New Zealand vs South Africa
-
గ్రీన్ భారీ సెంచరీ.. సౌతాఫ్రికాను చిత్తు చేసిన న్యూజిలాండ్
వెల్లింగ్టన్ వేదికగా సౌతాఫ్రికా మహిళల జట్టుతో జరిగిన మూడో వన్డేలో 66 పరుగుల తేడాతో న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్ను 2-1తో న్యూజిలాండ్ అమ్మాయిల జట్టు సొంతం చేసుకుంది. ఈ సిరీస్ డిసైడర్ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన కివీస్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 306 పరుగులు చేసింది.కివీస్ ఆరంభంలోనే సుజీ బేట్స్(0), ప్లిమ్మర్(1), అమీలియా కెర్(0) వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ సమయంలో న్యూజిలాండ్ మిడిలార్డర్ బ్యాటర్లు మాడీ గ్రీన్, బ్రూక్ హాలిడే అద్భుతమైన ఇన్నింగ్స్లు ఆడారు. వీరిద్దరూ నాలుగో వికెట్కు 211 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పారు.మ్యాడీ గ్రీన్ (128 బంతుల్లో15 ఫోర్లతో 141 నాటౌట్) అజేయ సెంచరీతో సత్తాచాటగా.. హాలిడే (98) తృటిలో సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయింది. సౌతాఫ్రికా బౌలర్లలో అయాండా హ్లూబి, తుమి సెఖుఖునే తలో రెండు వికెట్లు పడగొట్టగా.. నడైన్ డిక్లార్క్, మలబా చెరో వికెట్ సాధించారు.అనంతరం 307 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా 46.1 ఓవర్లలో 240 పరుగులకు ఆలౌటైంది. దక్షిణాఫ్రికా బ్యాటర్లలో లారా వోల్వడర్ట్(69) టాప్ స్కోరర్గా నిలవగా..అన్నెరీ డెర్క్సెన్(47), ట్రయన్(29) ఫర్వాలేదన్పించారు. మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. కాగా ప్లేయర్ ఆఫ్ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ది సిరీస్ అవార్డు రెండు కూడా మాడీ గ్రీన్కే దక్కాయి. -
న్యూజిలాండ్ ప్లేయర్ ప్రపంచ రికార్డు
న్యూజిలాండ్ క్రికెటర్ అమేలియా కెర్ సరికొత్త చరిత్ర సృష్టించింది. మహిళల వన్డే క్రికెట్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన నాన్- ఓపెనర్ బ్యాటర్గా ప్రపంచ రికార్డు సాధించింది. కాగా సౌతాఫ్రికా మహిళా జట్టుతో స్వదేశంలో న్యూజిలాండ్ వైట్బాల్ సిరీస్లు ఆడుతోంది.ఇందులో భాగంగా తొలుత టీ20 సిరీస్ జరుగగా ఆతిథ్య న్యూజిలాండ్ 4-1 తేడాతో సౌతాఫ్రికాను చిత్తు చేసింది. ఇక ఇరుజట్ల మధ్య వన్డే సిరీస్లో తొలి మ్యాచ్లో సౌతాఫ్రికా గెలవగా.. వెల్లింగ్టన్ వేదికగా బుధవారం రెండో వన్డే జరిగింది.346 పరుగులుటాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సఫారీ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 346 పరుగులు చేసింది. కెప్టెన్ వాల్వర్ట్ (69; 8 ఫోర్లు, 1 సిక్స్), అనికె బాష్ (91; 12 ఫోర్లు), ట్రియాన్ (25 బంతుల్లో 52 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్స్లు) హాఫ్సెంచరీలతో రాణించారు. అనంతరం ఛేదనలో న్యూజిలాండ్ 49.4 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 350 పరుగులు చేసి.. రెండు వికెట్ల తేడాతో గెలిచింది. మహిళల వన్డే క్రికెట్లో ఇదే అత్యధిక ఛేదన కావడం విశేషం.139 బంతుల్లో 179 పరుగులతో అజేయంగాగతేడాది ఆస్ట్రేలియాపై టీమిండియా ఛేజ్ చేసిన 339 పరుగుల స్కోరు రెండో స్థానానికి చేరింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, కివీస్ సారథి అమేలియా కెర్ (Amelia Kerr) ఆకాశమే హద్దుగా చెలరేగింది. వన్డౌన్లో బ్యాటింగ్ చేసిన ఆమె మొత్తంగా 139 బంతుల్లో 179 పరుగులతో అజేయంగా నిలిచింది.కెర్ ఇన్నింగ్స్లో 23 ఫోర్లు, 1 సిక్స్ ఉండటం విశేషం. ఇలా కెప్టెన్ ఇన్నింగ్స్తో కెర్ న్యూజిలాండ్ను విజయతీరాలకు చేర్చగా... ఆమెకు ఇసాబెల్లా (68;11 ఫోర్లు) చక్కటి సహకారం అందించింది. సఫారీ బౌలర్లలో ఖాకా 3 వికెట్లు పడగొట్టింది. తొలి మ్యాచ్లో దక్షిణాఫ్రికా విజయం సాధించగా... ప్రస్తుతం సిరీస్ 1–1తో సమమైంది.అమేలియా కెర్ ప్రపంచ రికార్డుసౌతాఫ్రికాతో రెండో వన్డే సందర్భంగా అమేలియా కెర్ 179 పరుగులతో అజేయంగా నిలవడం ద్వారా.. మహిళల వన్డే చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన నాన్- ఓపెనింగ్ ప్లేయర్గా రికార్డు సాధించింది. ఇంతకు ముందు ఈ రికార్డు శ్రీలంక దిగ్గజం చమరి ఆటపట్టు పేరిట ఉండేది.బ్రిస్టల్ వేదికగా 2017లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో ఆటపట్టు 178 పరుగులతో అజేయంగా నిలిచింది. తాజాగా ఆమె కంటే ఒక్క పరుగు ఎక్కువ చేసిన అమేలియా కెర్.. ఆటపట్టును అధిగమించింది. ఈ జాబితాలో టీమిండియా కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (171), న్యూజిలాండ్ స్టార్లు సుజీ బేట్స్ (168), బీఎమ్ హైల్డే (157) కెర్, ఆటపట్టు తర్వాతి స్థానాల్లో నిలిచారు.చదవండి: నాకైతే భయం వేస్తోంది: వైభవ్ సూర్యవంశీపై పాక్ మాజీ క్రికెటర్ల వ్యాఖ్యలు -
చరిత్ర సృష్టించిన న్యూజిలాండ్.. ప్రపంచంలోనే తొలి జట్టుగా
వెల్లింగ్టన్ వేదికగా దక్షిణాఫ్రికా మహిళలతో జరిగిన రెండో వన్డేలో న్యూజిలాండ్ అమ్మాయిల జట్టు చారిత్రత్మక విజయాన్ని అందుకుంది. సౌతాఫ్రికా నిర్ధేశించిన 347 పరుగుల లక్ష్యాన్ని చేధించి భారత్ పేరిట ఉన్న వరల్డ్ రికార్డును కివీస్ తిరగరాసింది. మహిళల వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక రన్ ఛేజ్ చేసిన జట్టుగా న్యూజిలాండ్ రికార్డులెక్కింది. ఇంతకుముందు వరకు ఈ రికార్డు భారత మహిళల జట్టు పేరిట ఉండేది. వన్డే ప్రపంచకప్-2025లో ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్లో ఉమెన్ ఇన్ బ్లూ.. 339 పరుగులు టార్గెట్ను చేజ్ చేసింది. ఇప్పుడు ఈ రికార్డును కివీస్ బ్రేక్ చేసింది.ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 346 పరుగుల భారీ స్కోర్ సాధించింది. దక్షిణాఫ్రికా బ్యాటర్లలో అన్నేకే బోష్(91) టాప్ స్కోరర్గా నిలవగా.. కెప్టెన్ లారా వోల్వార్డ్(69), ట్రయోన్(52), జాఫ్టా(37) రాణించారు.అదరగొట్టిన అమెలియా..ఇక ఈ భారీ లక్ష్య చేధనలో కివీస్ కెప్టెన్ అమెలియా కెర్ అద్భుతం చేసింది. సుజీ బేట్స్(8), ప్లిమ్మర్(23), మ్యాడీ గ్రీన్(13) వంటి స్టార్ బ్యాటర్లు విఫలమైన చోట అమెలియా సంచలన ఇన్నింగ్స్ ఆడింది. ఓ వైపు క్రమం తప్పుకుండా వికెట్లు పడుతున్నప్పటికి కెర్ మాత్రం తన విధ్వంసకర బ్యాటింగ్ను కొనసాగించింది.ఈ క్రమంలో అమెలియా కేవలం 90 బంతుల్లోనే తన ఐదువ వన్డే సెంచరీ మార్క్ను అందుకుంది. ఆఖరి ఓవర్లో 11 పరుగులు అవసరం కాగా.. అమెలియా కేర్ వరుసగా మూడు బౌండరీలు బాది తమ జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించింది. మొత్తంగా మహిళల వన్డే క్రికెట్లో లక్ష్య చేధనలో అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన రెండో ప్లేయర్గా కెర్ నిలిచింది. అదేవిధంగా న్యూజిలాండ్ గడ్డపై వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన ఉమెన్స్ ప్లేయర్గా కూడా కెర్ రికార్డు నెలకొల్పింది.మహిళల వన్డేల్లో అత్యధిక రన్ ఛేజ్ చేసిన జట్లు ఇవేన్యూజిలాండ్-347-ప్రత్యర్ధి- సౌతాఫ్రికాభారత్-339- ప్రత్యర్ధి- ఆస్ట్రేలియాఆస్ట్రేలియా-331- ప్రత్యర్ధి భారత్చదవండి: మాక్స్వెల్కు షాకిచ్చిన క్రికెట్ ఆస్ట్రేలియా -
చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా ప్లేయర్.. ప్రపంచ రికార్డు
సౌతాఫ్రికా క్రికెటర్ కానర్ ఎస్తురూజెన్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. టీ20లలో న్యూజిలాండ్పై అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన నాన్ ఓపెనింగ్ వికెట్ కీపర్ బ్యాటర్గా నిలిచాడు ఎస్తురూజెన్.సంగక్కర రికార్డు బద్దలుతద్వారా శ్రీలంక దిగ్గజం కుమార్ సంగక్కర 2009లో నెలకొల్పిన రికార్డును ఎస్తురూజెన్ బద్దలు కొట్టాడు. కాగా ఐదు టీ20 మ్యాచ్ల సిరీస్ ఆడేందుకు సౌతాఫ్రికా జట్టు న్యూజిలాండ్కు వెళ్లింది. ఈ సిరీస్లో ఎస్తురూజెన్ మొత్తంగా 200 పరుగులు స్కోరు చేశాడు. ఇందులో రెండు అర్ధ శతకాలు ఉన్నాయి.ఇక బుధవారం ముగిసిన ఐదో టీ20లో ఎస్తురూజెన్ 33 బంతుల్లో 75 పరుగులు సాధించాడు. తద్వారా అంతర్జాతీయ టీ20లలో న్యూజిలాండ్పై అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన నాన్ ఓపెనింగ్ వికెట్ కీపర్ బ్యాటర్గా చరిత్రకెక్కాడు. 2009లో సంగక్కర కివీస్పై 69 పరుగులు చేశాడు. 33 పరుగుల తేడాతో..మ్యాచ్ విషయానికొస్తే.. క్రైస్ట్చర్చ్ వేదికగా బుధవారం జరిగిన నిర్ణయాత్మక పోరులో కేశవ్ మహరాజ్ సారథ్యంలోని సౌతాఫ్రికా జట్టు 33 పరుగుల తేడాతో.. ఆతిథ్య న్యూజిలాండ్ను మట్టికరిపించింది. తద్వారా ఐదు మ్యాచ్ల సిరీస్ను 3–2తో చేజిక్కించుకుంది. ఈ సిరీస్ ద్వారానే నలుగురుసౌతాఫ్రికా ప్లేయర్లు అరంగేట్రం చేసినా... వారంతా సమయానుకూలంగా మెరిపించడంతో సఫారీ జట్టు సులువుగా సిరీస్ కైవసం చేసుకుంది.ధనాధన్ హాఫ్సెంచరీన్యూజిలాండ్ గడ్డపై దక్షిణాఫ్రికా 2012లో 2–1తో... 2017లో 1–0తో టీ20 సిరీస్లను సొంతం చేసుకుంది. ఇక చివరిదైన ఐదో మ్యాచ్లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. గత మ్యాచ్లో అర్ధశతకంతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన కానర్ ఎస్తురూజెన్ (33 బంతుల్లో 75; 5 ఫోర్లు) మరోసారి ధనాధన్ హాఫ్సెంచరీతో చెలరేగాడు.రుబిన్ హెర్మన్ (39; 4 ఫోర్లు, 1 సిక్స్), ముల్డర్ (31; 2 ఫోర్లు, 2 సిక్స్లు) అతడికి సహకరించారు. కివీస్ బౌలర్లు ఆరంభంలో కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో... పరుగుల రాక గగనమైంది. దీంతో 11 ఓవర్లు ముగిసేసరికి సౌతాఫ్రికా 79/2తో నిలిచింది. ఈ దశలో కానర్ భారీ షాట్లతో చెలరేగిపోయాడు.నాలుగో వికెట్కు ఫోరెస్టర్ (21 నాటౌట్)తో కలిసి కానర్ 27 బంతుల్లో 61 పరుగులు జోడించడంతో సఫారీ జట్టు మంచి స్కోరు చేయగలిగింది. చివరి 10 ఓవర్లలో సౌతాఫ్రికాకా 111 పరుగులు రాబట్టింది. న్యూజిలాండ్ బౌలర్లలో బెన్ సీర్స్ రెండు వికెట్లు పడగొట్టాడు.154 పరుగులకు పరిమితంఅనంతరం ఓ మాదిరి లక్ష్యఛేదనలో న్యూజిలాండ్ తడబడింది. 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 154 పరుగులకు పరిమితమైంది. బెవాన్ జాకబ్స్ (19 బంతుల్లో 36; 2 ఫోర్లు, 3 సిక్స్లు) టాప్ స్కోరర్ కాగా... కెప్టెన్ జేమ్స్ నీషమ్ (24), టిమ్ రాబిన్సన్ (25), క్లీవర్ (22) తలా కొన్ని పరుగులు చేశారు.అయితే, కివీస్ బ్యాటర్లు మంచి ఆరంభాలను భారీ స్కోర్లుగా మలచలేకపోవడంతో... ఆ జట్టుకు పరాజయం తప్పలేదు. సౌతాఫ్రికా బౌలర్లలో కోట్జీ, ముల్డర్, బార్ట్మన్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. కానర్ ఎస్తురూజెన్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు దక్కాయి. చదవండి: IPL 2026: ప్యాట్ కమ్మిన్స్ కీలక ప్రకటన -
సౌతాఫ్రికాకు మరో క్లాసెస్ దొరికాడు..!
న్యూజిలాండ్కు సొంతగడ్డపై పరాభవం ఎదురైంది. ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను పర్యాటక సౌతాఫ్రికా 3-2 తేడాతో కైవసం చేసుకుంది. క్రైస్ట్ చర్చ్ వేదికగా ఇవాళ (మార్చి 25) జరిగిన నిర్ణయాత్మక ఐదో మ్యాచ్లో సఫారీ జట్టు 33 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నాలుగో నంబర్ ఆటగాడు, వికెట్ కీపర్ బ్యాటర్ కానర్ ఎస్టర్హ్యూజన్ (33 బంతుల్లో 75; 5 ఫోర్లు, 6 సిక్సర్లు) విధ్వంసకర అర్ద శతకంతో విరుచుకుపడటంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది.మిగతా ఆటగాళ్లలో వియాన్ ముల్దర్ (31), రూబిన్ హెర్మన్ (39) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ఆఖర్లో డియాన్ ఫార్రెస్టర్ (21 నాటౌట్; ఫోర్, సిక్స్) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. టోని డి జోర్జి (12) నిరాశపర్చగా.. జేసన్ స్మిత్ ఒక్క పరుగుతో అజేయంగా నిలిచాడు. న్యూజిలాండ్ బౌలర్లలో బెన్ సియర్స్ 2, జకరీ ఫౌల్క్స్, జోష్ క్లార్క్సన్ తలో వికెట్ తీశారు.అనంతరం 188 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన న్యూజిలాండ్.. సఫారీ బౌలర్ల ధాటికి తడబడింది. నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 154 పరుగులే చేసి పరాజయంపాలైంది. గెరాల్డ్ కొయెట్జీ, వియాన్ ముల్దర్, ఓట్నీల్ బార్ట్మన్ తలో 2, కెప్టెన్ కేశవ్ మహారాజ్ ఓ వికెట్ తీసి న్యూజిలాండ్ను కట్టడి చేశారు. వికెట్లు తీయకపోయినా ప్రెనెలన్ సుబ్రాయెన్ (4-0-22-0) అద్బుతంగా బౌలింగ్ చేశాడు. కివీస్ ఇన్నింగ్స్లో ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు. 36 పరుగులతో బెవాన్ జాకబ్స్ టాప్ స్కోరర్గా నిలిచాడు. టిమ్ రాబిన్సన్ 25, డేన్ క్లీవర్ 22, నిక్ కెల్లీ 14, కేటీన్ క్లార్క్ 2, కెప్టెన్ జిమ్మీ నీషమ్ 24, జోష్ క్లార్క్సన్ 13, కోల్ మెక్కోంచి 1, జకరీ ఫౌల్క్స్, కైల్ జేమీసన్ తలో 4 పరుగులతో అజేయంగా నిలిచారు.మరో క్లాసెస్ దొరికాడు..!ఈ సిరీస్తో సౌతాఫ్రికాకు మరో క్లాసెన్ దొరికాడు. క్లాసెన్ లాగే వికెట్కీపర్ బ్యాటర్ అయిన కానర్ ఎస్టర్హ్యూజన్ విధ్వంసకర బ్యాటింగ్ శైలితో క్లాసెన్కు తలపించాడు. కానర్ వికెట్ల వెనకాల కూడా పర్వాలేదనిపించాడు. నేటి మ్యాచ్లో విధ్వంసకర హాఫ్ సెంచరీతో తన జట్టుకు సిరీస్ విజయాన్ని అందించిన కానర్.. దీనికి ముందు మ్యాచ్లోనూ ఇదే తరహాలో చెలరేగాడు. ఆ మ్యాచ్లో 36 బంతులు ఎదుర్కొని 7 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 57 పరుగులు చేశాడు. ఇదే సిరీస్తో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన కానర్.. 5 మ్యాచ్ల్లో 145కు పైగా స్ట్రయిక్ రేట్తో 200 పరుగులు చేశాడు. తద్వారా ఐదో టీ20లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్తో పాటు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు కూడా గెలుచుకున్నాడు. క్లాసెన్ రిటైరయ్యాక సౌతాఫ్రికాకు ఆ స్థాయి బ్యాటర్గా కానర్ గుర్తింపు తెచ్చుకున్నాడు. -
నాలుగో టీ20లో సౌతాఫ్రికా చిత్తు.. సిరీస్ న్యూజిలాండ్ సొంతం
వెల్లింగ్టన్ వేదికగా దక్షిణాఫ్రికాతో మహిళలతో జరిగిన నాలుగో టీ20లో న్యూజిలాండ్ ఉమెన్స్ టీమ్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్ల సిరీస్ను 3-1తో న్యూజిలాండ్ సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది.ప్రోటీస్ ఆల్రౌండర్ అనేరీ డెర్క్సెన్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడింది. కేవలం 32 బంతుల్లో 8 ఫోర్లు, ఒక సిక్సర్తో 55 పరుగులు చేసింది. ఆమెతో పాటు లాస్ 30 పరుగులతో రాణించింది. న్యూజిలాండ్ బౌలర్లలో జెస్ కెర్ 3 వికెట్లతో అదరగొట్టింది. అనంతరం 160 పరుగుల లక్ష్యాన్ని కివీస్ జట్టు 18.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కివీస్ స్టార్ ఆల్రౌండర్ సోఫీ డివైన్ మరోసారి విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడింది. కేవలం 34 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 64 పరుగులు చేసింది. ఆమెతో పాటు అమీలియా కేర్ 31 పరుగులతో రాణించింది. సౌతాఫ్రికా బౌలర్లలో క్లో ట్రయాన్ 2 వికెట్లు తీసింది. ఇక ఇరు జట్ల మధ్య నామమాత్రపు ఐదో టీ20 క్రైస్ట్చర్చ్ వేదికగా మార్చి 25న జరగనుంది.చదవండి: IPL 2026: '250 స్కోర్ కొట్టినా.. సన్రైజర్స్ ఓడిపోతుంది' -
ప్రతీకారం తీర్చుకున్న న్యూజిలాండ్
తొలి టీ20లో సౌతాఫ్రికా చేతిలో ఎదురైన పరాభవానికి న్యూజిలాండ్ ప్రతీకారం తీర్చుకుంది. రెండో టీ20 మ్యాచ్లో సఫారీ జట్టును మట్టికరిపించి జయభేరి మోగించింది. టీ20 ప్రపంచకప్-2026లో రన్నరప్గా నిలిచిన కివీస్.. ప్రస్తుతం స్వదేశంలో ఐదు టీ20 మ్యాచ్ల సిరీస్తో బిజీగా ఉంది.ఇందులో భాగంగా ఆదివారం మౌంట్ మౌంగనీ వేదికగా ప్రొటిస్తో తొలి టీ20లో తలపడ్డ న్యూజిలాండ్.. ఏడు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. తాజాగా హామిల్టన్లో మంగళవారం నాటి మ్యాచ్లో టాస్ ఓడిన కివీస్.. సౌతాఫ్రికా ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్కు దిగింది.డెవాన్ కాన్వే అర్ధ శతకంటాపార్డర్లో ఓపెనర్ టామ్ లాథమ్ (11), వన్డౌన్ బ్యాటర్ టిమ్ రాబిన్సన్ (1) నిరాశపరచగా.. మరో ఓపెనర్ డెవాన్ కాన్వే అర్ధ శతకం (60)తో ఆకట్టుకున్నాడు. మిగిలిన వారిలో నిక్ కెలీ (12 బంతుల్లో 21), కెప్టెన్ మిచెల్ సాంట్నర్ (14 బంతుల్లో 21) ఫర్వాలేదనిపించగా.. కోల్ మెకాంచి (12 బంతుల్లో 18), జోష్ క్లార్క్సన్ (9 బంతుల్లో 26) మెరుపు ఇన్నింగ్స్తో అజేయంగా నిలిచారు.ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో న్యూజిలాండ్ ఆరు వికెట్ల నష్టానికి 175 పరుగులు సాధించింది. సఫారీ బౌలర్లలో వియాన్ ముల్డర్ రెండు వికెట్లు తీయగా.. గెరాల్డ్ కోయెట్జి, ఒట్నీల్ బార్ట్మాన్, కెప్టెన్ కేశవ్ మహరాజ్, జార్జ్ లిండే తలా ఒక వికెట్ దక్కించుకున్నారు.ఆదిలోనే ఎదురుదెబ్బలులక్ష్య ఛేదనకు దిగిన సౌతాఫ్రికాకు ఆదిలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. ఓపెనర్లలో కొన్నోర్ ఎస్తరూజెన్ (8)ను బెన్ సియర్స్ వెనక్కి పంపగా.. వియాన్ ముల్డర్ (16)ను సాంట్నర్ అవుట్ చేశాడు. వన్డౌన్లో వచ్చిన టోనీ జార్జి (1) మెకాంచీ బౌలింగ్లో పెవిలియన్ చేరాడు.107 పరుగులకే ఆలౌట్ మిగిలిన వారిలో రూబిన్ హెర్మాన్ (19) ఫర్వాలేదనిపించగా.. జార్జ్ లిండే 12 బంతుల్లో 33 పరుగులు చేశాడు. మిగిలిన వారంతా చేతులెత్తేయడంతో 15.3 ఓవర్లలో 107 పరుగులకే సౌతాఫ్రికా ఆలౌట్ అయింది. ఫలితంగా న్యూజిలాండ్ 68 పరుగుల తేడాతో గెలిచి సిరీస్ను ప్రస్తుతానికి 1-1తో సమం చేసింది.కివీస్ బౌలర్లలో లాకీ ఫెర్గూసన్, బెన్ సియర్స్ చెరో మూడు వికెట్లతో చెలరేగగా.. సాంట్నర్ రెండు, మెకాంచి, జేమ్స్ నీషమ్ తలా ఒక వికెట్ పడగొట్టారు. న్యూజిలాండ్- సౌతాఫ్రికా మధ్య శుక్రవారం నాటి మూడో టీ20కి ఆక్లాండ్లోని ఈడెన్ పార్క్ వేదిక.చదవండి: టీమిండియా టీ20 కెప్టెన్గా ఊహించని పేరు! -
NZ vs SA: న్యూజిలాండ్కు మరో షాక్!
