photo
-
శ్వేతసౌధంలో ట్రంప్ మగ్షాట్
ఏదైనా కేసులో ఒక నేత అరెస్ట్ అయితే ఆ విషయాన్ని పత్రికా సమావేశంలోనో, మరే సందర్భంలోనో ప్రస్తావిస్తే ఆ నేతకు అస్సలు నచ్చదు. అసలు తనను అన్యాయంగా అరెస్ట్ చేశారని అంతెత్తున లేచి ఖండిస్తారు. అరెస్ట్నాటి ఫొటోలను ఒకవేళ మళ్లీ ఆయన ముందే పెడితే ఉగ్రరూపం దాల్చినా ఆశ్చర్య పోనక్కర్లేదు. అలాంటిది తెంపరితనానికి మారుపేరుగా నిలిచిపోయిన అగ్రరాజ్యానికి అధినేత డొనాల్డ్ ట్రంప్ ఇంకెలా స్పందిస్తారో అని చాలా మంది భావించడం సహజం. కానీ అలాంటి ఆలోచనలకు పటాపంచలు చేస్తూ, విభిన్నంగా ట్రంప్ తన అరెస్ట్ నాటి ఫొటోను పెద్ద సైజులో తీయించి చక్కగా బంగారు రంగు ఫ్రేమ్ కట్టి ఏకంగా అధ్యక్షభవనంలోనే తగిలించారు. అది కూడా ఎక్కడో కనిపించనట్లు ఓ మూలన కాకుండా నేరుగా కార్యనిర్వాహక ఉత్తర్వులు జారీచేసే ఓవల్ ఆఫీస్ గోడకే తగిలించారు. రెండ్రోజుల క్రితం అమెరికా పర్యటనకు వెళ్లిన భారత ప్రధాని నరేంద్ర మోదీ వైట్హౌస్కు వెళ్లినప్పుడు అక్కడి మీడియా కెమెరామెన్లు ఓవల్ ఆఫీస్ అంతటినీ తమ కెమెరాల్లో బంధించిన వేళ ఈ మగ్షాట్ ఫొటోఫ్రేమ్ విషయం వెలుగులోకి వచ్చింది. ఏమిటీ మగ్షాట్ ? 2020లో అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి జార్జియా రాష్ట్రంలో ఫలితాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలపై నాటి రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి ట్రంప్ను అరెస్ట్చేశారు. ఆ సందర్భంగా 2023 ఆగస్ట్లో జార్జియా రాష్ట్రంలోని పుల్టన్ కౌంటీ జైలుకు వచ్చి ట్రంప్ లొంగిపోయారు. కస్టడీలోకి తీసుకునే ముందు అరెస్ట్ అయిన నిందితుడి ముఖం స్పష్టంగా తెలిసేలా దగ్గరి ఫొటో అంటే మగ్ షాట్ను నిబంధనల ప్రకారం తీసుకుంటారు. ట్రంప్ ఫొటో సైతం అలాగే తీశారు. మాజీ అధ్యక్షుడిని ఇలా మగ్షాట్ తీయడం అమెరికా చరిత్రలో ఇదే తొలిసారి. దీంతో ట్రంప్ మగ్షాట్ ఆన్లైన్లో విపరీతంగా వైరల్ అయింది. ఆ ఫొటోను ఆనాడు ప్రఖ్యాత న్యూయార్క్ పోస్ట్ సైతం ఫ్రంట్పేజీలో ప్రచురించింది. ఆ ఫ్రంట్పేజీ కటౌట్నే ట్రంప్ ఫ్రేమ్ కట్టించారు. మగ్షాట్పై నాటి అధికార డెమొక్రాట్లు, నాటి అధ్యక్షుడు జో బైడెన్ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. అయితే ట్రంప్కు మద్దతుగా ఇదే మగ్షాట్ ఫొటోలను ఆన్లైన్లో ప్రచారానికి రిపబ్లికన్ నేతలు వాడుకున్నారు. తాజాగా మగ్షాట్ను వైట్హౌస్లో ఫ్రేమ్ కట్టిన విషయం అందరికీ తెలియడంతో వైట్హౌస్ డెప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ డాన్ స్కావినో ఒక పోస్ట్చేశారు. ‘‘హ్యాపీ వేలంటైన్ డే. అందమైన ఓవల్ ఆఫీస్లోకి మీకందరికీ స్వాగతం’’అని ‘ఎక్స్’లో ఒక పోస్ట్చేశారు. ఈ ఫొటోఫ్రేమ్ను మాజీ అమెరికా అధ్యక్షుడు జార్జ్ వాషింగ్టన్, ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్ల ఫొటోల సమీపంలో తగిలించారు. ఆనాడు అరెస్ట్ అయిన వెంటనే పూచీకత్తు మీద ట్రంప్ విడుదలయ్యారు. ఎలాగూ ఫొటో వైరల్గా మారడంతో దీనిని వ్యాపారవస్తువుగా ట్రంప్ మార్చేశారు. స్వయంగా ఆయన తన మగ్షాట్ ఫొటోల విక్రయం ద్వారా దాదాపు రూ.61 కోట్లు ఆర్జించారు. టీ–షర్ట్లు మొదలు డిజిటల్ ట్రేడింగ్ కార్డుల దాకా అన్నింటిపైనా ఈ మగ్షాట్నే ముద్రించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
చూపులతోనే మైమరిపిస్తున్న కృతి శెట్టి...! (ఫోటోలు)
-
మోడ్రన్ లుక్స్ తో అదరగోడుతున్న ఆషికా రంగనాథ్ ఫోటోలు
-
Pic of The Day: ‘క్లిక్’ కొట్టామంటే కిర్రాక్ ఉండాలే!
ఇప్పుడంటే ప్రతి స్మార్ట్ఫోన్(Smart Phone) ఓ కెమెరా..గురిపెట్టామా... క్లిక్ అనిపించామా... ఫొటో రెడీ. కానీ...వాస్తవానికి ఫొటోగ్రఫీ(Photography) అంత ఈజీ ఏమీ కాదు..సరైన కెమెరా.. సెట్టింగ్లపై అవగాహన.. లైటింగ్.. టైమింగ్..ఇలా బోలెడన్ని విషయాలను అర్థం చేసుకుని మరీ క్లిక్ అనిపించాలి!కావాలంటే.. ఎనజేటర్ పేరుతో ఎక్స్పై వచ్చిన ఈ ట్వీట్ చూడండి! అత్యద్భుతమైన ఫొటోగ్రఫీకి కొన్ని మచ్చుతునకలు కనిపిస్తాయి!This is photography at it’s finest. rate all from 1-10! pic.twitter.com/rTHuZjGmUo— Enezator (@Enezator) January 6, 2025 -
నితీశ్ రెడ్డి కుటుంబంతో అనుష్క శర్మ.. ఫొటో వైరల్
-
దీపికా పదుకొణె లైఫ్ రీస్టార్ట్.. సింగర్కి కన్నడ నేర్పిస్తూ (ఫొటోలు)
-
త్వరలోనే నాగచైతన్య-శోభిత పెళ్లి.. ఆ ఫోటోను డిలీట్ చేసిన చైతూ!
