Nandita swetha
-
నా పక్కన రెండు దెయ్యాలు కూర్చున్నాయి.
-
‘ఓ మంచి ఘోస్ట్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
‘ఓ మంచి ఘోస్ట్’ వచ్చేస్తోంది
వెన్నెల కిషోర్, నందితా శ్వేత ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘ఓ మంచి ఘోస్ట్’. శంకర్ మార్తాండ్ దర్శకత్వం వహిస్తున్న ఈ కామెడీ హారర్ చిత్రాన్ని మార్క్సెట్ నెట్వర్క్స్ బ్యానర్పై డా.అబినికా ఇనాబతుని నిర్మిస్తున్నారు. షకలక శంకర్, నవమి గాయక్, నవీన్ నేని, రజత్ రాఘవ్, హాస్యనటుడు రఘుబాబు తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన గ్లింప్స్, టీజర్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ని ప్రకటిస్తూ కొత్త పోస్టర్ని విడుదల చేశారు మేకర్స్. జూన్ 21న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ‘ఎన్నో హిట్ చిత్రాలకు సంగీతాన్ని అందించిన అనూప్ రూబెన్స్ ‘ఓ మంచి ఘోస్ట్’కు మంచి ఆర్ఆర్, పాటలు ఇచ్చారు. ఈ చిత్రానికి అనూప్ మ్యూజిక్ ప్లస్ కానుంది. ప్రేక్షకులు నవ్వుతూనే భయపడతారు? అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే సినిమా ఇది’ అని చిత్రబృందం పేర్కొంది. -
ఓఎమ్జీ టీజర్: 'అరుంధతికి అక్కవైనా.. చంద్రముఖికి చెల్లివైనా..'
‘పూర్వ జన్మ జ్ఞానంతో మళ్లీ జన్మ ఎత్తే అవకాశం ఏ జీవికి కూడా ఉండదు.. దెయ్యాలకు మాత్రమే ఉంటుంది’ అనే డైలాగ్తో ‘ఓఎమ్జీ’ (ఓ మంచి ఘోస్ట్) చిత్రం టీజర్ ఆరంభమవుతుంది. ‘ఒసేయ్ నువ్వు అరుంధతికి అక్కవైనా.. చంద్రముఖి చెల్లివైనా.. కాశ్మోరా లవర్వైనా, కాంచన కజిన్వైనా..’ అంటూ వెన్నెల కిశోర్ చేసే కామెడీ, ‘నేను మోహిని పిశాచి మోహం తీర్చా.. కామిని పిశాచి కామం తీర్చా’ అంటూ షకలక శంకర్ చేసే కామెడీతో ఈ టీజర్ సాగుతుంది. ఘోస్ట్ క్యారెక్టర్లో నందితా శ్వేతా అందరినీ భయపెట్టేలా కనిపించారు. హారర్, కామెడీ ప్రధానాంశాలుగా రూపొందిన చిత్రం ‘ఓఎమ్జీ’. వెన్నెల కిశోర్, నందితా శ్వేత, షకలక శంకర్, నవమీ గాయక్, నవీన్ నేని, రజత్ రాఘవ్, రఘుబాబు కీలక పాత్రల్లో శంకర్ మార్తాండ్ దర్శకత్వం వహించారు. డా. అబినికా ఇనాబతుని నిర్మించారు. శనివారం ఈ చిత్రం టీజర్ని విడుదల చేశారు. ‘‘త్వరలో ‘ఓఎమ్జీ’ విడుదల తేదీని ప్రకటిస్తాం’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. -
మంచు లక్ష్మిని ఇలా చూసుండరు.. బిగ్బాస్ బ్యూటీ ఏకంగా అలా!
హోయలు పోతూ మృణాల్ ఠాకుర్ వయ్యారాలు చాలారోజుల తర్వాత క్యూట్గా 'కాంతార' భామ విచిత్రమైన గెటప్తో షాకిచ్చిన మంచు లక్ష్మి అందాలన్నీ చూపించేస్తున్న హాట్ బ్యూటీ రీతూ చౌదరి మత్తెక్కించేలా శ్రీలీల పోజులు.. చూస్తే ఆహా అనాల్సిందే బిగ్బాస్ స్రవంతి బ్లాస్టింగ్ పోజులు.. మైమరిచిపోతారంతే ఒంపుసొంపులతో రెచ్చిపోతున్న హీరోయిన్ శ్రద్ధా దాస్ వెకేషన్లో చిల్ అవుతున్న యంగ్ హీరోయిన్ ఇవానా View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) View this post on Instagram A post shared by Sapthami Gowda 🧿 (@sapthami_gowda) View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) View this post on Instagram A post shared by Alekhya Harika (@alekhyaharika_) View this post on Instagram A post shared by Rithu_chowdary (@rithu_chowdhary) View this post on Instagram A post shared by Sreeleela (@sreeleela14) View this post on Instagram A post shared by sravanthi_chokarapu (@sravanthi_chokarapu) View this post on Instagram A post shared by Shraddha Das (@shraddhadas43) View this post on Instagram A post shared by Siri Hanumanthu (@sirihanmanth) View this post on Instagram A post shared by Ivana (@i__ivana_) View this post on Instagram A post shared by Manushi Chhillar (@manushi_chhillar) View this post on Instagram A post shared by Amritha - Thendral (@amritha_aiyer) View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) View this post on Instagram A post shared by Nandita Swetha (@nanditaswethaa) -
Raghava Reddy Review: ‘రాఘవరెడ్డి’ మూవీ రివ్యూ
టైటిల్: రాఘవరెడ్డి నటీనటులు: శివ కంఠంనేని, రాశి, నందిత శ్వేత, అన్నపూర్ణ, రఘుబాబు, శ్రీనివాస్ రెడ్డి , అజయ్ , పోసాని కృష్ణమురళి, ప్రవీణ్ , అజయ్ ఘోష్, బిత్తిరి సత్తి తదితరులు నిర్మాణ సంస్థ: లైట్ హౌస్ సినీ మ్యాజిక్ నిర్మాతలు: కేఎస్ శంకర్ రావ్, జీ.రాంబాబు యాదవ్, ఆర్.వెంకటేశ్వర్ రావు స్టోరీ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : సంజీవ్ మేగోటి సంగీతం: సంజీవ్ మేగోటి - సుధాకర్ మారియో విడుదల తేది: జనవరి 5, 2024 కథేంటంటే.. రాఘవ రెడ్డి(శివ కంటంనేని) ఓ క్రిమినాలాజీ ప్రొఫెసర్. డిగ్రీ విద్యార్థులకు పాఠాలు చెప్పడం తో పాటు క్రిమినల్ కేసులు సాల్వ్ చేయడంలో పోలీసులకు సహాయం చేస్తుంటాడు. రాఘవ రెడ్డి పాఠాలు చెప్పే కాలేజీ లోకి మహాలక్ష్మి అలియాస్ లక్కీ ( నందిని శ్వేత) స్టూడెంట్ గా వస్తుంది. లక్కీ చాలా అల్లరి అమ్మాయి. తన యాటిట్యూడ్ తో రాఘవరెడ్డి తో గొడవ పడుతుంది. కాలేజీ లో అంతా రాఘవ రెడ్డికి భయపడతారు కానీ లక్కీ మాత్రం రౌడీ బేబీ లా ప్రవర్తిస్తూ ప్రొఫెసర్ ని లెక్కచేయదు. ఒక సందర్భంలో రాఘవ రెడ్డికి లక్కీకి పెద్ద గొడవ జరుగుతుంది. ఇదిలా ఉంటే...లక్కీ తల్లి దేవకీ(రాశి) ఒకసారి కాలేజీ కి వచ్చి వెళ్తుంటే...ఆమె వెనుక పరుగెత్తుతాడు రాఘవ. అసలు దేవకిని చూసి రాఘవ ఎందుకు పరుగెత్తాడు? వారిద్దరి మధ్య ఉన్న సంబంధం ఏంటి? లక్కీ నీ కిడ్నాప్ చేసిందెవరు? ఎందుకు చేశారు? క్రిమినల్ కేసులను సాల్వ్ చేసే రాఘవ్.. కిడ్నాపర్ల ను ఎలా కనిపెట్టాడు? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. హీరో తన డ్యూటీ కోసం ఫ్యామిలీని దూరం చేసుకోవడం..ఆపద వచ్చినప్పుడు మళ్లీ ఫ్యామిలీ కోసం పోరాటం చేసి రక్షించుకోవడం చాలా సినిమాల్లో చూశాం. రాఘవరెడ్డి కథ కూడా ఇదే పంథాలో సాగుతుంది. డాటర్ సెంటిమెంట్తో ప్యామిలీ ఎమోషనల్గా ఈ కథను తీర్చిదిద్దాడు దర్శకుడు. యూత్ను ఆకట్టుకోవడం కోసం కాలేజీ నేపథ్యాన్ని జోడించాడు. కథ పాతదే అయినా కాస్త కమర్శియల్ అంశాలను జోడించి కాస్త డిఫరెంట్గా సినిమాను తెరకెక్కించాడు. దర్శకుడు ఎంచుకున్న పాయింట్..దాని చుట్టు అల్లుకున్న సన్నివేశాలు బాగున్నప్పటికీ..తెరపై ఆకట్టుకునేలా తీయడంలో కాస్త తడబడ్డాడు. స్క్రీన్ప్లేని మరింత బలంగా రాసుకుంటే మెరుగైన ఫలితం ఉండేది. ఫస్టాఫ్లో హీరోకి కావాల్సినంత ఎలివేషన్ ఇచ్చాడు. ప్రారంభంలోనే హీరో పాత్ర ఎంత పవర్ఫుల్గా ఉండబోతుందో చూపించాడు. కాలేజీ ప్రొఫెసర్గా ఉంటూనే.. క్రిమినల్ కేసులను పరిష్కరించడం. దోషులను గుర్తించే విధానాన్ని విశ్లేషించడం అన్ని ఆకట్టుకుంటాయి. ఇక నందిని శ్వేత పాత్ర ఎంట్రీ తర్వాత కథనం ఫన్ వేలో సాగుతుంది. కాలేజీలో ఆమె చేసే అల్లరి, శ్రీనివాస్ రెడ్డి చేసే కామెడీ నవ్వులు పూయిస్తాయి. ఇంటర్వెల్ సీన్ సెకండాఫ్పై ఆసక్తిని పెంచుతుంది. ఇక ద్వితియార్థంలో కథను ఫ్యామిలీ ఎమోషన్స్ వైపు మలిచాడు. తన కూతురు ఎవరో తెలుసుకునేందుకు హీరో చేసే ప్రయత్నం.. ఈ క్రమంలో వచ్చే ప్లాష్బ్యాక్ ఎపిసోడ్ ఎమోషనల్గా కనెక్ట్ అవుతుంది. కొన్ని చోట్ల నాటకీయత ఎక్కువైనట్లు అనిపిస్తుంది. కిడ్నాపర్లను కనిపెట్టేందుకు హీరో చేసే ప్రయత్నం కూడా అంతగా ఆకట్టుకోదు. స్లో నెరేషన్.. సాగదీత సన్నివేశాలు ఎక్కువగా ఉండడం సినిమాకు మైనస్. క్లైమాక్స్ రొటీన్గా ఉంటుంది. ఎవరెలా చేశారంటే.. టైటిల్ పాత్ర పోషించిన శివ కంఠంనేని తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. యాక్షన్ సీన్లతో పాటు ఎమోషనల్ సన్నివేశాల్లో కూడా చక్కగా నటించాడు. డైలాగ్ డెలివరీ కూడా బాగుంది. లక్కీ పాత్రలో నందిని శ్వేత అదరగొట్టేసింది. ఇక చాలా రోజుల తర్వాత వెండితెరపై కనిపించిన రాశి.. దేవకి పాత్రకి పూర్తి న్యాయం చేసింది. బిత్తిరి సత్తి, శ్రినివాస్ రెడ్డిల కామెడీ సినిమాకు ప్లస్ అయింది. అజయ్ ఘోష్ విలనిజం పర్వాలేదు. అజయ్, ప్రవీణ్లతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతిక పరంగా సినిమా పర్వాలేదు. బీజీఎం, పాటలు ఓకే. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టు ఉన్నతంగా ఉన్నాయి. -