సౌతాఫ్రికాతో తొలి టీ20లో ఓడిన న్యూజిలాండ్ క్రికెట్ జట్టుకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్పిన్నర్ ఇష్ సోధికి గాయమైంది. సౌతాఫ్రికాతో తొలి టీ20 మ్యాచ్కు ముందు నెట్స్లో బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో సోధి బొటనవేలుకు గాయం కాగా.. స్కానింగ్లో భాగంగా వేలు విరిగిపోయినట్లు తేలింది.నాలుగు వారాల విశ్రాంతి ఫలితంగా ఇష్ సోధికి నాలుగు వారాల పాటు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. ఈ క్రమంలో సౌతాఫ్రికాతో తొలి టీ20కి దూరమైన ఈ రైటార్మ్ స్పిన్నర్.. మిగిలిన రెండు టీ20 మ్యాచ్లకూ దూరమయ్యాడు. ఇదిలా ఉంటే.. సఫారీలతో రెండో టీ20 సందర్భంగా కివీస్ స్పీడ్స్టర్ లాకీ ఫెర్గూసన్ జట్టుతో చేరనున్నాడు.కాగా టీ20 ప్రపంచకప్-2026 ఫైనల్లో టీమిండియా చేతిలో ఓడి రన్నరప్గా నిలిచిన న్యూజిలాండ్.. స్వదేశంలో సౌతాఫ్రికాతో ఐదు టీ20ల సిరీస్ ఆడుతోంది. ఇందులో భాగంగా మౌంట్ మాంగనీ వేదికగా ఆదివారం తొలి టీ20లో సఫారీ జట్టుతో తలపడింది.91 పరుగులకే ఆలౌట్ఈ మ్యాచ్లో దక్షిణాఫ్రికా జట్టు 7 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ను చిత్తుచేసింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్... 14.3 ఓవర్లలో 91 పరుగులకే ఆలౌటైంది. నీషమ్ (21 బంతుల్లో 26 2 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్ కాగా... మిగిలిన వాళ్లంతా విఫలమయ్యారు. కాన్వే (1), లాథమ్ (7), రాబిన్సన్ (6), అరంగేట్ర ఆటగాడు నిక్ కెల్లీ (2), జాకబ్స్ (10), సాంట్నర్ (15) విఫలమయ్యారు.ఎన్కబని మొకొనాకు 3 వికెట్లుఇక ఈ మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ టి20 అరంగేట్రం చేసిన నలుగురు సఫారీ ప్లేయర్లు విజయంలో కీలక పాత్ర పోషించారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ఎన్కబని మొకొనా (Nqobani Mokoena) 3 వికెట్లు పడగొట్టగా... కోట్జీ, బార్ట్మన్, కెప్టెన్ కేశవ్ మహరాజ్ తలా రెండు వికెట్లు తీశారు.సాంట్నర్ 4 ఓవర్లలో 8 పరుగులే ఇచ్చిఅనంతరం స్వల్ప లక్ష్యఛేదనలో సఫారీ జట్టు 16.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 93 పరుగులు చేసింది. వికెట్ కీపర్ కానర్ ఎస్తెర్హుజెన్ (48 బంతుల్లో 45 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. న్యూజిలాండ్ కెప్టెన్ సాంట్నర్ 4 ఓవర్లలో 8 పరుగులే ఇచ్చి ఒక వికెట్ పడగొట్టాడు.ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్ ద్వారా నలుగురు (కానర్ ఎస్లుర్హుజెన్, డియాన్ ఫారెస్టర్, జోర్డాన్ హెర్మన్, ఎన్కబరి మొకొనా) సౌతాఫ్రికా ఆటగాళ్లు అరంగేట్రం చేశారు. ఇరు జట్ల మధ్య హామిల్టన్లో మంగళవారం రెండో టీ20 నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. చదవండి: అతడి ఆట అసాధారణం.. గంభీర్పై ద్రవిడ్ ప్రశంసలు -
న్యూజిలాండ్పై సౌతాఫ్రికా ఘన విజయం
న్యూజిలాండ్ పర్యటనను సౌతాఫ్రికా ఘనంగా ఆరంభించింది. మౌంట్ మంగునూయ్ వేదికగా జరిగిన తొలి టీ20లో కివీస్పై 7 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్ల సిరీస్లో ప్రోటీస్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది.మార్క్రమ్, డికాక్, రబాడ, ఎంగిడి వంటి సీనియర్లు లేనిప్పటికి.. కేశవ్ మహారాజ్ సారథ్యంలో ప్రోటీస్ యువ జట్టు అద్భుతంగా రాణించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 14.3 ఓవర్లలో కేవలం 91 పరుగులకే కుప్పకూలింది. సఫారీ బౌలర్ల దాటికి కివీస్ బ్యాటర్లు విల్లవిల్లాడారు. కివీస్ బ్యాటర్లలో నీషమ్(26) టాప్ స్కోరర్గా నిలిచాడు. మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. ప్రోటీస్ బౌలర్లలో న్కోబాని మోకోనా మూడు వికెట్లు పడగొట్టగా.. కోయిట్జీ, బార్ట్మన్, కేశవ్ మహారాజ్ తలా రెండు వికెట్లు సాధించారు.అనంతరం 92 పరుగుల లక్ష్య చేధనలో సౌతాఫ్రికా కూడా తీవ్రంగా శ్రమించింది. కివీస్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తూ సఫారీలను ముప్పు తిప్పలు పెట్టాడు. అయితే ఓపెనర్ కానర్ ఎస్టర్హైజెన్(45) అజేయంగా నిలిచి మ్యాచ్ను ఫినిష్ చేశాడు. ఫలితంగా సౌతాఫ్రికా లక్ష్యాన్ని 16.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి చేధించింది. ఇరు జట్ల మధ్య రెండో టీ20 హామిల్టన్ వేదికగా మార్చి 17న జరగనుంది.చదవండి: మా జట్లను చూస్తుంటే గర్వంగా ఉంది: రోహిత్ శర్మ -
కుప్పకూలిన న్యూజిలాండ్.. 91 పరుగులకే ఆలౌట్
మౌంట్ మౌంగానుయ్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టీ20లో న్యూజిలాండ్ బ్యాటర్లు దారుణ ప్రదర్శన కనబరిచింది. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన కివీస్ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది. సఫారీ బౌలర్ల దాటికి బ్లాక్ క్యాప్స్ బ్యాటర్లు విల్లవిల్లాడారు.దీంతో న్యూజిలాండ్ 14.3 ఓవర్లలో కేవలం 91 పరుగులకే కుప్పకూలింది. స్టార్ బ్యాటర్లు ఫిన్ అలెన్, టిమ్ సీఫెర్ట్, రచిన్ రవీంద్ర, మిచెల్ లేని లోటు స్పష్టంగా కన్పించింది. అయితే డెవాన్ కాన్వే(1), టామ్ లాథమ్ వంటి సీనియర్లు ఉన్నప్పటికి తమ మార్క్ చూపించలేకపోయారు.ప్రోటీస్ బౌలర్లలో న్కోబాని మోకోనా మూడు వికెట్లు పడగొట్టగా.. కోయిట్జీ, బార్ట్మన్, కేశవ్ మహారాజ్ తలా రెండు వికెట్లు సాధించారు. మౌంట్ మౌంగానుయ్ వేదికలో అత్యల్ప స్కోర్ నమోదు చేసిన జట్టుగా న్యూజిలాండ్ నిలిచింది. ఇంతకుముందు ఈ వేదికలో న్యూజిలాండ్పై పాకిస్తాన్ 105 పరుగులకు ఆలౌటైంది.తుది జట్లుదక్షిణాఫ్రికా: కానర్ ఎస్టర్హుయిజెన్(వికెట్ కీపర్), జోర్డాన్ హెర్మాన్, టోనీ డి జోర్జీ, రూబిన్ హెర్మాన్, జాసన్ స్మిత్, డయాన్ ఫారెస్టర్, జార్జ్ లిండే, జెరాల్డ్ కోట్జీ, కేశవ్ మహారాజ్(కెప్టెన్), న్కోబాని మోకోనా, ఓట్నీల్ బార్ట్మన్న్యూజిలాండ్: డెవాన్ కాన్వే, టామ్ లాథమ్(వికెట్కీపర్), టిమ్ రాబిన్సన్, నిక్ కెల్లీ, బెవాన్ జాకబ్స్, జేమ్స్ నీషమ్, మిచెల్ సాంట్నర్(కెప్టెన్), జకారీ ఫౌల్క్స్, కోల్ మెక్కాంచీ, కైల్ జామిసన్, బెన్ సియర్స్చదవండి: తండ్రి కాబోతున్న టీమిండియా కెప్టెన్ -
మా జట్టుకే ప్రాధాన్యం!.. ఐసీసీపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఫైర్
ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తీరును తప్పుబట్టాడు. ఐసీసీ ఒక్కొక్క జట్టును ఒక్కోలా చూస్తుందని.. తాజాగా ఇంగ్లండ్కు పెద్ద పీట వేసిన తీరే ఇందుకు నిదర్శనమని విమర్శించాడు. టీ20 ప్రపంచకప్-2026 టోర్నీకి భారత్- శ్రీలంక ఆతిథ్యం దేశాలుగా ఉన్న విషయం తెలిసిందే.టైటిల్ పోరుతో తెరఫిబ్రవరి 7న మొదలైన ఈ ఐసీసీ టోర్నీ నేటి (మార్చి 8) ఫైనల్తో ముగియనుంది. భారత్- న్యూజిలాండ్ (IND vs NZ) మధ్య జరిగే టైటిల్ పోరుకు అహ్మదాబాద్ వేదిక. ఇదిలా ఉంటే.. వరల్డ్కప్ టోర్నీ మధ్యలోనే మధ్య ప్రాచ్యంలో ఉద్రిక్తతలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా దాడులు.. అందుకు ఇరాన్ స్పందిస్తున్న తీరుతో యుద్ధం తీవ్ర రూపం దాల్చింది.వెస్టిండీస్, సౌతాఫ్రికా, ఇంగ్లండ్ జట్లు ఇక్కడే!ఈ నేపథ్యంలో గల్ఫ్ దేశాల గగనతలం మూసివేయడంతో వెస్టిండీస్, సౌతాఫ్రికా, ఇంగ్లండ్ జట్లు భారత్లోనే చిక్కుకుపోయాయి. నిజానికి విండీస్ మార్చి 1 టీమిండియా చేతిలో ఓటమి తర్వాత టోర్నీ నుంచి నిష్క్రమించింది. పరిస్థితులు సాధారణంగా ఉండి ఉంటే.. ఆ మరుసటి రోజే స్వదేశానికి చేరుకోవాల్సింది.కానీ పశ్చియాసియాలో యుద్ధం కారణంగా విండీస్ జట్టు వారం రోజులుగా ఇక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. మరోవైపు.. సౌతాఫ్రికా సెమీ ఫైనల్లో న్యూజిలాండ్తో జరిగిన మార్చి 4 నాటి మ్యాచ్లో ఓడి ఎలిమినేట్ అయింది. యుద్ధ పరిస్థితుల వల్ల జట్టు కూడా ఇక్కడే ఉంది. మరోవైపు.. సెమీ ఫైనల్లో మార్చి 5న టీమిండియా చేతిలో ఓడిన ఇంగ్లండ్ కూడా ఇక్కడే ఉండాల్సి రాగా.. ఐసీసీ జోక్యంతో శనివారం స్వదేశానికి ప్రత్యేక విమానంలో బయల్దేరింది. ఇక వెస్టిండీస్, సౌతాఫ్రికా జట్లకు కూడా ఐసీసీ ప్రత్యేక విమానం ఏర్పాటు చేసినా.. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుంచి అనుమతి రాలేదని సమాచారం.దీంతో ఆ రెండు జట్లు ఇంకా భారత్లోనే ఉండాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో విండీస్ హెడ్కోచ్ డారెన్ సామీ.. ‘‘మమ్మల్ని త్వరగా పంపిచేయండి’’ మహాప్రభో అంటూ మొరపెట్టుకున్న తీరు చర్చనీయాంశమైంది.ఇంగ్లండ్కి మాత్రం చార్టర్ ఫ్లైట్ దొరికిందిఈ పరిణామాలపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. ఐసీసీ తీరును విమర్శించాడు. ‘‘ఇంగ్లండ్ గురువారమే నాకౌట్ అయింది. వాళ్లకి మాత్రం చార్టర్ ఫ్లైట్ దొరికింది. వెస్టిండీస్ గత ఆదివారం నుంచి కోల్కతాలోనే చిక్కుకుపోయింది.సౌతాఫ్రికా పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఇక్కడే అధికార దుర్వినియోగం ఎలా జరుగుతుందో మనం తెలుసుకోవచ్చు. జట్లన్నీ ఒకే పరిస్థితిలో ఉన్నపుడు.. వాటన్నింటీ ఒకే విధంగా ట్రీట్ చేయాలి కదా!.. ఓ దేశ బోర్డు శక్తిమంతమైనది అయినంత మాత్రాన ఐసీసీ వాళ్లకు ప్రాధాన్యం ఇవ్వకూడదు’’ అని మైకేల్ వాన్ ట్వీట్ చేశాడు.ఓవరాక్షన్ వద్దుఅయితే, వాన్ పోస్టుకు నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ఇండియా- యూరోప్ మధ్య గగనతలంలో ఎలాంటి అడ్డంకులు లేవని.. అదే వెస్టిండీస్ వంటి జట్టు స్వదేశం చేరాలంటే గల్ఫ్ దేశాలు దాటాల్సి ఉంటుందని పేర్కొంటున్నారు.ఒకవేళ యూరోప్ గుండా విండీస్ జట్టును పంపించాలన్నా ఇప్పటికిప్పుడు వీసా, ఒకే చోట 40- 50 మందికి సీట్లు అరేంజ్ చేయడం కుదరదని అంటున్నారు. భౌగోళిక పరిస్థితులను బట్టే ఓ జట్టు ముందు.. ఓ జట్టు వెనక వెళ్లడం జరుగుతుందని.. అంతే తప్ప ఇందులో అధికార దుర్వినియోగం ఏమీ లేదని వాన్కు చురకలు అంటిస్తున్నారు. కాగా ఆదివారం నాటికి వెస్టిండీస్, సౌతాఫ్రికా జట్లు స్వదేశానికి చేరుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.చదవండి: T20 WC Final: సాంట్నర్కు ఇచ్చిపడేసిన సూర్యకుమార్ -
ఆకాశమే హద్దుగా చెలరేగుతున్న న్యూజిలాండ్ చిచ్చరపిడుగులు
ఐపీఎల్ 2026 ప్రారంభానికి ఇంకా చాలా సమయం ఉన్నా, ఆ జట్టు ఎంపిక చేసుకున్న ఆటగాళ్లు ఇప్పటినుంచే ప్రత్యర్థులను భయపెడుతున్నారు. ఈ సీజన్ మినీ వేలంలో కేకేఆర్ ఫ్రాంచైజీ టిమ్ సీఫర్ట్ (రూ. 1.5 కోట్లు), ఫిన్ అల్లెన్ (రూ. 2 కోట్లు)ను రూ. 3.5 కోట్లకు సొంతం చేసుకుంది. ఈ న్యూజిలాండ్ ఓపెనింగ్ ద్వయం నిన్న (మార్చి 4) జరిగిన టీ20 ప్రపంచకప్ 2026 తొలి సెమీఫైనల్లో సౌతాఫ్రికాపై పేట్రేగిపోయింది. ముఖ్యంగా అల్లెన్ ఆకాశమే హద్దుగా విధ్వంసం సృష్టించాడు. కేవలం 33 బంతుల్లోనే 10 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో సుడిగాలి శతకం (100 నాటౌట్) బాది తన జట్టును ఒంటిచేత్తో ఫైనల్కు చేర్చాడు. మరో ఎండ్లో సీఫర్ట్ తానేమీ తక్కువ కాదు అన్నట్లు 33 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 58 పరుగులు చేసి గెలుపుకు గట్టి పునాది వేశాడు. అల్లెన్, సీఫర్ట్ ఇంతలా విరుచుకుపడింది తమ ఐపీఎల్ హోం గ్రౌండ్ అయిన ఈడెన్ గార్డన్స్లో కావడం విశేషం. అల్లెన్, సీఫర్ట్ విధ్వంసకాండ చూశాక కేకేఆర్ అభిమానుల్లో ఎక్కడలేని జోష్ వచ్చింది. గత సీజన్లో పేలవ ప్రదర్శనలతో చివరి స్థానాల్లో నిలిచిన కేకేఆర్కు అల్లెన్, సీఫర్ట్ కొత్త ఊపునిచ్చారు. వీరిద్దరిని కేకేఆర్ వచ్చే సీజన్లో ఓపెనర్లుగా ప్రవేశపెట్టవచ్చు. వీరు మెరుపు విన్యాసాలకు పెట్టింది పేరు. ఇదే జోరును వీరు రానున్న ఐపీఎల్ సీజన్లోనూ కొనసాగిస్తే.. కేకేఆర్ మరోసారి టైటిల్ ఎగరేసుకుపోవడం ఖాయం. దీనికంటే ముందు ఈ ఇద్దరిపై మరో పెద్ద బాధ్యత ఉంది. న్యూజిలాండ్ను రెండో సారి టీ20 ప్రపంచకప్ ఫైనల్స్కు చేర్చిన వీరు.. ఈసారి ఎలాగైనా టైటిల్ సాధించాలని కసిగా ఉన్నారు. ఈ ప్రపంచకప్లో వీరిద్దరి ఫామ్ అమోఘంగా ఉంది. ఇప్పటికే 463 పరుగులు జోడించి, టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఏ వికెట్కైనా అత్యధిక పరుగులు జోడిగా రికార్డు నెలకొల్పారు. తాజాగా సౌతాఫ్రికాపై తొలి వికెట్కు 117 పరుగులు జోడించిన అల్లెన్-సీఫర్ట్ జోడి.. ఈ ఎడిషన్లో 100 ప్లస్ భాగస్వామ్యం నమోదు చేయడం ఇది రెండోసారి. గ్రూప్ దశలో యూఏఈపై ఈ జోడీ అజేయమైన 175 పరుగులు జోడించి ప్రపంచకప్ రికార్డు నెలకొల్పింది. మొత్తంగా అల్లెన్-సీఫర్ట్ జోడీ అటు స్వదేశ అభిమానులతో పాటు కేకేఆర్ అభిమానుల్లోనూ సరికొత్త ఆశలు చిగురింపజేస్తుంది. ఈ జోడీ ప్రపంచకప్ ఫైనల్లో ఏ మేరకు రాణిస్తుందో చూడాలని యావత్ క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఇవాళ (మార్చి 5) భారత్-ఇంగ్లండ్ మధ్య రెండో సెమీఫైనల్ విజేతతో న్యూజిలాండ్ ఫైనల్లో అమీతుమీ తేల్చుకుంటుంది. ఈ మ్యాచ్ మార్చి 8న అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరుగనుంది. -
T20 WC 2026: సౌతాఫ్రికా-న్యూజిలాండ్ మ్యాచ్లో షాకింగ్ సన్నివేశం