అక్కినేని హీరో నాగచైతన్య త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నారు. ఇప్పటికే హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో ఎంగేజ్మెంట్ చేసుకున్న చైతూ ఈ ఏడాది డిసెంబర్లో వివాహబంధంలోకి అడుగు పెట్టనున్నట్లు తెలుస్తోంది. నిశ్చితార్థం తర్వాత వీరిద్దరు తొలిసారిగా జంటగా కనిపించారు. అంతేకాకుండా ఇటీవలే పెళ్లి పనులు మొదలైన ఫోటోలను శోభిత తన ఇన్స్టాలో పోస్ట్ చేసింది. ఆ ఫోటోలు నెట్టింట తెగ వైరల్గా మారాయి.అయితే గతంలో సమంతను పెళ్లాడిన నాగ చైతన్య విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరు 2021లో తామిద్దరం విడిపోతున్నట్లు ప్రకటించారు. అయితే ఆగస్టులో శోభిత-చైతూ ఎంగేజ్మెంట్ తర్వాత కూడా ఆయన ఇన్స్టాలో సమంతతో ఉన్న ఫోటోలను నెటిజన్స్ గుర్తించారు. అందులో విడాకులకు సంబంధించిన పోస్ట్, 2018లో మజిలీ సినిమాకు సంబంధించిన పోస్టర్ ఉన్నాయి. అంతేకాకుండా సమంతతో కలిసి రేస్ ట్రాక్పై తీసిన చిత్రం కూడా ఉంది. అందులో "బ్యాక్ త్రో ...మిసెస్ అండ్ ది గర్ల్ఫ్రెండ్" అని క్యాప్షన్ కూడా రాసుకొచ్చారు.అయితే తాజాగా ఆ ఫోటోను నాగ చైతన్య తన ఇన్స్టా నుంచి తొలగించినట్లు తెలుస్తోంది. ఇటీవల చైతూ నిశ్చితార్థం సమయంలో ఆమెపై గౌరవంతో ఆ పోస్ట్ను తొలగించాలంటూ సమంత అభిమానులు సోషల్ మీడియా వేదికగా కోరారు. దీంతో శోభితతో పెళ్లికి ముందే ఆ పోస్ట్ నాగచైతన్య తొలగించినట్లు అర్థమవుతోంది. కాగా.. 2017లో పెళ్లి చేసుకున్న సమంత- చైతూ వ్యక్తిగత కారణాలతో 2021లో విడిపోయారు. -
30 ఏళ్ల క్రితం ఫోటో.. చిరుతో ఉన్నదెవరో తెలుసా..?
మెగాస్టార్ చిరంజీవితో ఉన్న ఒక బాలుడి ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. అతని పుట్టినరోజు సందర్భంగా మెగా ఫ్యాన్స్ ఈ ఫోటోను షేర్ చేస్తున్నారు. ఇందులో ఉన్నది ఎవరో కనిపెట్టండి అంటూ ఒక క్యాప్షన్తో వారు షేర్ చేస్తున్నారు. గుర్తుపట్టిన అభిమానులు మాత్రం వెంటనే శుభాకాంక్షలు కూడా తెలుపుతున్నారు. ఇంతకు చిరు చేతిలో ఉన్న ఆ బాలుడు ఎవరంటే..? టాలీవుడ్ యంగ్ హీరో సాయిధరమ్ తేజ్.మెగాఫ్యామిలీ నుంచి వచ్చిన సాయిధరమ్ తేజ్ అక్టోబర్ 15న తన 38వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. సినిమాల పరంగా తన కెరీర్ ప్రారంభంలో వరస హిట్స్ కొట్టిన ఆయన ఆ తర్వాత రొటీన్ కమర్షియల్ సినిమాలతో ఘోరంగా దెబ్బతిన్నాడు. మధ్యలో 'రిపబ్లిక్' లాంటి ప్రయోగాత్మక చిత్రాలతో ఆకట్టుకున్నాడు. అయితే, విరూపాక్ష, బ్రో చిత్రాలతో అభిమానులను మెప్పించాడని చెప్పవచ్చు.రాబోయే సినిమా విషయానికొస్తే.. సాయి ధరమ్ తేజ్ టైటిల్ రోల్లో ‘గాంజా శంకర్’గా రానున్నాడు. సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్నారు. గతేడాదిలో ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటుంది. అయితే, సినిమా టైటిల్ మార్చాలని పలు అభ్యంతరాలు వచ్చాయి. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. -
వీళ్లు.. ఈ కుర్రాడి తల్లిదండ్రులా?
సోషల్ మీడియా ఎప్పటికప్పుడు కొత్త ప్రపంచాన్ని చూపిస్తుంటుంది. కొన్నిసార్లు షాకింగ్ వీడియోలు, ఫొటోలు వైరల్ అవుతుంటాయి. వీటిని చూసినప్పుడు ఎవరికీ ఏమాత్రం నమ్మాలని అనిపించదు.తాజాగా ఒక ఫొటో వైరల్గా మారింది. దీనిని చూసినవారు తెగ ఆశ్యర్యపోవడానికి తోడు కడుపు చెక్కలయ్యేలా నవ్వుకుంటున్నారు. ఇన్స్టాగ్రామ్లో ఒక కుర్రాడికి సంబంధించిన ఎగ్జామినేషన్ ఫారం తెగ వైరల్ అవుతోంది. ఆ కుర్రాడు బీఏ ఆనర్స్ విద్యార్థి అని తెలుస్తోంది. అతనికి సంబంధించిన ఫారంలో తండ్రి పేరు ‘ఇమ్రాన్ హష్మీ’ అని, తల్లి పేరు ‘సన్నీ లియోన్’ అని రాసి ఉంది. వీరు బాలీవుడ్ ప్రముఖులనే విషయం తెలిసిందే.ఈ ఫోటో వైరల్ అవడానికి ఆ కుర్రాడి తల్లిదండ్రుల పేర్లే ప్రధాన కారణం. అయితే ఇది నిజమా లేక ఎవరైనా ఫోటోను ఎడిట్ చేశారా అనేది స్పష్టం కాలేదు. ఈ ఫోటో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ ఫోటో ఇండియన్ రేర్ ఇమేజస్ అనే పేజీ నుండి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ అయ్యింది. ఈ పోస్ట్ను ఇప్పటివరకూ 2 లక్షల 28 వేల మందికి పైగా యూజర్లు వీక్షించారు. ఈ పోస్ట్ చూసిన ఒక యూజర్ ఆ కుర్రాడి తాత పేరు మహేష్ భట్ అని రాయగా, మరొక యూజర్ దీనిని ఫేక్ అని పేర్కొన్నాడు.ఇది కూడా చదవండి: సహారాలో భారీ వర్షాలు.. ఆశ్చర్యపరుస్తున్న దృశ్యాలు -
చిత్ర కథలు (ఫొటోలు)
‘ఉద్యోగ’ దీక్షబూని..‘కొడితే కొట్టాలిరా.. సిక్స్ కొట్టాలి.. పడితే పట్టాలిరా.. కొలువు పట్టాలి’ అన్నట్టుగా ఉద్యోగ సాధన దీక్ష చేపట్టారు విజయనగరంలోని నిరుద్యోగులు. ప్రశాంత వాతావరణంలో తదేక దీక్షతో చదువుతూ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారు. విజయనగరం కోటలోను, చుట్టుపక్కల గట్లు, చెట్ల కింద పదుల సంఖ్యలో నిరుద్యోగ యువత ఇలా చదువుతూ కనిపించారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, విజయనగరం రైల్ బస్సు.. ప్రయాణం మిస్సుప్రకృతి అందాల నడుమ విశేష సేవలందించిన రైల్ బస్సు మూలనపడింది. బొబ్బిలి–సాలూరు మధ్య 21 కి.మీ. మేర ఒక ఇంజిన్, రెండు బోగీలతో నడిచే ఈ రైల్ బస్సును 1993లో ప్రారంభించారు. 