overaction
-
పెదకూరపాడు నియోజకవర్గంలో టీడీపీ గూండాల అరాచకం
-
VRO బాగోతం బయటపెట్టిన మహిళ
-
జనసేన ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ రౌడీయిజం
-
తిరుపతిలో కూటమి గూండాగిరి
-
కూటమికి తలనొప్పిగా బీటెక్ రవి తీరు
-
జనసేన నేతల బరితెగింపు
-
ప.గో జిల్లాలో సంక్రాంతి సంబరాల పేరుతో కూటమి నేతల బరితెగింపు
-
తిరుమలలో పోలీసుల దురుసు ప్రవర్తన
-
ప్రధాని పర్యటనలో పోలీసుల ఓవరాక్షన్.. ఉక్కు కార్మికులకు వార్నింగ్
సాక్షి,విశాఖపట్నం:ప్రధాని మోదీ విశాఖపట్నం సందర్భంగా పోలీసులు ఓవరాక్షన్ చేస్తున్నారు. డిమాండ్ల సాధన కోసం నిరాహార దీక్ష చేస్తున్న విశాఖ స్టీల్ కార్మికులకు పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. దీక్షా శిబిరం నుంచి బయటకు వస్తే అరెస్ట్ చేస్తామని హెచ్చరించారు. ఇప్పటికే కార్మికులు దీక్ష చేస్తున్న కూర్మన్నపాలెంలో పోలీసులు భారీగా మోహరించారు.ఏ నిమిషమైనా పోరాట కమిటీ నేతలను పోలీసులు అరెస్టు చేసే అవకాశం ఉంది. మారుతి సర్కిల్ నుంచి ఐఎన్ఎస్ డేగా, కాన్వెంట్ జంక్షన్,రైల్వే స్టేషన్కు వెళ్లే దారిలో వాహనాలను నిలిపివేశారు. ప్రెగ్నెంట్ లేడీ ఆసుపత్రికి వెళ్లేందుకు బ్రతిమిలాడినా పోలీసులు అనుమతించలేదు. నిండు గర్భిణీ హాస్పిటల్ పేపర్స్ చూపించినా కనికరించలేదు.టీడీపీ ఎమ్మెల్సీ చిరంజీవిని మాత్రం అటుగా వెళ్లేందుకు పోలీసులు అనుమతించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.విశాఖ(visakhapatnam)లో స్టీల్ప్లాంట్ పరిరక్షణ కోసం పోరాట కమిటీ నిరాహార దీక్షకు పూనుకుంది. విశాఖకు ప్రధాని మోదీ(PM Modi) వస్తున్న తరుణంలో పోరాట కమిటీ సభ్యులు.. ప్రధాని అపాయింట్మెంట్ కోరారు. అయితే, ప్రభుత్వం నుంచి మాత్రం ఎలాంటి స్పందన రాలేదు. ఈ నేపథ్యంలో విశాఖలో ప్రధాని స్పందించకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరిక జారీ చేశారు.మరోవైపు.. వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ పార్కు వద్ద ధర్నా జరిగింది. ఈ సందర్భంగా సీపీఎం నేతలు మాట్లాడారు. విశాఖ స్టీల్ప్లాంట్ సొంత గనుల గురించి ఇప్పటి వరకు నోరు మెదపని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి భరత్.. ఏకంగా ఆర్సెలార్ మిట్టల్కు ఏజెంట్గా మారారని మండిపడ్డారు. కేంద్ర ఉక్కు మంత్రి కుమార్స్వామిని కలిసి రాష్ట్రంలో ఏర్పాటు చేయబోయే ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ పరిశ్రమకు నిరాటకంగా ముడి ఇనుప ఖనిజం సరఫరాకు చర్యలు తీసుకోవాలని కోరారని ఆరోపించారు. తక్షణం మంత్రి పదవి నుంచి భరత్ను తొలగించాలని డిమాండ్ చేశారు. -
TDP ఎమ్మెల్యే మాధవిరెడ్డి దౌర్జన్యం
-
గుంటూరులో కొనసాగుతున్న టీడీపీ నేతల అరాచకం
-
నంద్యాలలో రెచ్చిపోతున్న టీడీపీ నేతలు
-
తాడిపత్రిలో ఆగని జేసీ కుటుంబ అరాచకాలు
-
నీటి సంఘాల ఎన్నికల్లో టీడీపీ నేతల అరాచకం
-
సజ్జల భార్గవ్ రెడ్డి డ్రైవర్ పై పోలీసులు తప్పుడు కేసులు.. అంబటి స్ట్రాంగ్ కౌంటర్
-
పెనుకొండలో మంత్రి సవిత భర్త వెంకటేశ్వరరావు వీరంగం
-
కడప కార్పొరేషన్ వద్ద టీడీపీ ఎమ్మెల్యే హల్ చల్
-
బాణాసంచా షాపుల కేటాయింపులో టీడీపీ నేతల చేతివాటం
-
దసరా వేడుకల్లో వీరకుమార్ అనే ఏఆర్ కానిస్టేబుల్ వీరంగం...