సౌతాఫ్రికా-న్యూజిలాండ్ మధ్య నిన్న (మార్చి 4) జరిగిన టీ20 వరల్డ్కప్ 2026 తొలి సెమీఫైనల్ మ్యాచ్లో షాకింగ్ సన్నివేశం చోటు చేసుకుంది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్ 10వ ఓవర్ తొలి బంతిలో కగిసో రబాడా వేసిన అద్భుత బంతికి టిమ్ సీఫర్ట్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆశ్చర్యకరంగా, ఓ బెయిల్ ఎగిరి ఏకంగా బౌండరీ రోప్పై పడింది. దీంతో ఆటగాళ్లు, అభిమానులు, వ్యాఖ్యాతలు అందరూ షాక్కు గురయ్యారు. ఈ క్లిప్ సోషల్ మీడియాలో వైరలవుతోంది. గతంలో ఇలాంటి సన్నివేశాలు చాలా అరుదుగా జరిగాయి.pic.twitter.com/ZjIVl2UxEz— crictalk (@crictalk7) March 4, 2026మ్యాచ్ విషయానికొస్తే.. న్యూజిలాండ్ సౌతాఫ్రికాను చిత్తుగా ఓడించి, ఫైనల్కు దూసుకెళ్లింది. సౌతాఫ్రికా నిర్దేశించిన 170 పరుగుల లక్ష్యాన్ని కివీస్ కేవలం 12.5 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ ఫిన్ అల్లెన్ బీభత్సమైన సెంచరీతో (33 బంతుల్లోనే 10 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 100 నాటౌట్) కివీస్ను ఒంటిచేత్తో గెలిపించాడు. టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఇదే ఫాస్టెస్ట్ సెంచరీ. టీ20 వరల్డ్కప్ నాకౌట్ మ్యాచ్ల్లోనూ ఇదే తొలి సెంచరీ. ఈ సెంచరీతో అల్లెన్ మరిన్ని రికార్డులు కొల్లగొట్టాడు.టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. 77 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును మార్కో యాన్సెన్ (30 బంతుల్లో 55 నాటౌట్; 2 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు అర్ద సెంచరీతో ఆదుకున్నాడు. అతనికి ట్రిస్టన్ స్టబ్స్ (29) కాసేపు సహకరించాడు. అంతకుముందు డెవాల్డ్ బ్రెవిస్ (34) ఓ మోస్తరు స్కోర్తో పర్వాలేదనిపించాడు. వీరు మినహా సౌతాఫ్రికా ఆటగాళ్లంతా విఫలమయ్యారు. మార్క్రమ్ 18, డికాక్ 10, మిల్ర్ 6, బాష్ 2, రికెల్టన్, రబాడ డకౌటయ్యారు. సౌతాఫ్రికా ఇన్నింగ్స్ను రచిన్ (4-0-29-2), మ్యాట్ హెన్రీ (4-0-34-2), కోల్ మెక్కోంచి (1-0-9-2), ఫెర్గూసన్ (4-0-29-1), మిచెల్ సాంట్నర్ (4-0-25-0) దెబ్బకొట్టారు.అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనలో టిమ్ సీఫర్డ్ (58), ఫిన్ అల్లెన్ (100 నాటౌట్) 9 ఓవర్లలో తొలి వికెట్కు 117 పరుగులు జోడించి గెలుపుకు పటిష్ట పునాది వేశారు. సీఫర్ట్ ఔటయ్యాక మరింత రెచ్చిపోయిన అల్లెన్ కేవలం బౌండరీలు, సిక్సర్లతో మ్యాచ్ను ముగించాడు. అతనికి రచిన్ (13 నాటౌట్) సహకరించాడు.2021 ఎడిషన్ తర్వాత న్యూజిలాండ్ ఫైనల్కు చేరడం ఇదే మొదటిసారి. ఆ ఎడిషన్లో ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో పరాజయం ఎదుర్కొని తృటిలో ప్రపంచ ఛాంపియన్ అయ్యే అవకాశాన్ని కోల్పోయిన కివీస్కు మళ్లీ ఇన్నాళ్లకు ప్రపంచకప్ సాధించే అవకాశం వచ్చింది. భారత్, ఇంగ్లండ్ మధ్య రెండో సెమీఫైనల్ విజేతతో న్యూజిలాండ్ తమ తొలి ప్రపంచకప్ టైటిల్ కోసం పోరాడుతుంది. -
33 బంతుల్లో శతకం.. రికార్డుల మోత మోగించిన కివీస్ యోధుడు
టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా నిన్న (మార్చి 4) జరిగిన తొలి సెమీఫైనల్లో న్యూజిలాండ్ సౌతాఫ్రికాను 9 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించి, ఫైనల్కు చేరింది. సౌతాఫ్రికా నిర్దేశించిన 170 పరుగుల లక్ష్యాన్ని కివీస్ కేవలం 12.5 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ ఫిన్ అల్లెన్ బీభత్సమైన సెంచరీతో కివీస్ను ఒంటిచేత్తో గెలిపించాడు. అల్లెన్ 33 బంతుల్లోనే 10 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో అజేయమైన సెంచరీ చేసి కివీస్ను విజయతీరాలకు చేర్చాడు. ఈ సెంచరీతో అల్లెన్ రికార్డుల మోత మోగించాడు.టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఫాస్టెస్ట్ సెంచరీ.ఓవరాల్ టీ20 క్రికెట్ చరిత్రలో ఓ ఫుల్ మెంబర్ జట్టుపై ఇదే ఫాస్టెస్ట్ సెంచరీ.ఓవరాల్గా (ఫుల్ మెంబర్లు, సభ్య దేశాలు) టీ20ల్లో ఇది మూడో జాయింట్ ఫాస్టెస్ట్ సెంచరీ.ఓవరాల్గా ఓ ఫుల్ మెంబర్ జట్టు తరఫున సికందర్ రజాతో (గాంబియాపై 33 బంతుల్లో శతకం) పాటు జాయింట్ ఫాస్టెస్ట్ సెంచరీ. టీ20 ప్రపంచకప్ నాకౌట్ మ్యాచ్ల చరిత్రలో తొలి శతకం.టీ20 క్రికెట్లో న్యూజిలాండ్ తరఫున ఫాస్టెస్ట్ సెంచరీ.టీ20 వరల్డ్కప్ చరిత్రలో బ్రెండన్ మెక్కల్లమ్తో (11 ఫోర్లు, 7 సిక్సర్లు) కలిసి ఓ ఇన్నింగ్స్లో అత్యధిక బౌండరీ కౌంట్ (10 ఫోర్లు, 8 సిక్సర్లు). ఓ టీ20 వరల్డ్కప్ ఎడిషన్లో అత్యధిక సిక్సర్లు-20.టీ20 వరల్డ్కప్ సెమీస్ లేదా ఫైనల్స్లో కనీసం 30 బంతులు ఆడిన కోటాలో విరాట్ కోహ్లితో పాటు అతి తక్కువ డాట్ బాల్స్ (3). టీ20 ప్రపంచకప్లో న్యూజిలాండ్ తరఫున మూడో శతకం (మెక్కల్లమ్, ఫిలిప్).ఈ ఇన్నింగ్స్తో అల్లెన్ మరిన్ని చిన్నా చితకా రికార్డులను కూడా బ్రేక్ చేసి న్యూజిలాండ్ను ప్రపంచకప్ కల సాకారం చేసే దిశగా తీసుకెళ్లాడు. 2021 ఎడిషన్ తర్వాత న్యూజిలాండ్ ఫైనల్కు చేరడం ఇదే మొదటిసారి. ఆ ఎడిషన్లో ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో పరాజయం ఎదుర్కొని తృటిలో ప్రపంచ ఛాంపియన్ అయ్యే అవకాశాన్ని కోల్పోయిన కివీస్కు మళ్లీ ఇన్నాళ్లకు ప్రపంచకప్ సాధించే అవకాశం వచ్చింది. భారత్, ఇంగ్లండ్ మధ్య ఇవాళ జరిగే రెండో సెమీఫైనల్ విజేతతో న్యూజిలాండ్ తమ తొలి ప్రపంచకప్ టైటిల్ కోసం పోరాడుతుంది. -
T20 WC: అలెన్ విధ్వంసకర శతకం.. వరల్డ్కప్ ఫైనల్లో న్యూజిలాండ్
టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్లో న్యూజిలాండ్ ఫైనల్కు దూసుకువెళ్లింది. కోల్కతాలో జరిగిన తొలి సెమీస్ మ్యాచ్లో సౌతాఫ్రికాను తొమ్మిది వికెట్ల తేడాతో ఓడించి టైటిల్ పోరుకు అర్హత సాధించింది. ఈడెన్ గార్డెన్స్లో బుధవారం నాటి ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన కివీస్.. సౌతాఫ్రికాను తొలుత బ్యాటింగ్కు ఆహ్వానించింది.కెప్టెన్ నమ్మకాన్ని నిలబెడుతూ న్యూజిలాండ్ బౌలర్లు ఆది నుంచే నిప్పులు చెరిగారు. క్వింటన్ డికాక్ (10)ను అవుట్ చేసి కివీస్ వికెట్ల వేట మొదలుపెట్టిన కోల్ మెకాంచీ.. వన్డౌన్లో వచ్చిన ర్యాన్ రికెల్టన్ (0)ను డకౌట్గా వెనక్కి పంపాడు. ఇక మరో ఓపెనర్, కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్ (18)ను రచిన్ రవీంద్ర పెవిలియన్కు చేర్చాడు.యాన్సెన్ హాఫ్ సెంచరీఅదే విధంగా డారిల్ మిచెల్ (6)ను కూడా అవుట్ చేసిన రచిన్ కివీస్ శిబిరంలో జోష్ నింపాడు. ఇక డెవాల్డ్ బ్రెవిస్ (34)ను జేమ్స్ నీషమ్ అవుట్ చేయగా.. ట్రిస్టన్ స్టబ్స్ (29)ను లాకీ ఫెర్గూసన్ పెవిలియన్కు పంపించాడు. అయితే, మార్కో యాన్సెన్ హాఫ్ సెంచరీ (30 బంతుల్లో 55) నాటౌట్గా నిలవడంతో సౌతాఫ్రికా.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది.ఇక లక్ష్య ఛేదనకు దిగిన న్యూజిలాండ్ 12.5 ఓవర్లలోనే కేవలం ఒక వికెట్ నష్టపోయి 173 పరుగులు సాధించింది. ఓపెనర్లలో టిమ్ సీఫర్ట్ 33 బంతుల్లో 58 పరుగులు సాధించగా.. ఫిన్ అలెన్ విధ్వంసకర శతకం బాదాడు. Everything is flying to the boundary tonight! 🫣ICC Men’s #T20WorldCup | Semi-final 1 #SAvNZ | LIVE NOW 👉 https://t.co/LMBOn54jDE pic.twitter.com/1kQbb9uF6n— Star Sports (@StarSportsIndia) March 4, 2026ఫాస్టెస్ట్ సెంచరీకేవలం 33 బంతుల్లోనే 10 ఫోర్లు, 8 సిక్సర్లు బాది 100 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఫోర్ బాది కివీస్ గెలుపును ఖరారు చేశాడు. రచిన్ రవీంద్ర 11 బంతుల్లో 13 పరుగులతో అజేయంగా నిలిచాడు. కాగా ఈ మ్యాచ్ సందర్భంగా టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేసిన బ్యాటర్గా అలెన్ చరిత్ర సృష్టించాడు. -
T20 WC 2026: చరిత్ర సృష్టించిన సఫారీ క్రికెటర్లు
న్యూజిలాండ్తో సెమీ ఫైనల్లో సౌతాఫ్రికా ఆల్రౌండర్ మార్కో యాన్సెన్ అద్బుత బ్యాటింగ్తో ఆకట్టుకున్నాడు. కివీస్ బౌలర్ల ధాటికి టాపార్డర్ కుదేలైన వేళ తాను ఉన్నానంటూ ముందుకు వచ్చాడు.చరిత్ర సృష్టించిన సఫారీ క్రికెటర్లుకేవలం 77 పరుగులే చేసి సగం వికెట్లు కోల్పోయిన తరుణంలో యాన్సెన్ (Marco Jansen) .. ట్రిస్టన్ స్టబ్స్ (Trisran Stubss)తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. వీరిద్దరు కలిసి ఆరో వికెట్కు 47 బంతుల్లో 73 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. తద్వారా ఈ జోడీ సరికొత్త చరిత్ర సృష్టించింది.సౌతాఫ్రికా తరఫున అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో ఆరు లేదంటే అంతకంటే ఎక్కువ వికెట్లకు అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పిన జట్టుగా నిలిచింది. అంతేకాదు.. టీ20 ప్రపంచకప్ ప్లే ఆఫ్స్ మ్యాచ్లలో ఆరు లేదంటే అంతకంటే ఎక్కువ వికెట్లకు యాభైకి పైగా పరుగులు జోడించిన రెండో జంటగా యాన్సెన్- స్టబ్స్ నిలిచారు.Marco 𝗖𝗟𝗨𝗧𝗖𝗛 Jansen 🔥Entered at 77/5 & played an innings of a lifetime to guide South Africa a fighting total! 🙌ICC Men’s #T20WorldCup | Semi-final 1 #SAvNZ | LIVE NOW 👉 https://t.co/LMBOn54jDE pic.twitter.com/CCD0QTflth— Star Sports (@StarSportsIndia) March 4, 2026టీ20 ప్రపంచకప్ ప్లే ఆఫ్స్ మ్యాచ్లలో ఆరు లేదంటే అంతకంటే ఎక్కువ వికెట్లకు 50 ప్లస్ పార్ట్నర్షిప్ నమోదు చేసిన జోడీలు👉మార్కస్ స్టొయినిస్- మాథ్యూవేడ్ (ఆస్ట్రేలియా) పాకిస్తాన్ మీద 2021 సెమీ ఫైనల్లో 81*👉మార్కో యాన్సెన్- ట్రిస్టన్ స్టబ్స్ (సౌతాఫ్రికా) న్యూజిలాండ్ మీద 2026 సెమీ ఫైనల్లో 73👉ఏంజెలో మాథ్యూస్- కుమార్ సంగక్కర (శ్రీలంక) పాకిస్తాన్ మీద 2009 ఫైనల్లో 68*👉జార్జ్ బెయిలీ- ప్యాట్ కమిన్స్ (ఆస్ట్రేలియా) వెస్టిండీస్ మీద 2012 సెమీ ఫైనల్లో 68👉కార్లోస్ బ్రాత్వైట్- మార్లన్ సామ్యూల్స్ (వెసిండీస్) ఇంగ్లండ్ మీద 2016 ఫైనల్లో 54*👉మైకేల్ హస్సీ- మిచెల్ జాన్సన్ (ఆస్ట్రేలియా) పాకిస్తాన్ మీద 2010 సెమీ ఫైనల్లో 53*169 పరుగులుఇదిలా ఉంటే.. టీ20 ప్రపంచకప్-2026లో భాగంగా న్యూజిలాండ్తో సెమీ ఫైనల్లో టాస్ ఓడిన సౌతాఫ్రికా తొలుత బ్యాటింగ్ చేసింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 169 పరుగులు సాధించింది. మార్కో యాన్సెన్ 55 పరుగులతో అజేయంగా నిలవగా.. స్టబ్స్ 29 పరుగులు చేశాడు. డెవాల్డ్ బ్రెవిస్ 34 పరుగులతో రాణించాడు. చదవండి: T20 WC 2026: బాబర్ ఎందుకు?.. పాక్ బోర్డులో తొలి రాజీనామా -
T20 WC: వార్ వన్సైడ్ అనుకుంటే.. ఆఖర్లో దంచికొట్టేశాడే!
న్యూజిలాండ్తో సెమీ ఫైనల్లో సౌతాఫ్రికా మెరుగైన స్కోరు సాధించింది. ఆదిలోనే వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన సఫారీ జట్టును ఆల్రౌండర్ మార్కో యాన్సెన్ మెరుపు అర్ధ శతకంతో ఆదుకున్నాడు. ఫలితంగా ప్రొటిస్ జట్టు గౌరవప్రదంగా ఇన్నింగ్స్ ముగించగలిగింది.టీ20 ప్రపంచకప్-2026 తొలి సెమీస్ మ్యాచ్లో భాగంగా కోల్కతాలో టాస్ గెలిచిన న్యూజిలాండ్ సౌతాఫ్రికాను తొలుత బ్యాటింగ్కు ఆహ్వానించింది. ఆది నుంచే కివీస్ బౌలర్లు నిప్పులు చెరగడంతో వరుస విరామాల్లో ప్రొటిస్ జట్టు వికెట్లు కోల్పోయింది. టాపార్డర్ కుదేలుఓపెనర్లు ఐడెన్ మార్క్రమ్ (18), క్వింటన్ డికాక్ (10), ర్యాన్ రికెల్టన్ (0) పూర్తిగా విఫలమయ్యారు. డెవాల్డ్ బ్రెవిస్ (34) కాసేపు నిలబడగా... డేవిడ్ మిల్లర్ (6) పూర్తిగా నిరాశపరిచాడు. ఫలితంగా డెబ్బై ఏడు పరుగులకే సౌతాఫ్రికా ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయింది. ఇలాంటి తరుణంలో ట్రిస్టన్ స్టబ్స్ (29)తో కలిసి మార్కో యాన్సెన్ భాగస్వామ్యం నిర్మించాడు. వీరిద్దరు కలిసి ఆరో వికెట్కు 47 బంతుల్లో 73 పరుగులు జోడించారు. 27 బంతుల్లో అర్ధ శతకంఇక ఈ మ్యాచ్లో యాన్సెన్ 27 బంతుల్లో అర్ధ శతకం సాధించాడు. ఈ టోర్నీలో అతడికి ఇదే తొలి హాఫ్ సెంచరీ. లాకీ ఫెర్గూసన్ బౌలింగ్లో సిక్స్ బాది యాభై పరుగుల మార్కు అందుకున్నాడు యాన్సెన్. మొత్తంగా 30 బంతులు ఎదుర్కొని రెండు ఫోర్లు, ఐదు సిక్సర్ల సాయంతో 55 పరుగులతో అజేయంగా నిలిచాడు.Marco 𝗖𝗟𝗨𝗧𝗖𝗛 Jansen 🔥Entered at 77/5 & played an innings of a lifetime to guide South Africa a fighting total! 🙌ICC Men’s #T20WorldCup | Semi-final 1 #SAvNZ | LIVE NOW 👉 https://t.co/LMBOn54jDE pic.twitter.com/CCD0QTflth— Star Sports (@StarSportsIndia) March 4, 2026మిగిలిన వారిలో కార్బిన్ బాష్ రెండు పరుగులు చేయగా.. కగిసో రబడ డకౌట్ అయ్యాడు. కేశవ్ మహరాజ్ ఒక పరుగుతో నాటౌట్గా నిలిచాడు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 169 పరుగులు సాధించింది. హెన్రీ పొదుపుగా బౌలింగ్ చేయడంతోకివీస్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ, కోల్ మెకాంచీ, రచిన్ రవీంద్ర తలా రెండు వికెట్లు తీయగా.. లాకీ ఫెర్గూసన్, జేమ్స్ నీషమ్ చెరో వికెట్ పడగొట్టారు. ఆఖరి ఓవర్లో హెన్రీ కేవలం ఆరు పరుగులే ఇచ్చి ప్రొటిస్ జట్టును నామమాత్రపు స్కోరుకు పరిమితం చేయడంలో కీలక పాత్ర పోషించాడు.చదవండి: T20 WC 2026: బాబర్ ఎందుకు?.. పాక్ బోర్డులో తొలి రాజీనామా -
T20 WC 1st Semi Final: టాస్ గెలిచిన కివీస్.. తుదిజట్లు ఇవే