ఎమోషనల్ రాఘవ రెడ్డి
శివ కంఠమనేని హీరోగా, రాశీ, నందితా శ్వేత ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘రాఘవ రెడ్డి’. స్పేస్ విజన్ నరసింహా రెడ్డి సమర్పణలో సంజీవ్ మేగోటి దర్శకత్వంలో కేఎస్ శంకర్ రావ్, జి. రాంబాబు యాదవ్, ఆర్. వెంకటేశ్వర్ రావు నిర్మించిన ఈ చిత్రం జనవరి 5న విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నిర్మాత మండలి కార్యదర్శి ప్రసన్న కుమార్ మాట్లాడుతూ– ‘‘చిన్న సినిమాల వల్లే ఇండస్ట్రీ బతుకుతుంది. ఇండస్ట్రీని బతికించుకునేందుకు ‘రాఘవరెడ్డి’లాంటి సినిమాలను ప్రేక్షకులు విజయవంతం చేయాలి. ఈ సినిమాలో అన్ని రకాల ఎమోషన్స్ కనిపిస్తున్నాయి’’ అన్నారు. ‘‘ఇంట్రవెల్ అందరికీ నచ్చుతుంది. క్లైమాక్స్ సీన్స్ ఎమోషనల్గా టచ్ అవుతాయి. ఆడియన్స్ కంటతడి పెడతారు’’ అన్నారు శివ కంఠమనేని. ‘‘తొమ్మిదేళ్ల గ్యాప్ తర్వాత దర్శకుడిగా ‘రాఘవ రెడ్డి’ అనే ఓ మంచి సినిమా తీశాను’’ అన్నారు సంజీవ్. ‘‘ఈ సినిమాలో కూతురే ప్రపంచంగా బతికే దేవకి పాత్ర చేశాను’’ అన్నారు రాశీ. ‘‘ఈ సినిమాలో క్రిమినాలజీ ఫ్రొఫెసర్ రాఘవ రెడ్డిగా శివగారు నటించారు. యూత్కి కావల్సిన ఎలిమెంట్స్తో పాటు యాక్షన్, సోషల్ మెసేజ్ కూడా ఉన్నాయి’’ అన్నారు నిర్మాతలు. -
నవరసాల రాఘవ రెడ్డి
శివ కంఠమనేని హీరోగా, రాశి, నందితా శ్వేత ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘రాఘవ రెడ్డి’. సంజీవ్ మేగోటి దర్శకత్వం వహించారు. స్పేస్ విజన్ నరసింహా రెడ్డి సమర్పణలో లైట్ హౌస్ సినీ మ్యూజిక్ బ్యానర్పై కేఎస్ శంకర్ రావ్, జి. రాంబాబు యాదవ్, ఆర్. వెంకటేశ్వరరావు నిర్మించిన ఈ సినిమా జనవరి 4న విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్ను నటుడు, నిర్మాత మురళీ మోహన్ విడుదల చేశారు. సంజీవ్ మేగోటి మాట్లాడుతూ– ‘‘యాక్షన్, డ్రామా, థ్రిల్లర్ అంశాలతో ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ సినిమాను తెరకెక్కించాం’’ అన్నారు. ‘‘మధురపూడి గ్రామం అనే నేను’ చిత్రంలో నా పాత్ర రగ్డ్గా ఉంటుంది. ‘రాఘవ రెడ్డి’లో సిన్సియర్, స్ట్రిక్ట్ ప్రోఫెసర్గా నటించాను. చక్కటి విందు భోజనంలా నవరసాలున్న సినిమా ఇది’’ అన్నారు శివ కంఠమనేని. ‘‘మా బ్యానర్ నుంచి వస్తోన్న మూడో సినిమా ఇది. మా చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాలి’’ అన్నారు వెంకటేశ్వరరావు. ఈ ట్రైలర్ విడుదల వేడుకలో నటి అన్నపూర్ణ, దర్శకుడు నీలకంఠ, సంగీతదర్శకుడు సుధాకర్ మారియో, ఎడిటర్ ఆవుల వెంకటేశ్, వరా ముళ్లపూడి, నటుడు అజయ్ ఘోష్ మాట్లాడారు. ఈ చిత్రానికి సంగీతం: సంజీవ్ మేగోటి– సుధాకర్ మారియో, ఎగ్జిక్యూటివ్ప్రోడ్యూసర్: ఘంటా శ్రీనివాసరావు. -
స్టేజిపైనే బోరున ఏడ్చేసిన హీరోయిన్.. కారణమిదే!
అశ్విన్ బాబు, నందితా శ్వేత పోలీస్ పాత్రల్లో నటించిన లేటేస్ట్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ 'హిడింబ'. ఈ చిత్రానికి అనిల్ కన్నెగంటి దర్శకత్వంలో తెరకెక్కించారు. అనిల్ సుంకర ఏకే ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో ఎస్వీకే సినిమాస్పై గంగపట్నం శ్రీధర్ నిర్మించారు. అమ్మాయిల సీరియల్ కిడ్నాప్లకు సంబంధించిన కేసును ఛేదించే కథాంశంతో ఈ సినిమా రూపొందించారు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్ను సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా చిత్రబృందం సక్సెస్ మీట్ను ఏర్పాటు చేసింది. అయితే ఈ కార్యక్రమానికి హాజరైన హీరోయిన్ నందితా శ్వేత ఫుల్ ఎమోషనలయ్యారు. స్టేజ్పై మాట్లాడుతూ కన్నీటి పర్యంతమయ్యారు. (ఇది చదవండి: వేకేషన్కు మహేశ్ బాబు ఫ్యామిలీ.. ఎయిర్పోర్ట్లో సందడి!) నందితా శ్వేత మాట్లాడుతూ.. ' హిడింబ టైటిల్ చూడగానే అందరికీ కేవలం థ్రిల్లర్ మూవీ అనుకుని ఉంటారు. కానీ ఫ్యామిలీ కూడా వచ్చి చూస్తున్నారు. ఈ సినిమాలో అవకాశం వచ్చినప్పుడు సీరియస్ రోల్ నేను చేస్తానని అనుకోలేదు. దర్శకుడు అనిల్ నాపై ఎంతో నమ్మకం ఉంచి నాకు క్యారెక్టర్ ఇచ్చారు. అశ్విన్ - అనిల్ వల్లే నా పాత్రకు పూర్తిగా న్యాయం చేశా. వాళ్లు నన్ను ఎంతగానో సపోర్ట్ చేశారు.' అని అన్నారు. నందితా మాట్లాడుతూ..' ఈ మూవీ నాకు సెంటిమెంటల్గా ఎంతో కనెక్ట్ అయి ఉంది. ఎందుకంటే ఈ మూవీ చేసేటప్పుడు మా ఫాదర్ చనిపోయారు. ఈ మూవీ వల్లే నాకు పేరు వచ్చింది. ఆయన ఆశీస్సుల వల్ల నేను ఇక్కడ ఉన్నాఅంటూ తీవ్ర భావోద్వేగానికి గురైంది. ఎక్కడికిపోతావు చిన్నవాడా తర్వాత ‘హిడింబ’తోనే నాకు ఇంత గుర్తింపు వచ్చిందని' నందితా శ్వేత అన్నారు. (ఇది చదవండి:'హిడింబ' సినిమాకు రీ–సెన్సార్ చేశాం.. కారణం ఇదే' ) -
అశ్విన్ బాబు, అనిల్ సుంకర కాంబినేషన్లో వస్తున్న కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్
-
నాలుగేళ్లుగా ఆ వ్యాధితో బాధపడుతున్నా: హీరోయిన్
‘‘స్టార్డమ్ అనేది నా చేతుల్లో లేదు. నాకు వచ్చిన పాత్రలకు న్యాయం చేయడంపైనే దృష్టి పెట్టాను. వైవిధ్యమైన పాత్రలు చేశాను. ‘హిడింబ’తో నాకు స్టార్డమ్ ఖాయం అనే నమ్మకం ఉంది’’ అన్నారు నందితా శ్వేత. అశ్విన్బాబు హీరోగా అనిల్ కన్నెగంటి దర్శకత్వంలో అనిల్ సుంకర సమర్పణలో గంగపట్నం శ్రీధర్ నిర్మించిన చిత్రం ‘హిడింబ’. ఈ సినిమా ఈ నెల 20న విడుదల కానుంది. (ఇది చదవండి: రెండో భర్త మరణం.. 23 ఏళ్లకే జీవితం ముగిసిపోయింది: నటి) ఈ సందర్భంగా హీరోయిన్ నందితా శ్వేత మాట్లాడుతూ ‘‘హిడింబ’లో ఆద్యా అనే పోలీసాఫీసర్ పాత్రలో కనిపిస్తాను. నా పాత్ర హీరో పాత్రకు సమానంగా ఉంటుంది. ఇక దాదాపు నాలుగేళ్లుగా కండరాలకు సంబంధించిన ఫైబ్రోమాల్జియాతో ఇబ్బంది పడుతున్నాను. దీనివల్ల భారీగా కసరత్తులు, డైట్ చేయకూడదు. నిద్రలేమి ఉండకూడదు. కానీ ‘హిడింబ’ కోసం ఇవన్నీ జరిగాయి. ఆ విధంగా కొంత స్ట్రగుల్ అయ్యాను. నేను చేసిన ‘మంగళవారం’ , ఓ మంచి ఘోస్ట్’ చిత్రాలు రిలీజ్కు రెడీ అవుతున్నాయి. తెలుగులో ఒకటి, తమిళంలో మూడు సినిమాలు చేస్తున్నాను’’ అని అన్నారు. (ఇది చదవండి: అందుకే సినిమాలకు దూరమయ్యా..: తమ్ముడు హీరోయిన్) -
'హిడింబ' సినిమాకు రీ–సెన్సార్ చేశాం.. కారణం ఇదే'
అశ్విన్ బాబు, నందితా శ్వేత జంటగా అనిల్ కన్నెగంటి దర్శకత్వం వహించిన చిత్రం 'హిడింబ'. అనిల్ సుంకర ఏకే ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో ఎస్వీకే సినిమాస్పై గంగపట్నం శ్రీధర్ నిర్మించిన ఈ చిత్రాన్ని ఈ నెల 20న విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. 'ఇండియన్ సినిమాల్లో ఇంతకు ముందెన్నడూ చెప్పని కథ, ఇంతకు ముందు ఎవరూ టచ్ చేయని జానర్' అంటూ రిలీజ్ డేట్ పోస్టర్లో వేశారు మేకర్స్. (ఇదీ చదవండి: రజనీకాంత్, కమల్ హాసన్ వంటి స్టార్స్తో నటించిన హీరోయిన్.. చివరకు ఎయిడ్స్తో!) 'యూనిక్ కథతో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని, థ్రిల్ని ఇచ్చేలా ‘హిడింబ’ని మలిచారు అనిల్ కన్నెగంటి. ఈ చిత్రంలో కొన్ని ఇంటెన్స్ యాక్షన్ సన్నివేశాలు అభ్యంతరకరంగా ఉన్నాయని సెన్సార్ వారు చెప్పారు. దీంతో రివ్యూ కమిటీ ద్వారా సినిమాని రీ–సెన్సార్ చేసి విడుదల చేస్తున్నాం' అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: వికాస్ బాదిసా, కెమెరా: బి. రాజశేఖర్. -