-
ఏలూరుపాడులో అంబేద్కర్ ఫ్లెక్సీని చించేసిన రఘు రామ కృష్ణంరాజు
-
సచివాలయ ఉద్యోగిపై ‘తమ్ముడి’ శివాలు
సాక్షి, శ్రీసత్యసాయి జిల్లా: తనకు సమాచారం ఇవ్వకుండా రాయితీపై ప్రభుత్వం అందజేసే ఉలవలు ఎలా పంపిణీ చేస్తావంటూ టీడీపీ నాయకుడు వెంకటేష్ బండ బూతులతో సచివాలయ హార్టీకల్చర్ అసిస్టెంట్పై వీరంగం చేశాడు. శ్రీసత్యసాయి జిల్లా పరిగి మండలం శాసనకోటలో జరిగిన ఈ ఘటన.. టీడీపీ చోటామోటా నాయకులు కూడా ప్రభుత్వ యంత్రాంగంపై విరుచుపడుతున్న తీరుకు అద్దంపడుతోంది.ప్రభుత్వం రైతులకు సబ్సిడీపై ఉలవ విత్తనాలు అందజేస్తోంది. పరిగి మండలంలోని వ్యవసాయాధికారులు ఈ నెల 12 నుంచి ఉలవల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. శాసనకోటలో 13వ తేదీ విత్తన పంపిణీ జరగాల్సిన ఉన్నా.. స్థానిక టీడీపీ నాయకుల బెదిరింపుతో మండల వ్యవసాయాధికారులు వాయిదా వేశారు. 14వ తేదీ గ్రామానికి చెందిన టీడీపీ నాయకులతో కలిసి సచివాలయ ఉద్యోగులు ఆర్బీకే పరిధిలోని గ్రామ పంచాయతీ రైతులకు ఉలవ విత్తనాలను పంపిణీ చేశారు.ఆపై వరుస సెలవులు రావడంతో మంగళవారం ఉలవ విత్తనాల పంపిణీని చేపట్టారు. ఈ కార్యక్రమానికి రావాలని అదే రోజు సచివాలయ ఉద్యోగి పవన్కుమార్రెడ్డి గ్రామానికి చెందిన టీడీపీ బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి వెంకటేష్ను ఆహ్వానించేందుకు ఫోన్ చేశారు. అయితే తనకు తెలియకుండా రైతులకు విత్తనాలు ఎలా పంపిణీ చేస్తావంటూ ఆ టీడీపీ నేత వెంకటేష్ బూతు పురాణానికి తెరలేపాడు.ఇదీ చదవండి: శ్రీవారి లడ్డూపై CBN ఉన్మాద రాజకీయం‘ఈ వెంకటేశ్ గాడు పెద్ద క్రిమినల్.. వైకాపా నా కొడుకులతో నీ వేషాలు సరిపోతాయి.. నాతో కాదు.. అంటూ పచ్చి బూతులతో ఆ ఉద్యోగిపై విరుచుకు పడ్డాడు. ఆ ఉద్యోగిని బండబూతులు తిట్టిన ఆడియో తాజాగా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అనుచరుడయిన శాసనకోట వెంకటేష్ ఓ అధికారిని అంతలా దూషిస్తూ మాట్లాడిన తీరు విమర్శలపాలవుతోంది. -
ఎమ్మెల్యే బాలకృష్ణ ఇలాకాలో రెచ్చిపోయిన టీడీపీ నేత
శ్రీ సత్యసాయి, సాక్షి: రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నేతల దాడులు ఆగటం లేదు. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి పచ్చనేతలు దాడులతో రెచ్చిపోతున్నారు.తాజాగా టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ ఇలాకాలో టీడీపీ నేత రెచ్చిపోయాడు. హిందూపురంలో కొడవలితో టీడీపీ నేత శ్రీహరి నాయుడు వీరంగం సృష్టించాడు. వినాయకుడి మండపం వద్ద డీజే పెట్టొద్దని.. పాటలు నిలిపివేయాలని గొడవకు దిగాడు. అక్కడితో ఆగకుండా అక్కడి ఉన్నవారిపై దాడికి తెగబడ్డాడు.టీడీపీ నేత దాడిలో పాండురంగ అనే వ్యక్తి గాయపడ్డారు. ప్రస్తుతం టీడీపీ నేత దౌర్జన్యం దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.చదవండి: విపత్తు నిర్వహణను పట్టించుకోని చంద్రబాబు సర్కార్ -
డార్క్ రూమ్ లో చిత్రహింసలు
-
టీడీపీ నేతలకు చెప్తున్నా.. అధికారం శాశ్వతం కాదు..