పొట్టి క్రికెట్ మహా సంగ్రామంలో తొలి సెమీ ఫైనల్ పోరుకు తెరలేచింది. టీ20 ప్రపంచకప్-2026లో భాగంగా సౌతాఫ్రికా- న్యూజిలాండ్ మధ్య జరిగే ఈ మెగా మ్యాచ్కు కోల్కతా వేదిక. ఈడెన్ గార్డెన్స్లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ తొలుత బౌలింగ్ ఎంచుకుని.. ప్రొటిస్ జట్టును బ్యాటింగ్కు ఆహ్వానించింది.టాస్ సందర్భంగా కివీస్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ మాట్లాడుతూ.. ‘‘పిచ్ బాగుంది. వికెట్ పాతబడే కొద్ది బ్యాటింగ్కు ఇంకాస్త సహకరిస్తుందని అనిపిస్తోంది. అందుకే తొలుత బౌలింగ్ ఎంచుకున్నాం. ఆది నుంచే ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టాల్సి ఉంటుంది. మ్యాట్ హెన్రీ తిరిగిఇ వచ్చాడు. సోధి స్థానంలో నీషమ్ కూడా తుదిజట్టులోకి వచ్చాడు’’ అని తెలిపాడు.It’s semi-final time! Mitchell Santner has won the toss and opted to bowl first! 🪙Who will be the first team to make it to the final? 🤔ICC Men’s #T20WorldCup | Semi-final 1 #SAvNZ | LIVE NOW 👉 https://t.co/LMBOn54jDE pic.twitter.com/N8m1kkxoX8— Star Sports (@StarSportsIndia) March 4, 2026మా తుదిజట్టులో మూడు మార్పులుఇక సౌతాఫ్రికా సారథి ఐడెన్ మార్క్రమ్ మాట్లాడుతూ.. ‘‘ఈ టోర్నీలో ఇప్పటి వరకు మా జట్టులోని ప్రతి సభ్యుడు తమ వంతు సహకారం అందించడం సంతోషకరం. ఈ మ్యాచ్లోనూ గొప్పగా రాణించి మంచి స్కోరు నమోదు చేస్తామని ఆశిస్తున్నా. గత రాత్రి కూడా మేము ప్రాక్టీస్ చేశాము.మా తుదిజట్టులో మూడు మార్పులు చేశాము. రబడ, యాన్సెన్, కేశవ్ మహరాజ్ తిరిగి జట్టులోకి వచ్చారు’’ అని పేర్కొన్నాడు. కాగా సూపర్-8 దశలో అజేయంగా నిలిచిన సౌతాఫ్రికా తొలి టైటిల్ వేట దిశగా సెమీస్ రూపంలో మరో ముందడుగు వేసింది. గత ఎడిషన్లో రన్నరప్తో సరిపెట్టుకున్న సఫారీలు ఈసారి పట్టు వదలకుండా పోరాడేందుకు సిద్ధమయ్యారునిలకడైన ఆట.. ప్రొటిస్దే పైచేయిమరోవైపు.. సౌతాఫ్రికా మాదిరే ఇంత వరకు ఒక్కసారి కూడా టైటిల్ గెలవని న్యూజిలాండ్ సైతం ఈసారి ట్రోఫీ గెలవాలనే పట్టుదలతో ఉంది. అయితే, ఈ ఎడిషన్లో ప్రదర్శనల పరంగా కివీస్ కంటే సఫారీలే ఓ అడుగు ముందున్నారు. ఇక సూపర్-8 దశలో పాకిస్తాన్తో ఆడాల్సిన మ్యాచ్ రద్దు కాగా.. శ్రీలంకపై గెలిచిన న్యూజిలాండ్ సెమీస్ రేసులో ముందుకు దూసుకువచ్చింది. ఆఖరి మ్యాచ్లో ఇంగ్లండ్ చేతిలో ఓడినా.. పాక్ శ్రీలంకపై నామమాత్రపు విజయంతో సరిపెట్టుకోవడంతో సెమీ ఫైనల్లో అడుగుపెట్టగలిగింది.తుదిజట్లు ఇవేన్యూజిలాండ్టిమ్ సీఫెర్ట్(వికెట్ కీపర్), ఫిన్ అలెన్, రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్మన్, డారిల్ మిచెల్, జేమ్స్ నీషమ్, మిచెల్ సాంట్నర్(కెప్టెన్), కోల్ మెక్కాంచీ, మ్యాట్ హెన్రీ, లాకీ ఫెర్గూసన్సౌతాఫ్రికాఐడెన్ మార్క్రమ్ (కెప్టెన్), క్వింటన్ డి కాక్(వికెట్ కీపర్), ర్యాన్ రికెల్టన్, డెవాల్డ్ బ్రెవిస్, డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, మార్కో యాన్సెన్, కార్బిన్ బాష్, కగిసో రబాడ, కేశవ్ మహారాజ్, లుంగి ఎన్గిడి.చదవండి: T20 WC 2026: బాబర్ ఎందుకు?.. పాక్ బోర్డులో తొలి రాజీనామా -
సెమీస్ సమరానికి సిద్ధం
టి20 ప్రపంచ కప్ చరిత్రలో రెండు టీమ్లదీ దాదాపు ఒకే రకమైన పరిస్థితి...ఇరు జట్లు ఒక్కో సారి ఫైనల్ వరకు చేరగలిగినా టైటిల్ గెలుచుకోలేక రన్నరప్గానే సంతృప్తి చెందాయి. లీగ్ దశలో అద్భుతంగా ఆడుతున్నా, ప్రత్యర్థి జట్లకు సవాల్ విసురుతున్నా అసలు సమయంలో మాత్రం ఈ టీమ్లు చేతులెత్తేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరోసారి ఫైనల్ చేరి తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ సిద్ధమయ్యాయి. రెండు టీమ్లలో ఒకరికి మాత్రమే టైటిల్ వేటలో పోటీ పడేందుకు అవకాశం ఉంది. ఈ క్రమంలో తుది పోరుకు అర్హత సాధించేందుకు రెండు జట్లూ సై అంటున్నాయి. ఈడెన్ గార్డెన్స్లో హోరాహోరీ పోరులో ఏ జట్టు పైచేయి సాధిస్తుందనేది ఆసక్తికరం. కోల్కతా: టి20 వరల్డ్ కప్ తొలి నాకౌట్ సమరానికి రంగం సిద్ధమైంది. నేడు (బుధవారం) జరిగే తొలి సెమీఫైనల్లో గత టోర్నీ రన్నరప్ దక్షిణాఫ్రికాతో న్యూజిలాండ్ తలపడుతుంది. టోర్నీలో ఇప్పటి వరకు ఆడిన 7 మ్యాచ్లలో కూడా విజయాలు సాధించే దక్షిణాఫ్రికా అజేయంగా సెమీస్ చేరగా...కివీస్ ప్రస్థానం మాత్రం తడబడుతూ సాగింది. లీగ్ దశలో మూడు బలహీన జట్లను ఓడించిన న్యూజిలాండ్, సూపర్ ఎయిట్స్లో ఒకటే విజయంతో ముందంజ వేసింది. ఈ టోర్నీలో ఇరు జట్ల మధ్య జరిగిన పోరులో దక్షిణాఫ్రికా అలవోక విజయాన్ని అందుకుంది. ఇప్పుడు అదే ప్రదర్శనతో దక్షిణాఫ్రికా ఫైనల్ చేరుతుందా లేక గత మ్యాచ్కు కివీస్ ప్రతీకారం తీర్చుకుంటుందా చూడాలి. అద్భుత ఫామ్లో... 2024 వరల్డ్ కప్ ఫైనల్లో దాదాపు చివరి వరకు ఆధిపత్యం ప్రదర్శించి అనూహ్యంగా ఓడిన దక్షిణాఫ్రికా ఈ సారి మెగా టోర్నీకి బాగా సన్నద్ధమై వచ్చినట్లు కనిపించింది. ప్రత్యర్థులకు ఎక్కడా ఎలాంటి అవకాశం ఇవ్వకుండా ఆ జట్టు చెలరేగిపోతోంది. అఫ్గనిస్తాన్పై పోరు సూపర్ ఓవర్ వరకు వెళ్లినా...భారత్, న్యూజిలాండ్, వెస్టిండీస్లను ఓడించిన తీరు జట్టు బలాన్ని చూపించింది. కెప్టెన్ మార్క్రమ్ తన కెరీర్లోనే అత్యుత్తమ ఫామ్లో కనిపిస్తున్నాడు. టాపార్డర్లో డికాక్, రికెల్టన్లనుంచి అతనికి సరైన మద్దతు లభిస్తోంది. బ్రెవిస్, మిల్లర్, స్టబ్స్లతో మిడిలార్డర్ చాలా పటిష్టంగా ఉంది. మిల్లర్ చాలా కాలంగా నిలకడగా రాణిస్తుండగా, బ్రెవిస్ మెరుపు బ్యాటింగ్తో ఏ టీమ్పైనైనా చెలరేగిపోగలడు. యాన్సెన్, బాష్ రూపంలో ఇద్దరు చక్కటి ఆల్రౌండర్లు ఉండటం జట్టు బలాన్ని పెంచింది. బౌలింగ్లో ఇద్దరు బెస్ట్ ఫాస్ట్ బౌలర్లు జట్టును నడిపిస్తున్నారు. రబాడ, ఎన్గిడి ప్రతీ మ్యాచ్లో ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేయడంలో సఫలం కావడంతో పాటు వరుస విరామాల్లో వికెట్లు తీసి కోలుకోకుండా చేస్తున్నారు. ముఖ్యంగా ఇటీవల తన ఆటను అమాంతం మెరుగుపర్చుకున్న ఎన్గిడి ‘స్లో బంతులు’ బ్యాటర్లకు పెద్ద సమస్యగా మారాయి. జట్టులో ఏకైక స్పిన్నర్గా కేశవ్ మహరాజ్ తన సత్తాను ప్రదర్శిస్తున్నాడు. ఓవరాల్గా అన్ని రంగాల్లో పటిష్టంగా కనిపిస్తున్న సఫారీలకే గెలుపు సానుకూలత ఎక్కువగా ఉంది. తడబడుతూనే... ప్రత్యర్థితో పోలిస్తే న్యూజిలాండ్ కాస్త బలహీనంగా కనిపిస్తోంది. టోర్నీ ఆరంభానికి ముందు బలాబలాల్లో ఏ జట్టుకూ కూడా తీసిపోనట్లు కనిపించిన కివీస్ అసలు సమయంలో మాత్రం ఆ స్థాయి ప్రదర్శనను చూపించలేకపోయింది. ఏ ఆటగాడు కూడా ఒంటిచేత్తో టీమ్ను గెలిపించేలా కనిపించడం లేదు. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్లో కూడా జట్టులో తడబాటు కనిపిస్తూనే ఉంది. టాప్–3 బ్యాటర్లు సీఫెర్ట్, అలెన్, రచిన్లలో ఎవరూ గొప్పగా ఆడలేదు. ఫిలిప్స్లో కూడా నిలకడ లోపించగా...చాప్మన్ పూర్తిగా విఫలమయ్యాడు. ఇటీవల భారత్తో సిరీస్లో చెలరేగిన మిచెల్ పెద్దగా ప్రభావం చూపలేకపోగా...కెపె్టన్ సాంట్నర్ వైఫల్యం జట్టును దెబ్బ తీసింది. బౌలింగ్లో విఫలమైన సాంట్నర్ బ్యాటింగ్లో కూడా ఒక్క ఇన్నింగ్స్ మినహా ఎక్కడా బాగా ఆడలేదు. ఇంగ్లండ్ చేతిలో పరాజయం జట్టు బలహీనతలను స్పష్టంగా చూపించింది. బౌలింగ్లో ఫెర్గూసన్పైనే ప్రధానంగా పేస్ భారం ఉంది. వ్యక్తిగత కారణాలతో స్వదేశానికి వెళ్లిన హెన్రీ సెమీస్ వరకు తిరిగి వస్తాడని మేనేజ్మెంట్ చెప్పినా, దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఒక వేళ హెన్రీ రాకపోతే అతని స్థానంలో డఫీ బరిలోకి దిగుతాడు. కివీస్ ఏకంగా ఐదుగురు స్పిన్నర్లతో ఆడుతున్నా ఒక్కరు కూడా ప్రమాదకరంగా కనిపించడం లేదు. అందరూ ధారాళంగా పరుగులిస్తున్నారు. తుది జట్లు (అంచనా) దక్షిణాఫ్రికా: మార్క్రమ్ (కెప్టెన్), డికాక్, రికెల్టన్, బ్రెవిస్, మిల్లర్, స్టబ్స్, యాన్సెన్, బాష్, రబాడ, మహరాజ్, ఎన్గిడి న్యూజిలాండ్: సాంట్నర్ (కెప్టెన్), సీఫెర్ట్, అలెన్, రచిన్, ఫిలిప్స్, చాప్మన్, మిచెల్, మెక్కోన్కీ, సోధి, ఫెర్గూసన్, హెన్రీ / డఫీ5-0 టి20 వరల్డ్ కప్ చరిత్రలో ఇరు జట్ల మధ్య 5 మ్యాచ్లు జరగ్గా...ఐదు కూడా దక్షిణాఫ్రికానే గెలిచింది. పిచ్, వాతావరణంబ్యాటింగ్కు బాగా అనుకూలమైన పిచ్. భారీ స్కోర్లకు అవకాశం ఉంది. మంచు ప్రభావంతక్కువగా ఉన్నా సరే ఇక్కడ ఛేదన చాలా సులువు. భారత్, విండీస్ మధ్య పోరులో కూడా ఇది కనిపించింది. మ్యాచ్ రోజు వర్ష సూచన లేదు. -
T20 WC 2026: సెమీస్కు అంపైర్లు వీరే..!
టీ20 ప్రపంచకప్ 2026 తుది దశకు చేరింది. నాలుగు సెమీఫైనల్ బెర్త్లు ఖరారయ్యాయి. తొలి సెమీఫైనల్లో సౌతాఫ్రికా, న్యూజిలాండ్.. రెండో సెమీఫైనల్లో భారత్-ఇంగ్లండ్ అమీతుమీ తేల్చుకుంటాయి. తొలి సెమీస్ కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా మార్చి 4వ తేదీ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. రెండో సెమీఫైనల్ ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా రాత్రి 7 గంటలకే మొదలవుతుంది.ఈ మ్యాచ్లకు అఫీషియల్స్ జాబితాను (అంపైర్లు, రిఫరీలు) ఐసీసీ ఇవాళ ప్రకటించింది. ఎనిమిది మంది అంపైర్లు, ఇద్దరు మ్యాచ్ రిఫరీల పేర్లను వెల్లడించింది. ఎప్పటిలాగే తటస్థ అధికారులను నియమించింది. సౌతాఫ్రికా వర్సెస్ న్యూజిలాండ్ తొలి సెమీఫైనల్ - ఆన్ ఫీల్డ్ అంపైర్లు: రిచర్డ్ ఇల్లింగ్వర్త్, అలెక్స్ వార్ఫ్ - థర్డ్ అంపైర్: నితిన్ మెనన్ - నాలుగో అంపైర్లు: రాడ్ టక్కర్ - మ్యాచ్ రిఫరీ: జవగల్ శ్రీనాథ్ భారత్ వర్సెస్ ఇంగ్లండ్ రెండో సెమీఫైనల్ - ఆన్ ఫీల్డ్ అంపైర్లు: క్రిస్ గాఫనీ, అల్లాహుద్దీన్ పాలేకర్ - థర్డ్ అంపైర్లు: ఎడ్రియన్ హోల్డ్స్టాక్ - నాలుగో అంపైరు: పాల్ రైఫెల్ - మ్యాచ్ రిఫరీ: ఆండీ పైక్రాఫ్ట్ -
T20 WC 2026: అదే జరిగితే భారత్కు చుక్కెదురే..!
టీ20 ప్రపంచకప్ 2026 తుది దశకు చేరింది. తొలి సెమీఫైనల్లో సౌతాఫ్రికా, న్యూజిలాండ్.. రెండో సెమీఫైనల్లో భారత్-ఇంగ్లండ్ అమీతుమీ తేల్చుకుంటాయి. తొలి సెమీస్ కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా మార్చి 4వ తేదీ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. రెండో సెమీఫైనల్ ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా రాత్రి 7 గంటలకే మొదలవుతుంది.ఈ మ్యాచ్లకు వరుణుడు నుంచి ఎలాంటి ముప్పు లేనప్పటికీ.. ఏదైనా కారణం చేత రద్దైతే పరిస్థితి ఏంటని అభిమానులు చర్చించుకుంటున్నారు. వాస్తవానికి ఈ నాకౌట్ మ్యాచ్లకు ఐసీసీ రిజర్వ్ డే కేటాయించింది. షెడ్యూలైన రోజు మ్యాచ్ జరుగకపోయినా లేక పాక్షికంగా జరిగి ఆగిపోయినా, ఆగిన చోటి నుంచి మరుసటి రోజు మ్యాచ్ను కొనసాగిస్తారు. ఒకవేళ రిజర్వ్ డేలో కూడా మ్యాచ్ సాధ్యపడకపోతే మాత్రం సూపర్-8 దశలో మెరుగైన ఫలితాలు సాధించిన జట్టు ఫైనల్స్కు చేరుకుంటుంది.ఈ లెక్కన తొలి సెమీఫైనల్ ఏ కారణంగా అయినా రద్దైతే, సూపర్-8లో గ్రూప్-1 టాపర్గా ఉన్న సౌతాఫ్రికా ఫైనల్కు వెళ్తుంది. న్యూజిలాండ్ ఇంటిముఖం పడుతుంది. రెండో సెమీఫైనల్ ఏ కారణంగా అయినా రద్దైతే, సూపర్-8లో గ్రూప్-2 టాపర్గా ఉన్న ఇంగ్లండ్ ఫైనల్కు అర్హత సాధిస్తుంది. టీమిండియా టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. కాబట్టి, ఏ కారణంగా కూడా సెమీస్ రద్దు కాకూడదని ప్రతి భారతీయుడు కోరుకుంటున్నాడు. -
T20 WC 2026: ధోని ప్రపంచ రికార్డు బద్దలు
సౌతాఫ్రికా స్టార్ క్రికెటర్ క్వింటన్ డికాక్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్లో ఇంత వరకు ఏ ఆటగాడికీ సాధ్యం కాని ఘనత సాధించాడు. ఈ క్రమంలో భారత దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని పేరిట ఉన్న ప్రపంచ రికార్డును ఈ వికెట్ కీపర్ బ్యాటర్ బద్దలు కొట్టాడు.టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో భాగంగా శనివారం నాటి మ్యాచ్లో సౌతాఫ్రికా న్యూజిలాండ్తో తలపడింది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో టాస్ గెలిచిన సఫారీ జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన కివీస్.. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 175 పరుగులు సాధించింది.యాన్సెన్ నాలుగు వికెట్లతో చెలరేగగా.. ప్రొటిస్ బౌలర్లలో మార్కో యాన్సెన్ (Marco Jansen) నాలుగు వికెట్లతో చెలరేగగా.. ఎంగిడి, కేశవ్ మహరాజ్, బాష్ తలా ఒక వికెట్ దక్కించుకున్నారు. మరోవైపు.. వికెట్ కీపర్ క్వింటన్ డికాక్ (Quinton de Kock) కివీస్ ఓపెనర్ టిమ్ సీఫర్ట్ (13) ఇచ్చిన క్యాచ్ను అందుకున్నాడు.ధోని వరల్డ్ రికార్డు బద్దలుఈ క్రమంలో టీ20 వరల్డ్కప్ టోర్నీలో అత్యధిక డిస్మిసల్స్లో భాగమైన వికెట్ కీపర్గా డికాక్ చరిత్రకెక్కాడు. ఇంతకుముందు ఈ రికార్డు ధోని పేరిట ఉండేది. టీ20 ప్రపంచకప్ ఈవెంట్లో ధోని 32 ఇన్నింగ్స్లో 32 డిస్మిసల్స్లో భాగం కాగా.. డికాక్ 30 ఇన్నింగ్స్లోనే 33 సార్లు ప్రత్యర్థి బ్యాటర్ అవుట్ కావడంలో తన వంతు పాత్ర పోషించాడు.ఇదిలా ఉంటే.. కివీస్ విధించిన నామమాత్రపు లక్ష్యంతో ఛేదనకు దిగిన సౌతాఫ్రికా 17.1 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు నష్టపోయి 178 పరుగులు సాధించింది. తద్వారా న్యూజిలాండ్పై ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కెప్టెన్, ఓపెనింగ్ బ్యాటర్ ఐడెన్ మార్క్రమ్ మెరుపు, అజేయ అర్ధ శతకం (44 బంతుల్లో 86)తో రాణించి గెలుపులో కీలక పాత్ర పోషించాడు. ఇక మరో ఓపెనర్ డికాక్ మాత్రం (14 బంతుల్లో 20) నిరాశపరిచాడు.Aiden Markram goes big over long-on for his third six of the innings! 💥The Proteas have started strong, racing past the 50-run mark in under 4 overs.ICC Men’s #T20WorldCup | #NZvSA | LIVE NOW 👉https://t.co/QWNvn10eTj pic.twitter.com/Fz1rZvafPE— Star Sports (@StarSportsIndia) February 14, 2026టీ20 ప్రపంచకప్ టోర్నీలో అత్యధిక డిస్మిసల్స్లో భాగమైన వికెట్ కీపర్లు👉క్వింటన్ డికాక్ (సౌతాఫ్రికా)- 33 డిస్మిసల్స్👉ఎంఎస్ ధోని (ఇండియా)- 32 డిస్మిసల్స్👉కమ్రాన్ అక్మల్ (పాకిస్తాన్)- 30 డిస్మిసల్స్👉దినేశ్ రామ్దిన్ (వెస్టిండీస్)- 27 డిస్మిసల్స్.చదవండి: IND vs PAK: అతడి ఆటకు మేము లొంగిపోము: సూర్య -
న్యూజిలాండ్ క్రికెటర్ వరల్డ్ రికార్డు.. చరిత్రలోనే తొలి ‘ప్లేయర్’గా..