Nandita Swetha : అదిరిపోయే ఫోజులతో నందిత శ్వేత (ఫొటోలు)
-
‘హిడింబ’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
-
ఎక్కడికి వెళ్లిన అలానే పిలుస్తున్నారు అందుకే చాలా సినిమాలు రిజెక్ట్ చేశాను
-
నందిత శ్వేత అందాల హొయలు.. ఆరెంజ్ డ్రెస్లో అదరహో! (ఫోటోలు)
-
సింగిల్ క్యారెక్టర్తో సినిమా.. రారా పెనిమిటి అంటున్న నందిత శ్వేత
భర్త రాక కోసం..భార్య పడే విరహ వేదన నేపథ్యంలో సింగిల్ క్యారక్టర్తో రూపొందిన చిత్రం `రారా పెనిమిటి`. శ్రీ విజయానంద్ పిక్చర్స్ బ్యానర్లో రూపొందిన ఈ చిత్రంలో ఉన్న ఏకైక పాత్రలో నందిత శ్వేత నటించగా సత్య వెంకట గెద్దాడ దర్శకత్వం వహించారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతాన్ని సమకూర్చగా ప్రమీల గెద్దాడ నిర్మాతగా వ్యవహరించింది. ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రసాద్ ల్యాబ్స్లో ప్రీ రిలీజ్ వేడుక ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సంగీత దర్శకుడు మణిశర్మ మాట్లాడుతూ...``దర్శకుడు ఒక మంచి కథతో వచ్చి కలిశారు. నేను ఇంత వరకు చేసిన కంపోజిషన్ లో నాకు ఇష్టమైన పాటలు ఇందులో ఉన్నాయి`` అన్నారు. హీరోయిన్ నందిత శ్వేత మాట్లాడుతూ...``డైరెక్టర్ కథ చెప్పి...సింగిల్ క్యారక్టర్ అనగానే ... ఈ పాత్ర చేయగలనా అని మొదట భయపడ్డాను. సాహసమే అయినా ఓకే చెప్పాను. ఇలాంటి పాత్ర చేసే అవకాశం వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. నిజంగా ఈ సినిమా చేయడం నా అదృష్టం. శివశంకర్ మాస్టర్ గారు కొరియోగ్రఫీ అద్భుతంగా చేశారు. వారు ఇప్పుడు లేకపోవడం బాధాకరం`` అన్నారు. దర్శకుడు సత్య వెంకట గెద్దాడ మాట్లాడుతూ...``కొత్తగా పెళ్లైన అమ్మాయి..తన భర్త రాక కోసం ఎదరు చూస్తూ పడే విరహ వేదనే ఈ చిత్రం. తన భర్త వచ్చాడా? లేదా? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. గ్రామీణ నేపథ్యంలో నడిచే కథ కాబట్టి.. ఆ గడుసుతనం ఉన్న అమ్మాయి కావాలని... చాలా మందిని సెర్చ్ చేశాక నందిత గారైతే పర్ఫెక్ట్ అని తీసుకున్నాం. తను నేను అనుకున్న దానికన్నా అద్భుతంగా చేసింది. అష్ట లక్షణాలున్న పాత్రను చాలా అవలీలగా చేసింది. మణిశర్మ గారు ఈ సినిమాకు పని చేయడమే పెద్ద ఎస్సెట్ గా భావిస్తున్నాం. సింగిల్ క్యారక్టర్ అయినప్పటికీ హీరోయిన్ తో పలు పాత్రలు ఫోన్ లో సంభాషిస్తుంటాయి. ఆ పాత్రలకు బ్రహ్మానందం, తణికెళ్ల భరణి, సునీల్, సప్తగిరి, హేమ, అన్నపూర్ణమ్మ ఇలా పలువురు నటీనటులు డబ్బింగ్ చెప్పారు. వారందరికీ నా ధన్యవాదాలు. సినిమా అంతా పూర్తయింది. త్వరలో విడుదల చేస్తాం`` అన్నారు. -
‘జెట్టీ’తో నా కల నెరవేరింది
‘‘గ్రామీణ నేపథ్యంలోని సినిమాలో పల్లెటూరి అమ్మాయిగా నటించాలనేది నా కల. అది ‘జెట్టీ’తో నెరవేరింది. ఈ చిత్రం మంచి హిట్టవుతుంది’’ అన్నారు హీరోయిన్ నందితా శ్వేత. సుబ్రమణ్యం పిచ్చుక దర్శకత్వంలో నందితా శ్వేత, మన్యం కృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘జెట్టి’. వేణు మాధవ్ కె. నిర్మించిన ఈ సినిమా ఈ నెల 28న విడుదల కానుంది. ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. ‘‘మత్స్యకారుల జీవితాల్లోని సమస్యలను చెప్పే చిత్రమిది. పోర్టుల పేరుతో మత్య్సకారుల జీవితాలను ఎలా ఇబ్బందులు పెడుతున్నారు? అనేది ఆసక్తిగా ఉంటుంది’’ అన్నారు. ‘జెట్టి అంటే పోర్టు అని అర్థం. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా రిలీజవుతుంది’’ అన్నారు వేణు మాధవ్ .కె. మన్యం కృష్ణ, సంగీతదర్శకుడు కె. కార్తీక్ మాట్లాడారు. ఈ చిత్రానికి కెమెరా: వీరమణి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: పండ్రాజు శంకర్రావు. -
యాక్షన్తో అదరగొట్టిన అశ్విన్.. ఆసక్తిగా 'హిడింబ'
Ashwin Babu Nandita Swetha Hidimba First Glimpse Released: విభిన్నమైన సినిమాలతో అలరిస్తున్నాడు అశ్విన్ బాబు. జీనియస్, రాజుగారి గది 2, రాజుగారి గది 3 చిత్రాలలో నటించి మెప్పించాడు. ఇప్పుడు వాటన్నింటికి డిఫరెంట్గా అశ్విన్ బాబు నటించిన తాజా చిత్రం 'హిడింబ'. ఈ చిత్రానికి అనిల్ కన్నెగంటి దర్శకత్వం వహించారు. శ్రీ విఘ్నేష్ కార్తీక్ సినిమాస్ బ్యానర్లో గంగపట్నం శ్రీధర్ నిర్మించిన ఈ యాక్షన్ థ్రిల్లర్లో హీరోయిన్గా నందితా శ్వేత నటిస్తోంది. ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్ను ఆదివారం విడుదల చేసింది చిత్రబృందం. ఈ గ్లింప్స్ రిలీజైన కొన్ని గంటల్లోనే వైరల్ అయ్యాయి. 'పోలీసు ఆపరేషనా' అంటూ సీనియర్ నటుడు శుభలేఖ సుధాకర్ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసే డైలాగ్తో ప్రారంభమైన ఈ వీడియో ఆసక్తిగా ఉంది. ఓ బాలుడి చుట్టూ తిరిగే కథతో తెరకెక్కినట్లు సమాచారం. హీరో, విలన్ల మధ్య పోరాట సన్నివేశాలు అందరినీ ఆకట్టుకునేలా ఉన్నాయని, సినిమాటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్్ అద్భుతంగా ఉన్నాయని చిత్రబృందం తెలిపింది. ఈ మూవీతో అశ్విన్కు మరింత గుర్తింపు లభిస్తుందని పేర్కొంది. చదవండి: అదరగొట్టిన కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్.. టాలీవుడ్లో ఎన్టీఆర్, సమంత టాప్.. -
ఆ అవకాశాం వస్తే ఎందుకు చేయను?: నందితా శ్వేత
సాక్షి, మలికిపురం: గోదావరి తీరం చాలా ఆహ్లాదకరంగా ఉందని సినీ నటి నందితా శ్వేత అన్నారు. విజయానంద్ పిక్చర్స్ బ్యానర్పై జి.వెంకట సత్యప్రసాద్ దర్శకత్వంలో నటిస్తున్న ‘రారా.. నా పెనిమిటి’ చిత్రం షూటింగ్ నిమిత్తం ఆమె ప్రస్తుతం రాజోలు దీవిలో ఉన్నారు. గోదావరి లంకల్లో ఈ చిత్రం షూటింగ్ జరుగుతోంది. ఈ సందర్భంగా ఆదివారం ఆమె మలికిపురంలో ‘సాక్షి’తో ముచ్చటించారు. ► ‘రారా.. నా పెనిమిటి’ సినిమా మీకు ఎన్నో చిత్రం? నందితా శ్వేత: గతంలో నితిన్తో శ్రీనివాస కళ్యాణం, ‘అక్షర’తో పాటు నిఖిల్తో ఒక సినిమా చేశారు. ఇది నాలుగో సినిమా. ► తెలుగు సినీ పరిశ్రమలో మీకు లభిస్తున్న ఆదరణ ఏవిధంగా ఉంది? నందితా శ్వేత: నా చిత్రాలతో పాటు గత సినిమాలను కూడా పరిశీలిస్తే తెలుగు ప్రేక్షకుల అభిరుచి చాలా బాగుంటుంది. కథ, కథనంతో పాటు చక్కని సందేశాత్మక, వినోదాత్మక చిత్రాలను ఆదరిస్తారు. ► పెద్ద హీరోలతో అవకాశాలు రావట్లేదా? నందితా శ్వేత: ఇప్పడిపుడే ఇండస్ట్రీలో నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నా. అవకాశాలు వస్తే ఎందుకు చేయను? ► ఇంతకు ముందు ఎప్పుడైనా కోస్తా తీరానికి వచ్చారా? నందితా శ్వేత: లేదు. ఈ చిత్రం కోసమే వచ్చాను. ► ఇక్కడి వాతావరణం ఎలా ఉంది? నందితా శ్వేత: చాలా బాగుంది. ఉభయ గోదావరి జిల్లాల్లో షూటింగ్ చేశాం. చక్కటి వాతావరణం. గోదావరి నదీ పాయలు, కొబ్బరి తోటలు, పంట పొలాలూ చాలా ఆహ్లాదకరంగా ఉన్నాయి. ప్రధానంగా ఇక్కడి ప్రజల మర్యాద, వద్దన్నా వినకుండా మరీమరీ అడిగి వడ్డించి, తినిపించే ఆత్మీయత, వారి పలకరింపులు చాలా బాగున్నాయి. కోనసీమ వంటకాలు కూడా చాలా బాగున్నాయ్. ఉల్లిపాయలు, కోడిగుడ్డుతో చేసే ఆమ్లెట్ మరీ రుచిగా ఉంది. -
Jetty Movie: ఒక ఊరిలో జరిగిన కథ