-
హోం మంత్రి రాకతో పోలీసుల ఓవరాక్షన్
విజయవాడ స్పోర్ట్స్/రామవరప్పాడు: బుడమేరు వరద బాధితులకు సహాయం అందించాల్సిన పోలీసులు ఆదివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మిన్నకుండిపోయారు. సింగ్నగర్ ఫ్లై ఓవర్ వద్దకు హోం మంత్రి అనిత రాగానే ఓవరాక్షన్ చేశారు. బాధితులను పక్కకు నెట్టేసి ఒక్కసారిగా బారికేడ్లను అడ్డం పెట్టారు. దీంతో పోలీసులపై బాధితులు మండిపడ్డారు.ఇప్పటివరకు పట్టించుకోకుండా.. హోం మంత్రి రాగానే.. చచ్చీ చెడి ఈదుకుంటూ.. వచ్చిన మమ్మల్ని పక్కకు తోసేస్తారా అంటూ పోలీసులపై విరుచుకుపడ్డారు. తమ వాళ్లను తీసుకొచ్చేందుకు బోట్లు ఏర్పాటు చేయాలని కోరిన బాధితులపై ఆమె దురుసుగా ప్రవర్తించారు. కాగా, రామవరప్పాడు ఫ్లై ఓవర్ దిగువ ప్రాంతంలోని ఎస్ఎల్వీ గ్రీన్ మెడాస్లోని విల్లాలు వరద నీటితో నిండిపోయాయి. ఈ ఎస్ఎల్వీ విల్లాస్లో హోం మంత్రి అనితకు చెందిన విల్లాలు కూడా మునిగిపోయాయి. -
ఎంపీడీఓ కార్యాలయంలో టీడీపీ నేతల వీరంగం..
-
అనకాపల్లి: వరాహపురంలో టీడీపీ దౌర్జన్యం
సాక్షి, అనకాపల్లి: టీడీపీ నాయకుల దౌర్జన్యాలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. శనివారం అనకాలపల్లి చీడికాడ మండలం వరహాపురం స్కూల్ కమిటీ ఎన్నికలో టీడీపీ నేతలు దౌర్జన్యానికి తెగపడ్డారు. టీడీపీకి బలం లేకపోవడంతో అక్రమ మార్గంలో గెలిచేందుకు ప్రయత్నం చేశారు. ఎన్నికలో చేతులెత్తే విధానానికి స్వస్తి పలికి సీక్రెట్ ఓటింగ్ పెట్టాలని టీడీపీ డిమాండ్ చేసింది. స్కూల్ హెచ్ఎంపై టీడీపీ నాయకులు తీవ్ర ఒత్తిడి చేశారు. దీంతో వరహపురం స్కూల్ కమిటీ ఎన్నిక గందరగోళంగా మారింది. -
టీడీపీ బరితెగింపు.. దళిత మహిళ చైర్మన్ అయితే మీకు నొప్పేంటి..
-
చంద్రంపాలెం స్కూల్ కమిటీ ఎన్నికల్లో టీడీపీ దౌర్జన్యం
సాక్షి, విశాఖప్నటం: చంద్రంపాలెం స్కూల్ కమిటీ ఎన్నికల్లో టీడీపీ దౌర్జన్యానికి తెగపడింది. ఈ ఎన్నికల్లో మొదట ముగ్గురు వైఎస్సార్సీపీ సానుభూతిపరులు గెలవడంతో ఎన్నిక వాయిదా వేయాలని టీడీపీ నేతలు ఒత్తిడి తీసుకువచ్చారు. కానీ, ఎన్నికల వాయిదా వేయడానికి స్యూల్ విద్యార్థుల తల్లిదండ్రులు ఒప్పుకొలేదు. అక్కడితో ఆగకుండా టీడీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో స్కూల్లోకి ప్రవేశించారు. దీంతో అవుటర్స్ను ఎలా స్కూల్లోకి అనుమతిస్తారని తల్లిదండ్రులు ఉపాధ్యాయులను నిలిదీశారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చివరికి ఎన్నికల నిర్వహించకుండానే టీడీపీ సానుభూతిపరులు గెలిచినట్లు ప్రకటించారు. స్కూల్లోకి టీడీపీ కార్యర్తలు దూసుకురావటంపై విద్యార్థుల తల్లిదండ్రులు విమర్శలు చేస్తున్నారు. -
లాయర్ పై పోలీస్ ఓవరాక్షన్.. చివరికి సీన్ రివర్స్
-
టీడీపీ ఎమ్మెల్యే ఓవర్ యాక్షన్..
-
గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ ఓవరాక్షన్
సాక్షి, గుంటూరు: గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ ఓవరాక్షన్ ప్రదర్శించారు. రాజీవ్ గాంధీ నగర్లో శిలాఫలకాలను పగలగొట్టారు. గత ప్రభుత్వంలో రోడ్ల కోసం వేసిన శిలాఫలకాలను తానే స్వయంగా ధ్వంసం చేశారు. ఎమ్మెల్యే హోదాలో ఉండి ఇదేం పని అంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.కాగా, ఉమ్మడి గుంటూరు జిల్లాలో పచ్చ మూకల దౌర్జన్యాలకు అడ్డుకట్ట పడటం లేదు. కూటమి ప్రభుత్వం వచ్చి రెండు నెలలు దాటింది. ఇంకా ప్రతిచోటా దాడులు జరుగుతూనే ఉన్నాయి. వాహనాలు తగులబెట్టడం, కొట్టడం, ఊరిలో ఉండవద్దంటూ బెదిరించడం పరిపాటిగా మారింది. తాజాగా వట్టిచెరుకూరు మండలం గారపాడులో ఉద్రిక్తత నెలకొంది. వైఎస్సార్ సీపీ నాయకులు గ్రామంలో ఉండటానికి వీలులేదంటూ టీడీపీ నేతలు హుకుం జారీ చేశారు. -
ఏపీలో కూటమి నేతల వేధింపులు, దౌర్జన్యాలు
-
చిరు వ్యాపారులపై జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ ప్రతాపం
-
సీఐ బెదిరిస్తున్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
-
రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయి: పోతుల సునీత
-
దాడులు ఆపరు కానీ.. నిరసన చేస్తే అడ్డుకుంటారా..?