న్యూజిలాండ్ వెటరన్ క్రికెటర్ సుజీ బేట్స్ (Suzie Bates) సరికొత్త చరిత్ర లిఖించింది. మహిళల క్రికెట్లో 350 మ్యాచ్ల క్లబ్లో చేరిన తొలి ప్లేయర్గా ప్రపంచ రికార్డు సాధించింది. ఐసీసీ మహిళల వన్డే వరల్డ్కప్-2025 (ICC Womens World Cup)లో భాగంగా సౌతాఫ్రికాతో మ్యాచ్ సందర్భంగా సుజీ బేట్స్ ఈ ఫీట్ నమోదు చేసింది.చేదు అనుభవంఅయితే, మహిళా క్రికెట్ చరిత్రలోనే అరుదైన ఘట్టానికి చేరువైన వేళ.. సుజీ బేట్స్కు ఓ చేదు అనుభవం మాత్రం తప్పలేదు. కాగా న్యూజిలాండ్ తరఫున 2006లో అరంగేట్రం చేసిన ఈ బ్యాటింగ్ ఆల్రౌండర్ ఇప్పటికీ జట్టులో ప్రధాన సభ్యురాలిగా కొనసాగుతుండటం విశేషం.గోల్డెన్ డకౌట్తన సుదీర్ఘ కెరీర్లో ఇప్పటి వరకు 172 వన్డేలు.. 177 అంతర్జాతీయ టీ20 మ్యాచ్లు ఆడింది సుజీ బేట్స్. సౌతాఫ్రికా మహిళలతో సోమవారం నాటి వరల్డ్కప్ మ్యాచ్ సందర్భంగా 173వ వన్డే ఆడిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. ఓవరాల్గా అంతర్జాతీయ స్థాయిలో 350 మ్యాచ్ల మైలురాయిని చేరుకుంది. అయితే, ఈ మ్యాచ్లో సుజీ బేట్స్ గోల్డెన్ డకౌట్గా వెనుదిరగడం గమనార్హం.Dream start for South Africa! 🔥Marizanne Kapp makes an instant impact. Suzie Bates is gone!Catch the LIVE action ➡ https://t.co/UaXsqrDnrA#CWC25 👉 NZ 🆚 SA | LIVE NOW on Star Sports & JioHotstar! pic.twitter.com/6cWC1BwnKh— Star Sports (@StarSportsIndia) October 6, 2025 న్యూజిలాండ్ తరఫున ఇన్నింగ్స్ ఆరంభించిన సుజీ.. సౌతాఫ్రికా పేసర్ మరిజానే కాప్ బౌలింగ్లో లెగ్ బిఫోర్ వికెట్గా పెవిలియన్ చేరింది. కాగా సుజీ బేట్స్ ఇప్పటి వరకు వైట్ఫెర్న్స్ తరఫున వన్డేల్లో మొత్తంగా 5896, టీ20లలో 4716 పరుగులు సాధించింది.మరో విశేషం ఏమిటంటే..ఇక మ్యాచ్ విషయానికొస్తే.. ఇండోర్ వేదికగా సౌతాఫ్రికా వుమెన్ జట్టుతో మ్యాచ్లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ మహిళా టీమ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుని.. 25 ఓవర్ల ఆట ముగిసే సరికి రెండు వికెట్ల నష్టానికి 101 పరుగులు సాధించింది. ఇదిలా ఉంటే..న్యూజిలాండ్ కెప్టెన్ సోఫీ డివైన్కు ఇది 300వ అంతర్జాతీయ మ్యాచ్ కావడం మరో విశేషం.మహిళల క్రికెట్లో అత్యధిక అంతర్జాతీయ మ్యాచ్లు ఆడిన టాప్-5 ప్లేయర్లు వీరే👉సుజీ బేట్స్ (న్యూజిలాండ్)- 350👉హర్మన్ప్రీత్ కౌర్ (ఇండియా)- 342👉ఎలిస్ పెర్రీ (ఆస్ట్రేలియా)- 341👉మిథాలీ రాజ్ (ఇండియా)- 333👉చార్లెట్ ఎడ్వర్డ్స్ (ఇంగ్లండ్)- 309.చదవండి: ‘మీ నాన్నతో కలిసి ఆటో తోలుకో’;.. ధోని ఆరోజు చెప్పిన మాటతో ఇలా..: సిరాజ్ -
చెలరేగిన హెన్రీ.. సౌతాఫ్రికాను చిత్తు చేసిన న్యూజిలాండ్
జింబాబ్వేలో జరుగుతున్న ముక్కోణపు టీ20 సిరీస్లో న్యూజిలాండ్ శుభారంభం చేసింది. బుధవారం హరారే స్పోర్ట్స్ క్లబ్లో సౌతాఫ్రికాను 21 పరుగుల తేడాతో న్యూజిలాండ్ చిత్తు చేసింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది.కివీస్ ఓపెనర్లు సీఫర్ట్(22), కాన్వే(9) ఆరంభంలోనే ఔటయ్యారు. ఆ తర్వాత సీనియర్ బ్యాటర్ డార్లీ మిచెల్(5), వికెట్ కీపర్ హే(5) సింగిల్ డిజిట్ స్కోర్లకే వెనుదిరిగారు. ఈ సమయంలో టిమ్ రాబిన్సన్(75), డెవాన్ జాకబ్స్(44).. ప్రత్యర్ధి బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. వీరిద్దరూ ఐదో వికెట్కు 105 పరుగుల ఆజేయ భాగస్వామ్యం నెలకొల్పారు. సౌతాఫ్రికా బౌలర్లలో మఫాక రెండు, ఎంగిడీ, ముత్తుసామి, కోట్జీ తలా వికెట్ సాధించారు.అనంతరం లక్ష్య చేధనలో సౌతాఫ్రికా 18.2 ఓవర్లలో 152 పరుగులకే కుప్పకూలింది. ప్రోటీస్ బ్యాటర్లలో బ్రెవిస్(35) టాప్ స్కోరర్గా నిలవగా.. లిండే(30), ప్రిటోరియస్(27) పర్వాలేదన్పించారు. కివీస్ బౌలర్లలో మాట్ హెన్రీ, జాకబ్ డఫీ తలా మూడు వికెట్లు పడగొట్టగా.. సోధీ రెండు, శాంట్నర్ ఓ వికెట్ సాధించారు.చదవండి: Virat kohli: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్గా -
సౌతాఫ్రికా, జింబాబ్వేలతో సిరీస్కు కివీస్ జట్టు ప్రకటన
జింబాబ్వే- సౌతాఫ్రికాలతో ముక్కోణపు టీ20 సిరీస్ (T20 Tri Series)కు న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు తమ జట్టును ప్రకటించింది. మిచెల్ సాంట్నర్ కెప్టెన్సీలోని ఈ జట్టులో పేసర్ ఆడం మిల్నే (Adam Milne) తిరిగి రాగా.. బెవాన్ జేకబ్స్ (Bevon Jacobs) తొలిసారి చోటు దక్కించుకున్నాడు. మరోవైపు.. కొంత మంది సీనియర్లు మాత్రం వివిధ కారణాల వల్ల దూరమయ్యారు.కేన్ మామ ఎందుకు దూరం అయ్యాడంటే?మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్తో పాటు పేసర్లు లాకీ ఫెర్గూసన్, బెన్ సియర్స్, కైలీ జెమీషన్.. అదే విధంగా.. బ్యాటర్ డెవాన్ కాన్వే ఈ త్రైపాక్షిక సిరీస్కు దూరంగా ఉండనున్నారు. విలియమ్సన్ ప్రస్తుతం ఇంగ్లండ్ కౌంటీల్లో మిడిల్సెక్స్ జట్టుకు ఆడుతుండటంతో.. సెలక్షన్కు అందుబాటులో లేకుండా పోయాడు.ఇక పక్కటెముకల నొప్పి కారణంగా బెన్ సియర్స్ జట్టుకు దూరం కాగా.. ఫెర్గూసన్కు పనిభారం తగ్గించే నిమిత్తం విశ్రాంతినిచ్చారు. మరోవైపు.. జెమీషన్ తమ మొదటి సంతానానికి ఆహ్వానం పలికే క్రమంలో సెలవు తీసుకున్నాడు.వారిద్దరి రీ ఎంట్రీఈ జింబాబ్వే- సౌతాఫ్రికాలతో సిరీస్ సందర్భంగా ఆల్రౌండర్లు గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర తిరిగి జట్టులోకి రాగా.. కెప్టెన్ సాంట్నర్ కూడా రీఎంట్రీ ఇచ్చాడు. కాగా ఐపీఎల్-2025లో ముంబై ఇండియన్స్కు ప్రాతినిథ్యం వహించిన సాంట్నర్ ప్లే ఆఫ్స్ కారణంగా పాకిస్తాన్తో సిరీస్కు దూరంగా ఉన్న విషయం తెలిసిందే.ఇక అన్క్యాప్డ్ ప్లేయర్ బెవాన్ జేకబ్స్ తొలిసారి జట్టులోకి రాగా.. మిల్నే కూడా రీఎంట్రీ ఇచ్చాడు. కాగా ఈ సిరీస్తో న్యూజిలాండ్ టీ20 ప్రపంచకప్-2026 సన్నాహకాలు ఆరంభించనుంది. ఈ విషయాల గురించి కొత్త కోచ్ రాబ్ వాల్టర్ మాట్లాడుతూ.. ‘‘బెవాన్ దేశీ క్రికెట్లో, ఫ్రాంఛైజీ క్రికెట్లో అద్భుత ప్రదర్శన కనబరిచాడు. ఇక మిల్నే నైపుణ్యాలున్న టీ20 బౌలర్.ఫెర్గూసన్, సియర్స్, జెమీషన్ లేరు కాబట్టి మిల్నే రాకతో ప్రయోజనం చేకూరుతుంది. వరల్డ్కప్నకు సన్నద్ధమయ్యే క్రమంలో మాకు సిరీస్ ఎంతో ముఖ్యమైనది. వైవిధ్యంతో కూడిన జట్టును అందుకే ఎంపిక చేశాం’’ అని పేర్కొన్నాడు.జింబాబ్వే- సౌతాఫ్రికాలతో ట్రై సిరీస్కు న్యూజిలాండ్ జట్టుమిచెల్ సాంట్నర్ (కెప్టెన్), ఫిన్ అలెన్, మైకేల్ బ్రేస్వెల్, మార్క్ చాప్మన్, జాకబ్ డఫీ, జాక్ ఫౌల్క్స్, మ్యాట్ హెన్రీ, బెవాన్ జేకబ్స్, ఆడమ్ మిల్నే, డారిల్ మిచెల్, విల్ ఓ రూర్కే, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, టిమ్ సీఫెర్ట్, ఇష్ సోధి.చదవండి: భారత్-ఇంగ్లండ్ వన్డే, టీ20 సిరీస్.. షెడ్యూల్, జట్లు తదితర వివరాలు ఇవే -
IND vs NZ: ఇది సరికాదు!.. ఫైనల్లో కివీస్ గెలవాలి: సౌతాఫ్రికా స్టార్
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) ఫైనల్లో తన మద్దతు న్యూజిలాండ్ జట్టుకేనని సౌతాఫ్రికా స్టార్ క్రికెటర్ డేవిడ్ మిల్లర్(David Miller) అన్నాడు. టైటిల్ పోరులో తలపడే టీమిండియా- కివీస్ రెండూ పటిష్ట జట్లే అయినప్పటికీ తాను మాత్రం సాంట్నర్ బృందం వైపే ఉంటానని స్పష్టం చేశాడు. సెమీ ఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో ఓటమి అనంతరం మిల్లర్ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. సెమీస్ మ్యాచ్ల షెడ్యూల్ పట్ల అతడికి ఉన్న అసంతృప్తే ఇందుకు కారణమని తెలుస్తోంది.కాగా ఫిబ్రవరి 19న పాకిస్తాన్(Pakistan) వేదికగా చాంపియన్స్ ట్రోఫీ మొదలుకాగా.. భారత జట్టు మాత్రం తటస్థ వేదికైన దుబాయ్లో తమ మ్యాచ్లు ఆడుతోంది. టీమిండియాతో మ్యాచ్ల కోసం గ్రూప్-‘ఎ’లో భాగమైన బంగ్లాదేశ్, పాకిస్తాన్, న్యూజిలాండ్ పాక్ నుంచి దుబాయ్కు ప్రయాణం చేయాల్సి వచ్చింది. ఇక రోహిత్ సేన సెమీస్ చేరడంతో గ్రూప్-బి నుంచి పోటీదారు ఎవరన్న అంశంపై ముందే స్పష్టత లేదు కాబట్టి ఆస్ట్రేలియాతో పాటు సౌతాఫ్రికా కూడా అరబిక్ దేశానికి రావాల్సి వచ్చింది.అయితే, గ్రూప్ దశలో ఆఖరిగా కివీస్పై విజయం సాధించిన భారత్.. గ్రూప్-ఎ టాపర్గా నిలవగా.. గ్రూప్-బి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా దుబాయ్లోనే ఉండిపోగా.. సౌతాఫ్రికా వెంటనే న్యూజిలాండ్తో సెమీస్ ఆడేందుకు పాకిస్తాన్కు తిరిగి వచ్చింది.ఈ పరిణామాల నేపథ్యంలో డేవిడ్ మిల్లర్ మాట్లాడుతూ.. ‘‘మా షెడ్యూల్ ఏమాత్రం బాగా లేదు. దుబాయ్కి ప్రయాణం గంటా 40 నిమిషాలే కావచ్చు. కానీ మేం వెళ్లక తప్పలేదు. మ్యాచ్ ముగిసిన తర్వాతే ఆ రోజే సిద్ధమై సాయంత్రం దుబాయ్కు వెళ్లాం. సోమవారం తెల్లవారుజామున మళ్లీ పాకిస్తాన్కు వచ్చాం’ అని మిల్లర్ అన్నాడు.ఇక ఫైనల్లో టీమిండియా- కివీస్ తలపడనున్న తరుణంలో.. ‘‘ప్రతి ఒక్క జట్టు తమ అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు ప్రయత్నిస్తుంది. నిజానికి టీమిండియాతో మేము మరోసారి ఫైనల్ ఆడే పరిస్థితి ఉంటే ఎంతో బాగుండేది. కానీ మనం అనుకున్నవన్నీ జరగవు. ఏదేమైనా ట్రోఫీ గెలిచేందుకు ప్రతి ఒక్క ఆటగాడు కఠినశ్రమకు ఓర్చి అంకితభావంతో పనిచేస్తాడని చెప్పగలను. భారత్, న్యూజిలాండ్లు పటిష్టమైన జట్లే అయినా.. నిజాయితీగా చెప్పాలంటే.. నేను మాత్రం కివీస్ గెలవాలనే కోరుకుంటున్నా’’ అని డేవిడ్ మిల్లర్ పేర్కొన్నాడు.కాగా రెండో సెమీ ఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో సౌతాఫ్రికా ఓడిపోయిన విషయం తెలిసిందే. లాహోర్ వేదికగా బుధవారం జరిగిన ఈ మ్యాచ్లో కివీస్ రికార్డు స్థాయిలో నిర్ణీత యాభై ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 362 పరుగులు సాధించింది. అయితే, లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా 312 పరుగులకే పరిమితమైంది. దీంతో డేవిడ్ మిల్లర్ వీరోచిత, విధ్వంసకర శతకం వృథాగా పోయింది. మిల్లర్ 67 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 100 పరుగులతో అజేయంగా నిలిచాడు.ఇదిలా ఉంటే.. టీ20 ప్రపంచకప్-2024 ఫైనల్లో టీమిండియా- సౌతాఫ్రికా తలపడిన విషయం తెలిసిందే. అయితే, ప్రొటిస్ జట్టు ఆఖరి వరకు పోరాడినా ఫలితం లేకుండా పోయింది. రోహిత్ సే న ఏడు పరుగుల స్వల్ప తేడాతో గెలిచి చాంపియన్గా నిలిచింది.ఇక... ఐసీసీ టోర్నమెంట్లలో కీలక సమయాల్లో చేతులెత్తేసి చోకర్స్గా ముద్రపడ్డ సౌతాఫ్రికా ఖాతాలో ఉన్న ఏకైక ఐసీసీ టైటిల్ చాంపియన్స్ ట్రోఫీ మాత్రమే. 1998లో ప్రొటిస్ జట్టు విజేతగా నిలిచింది. ఆ తర్వాత పలు సందర్భాల్లో అద్భుత ప్రదర్శనతో సెమీస్, ఫైనల్ చేరినా ఇంత వరకు ట్రోఫీని మాత్రం ముద్దాడలేకపోయింది. -
ఆ నలుగురి వల్లే ఈ ఓటమి.. కానీ అతడు మాత్రం అద్బుతం: బవుమా
సౌతాఫ్రికా క్రికెట్ జట్టు మరోసారి సెమీస్ గండాన్ని దాటలేకపోయింది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో లహోర్ వేదికగా న్యూజిలాండ్తో జరిగిన రెండో సెమీఫైనల్లో 50 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా ఓటమి పాలైంది. డేవిడ్ మిల్లర్ 363 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 312 పరుగులు మాత్రమే చేయగలిగింది. డేవిడ్ మిల్లర్ విరోచిత సెంచరీతో పోరాడినా విజయం మాత్రం ప్రోటీస్కు దక్కలేదు. లక్ష్య చేధనలో దక్షిణాఫ్రికా 218 పరుగులకే 8 వికెట్లు కోల్పోయింది. ఈ సమయంలో మిల్లర్ విధ్వంసం సృష్టించాడు. వరుస బౌండరీలతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. కానీ అప్పటికే మ్యాచ్ సఫారీల చేజారిపోయింది. మిల్లర్ 67 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సులతో 100 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. కెప్టెన్ టెంబా బవుమా (56), వాన్ డర్ డుసెన్ (69) అర్ధసెంచరీలతో రాణించారు. కివీస్ బౌలర్లలో మిచెల్ శాంట్నర్ మూడు కీలక వికెట్లు పడగొట్టి సఫారీలను దెబ్బతీశాడు. అతడితో పాటు ఫిలిప్స్, హెన్రీ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. రవీంద్ర, బ్రెస్వెల్ ఓ వికెట్ సాధించారు.అంతకుముందు బ్యాటింగ్ చేసిన కివీస్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 362 పరుగుల భారీ స్కోర్ సాధించింది. న్యూజిలాండ్ బ్యాటర్లలో రచిన్ రవీంద్ర(108), విలియమ్సన్(102) సెంచరీలతో మెరిశారు.ఇక సెమీస్లో ఓటమిపై మ్యాచ్ అనంతరం ప్రోటీస్ కెప్టెన్ టెంబా బవుమా స్పందించాడు. భాగస్వామ్యాలు రాకపోవడంతోనే ఈ మ్యాచ్లో ఓటమిపాలైమని బావుమా తెలిపాడు."న్యూజిలాండ్ మా ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. అయితే వారు బ్యాటింగ్ చేసిన విధానం చూసి మేం సునాయసంగా 350 పైగా పరుగుల లక్ష్యాన్ని చేధిస్తామని భావించాను. కానీ మేము అలా చేయలేకపోయాము. ముఖ్యంగా భాగస్వామ్యాలను సాధించలేకపోయాము.కేవలం రెండు భాగస్వామ్యాలు మాత్రమే వచ్చాయి. మిడిల్ ఓవర్లలో రాస్సీ లేదా నేను ఎవరో ఒకరు ఛాన్స్ తీసుకోవాలని అనుకున్నాము. ఎందుకంటే 360 పరుగుల లక్ష్యం చేధన అంత ఈజీ కాదు. ఈ ప్రయత్నంలోనే నా వికెట్ కోల్పోవల్సి వచ్చింది. ఆ తర్వాత రాస్సీ కూడా దురదృష్టవశాత్తూ పెవిలియన్కు చేరాల్సి వచ్చింది.అయితే మేము ఔటయ్యాక ఎవరో ఒకరు భారీ ఇన్నింగ్స్ ఆడాలని కోరున్నాము. మేము అనుకున్నట్లు డేవిడ్ మిల్లర్ ఆ బాధ్యత తీసుకున్నాడు. మిల్లర్ గత కొన్నేళ్లగా మా జట్టుకు ఎన్నో అద్బుతమైన విజయాలు అందించాడు. ఈ రోజు కూడా అతడిపై ఆశలు పెట్టకున్నాము. కానీ అతడికి సహకరించే వారు లేకపోవడంతో ఓటమి పాలైము. ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ బ్యాటర్లు అద్బుతమైన ప్రదర్శన కనబరిచారు. గ్యాప్స్ రాబట్టి వారు బౌండరీల సాధించిన తీరు నన్ను ఎంతోగానే ఆకట్టుకుంది. మిడిల్ ఓవర్లలో మేము వికెట్లు తీయలేకపోయాము. రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్కు క్రెడిట్ ఇవ్వాలి. ఈ రోజు వారిద్దరూ చాలా బాగా ఆడారు. ఆఖరిలో ఫిలిప్స్, మిచెల్ కూడా దూకుడుగా ఆడి మాపై ఒత్తిడి పెంచారు. ఏదేమైనప్పటికి వారు మా కంటే మెరుగైన క్రికెట్ ఆడారు" అని బవుమా పేర్కొన్నాడు.చదవండి: ఛాంపియన్స్ ట్రోఫీలో ఫెయిల్.. రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ క్రికెటర్ -
CT 2025: సౌతాఫ్రికాను చిత్తు చేసిన న్యూజిలాండ్.. ఫైనల్లో టీమిండియాతో అమీతుమీ
ఇవాళ (మార్చి 5) జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ-2025 రెండో సెమీఫైనల్లో సౌతాఫ్రికాపై న్యూజిలాండ్ 50 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా మార్చి 9న జరిగే ఫైనల్లో టీమిండియాతో అమీతుమీకి అర్హత సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ రచిన్ రవీంద్ర (101 బంతుల్లో 108; 13 ఫోర్లు, సిక్స్), కేన్ విలియమ్సన్ (94 బంతుల్లో 102; 10 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీలతో కదంతొక్కడంతో నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 362 పరుగుల భారీ స్కోర్ చేసింది. డారిల్ మిచెల్ 49 పరుగులతో (37 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్) రాణించగా.. ఆఖర్లో గ్లెన్ ఫిలిప్స్ (27 బంతుల్లో 49 నాటౌట్; 6 ఫోర్లు, సిక్స్) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. సౌతాఫ్రికా బౌలర్లలో ఎంగిడి 3, రబాడ 2, ముల్దర్ ఓ వికెట్ పడగొట్టారు.భారీ లక్ష్య ఛేదనలో తడబడిన సౌతాఫ్రికా నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 312 పరుగులు మాత్రమే చేయగలిగింది. బవుమా (56), డసెన్ (69) అర్ద సెంచరీలతో రాణించగా.. ఆఖర్లో పోరాడితే పోయేదేమీ లేదన్నట్లు ఆడి మిల్లర్ మెరుపు సెంచరీ (67 బంతుల్లో 100 నాటౌట్; 10 ఫోర్లు, 4 సిక్సర్లు) బాదాడు. మిల్లర్ చివరి బంతికి రెండు పరుగులు తీసి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కివీస్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ 3 వికెట్లు తీసి సౌతాఫ్రికా విజయావకాశాలను దెబ్బకొట్టాడు. మ్యాట్ హెన్రీ, గ్లెన్ ఫిలిప్స్ తలో 2, బ్రేస్వెల్, రచిన్ రవీంద్ర చెరో వికెట్ పడగొట్టారు. భారత్, న్యూజిలాండ్ మధ్య ఫైనల్ మ్యాచ్ దుబాయ్ వేదికగా జరుగనుంది. కాగా, తొలి సెమీఫైనల్లో టీమిండియా ఆసీస్పై ఘన విజయం సాధించి వరుసగా మూడోసారి, ఓవరాల్గా ఐదోసారి ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్కు అర్హత సాధించింది. సెమీస్లో విరాట్ కోహ్లి చిరస్మరణీయమైన ఇన్నింగ్స్ ఆడి భారత్ గెలుపులో కీలకపాత్ర పోషించాడు. చరిత్ర సృష్టించిన కేన్ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు కేన్ విలియమ్సన్ ఓ అరుదైన మైలురాయిని తాకాడు. 27 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అంతర్జాతీయ క్రికెట్లో 19000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి న్యూజిలాండ్ ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. కేన్ తన 370వ అంతర్జాతీయ మ్యాచ్లో ఈ ఘనత సాధించాడు.48వ శతకం.. స్టీవ్ స్మిత్ రికార్డు సమంనేటి మ్యాచ్లో సెంచరీతో కేన్ వన్డేల్లో 15వ సెంచరీ, ఓవరాల్గా (మూడు ఫార్మాట్లలో) 48వ సెంచరీని నమోదు చేశాడు. ప్రస్తుతం యాక్టివ్గా ఉన్న క్రికెటర్లలో అత్యధిక వన్డే సెంచరీలు (మూడు ఫార్మాట్లలో) చేసిన ఆటగాళ్ల జాబితాలో కేన్ నాలుగో స్థానానికి ఎగబాకాడు. ఈ క్రమంలో ఆసీస్ స్టార్ ఆటగాడు, ఫాబ్ ఫోర్లో ఒకడైన స్టీవ్ స్మిత్ రికార్డును సమం చేశాడు. అంతర్జాతీయ క్రికెట్లో యాక్టివ్గా ఉన్న క్రికెటర్లలో అత్యధిక సెంచరీలు చేసిన రికార్డు విరాట్ కోహ్లి (82) పేరిట ఉంది. ఓవరాల్గా అత్యధిక సెంచరీలు చేసిన రికార్డు సచిన్ (100) పేరిట ఉంది. రచిన్ రికార్డు శతకంఈ మ్యాచ్లో సెంచరీతో రచిన్ కూడా రికార్డుల్లోకెక్కాడు. కివీస్ తరఫున ఐసీసీ వన్డే టోర్నీల్లో అత్యధిక శతకాలు (5) బాదిన క్రికెటర్గా చరిత్ర సృష్టించాడు. ఈ టోర్నీ ప్రస్తుత ఎడిషన్లో రచిన్కు ఇది రెండో శతకం కాగా.. అంతకుముందు భారత్లో జరిగిన 2023 వన్డే వరల్డ్కప్లో మూడు సెంచరీలు బాదాడు. -