నందితా శ్వేత, కృష్ణ , కన్నడ కిషోర్, మైమ్ గోపి, ఎమ్యస్ చౌదరి, శివాజీరాజా, జీవా, సుమన్ శెట్టి నటించిన చిత్రం ‘జెట్టి’. సుబ్రహ్మణ్యం పిచ్చుక దర్శకత్వంలో వేణుమాధవ్ నిర్మించిన ఈ చిత్రం టైటిల్ లోగోని లాంచ్ చేశారు. సుబ్రహ్మణ్యం పిచ్చుక మాట్లాడుతూ –‘‘కొన్ని వందల గ్రామాల్లోని వేల మత్స్యకార కుటుంబాల తరాల పోరాటం ఒక గోడ.. ఆ గోడ పేరే జెట్టి. అనాదిగా వస్తున్న ఆచారాలను నమ్ముకొని జీవనం సాగిస్తున్న మత్య్సకారులున్న ఒక ఊరిలో జరిగిన కథ ఇది. మత్స్యకారుల జీవన శైలి, వారి కట్టుబాట్లతో తెరకెక్కించాం. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో సినిమాని విడుదల చేస్తాం. మా చిత్రంలో సిద్ శ్రీరాం పాడిన పాట హైలెట్గా ఉంటుంది.. త్వరలోనే ఆ పాటను రిలీజ్ చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: కార్తిక్ కొండకండ్ల. -
'అక్షర' మూవీ రివ్యూ
టైటిల్ : అక్షర జానర్ : క్రైమ్ థ్రిల్లర్ నటీనటులు : నందిత శ్వేత, శకలక శంకర్, అజయ్ ఘోష్, మధునందన్, సత్య, హర్షవర్థన్ తదితరులు నిర్మాణ సంస్థ : సినిమా హాల్ ఎంటర్టైన్మెంట్ నిర్మాత : అల్లూరి సురేశ్ వర్మ, అహితేజ బెల్లంకొండ దర్శకత్వం : బి. చిన్నికృష్ణ సంగీతం : సురేశ్ బొబ్బిలి సినిమాటోగ్రఫీ : నరేశ్ బానెల్లి విడుదల తేది : ఫిబ్రవరి 26, 2021 హీరోయిన్ నందిత శ్వేత ప్రధాన పాత్ర పోషించిన చిత్రం 'అక్షర'. విద్యావ్యవస్థలోని లోపాల్ని చర్చిస్తూ సందేశాత్మక ఇతివృత్తంతో ఈ సినిమాను తెరకెక్కించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై ఆసక్తి పెంచాయి. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గ్రాండ్గా చేయడంతో ఈ సినిమాపై హైప్ క్రియేట్ అయింది. ఎన్నో అంచనాల మధ్య ఫిబ్రవరి 26న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘అక్షర’ ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో రివ్యూలో చూద్దాం. కథ విద్యా విధాన్ అనే ప్రైవేట్ విద్యా సంస్థలో అక్షర (నందిత శ్వేత) ఫిజిక్స్ లెక్చరర్. అదే కాలేజీకి బోర్డ్ డైరెక్టర్గా ఉన్న శ్రీతేజ్ (శ్రీతేజ్) తొలి చూపులోనే అక్షరతో ప్రేమలో పడిపోతాడు. ఇదిలా ఉంటే అక్షర నివాసం ఉండే కాలనీకి చెందిన వాల్తేర్ బాయ్స్ మధు నందన్, సత్య, శంకర్లు ఒకరి తెలియకుండా ఒకరు ఆమెను ప్రేమిస్తుంటారు. ఆమె ఇష్టాయిష్టాలను తెలుసుకొని వాటిని ఫాలో అవుతూ అక్షరను ఇంప్రెస్ చేసే పనిలో ఉంటారు. అక్షరకు మాత్రం ఈ విషయం తెలియదు. కాలేజీకి వెళ్లడం.. టీచింగ్ అయిపోగానే లైబ్రరీలో గడపడం ఆమె దినచర్య. అలాగే విద్యావ్యవస్థపై పోరాటం చేస్తుంది. ఈ క్రమంలో శ్రీతేజ్కు ఆమె దగ్గరవుతుంది. ఒక రోజు శ్రీతేజ్ తన మనసులో మాటను చెప్పేందుకు అక్షరను ఒక చోటుకు తీసుకెళ్లాడు. తన ప్రేమ విషయాన్ని తెలియజేసేలోపు అక్షర సడెన్గా బ్యాగులో నుంచి తుపాకి తీసి శ్రీతేజ్ను కాల్చేస్తుంది. అంతే కాకుండా ఈ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసు ఆఫీసర్ను కూడా అక్షర చంపేస్తుంది. అసలు శ్రీతేజ్ని అక్షర ఎందుకు చంపేసింది? అసలు అక్షర ఫ్లాష్బ్యాక్ ఏంటి? విద్యా విధాన్ ప్రైవేట్ సంస్థల యజమాని సంజయ్ స్వరూప్ అంటే అక్షరకు ఎందుకు కోపం? షకలక శంకర్, మధునందన్, సత్య, అజయ్ ఘోష్ పాత్రలు ఏమిటి అన్నదే మిగతా కథ. నటీనటులు ఈ సినిమాకు ప్రధాన బలం నందిత శ్వేత పాత్రే. అక్షర అనే లెక్చరర్ పాత్రలో ఆమె ఒదిగిపోయారు. కొన్ని ఎమోషనల్ సీన్లను కూడా బాగా పండించారు. ఇక విద్యా విధాన్ విద్యా సంస్థల అధినేతగా సంజయ్ స్వరూప్ తన పరిధి మేరకు నటించారు. ఫ్లాష్బ్యాక్లో వచ్చే హర్షవర్థన్ పాత్ర సినిమాను మరో స్థాయికి తీసుకెళ్తుంది. ప్రభుత్వ పాఠశాల టీచర్గా ఆయన చక్కగా నటించాడు. అలాగే శకలక శంకర్, సత్య, మధునందన్ తమ పరిధిమేరకు ఆకట్టుకున్నారు. విశ్లేషణ : ప్రైవేట్ విద్యా సంస్థల ఒత్తిడి కారణంగా విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులకు గురవుతున్నారు? ర్యాంకులు, మార్కుల కోసం కార్పొరేట్ విద్యా సంస్థలు విద్యార్థుల జీవితాలతో ఎలా ఆడుకుంటున్నారో చూపించిన చిత్రమే అక్షర. అయితే దర్శకుడు చిన్నికృష్ణ ఎంచుకున్న కాస్సెప్ట్ బాగున్నప్పటికీ తెరపై చూపించడంలో విఫలమయ్యాడు. మంచి కథకు అనవసర కామెడీని జోడించి సినిమా తేలిపోయేలా చేశాడు. ఫస్టాఫ్ మొత్తం కామెడీతో నడిపించిన దర్శకుడు ఇంటర్వెల్ బ్యాంగ్లో ట్విస్ట్ ఇచ్చి సెకండాఫ్పై ఆసక్తి కలిగించేలా చేశాడు. అయితే అసలు కథను సెకండాఫ్లో చెప్పినప్పటికీ.. అక్కడ కూడా అనవసర కామెడీని చొప్పించాడు. కేసు విచారణను కూడా నాసిరకం కామెడీతో నీరుకార్చాడు. ఇక చివరి అరగంటలో వచ్చే సన్నివేశాలను సినిమాకు చాలా ప్లస్. హర్షవర్థన్ చెప్పే సంభాషణలు ప్రతి ఒక్కరిని ఆలోచించే విధంగా చేస్తాయి. విద్యావ్యవస్థలో ఉన్న లోపాలను చక్కగా చూపించారు. గిదుటూరి సత్య ఎడిటింగ్ అంతంత మాత్రమే ఉంది. తను చాలా సన్నివేశాల్లో తన కత్తెరకు పనిచెప్పాల్సింది. నరేశ్ బానెల్లి సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు కథానుసారం బాగున్నాయి. ప్లస్ పాయింట్స్ నందిత శ్వేత నటన ఇంటర్వెల్ బ్యాంగ్ మైనస్ పాయింట్స్ కథ, కథనం అనవసరపు కామెడీ రొటీన్ క్లైమాక్స్ - అంజి శెట్టె, సాక్షి వెబ్డెస్క్ -
నందిత శ్వేత బ్యూటిఫుల్ ఫోటోలు
-
కపటధారి మూవీ టీం ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ
-
'అక్షర' ట్రైలర్ వచ్చేసింది..
"విద్యను నమ్మినవాడు విజ్ఞాని అవుతాడు, విద్యను అమ్మినవాడు జ్ఞానాగ్నిలో దహించుకుపోతాడు, అఖిల విశ్వాన్ని శాసించేది అక్షరమే.." అని ఎలుగెత్తి చాటుతున్న వాక్యాలతో అక్షర ట్రైలర్ ప్రారంభమైంది. ఇందులో హీరోయిన్ నందిత శ్వేత ఫిజిక్ టీచర్ అక్షర, అన్యాయాన్ని ఎదిరించే వనితగా కనిపిస్తోంది. ప్రస్తుత సమాజంలో విద్యను వ్యాపారం చేసిన కాలేజీల నిర్వాకాన్ని, సీట్లు, ర్యాంకుల అమ్మకాలను విమర్శిస్తూ విద్యార్థుల మానసిక ఒత్తిడిని తెర మీద చూపించేందుకు అక్షర చిత్రయూనిట్ ప్రయత్నించినట్లు కనిపిస్తోంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అక్షర ట్రైలర్ను మంగళవారం రిలీజ్ చేశాడు. ఇక బడా కాలేజీలో చదివే ఓ విద్యార్థి మరణం చుట్టూ కథ తిరుగుతున్నట్లు తెలుస్తోంది. భూమిని నమ్ముకున్నోడు రైతు, చదువును నమ్ముకున్నోడు రాజు అని చెప్పిన డైలాగు బాగుంది. ఇందులో షకలక శంకర్, సత్య, అజయ్ ఘోష్, మధునందన్, కేరాఫ్ కంచరపాలెం ఫేమ్ రాజు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సురేశ్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నారు. చిన్నికృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సినిమా హాల్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై సురేశ్ వర్మ, అహితేజ బెల్లంకొండ నిర్మిస్తున్నారు. చదవండి: రఘుబాబు కూతురి ఎంగేజ్మెంట్లో స్టార్ల సందడి హైదరాబాద్ నా సిటీనే.. నా బ్యూటీ -
రెండో ప్రయత్నంగా ఫ్యామిలీ సస్పెన్స్ థ్రిల్లర్
‘అక్కడొకడుంటాడు’తో శివ కంఠమనేని నటుడిగా పరిచయమయ్యారు. తొలి చిత్రంతో మంచి పేరు తెచ్చుకున్నారు. ఈ నెల 24న ఆయన మరో చిత్రాన్ని ప్రారంభించనున్నారు. శివ కంఠమనేని ప్రధాన పాత్రలో లైట్ హౌస్ సినీ మేజిక్ పతాకంపై జి. రాంబాబు యాదవ్, ఆర్. వెంకటేశ్వరరావు, కె.ఎస్. శంకరరావు, వి. కృష్ణారావు నిర్మించనున్న ఈ చిత్రం ఆగస్టు 24న రామానాయుడు స్టూడియోస్లో ప్రారంభం కానుంది. సంజీవ్ మేగోటి దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో నందితా శ్వేత, రాశి, కె. అశోక్కుమార్లు ప్రధాన పాత్రల్లో నటించనున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ ‘ఫ్యామిలీ ఓరియంటెడ్ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రమిది. ఈ శనివారం పూజా కార్యక్రమాలతో రామానాయుడు స్టూడియోస్లో చిత్రాన్ని ప్రారంభిస్తాం. అదే రోజున రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడతాం. రెండు షెడ్యూళ్లలో చిత్రాన్ని పూర్తి చేయాలనుకుంటున్నాం. సినిమాలో మొత్తం ఐదు పాటలు ఉన్నాయి. నాలుగు పాటల రికార్డింగ్ పూర్తయింది. వీటిలో మంగ్లీ పాడిన ‘చదివిందేమో టెన్త్రో... అయ్యిందేమో డాక్టరో’ పాటను ‘గీత గోవిందం’లో ‘కనురెప్పల కాలంలోనే కథ మొత్తం మారేపోయింది’ రాసిన సాగర్ రాశారు. సినిమా టైటిల్ ఇంకా ఖరారు చేయలేదు’ అని తెలిపారు. -