-
కెఎస్ఆర్ లైవ్ షో @ 22nd July 2024
-
అధికారం శాశ్వతం కాదు.. టీడీపీకి ఎంపీ గురుమూర్తి వార్నింగ్
-
రచ్చ కోసం రెచ్చగొట్టిన టీడీపీ
సాక్షి, టాస్క్ఫోర్స్: అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లెలో టీడీపీ శ్రేణులు కవ్వింపు చర్యలకు దిగటంతో ఉద్రిక్తత తలెత్తింది. పోలీసులు వారించి పలుసార్లు అడ్డుకున్నా ఖాతరు చేయకుండా నాలుగు గంటలపాటు ఉద్రిక్త పరిస్థితుల్ని సృష్టించారు. వివరాల్లోకి వెళితే.. మంగళవారం మధ్యాహ్నం నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి వచి్చన టీడీపీ నాయకులు, కార్యకర్తలు తంబళ్లపల్లె ఎంపీడీవో కార్యాలయం వద్దకు చేరుకున్నారు. అక్కడినుంచి వీరంతా ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి నివాసం వద్దకు వెళుతున్నట్టు పోలీసులకు సమాచారం అందింది.సోమవారం నుంచి ఎమ్మెల్యే ఇంటివద్దే ఉన్నారు. దీంతో టీడీపీ శ్రేణులు మంగళవారం అక్కడికి వెళ్లి శాంతిభద్రతల సమస్య సృష్టించాలని భావించారు. ఈ సమాచారం తెలిసి డీఎస్పీ ప్రసాదరెడ్డి పలువురు సీఐలు, ఎస్సైలను రప్పించారు. పోలీసు అధికారులు టీడీపీ శ్రేణులను నిలువరించి వెనక్కి వెళ్లాలని సూచించినా.. పట్టించుకోకుండా మమ్మల్లే అడ్డుకుంటారా అంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీస్ స్టేషన్ ఎదుట రాస్తారోకో చేపట్టి ట్రాఫిక్కు ఇబ్బందులు కలిగించారు.కొద్దిసేపటి తర్వాత పోలీసులు ఎమ్మెల్యే నివాసానికి సమీపంలోని మదనపల్లి రోడ్డులోని లేఅవుట్ ఆర్చ్ వద్దకు చేరుకున్నారు. టీడీపీ శ్రేణులను మళ్లీ అక్కడ పోలీసులు నిలువరించారు. రెండు గంటలకు పైగా వారికి నచ్చజెప్పేందుకు పోలీసు అధికారులు తీవ్రస్థాయిలో ప్రయత్నించినా లెక్కచేయలేదు. సాయంత్రం 6 గంటల సమయంలో టీడీపీ శ్రేణులు ఈలలు, సవాళ్లతో బిగ్గరగా కేకలు వేశారు.దీంతో ఎమ్మెల్యే ఇంటివద్ద ఉన్న వైఎస్సార్సీపీ శ్రేణులు అప్రమత్తమయ్యాయి. టీడీపీ శ్రేణులు కవ్వింపు చర్యలతో గొడవలు సృష్టించేందుకు రెచ్చగొడుతున్నారన్న విషయం వారికి అర్థమైంది. దీంతో ఘర్షణ వాతావరణం తలెత్తకుండా చూసేందుకు ములకలచెరువు సీఐ మధు ఎమ్మెల్యే ఇంటి వద్దకు చేరుకున్నారు. పరిస్థితిని వివరించి సంయమనం పాటించాలని కోరారు. తాము ఎమ్మెల్యేని కలిసేందుకు వచ్చామని, టీడీపీ శ్రేణుల వ్యవహారం తమకు తెలియదని వైఎస్సార్సీపీ శ్రేణులు తెలిపాయి. ఇంతలో టీడీపీ శ్రేణుల కవ్వింపు చర్యలు శృతిమించడంతో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. పోలీసులు రాత్రి 9 గంటలకు కూడా తంబళ్లపల్లెలో పోలీసు పహారా కొనసాగుతోంది. -
ఎన్టీఆర్ జిల్లాలో పోలీసుల ఓవరాక్షన్..