15 గిరిజన గ్రామాల మధ్య ఇది నడిచేది. ఈ రైలు బస్సును నడపలేక రైల్వే అధికారులు మూలనపెట్టేశారు. ప్రస్తుతం ఇది విశాఖలోని రైల్వే స్విమ్మింగ్ పూల్ ప్రాంతంలో ఇలా ఉండిపోయింది. – సాక్షి ఫొటోగ్రాఫర్, విశాఖపట్నం ఇదేంటన్నా.. పోలీసన్నావాహన చోదకులు రహదారి నిబంధనలను అతిక్రమిస్తే.. అడ్డుకోవాల్సిన పోలీసులే నిబంధనల్ని అతిక్రమిస్తే ఏమనాలి. ఏమైనా అందామంటే.. వాళ్లు ఊరుకుంటారా. హెల్మెట్ ధరించకుండా మోటార్ సైకిల్పై నడపడమే కాకుండా.. సెల్ఫోన్ మాట్లాడుతూ కొందరు పోలీసులు ఇలా ముందుకు సాగిపోతున్నారు. నిబంధనల్ని తోసిరాజని నెల్లూరు ఓ కానిస్టేబుల్ మాగుంట లేఅవుట్ ప్రాంతంలో కెమెరా కంటికి చిక్కారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, నెల్లూరు ఫిలిప్పీన్స్ను భీకర తుపాను క్రతోన్ వణికిస్తోంది. ఇలొకొస్ నార్టె ప్రావిన్స్లోని బకర్రాలో వరదల్లో చిక్కుకుపోయిన ప్రజలను తరలిస్తున్న సహాయక సిబ్బంది క్రతోన్ తుపానుతో ఓ వైపు వర్షం కురుస్తుండగా ఆకాశంలో ఆహ్లాదం కలిగిస్తున్న ఇంద్రధనుస్సు. తైవాన్ రాజధాని తైపీలోనిదీ దృశ్యం. గ్రీస్లో కార్చిచ్చు వ్యాపించింది. ఆదివారం కొరింతియా ప్రాంతంలోని అనో లౌట్రో గ్రామం వైపు దూసుకొస్తున్న మంటల దృశ్యమిది. పితృ పక్షం సందర్భంగా సోమవారం బిహార్ రాష్ట్ర గయలోని దేవ్ఘాట్లో పిండ ప్రదానం చేస్తున్న ఓ విదేశీ భక్తురాలు దక్షిణ కొరియా రాజధాని సియోల్లో సోమవారం ‘మిస్ యూనివర్స్ కొరియా’ పోటీల్లో హొయలొలికిస్తున్న 81 ఏళ్ల చోయి సూన్ హ్వా. -
Raai Laxmi : మోడ్రన్ లుక్లో అదరగొట్టిన రాయ్ లక్ష్మీ
-
Kalyani Priya darshan : తెల్ల చీరలో కల్యాణి ప్రియదర్శన్ సోయగాలు..!
-
ఈ చిన్నారిని గుర్తుపట్టారా? ఇపుడు రాజ్యసభ ఎంపీ!
రాజ్యసభ, ఎంపీ, రచయిత సుధానారాయణమూర్తి సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు. అనేక సామాజిక అంశాలపై తన అభిప్రాయాలను పంచుకుంటూ ఉంటారు. ఒక్కోసారి తన వ్యక్తిగత విషయాలను జోడిస్తూ, మరికొన్ని అవగాహన కల్పించే అంశాలను తన అభిమానులతో కూడా షేర్ చేస్తూ ఉంటారు. తాజాగా తన చిన్నప్పటి ఫోటో ఒకటి ఎక్స్లో పోస్ట్ చేశారు. దీంతో ఇది అభిమానులను ఆకట్టుకుంటోంది.‘‘ఈ ఫోటో నాకు సంవత్సరం వయస్సులో ఉన్నప్పుడు హుబ్లీలోని ఒక స్టూడియోలో తీసింది. ఆ సమయంలో, మేము షిగ్గావ్లో ఉండేవాళ్లం, కానీ అక్కడ స్టూడియోలు లేనందున, మేము ఈ ఫోటో కోసం హుబ్లీకి వెళ్లాం’’ అంటూ సుధామూర్తి తన బాల్య స్మృతులను నెమరు వేసుకున్నారు.This picture was taken in a studio in Hubli when I was around 1 year old. At the time, we were living in Shiggaon, but since there were no studios there, we travelled to Hubli for this photograph. pic.twitter.com/YjhjJ3Aw5L— Smt. Sudha Murty (@SmtSudhaMurty) July 30, 2024 -
అప్పటి పిల్లాడే.. నేడు ప్రపంచ కుబేరుడు - ఎవరో చెప్పుకోండి
ఈ ఫొటోలో కనిపిస్తున్న పాలబుగ్గల పాపాయి ఎవరా అని ఆలోచిస్తున్నారా? ఇతడే ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు. ఇప్పటికే మీ మనసులో ఓ పేరు తళుక్కుమని మెరిసి ఉంటుంది. మీరు ఊహించింది నిజమే.. ఇతడే టెస్లా సీఈఓ 'ఇలాన్ మస్క్'.ప్రపంచంలో అత్యంత ధనవంతుడైన 'ఇలాన్ మస్క్' గురించి అందరికి తెలుసు. జూన్ 28 నాటికి 53ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా పలువు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మస్క్ తన 30వ ఏట తీయించుకున్న ఫోటో కూడా షేర్ చేశారు.మస్క్ సంపద సుమారు రూ. 20 లక్షల కోట్ల కంటే ఎక్కువే అని తెలుస్తుంది. ఇటీవల ఈయన తన మూడో భార్య ద్వారా మరో బిడ్డను పొందారు. దీంతో ఈయనకు మొత్తం 12 మంది సంతానం ఉన్నట్లు తెలుస్తోంది.Elon Musk is one of the most well-known CEOs in the world, born on June 28, 1971 in South Africa1. He is the founder, chairman, and CEO of SpaceX, as well as an investor, CEO, and product designer at Tesla1. Musk uses memes on social media, including popular jokes involving 69… pic.twitter.com/4UlBBjuSz7— Troll Media Center (@TrollCTO69420) June 28, 2024 -
ఎంపీలు కంగనా-చిరాగ్.. అదిరిపోయే లుక్
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఎంపీగా మారి పార్లమెంట్లో అడుగుపెట్టారు. ఇటీవలి లోక్సభ ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్లోని మండి లోక్సభ స్థానం నుంచి బీజేపీ టిక్కెట్పై పోటీ చేసి, కంగనా విజయం సాధించారు. దీంతో ఇప్పుడు మీడియా దృష్టి కంగనాపై నిలిచింది.లోక్ సభ స్పీకర్ ఎన్నిక సందర్భంగా బుధవారం ఎంపీలంతా పార్లమెంట్కు వచ్చారు. ఇదే కోవలో బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ లోక్ సభ మెట్లు ఎక్కగానే మీడియా కెమెరాలు ఆమెను చుట్టుముట్టాయి. ఈ సమయంలో కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ కూడా ఆమెకు సమీపంలో కనిపించారు. పార్లమెంట్ మెట్ల మీద వారిద్దరూ కలుసుకుని, నవ్వుతూ పరస్పరం పలుకరించుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. యూజర్స్ తమ అభిమాన నేతలను చూసి సంబరపడుతున్నారు.కంగనా రనౌత్, చిరాగ్ పాశ్వాన్ గతంలో ఒక చిత్రంలో కలిసి నటించారు. 2011లో విడుదలైన ‘మిలే నా మిలే హమ్’లో వీరిద్దరూ కనిపించారు. ఈ చిత్రం అంతగా విజయవంతం కాలేదు. అయితే ఇప్పుడు వీరిద్దరూ ఎంపీలుగా మారి రాజకీయాల్లో విజయం సాధించారు. వీరు నటించిన చిత్రం బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైన తర్వాత చిరాగ్ పాశ్వాన్ తన తండ్రి రామ్ విలాస్ పాశ్వాన్ సారధ్యంలో రాజకీయాల వైపు పయనం మొదలుపెట్టారు. 2024లో రాజకీయ రంగ ప్రవేశం చేసిన కంగనా తొలి ఇన్నింగ్స్లోనే విజయాన్ని అందుకున్నారు. #WATCH | Union Minister Chirag Paswan and BJP MP Kangana Ranaut arrive at the Parliament. pic.twitter.com/ZZZk61z7d0— ANI (@ANI) June 26, 2024 -