‘కల్కి’ మూవీ రివ్యూ
-
‘కల్కి’ మూవీ రివ్యూ
టైటిల్ : కల్కి జానర్ : ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ తారాగణం : రాజశేఖర్, అదా శర్మ, నందితా శ్వేతా, రాహుల్ రామకృష్ణ, అశుతోష్ రాణా సంగీతం : శ్రావణ్ భరద్వాజ్ దర్శకత్వం : ప్రశాంత్ వర్మ నిర్మాత : సీ కల్యాణ్, శివాని, శివాత్మిక గరుడవేగ సినిమాతో సక్సెస్ ట్రాక్లోకి వచ్చిన యాంగ్రీ హీరో రాజశేఖర్, అ! లాంటి డిఫరెంట్ మూవీతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ వర్మ కాంబినేషన్లో తెరకెక్కిన పీరియాడిక్ థ్రిల్లర్ మూవీ కల్కి. రాజశేఖర్ను మరోసారి యాంగ్రీ హీరోగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన ఈ సినిమా మీద భారీ అంచనాలే ఉన్నాయి. తొలి సినిమాతో కమర్షియల్గా సక్సెస్ కాలేకపోయిన ప్రశాంత్ వర్మ ఈ సినిమా రిజల్ట్ మీద చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు. మరి ప్రశాంత్ వర్మ నమ్మకాన్ని కల్కి నిలబెట్టిందా..? ఈ థ్రిల్లర్తో రాజశేఖర్ మరో సక్సెస్ అందుకున్నాడా..? కథ : కల్కి.. కథ అంతా 1980ల కాలంలో సాగుతుంది. రజాకార్ల దాడుల్లో రాజు చనిపోవటంతో కొల్లాపూర్ సంస్థానం బాద్యతలు రాణీ రామచంద్రమ్మ తీసుకుంటారు. సంస్థానం మీద కన్నేసిన ఆ ప్రాంత ఎమ్మెల్యే నర్సప్ప (అశుతోష్ రాణా), పెరుమాండ్లు (శత్రు) రాణీని చంపి సంస్థానాన్ని హస్తగతం చేసుకొని ప్రజలను హింసిస్తుంటారు. తరువాత నర్సప్ప, పెరుమాండ్లు మధ్య కూడా గొడవలు రావటంతో ఊరు రణరంగంలా మారుతుంది. ప్రజలు నర్సప్ప అరాచకాల్ని భరించలేక, ఎదురుతిరగలేక బిక్కుబిక్కుమంటూ జీవిస్తుంటారు. అదే సమయంలో పట్నం నుంచి వచ్చిన నర్సప్ప తమ్ముడు శేఖర్ బాబు(సిద్దు జొన్నలగడ్డ)ను దారుణంగా హత్య చేస్తారు. హత్యకు కారణం నర్సప్ప అని కొందరు, కాదు పెరుమాండ్లు చంపాడని మరి కొందరు, కాదూ రాణీ రామచంద్రమ్మ దెయ్యం అయి వచ్చి చంపిందని మరికొందరు అనుకుంటుంటారు. ఈ హత్య కేసు ఇన్వెస్టిగేట్ చేయడానికి కల్కి(రాజశేఖర్)ని ప్రత్యేకంగా అపాయింట్ చేస్తారు. కొల్లాపూర్ వచ్చిన కల్కి, జర్నలిస్ట్ దేవదత్తా (రాహుల్ రామకృష్ణ) సాయంతో ఇన్వెస్టిగేషన్ మొదలుపెడతాడు. కల్కి ఈ కేసు ఎలా చేదించాడు..? అసలు శేఖర్ బాబు ఎలా చనిపోయాడు.? ఎవరు చంపారు..? ఈ కథతో ఆసిమా(నందితా శ్వేత)కు సంబంధం ఏంటి.? అన్నదే మిగతా కథ. నటీనటులు : గరుడ వేగ సక్సెస్తో మంచి ఊపు మీదున్న రాజశేఖర్, కల్కి పాత్రలో జీవించాడు. అక్కడక్కడా లుక్ పరంగా కాస్త ఇబ్బంది పెట్టినా ఓవరాల్గా మరోసారి యాంగ్రీ హీరోగా సూపర్బ్ అనిపించాడు. యాక్షన్ సీన్స్లోనూ ఆకట్టుకున్నాడు. అదా శర్మ పోషించిన హీరోయిన్ పాత్రకు కథలో ఏ మాత్రం ప్రాదాన్యం లేదు. కేవలం ఓ పాట కోసమే ఆమెను తీసుకున్నట్టుగా అనిపిస్తుంది. కీలక పాత్రలో నటించిన నందితా శ్వేత.. ఆ పాత్రకు పూర్తి న్యాయం చేశారు. మంచి నటిగా పేరున్న నందితా ఈ సినిమాతో మరోసారి తన మీదున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు. సినిమాను నడిపించే పాత్రలో రాహుల్ రామకృష్ణ ఆకట్టుకున్నాడు. సీరియస్ మోడ్లో సాగే కథనంలో అప్పుడప్పుడు తనదైన కామిక్ టైమింగ్తో మెప్పించాడు. విలన్గా అశుతోష్ రాణా తన పాత్రలో ఒదిగిపోయాడు. ఇతర పాత్రల్లో శత్రు, నాజర్, సిద్దు జొన్నలగడ్డ, చరణ్దీప్, పూజితా పొన్నాడ తమ పరిది మేరకు ఆకట్టుకున్నారు. విశ్లేషణ : ఇది పూర్తిగా ప్రశాంత్ వర్మ మార్క్ సినిమా. రెండో ప్రయత్నంగా పీరియాడికల్ థ్రిల్లర్ను ఎంచుకున్న ప్రశాంత్ సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. డిఫరెంట్ స్క్రీన్ప్లే, థ్రిల్లింగ్ ట్విస్ట్లతో మంచి కథా కథనాలను రెడీ చేసుకున్నాడు. అయితే చెప్పాల్సిన కథ రెండున్నర గంటలకు సరిపడా లేకపోవటంతో కథనాన్ని కాస్త నెమ్మదిగా నడిపించాడు. కొన్ని సన్నివేశాల్లో అర్థంకాని స్క్రీన్ప్లే ప్రేక్షకులను తికమకపెడుతుంది. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్లో చాలా సన్నివేశాలు నెమ్మదిగా సాగుతాయి. హీరో హీరోయిన్ల ప్రేమకథ కమర్షియల్ ఫార్మాట్ కోసం కావాలనే ఇరికించినట్టుగా అనిపిస్తుంది. ద్వితీయార్థంలో థ్రిల్లింగ్ ట్విస్ట్లతో ప్రేక్షకులను సర్ప్రైజ్ చేశాడు దర్శకుడు. ముఖ్యంగా చివరి 30 నిమిషాలు ఆడియన్స్ను కట్టిపడేశాడు. సినిమాకు ప్రధాన బలం నేపథ్య సంగీతం, పాటలతో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన శ్రావణ్ భరద్వాజ్ నేపథ్యం సంగీతంతో వావ్ అనిపించాడు. కొన్ని సన్నివేశాల్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ సీన్ను డామినేట్ చేసినట్టు అనిపిస్తుంది. శివేంద్ర సినిమాటోగ్రఫి కూడా సూపర్బ్ అనిపించేలా ఉంది. 80ల నాటి లుక్ తీసుకురావటంలో ఆర్ట్ డిపార్ట్మెంట్ చేసిన కృషి తెర మీద కనిపిస్తుంది. ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది. విజువల్ ఎఫెక్ట్స్ కూడా నాసిరకంగా ఉన్నాయి. సీ కల్యాణ్తో కలిసి స్వయంగా సినిమాను నిర్మించిన రాజశేఖర్ ఖర్చుకు వెనకాడకుండా సినిమాను రూపొందించాడు. ప్లస్ పాయింట్స్ : నేపథ్య సంగీతం క్లైమాక్స్ ప్రశాంత్ వర్మ మార్క్ టేకింగ్ మైనస్ పాయింట్స్ : హీరోయిన్ పాత్ర స్క్రీన్ప్లే ఫస్ట్ హాఫ్లో కొన్ని సీన్స్ సాంగ్స్ - సతీష్ రెడ్డి జడ్డా, సాక్షి వెబ్ డెస్క్. -
విద్య కోసం పోరాటం
కథానాయిక నందితాశ్వేత ప్రధాన పాత్రలో బి. చిన్నికృష్ణ దర్శకత్వం వహించిన చిత్రం ‘అక్షర’. అహితేజ బెల్లంకొండ, సురేష్ వర్మ నిర్మించారు. విద్యావ్యవస్థలోని లోపాలను ప్రశ్నించే అక్షర పోరాటం ఆసక్తిగా సాగుతుంది అని చిత్రబృందం చెబుతోంది. ఈ సినిమా టీజర్ను విడుదల చేసిన దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ– ‘‘ఒక దర్శకుడి ఆలోచన విఫలం కావొచ్చు. కానీ అతని ప్రయత్నం ఎప్పటికీ విఫలం కాకూడదు. ఈ సినిమా కథ బాగా నచ్చింది. టీజర్ బాగుంది. ఇలాంటి కాన్సెప్ట్ను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్న నిర్మాతలకు అభినందనలు. చిన్నికృష్ణ నాకు మంచి మిత్రుడు. నా మొదటి సినిమా ‘పటాస్’ టేకాఫ్ కావడానికి అతను చేసిన సహాయం మరువలేనిది. నందితా శ్వేత మంచి ఆర్టిస్టు. ఈ సినిమాలో ఆమె లుక్స్ బాగున్నాయి’’ అన్నారు. ‘‘నేను చెప్పిన లైన్ విని దర్శకుడిగా నాకు అవకాశం కల్పించిన నిర్మాతలకు థ్యాంక్స్. ఈ చిత్రంలో ఓ సీరియస్ పాయింట్ని డిస్కస్ చేశాం. ఈ సినిమాలోని ‘అక్షర’ పాత్రకు రూపం ఇచ్చిన నందితగారికి థ్యాంక్స్. ఈ కథ వినగానే ‘హిట్ కొడుతున్నావ్’ అని అనిల్ అన్నాడు. ఎడ్యుకేషన్ అందరికీ అందుబాటులోకి రావాలన్నదే అక్షర చేసే పోరాటం’’ అని చిన్నికృష్ణ అన్నారు. ‘‘మెసేజ్ ఓరియంటెడ్ మూవీ ఇది. ఈ సినిమాకు నా కెరీర్లో ప్రత్యేక స్థానం ఉంటుంది’’ అన్నారు నందిత. ‘‘సినిమాను ఆగస్టులో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు సురేష్ వర్మ.‘‘అక్షర’ సినిమా ఐడియా నాకు పేపర్ మీద ఉన్నప్పటి నుంచి తెలుసు. మంచి కాన్సెప్ట్తో వస్తున్నారు’’ అన్నారు ‘మధుర’ శ్రీధర్. ఈ చిత్రంలో మంచి క్యారెక్టర్ చేశానని శ్రీతేజ్ చెప్పారు. -
ముద్దు సీన్లు ఉన్నాయని ముందు తెలియదు