-
ఏపీలో తాలిబన్ల తరహా పాలన
-
రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న టీడీపీ గూండాల దాడులు, విధ్వంసాలు
-
కుమ్మపల్లిలో టీడీపీ నేతల అరాచకం
-
తిరువూరులో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ అరాచకం
-
టీడీపీ విష సంస్కృతి.. ఇదేం దౌర్జన్యం
-
చంద్రబాబు ఆదేశాలతో పేట్రేగిపోతోన్న పచ్చ రౌడీలు
-
KSR Live Show: మార్గాని భరత్ ప్రచార రథం దగ్ధం
-
మైలవరంలో ఫ్లెక్సీ వార్.. కొట్టుకున్న టీడీపీ నేతలు
-
పచ్చి బూతులతో.. టీడీపీ స్ట్రీట్ ఫైట్
-
పిన్నెల్లిపై దాడికి ప్రయత్నించిన టీడీపీ నేత కొమ్మెర శివ
-
అధికారం అండతో రెచ్చిపోతున్న టీడీపీ నాయకులు
-
ఆగని టీడీపీ దాడులు
-
కార్యకర్తల కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధం
-
ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం.. రెచ్చిపోతున్న టీడీపీ రౌడీలు
-
టీడీపీ అరాచకాలపై సింహాద్రి రమేష్ బాబు ఫైర్
-
టీడీపీ నేతల బరితెగింపు..|
-
రెచ్చిపోయిన టీడీపీ నేత కొల్లు రవీంద్ర..
-
టీడీపీ ఓవరాక్షన్.. మాచర్లలో ఉద్రిక్తత
సాక్షి, పల్నాడు జిల్లా: మాచర్లలో తెలుగుదేశం పార్టీ నేతలు ఓవరాక్షన్ చేశారు. వైఎస్సార్సీపీ కౌన్సిలర్ ఇంటికి టీడీపీ నేతలు తెలుగుదేశం జెండా కట్టారు. టీడీపీ జెండా తీసేయాలని వైఎస్సార్సీపీ కౌన్సిలర్ కోరగా.. టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్సీపీ కౌన్సిలర్తో వాదనకు దిగారు. దీంతో రెచ్చిపోయిన టీడీపీ కార్యకర్తలు.. వైఎస్సార్సీపీ కార్యకర్తలపైకి రాళ్లు రువ్వారు. గాయపడిన వైఎస్సార్సీపీ కార్యకర్తలను ఆసుపత్రికి తరలించారు. -
బరితెగించిన టీడీపీ సభ్యులు..మంత్రి బుగ్గన సీరియస్
-
పల్నాడు జిల్లాలో టీడీపీ కార్యకర్తల ఓవరాక్షన్
-
దళితులపై టీడీపీ గుండాల దౌర్జన్యం..
-
గుడివాడలో టీడీపీ-జనసేన శ్రేణుల ఓవరాక్షన్
సాక్షి, కృష్ణా జిల్లా: గుడివాడలో టీడీపీ, జనసేన శ్రేణుల ఓవరాక్షన్ ఉద్రిక్తతకు దారితీసింది. రోడ్డుకు అడ్డంగా బైక్లను నిలిపిన టీడీపీ, జనసేన కార్యకర్తలు.. వైఎస్సార్సీపీ శ్రేణులను రెచ్చగొట్టేలా వ్యవహరించారు. పోలీసులు నచ్చచెప్పినా వినకుండా రెచ్చగొట్టే చర్యలకు టీడీపీ పాల్పడింది. కాగా, గుడివాడ రాజకీయం హీటెక్కింది. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కొడాలి నాని ఆధ్వర్యంలో ఎప్పటిలాగే ఎన్టీఆర్ వర్థంతి వేడుకలు. అదే సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు రా కదలి రా సభ. గుడివాడ సెంటర్లో ఇద్దరు నేతల పోటాపోటీ ఫ్లెక్సీలు వెలిశాయి. ఇరువర్గాల కార్యకర్తలూ భారీ సంఖ్యలో పోగయ్యారు. అంతే.. దెబ్బకు అక్కడి రాజకీయం వేడెక్కింది. శాంతి భద్రతలకు భంగం వాటిల్లే ప్రమాదం ఉండడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. గుడివాడ మొత్తం పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. -
అన్నమయ్య జిల్లా రాజంపేటలో టిడిపి నేతల దుర్మార్గం
-
టీడీపీ కార్యకర్తల పేరుతో ఖమ్మంలో ఓ వర్గం ఓవరాక్షన్
-
తెలుగు యువత నాయకుల అత్యుత్సాహం