న్యూ లుక్లో రాహుల్.. పీక్లో 20 ఏళ్ల పొలిటికల్ కెరియర్
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లోక్సభలో ప్రతిపక్ష నేతగా మారారు. తన 20 ఏళ్ల రాజకీయ జీవితంలో తొలిసారిగా ఆయన ఈ బాధ్యతలు చేపట్టారు. ఇండియా కూటమిలోని అన్ని భాగస్వామ్య పార్టీల సమ్మతి మేరకు రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేతగా ఎన్నికయ్యారు.ఈ బాధ్యతలు స్వీకరించి అనంతరం రాహుల్ గాంధీ ఎంతో కాన్ఫిడెంట్గా కనిపిస్తున్నారు. అతని ఎక్స్ప్రెషన్స్లో ఆత్మవిశ్వాసం తొంగిచూస్తోంది. ఈ నేపధ్యంలో రాహుల్ గాంధీకి సంబంధించిన రెండు ఫొటోలు హల్చల్ చేస్తున్నాయి. వీటిలో తాను ప్రతిపక్ష నేతగా ఎంపికయ్యానన్న ఆనందం, ఉత్సాహం ఆయన ముఖంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి.కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ఇంట్లో జరిగిన ఇండియా కూటమి సమావేశానికి భాగస్వామ్య పార్టీల నేతలంతా హాజరయ్యారు. వారంతా రాహుల్ గాంధీని ప్రతిపక్ష నేతగా ప్రకటించిన వెంటనే రాయ్బరేలీ ఎంపీ రాహుల్ గాంధీ ముఖం వెలిగిపోయింది. ఈ ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ప్రకటనకు ముందు రాహుల్ సమావేశంలో నిశ్శబ్దంగా ఉంటూ అందరి మాటలు ఆలకిస్తూ కనిపించారు.తనను ప్రతిపక్ష నేతగా ఎన్నిక చేసిన అనంతరం రాహుల్ ఆనందంతో తన గుండెపై చేయి వేసుకున్నారు. తరువాత చేతులు జోడించి అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో 20 మంది నేతలు పాల్గొన్నారు. రాహుల్ గాంధీ 2004లో తొలిసారి క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చారు. అదే ఏడాది తొలిసారిగా అమేథీ నుంచి ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. నాటి నుంచి ఆయన ప్రతిపక్ష నేత పదవిని చేపట్టలేదు. అయితే ఇప్పుడు రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేత బాధ్యతలు చేపట్టారు. -
నా అనుమతి లేకుండానే ఆ ఫోటోలు లీక్ చేశారు: కస్తూరి
కస్తూరి శంకర్.. ఒకప్పుడు హీరోయిన్గా నటించింది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో అనేక సినిమాలు చేసింది. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తోంది. తమిళ బిగ్బాస్ షోలోనూ పార్టిసిపేట్ చేసిన ఈ నటి ఆ మధ్య బుల్లితెర సీరియల్స్లో మెరిసింది. 50 ఏళ్లు వయసు దాటినా ఆమె అందం చెక్కు చెదురలేదు. ఇప్పటికీ ఆమె నవ్వులో తెలియని మ్యాజిక్ ఉంటుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన ఫోటో షూట్కు సంబంధించి చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి.2000 సంవత్సరంలో కస్తూరి ఒక డాక్టర్ను వివాహం చేసుకుంది. ఆ తర్వాత ఆమె యూరప్ వెళ్లిపోయింది. ఆ తర్వాత అమెరికాలో కొంత కాలం ఉంది. ఆ సమయంలో రోజుల వ్యవధి ఉన్న తన బాబుతో అమ్మతనాన్ని చాటి చెబుతూ అర్ధనగ్నంగా ఫోటోలు దిగింది. అవి కాస్త నెట్టింట వైరల్ కావడంతో కొందురు ఆమెను విమర్శిస్తే.. మరికొందరు అభినందించారు. తాజాగా కస్తూరి ఆ సందర్భం గురించి ఇలా చెప్పుకొచ్చింది.'ఆ ఫోటో షూట్ నేను చేసింది ఇండియా కోసం కాదు.. అమెరికాలో ఒక మ్యాగ్జైన్ కోసం ఇచ్చాను. అది భారత్లో పబ్లీష్ కాకూడదు. కానీ, భారత్లో ఉన్న మీడియా వారు సెన్స్ లేకుండా ప్రచురించారు. దేశంలో పేరున్న మీడియా సంస్థనే ముందుగా భారత్లో ప్రచురించింది. కనీసం నన్ను కూడా అడగలేదు. ఇక్కడ ఉన్న వారికి నేను ఎవరికీ అనుమతి ఇవ్వలేదు. కొంత కాలం తర్వాత ఒక ఆంగ్ల పత్రిక నన్ను సంప్రదించి ప్రచురించుకుంది. అందరూ దొంగతనంగా ఆ ఫోటోలు వేసుకున్నారు. భారత కల్చర్కు ఆ ఫొటోలు పెద్దగా నచ్చవు. అది అమెరికన్ ప్రాజెక్టు. ఒక మహిళ డెలివరీ అయిన తర్వాత శరీరంలో మార్పులు వస్తాయి. దానిని అవగాహాన కల్పించేందుకే ఆ ప్రాజెక్ట్ చేశాను. మాతృత్వానికి అమెరికా వాళ్లు ఇచ్చే మర్యాద, మనం ఇచ్చే మర్యాద వేరుగా ఉంటుంది. ఆ ఫొటోలు లీక్ కావడం నాకు కూడా చాలా బాధగా అనిపించింది. బిడ్డకు పాలిచ్చే ఫొటోలను ఇక్కడి వారు చూసే విధానం వేరుగా ఉంటుంది. కానీ, అది తప్పని తెలుసుకున్నా. కానీ, ఎవరూ ఊహించని విధంగా భారత్ నుంచి కూడా కొందరు మహిళలు నాకు నాకు ఎంతో మద్దతు ఇచ్చారు. ఎందుకంటే వారు కూడా అమ్మ స్థానం నుంచే వచ్చారు కాబట్టి దాని విలువ తెలుస్తోంది. గ్రామీణ మహిళలు నుంచి కూడా నాకు సపోర్ట్ దక్కింది. కొంత కాలం తర్వాత పెళ్లి అయిన పురుషులు కూడా నాకు అండగా నిలిచారు.' అని కస్తూరి తెలిపింది. -
సెల్ఫీ అడిగిన అభిమాని.. ఓవర్ యాటిట్యూడ్ చూపించిన హీరో!