SA vs NZ: రచిన్ రవీంద్ర సరికొత్త చరిత్ర.. కివీస్ తొలి ప్లేయర్గా రికార్డు
ఐసీసీ వన్డే టోర్నమెంట్లలో న్యూజిలాండ్ యువ బ్యాటర్ రచిన్ రవీంద్ర(Rachin Ravindra) జోరు కొనసాగుతోంది. చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) సెమీ ఫైనల్లో భాగంగా సౌతాఫ్రికా(New Zealand vs South Africa)తో మ్యాచ్లో ఈ ఎడమచేతి వాటం బ్యాటర్ మళ్లీ శతక్కొట్టాడు. తద్వారా కివీస్ తరఫున ఐసీసీ వన్డే టోర్నీల్లో అత్యధిక శతకాలు బాదిన క్రికెటర్గా చరిత్ర సృష్టించాడు.అంతేకాదు.. తక్కువ ఇన్నింగ్స్లోనే అధిక సెంచరీలు కొట్టిన కివీస్ బ్యాటర్గానూ రచిన్ రవీంద్ర చరిత్రకెక్కాడు. కాగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 ఎడిషన్ రెండో సెమీ ఫైనల్లో సౌతాఫ్రికా- న్యూజిలాండ్ మధ్య మ్యాచ్కు లాహోర్ వేదిక.గడాఫీ స్టేడియంలో బుధవారం నాటి ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్కు దిగింది. ఓపెనర్ విల్ యంగ్(23 బంతుల్లో 21) తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరగా.. మరో ఓపెనర్ రచిన్ రవీంద్ర మాత్రం అదరగొట్టాడు. 93 బంతుల్లోనే వంద పరుగుల మార్కు అందుకున్న రచిన్.. కేన్ విలియమ్సన్తో కలిసి రెండో వికెట్కు 180 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి జట్టును పటిష్ట స్థితిలో నిలిపాడు.ఇదిలా ఉంటే.. రచిన్ రవీంద్రకు వన్డేల్లో ఇది ఐదో శతకం కావడం గమనార్హం. అయితే, ఇప్పటి వరకు అతడు యాభై ఓవర్ల ఫార్మాట్లో సాధించిన ఈ ఐదు సెంచరీలు ఐసీసీ టోర్నమెంట్లలోనే సాధించడం విశేషం. భారత్ వేదికగా వన్డే వరల్డ్కప్-2023లో రచిన్ రవీంద్ర ఏకంగా మూడు శతకాలు బాదాడు.తాజాగా చాంపియన్స్ ట్రోఫీ-2025 ఈవెంట్లో గాయం కారణంగా పాకిస్తాన్తో మ్యాచ్కు దూరమైనప్పటికీ.. ఆ తర్వాత బంగ్లాదేశ్(112)తో మ్యాచ్లో రీఎంట్రీ ఇచ్చి శతక్కొట్టాడు. తద్వారా ఐసీసీ వన్డే టోర్నీల్లో నాలుగో శతకం అందుకున్న 25 ఏళ్ల రచిన్.. తాజాగా పటిష్ట సౌతాఫ్రికాపై సెంచరీ కొట్టి ఈ సంఖ్యను ఐదుకు పెంచుకున్నాడు. తద్వారా రచిన్ రవీంద్ర పలు రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు. తక్కువ ఇన్నింగ్స్లో కివీస్ తరఫున వన్డేల్లో అధిక సెంచరీలు చేసిన జాబితాలో రెండో స్థానం దక్కించుకోవడంతో పాటు.. పిన్న వయసులో ఈ ఘనత సాధించిన రెండో కివీస్ ఆటగాడిగా నిలిచాడు.ఇదిలా ఉంటే సౌతాఫ్రికాతో మ్యాచ్లో రచిన్(101 బంతుల్లో 108, 13 ఫోర్లు, ఒక సిక్సర్)తో పాటు కేన్ విలియమ్సన్ కూడా శతకంతో చెలరేగాడు. వీరిద్దరికి తోడు డారిల్ మిచెల్(37 బంతుల్లో 49), గ్లెన్ ఫిలిప్స్(27 బంతుల్లో 49 నాటౌట్) దుమ్ములేపారు. ఫలితంగా నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయిన న్యూజిలాండ్.. రికార్డు స్థాయిలో 362 పరుగులు చేసింది. న్యూజిలాండ్ తరఫున తక్కువ ఇన్నింగ్స్లో ఐదు సెంచరీలు చేసిన ఆటగాళ్లు👉డెవాన్ కాన్వే- 22 ఇన్నింగ్స్లోరచిన్ రవీంద్ర- 28 ఇన్నింగ్స్లోడారిల్ మిచెల్- 30 ఇన్నింగ్స్లోకేన్ విలియమ్సన్- 56 ఇన్నింగ్స్లోనాథన్ ఆస్ట్లే- 64 ఇన్నింగ్స్లోపిన్న వయసులో వన్డేల్లో ఐదు శతకాలు బాదిన ఆటగాళ్లు24 ఏళ్ల 165 రోజుల వయసులో కేన్ విలియమ్సన్25 ఏళ్ల 107 రోజుల వయసులో రచిన్ రవీంద్ర.చదవండి: కోహ్లి పైపైకి.. -
SA VS NZ 2nd Semis: ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలోనే అత్యధిక స్కోర్ నమోదు
ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలోనే అత్యధిక స్కోర్ నమోదైంది. 2025 ఎడిషన్లో భాగంగా సౌతాఫ్రికాతో ఇవాళ (మార్చి 5) జరుగుతున్న రెండో సెమీఫైనల్లో న్యూజిలాండ్ 6 వికెట్ల నష్టానికి 362 పరుగులు భారీ స్కోర్ చేసింది. ఈ మ్యాచ్కు ముందు ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక స్కోర్ రికార్డు ఆస్ట్రేలియా పేరిట ఉంది. ఇదే ఎడిషన్లో ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్లో ఆసీస్ 356 పరుగులు చేసింది. ఆ మ్యాచ్లో ఇంగ్లండ్ నిర్దేశించిన 352 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తూ ఆసీస్ ఈ రికార్డు స్కోర్ సాధించింది.ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో టాప్-5 అత్యధిక స్కోర్లు362 - న్యూజిలాండ్ vs దక్షిణాఫ్రికా, 2025356 - ఆస్ట్రేలియా vs ఇంగ్లండ్, 2025351 - ఇంగ్లండ్ vs ఆస్ట్రేలియా, 2025347 - న్యూజిలాండ్ vs USA, 2004338 - పాకిస్తాన్ vs ఇండియా, 2017331 - ఇండియా vs సౌత్ ఆఫ్రికా, 2013ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ చేసిన స్కోర్ ఐసీసీ వన్డే టోర్నమెంట్ల నాకౌట్ మ్యాచ్ల్లో మూడో అత్యధిక స్కోర్గా (362) రికార్డైంది. ఐసీసీ వన్డే టోర్నమెంట్ల నాకౌట్ మ్యాచ్ల్లో అత్యధిక స్కోర్ రికార్డు టీమిండియా పేరిట ఉంది. 2023 వన్డే వరల్డ్కప్ సెమీఫైనల్లో భారత్ న్యూజిలాండ్పై 397 పరుగులు చేసింది.ఐసీసీ వన్డే టోర్నమెంట్ల నాకౌట్ మ్యాచ్ల్లో టాప్-5 అత్యధిక స్కోర్లు397/4 - IND vs NZ, ముంబై , CWC 2023 SF393/6 - NZ vs WI, వెల్లింగ్టన్, CWC 2015 QF362/6 - NZ vs SA, లాహోర్, CT 2025 SF359/2 - AUS vs IND, జోహన్నెస్బర్గ్, CWC 2003 ఫైనల్338/4 - PAK vs IND, ది ఓవల్, CT 2017 ఫైనల్రచిన్, విలియమ్సన్ శతకాలుమ్యాచ్ విషయానికొస్తే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్.. రచిన్ రవీంద్ర (108), కేన్ విలియమ్సన్ (102) సెంచరీలతో కదంతొక్కడంతో నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 362 పరుగుల భారీ స్కోర్ చేసింది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్లో విల్ యంగ్ 21, డారిల్ మిచెల్ 49, టామ్ లాథమ్ 4, బ్రేస్వెల్ 16 పరుగులు చేసి ఔట్ కాగా.. ఆఖర్లో గ్లెన్ ఫిలిప్స్ (49 నాటౌట్) సుడిగాలి ఇన్నింగ్స్ ఆడాడు. సౌతాఫ్రికా బౌలర్లలో ఎంగిడి 3, రబాడ 2, ముల్దర్ ఓ వికెట్ తీశారు.ఛేదిస్తే చరిత్రేవన్డే క్రికెట్లో కేవలం రెండు సందర్భాల్లో మాత్రమే నేడు కివీస్ నిర్దేశించిన టార్గెట్ (363) కంటే ఎక్కువ లక్ష్యాలు ఛేదించబడ్డాయి. ఈ రెండు సార్లు భారీ లక్ష్యాలను సౌతాఫ్రికానే ఛేదించింది. రెండు సందర్భాల్లో సౌతాఫ్రికా ప్రత్యర్థి ఆస్ట్రేలియానే కావడం విశేషం. 2006లో సౌతాఫ్రికా 435 పరుగుల లక్ష్యాన్ని విజయవంతగా ఛేదించింది. ఆతర్వాత 2016లో 372 లక్ష్యాన్ని ఊదేసింది. -
CT 2025, SA VS NZ 2nd Semis: 48వ శతకం.. స్మిత్ రికార్డును సమం చేసిన కేన్ మామ
ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భాగంగా సౌతాఫ్రికాతో ఇవాళ (మార్చి 5) జరుగుతున్న రెండో సెమీఫైనల్లో న్యూజిలాండ్ ఆటగాళ్లు రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్ సెంచరీలతో విరుచుకుపడ్డారు. న్యూజిలాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ చేస్తుండగా.. తొలుత రచిన్ రవీంద్ర సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆతర్వాత కొద్ది సేపటికే కేన్ విలియమ్సన్ శతక్కొట్టాడు. వీరిద్దరూ సెంచరీలతో చెలరేగడంతో న్యూజిలాండ్ భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తుంది. సెంచరీల అనంతరం రచిన్ (108), కేన్ (102) ఇద్దరూ ఔటయ్యారు. 45 ఓవర్ల తర్వాత న్యూజిలాండ్ స్కోర్ 296/4గా ఉంది. డారిల్ మిచెల్ (48), గ్లెన్ ఫిలిప్స్ (9) క్రీజ్లో ఉన్నారు. సౌతాఫ్రికా బౌలర్లలో రబాడ 2, ఎంగిడి, ముల్దర్ తలో వికెట్ పడగొట్టారు.48వ శతకం.. స్టీవ్ స్మిత్ రికార్డు సమంనేటి మ్యాచ్లో సెంచరీతో కేన్ వన్డేల్లో 15వ సెంచరీ, ఓవరాల్గా (మూడు ఫార్మాట్లలో) 48వ సెంచరీని నమోదు చేశాడు. ప్రస్తుతం యాక్టివ్గా ఉన్న క్రికెటర్లలో అత్యధిక వన్డే సెంచరీలు (మూడు ఫార్మాట్లలో) చేసిన ఆటగాళ్ల జాబితాలో కేన్ నాలుగో స్థానానికి ఎగబాకాడు. ఈ క్రమంలో ఆసీస్ స్టార్ ఆటగాడు, ఫాబ్ ఫోర్లో ఒకడైన స్టీవ్ స్మిత్ రికార్డును సమం చేశాడు. అంతర్జాతీయ క్రికెట్లో యాక్టివ్గా ఉన్న క్రికెటర్లలో అత్యధిక సెంచరీలు చేసిన రికార్డు విరాట్ కోహ్లి (82) పేరిట ఉంది. ఓవరాల్గా అత్యధిక సెంచరీలు చేసిన రికార్డు సచిన్ (100) పేరిట ఉంది.అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్లు (ప్రస్తుతం యాక్టివ్గా ఉన్న ప్లేయర్లు)విరాట్ కోహ్లి-82జో రూట్-53రోహిత్ శర్మ-49కేన్ విలియమ్సన్-48స్టీవ్ స్మిత్-48హ్యాట్రిక్ సెంచరీలువన్డేల్లో సౌతాఫ్రికాపై కేన్ మామకు ఇది వరుసగా మూడో సెంచరీ కావడం విశేషం. ఏ జట్టుపై అయినా వన్డేల్లో హ్యాట్రిక్ సెంచరీలు సాధించిన తొలి న్యూజిలాండ్ బ్యాటర్ విలియమ్సనే. సౌతాఫ్రికాపై వన్డేల్లో హ్యాట్రిక్ సెంచరీలు చేసిన తొలి బ్యాటర్ కూడా విలియమ్సనే. ఐసీసీ టోర్నీల్లో (వన్డేలు) రచిన్ రవీంద్ర (5) తర్వాత అత్యధిక సెంచరీలు చేసిన న్యూజిలాండ్ బ్యాటర్ కూడా విలియమ్సనే (4). 19000 పరుగుల క్లబ్లో కేన్.. తొలి న్యూజిలాండ్ ప్లేయర్ఈ ఇన్నింగ్స్లో 27 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద కేన్ విలియమ్సన్ ఓ అరుదైన మైలురాయిని తాకాడు. అంతర్జాతీయ క్రికెట్లో 19000 పరుగులు పూర్తి చేసుకున్న తొలి న్యూజిలాండ్ ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. కేన్ తన 370వ అంతర్జాతీయ మ్యాచ్లో ఈ ఘనత సాధించాడు.ఓవరాల్గా 16వ ఆటగాడుఅంతర్జాతీయ క్రికెట్లో 19000 పరుగులు పూర్తి చేసుకున్న 12వ ఆటగాడిగా కేన్ రికార్డుల్లోకెక్కాడు. కేన్కు ముందు సచిన్ (34357), సంగక్కర (28016), విరాట్ కోహ్లి (27598), రికీ పాంటింగ్ (27483), జయవర్దనే (25957), జాక్ కల్లిస్ (25534), రాహుల్ ద్రవిడ్ (24208), బ్రియాన్ లారా (22358), సనత్ జయసూర్య (21032), శివ్నరైన్ చంద్రపాల్ (20988), జో రూట్ (20724), ఇంజమామ్ ఉల్ హక్ (20580), ఏబీ డివిలియర్స్ (20014), రోహిత్ శర్మ (19624), క్రిస్ గేల్ (19593) ఈ ఘనత సాధించారు. -
CT 2025, SA VS NZ 2nd Semis: చరిత్ర సృష్టించిన కేన్ మామ
ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో (Champions Trophy-2025) భాగంగా సౌతాఫ్రికా, న్యూజిలాండ్ (South Africa Vs New Zealand) జట్ల మధ్య ఇవాళ (మార్చి 5) రెండో సెమీఫైనల్ జరుగుతుంది. లాహోర్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తుంది. 33 ఓవర్ల అనంతరం న్యూజిలాండ్ స్కోర్ 212/1గా ఉంది. విల్ యంగ్ (21) ఔట్ కాగా.. రచిన్ రవీంద్ర (108), కేన్ విలియమ్సన్ (80) క్రీజ్లో ఉన్నారు. విల్ యంగ్ వికెట్ లుంగి ఎంగిడికి దక్కింది.కాగా, ఈ ఇన్నింగ్స్లో 27 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద కేన్ విలియమ్సన్ (Kane Williamson) ఓ అరుదైన మైలురాయిని తాకాడు. అంతర్జాతీయ క్రికెట్లో 19000 పరుగులు పూర్తి చేసుకున్న తొలి న్యూజిలాండ్ ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. కేన్ తన 370వ అంతర్జాతీయ మ్యాచ్లో ఈ ఘనత సాధించాడు. ప్రస్తుతం కేన్ ఖాతాలో 47 సెంచరీలు, 103 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. కేన్ ఒక్క వన్డేల్లోనే 164 ఇన్నింగ్స్ల్లో 14 సెంచరీలు, 48 హాఫ్ సెంచరీల సాయంతో 7185 పరుగులు చేశాడు. టెస్ట్ల్లో 186 ఇన్నింగ్స్ల్లో 33 సెంచరీలు, 37 అర్ద సెంచరీల సాయంతో 9276 పరుగులు.. 93 టీ20 ఇన్నింగ్స్ల్లో 18 హాఫ్ సెంచరీల సాయంతో 2575 పరుగులు చేశాడు. ఓవరాల్గా 16వ ఆటగాడుఅంతర్జాతీయ క్రికెట్లో 19000 పరుగులు పూర్తి చేసుకున్న 12వ ఆటగాడిగా కేన్ రికార్డుల్లోకెక్కాడు. కేన్కు ముందు సచిన్ (34357), సంగక్కర (28016), విరాట్ కోహ్లి (27598), రికీ పాంటింగ్ (27483), జయవర్దనే (25957), జాక్ కల్లిస్ (25534), రాహుల్ ద్రవిడ్ (24208), బ్రియాన్ లారా (22358), సనత్ జయసూర్య (21032), శివ్నరైన్ చంద్రపాల్ (20988), జో రూట్ (20724), ఇంజమామ్ ఉల్ హక్ (20580), ఏబీ డివిలియర్స్ (20014), రోహిత్ శర్మ (19624), క్రిస్ గేల్ (19593) ఈ ఘనత సాధించారు. 19000 పరుగుల మైలురాయిని తాకే క్రమంలో కేన్ డేవిడ్ వార్నర్ను (18995) అధిగమించాడు.అంతర్జాతీయ క్రికెట్లో న్యూజిలాండ్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో కేన్ తర్వాత అత్యధికంగా రాస్ టేలర్ 18199 పరుగులు చేశాడు. స్టీఫెన్ ఫ్లెమింగ్ 15289 పరుగులు సాధించాడు. ప్రస్తుతం కేన్ న్యూజిలాండ్ తరఫున అత్యధిక సెంచరీలు (47) చేసిన ఆటగాడిగానూ రికార్డు కలిగి ఉన్నాడు. 2010లో అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన కేన్.. మూడు ఫార్మాట్లలో తనదైన ముద్ర వేసి ఈ తరం ఫాబ్ ఫోర్లో ఒకడిగా కొనసాగుతున్నాడు.కాగా, ప్రస్తుతం సౌతాఫ్రికా, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న మ్యాచ్లో విజేత దుబాయ్ వేదికగా జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ఫైనల్లో భారత్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ మార్చి 9న జరుగనుంది. భారత్.. తొలి సెమీస్లో ఆసీస్ను చిత్తు చేసి వరుసగా మూడోసారి, ఓవరాల్గా ఐదోసారి ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్కు అర్హత సాధించింది. -
CT 2025, 2nd Semi Final: సౌతాఫ్రికాపై న్యూజిలాండ్ ఘన విజయం
ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ఫైనల్లోకి న్యూజిలాండ్.. సెమీస్లో సౌతాఫ్రికా చిత్తుఛాంపియన్స్ ట్రోఫీ-2025 రెండో సెమీఫైనల్లో న్యూజిలాండ్ సౌతాఫ్రికాపై 50 పరుగుల తేడాతో గెలుపొందింది. తద్వారా మార్చి 9న జరిగే ఫైనల్లో టీమిండియాతో అమీతుమీకి అర్హత సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ రచిన్ రవీంద్ర (108), కేన్ విలియమ్సన్ (102) సెంచరీలతో కదంతొక్కడంతో నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 362 పరుగుల భారీ స్కోర్ చేసింది. డారిల్ మిచెల్ 49 పరుగులతో రాణించగా.. ఆఖర్లో గ్లెన్ ఫిలిప్స్ (49 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. సౌతాఫ్రికా బౌలర్లలో ఎంగిడి 3, రబాడ 2, ముల్దర్ ఓ వికెట్ పడగొట్టారు.భారీ లక్ష్య ఛేదనలో తడబడిన సౌతాఫ్రికా నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 312 పరుగులు చేసి లక్ష్యానికి 51 పరుగుల దూరంలో నిలిచిపోయింది. బవుమా (56), డసెన్ (69) అర్ద సెంచరీలతో రాణించగా.. ఆఖర్లో పోరాడితే పోయేదేమీ లేదన్నట్లు ఆడి మిల్లర్ మెరుపు సెంచరీ (100 నాటౌట్) బాదాడు. మిల్లర్ చివరి బంతికి రెండు పరుగులు తీసి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కివీస్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ 3 వికెట్లు తీసి సౌతాఫ్రికా విజయావకాశాలను దెబ్బకొట్టాడు. మ్యాట్ హెన్రీ, గ్లెన్ ఫిలిప్స్ తలో 2, బ్రేస్వెల్, రచిన్ రవీంద్ర చెరో వికెట్ పడగొట్టారు.ఓటమి అంచుల్లో సౌతాఫ్రికా363 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా 212 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి ఓటమి అంచుల్లో నిలిచింది. డేవిడ్ మిల్లర్ (25), కేశవ్ మహారాజ్ క్రీజ్లో ఉన్నారు. సాంట్నర్ (7-0-29-3) సౌతాఫ్రికాను దెబ్బకొట్టాడు. ఐదో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా.. మార్క్రమ్ ఔట్189 పరుగుల వద్ద (32.6వ ఓవర్) సౌతాఫ్రికా ఐదో వికెట్ కోల్పోయింది. రచిన్ రవీంద్ర బౌలింగ్లో అతనికే క్యాచ్ ఇచ్చి మార్క్రమ్ (31) ఔటయ్యాడు. నాలుగో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా.. క్లాసెన్ ఔట్167 పరుగుల వద్ద (28.4వ ఓవర్) సౌతాఫ్రికా నాలుగో వికెట్ కోల్పోయింది. సాంట్నర్ బౌలింగ్లో హెన్రీకి క్యాచ్ ఇచ్చి క్లాసెన్ (3) ఔటయ్యాడు. మార్క్రమ్ (19), డేవిడ్ మిల్లర్ క్రీజ్లో ఉన్నారు. డసెన్ ఔట్.. మూడో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా363 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా 161 పరుగుల వద్ద (26.5వ ఓవర్) మూడో వికెట్ కోల్పోయింది. సాంట్నర్ బౌలింగ్లో డసెన్ (69) క్లీన్ బౌల్డయ్యాడు. మార్క్రమ్ (16), క్లాసెన్ క్రీజ్లో ఉన్నారు. ఈ మ్యాచ్లో సౌతాఫ్రికా గెలవాలంటే ఇంకా 202 పరుగులు చేయాలి.రెండో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా125 పరుగుల వద్ద (22.2వ ఓవర్) సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా (56) రెండో వికెట్గా వెనుదిరిగాడు. సాంట్నర్ బౌలింగ్లో విలియమ్సన్కు క్యాచ్ ఇచ్చి బవుమా ఔటయ్యాడు. డసెన్కు (50) జతగా మార్క్రమ్ క్రీజ్లోకి వచ్చాడు. ఆచితూచి ఆడుతున్న డసెన్, బవుమా363 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా బ్యాటర్లు బవుమా (42), డసెన్ (34) ఆచితూచి ఆడుతున్నారు. 17 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్ 94/1గా ఉంది. రికెల్టన్ 17 పరుగులు చేసి మ్యాట్ హెన్రీ బౌలింగ్లో ఔటయ్యాడు.పది ఓవర్లలో సౌతాఫ్రికా స్కోరు:టెంబా బవుమా 25, డసెన్ 14 పరుగులతో ఉన్నారు. 