తాడేపల్లి రూరల్: గుంటూరు జిల్లా కుంచనపల్లిప్రాతూరు రోడ్డులో ఉన్న ఏపీ సీఐడీ సిట్ కార్యాలయం వద్ద మంగళవారం తెలుగు యువత నాయకులు, కార్యకర్తలు అత్యుత్సాహం ప్రదర్శించారు. సిట్ కార్యాలయం గోడలు దూకేందుకు ప్రయత్నం చేశారు. అడ్డుకునేందుకు వచ్చిన పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో వీఆర్వో ఫిర్యాదు మేరకు తాడేపల్లి పోలీసులు ఏడుగురిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ఎస్ఐ రమేష్ తెలిపిన వివరాల ప్రకారం... ఏపీ సీఐడీ కార్యాలయం వద్ద ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు విషయమై టీడీపీ నాయకుడు నారా లోకేశ్ను సిట్ అధికారులు విచారణ చేస్తున్నారు. ఆ సమయంలో బయటవారిని ఎవరినీ అనుమతించకుండా రెవెన్యూ, పోలీసుల ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. అయినా కొందరు తెలుగు యువత నాయకులు... సిట్ కార్యాలయం వెనుక వైపు గోడదూకి లోపలికి వచ్చేందుకు ప్రయత్నించారు. అక్కడ ఉన్న సెక్యూరిటీ, రెవెన్యూ సిబ్బంది వారిని అడ్డుకుని లోపలికి రావొద్దని పదేపదే చెప్పినా వినకుండా గోడదూకేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు అడ్డుకోవడంతో దౌర్జన్యానికి పాల్పడ్డారు. అక్రమంగా లోపలికి వచ్చేందుకు ప్రయత్నించినవారిపై వీఆర్వో మౌలాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. పోలీసులు అదుపులోకి తీసుకున్నవారిలో తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరాం చిన్నబాబు, ప్రధాన కార్యదర్శి నూతలపాటి నాగభూషణం, అధికార ప్రతినిధి సజ్జ అజయ్, చందర్లపాడు మండల అధ్యక్షుడు కమ్మ గోపీచంద్, నందిగామకు చెందిన గుళ్లపల్లి ఠాగూర్బాబు, ఈపూరి వినోద్, ఏలూరు జిల్లా ఎన్ఆర్ పేటకు చెందిన నాయుడు పవన్ ఉన్నారని చెప్పారు. -
తాడేపల్లి గూడెంలో టీడీపీ నేతలు ఓవరాక్షన్
సాక్షి, పశ్చిమ గోదావరి: తాడేపల్లి గూడెంలో టీడీపీ నేతలు ఓవరాక్షన్ చేశారు. పోలీసులు అనుమతి లేకుండా టీడీపీ శ్రేణులు తాడేపల్లిగూడెంలో పాదయాత్ర చేపట్టారు. ఈ నేపథ్యంలో పోలీసులు.. టీడీపీ శ్రేణులు చేపట్టిన పాదయాత్రను అడ్డుకున్నారు. దీంతో, వారు మరింత రెచ్చిపోయారు. వివరాల ప్రకారం.. తాడేపల్లిగూడెంలో టీడీపీ నేతలు మరోసారి రెచ్చిపోయారు. అనుమతి లేకుండా పాదయాత్ర చేపట్టడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో టీడీపీ శ్రేణులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ సందర్బంగా పోలీసులు.. జిల్లాలో సెక్షన్30 పోలీసు యాక్ట్ అమలులో ఉందని, సెక్షన్ 144 అమలులో ఉండటంతో పాదయాత్రను నిరాకరించినట్టు తెలిపారు. అయినప్పటికీ టీడీపీ శ్రేణులు వినిపించుకోకుండా ఓవరాక్షన్ చేశారు. -
టీడీపీ కొంప ముంచిన రామోజీరావు
-
దొందూదొందే ! సౌండ్ ఎక్కువ మ్యాటర్ తక్కువ
-
చంద్రబాబు అరెస్ట్ పై పవన్ కళ్యాణ్ ఓవర్ యాక్షన్ ఎందుకు?
-
అడ్డంగా దొరికినా ఆందోళనలేనా?
సాక్షి, రాజమహేంద్రవరం: ఎలాంటి తప్పూ చేయకపోయినా అరెస్టు చేస్తే ప్రతిఘటించడం చూసుంటాం. అక్రమాలతో సంబంధం లేకున్నా పోలీసులు అదుపులోకి తీసుకుంటే నిరసన తెలిపే నేతలను చూసుంటాం. కానీ, స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో అడ్డంగా దొరికిపోయిన టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుపై ఆ పార్టీ నేతలు పడిన పాట్లు విడ్డూరంగా ఉన్నాయి. చంద్రబాబు అరెస్టుపై నిరసనలకు టీడీపీ శ్రేణులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ప్రజల నుంచి కనీస స్పందన లేకపోవడంతో ఆందోళన కాస్తా అభాసుపాలైంది. ప్రజలను రెచ్చగొట్టి శాంతిభద్రతలకు విఘాతం కలిగించాలన్న వారి కుట్ర ఫలించలేదు. మరోపక్క ఇప్పటికే చంద్రబాబు వ్యవహార శైలితో విసిగిపోయిన పార్టీ శ్రేణుల్లో కొందరు ఆయనపై గుర్రుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆందోళనలకు పెద్దగా ఆసక్తి చూపలేదు. రోడ్డు పైకి వెళ్లి నిరసన తెలపడం ఎందుకని భావించి, ముందస్తుగా హౌస్ అరెస్టు అయ్యారు. ఏ చిన్న సంఘటన