‘‘సాధారణంగా నాకు థ్రిల్లర్స్ పెద్దగా ఆసక్తి లేదు. ఆ సబ్జక్టే కొంచెం డ్రైగా అనిపిస్తుంది. కానీ ఈ థ్రిల్లర్ ఒప్పుకోవడానికి కారణం కథ. ప్లస్ 6 హీరోయిన్లు ఉన్న తర్వాత ఇక డ్రైగా ఎందుకు ఉంటుంది? ఇలాంటి కథ ఎక్కడా రాలేదు’’ అన్నారు హవీష్. కెమెరామేన్ నిజార్ షఫీ దర్శకుడిగా మారి హవీష్ హీరోగా రెజీనా, నందితా శ్వేత, త్రిధా చౌదరి, అనీషా ఆంబ్రోస్, అదితీ ఆర్య, పూజితా పొన్నాడ హీరోయిన్లుగా రూపొందించిన చిత్రం ‘7’. రమేశ్ వర్మ కథను అందించి, నిర్మించిన ఈ రొమాంటిక్ థ్రిల్లర్ ఈ నెల 5న రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా హవీష్ పలు విషయాలు పంచుకున్నారు. ► సినిమాలో రెహమాన్ పోలీసాఫీసర్ పాత్రలో కనిపిస్తారు. ఆయన దృష్టిలో హీరోయిన్లు, నేను (6+1) 7 పాత్రలం. అందుకే ఆ టైటిల్ పెట్టాం. మొదట సినిమా అనుకున్నప్పటి నుంచి మరో నాలుగు రోజుల్లో సెట్స్ మీదకు వెళ్తాం అనేవరకూ కూడా తెలుగులో మాత్రమే తీయాలనునుకున్నాం. చివర్లో మరో నిర్మాత కూడా తోడవ్వడంతో తెలుగు, తమిళంలో నిర్మించాం. దర్శకుడు షఫీ పుట్టింది తమిళనాడులో అయినా తెలుగు సినిమాలు ఎక్కువ చేశారు. రెండు ప్రాంతాల వాళ్లకు అనుగుణంగా ఈ సినిమా తెరకెక్కించారు. నాకు ఒక్క ముక్క తమిళం రాదు. డైలాగ్స్ నేర్చుకోవడానికి గంటల గంటలు పట్టేది. ► కథలో బలం ఉండబట్టే ఆరుగురు హీరోయిన్లు నటించడానికి ఒప్పుకున్నారు. ఒకరితో ఫ్రెండ్ అవుతున్నాను అనుకునే లోపు ఆమె పార్ట్ షూటింగ్ పూర్తయి మరో హీరోయిన్ జాయిన్ అయ్యేవారు. ఇంత మంది హీరోయిన్లు ఉన్నప్పుడు చిన్న చిన్న ఫైట్స్ కామన్. ఇద్దరు హీరోయిన్స్ సెట్లో ఉన్నప్పుడు అక్కడి వాతావరణంలో తేడా నాకు అర్థం అయ్యేది. ► ఏ పని చేసినా నం.1గా ఉండాలనుకునే మనస్తత్వం నాది. అలానే కష్టపడతాను. మన పని మనం చేసుకుంటూ వెళ్తే సక్సెస్ ఆటోమేటిక్గా వస్తుంది. ఆ మధ్య ఓ పెద్ద ప్రాజెక్ట్లో హీరోగా అవకాశం వచ్చింది. చివరి నిమిషంలో క్యాన్సిల్ అయింది. దాంతో నా గత చిత్రానికి, దీనికి ఇంత గ్యాప్ వచ్చింది. ప్రస్తుతం ఓ మూడు సినిమాలు లైన్లో ఉన్నాయి. అభిషేక్ పిక్చర్స్ వాళ్లకు చేస్తున్నది ఫ్యామిలీ డ్రామా. అందులో మంచి లవ్స్టోరీ ఉంటుంది. ► మా ప్రొడక్షన్లో ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్తో ‘రాక్షసుడు’ సినిమా చేస్తున్నాం. జూలై 18న రిలీజ్ అనుకుంటున్నాం. నా బ్యానర్లో నేను నటించకపోయినా ఫర్వాలేదు. ఆల్రెడీ బ్యానర్లో నిర్మాతగా నా పేరున్నట్టే. ప్రతి సినిమాలో నేనుండవసరం లేదు కదా. ► ‘7’లో కొన్ని లిప్లాక్ సన్నివేశాలు ఉన్నాయి. కథ చెప్పినప్పుడు ముద్దు సీన్లు ఉన్నాయని నాతో చెప్పలేదు. సెట్లోకి వెళ్లి హీరోయిన్ను ముద్దుపెట్టమంటే భయపడ్డాను. ‘ఒకవేళ తను కొడితే ఏంటి?’ అనుకున్నాను. మొదట్లో కొంచెం ఇబ్బంది పడ్డాను. ఆ తర్వాత ధైర్యంగా చేసేశాను. ఏ రంగంలో అయినా మార్పు మంచిదే. అందరికీ చాన్స్ ఇవ్వాలనే పద్ధతిని నమ్ముతాను. ఆంధ్రప్రదేశ్ సీఎంగా చంద్రబాబుగారిని చూశాం. ఇప్పుడు జగన్గారికి అవకాశం ఇచ్చారు. ఆప్షన్ ఉండాలి. ఈయన సరిగ్గా పరిపాలించకపోతే ఆయన. ఆయన చేయకపోతే ఈయన.. అలా ఉండాలి. జగన్గారు రావడం ఖచ్చితంగా మంచిదే. ఆయనకి ఎక్స్పీరియన్స్ లేదని ఎందుకు అనుకోవాలి. జగన్గారు యంగ్స్టర్, ప్రపంచాన్ని చూశాడు. ఆయన బాగా పాలించగలరని అనుకుంటున్నాను. -
రెండింతలు భయపెడతాం
‘అభినేత్రి’ చిత్రంతో తమన్నా, ప్రభుదేవా ప్రేక్షకులను భయపెట్టారు. మొదటిసారి కంటే రెట్టింపు భయపెట్టడానికి ‘అభినేత్రి’ సీక్వెల్ ‘అభినేత్రి 2’తో రెడీ అయ్యారు. ప్రభుదేవా, తమన్నా జంటగా ఏ.ఎల్. విజయ్ దర్శకత్వంలో తెరకెక్కిన హారర్ థ్రిల్లర్ ‘అభినేత్రి 2’. సోనూ సూద్, నందితా శ్వేత, సప్తగిరి కీలక పాత్రల్లో నటించారు. అభిషేక్ నామా, ఆర్. రవీంద్రన్ నిర్మించారు. ఈ చిత్రాన్ని మే 31న రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘థ్రిల్ చేస్తూనే మనసును ఆకట్టుకునే సన్నివేశాలు ఈ సినిమాలో చాలా ఉంటాయి. టీజర్, ట్రైలర్కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ప్రభుదేవా, తమన్నా, నందితా శ్వేతల నటన ఈ సినిమాకు హైలైట్’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: అయాంకా బోస్, సంగీతం: శ్యామ్ సీఎస్. -
మార్చి 21న ‘ప్రేమ కథా చిత్రమ్ 2’
సుధీర్ బాబు, నందితలు హీరో హీరోయిన్లుగా తెరకెక్కి ఘనవిజయం సాధించిన సినిమా ప్రేమ కథా చిత్రమ్. మారుతి కథ అందించిన ఈ సినిమాకు జె ప్రభాకర్ రెడ్డి దర్శకుడు. కామెడీ హర్రర్ జానర్లో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ కావటంతో సుమంత్ అశ్విన్ హీరోగా సీక్వెల్ ను తెరకెక్కించారు. ప్రేమ కథా చిత్రం 2 పేరుతో తెరకెక్కిన ఈ సినిమా మార్చి 21న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. హరి కిషన్ దర్శకుడిగా పరిచయం అవుతూ తెరకెక్కించిన ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ను విడుదల చేశారు. ఈ సినిమాలో ఒక హీరోయిన్గా జంబ లకిడి పంబ ఫేం సిద్ధి ఇద్నాని నటిస్తుండగా మరో హీరోయిన్ గా ఎక్కడికి పోతావు చిన్నావాడా ఫేం నందిత శ్వేత నటించారు. ప్రేమ కథా చిత్రానికి నిర్మాతగా వ్యహరించిన సుదర్శన్ రెడ్డి సీక్వెల్ను కూడా నిర్మిస్తున్నారు. -
అందుకే బ్రేక్ తీసుకున్నా
‘‘స్టార్ అవ్వడం కన్నా ప్రేక్షకుల దగ్గర నటిగా మంచి పేరు తెచ్చుకోవాలన్నదే నా తపన. నాలో యాక్టర్ని గుర్తించి నాకు విభిన్నమైన పాత్రలు చేసే అవకాశాన్ని ఇస్తున్న దర్శక–నిర్మాతలకు ధన్యవాదాలు’’ అన్నారు నందితా శ్వేత. గోపీ గణేశ్ దర్శకత్వంలో సత్యదేవ్, నందితా శ్వేత జంటగా రూపొందిన చిత్రం ‘బ్లఫ్ మాస్టర్’. తమిళ చిత్రం ‘చతురంగ వేటై్ట’కి తెలుగు రీమేక్ ఇది. శివలెంక కృష్ణప్రసాద్ సమర్పణలో రమేష్ పిళ్లై నిర్మించిన ఈ సినిమా ఈ నెల 28న విడుదల కానుంది. ఈ సందర్భంగా నందితా శ్వేత చెప్పిన విశేషాలు. నేను మైసూర్లో పుట్టినప్పటికీ పెరిగింది మాత్రం బెంగళూరులోనే. నా స్కూల్ టైమ్లో ‘నంద లవ్స్ నందిత’ అనే కన్నడ చిత్రం చేశాను. సినిమా విజయం సాధించింది. కానీ నటనలో నా నైపుణ్యత ఇంకా పెరగాలని నాకు అనిపించింది. అందుకే కాస్త బ్రేక్ తీసుకుని యాక్టింగ్ కోర్స్ చేశాను. అలాగే నా స్టడీస్పై దృష్టి పెట్టి ఎమ్బీఏ కూడా పూర్తి చేశాను. నెక్ట్స్ పీహెచ్డీ చేయాలనే ఆలోచన ఉంది.ఎక్కడికి పోతావు చిన్నవాడా’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యాను. తర్వాత ‘శ్రీనివాస కళ్యాణం’ చేశాను. ‘బ్లఫ్ మాస్టర్’ నా మూడో సినిమా. ఇందులో అవని అనే క్యారెక్టర్ చేశాను. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ సినిమా చూడకుండానే గోపీగారు నన్ను ఈ సినిమాకు సెలక్ట్ చేశారు. సత్యదేవ్ మంచి నటుడు. సినిమాలో మా ఇద్దరి కెమిస్ట్రీ బాగా కుదిరింది. తమిళ చిత్రంతో పోలిస్తే చాలా మార్పులు చేశాం.ఆడియన్స్లో మార్పు వచ్చింది. సినిమాను సినిమాగానే చూస్తున్నారు. కంటెంట్ ఉంటేనే ఆదరిస్తున్నారు. పాత్ర పర్ఫెక్షన్ కోసం ఎంతైనా కష్టపడతాను. కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఇష్టపడతాను. ఇప్పటివరకు 22 సినిమాలు చేశాను. ఒక్క ఈ ఏడాదే తమిళ, తెలుగు, కన్నడ భాషల్లో 11 సినిమాల్లో భాగమవ్వడం చాలా హ్యాపీగా ఉంది. ఆల్రెడీ 3 రిలీజయ్యాయి. మరో ఎనిమిది సినిమాలు వరుసగా రిలీజవుతాయి.తెలుగు, కన్నడ, తమిళంలలో దేనికి ప్రియారిటీ అంటే చెప్పలేను. అన్నింటినీ బ్యాలెన్స్ చేస్తున్నాను. తెలుగులో ‘కల్కి’ చిత్రంలో ముస్లిం యువతిగా కనిపిస్తాను. ‘అక్షర’ చిత్రంలో లెక్చరర్ పాత్ర చేస్తున్నాను. అలాగే ప్రేమకథా చిత్రమ్ 2, అభినేత్రి 2, 7’ చిత్రాల్లో కూడా నా క్యారెక్టర్స్ డిఫరెంట్గా ఉంటాయి. ఇక తమిళంలో ‘నర్మద’ అనే చిత్రంలో తల్లి పాత్ర పోషిస్తున్నాను. సెల్వ దరక్శత్వంలో అరవిందస్వామి హీరోగా రూపొందుతున్న ‘వణంగాముడి’ చిత్రంలో నాది పోలీస్ పాత్ర. కన్నడంలో ‘కేజీఎఫ్’ హీరో యశ్తో ‘కిరాతక’ అనే సినిమా చేస్తున్నా. ఇంకా చాలా ఆఫర్లు వస్తున్నాయి. ఎగై్జటింగ్గా ఉంటేనే ఓకే చెబుతున్నాను. -
విద్యా వ్యవస్థలోని వాస్తవాలతో..