కోలీవుడ్ హీరో సిద్ధార్థ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దక్షిణాదిలో తెలుగు, తమిళ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. గతేడాది చిన్నా సినిమాతో ప్రేక్షకులను అలరించాడు. ప్రస్తుతం ఆయన కమల్ హాసన్ చిత్రం ఇండియన్-2 లో కనిపించనున్నారు. తాజాగా సిద్ధార్థ్ ముంబయిలోని బాంద్రాలో సందడి చేశారు.సిద్ధార్థ్ తన కారు వద్దకు వెళ్తుండగా ఫోటో దిగేందుకు యత్నించాడు. దీంతో అతనిపై హీరో సిద్ధార్థ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దయచేసి ఇక్కడ సౌండ్ చేయొద్దంటూ అతన్ని వారించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఇది చూసిన నెటిజన్స్ సిద్ధార్థ్ తీరుపై మండిపడుతున్నారు. అభిమానులతో ఇలాంటి ప్రవర్తన సరికాదని సూచిస్తున్నారు.కాగా.. ఈ ఏడాదిలోనే సిద్ధార్థ్, ఆదితి రావు హైదరీ నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. వనపర్తిలోని ఓ ఆలయంలో ఈ జంట సీక్రెట్గా ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఆ తర్వాత సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు. ఆదితి రావు హైదరీ ఇటీవల సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన హీరామండి వెబ్ సిరీస్లో మెరిసింది. View this post on Instagram A post shared by Instant Bollywood (@instantbollywood) -
ఉద్యోగులు ఇంటికెళ్లాక.. మస్క్ గురించి ఆసక్తికర విషయం!
ప్రపంచంలోని అత్యంత ధనవంతుల్లో ఒకరు, టెస్లా, స్పేస్ ఎక్స్ల బిగ్ బాస్ ఎలాన్ మస్క్ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. ఆటోమొబైల్, అంతరిక్షం, అంతర్జాలం (ఇంటర్నెట్, సోషల్ మీడియా) రంగాల్లో విజయవంతమైన కంపెనీలను ఆయన నడుపుతున్నారు.అయితే ఎలాన్ మస్క్ గురించి తాజాగా ఓ ఆశ్చర్యకరమైన విషయం వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ‘ఎక్స్’ (ట్విటర్)లో ఓ యూజర్ మస్క్ శ్రద్ధగా పనిచేస్తున్న త్రోబ్యాక్ ఫోటోను పంచుకున్నాడు. "జిప్2 (మస్క్ స్థాపించిన సాఫ్ట్వేర్ కంపెనీ)లో పనిచేసే ఇంజనీర్లు ఇళ్లకు వెళ్లగానే వారు రాసిన కోడ్ను తిరిగి రాసేవాడు. అలా వారానికి 120 గంటలు పనిచేసేవాడు. ఒక సీఈఓలా ఉండాలని ఆయన ఎప్పుడూ అనుకోలేదు" అని రాసుకొచ్చారు. నిజమే..ఎక్స్ యూజర్ తన గురించి పెట్టిన పోస్టుపై ఎలాన్ మస్క్ స్పందించారు. 'నిజమే' అంటూ ఆ విషయాన్ని ధ్రువీకరించారు. ఈ పోస్ట్కు 2.3 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. విపరీతంగా కామెంట్లు, రీ పోస్టులు, లైక్లతో ప్రస్తుతం వైరల్గా మారింది. Elon Musk used to rewrite code of engineers working at Zip2 after they went home, and used to work 120 hours a week. He never really wanted to be a CEO. pic.twitter.com/fQOyNRM0QD— DogeDesigner (@cb_doge) May 30, 2024 -
భార్యకు స్పెషల్గా విష్ చెప్పిన టాలీవుడ్ హీరో.. పోస్ట్ వైరల్!
టాలీవుడ్ యంగ్ హీరో మరోసారి అభిమానులను అలరించేందుకు సిద్ధమయ్యారు. సుధీర్ బాబు హీరోగా నటించిన చిత్రం హరోం హర. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంలో మాళవిక శర్మ జంటగా కనిపించనుంది. ఈ చిత్రాన్ని జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ మూవీని మే 31న రిలీజ్ చేయాల్సి ఉన్నప్పటికీ అనివార్య కారణాలతో వాయిదా వేశారు. వచ్చేనెల జూన్ 14న రిలీజ్ చేయనున్నట్లు సుధీర్బాబు ప్రకటించారు. 1989 నాటి చిత్తూరు జిల్లా కుప్పం నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు.అయితే సుధీర్ బాబు.. సూపర్ స్టార్ కృష్ణ కూతురు ప్రియదర్శినిని పెళ్లాడిన సంగతి తెలిసిందే. వీరిద్దరికి ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. అయితే సుధీర్, ప్రియదర్శినిల పెళ్లి మే 29,0 2006లో ఘనంగా జరిగింది. తాజాగా వివాహా వార్షికోత్సవం సందర్భంగా అరుదైన ఫోటోను పంచుకున్నారు సుధీర్. తన భార్య ప్రియదర్శిని పెళ్లిచూపుల ఫోటోను ట్విటర్లో పంచుకున్నారు. ఈ సందర్భంగా వివాహా వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపాడు. నాతో ఉన్నప్పటి తన మొదటి ఫోటో.. అంతేకాదు పెళ్లిచూపుల ఫోటో అంటూ పోస్ట్ చేశారు. ఇది చూసిన అభిమానులు హీరో జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. Happy Anniversary my love 'Priya' 💐 You complete me 😘🤗…. First pic of hers I have with me. Pellichoopulu photo 😄 pic.twitter.com/005YWnBIzZ— Sudheer Babu (@isudheerbabu) May 29, 2024 -
ఢిల్లీ మెట్రోలో రాహుల్.. ఫొటో వైరల్
దేశంలో లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఐదు దశల ఎన్నికలు ఇప్పటికే ముగియగా, ఇంకా మరో రెండు దశల ఎన్నికలు మిగిలివున్నాయి. ఈ క్రమంలో మే 25న ఢిల్లీలో ఆరో దశలో ఎన్నికలు జరగనున్నాయి.ఈ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సామాన్య ప్రజలకు చేరువయ్యేందుకు ఢిల్లీ మెట్రోలో ప్రయాణించారు. రాహుల్ గాంధీ మెట్రోలో ప్రయాణిస్తున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఢిల్లీ మెట్రోలో ప్రయాణిస్తున్న రాహుల్ గాంధీ సామాన్య ప్రజలతో మమేకమై, వారితో ఫొటోలు కూడా దిగారు. రాహుల్ గాంధీ ఢిల్లీ మెట్రోలో మంగోల్పురిలో జరిగే ర్యాలీకి బయలుదేరారు. ఆయనతో పాటు ఈశాన్య ఢిల్లీ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి కన్హయ్య కుమార్ కూడా ఉన్నారు. ఢిల్లీలో మే 25వ తేదీన ఓటింగ్ జరగనుంది. -
భారత సంతతి బాలుడికి దుబాయ్ పోలీసుల సత్కారం!