చోటు చేసుకున్నా రోడ్డుపై పడి ప్రభుత్వంపై బురద జల్లే టీడీపీ నేతలు.. చంద్రబాబు అవినీతి కుంభకోణంలో అడ్డంగా బుక్కయిపోవడంతో పూర్తి స్థాయిలో రోడ్డెక్కలేదు. నామ్ కా వాస్తే అన్న చందంగా కొంతసేపు నిరసనలు తెలిపి ఇళ్లకు జారుకున్నారు. ఓవర్ యాక్షన్ చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో ‘పచ్చ’ నేతలు అక్కడక్కడ ఓవర్ యాక్షన్ చేశారు. దుకాణాలు మూసివేయాలంటూ యజమానులపై చిందులు తొక్కారు. ఎవరూ స్పందించకపోవడంతో వెనక్కు తగ్గారు. ప్రజలను రెచ్చగొట్టే ప్రసంగాలు చేసినా లాభం లేకపోవడంతో చేసేది లేక వెనుదిరిగారు. కొన్ని ప్రాంతాల్లో బలవంతంగా షాపులు మూయించారు. వారు వెళ్లిన గంటల వ్యవధిలోనే వ్యాపారులు తిరిగి దుకాణాలు తెరచి యథావిథిగా వ్యాపారాలు నిర్వహించారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా అధికారులు ఆర్టీసీ బస్సులను ఉదయం డిపోలకే పరిమితం చేశారు. మధ్యాహ్నం నుంచి యథావిధిగా నడిపారు. పటిష్టంగా పోలీసు బందోబస్తు చంద్రబాబు అరెస్టు దృష్ట్యా జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలూ చోటు చేసుకోకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహించారు. ఆయన అరెస్టయిన క్షణం నుంచే శాంతిభద్రతల పరిరక్షణకు రంగంలోకి దిగారు. అక్కడక్కడ రోడ్లపైకి వచ్చిన టీడీపీ శ్రేణులను ఎప్పటికప్పుడు, ఎక్కడికక్కడ నిలువరించారు. ఆందోళన ఉధృతమైతే అదుపులోకి తీసుకుని, పోలీసు స్టేషన్లకు తరలించి, సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. ఫలితంగా జిల్లాలో ఎటువంటి హింసాత్మక ఘటనలూ చోటు చేసుకోలేదు. బంద్కు స్పందన నిల్ జిల్లా కేంద్రమైన రాజమహేంద్రవరం నగరంలో ఎటువంటి బందూ జరగలేదు. వ్యాపార సముదాయాలు, సినిమాహాళ్లు, ప్రైవేటు కార్యాలయాలు యథావిధిగా తెరచుకున్నాయి. రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ భర్త వాసు, రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి వారి ఇళ్ల వద్ద ఆందోళనకు దిగగా, పోలీసులు అరెస్తు చేశారు. గోపాలపురం, దేవరపల్లి మండలాల్లో రోడ్డుపై ఆందోళన చేస్తూ, జన జీవనానికి అంతరాయం కలిగిస్తున్న 50 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టీడీపీ నేతలు బంద్ చేయిస్తే గంట వ్యవధిలోనే తిరిగి షాపులు తెరిచారు. నిడదవోలులో షాపులు మూసేయాలని టీడీపీ నేతలు హంగామా చేసినా ఎవ్వరూ పట్టించుకోలేదు. అనపర్తి నియోజకవర్గంలో బంద్ ప్రభావం కనిపించ లేదు. మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేసినా స్పందన లేకపోయింది. రాజానగరంలో టీడీపీ నేతలు మొక్కుబడిగా కొద్దిసేపు ఆందోళన చేసి, వెళ్లిపోయారు. చంద్రబాబు తప్పు చేయకపోతే న్యాయస్థానంలో రుజువు చేసుకోవాలి. కోట్లాది రూపాయలు లూటీ చేసిన ఆయనను అరెస్టు చేస్తే టీడీపీ శ్రేణులు గగ్గోలు పెట్టడం ఎందుకు? – డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి, ఎమ్మెల్యే, అనపర్తి చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఆయన అరెస్టులో ఎలాంటి రాజకీయ దురుద్దేశాలు, కుట్రలు, కక్ష సాధింపులు లేవు. – తలారి వెంకట్రావు, ఎమ్మెల్యే, గోపాలపురం నైపుణ్య శిక్షణ పేరుతో రాష్ట్ర యువత భవిష్యత్తును తాకట్టు పెట్టి, ప్రజాధనాన్ని అడ్డగోలుగా దోచుకున్న చంద్రబాబు శిక్ష అనుభవించక తప్పదు. – జి.