‘ఎక్కడికి పోతావు చిన్నవాడ’ ఫేమ్ నందితా శ్వేత ముఖ్య పాత్రలో చిన్నికృష్ణ తెరకెక్కించనున్న చిత్రం ‘అక్షర’. సినిమా హాల్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై అహితేజ బెల్లంకొండ, సురేశ్ వర్మ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ముహుర్తం శనివారం జరిగింది. తొలి సన్నివేశానికి పారిశ్రామికవేత్త రఘురామ కృష్ణంరాజు కెమెరా స్విచ్చాన్ చేయగా, నిర్మాత ‘దిల్’ రాజు క్లాప్ ఇచ్చారు. దర్శకుడు సుధీర్ వర్మ గౌరవ దర్శకత్వం వహించారు. హీరోలు కార్తికేయ, విజయ్ రాహుల్, దర్శకుడు కల్యాణ్ కృష్ణ కురసాల స్క్రిప్ట్ని నిర్మాతలకు అందించి, శుభాకాంక్షలు చెప్పారు. ఈ సందర్భంగా నందితా శ్వేత మాట్లాడుతూ – ‘‘కథ వినగానే బాగా ఎగై్జట్ అయ్యాను. నిర్మాతల ఆలోచనలు నన్ను ఇంప్రెస్ చేశాయి. కథ మీద చాలా నమ్మకంగా ఉన్నాం. చాలా బాధ్యత గల పాత్ర. కొంచెం భయంగా కూడా ఉంది’’ అన్నారు. ‘‘నా కథను నమ్మి ఈ అవకాశం ఇచ్చిన నిర్మాతలకు థ్యాంక్స్. ఈ బ్యానర్ని నిలబెట్టే సినిమా అవుతుంది. విద్యా వ్యవస్థలోని వాస్తవాలకు వినోదం జోడించి చెప్పబోతున్నాం. నందితా శ్వేతాతో పాటు 3 ముఖ్యమైన పాత్రలున్నాయి. త్వరలో ప్రకటిస్తాం’’ అన్నారు దర్శకుడు చిన్నికృష్ణ. ‘‘కాన్సెప్ట్ టీజర్కి మంచి స్పందన లభించింది. డిసెంబర్ సెకండ్ వీక్లో షూటింగ్ మొదలుపెట్టి సమ్మర్కి విడుదల ప్లాన్ చేస్తున్నాం. ఆడియన్స్ ఆలోచనలో మార్పు కలిగించే చిత్రం అవుతుంది అనుకుంటున్నాం’’ అన్నారు నిర్మాతలు అహితేజ, సురేశ్ వర్మ. ఈ చిత్రానికి సంగీతం: సురేశ్ బొబ్బిలి, కెమెరా: జి.శివ, సహనిర్మాత: కె. శ్రీనివాసరెడ్డి. -
భయం మళ్లీ మొదలు
సుధీర్బాబు, నందిత జంటగా వచ్చిన ‘ప్రేమకథా చిత్రమ్’ ప్రేక్షకుల్ని భయపెట్టడంతో పాటు పొట్ట చెక్కలయ్యేలా నవ్వించింది. 2013లో ఘన విజయం సాధించిన ఈ చిత్రానికి సీక్వెల్గా ‘ప్రేమకథా చిత్రమ్ 2’ తెరకెక్కుతోంది. ‘బ్యాక్ టు ఫియర్’ అన్నది ఉపశీర్షిక. సుమంత్ అశ్విన్, సిద్ధి ఇద్నాని జంటగా, ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ ఫేమ్ నందితా శ్వేత హీరోయిన్గా తెరకెక్కుతోన్న ఈ సినిమాతో హరి కిషన్ని దర్శకుడిగా పరిచయం చేస్తూ ఆర్.పి.ఎ. క్రియేషన్స్పై ఆర్. సుదర్శన్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ని విజయదశమి సందర్భంగా విడుదల చేశారు. సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ– ‘‘లవ్, హారర్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోన్న చిత్రమిది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసే కథ. మా బ్యానర్లో మరో సూపర్ హిట్ చిత్రంగా నిలుస్తుందని నమ్ముతున్నాం. ఇప్పటికే 90% షూటింగ్ పూర్తయింది. ఈ నెల 22 నుంచి బ్యాలెన్స్ ఉన్న రెండు పాటలు, క్లయిమాక్స్ని చిత్రీకరించి, నవంబర్ నెలాఖరులో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: సి. రాం ప్రసాద్, సంగీతం: జె.బి, సహ నిర్మాతలు: ఆయుష్ రెడ్డి, ఆర్పి అక్షిత్ రెడ్డి. -
‘బ్లఫ్ మాస్టర్’ మూవీ స్టిల్స్
-
ఘరానా మోసగాడు
‘జ్యోతిలక్ష్మీ, ఘాజీ’ చిత్రాల ఫేమ్ సత్యదేవ్ హీరోగా గోపీ గణేశ్ పట్టాభి దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘బ్లఫ్ మాస్టర్’. నందితా శ్వేత కథానాయికగా నటించారు. శివలెంక కృష్ణప్రసాద్ సమర్పణలో రమేష్ పిళ్లై నిర్మించారు. తమిళ చిత్రం ‘చతురంగ వేటై్ట’ ఆధారంగా రూపొందిన ఈ సినిమా చితీకరణ పూర్తయింది. ఈ సందర్భంగా దర్శకుడు గోపీ గణేష్ మాట్లాడుతూ– ‘‘ఎవరో నలుగరు రచయితలు నాలుగు గోడల మధ్య కూర్చుని రాసిన కథ కాదిది. వాస్తవాలను కథగా మలిచి సినిమా చేశాం. మాయ మాటలు చెప్పి మోసగాళ్లు మోసం చేస్తూనే ఉన్నారు. మోసపోయిన తర్వాత అయ్యో మోసపోయాం అని బాధితులు బాధపడుతున్నారు. ఇలాంటి వాటికి ప్రతిరూపమే ఈ సినిమా. ఇందులో ఘరానా మోసగాడి పాత్రలో సత్యదేవ్ కనిపిస్తారు. సత్య బాగా నటించారు’’ అన్నారు. ‘‘ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అక్టోబర్లో పాటలను రిలీజ్ చేస్తాం. నవంబర్లో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనుకుంటున్నాం’’ అన్నారు రమేష్. ఫృథ్వీ, బ్రహ్మాజీ, ఆదిత్యామీనన్ ముఖ్య తారలుగా నటించిన ఈ చిత్రానికి కథ: హెచ్.డి. వినోద్, అడిషనల్ డైలాగ్స్: పులగం చిన్నారాయణ, సునీల్ కశ్యప్ సంగీతం అందించారు. -
స్క్రీన్ టెస్ట్
1. ఆగస్ట్ 15న పుట్టిన ప్రముఖ తెలుగు నటుడెవరో తెలుసా? ఎ) బ్రహ్మాజీ బి) శ్రీహరి సి) నరేశ్ డి) రావు రమేశ్ 2. కమల్హాసన్ నటించిన ‘విశ్వరూపం 1, 2’లలో హీరోయిన్గా నటించిన నటి ఎవరో కనుక్కోండి? ఎ) మల్లికా శెరావత్ బి) జయప్రద సి) అసిన్ డి) పూజాకుమార్ 3 . సాయిధరమ్ తేజ్ హీరోగా నటించిన ‘సుప్రీం’ చిత్రంలో బెల్లం శ్రీదేవి పాత్రలో నటించిన హీరోయిన్ ఎవరో తెలుసా? ఎ) రాశీ ఖన్నా బి) రెజీనా సి) రకుల్ప్రీత్ సింగ్ డి) లావణ్య త్రిపాఠి 4. చిరంజీవి పుట్టినరోజు ఆగస్టు 22న. ఈ ఆగస్టుకు ఆయన ఎన్నో సంవత్సరంలోకి అడుగు పెడతారో తెలుసా? ఎ) 61 బి) 60 సి) 62 డి) 64 5. నాగార్జున, నానీ నటిస్తున్న మల్టీస్టారర్ మూవీకి దర్శకుడెవరో చూద్దామా? ఎ) శ్రీరామ్ ఆదిత్య బి) ప్రశాంత్ వర్మ సి) విరించి వర్మ డి) తరుణ్ భాస్కర్ 6. ‘చి.ల.సౌ’ చిత్రం ద్వారా తెరంగేట్రం చేసిన హీరోయిన్ పేరేంటి? ఎ) శోభిత దూళిపాళ్ల బి) రుహానీ శర్మ సి) సిమ్రన్ డి) కష్మీరి 7. ‘మహానటి’ చిత్రంలో జెమినీ గణేశన్ పాత్రలో నటించారు ‘దుల్కర్ సల్మాన్’. ఆ సినిమాలో ఆయన మొదటి భార్యగా నటించిన హీరోయిన్ ఎవరో గుర్తుందా? ఎ) నందితా శ్వేత బి) మెహరీన్ సి) మాళవికా నాయర్ డి) నిత్యా మీనన్ 8. మహానేత వై.యస్. రాజశేఖర్ రెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘యాత్ర’. ఆ చిత్రదర్శకుడు మహీ.వి.రాఘవ్ ఇటీవల తెరకెక్కించిన హిట్ సినిమా పేరేంటి? ఎ) జయమ్ము నిశ్చయమ్మురా బి) జంబలకిడి పంబ సి) అమీ తుమీ డి) ఆనందో బ్రహ్మ 9. తమిళ దర్శకుడు శంకర్ తెరకెక్కించిన ‘రోబో 2.0’లో విలన్గా నటించిన బాలీవుడ్ నటుడెవరో కనుక్కోండి? ఎ) అజయ్ దేవ్గన్ బి) అక్షయ్ కుమార్ సి) రాజ్కుమార్ రావు డి) జాకీ ష్రాఫ్ 10. రేవతి, మోహన్ జంటగా నటించిన ‘మౌన రాగం’ చిత్రదర్శకుడెవరో గుర్తు చేసుకుందామా? ఎ) భారతీరాజా బి) భాగ్యరాజా సి) మణిరత్నం డి) బాలచందర్ 11 దర్శకులు దాసరి నారాయణరావు దర్శకత్వంలో ఎక్కువ చిత్రాల్లో నటించిన హీరోయిన్ ఎవరో కనుక్కోండి? ఎ) జయసుధ బి) జయప్రద సి) విజయశాంతి డి) విజయనిర్మల 12. ‘పంచదార బొమ్మా బొమ్మా పట్టుకోవద్దనకమ్మా...’ అనే పాటను పాడిన గాయకుడెవరో తెలుసా? ఎ) నిహాల్ బి) వేణు సి) మల్లిఖార్జున్ డి) అనూజ్ 13. దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళితో ఎక్కువ సినిమాలకు పని చేసిన కెమెరామెన్ ఎవరో తెలుసా? ఎ) రత్నవేలు బి) కేకే సెంథిల్ కుమార్ సి) రసూల్ ఎల్లోర్ డి) హరి అనుమోలు 14. ‘మనసుకు నచ్చింది’ సినిమాకు వాయిస్ ఓవర్ ఇచ్చిన టాప్ హీరో ఎవరు? ఎ) ఎన్టీఆర్ బి) ప్రభాస్ సి) మహేశ్బాబు డి) వెంకటేశ్ 15. రీసెంట్ తెలుగు హిట్ మూవీ ‘ఆర్ఎక్స్ 100’ తమిళ రీమేక్లో నటిస్తున్న హీరో ఎవరు? ఎ) ఆది సాయికుమార్ బి) ఆది పినిశెట్టి సి) అడివి శేష్ డి) రాహుల్ రవీంద్రన్ 16. దాదాపు ఆరేళ్ల తర్వాత తెలుగు సినిమా చేస్తున్న కథానాయిక ఎవరు? ఎ) త్రిష బి) హన్సిక సి) ఇలియానా డి) శ్రుతీహాసన్ 17. ‘గీత గోవిందం’ చిత్రంలో ‘ఇంకేం ఇంకేం ఇంకేం కావాలి...’ అనే పాపులర్ సాంగ్ను రచించిన రచయితఎవరు? ఎ) శ్రీమణి బి) అనంత శ్రీరామ్ సి) వరికుప్పల యాదగిరి డి) రాంబాబు గోసాల 18. ‘ప్రస్థానం’ సినిమాలో ప్రముఖ పాత్రలో నటించారు సాయికుమార్. హిందీ రీమేక్లో ఆ పాత్రను చేస్తున్న నటుడెవరు? ఎ) అనిల్ కపూర్ బి) సంజయ్ దత్ సి) నానా పటేకర్ డి) నవాజుద్దీన్ సిధ్ధిఖి 19. అక్కినేని, జమున జంటగా నటించిన ఈ స్టిల్ ఏ చిత్రంలోనిదో తెలుసా? ఎ) గుండమ్మకథ బి) దొంగరాముడు సి) ఇద్దరు మిత్రులు డి) చదువుకున్న అమ్మాయిలు 20. ‘మక్కళ్ నీది మయ్యమ్’ అనే రాజకీయ పార్టీని స్థాపించిన తమిళ హీరో ఎవరో కనుక్కోండి? ఎ) రజనీకాంత్ బి) శరత్కుమార్ సి) కమల్ హాసన్ డి) విజయ్కాంత్ మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం 10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్ 15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి 20 సమాధానాలూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి! సమాధానాలు 1) బి 2) డి 3) ఎ 4) డి 5) ఎ 6) బి 7) సి 8) డి 9) బి 10) సి 11) ఎ 12) డి 13) బి 14) సి 15) బి 16) సి 17) బి 18) బి 19) బి 20) సి నిర్వహణ: శివ మల్లాల -
విజయవాడలో ‘శ్రీనివాసకళ్యాణం’ చిత్ర బృందం
-
ముహూర్తం కుదిరింది
