట్టి ప్రజలను మత్తులో మునిగేలా చేసిన చ రిత్ర చంద్రబాబుదని తెలిపారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం అయిన వెంటనే మహిళాసాధికారితకు 20 వేల డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తారని ప్రకటించారన్నారు. అదే విధంగా ఏడాదికి 12 సిలిండర్లతో పాటు 100 సబ్సిడీ ఇవ్వనున్నామన్నారు. తెలంగాణ విభజనకు సూత్రధారి అయిన చంద్రబాబుకు సీమాంధ్రలో బుద్ధి చెబుతారని తెలిసి, అధికారంలోకి రావాలన్న తపనతో ప్రగల్భాలు పలుకుతున్నారన్నారు. ప్రజలు అంతా గమనిస్తున్నారని, రానున్న ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతారన్నారు. ఈ కార్యక్రమంలో కోవూరు వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ మాజీ చైర్మన్ దొడ్డంరెడ్డి నిరంజన్బాబు రెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యులు వీరి చలపతిరావు, నల్లావుల శ్రీనివాసులు, కొడవలూరు, ఇందుకూరుపేట, కోవూరు, విడవలూరు మం డల కన్వీనర్లు గంధం వెంకట శేషయ్య, మావులూరు శ్రీనివాసులు రెడ్డి, ములుమూడి వినోద్కుమార్రెడ్డి, బెజవాడ గోవర్ధన్రెడ్డి, నాయకులు వీరి సంపత్, కోడూరు విజయ్కుమార్రెడ్డి, ఎండీ కరీముల్లా పాల్గొన్నారు. -
'తెలుగు జాతి సమైక్యంగానే ఉండాలి'
-
'అన్న పేరు ఎత్తే అర్హత చంద్రబాబుకు లేదు'
నెల్లూరు: అవినీతిపరుడైన చంద్రబాబు నాయుడుకు అన్నా ఎన్టీఆర్ పేరు ఎత్తే అర్హత లేదని ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అన్నారు. ఆయన మంగళవారమిక్కడ మాట్లాడుతూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే ఇందుకూరుపేటను ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు.... అవకాశ రాజకీయాల కోసం ఎన్టీఆర్ పేరును ఉపయోగించుకుంటున్నారని నల్లపరెడ్డి మండిపడ్డారు. -
రూ.18.43 కోట్లతో రోడ్ల అభివృద్ధి
బుచ్చిరెడ్డిపాళెం, న్యూస్లైన్: కోవూరు నియోజకవర్గంలోని వివిధ రోడ్ల అభివృద్ధికి రూరల్ డెవలప్మెంట్ ఫండ్ కింద రూ.18.43 కోట్ల నిధులు మంజూరయ్యాయని ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఆదివారం తెలిపారు. కోవూరు ఇనమడుగు సెంటర్ నుంచి ముదివర్తి వరకు (1/0 నుంచి 16/0 వరకు) రూ.13.35 కోట్లతో రోడ్డు వెడల్పుతో పాటు తారురోడ్డు నిర్మాణం జరగనుందన్నారు. నెల్లూరు మైపాడు రోడ్డు నుంచి కుడితిపాళెం వరకు (కి.మీ. 16/0 నుంచి 27/4 వరకు), ఇందుకూరుపేట లూప్ రోడ్డు నుంచి పోట్లపూడి వరకు (కి.మీ 0/0 నుంచి 3/0 వరకు) రెండు రోడ్ల అభివృద్ధికి రూ.1.90 లక్షల నిధులు మంజూరయ్యాయన్నారు. బుచ్చిరెడ్డిపాళెం నుంచి దగదర్తి వరకు (కి.మీ 13/5 నుంచి 21/0 వరకు) రోడ్ల అభివృద్ధికి రూ.1.83 లక్షల నిధులు కేటాయించారన్నారు. ఎంసీ రోడ్డు నుంచి ఎంసీ రోడ్డు వరకు వయా గండవరం, పెద్దపుత్తేడు, చవటపుత్తేడు, ఊచగుంటపాళెం వరకు ( కి.మీ. 7/4 నుంచి 16/4 వరకు) రూ.1.35 లక్షలు నిధులు మంజూరైనట్లు ఎమ్మెల్యే ప్రసన్న తెలిపారు. రోడ్ల మంజూరుకు సహకరించిన సీఎం కిరణ్కుమార్ రెడ్డి, ఆర్థిక శాఖామంత్రి ఆనం రామనారాయణరెడ్డికి ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. -
త్వరలో వైఎస్సార్ స్వర్ణయుగం