శ్రీనివాస్నాయుడు, ఎమ్మెల్యే, నిడదవోలు చంద్రబాబు నాటకాలకు ప్రజలు మోసపోయే రోజులు పోయాయి. ధర్మం, న్యాయం ప్రకారమే చంద్రబాబు అరెస్టు జరిగింది. – డాక్టర్ గూడూరి శ్రీనివాస్, వైఎస్సార్ సీపీ కో ఆర్డినేటర్, రాజమహేంద్రవరం సిటీ పాపం పండి అవినీతి సమ్రాట్ చంద్రబాబు అరెస్టు అయ్యారు. ఆయనతో సహా చట్టానికి ఎవరూ అతీతులు కారు. అవినీతికి కేరాఫ్ అడ్రస్గా ఉన్న చంద్రబాబు బండారం ఆధారాలతో సహా బయట పడటం వల్లనే సీఐడీ పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. ఇది చట్ట పరిధిలో జరిగింది. ఆయన ఏ తప్పూ చేయకపోతే చట్టం ముందు తన నిర్దోషిత్వం నిరూపించుకోవాలి. కక్ష సాధింపు అంటూ రాజకీయ విమర్శలు చేయడం మంచిది కాదు. రానున్న రోజుల్లో ఆయన అవినీతి బాగోతాలు ఒక్కొక్కటిగా బయటకు వచ్చి, రాజకీయంగా సమాధి కావడం తథ్యం. – విప్పర్తి వేణుగోపాలరావు, జెడ్పీ చైర్మన్, ఉమ్మడి తూర్పు గోదావరి నాడు ఇచ్చిన హామీలు అమలు చేయాలని అడిగిన పేద ముస్లిం యువకులపై చంద్రబాబు నంద్యాలలో దేశద్రోహం కేసులు పెట్టి, జైలుకు పంపారు. నేడు అదే నంద్యాలలో యువతకు నైపుణ్యాన్ని ఇచ్చే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో అరెస్టయ్యారు. నేరాలు రుజువైతే ఆయన జీవితమంతా జైల్లోనే గడపాల్సి ఉంటుంది. ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలి. – ఆరిఫ్, జిల్లా వక్ఫ్బోర్డ్ చైర్మన్ -
పాదయాత్రలో లోకేశ్ అత్యుత్సాహం.. సైగ చేయడంతో..
నల్లజర్ల: తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలంలో శుక్రవారం ప్రారంభమైన లోకేశ్ పాదయాత్ర పలు గ్రామాల్లో ఉద్రిక్తతలకు దారితీసింది. పోతవరంలో ప్రారంభమైన పాదయాత్ర కవులూరు, చీపురుగూడెం, తిమ్మన్నపాలెంలలో జరిగింది. తిమ్మన్నపాలెం జంక్షన్లో సీఎం ఫ్లెక్సీని చూసిన లోకేశ్.. యువగళం సభ్యుడికి సైగ చేయడంతో ఆ వ్యక్తి సీఎం ఫ్లెక్సీని మూడొంతులకుపైగా చింపేశాడు. విషయం తెలియడంతో వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు.ఫ్లెక్సీ చింపిన వ్యక్తిపై కేసు నమోదు చేస్తామని అడిషనల్ ఎస్పీ రజనీ, డీఎస్పీ వర్మ తదితరులు హామీ ఇచ్చారు. వెంటనే అదే ప్రదేశంలో కొత్త ఫ్లెక్సీ ఏర్పాటు చేయించారు. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు సంయమనంతో ఉన్నా పలుమార్లు టీడీపీ కార్యకర్తలు రెచ్చగొట్టే చర్యలకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు రంగప్రవేశం చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు. అనంతరం శాంతించిన కార్యకర్తలు సీఎం జగన్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. సాయంత్రం పాదయాత్ర నల్లజర్ల జంక్షన్కు వచ్చేసరికి సొసైటీ అధ్యక్షుడు కారుమంచి రమేష్ ఇంటి ముందు నిలబడ్డ వైఎస్సార్సీపీ కార్యకర్తలపై యువగళం సభ్యుడు పిడిగుద్దులు గుద్దాడు. దీనిపై కార్యకర్తలు డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. చదవండి: ఐటీ దర్యాప్తు తప్పించుకునేందుకు కొత్త ఎత్తుగడ -
అద్దంకిలో రెచ్చిపోయిన టీడీపీ నేతలు
-
కావలి ఎమ్మార్వో కార్యాలయంలో టీడీపీ నేతల రచ్చ
-
టీడీపీ నేతల ఓవరాక్షన్
-
విశాఖలో జనసేన కార్యకర్తల రౌడీయిజం
-
మచిలీపట్నంలో టీడీపీ నేతల అరాచకం
-
మందుబాబు చెంప చెల్లుమనిపించిన ఎస్ఐ రాజు
-
దళిత నేత సందీప్ ను దూషించిన టీడీపీ నేత గడ్డం వెంకటేశ్వరరావు
-
లోకేష్ యాత్రలో టీడీపీ కార్యకర్తలు అత్యుత్సాహం
సాక్షి, సత్యసాయి జిల్లా: లోకేష్ యాత్రలో టీడీపీ కార్యకర్తలు అత్యుత్సాహం ప్రదర్శించారు. నడిరోడ్డుపై టీడీపీ కార్యకర్తలు బాణసంచా పేల్చడంతో ఐదుగురు గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించారు. బత్తలపల్లి మండలం పొట్లమర్రిలో ఘటన జరిగింది.