దుబాయ్లో నివశిసిస్తున్న భారత సంతతి బాలుడికి దుబాయ్ పోలీలసులచే ఘన సత్కారం లభించింది. ఈ విషయాన్ని దుబాయ్ పోలీసులు తమ అధికారిక ఖాతాలో వెల్లడించారు. దుబాయ్ పోలీస్ వెబ్సైట్ కథనం ప్రకారం..ముహమ్మద్ అయాన్ యూనిస్ తన తండ్రితో కలిసి ఒక పర్యాటక ప్రాంతంలో వెళ్తుండగా ఒక టూరిస్ట్ వాచ్ని దొరికింది. దానిని పోగొట్టుకున్న టూరిస్ట్కి అందేలా దుబాయ్ పోలీసులకు అప్పగించాడు. ఆ వాచ్ని అందుకున్న బాధితుడు దుబాయ్లో ఉన్నత స్థాయ భద్రత, సమగ్రత పట్ల సంతృప్తిని వ్యక్తం చేస్తూ ప్రశంసించాడు.తాము ఆ వాచ్ని బాదితుడికి విజయవంతంగా అందించేలా సాయం చేసినందుకు గాను ఆ బాలుడిని దుబాయ పోలీసులు సత్కరించారు. అతడి నిజాయితీకి అవార్డును అందించి, సర్టిఫికేట్ను ప్రదానం చేశారు అధికారులు. పర్యాటకులు పోగొట్టుకున్న వాచ్ని నిజాయితీగా ఇచ్చినందుకు గానూ ఆ బాలుడు దుబాయ్ పోలీసుల చేత ఈ గౌరవాన్ని అందుకున్నాడు. ఈ మేరకు టూరిస్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ బ్రిగేడియర్ ఖాల్ఫాన్ ఒబీద్ అల్ జల్లాఫ్, అతని డిప్యూటీ లెఫ్టినెంట్ కల్నల్ ముహ్మద్ అబ్దుల రెహ్మాన్, టూరిస్ట్ హ్యీపీనెస్ విభాగం అధిపతి కెప్టెన్ షహబ్ అల్ సాదీ తదితరులు బాలుకుడికి ఈ సర్టిఫికేట్లను అందజేశారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ఎక్స్లో తెలుపుతూ అందుకు సంబంధించిన ఫోటోను కూడా షేర్ చేసింది. ఇది యూఏఈలో పిల్లల ప్రవర్తన, ఉన్నతమైన నైతిక ప్రమాణాలు, భద్రతను ప్రతిబింబిస్తుందని, ముఖ్యంగా దాని కీలకమైన పర్యాటక రంగంలో ఇది మరింత స్పష్టంగా కనిపిస్తుందని జల్లాఫ్ అన్నారు. అందరూ యూనిస్ అడుగుజాడల్లో నడవాలని అన్నారు. అలానే గతనెలలో జుమేరా బీచ్లో దొరికిన విలువైన వస్తువుని అప్పగించినందుకు ఒక యువకుడిని దుబాయ్ పోలీసులు సత్కరించడం జరిగింది. #News | Dubai Police Honours Child for Honesty After Returning Tourist's Lost WatchDetails:https://t.co/6dFnBky55r#YourSecurityOurHappiness#SmartSecureTogether pic.twitter.com/bVccqxabP5— Dubai Policeشرطة دبي (@DubaiPoliceHQ) May 12, 2024(చదవండి: భారత న్యూయార్క్ కాన్సులేట్ ఏడాది పొడవునా తెరిచే ఉంటుంది!) -
వ్యాక్సిన్ సర్టిఫికెట్లపై ప్రధాని ఫొటో ఎటు పోయింది: మీసా భారతి
పాట్నా: కొవిడ్ వ్యాక్సిన్పై అనుమనాలు వ్యక్తం అవుతుండటం వల్లే ప్రధాని ఫొటోవ్యాక్సిన్ సర్టిఫికెట్లపై తొలగించారని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాదా్ యాదవ్ కుమార్త్ మీసా భారతి అన్నారు. మీసా భారతి బిహార్లోని పాటలిపుత్ర నియోజకవర్గం నుంచి ఎంపీ పదవికి పోటీ చేస్తున్నారు. ప్రచారంలో భాగంగా మీసా ప్రధానిపై విమర్శలు గుప్పించారు. ‘వ్యాక్సిన్ దుష్ప్రభావాలపై వస్తున్న వార్తలతో ప్రధాని భయపడుతున్నారు. ప్రధానికి ప్రతి దానిపై క్రెడిట్ తీసుకోవడం అలవాటు. అయితే కరోనా వ్యాక్సిన్పై అనుమానాలు వ్యక్తమవుతున్నందున ప్రధాని పక్కకు తప్పుకుంటున్నారు.వ్యాక్సిన్ సర్టిఫికెట్లపై తన ఫొటోలను తొలగించారు. వ్యాక్సిన్పై పూర్తిస్థాయి దర్యాప్తు జరగాలి’ అని మీసా డిమాండ్ చేశారు. కాగా, ఎన్నికల కోడ్ ఉన్నందు వల్లే కొవిడ్ వ్యాక్సిన్ సర్టిఫికెట్లపై ప్రధాని ఫొటో తొలగించారని బీజేపీ నేతలు మీసాకు కౌంటర్ ఇస్తున్నారు. -
ALT Text Testing- Photos
-
మే 15 నుంచి ‘గూగుల్ ఫొటోస్’లో మార్పులు
మొబైల్ కొనేముందు ర్యామ్, ఇంటర్నల్ మెమెరీ, స్క్రీన్ సైజ్తోపాటు ప్రధానంగా కెమెరా గురించి తెలుసుకుంటారు. అందులో ప్రత్యేక ఫీచర్లు ఉంటే మరింత ఆసక్తి చూపుతారు. కొన్ని మొబైల్ తయారీ సంస్థలు ఇంటర్నల్గా ఫోన్ కెమెరా టూల్లోనే ఏఐ ఆధారిత ఫీచర్లును వాడుతున్నాయి. దానికితోడు ప్లేస్టోర్లో అందుబాటులో ఉన్న చాలా ఫొటో ఎడిటింగ్ యాప్లు సైతం ఏఐను వినియోగిస్తున్నాయి. వాటికి ధీటుగా ‘గూగుల్ ఫోటోస్’ యాప్లోనూ కొన్ని మార్పులు చేస్తున్నట్లు గూగుల్ తాజాగా ప్రకటించింది. ఈ మార్పులు మే 15 నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంది. గూగుల్ తన వినియోగదారులకు మెరుగైన ఫొటో ఫీచర్లను అందించేందుకు ఎడిటింగ్ ఆప్షన్లలో మార్పులు తీసుకొస్తున్నట్లు తెలిపింది. గూగుల్ ఫొటోస్ యాప్లో మ్యాజిక్ ఎడిటర్, మ్యాజిక్ ఎరేజర్తోపాటు ఫోటో బ్లర్, పోట్రైట్ లైట్ వంటి ఇతర ఏఐ టూల్స్ను అందించనున్నట్లు చెప్పింది. గూగుల్ సంస్థ ఇప్పటికే ఈ టూల్స్ను కొన్ని మొబైల్స్లో అందుబాటులోకి తీసుకొచ్చింది. 2023 మేలో వీటిని పిక్సెల్ 8, పిక్సెల్ 8 ప్రో స్మార్ట్ఫోన్ యూజర్లకు పరిచయం చేసింది. మే 15, 2024 తర్వాత ఈ ఏఐ ఆధారిత ఫొటో ఎడిటర్ టూల్స్ను గూగుల్ ఫొటోస్ వాడుతున్న ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లందరూ వినియోగించవచ్చని తెలిపింది. ఇదీ చదవండి: ‘వాటిలో పెట్టుబడి పెడితే రూ.కోట్లే..’ యూజర్లు ఈ ఫీచర్లును వాడుకోవాలంటే మాత్రం ఆండ్రాయిడ్ 8.0, ఐఓఎస్ 15 సహా ఆపై వచ్చిన ఓఎస్లనే ఇన్స్టాల్ చేసుకోవాలని కంపెనీ పేర్కొంది. దాంతోపాటు మొబైల్ ర్యామ్ 3జీబీ కంటే ఎక్కువ ఉండాలని చెప్పింది. -
‘హిజాబ్’ ఉదంతంలో న్యాయం.. బాధితులకు రూ. 146 కోట్ల పరిహారం!