కోవూరు, న్యూస్లైన్: రాష్ట్రంలోని రాక్షస పాలనకు త్వరలోనే తెరపడి, వైఎస్సార్ స్వర్ణయుగం ప్రజల ముందుకు వస్తుందని కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి అన్నారు. పడుగుపాడులోని వైఎస్సార్సీపీ నేత రామిరెడ్డి మల్లికార్జున్రెడ్డి నివాసంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ ఘనవిజయం సాధించి వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం కావడం ఖాయమన్నారు. ఆయన తెచ్చే స్వర్ణయుగంలో వృద్ధులు, వితంతవులకు రూ.700, వికలాంగులకు రూ.వెయ్యి వంతున పింఛన్ అందుతుందన్నారు. మహిళలు, రైతులు, చేనేత కార్మికులకు వడ్డీ లేని రుణాలు అందజేస్తారన్నారు. ఏటా 10 లక్షల ఇళ్లు కట్టించి పేదలందరి సొంతింటి కల నెరవేరుస్తారన్నారు. ఆరోగ్యశ్రీ పరిధినిపెంచి పేదల ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా ముందుకెళతామన్నారు. అమ్మఒడి పథకం ద్వారా ఎల్కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య లభిస్తుందన్నారు. పిల్లలు చదివే తరగతిని బట్టి వారి తల్లుల బ్యాంకు అకౌంట్లో నగదు జమ చేస్తారన్నారు. పంటలకు గిట్టుబాటు ధర కల్పించేందుకు రూ.3 వేల కోట్లతో ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తారన్నారు. ప్రస్తుతం తాను ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉండటంతో నియోజకవర్గాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయలేకపోతున్నానన్నారు. గతంలో తాను టీడీపీ ఎమ్మెల్యే వ్యవహరించిన సమయంలో ఆ పార్టీ అధికారంలో ఉండటంతో ఏ స్థాయి అభివృద్ధి పనులు చేశానో ప్రజలందరికీ తెలుసన్నారు. ఇవేమి తెలియని కొందరు మాట్లాడుతున్న మాటలను ఎవరూ పట్టించుకోవద్దని సూచించారు. ఎమ్మెల్యే వెంట పార్టీ మండల కన్వీనర్ ములుమూడి వినోద్కుమార్రెడ్డి, రామిరెడ్డి మల్లికార్జునరెడ్డి, పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి, నిరంజన్బాబురెడ్డి, సుబ్బారెడ్డి, నరసింహులురెడ్డి, సుధీర్రెడ్డి, కోటపూరి రమణయ్య, ఆదిశేషయ్య, అట్లూరు సుబ్రమణ్యం, యానాదయ్య, గడ్డం రమణమ్మ, కాటంరెడ్డి దినేష్రెడ్డి, సామేల్, అన్ను తదితరులు ఉన్నారు. సమస్యలు పరిష్కరించాలని వినతి కొన్నేళ్లుగా తాము ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని పోతిరెడ్డిపాళెం వాసులు కోరారు. సాలుచింతల సెంటర్లో గాజుల మల్లికార్జున నివాసంలో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే ప్రసన్నకుమార్రెడ్డికి వారు తమ సమస్యలు వివరించారు. మరుగుదొడ్లు నిర్మించుకుని చాలా కాలమైనా, బిల్లులు మంజూరు చేయలేదన్నారు. తాగునీటి కోసం నిత్యం కష్టాలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని వారు కోరారు. ఈ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని ఎమ్మెల్యే వారికి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సుబ్బారెడ్డి, రవీంద్రరెడ్డి, తిరుపతిరెడ్డి, సుధాకర్రెడ్డి, సీహెచ్ శ్రీనివాసులురెడ్డి, గాజుల మల్లికార్జున్, నాగరాజు,శ్రీనివాసులు, పన్నెం సుబ్రహ్మణ్యం, హరిప్రసాద్రెడ్డి, రాజ తదితరులు పాల్గొన్నారు. -
నెల్లూరులో నల్లపరెడ్డి మద్దతు దీక్ష