రీసెంట్గా మూడు పదుల వయసులోకి అడుగుపెట్టిన హీరో నితిన్ పెళ్లి చేసుకున్నారు. కాస్త ఆగి మీ ఆలోచనలకు అడ్డుకట్ట వేయండి. ఆయన పెళ్లి చేసుకున్నది రియల్ లైఫ్లో కాదు రీల్ లైఫ్లో. నితిన్ హీరోగా ‘శతమానం భవతి’ ఫేమ్ సతీష్ వేగేశ్న దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘శ్రీనివాస కల్యాణం’ రిలీజ్కు ముహూర్తం కుదిరింది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ‘దిల్’ రాజు నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 9న విడుదల కానుంది. ఇందులో రాశీఖన్నా, నందితా శ్వేతా కథానాయికలుగా నటించారు. ‘‘ఒక సాంగ్, ప్యాచ్ వర్క్ మినహా షూటింగ్ పూర్తయింది. దాదాపు 12 సంవత్సరాల క్రితం మా బ్యానర్లో ‘బొమ్మరిల్లు’ విడుదలైన ఆగస్టు 9న ఇప్పుడు మళ్లీ ‘శ్రీనివాస కల్యాణం’ ప్రేక్షకుల ముందుకు రానుంది. మళ్లీ అదే రోజున అదే స్థాయి విజయాన్ని ‘శ్రీనివాస కల్యాణం’ చిత్రంతో అందుకోవాలని ప్రయత్నిస్తున్నాం’’ అన్నారు ‘దిల్’ రాజు. -
నందితతో ‘శ్రీనివాస కళ్యాణం’
ప్రస్తుతం కృష్ణచైతన్య దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న యంగ్ హీరో నితిన్, ఆ సినిమా తరువాత దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కనున్న శ్రీనివాస కళ్యాణం సినిమాలో నటించనున్నాడు. ఈ సినిమాకు శతమానం భవతి ఫేం సతీష్ వేగేశ్న దర్శకుడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈసినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. తాజాగా ఈ సినిమాలో నితిన్కు హీరోయిన్ను ఫైనల్ చేశారు. ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన కన్నడ బ్యూటి నందిత శ్వేత. తొలి సినిమాతోనే నటిగా మంచి మార్కులు సాధించిన ఈ అందాల భామ శ్రీనివాస్ కళ్యాణంలో నితిన్ సరసన హీరోయిన్గా నటిస్తోంది. నందిత ఎంపికపై టాలీవుడ్ సర్కిల్స్ లో వార్తలు వినిపిస్తున్న చిత్రయూనిట్ మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. -
తెలుగు చిత్రాలకే ప్రాధాన్యం
తణుకు: ఇకపై తెలుగు చిత్రాలకే ప్రాధాన్యం ఇస్తానని, ఇక్కడి తెలుగువారంటే తనకు ఎంతో గౌరవమని ప్రముఖ సినీనటి నందిత శ్వేత పేర్కొంది. ‘ఎక్కడకు పోతావు చిన్నవాడా..’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను అలరించిన ఈ కన్నడ నటి శనివారం తణుకు వచ్చేసింది. తణుకులో వన్ ఇండియా షాపింగ్మాల్ ప్రారంభించిన ఆమె కొద్ది సేపు ‘సాక్షి’తో చిట్చాట్ చేసింది. మీ స్వస్థలం...? బెంగళూరు, కర్నాటక చిత్రరంగ ప్రవేశం ఎలా.? మోడల్గా రాణిస్తుండగా 2008లో కన్నడ చిత్రంలో అవకాశం వచ్చింది. ఎన్ని చిత్రాలు చేశారు? తమిళంలో 17 చిత్రాలు చేశాను. తెలుగులో ఎలా..? ఎక్కడకు పోతావు చిన్నవాడా చిత్రంలో తెలుగులో మొదటి చిత్రం చేశాను. దీనిలో అమల పాత్ర ఎంతో పేరు తెచ్చింది. రాబోయే చిత్రాలు? తెలుగులో రెండు చిత్రాల్లో అవకాశం వచ్చింది. వివరాలు త్వరలో వెల్లడిస్తాను. ఏ భాషకు ప్రాధాన్యం ఇస్తారు? తెలుగుకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాను. ఇక్కడి అభిమానులు ఆత్మీయత మర్చిపోలేను. అవార్డులు? తమిళంలో ఓ చిత్రంతో పాటు తెలుగులో మొదటి చిత్రం ఎక్కడకు పోతావు చిన్నవాడా చిత్రానికి ఫిలింఫేర్ అవార్డు అందుకున్నాను. లక్ష్యం? తెలుగు చిత్రపరిశ్రమలో మంచి నటిగా గుర్తింపు పొందాలని ఉంది. -
అదో వింత అనుభవం
ఆ పాత్ర విన్నప్పుడు పెద్దదిగానే ఉంది అని చెప్పుకొచ్చింది నటి నందిత. మరి ఆ కథేంటో చూద్దామా‘ తొలి చిత్రం అట్టకత్తిలోనే పాఠశాల, కళాశాల విద్యార్థినిగా విభిన్న అభినయాన్ని ప్రదర్శించి ప్రశంసలు అందుకున్న ఈ భామ ఎదిర్నీశ్చల్ లాంటి చిత్రాల్లో నటిగా మంచి పేరు తెచ్చుకుంది. అయితే ఇప్పటి వరకూ హోమ్లీ పాత్రలతో అలరించిన నందిత తాజాగా తన రూట్ మార్చుకుందట. ఇకపై అందాల నందితను చూస్తానంటున్న ఈ బ్యూటీ చేతి నిండా చిత్రాలతో బిజీగానే ఉంది. ప్రస్తుతం సెల్వరాఘవన్ చిత్రం నెంజమ్ మరప్పదిల్లై చిత్ర విడుదల కోసం ఎదురు చూస్తోందట. ఈ అమ్మడితో చిట్చాట్... సెల్వరాఘవన్ దర్శకత్వంలో నటించిన అనుభవం గురించి? జ: సెల్వరాఘవన్ తన చిత్రం నెంజమ్ మరప్పదిల్లైలో నటించమని అడినప్పుడు నేను నమ్మలేక పోయాను. సాధారణంగా ఆయన చిత్రాల్లో హీరోయిన్లకు అధిక ప్రాధాన్యత ఉంటుంది.అందుకే అందరు హీరోయిన్లు ఆయన దర్శకత్వంలో నటించాలని కోరుకుంటారు. నెంజమ్రప్పుదిల్లై చిత్రం ప్రచారాల్లో, పోస్టర్లలో తాను అధికంగా కనిపించకపోవచ్చు. అయితే చిత్రం చూసిన తరువాత ప్రేక్షకులు తన పాత్ర గురించే మాట్లాడుకుంటారు. వణంగాముడి చిత్రంలో పోలీసు అధికారిణిగా నటిస్తున్నారట? జ: ఇప్పుటి వరకూ నందితను హోమ్లీ పాత్రల్లోనే చూశారు. వణంగాముడి చిత్రంలో వేరే నందితను చూస్తారు. ఇందులో యక్షన్ సన్నివేశాల్లోనూ నటించాను. నేను కొంచెం డాన్స్ కూడా నేర్చుకున్నాను. దాన్ని ఈ చిత్రంలో వాడుకునే అవకాశం కలిగింది. వైవిధ్యభరిత కథా పాత్రల్లో నటించాలని చెప్పడం కాదు. దాన్ని చేతల్లో చూపాలి. నేను మాత్రం విభిన్న కథా పాత్రలనే ఎంపిక చేసుకుని నటిస్తున్నాను. అలాంటి చిత్రాల్లో ఈ వణంగాముడి ఒకటి. ఇతర భాషా చిత్రాలపైనా దృష్టి సారిస్తున్నట్లున్నారు? జ: నిజం చెప్పాలంటే నేను కన్నడ చిత్రాల్లో నటించిన తరువాతే తమిళంలోకి వచ్చాను. ఇప్పుడు ఇక్కడ చేతి నిండా చిత్రాలు ఉండడంతో ఇతర భాషా చిత్రాలపై దృష్టి సారించలేకపోతున్నాను.ఆ మధ్య ఎక్కిడికి పోతావే చిన్నదానా అనే తెలుగు చిత్రంలో నటించాను. ఆ చిత్రం నోట్ల రద్దు తరుణంలో విడుదలైనా మంచి వసూళ్లను రాబట్టింది. చాలా మంది ప్రముఖ నటీమణులు నటించడానికి నిరాకరించిన పాత్రను నేను అందులో నటించాను. విజయ్ నటించిన పులి చిత్రంలో చాలా చిన్న పాత్రలో నటించడానికి కారణం? జ: ఓ..ఆ విషయం మీకు ఇంకా గుర్తుందా‘ నేనెప్పుడో మరిచిపోయాను. వాస్తవమేమిటంటే ఆ పాత్ర నాకు చెప్పినప్పుడు పెద్దగానే ఉంది. ఆ తరువాత చిత్రం థియేటర్కు వచ్చినప్పుడు చిన్నదిగా మారిపోయింది. ఆ విషయం గురించి ఇప్పుడు చర్చించడంలో ప్రయోజనం ఏముంది? అదో అనుభవంగా భావిస్తాను. -
ఆయన ఫోన్ కాల్ రాగానే ఒప్పుకున్నా..
కన్నడ నటి నందితా శ్వేత ఇప్పుడు కోలీవుడ్లోనూ వరుస అవకాశాలతో దూసుకు పోతోంది. తొలి చిత్రం అట్టకత్తితోనే సక్సెస్ను అందుకున్న లక్కీ నటి ఆమె. ఆ తరువాత వరుసగా ఎదిర్నీశ్చల్, తిరుడన్ పోలీస్ చిత్రాల్లో నటించి కథానాయకిగా నందిత మంచి గుర్తింపు పొందింది. శివకార్తికేయన్, విజయ్ సేతుపతి వంటి యువ నటులతో రొమాన్స్ చేసిన తామె ఎందుకనో స్టార్ హీరోయిన్ ఇమేజ్ను ఇంకా అందుకోలేకపోయింది. అయితే గత ఏడాది ‘ఎక్కడికి పోతావు చిన్నదానా’ చిత్రంతో టాలీవుడ్కు పరిచయమైన ఈ కన్నడ బ్యూటీ ప్రస్తుతం ఈ రెండు భాషల్లోనూ మంచి అవకాశాలు వస్తున్నాయి అంటోంది. సెల్వరాఘవన్ దర్శత్వంలో నెంజం మరప్పదిలై చిత్రంలో ఎస్జే.సూర్యకు జంటగా నటిస్తున్నారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. నందితా శ్వేతా మాట్లాడుతూ సెల్వరాఘవన్ తన అభిమాన దర్శకుడని పేర్కొంది. ఆయన నుంచి ఫోన్ కాల్ రాగానే మరో మాట లేకుండా ఈ నెంజం మరప్పదిల్లై చిత్రంలో నటించడానికి అంగీకరించానని పేర్కొంది. ఆ తరువాతే ఇందులో ఎస్జే.సూర్య కథానాయకుడన్న విషయం తెలిసిందని చెప్పింది. ఈ చిత్రంలో తనకు ఎస్జే.సూర్యతో రొమాన్స్ను మించి నటనకు అవకాశం పాత్ర లభించిందని అంది. యాక్షన్ సన్నివేశాలు కూడా ఉంటాయని చెప్పింది. ప్రస్తుతం మూడు చిత్రాలతో బిజీగా ఉన్నట్లు తెలిపింది. అందులో అరవిందస్వామికి జంటగా నటిస్తున్న వనంగముడి చిత్రం ఒకటని,. ఇందులో పోలీస్ పాత్రలో నటించడం మంచి అనుభవంగా పేర్కొంది. అదే విధంగా చతురంగవేట్టై తెలుగు రీమేక్లో నటిస్తున్నానని తెలిపింది. ఎలాంటి పాత్రలు పోషించాలని ఆశిస్తున్నారని అడుగుతున్నారని, తాను తమిళంలో అభినయానికి అవకాశం ఉన్న పాత్రలను, తెలుగులో గ్లామర్ పాత్రలను కోరుకుంటున్నానని చెప్పింది. -
హ్యాండ్సమ్ స్టార్తో నిఖిల్ హీరోయిన్
ఎక్కడికీ పోతావు చిన్నవాడా సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన అందాల భామ నందిత శ్వేత. తొలి సినిమాతోనే తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటి.. ఇప్పుడు సౌత్లో వరుస సినిమాలతో బిజీ అవుతోంది. ఇప్పటికే అడవి శేష్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో నందిత హీరోయిన్గా నటిస్తోంది. తమిళ్లో ఘనవిజయం సాధించిన శతురంగ వెట్టై సినిమాకు రీమేక్గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. తాజాగా మరో ఇంట్రస్టింగ్ సినిమాకు ఓకె చెప్పింది ఈ బ్యూటి. కోలీవుడ్ హ్యాండ్సమ్ స్టార్ అరవింద్ స్వామిగా హీరో తెరకెక్కుతున్న వనన్గమూడి సినిమాలో నందిత హీరోయిన్గా నటించనుంది. సెల్వ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నందిత పోలీస్ గెటప్లో దర్శనమివ్వనుందన్న టాక్ వినిపిస్తోంది. ఈ మూవీలో నందితతో పాటు రితికా సింగ్, చాందినీలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. -
హీరోయిన్కు ఫోన్ చేసి సర్ప్రైజ్ చేసిన బన్నీ