56-1తొలి వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా4.5: మ్యాట్ హెన్రీ బౌలింగ్లో ర్యాన్ రెకెల్టన్ బ్రేస్వెల్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 12 బంతులు ఎదుర్కొన ఈ ఓపెనింగ్ బ్యాటర్ 17 పరుగులు చేసి నిష్క్రమించాడు. రచిన్, విలియమ్సన్ శతకాలు.. న్యూజిలాండ్ భారీ స్కోర్టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్.. రచిన్ రవీంద్ర (108), కేన్ విలియమ్సన్ (102) సెంచరీలతో కదంతొక్కడంతో నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 362 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఆఖర్లో గ్లెన్ ఫిలిప్స్ (49 నాటౌట్) సుడిగాలి ఇన్నింగ్స్ ఆడాడు. 300 దాటిన న్యూజిలాండ్ స్కోర్45.3వ ఓవర్: మార్కో జన్సెన్ బౌలింగ్లో గ్లెన్ ఫిలిప్స్ బౌండరీ బాదడంతో న్యూజిలాండ్ స్కోర్ 300 దాటింది. ఈ బౌండరీ అనంతరం ఫిలిప్స్ వరుసగా మరో మూడు బౌండరీలు బాదాడు. 47వ ఓవర్ తొలి బంతికి ఎంగిడి బౌలింగ్లో రబాడకు క్యాచ్ ఇచ్చి డారిల్ మిచెల్ (49) ఔటయ్యాడు. 46.3 ఓవర్ల తర్వాత కివీస్ స్కోర్ 317/5గా ఉంది. ఫిలిప్స్తో పాటు బ్రేస్వెల్ క్రీజ్లో ఉన్నాడు.నాలుగో వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్41.1 ఓవర్: 257 పరుగుల వద్ద న్యూజిలాండ్ నాలుగో వికెట్ కోల్పోయింది. రబాడ బౌలింగ్లో టామ్ లాథమ్ (4) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. డారిల్ మిచెల్కు (19) జతగా గ్లెన్ ఫిలిప్స్ క్రీజ్లోకి వచ్చాడు. సెంచరీ పూర్తి చేసిన వెంటనే ఔటైన విలియమ్సన్39.5వ ఓవర్: సెంచరీ పూర్తి చేసిన ఓవర్లోనే విలియమ్సన్ (102) ఔటయ్యాడు. ముల్దర్ బౌలింగ్లో ఎంగిడికి క్యాచ్ ఇచ్చి కేన్ మామ పెవిలియన్ బాట పట్టాడు. 40 ఓవర్ల అనంతరం న్యూజిలాండ్ స్కోర్ 252/3గా ఉంది. టామ్ లాథమ్ (1), డారిల్ మిచెల్ (17) క్రీజ్లో ఉన్నారు.సెంచరీ పూర్తి చేసుకున్న విలియమ్సన్39.1 ఓవర్: ముల్దర్ బౌలింగ్లో బౌండరీ బాది కేన్ విలియమ్సన్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. వన్డేల్లో కేన్కు ఇది 15వ సెంచరీ. కేన్ తన సెంచరీ మార్కును 91 బంతుల్లో చేరుకున్నాడు. రచిన్ అవుట్రచిన్ రవీంద్ర రూపంలో కివీస్ రెండో వికెట్ కోల్పోయింది. రబడ బౌలింగ్లో రచిన్ క్లాసెన్కు క్యాచ్ ఇచ్చి 108 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు. విలియమమ్సన్ 80 పరుగులతో ఉండగా.. డారిల్ మిచెల్ క్రీజులోకి వచ్చాడు. స్కోరు: 213/2 (33.5) శతక్కొట్టిన రచిన్.. విలియమ్సన్ ఫిఫ్టీసౌతాఫ్రికాతో సెమీ ఫైనల్లో కివీస్ బ్యాటర్లు రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్ దంచికొడుతున్నారు. 32 ఓవర్లు పూర్తయ్యేసరికి రచిన్ 95 బంతుల్లో 105 పరుగులతో నిలవగా.. విలియమ్సన్ 74 బంతుల్లో 72 రన్స్ సాధించాడు. దీంతో న్యూజిలండ్ స్కోరు 201కి చేరింది.నిలకడగా ఆడుతున్న రచిన్, విలియమ్సన్అర్ధ శతకం పూర్తి చేసుకున్న రచిన్ రవీంద్ర, విలియమ్సన్తో కలిసి 76 పరుగులకు పైగా భాగస్వామ్యం నమోదు చేశాడు. 22 ఓవర్ల ఆట ముగిసే సరికి రచిన్ 67, విలియమ్సన్ 31 పరుగులతో ఉన్నారు.పదమూడు ఓవర్లలో న్యూజిలాండ్ స్కోరు: 67-1విలియమ్సన్ 11, రచిన్ రవీంద్ర 34 పరుగులతో ఉన్నారు.7.5: తొలి వికెట్ కోల్పోయిన కివీస్విల్ యంగ్ రూపంలో న్యూజిలాండ్ తొలి వికెట్ కోల్పోయింది. ఎంగిడి బౌలింఘ్లో మార్క్రమ్కు క్యాచ్ ఇచ్చి యంగ్ 21 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు. విలియమ్సన్ క్రీజులోకి వచ్చాడు. స్కోరు 48-1(8)టాస్ గెలిచిన కివీస్ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 రెండో సెమీ ఫైనల్కు రంగం సిద్ధమైంది. సౌతాఫ్రికా- న్యూజిలాండ్(South Africa Vs New Zealand) మధ్య లాహోర్ వేదికగా మ్యాచ్కు నగారా మోగింది. టాస్ గెలిచిన కివీస్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘‘వికెట్ బాగుంది. అందుకే మేము తొలుత బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాం.పిచ్ కాస్త పొడిగానే ఉంది. న్యూజిలాండ్ కెప్టెన్గా పనిచేయడం నాకు దక్కిన గౌరవం. మా జట్టు అద్భుతంగా ఆడుతోంది. గత మ్యాచ్లో మేము దుబాయ్లో పిచ్ పరిస్థితిని అంచనా వేయలేకపోయాం. అయితే, ఇక్కడ త్రైపాక్షిక సిరీస్ ఆడిన అనుభవం అక్కరకు వస్తుంది.గత మ్యాచ్లో ఆడిన జట్టుతోనే సౌతాఫ్రికాతోనూ ఆడబోతున్నాం. ధాటిగా ఆడి ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెడతాం’’ అని సాంట్నర్ తెలిపాడు. ఇక సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా మాట్లాడుతూ.. ‘‘తొలుత బ్యాటింగ్ చేయాలా, బౌలింగ్ చేయాల అన్న అంశంలో మాకు ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు.నా ఆరోగ్యం బాగానే ఉందిమా బౌలర్లు ముందుగా వాళ్ల పని పూర్తి చేస్తే.. ఆ తర్వాత బ్యాటర్లు కూడా తమ విధిని నిర్వర్తిస్తారు. ఈ మ్యాచ్లో మేము ఒకే ఒక్క మార్పుతో బరిలోకి దిగుతున్నాం. నేను జట్టులోకి వచ్చేశాను. ప్రసుతం నా ఆరోగ్యం బాగానే ఉంది.గత ఐసీసీ టోర్నమెంట్లలో సెమీ ఫైనల్స్, ఫైనల్స్ నుంచి మేము పాఠాలు నేర్చుకున్నాం. కీలక సమయంలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వద్దని నిశ్చయించుకున్నాం. అందుకు తగిన ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాం. ఇది సెమీ ఫైనల్ కాబట్టి మేము ఒత్తిడికి లోనుకాము. సాధారణ మ్యాచ్లాగే దీనిని చూస్తాం’’ అని పేర్కొన్నాడు.కాగా పాకిస్తాన్ వేదికగా ఫిబ్రవరి 19న మొదలైన చాంపియన్స్ ట్రోఫీ తుదిదశకు చేరుకుంది. దుబాయ్లో జరిగిన తొలి సెమీ ఫైనల్లో టీమిండియా ఆస్ట్రేలియాను ఓడించి ఫైనల్ చేరింది. లాహోర్లోని గడాఫీ స్టేడియంలో సౌతాఫ్రికా- న్యూజిలాండ్ల ఫలితం.. భారత్ ప్రత్యర్థి ఎవరన్న అంశాన్ని తేల్చనుంది.ట్రై సిరీస్లో కివీస్దే విజయంఇక ఈ వన్డే టోర్నీలో మొత్తం ఎనిమిది జట్లు పాల్గొన్నాయి. గ్రూప్-‘ఎ’ నుంచి భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్.. గ్రూప్-‘బి’ నుంచి సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, అఫ్గనిస్తాన్, ఇంగ్లండ్ పోటీపడ్డాయి. ఇందులో భారత్, న్యూజిలాండ్.. సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా సెమీస్ చేరగా.. ఆసీస్ను టీమిండియా నాకౌట్ చేసింది. ఇక గ్రూప్-‘బి’ టాపర్గా ఉన్న సౌతాఫ్రికా కివీస్తో మ్యాచ్లో ఏ మేరకు రాణిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ మెగా ఈవెంట్ ఆరంభానికి ముందు పాకిస్తాన్తో సౌతాఫ్రికా, న్యూజిలాండ్ ట్రై సిరీస్ ఆడగా.. కివీస్ పాక్, సౌతాఫ్రికాలను ఓడించి విజేతగా నిలిచింది. ఇదిలా ఉంటే.. చాంపియన్స్లో ట్రోఫీ లీగ్ దశ చివరి మ్యాచ్లలో సౌతాఫ్రికా ఇంగ్లండ్ను ఓడించగా.. న్యూజిలాండ్ భారత్ చేతిలో ఓటమిపాలైంది. చాంపియన్స్ ట్రోఫీ-2025: రెండో సెమీ ఫైనల్- సౌతాఫ్రికా వర్సెస్ న్యూజిలాండ్ తుదిజట్లుసౌతాఫ్రికార్యాన్ రికెల్టన్, టెంబా బావుమా(కెప్టెన్), రాసీ వాన్ డెర్ డసెన్, హెన్రిచ్ క్లాసెన్(వికెట్ కీపర్), డేవిడ్ మిల్లర్, ఐడెన్ మార్క్రమ్, వియాన్ ముల్డర్, మార్కో జాన్సెన్, కేశవ్ మహారాజ్, కగిసో రబడ, లుంగి ఎంగిడి.న్యూజిలాండ్విల్ యంగ్, రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్, టామ్ లాథమ్(వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ బ్రేస్వెల్, మిచెల్ సాంట్నర్(కెప్టెన్), మాట్ హెన్రీ, కైలీ జెమీసన్, విలియం ఒ'రూర్కీ.చదవండి: రోహిత్ గురించి ప్రశ్న.. ఇచ్చి పడేసిన గంభీర్! నాకన్నీ తెలుసు... -
కివీస్తో సెమీస్.. సఫారీలకు గాయాల బెడద! జట్టులోకి స్టార్ ప్లేయర్
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 సెకెండ్ సెమీఫైనల్లో బుధవారం దక్షిణాఫ్రికా-న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. లహోర్ వేదికగా జరగనున్న ఈ కీలక పోరులో గెలిచి ఫైనల్ దూసుకెళ్లాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. సౌతాఫ్రికా తమ గ్రూపు స్టేజిని ఆజేయంగా ముగించగా.. కివీస్ తమ ఆఖరి లీగ్ మ్యాచ్లో భారత్ చేతిలో ఓటమిపాలైంది.కాగా సెమీస్ పోరుకు ముందు సౌతాఫ్రికాను ఆటగాళ్ల ఫిట్నెస్ సమస్య వెంటాడుతోంది. ఇంగ్లండ్తో జరిగిన తమ ఆఖరి లీగ్ మ్యాచ్కు అనారోగ్యం కారణంగా దూరమైన ప్రోటీస్ కెప్టెన్ టెంబా బావుమా, స్టార్ ఓపెనర్ టోనీ డి జోర్జి ఇంకా పూర్తిగా కోలుకోపోయినట్లు తెలుస్తోంది. అదేవిధంగా ఇంగ్లండ్తో మ్యాచ్కు స్టాండ్ ఇన్ కెప్టెన్గా వ్యవహరించిన ఐడైన్ మార్క్రమ్ సైతం తొడకండరాల గాయంతో బాధపడుతున్నాడు. ఇంగ్లండ్తో మ్యాచ్లో మార్క్రమ్ తొడ కండరాలు పట్టేశాయి. దీంతో ఫీల్డింగ్ మధ్యలోనే ఐడైన్ మైదానాన్ని వీడాడు. అతడి స్ధానంలో హెన్రిచ్ క్లాసెన్ కెప్టెన్సీ బాధ్యతలను చేపట్టాడు. అయితే మార్క్రమ్కు మార్చి 4న ప్రోటీస్ వైద్య బృందం ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించనుంది. ఒకవేళ ఈ ఫిట్నెస్ పరీక్షలో మార్క్రమ్ ఫెయిల్ అయితే కివీస్తో సెమీస్కు దూరమయ్యే అవకాశముంది. ఈ క్రమంలో ఆల్రౌండర్ జార్జ్ లిండేను సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు రిజర్వ్ జాబితాలో చేర్చినట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. అతడు ఇప్పటికే దక్షిణాఫ్రికా నుంచి పాకిస్తాన్కు చేరుకున్నట్లు సమాచారం. కాగా లిండేకు అద్బుతమైన ఆల్రౌండ్ స్కిల్స్ ఉన్నాయి. ఇటీవల జరిగిన సౌతాఫ్రికా టీ20లో కూడా అతడు అదరగొట్టాడు. ఈ క్రమంలోనే సెలక్టర్లు అతడివైపు మొగ్గు చూపారు.చదవండి: అతడికి కొత్త బంతిని ఇవ్వండి.. హెడ్కు చుక్కలు చూపిస్తాడు: అశ్విన్ -
SA Vs NZ: చరిత్ర సృష్టించిన విలియమ్సన్.. విరాట్ కోహ్లి రికార్డు బద్దలు
ఛాంపియన్స్ ట్రోఫీ-2025కు ముందు న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్ కేన్ విలియమ్సన్(Kane Williamson) అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. కివీస్ జట్టు ప్రస్తుతం పాకిస్తాన్ వేదికగా మక్కోణపు సిరీస్లో తలపడుతోంది. ఈ సిరీస్లో భాగంగా పాక్తో జరిగిన తొలి మ్యాచ్లో హాఫ్ సెంచరీతో సత్తాచాటిన కేన్ మామ.. సోమవారం దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో మ్యాచ్లోనూ అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు.టీ20 తరహాలో తన ఇన్నింగ్స్ను కొనసాగించిన విలియమ్సన్ కేవలం 72 బంతుల్లోనే తన సెంచరీ మార్క్ను అందుకున్నాడు. ఇది విలియమ్సన్కు ఐదేళ్ల తర్వాత వచ్చిన వన్డే సెంచరీ కావడం గమనార్హం. ఓవరాల్గా 113 బంతులు ఎదుర్కొన్న విలియమ్సన్.. 13 ఫోర్లు, 2 సిక్స్లతో 133 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడితో పాటు డెవాన్ కాన్వే(97) కీలక ఇన్నింగ్స్ ఆడారు. దీంతో 305 పరుగుల భారీ లక్ష్యాన్ని కివీస్ కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 48.4 ఓవర్లలో చేధించింది.అంతకుమందు బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 304 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా బ్యాటర్లలో అరంగేట్ర ఆటగాడు మాథ్యూ బ్రీట్జ్కే విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు.148 బంతులు ఎదుర్కొని 11 ఫోర్లు, 5 సిక్సర్లతో 150 పరుగులు చేశాడు. అతడితో పాటు వియాన్ ముల్డర్ (64), జాసన్ స్మిత్ (41) కూడా రాణించారు. కివీస్ బౌలర్లలో మాట్ హెన్రీ, ఓ రూర్క్ తలా రెండు వికెట్లు పడగొట్టగా..బ్రాస్వెల్ ఓ వికెట్ సాధించాడు.చరిత్ర సృష్టించిన విలియమ్సన్..ఇక ఈ మ్యాచ్లో అద్భుత ఇన్నింగ్స్ ఆడిన విలియమ్సన్ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. వన్డేల్లో అత్యంత వేగంగా 7000 పరుగులు అందుకున్న రెండో బ్యాటర్గా విలియమ్సన్ రికార్డులకెక్కాడు. 159 ఇన్నింగ్స్లలో కేన్ ఈ ఫీట్ సాధించాడు. ఇప్పటివరకు ఈ రికార్డు విరాట్ కోహ్లి(161 ఇన్నింగ్స్లు) పేరిట ఉండేది. తాజా మ్యాచ్తో కోహ్లి రికార్డును విలియమ్సన్ బ్రేక్ చేశాడు. అయితే కివీస్ తరపున ఈ ఫీట్ సాధించిన తొలి క్రికెటర్ మాత్రం కేన్ మామనే కావడం విశేషం.వన్డేల్లో అత్యంత వేగంగా 7000 పరుగులు1. హషీమ్ ఆమ్లా: 150 ఇన్నింగ్స్లు2. కేన్ విలియమ్సన్: 159 ఇన్నింగ్స్లు3. విరాట్ కోహ్లీ: 161 ఇన్నింగ్స్లు4. ఏబీ డివిలియర్స్: 166 ఇన్నింగ్స్లు5. సౌరవ్ గంగూలీ: 174 ఇన్నింగ్స్లు -
విలియమ్సన్ విధ్వంసం.. సౌతాఫ్రికాను చిత్తు చేసిన న్యూజిలాండ్
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ముంగిట పాకిస్తాన్ వేదికగా జరుగుతున్న ముక్కోణపు వన్డే సిరీస్లో న్యూజిలాండ్ అదరగొడుతోంది. ఈ సిరీస్లో భాగంగా లహోర్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది.305 పరుగుల భారీ లక్ష్యాన్ని కివీస్ కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 48.4 ఓవర్లలో చేధించింది. ఈ భారీ లక్ష్య చేధనలో బ్లాక్ క్యాప్స్ ఆరంభంలోనే ఓపెనర్ విల్ యంగ్(19) వికెట్ను కోల్పోయింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కేన్ విలియమ్సన్(Kane Williamson) కాన్వేతో కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు.వీరిద్దరూ రెండో వికెట్కు 187 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. విలియమ్సన్(113 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్స్లతో 133 నాటౌట్) అద్బుతమైన సెంచరీతో చెలరేగగా.. డెవాన్ కాన్వే(97) తృటిలో శతకం సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. సౌతాఫ్రికా బౌలర్లలో సేనురన్ ముత్తుసామి రెండు వికెట్లు పడగొట్టగా.. బాష్, ముల్డర్ తలా వికెట్ సాధించారు.మాథ్యూ బ్రీట్జ్కే విధ్వంసకర సెంచరీఇక ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 304 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా బ్యాటర్లలో అరంగేట్ర ఆటగాడు మాథ్యూ బ్రీట్జ్కే విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు.148 బంతులు ఎదుర్కొని 11 ఫోర్లు, 5 సిక్సర్లతో 150 పరుగులు చేశాడు.తద్వారా అరంగేట్రంలో 150 రన్స్ చేసిన తొలి ఆటగాడిగా ప్రపంచ రికార్డు సృష్టించాడు. అతడితో పాటు వియాన్ ముల్డర్ (64), జాసన్ స్మిత్ (41) కూడా రాణించారు. కివీస్ బౌలర్లలో మాట్ హెన్రీ, ఓ రూర్క్ తలా రెండు వికెట్లు పడగొట్టగా..బ్రాస్వెల్ ఓ వికెట్ సాధించాడు. కాగా ఈ సిరీస్లో కివీస్కు ఇదే రెండో విజయం. పాకిస్తాన్తో జరిగిన తొలి మ్యాచ్లో 78 పరుగుల తేడాతో న్యూజిలాండ్ గెలుపొందింది.చదవండి: ఆసీస్, భారత్, ఇంగ్లండ్ కాదు.. ఆ జట్టు చాలా డేంజరస్: రవి శాస్త్రి -
సౌతాఫ్రికాతో మ్యాచ్.. కేన్ మామ సూపర్ సెంచరీ! వీడియో వైరల్
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025కు ముందు పాకిస్తాన్ వేదికగా న్యూజిలాండ్, సౌతాఫ్రికా, పాక్ మధ్య ముక్కోణపు వన్డే సిరీస్ జరుగుతోంది. ఈ సిరీస్లో భాగంగా సోమవారం రెండో మ్యాచ్లో లహోర్ వేదికగా న్యూజిలాండ్-దక్షిణాఫ్రికా జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్ కేన్ విలియమ్సన్ అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. ఫస్ట్ డౌన్లో బ్యాటింగ్కు వచ్చిన విలియమ్సన్ టీ20 తరహాలో తన ఇన్నింగ్స్ను కొనసాగించాడు. కేన్ క్రీజులోకి వచ్చినప్పటి నుంచే తన ట్రేడ్ మార్క్ షాట్లతో అభిమానులను అలరించాడు. ఈ క్రమంలో కేవలం 72 బంతుల్లోనే తన 14వ వన్డే సెంచరీని కేన్ మామ అందుకున్నాడు.అతడి ఇన్నింగ్స్లో ఇప్పటివరకు 11 ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి. అంతేకాకుండా 305 పరుగుల లక్ష్య చేధనలో డెవాన్ కాన్వేతో కలిసి 187 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని విలియమ్సన్ నెలకొల్పాడు. ప్రస్తుతం కేన్ 103 పరుగులతో తన బ్యాటింగ్ను కొనసాగిస్తున్నాడు. బ్లాక్ క్యాప్స్ విజయానికి 85 బంతుల్లో 68 పరుగులు కావాలి.విలియమ్సన్ అరుదైన రికార్డు..ఈ మ్యాచ్లో సెంచరీతో మెరిసిన విలియమ్సన్ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సెంచరీలు చేసిన దక్షిణాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ రికార్డును విలియమ్సన్ సమం చేశాడు. ఏబీడీ తన కెరీర్లో 420 మ్యాచ్లు ఆడి 47 సెంచరీలు నమోదు చేయగా.. విలియమ్సన్ కూడా ఇప్పటివరకు 47 శతకాలు నమోదు చేశాడు.కేన్ మరో సెంచరీ సాధిస్తే డివిలియర్స్ను అధిగమిస్తాడు. అదే విధంగా విదేశీ గడ్డపై వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన రెండో న్యూజిలాండ్ ప్లేయర్గా కేన్ నిలిచాడు. విలియమ్సన్ ఇప్పటివరకు విదేశాల్లో 6 వన్డే సెంచరీలు చేశాడు. ఈ అరుదైన ఫీట్ సాధించిన జాబితాలో న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ మార్టిన్ గప్టిల్(7) ఉన్నాడు. ఇక ఓవరాల్గా కివీస్ తరపున అత్యధిక వన్డే సెంచరీలు జాబితాలో విలియమ్సన్ నాలుగో స్ధానంలో నిలిచాడు. ఈ లిస్ట్లో కివీ దిగ్గజం రాస్ టేలర్(21) ఉన్నాడు.మాథ్యూ బ్రీట్జ్కే విధ్వంసం.. ఇక ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 304 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా బ్యాటర్లలో అరంగేట్ర ఆటగాడు మాథ్యూ బ్రీట్జ్కే విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు.148 బంతులు ఎదుర్కొని 11 ఫోర్లు, 5 సిక్సర్లతో 150 పరుగులు చేశాడు. తద్వారా అరంగేట్రంలో 150 రన్స్ చేసిన తొలి ఆటగాడిగా ప్రపంచ రికార్డు సృష్టించాడు. అతడితో పాటు వియాన్ ముల్డర్ (64), జాసన్ స్మిత్ (41) కూడా రాణించారు. Kane Williamson gets to his 14th ODI century off 72 balls! 💯#3Nations1Trophy | #NZvSA pic.twitter.com/e90S4QNieI— Pakistan Cricket (@TheRealPCB) February 10, 2025 -
ఒక్కొక్కరికి రూ. 1 కోటీ 30 లక్షలు!