అమెరికాలోని న్యూయార్క్ నగరంలో 2017లో ఇద్దరు ముస్లిం మహిళలకు అవమానం జరిగింది. ఇన్నేళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత వారికి న్యాయం లభించింది. ఇందుకు పరిహారంగా బాధితులకు 17.5 మిలియన్ అమెరికన్ డాలర్లు చెల్లించడానికి న్యూయార్క్ పోలీస్ డిపార్ట్ మెంట్ అంగీకరించింది. వివరాల్లోకి వెళితే 2017లో స్థానిక చట్టాలను, నిబంధనలను అతిక్రమించారనే ఆరోపణలతో న్యూయార్క్ పోలీసులు ఇద్దరు ముస్లిం మహిళలను అరెస్టు చేశారు. ఆ తరువాత వారిని జైలుకు పంపే ముందు నిబంధనలలో భాగంగా వారికి ఫొటోలు తీశారు. వీటిని మగ్ షాట్ అంటారు. ఈ ఫొటోల కోసం పోలీసులు ఆ మహిళల హిజాబ్ను తొలగించారు. దీనిని బాధిత మహిళలు అవమానంగా భావించారు. ఈ ఉదంతంపై బాధితులు 2018లో కోర్టును ఆశ్రయించారు. కోర్టులో బాధితురాలి తరపు న్యాయవాది మాట్లాడుతూ బాధితుల మత విశ్వాసాలను పరిగణించకుండా పోలీసులు వారి హిజాబ్ తొలగించి తీవ్రంగా అవమానించారని, వారి మనోభావాలను దెబ్బతీశారని పేర్కొన్నారు. ఈ కేసు నేపధ్యంలో మగ్ షాట్ నిబంధనలపై అమెరికా అంతటా చర్చ జరిగింది. దీనిపై ప్రజల నుంచి విమర్శలు వ్యక్తం కావడంతో 2020లో మగ్ షాట్ నిబంధనలలో పోలీసులు పలు మార్పులు చేశారు. ఈ ఫొటోల కోసం ముస్లిం మహిళలు హిజాబ్ తొలగించనవసరంలేదని, ముఖం కనిపించేలా ఉంటేచాలని పేర్కొన్నారు. ఈ నిబంధన మిగతా మతాల వారికీ వర్తిస్తుందని, సిక్కులు కూడా తమ టర్బన్ను తొలగించాల్సిన అవసరం పోలీసులు వివరించారు. ఆదేళ్ల సుదీర్ఘ న్యాయపోరాటం అనంతరం పోలీసులు బాధిత మహిళలతో పాటు గతంలో ఈ విధంగా ఇబ్బంది పడిన వారికీ కూడా పరిహారం చెల్లించేందుకు అంగీకరించారు. ఈ ఇద్దరు బాధిత మహిళలకు ఒక్కొక్కరికీ 7 వేల నుంచి పది వేల డాలర్ల చొప్పున మొత్తం 17.5 మిలియన్ డాలర్లు చెల్లించేందుకు న్యూయార్క్ పోలీస్ డిపార్ట్ మెంట్ అంగీకరించింది. మన రూపాయల్లో ఇది సుమారు రూ. 146 కోట్లకు సమానం. -
అలాంటి కథతో వస్తోన్న నిత్యా మీనన్.. ఇన్స్టా పోస్ట్ వైరల్!
అలా మొదలైంది సినిమాతో టాలీవుడ్కు ఎంట్రీ ఇచ్చిన నటి నిత్యామీనన్. ఆ తర్వాత నితిన్ సరసన ఇష్క్ సినిమాతో గుర్తింపు దక్కించుకుంది. ఆమె తెలుగుతో పాటు కన్నడ, తమిళం, మలయాళంలో దాదాపు 50కి పైగా చిత్రాల్లో నటించింది. తెలుగులో గుండెజారి గల్లంతయ్యిందే, జనతా గ్యారేజ్, 100 డేస్ ఆఫ్ లవ్, ఒక్క అమ్మాయి తప్ప, ఇంకొక్కడు లాంటి చిత్రాల్లో నటించింది. నిత్యా మీనన్ ప్రస్తుతం వెబ్ సిరీస్ల్లో నటిస్తూ అభిమానులను అలరిస్తోంది. తాజాగా మరో ఆసక్తికర స్టోరీతో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. తాజాగా దీనికి సంబంధించిన ఫోటోను తన ఇన్స్టాలో పంచుకుంది. ఓ యువతి ప్రేమకథా ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రంలో ఆమె నటిస్తున్నట్లు కనిపిస్తోంది. గతంలో సత్యజిత్ రే.. ఠాగూర్ చిన్న కథ ఆధారంగా తెరకెక్కించిన సమాప్తి పేరుతో సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రంలో మృణ్మోయి అనే యువతి పాత్రను చూపించారు. తాజాగా నిత్యా మీనన్ పోస్టర్ చూస్తే అదే కథ ఆధారంగా తెరకెక్కిస్తున్న చిత్రంలో నటించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. View this post on Instagram A post shared by Nithya Menen (@nithyamenen) -
సన్నాఫ్ విరాట్ కోహ్లీ
అనుష్క శర్మ ఈ నెల 15న పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. అబ్బాయికి ‘అకాయ్’ అని పేరు పెట్టినట్లు తెలియజేశాడు విరాట్ కోహ్లీ. అయితే ‘అకాయ్’ ఫొటోను ఎక్కడా షేర్ చేయలేదు. దీంతో ‘అకాయ్’ రూ΄ాన్ని రకరకాలుగా ఊహించుకుంటూ అభిమానులు ఏఐ జెనరేటెడ్ ఫొటోలను క్రియేట్ చేశారు. అకాయ్ను విరాట్ ఎత్తుకున్నట్లు, విరాట్–అనుష్కలు అకాయ్తో ఆడుకుంటున్నట్లు... ఇలా రకరకాలుగా క్రియేట్ చేశారు. ‘అకాయ్ ఫొటో షేర్ చేయకుండా విరాట్ కోహ్లీ మంచి పని చేశాడు. చేసి ఉంటే ఇంత అద్భుతమైన చిత్రాలను చూసి ఉండేవాళ్లం కాదు’ అంటూ నెటిజనులు ప్రశంసల జల్లు కురిపించారు. ప్రశంసల వర్షం ఒక కోణం అయితే... సాంకేతిక ఆసక్తి మరో కోణం. ‘మీరు ఉపయోగించిన ఏఐ టూల్స్ గురించి వివరంగా తెలుసుకోవాలని ఉంది’ అంటూ చాలామంది కామెంట్స్ పెడుతున్నారు. -
ఆయనే మళ్లీ పుట్టాడు.. నిఖిల్ ఎమోషనల్ పోస్ట్!