ప్రపంచ క్రికెట్లో టాప్-3 అయిన భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ ఆటగాళ్లతో పోలిస్తే న్యూజిలాండ్ క్రికెటర్లకు సాధారణంగా ఆట ద్వారా వచ్చే ఆదాయం తక్కువ. ఎవరో ఒకరిద్దరు మినహా ఎక్కువ మంది పార్ట్ టైమ్ ఉద్యోగాల ద్వారా ఇతర ఆదాయంపై ఆధారపడేవారే. ఇక ఒక్కసారి రిటైర్ అయితే నేరుగా ఏదైనా ఉద్యోగంలో చేరిపోతే తప్ప పని నడవదు. ఇక ఆ దేశపు మహిళా క్రికెటర్ల పరిస్థితి మరీ ఇబ్బందికరం.పురుష టీమ్ సభ్యులతో పోలిస్తే వీరికి దక్కేది చాలా తక్కువ మొత్తం. మహిళా క్రికెటర్లంతా ఆటపై ఇష్టం, ఆసక్తితో కొనసాగడమే. ఇలాంటి సమయంలో టీ20 వరల్డ్ కప్ విజయం ద్వారా వచ్చిన మొత్తం వారికి కాస్త ఊరటను అందించింది! విజేతగా నిలవడంతో కివీస్ మహిళల టీమ్కు ప్రైజ్మనీ రూపంలో ఐసీసీ రూ. 23 లక్షల 40 వేల డాలర్లు అందించింది. ఈ మొత్తాన్ని జట్టులో 15 మందికి సమంగా పంచారు.ఫలితంగా ఒక్కొక్కరికి 2 లక్షల 56 వేల న్యూజిలాండ్ డాలర్లు (సుమారు రూ.1 కోటీ 30 లక్షలు) లభించాయి. వరల్డ్ కప్కు ముందు వరుసగా 10 టీ20లు ఓడి ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన జట్టు చివరకు చాంపియన్గా నిలిచింది. దాంతో ఆర్థికపరంగా కూడా జట్టులోని సభ్యులకు వెసులుబాటు దక్కడం ఈ టీమ్ గెలుపులో మరో సానుకూలాంశం! చదవండి: ‘గదికి పిలిచి.. భుజాలపై చేతులు వేశాడు.. తండ్రిలాంటి వాడినంటూ..’ -
SA vs NZ W T20: వరల్డ్కప్ విజేత న్యూజిలాండ్
మహిళల టీ20 వరల్డ్ కప్-2024 ఫైనల్లో సౌతాఫ్రికాపై న్యూజిలాండ్ విజయం సాధించింది. దీంతో తొలిసారి న్యూజిలాండ్ మహిళల టీ20 వరల్డ్ కప్ను కైవసం చేసుకుంది. సౌతాఫ్రికాపై 32 పరుగుల తేడాతో న్యూజిలాండ్ గెలుపొందింది. స్కోర్లు: న్యూజిలాండ్ 158/5, సౌతాఫ్రికాపై 126/9మహిళల టీ20 వరల్డ్ కప్-2024 ఫైనల్లో న్యూజిలాండ్ మెరుగైన స్కోరు సాధించింది. దుబాయ్ వేదికగా సౌతాఫ్రికాతో మ్యాచ్లో నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి 158 పరుగులు చేసింది. వైట్ఫెర్న్స్ బ్యాటర్లలో ఓపెనర్ సుజీ బేట్ 31 బంతుల్లో 32 పరుగులు చేయగా.. మరో ఓపెనర్ జార్జియా ప్లిమెర్(9) మాత్రం నిరాశపరిచింది.ఈ క్రమంలో ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యత తీసుకున్న వన్డౌన్ బ్యాటర్ అమేలియా కెర్ 38 బంతుల్లో నాలుగు ఫోర్ల సాయంతో 43 రన్స్ సాధించింది. ఆమెకు తోడుగా బ్రూక్ హాలీడే(28 బంతుల్లో 38) రాణించింది. వీరిద్దరి కారణంగా న్యూజిలాండ్ పటిష్ట స్థితిలో నిలిచింది. మిగతా వాళ్లలో కెప్టెన్ సోఫీ డివైన్(6) విఫలం కాగా.. మ్యాడీ గ్రీన్ 12, వికెట్ కీపర్ ఇసబెల్లా గేజ్ 3 పరుగులతో అజేయంగా నిలిచారు.సౌతాఫ్రికా బౌలర్లలో అయబోంగా ఖాకా, క్లోయీ ట్రియాన్, నాడిన్ డి క్లెర్క్ ఒక్కో వికెట్ తీయగా.. నోన్కులులేకో మ్లాబా రెండు వికెట్లు తన ఖాతాలో వేసుకుంది. ఎవరు గెలిచినా చరిత్రే!కాగా 14 ఏళ్ల తర్వాత తొలిసారి న్యూజిలాండ్ మహిళా జట్టు వరల్డ్కప్ ఫైనల్ చేరగా.. సౌతాఫ్రికా వరుసగా రెండోసారి తుదిపోరుకు అర్హత సాధించింది. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్ విధించిన 159 పరుగుల లక్ష్యాన్ని సౌతాఫ్రికా ఛేదిస్తే తమ దేశం ఖాతాలో మొట్టమొదటి ఐసీసీ వరల్డ్కప్ను జమచేస్తుంది. లేదంటే.. న్యూజిలాండ్కు తొలి ప్రపంచకప్ దక్కుతుంది.మహిళల టీ20 వరల్డ్కప్ ఫైనల్ న్యూజిలాండ్ వర్సెస్ సౌతాఫ్రికాతుదిజట్లున్యూజిలాండ్సుజీ బేట్స్, జార్జియా ప్లిమెర్, అమేలియా కెర్, సోఫీ డివైన్(కెప్టెన్), బ్రూక్ హాలిడే, మ్యాడీ గ్రీన్, ఇసబెల్లా గాజ్(వికెట్ కీపర్), రోజ్మేరీ మైర్, లీ తహుహు, ఈడెన్ కార్సన్, ఫ్రాన్ జోనాస్సౌతాఫ్రికాలారా వోల్వార్డ్ (కెప్టెన్), టాజ్మిన్ బ్రిట్స్, అన్నేక్ బాష్, క్లోయి ట్రియాన్, మారిజానే కాప్, సునే లుస్, నాడిన్ డి క్లెర్క్, అన్నేరీ డెర్క్సెన్, సినాలో జఫ్తా(వికెట్ కీపర్), నోన్కులులేకో మ్లాబా, అయబోంగా ఖాకా.చదవండి: IPL 2025- CSK: ధోనికి రూ. 4 కోట్లు! వాళ్లిద్దరూ జట్టుతోనే! -
సౌతాఫ్రికా క్రికెట్కు అవమానం.. 92 ఏళ్ల చరిత్రలో ఇదే తొలిసారి
South Africa tour of New Zealand, 2024- హామిల్టన్: ఎట్టకేలకు టెస్టు ఫార్మాట్లో దక్షిణాఫ్రికా జట్టుపై న్యూజిలాండ్ జట్టు తొలిసారి సిరీస్ను సొంతం చేసుకుంది. శుక్రవారం జరిగిన రెండో టెస్టులో దక్షిణాఫ్రికా నిర్దేశించిన 267 పరుగుల లక్ష్యాన్ని న్యూజిలాండ్ ఛేదించి సిరీస్ను 2–0తో క్లీన్స్వీప్ చేసింది. 1932 నుంచి రెండు జట్ల మధ్య 18 టెస్టు సిరీస్లు జరిగాయి. దక్షిణాఫ్రికా 13 సార్లు నెగ్గగా, నాలుగు సిరీస్లు ‘డ్రా’గా ముగిశాయి. 18వ ప్రయత్నంలో మొదటిసారి న్యూజిలాండ్కు సిరీస్ దక్కింది. ఓవర్నైట్ స్కోరు 40/1తో నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన న్యూజిలాండ్ 94.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 269 పరుగులు చేసి గెలిచింది. కేన్ విలియమ్సన్ (133 నాటౌట్; 12 ఫోర్లు, 2 సిక్స్లు) అజేయ సెంచరీ సాధించాడు. విల్ యంగ్ (60 నాటౌట్; 8 ఫోర్లు)తో కలిసి విలియమ్సన్ నాలుగో వికెట్కు 152 పరుగుల అభేద్యమైన భాగస్వామ్యాన్ని జోడించాడు. కాగా సౌతాఫ్రికా టీ20 లీగ్తో సీనియర్ ఆటగాళ్లంతా బిజీగా ఉండటంతో.. అనుభవలేమి, యువ ప్లేయర్లతో కూడిన జట్టును కివీస్ పర్యటనకు పంపింది ప్రొటిస్ బోర్డు. తొలి టెస్టు సందర్భంగా ఏకంగా ఐదుగురు సౌతాఫ్రికా క్రికెటర్లు అరంగేట్రం చేయడం విశేషం. ఫలితంగా.. న్యూజిలాండ్తో పోటీలో.. 92 ఏళ్ల చరిత్రలో తొలిసారి టెస్టు సిరీస్లో వైట్వాష్కు గురై.. భారీ మూల్యమే చెల్లించింది. న్యూజిలాండ్ చేతిలో క్లీన్స్వీప్ అయి ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. Kane Williamson has reached his 32nd Test Century! With 172 innings, that is the fewest innings to reach 32 test 100's in test history, beating Steve Smith. 🔥🏏@BLACKCAPS v South Africa: 2nd Test | LIVE on DUKE and TVNZ+ pic.twitter.com/pSg5VFP2nS — TVNZ+ (@TVNZ) February 16, 2024 -
రసవత్తరంగా సాగుతున్న న్యూజిలాండ్-సౌతాఫ్రికా రెండో టెస్ట్
రెండు మ్యాచ్ల సిరీస్లో భాగంగా హ్యామిల్టన్ వేదికగా న్యూజిలాండ్-సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ రసవత్తరంగా సాగుతుంది. కఠినమైన పిచ్పై పర్యాటక సౌతాఫ్రికా.. న్యూజిలాండ్కు 267 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించగా.. మూడో రోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ వికెట్ కోల్పోయి 40 పరుగులు చేసింది. మూడో రోజు ఆట కాసేపట్లో ముగుస్తుందనగా.. డెవాన్ కాన్వే (17) ఔటయ్యాడు. కాన్వే ఔటయ్యాక అంపైర్లు మూడో రోజు ఆటను ముగించారు. న్యూజిలాండ్ గెలవాలంటే ఇంకా 227 పరుగులు చేయాలి. పిచ్ బౌలర్లకు సహకరిస్తుండటంతో రేపు ఫలితం తేలడం ఖాయమని తెలుస్తుంది. అంతకుముందు బెడింగ్హమ్ (110) కెరీర్లో తొలి శతకంతో విజృంభించడంతో సౌతాఫ్రికా సెకెండ్ ఇన్నింగ్స్లో 235 పరుగులు చేసి ఆలౌటైంది. సౌతాఫ్రికా ఇన్నింగ్స్లో బెడింగ్హమ్తో పాటు నీల్ బ్రాండ్ (34), కీగన్ పీటర్సన్ (43), హమ్జా (17) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. విలియమ్ రూర్కీ ఐదు వికెట్లు పడగొట్టి సౌతాఫ్రికా పతనాన్ని శాశించాడు. దీనికి ముందు న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్లో 211 పరుగులకే ఆలౌటైంది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్లో ఒక్కరు కూడా కనీసం హాఫ్ సెంచరీ చేయలేకపోయారు. 43 పరుగులు చేసిన విలియమ్సన్ టాప్ స్కోరర్గా నిలిచాడు. సౌతాఫ్రికా బౌలర్ డి పైడ్ట్ ఐదు వికెట్లతో చెలరేగాడు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్లో 242 పరుగులకు ఆలౌటైంది. రుయాన్ డి స్కార్డ్ట్ (64) టాప్ స్కోరర్గా నిలిచాడు. కివీస్ పేసర్ విలియమ్ రూర్కీ నాలుగు వికెట్లతో రాణించాడు. కాగా, ఈ సిరీస్లో తొలి టెస్ట్లో న్యూజిలాండ్ విజయం సాధించింది. క్రికెట్ సౌతాఫ్రికా.. న్యూజిలాండ్ పర్యటనకు ద్వితియ శ్రేణి జట్టును పంపించింది. -
న్యూజిలాండ్కు షాకిచ్చిన సౌతాఫ్రికా ‘అనుభలేమి జట్టు’!
న్యూజిలాండ్తో రెండో టెస్టు రెండో రోజు ఆటలో అనూహ్యంగా సౌతాఫ్రికా పైచేయి సాధించింది. మంగళవారం నాటి ఆటను 220/6తో ముగించిన సౌతాఫ్రికా.. బుధవారం తమ స్కోరుకు మరో 22 పరుగులు మాత్రమే జతచేసి ఆలౌట్ అయింది. 242 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్ ముగించింది. హామిల్టన్ టెస్టులో కివీస్ బౌలర్లలో విలియం రూర్కీ 4 వికెట్లు పడగొట్టగా.. రచిన్ రవీంద్ర 3 వికెట్లు దక్కించుకున్నాడు. కెప్టెన్ టిమ్ సౌతీతో పాటు మ్యాట్ హెన్రీ, వాగ్నర్ తలా ఒక వికెట్ తీశారు. ఈ క్రమంలో బ్యాటింగ్ మొదలుపెట్టిన న్యూజిలాండ్కు సౌతాఫ్రికా బౌలర్లు చుక్కలు చూపించారు. కివీస్ ఓపెనర్ డెవాన్ కాన్వే డకౌట్గా వెనుదిరగగా.. మరో ఓపెనర్ టామ్ లాథమ్ 40 పరుగులు రాబట్టాడు. ఇక వన్డౌన్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ 43 పరుగులతో కివీస్ ఇన్నింగ్స్లో టాప్ స్కోరర్గా నిలవగా.. మిగతా వాళ్లలో విల్ యంగ్(36), నీల్ వాగ్నర్(33) మాత్రమే ముప్పై పరుగుల మార్కు అందుకున్నారు. ఫలితంగా.. బుధవారం నాటి రెండో రోజు ఆట పూర్తయ్యే సరికి 77.3 ఓవర్లలో 211 పరుగులు మాత్రమే చేసి న్యూజిలాండ్ ఆలౌట్ అయింది. సౌతాఫ్రికా కంటే.. 31 పరుగులు వెనుకబడి ఉంది. ప్రొటిస్ స్పిన్నర్ డేన్ పీడ్ ఐదు వికెట్లతో చెలరేగగా.. పేసర్ డేన్ పీటర్సన్ 3 వికెట్లు కూల్చాడు. మరో పేసర్ మొరేకికి ఒక వికెట్ దక్కింది. కాగా తొలి టెస్టులో ఆల్రౌండర్ రచిన్ రవీంద్ర(240) వ్యక్తిగత స్కోరు కంటే కూడా ఈసారి కివీస్ తొలి ఇన్నింగ్స్ స్కోరు తక్కువ కావడం గమనార్హం. ఇక మొదటి టెస్టులో రచిన్ డబుల్ సెంచరీ, విలియమ్సన్ వరుస సెంచరీల కారణంగా 281 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది న్యూజిలాండ్. అనుభలేమి సౌతాఫ్రికా జట్టుతో జరుగుతున్న రెండు మ్యాచ్ల సిరీస్లో ప్రస్తుతం 1-0తో ఆధిక్యంలో ఉంది. ఇక సీనియర్లంతా సౌతాఫ్రికా టీ20 లీగ్తో బిజీగా ఉన్న కారణంగా కీలకమైన కివీస్ పర్యటనకు అనుభవలేమి జట్టును పంపి విమర్శుల మూటగట్టుకుంది సౌతాఫ్రికా. న్యూజిలాండ్తో మౌంట్ మాంగనుయ్లో జరిగిన తొలి టెస్టు సందర్భంగా ఏకంగా ఆరుగురు ప్రొటిస్ ఆటగాళ్లు అరంగేట్రం చేయడం విశేషం. చదవండి: అరంగేట్ర జట్టును పంపినందుకు సౌతాఫ్రికాకు తగిన శాస్తి! -
ఈసారి బంతితో మ్యాజిక్ చేసిన రచిన్ రవీంద్ర
న్యూజిలాండ్ యువ ఆల్రౌండర్ రచిన్ రవీంద్ర ఫార్మాట్లకతీతంగా ఇరగదీస్తున్నాడు. వన్డే వరల్డ్కప్ 2023లో సంచలన ప్రదర్శనలు చేసి వెలుగులోకి వచ్చిన రచిన్.. తాజాగా టెస్ట్ ఫార్మాట్లోనూ సత్తా చాటుతున్నాడు. రెండు మ్యాచ్ల సిరీస్లో భాగంగా సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్ట్లో బ్యాట్తో (డబుల్ సెంచరీ) చెలరేగిన రచిన్.. ఇవాళ (ఫిబ్రవరి 13) మొదలైన రెండో టెస్ట్లో బంతితో మ్యాజిక్ చేశాడు. రచిన్ 3 వికెట్లతో రాణించడంతో పర్యాటక సౌతాఫ్రికా కష్టాల్లో పడింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు 6 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసింది. రచిన్తో పాటు మ్యాట్ హెన్రీ (1/48), విలియమ్ రూర్కీ (1/47), నీల్ వాగ్నర్ (1/28) వికెట్లు తీశారు. 150 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికాను రుయాన్ డి స్వార్డ్ట్ (55), షాన్ వాన్ బెర్గ్ (34) ఆదుకున్నారు. వీరిద్దరూ ఏడో వికెట్కు 70 పరుగులు జోడించారు. ప్రస్తుతం ఈ ఇద్దరు బ్యాటర్లు క్రీజ్లోనే ఉన్నారు. సౌతాఫ్రికా ఇన్నింగ్స్లో నీల్ బ్రాండ్ 25, క్లైడ్ ఫోర్టిన్ 0, రేనార్డ్ వార్ టోండర్ 32, జుబేర్ హంజా 20, డేవిడ్ బెడింగ్హమ్ 39, కీగన్ పీటర్సన్ 2 పరుగులు చేసి ఔటయ్యారు. ఈ మ్యాచ్లో సౌతాఫ్రికా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. కాగా, ఈ సిరీస్లోని జరిగిన తొలి మ్యాచ్లో కివీస్ 281 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఆ మ్యాచ్లో రచిన్ రవీంద్ర తొలి ఇన్నింగ్స్లో డబుల్ సెంచరీతో విరుచుకుపడగా.. కేన్ విలియమ్సన్ రెండు ఇన్నింగ్స్ల్లో సెంచరీలు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. తొలి టెస్ట్లో రచిన్ బంతితోనూ (2 వికెట్లు) పర్వాలేదనిపించాడు. ఈ సిరీస్ కోసం క్రికెట్ సౌతాఫ్రికా ద్వితియ శ్రేణి జట్టును పంపించి చేతులుకాల్చుకుంది. -
‘అరంగేట్ర’ జట్టును పంపినందుకు సౌతాఫ్రికాకు తగిన శాస్తి!
New Zealand vs South Africa, 1st Test : సౌతాఫ్రికాతో తొలి టెస్టులో న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. అనుభలేమి ప్రొటిస్ జట్టును 281 పరుగుల తేడాతో చిత్తు చిత్తుగా ఓడించింది. తద్వారా సౌతాఫ్రికాపై రెండో అతి పెద్ద విజయం అందుకుంది. ఈ గెలుపులో కీలక పాత్ర పోషించిన ఆల్రౌండర్ రచిన్ రవీంద్రకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. సీనియర్లంతా సౌతాఫ్రికా టీ20 లీగ్-2024తో బిజీ కావడంతో నీల్ బ్రాండ్ సారథ్యంలో.. పెద్దగా అనుభవంలేని ప్రొటిస్ జట్టు న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లింది. ఐదుగురు మినహా కెప్టెన్ బ్రాండ్ సహా అంతా అరంగేట్ర ప్లేయర్లే కావడం విశేషం. రచిన్ డబుల్ సెంచరీ ఈ క్రమంలో మౌంట్ మౌంగనుయ్ వేదికగా కివీస్తో ఆదివారం మొదలైన మ్యాచ్లో టాస్ గెలిచిన.. సౌతాఫ్రికా తొలుత బౌలింగ్ చేసింది. కెప్టెన్ విలియమ్సన్(118) సెంచరీతో రాణించగా.. రచిన్ రవీంద్ర డబుల్ సెంచరీ(240)తో చెలరేగాడు. వీరిద్దరి అద్భుత ఇన్నింగ్స్ కారణంగా న్యూజిలాండ్ తమ తొలి ఇన్నింగ్స్లో 511 పరుగుల భారీ స్కోరు చేసి.. ఆలౌట్ అయింది. ఈ క్రమంలో బ్యాటింగ్ మొదలుపెట్టిన సౌతాఫ్రికా 162 పరుగులకే కుప్పకూలింది. ప్రొటిస్ బ్యాటర్లలో కీగన్ పీటర్సన్(45) ఒక్కడే చెప్పుకోదగ్గ స్కోరు చేశాడు. కివీస్ బౌలర్లలో హెన్రీ (3/31), సాంట్నర్ (3/34), జేమీసన్ (2/35), రచిన్ రవీంద్ర (2/16) రాణించారు. విలియమ్సన్ వరుస శతకాలతో ఈ నేపథ్యంలో 349 పరుగుల భారీ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన కివీస్ జట్టు.. 179-4 స్కోరు వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. ఇక కెప్టెన్ కేన్ విలియమ్సన్ (109; 12 ఫోర్లు, 1 సిక్స్) రెండో ఇన్నింగ్స్లోనూ సెంచరీ సాధించడం విశేషం. తద్వారా ఒకే టెస్టులోని రెండు ఇన్నింగ్స్లలో సెంచరీలు చేసిన ఐదో న్యూజిలాండ్ క్రికెటర్గా విలియమ్సన్ గుర్తింపు పొందాడు. సౌతాఫ్రికా చిత్తు ఈ మేరకు బుధవారం నాటి మూడో రోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ 528 పరుగుల ఆధిక్యం సాధించి.. సౌతాఫ్రికా ఎదుట భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఈ క్రమంలో గురువారం నాటి ఆటలో 247 పరుగులకే ఆలౌట్ అయిన సౌతాఫ్రికా టార్గెట్ పూర్తి చేయలేక భారీ ఓటమిని మూటగట్టుకుంది. కివీస్ బౌలర్లలో కైలీ జెమీషన్ అత్యధికంగా నాలుగు వికెట్లు తీయగా.. మిచెల్ సాంట్నర్ మూడు వికెట్లు పడగొట్టాడు. టిమ్ సౌథీ, మ్యాట్ హెన్రీ, గ్లెన్ ఫిలిప్స్లకు ఒక్కో వికెట్ దక్కింది. ఇక సౌతాఫ్రికాతో రెండు టెస్టుల సిరీస్లో న్యూజిలాండ్ 1-0తో ఆధిక్యంలో నిలవగా.. ఇరుజట్ల మధ్య ఫిబ్రవరి 13 నుంచి రెండో మ్యాచ్ ఆరంభం కానుంది. న్యూజిలాండ్తో తొలి టెస్టు సందర్భంగా అరంగేట్రం చేసిన ప్రొటిస్ ఆటగాళ్లు: 1.ఎడ్వర్డ్ మూరే(ఓపెనర్) 2.నీల్ బ్రాండ్(ఓపెనర్, కెప్టెన్) 3.వాన్ టాండర్(వన్డౌన్ బ్యాటర్) 4.రువాన్ డి స్వార్డ్(బౌలింగ్ ఆల్రౌండర్) 5.క్లైడ్ ఫార్చూన్(వికెట్ కీపర్ బ్యాటర్) 6. షోపో మొరేకి(పేస్ బౌలర్). చదవండి: అరిచీ.. అరిచీ.. నా గొంతు పోయింది: రోహిత్ శర్మ వ్యాఖ్యలు వైరల్