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ తండ్రిగా ప్రమోషన్ పొందారు. ఆయన భార్య పల్లవి బుధవారం ఉదయం పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చింది. ఈ విషయాన్ని నిఖిల్ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న నిఖిల్, డాక్టర్ పల్లవి 2020లో పెద్దల సమక్షంలో వివాహబంధంతో ఒక్కటయ్యారు. కొడుకు పుట్టిన సందర్భంగా హీరో నిఖిల్ ఎమోషనలయ్యారు. తన తండ్రి మళ్లీ తిరిగి వచ్చాడంటూ పోస్ట్ చేశారు. నిఖిల్ తన ఇన్స్టాలో రాస్తూ..'ఏడాది క్రితమే మా నాన్న మిస్సయ్యాను. ఇప్పుడు మా కుటుంబంలోకి మగ బిడ్డ అడుగుపెట్టారు. ఆయనే మళ్లీ తిరిగి వచ్చాడని అనుకుంటున్నా. మాకు అబ్బాయి జన్మించినందుకు చాలా సంతోషంగా ఉంది.' అంటూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మా కుటుంబంలోకి తన తండ్రే మళ్లీ తిరిగి వచ్చాడంటూ ఎమోషనలయ్యారు నిఖిల్. ఇక నిఖిల్ సినీ కెరీర్ విషయాకొస్తే.. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ‘హ్యాపీ డేస్’ సినిమాతో హీరోగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించాడు. కార్తికేయ, స్వామిరారా సినిమాలతో హిట్స్ అందుకున్నాడు. కార్తికేయ 2తో పాన్ ఇండియా స్టార్గా మారాడు. ప్రస్తుతం మరో పాన్ ఇండియా మూవీ ‘స్వయంభూ’ షూటింగ్లో బిజీగా ఉన్నారు. . చారిత్రాత్మక నేపథ్యంలో సాగే ఈ సినిమాలో హీరో నిఖిల్ ఓ వారియర్ పాత్రలో కనిపించనున్నారు. View this post on Instagram A post shared by Nikhil Siddhartha (@actor_nikhil) View this post on Instagram A post shared by CelebrityNews (@industrycelebritynews) -
‘జల్లికట్టు’లో సీఎం జగన్ ఫొటో
పలమనేరు(చిత్తూరు జిల్లా): తమిళనాడు వాసులు కూడా ఏపీ సీఎం వైఎస్ జగన్పై తమకున్న అభిమానాన్ని చాటుకుంటున్నారు. తమిళనాడులో ప్రస్తుతం జల్లికట్టు మైలేర్ల సీజన్ కొనసాగుతోంది. మైలేర్లలో వేగంగా పరుగెత్తిన ఎద్దుకు బహుమతులు రూ.10 లక్షల దాకా ఉన్నాయి. ఇప్పటిదాకా పరుగు పందెంలో కచ్చితంగా గెలిచే ఎద్దులకు కొండ గుర్తుగా రజనీకాంత్, విజయ్, సూర్య ఫొటోలను మాత్రం కొమ్ములకు ప్రభలను కట్టి పందేల్లో వదిలేవారు. ఇప్పుడు వేలూరు, క్రిష్ణగిరి, తిరప్పత్తూరు జిల్లాలోని చాలాచోట్ల జరిగే జల్లికట్టు, మైలేర్లలో ఆంధ్రా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫొటోలున్న ప్రభలతో ఎద్దులు కనిపిస్తున్నాయి. పందేలు జరిగేచోట సైతం మైక్లో కామెంటరీ చేసేవాళ్లు ఆంధ్రా టైగర్ జగన్ వద్దాండ్రా, సిద్ధం అంటూ పొగడటం విశేషం. -
బ్యూటిఫుల్ పిక్ స్టోరీ చెప్పిన సొట్టబుగ్గల సుందరి: ఫోటో వైరల్
స్టార్ హీరోయిన్గా బాలీవుడ్ను ఏలిన అందాల తార ప్రీతి జింటా. యాపిల్బ్యూటీగా, డింపుల్ గర్ల్గా పాపులర్ అయిన ప్రీతి తాజాగా ఒక ఫోటోను ట్విటర్లో షేర్ చేసింది. హిమాచల్లోని సిమ్లాలో పుట్టిన ప్రీతి వెండి తెర మీద చెరగని సంతకం. ఆమె అందమైన నవ్వు, సొట్టబుగ్గలంటే అప్పట్లో కుర్రకారుకి ఒక వ్యామోహం. 1998లో ప్రముఖ దర్శకుడు మణిరత్నం ‘దిల్ సే’తో తెరంగేట్రం చేసింది. తొలి సినిమాతోనే సూపర్ డూపర్ హిట్ను తన ఖాతాలో వేసుకుంది. ఆ సందర్బంగా తీసిన ఒక ఫోటోను, దానికి సంబంధించిన జ్ఞాపకాలను ట్వీట్ చేసింది.( మహిళా ఖైదీల గర్భంపై హైకోర్టు సీరియస్!) ‘‘దిల్ సే సెట్లో తొలి రోజు ఈ ఫోటో తీశారు. మణిరత్నం, షారూఖ్ ఖాన్తో కలిసి వర్క్ చేస్తుందకు చాలా ఎక్సైటింగ్ ఉన్నా. ఇంతలో మణిసార్ నన్ను చూడగానే మొహం కడుక్కుని రమ్మని, నవ్వుతూ మర్యాదగా అడిగారు. అయితే సార్... నా మేకప్ పోతుంది సార్ అని చెప్పా. నాకు కావలసింది అదే.. వెళ్లి ఫేస్ వాష్ చేసుకొని రా అని చెప్పారు అంతే మర్యాదగా. తమాషా చేస్తున్నారా అనుకున్నా మొదట. కానీ కాదని ఈ ఫోటో చూసిన తర్వాత అర్థం అయింది. ఫోటోగ్రఫీ డైరెక్టర్ సంతోష్ శివన్ గారు నిజంగా మనసు పెట్టి (దిల్సే) తీసిన ఫోటో. ప్రెష్గా, ప్రశాంత ముఖంతో అద్భుతమైన ఫోటో ఇది. ఆయనకు ధన్యవాదాలు’’ అంటూ తన మొమోరీస్ ట్వీట్ చేసింది. ఇప్పటికే ఈ ట్వీట్ 10లక్షలకు పైగా వ్యూస్ దక్కించుకుంది. (ఆ చిన్ని గుండె సవ్వడి...అంటూ గుడ్ న్యూస్ చెప్పిన లవ్బర్డ్స్) This picture was taken on the first day on the set of Dil Se. I was so excited to be working with Mani Ratnam sir & Shah Rukh Khan. When Mani sir saw me he smiled and politely asked me to wash my face…. But sir… my make up will come off, I said smiling …. That’s exactly what I… pic.twitter.com/Lrr6CpSMFA — Preity G Zinta (@realpreityzinta) February 8, 2024 కాగా 1975 జనవరి 31న పుట్టిన ప్రీతి జింటా హిందీతో పాటు తెలుగు, పంజాబీ, ఇంగ్లీష్ సినిమాల్లో నటించారు. బాలీవుడ్లో అనేక సూపర్హిట్ మూవీలతోపాటు టాలీవుడ్లో కూడా తనదైన ముద్రను వేసుకుంది. ప్రేమంటే ఇదేరాతో టాలీవుడ్లోకి ప్రవేశించి, ప్రిన్స్ మహేష్బాబు సరసన 1999లో రొమాంటిక్ కామెడీ రాజ కుమారుడులో నటించి టాలీవుడ్ ఆడియెన్స్ను ఆకట్టుకుంది. 2016 ఫిబ్రవరి 29న వ్యాపారవేత్త జీన్ గూడెనఫ్ ను పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం ఇండస్ట్రీకి దూరమైనా నటిగా, నిర్మాతగా, వ్యాపార వేత్తగా తనను తాను ప్రూవ్ చేసుకుంటోంది. ఈ జంటకు ఇద్దరు(ట్విన్స్) పిల్లలు ఉన్నారు. -
మంచు పాన్పు
చలికాలపు రాత్రి నిద్రొస్తే మనమంతా బిర్రుగా ముసుగు తన్నిపడుకుంటాం. కానీ ఈ మంచు ఎలుగుబంటి మాత్రం సుఖమనిన ఇదియెగాద అనుకుంటూ మంచుపాన్పుపై హాయిగా నిద్రపోయింది. ఐస్బర్గ్పై ఎలుగు నిద్రపోతున్న ఫొటోను బ్రిటిష్ ఫొటోగ్రాఫర్ నీమా సరిఖానీ తీశారు. ఈ ఫొటో.. పీపుల్స్ ఛాయిస్ సంస్థ చేపట్టిన ఓటింగ్లో పాల్గొన్న వేలాది మందికి తెగ నచ్చేసింది. దీంతో నీమాను పీపుల్స్ ఛాయిస్ వైల్డ్లైఫ్ ఫొటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్ పురస్కారంతో సత్కరించారు. నార్వేకు చెందిన స్వాల్బార్డ్ ద్వీపసమూహంలో ఉత్తర ధృవానికి అత్యంత సమీప ఐస్బర్గ్ల వద్ద ఈ ఫొటోను తీశారు. -
ఓ సారి ఇటు చూడండి బ్రదర్..! మీకోసమే ఈ చాయ్..!!
మారుతున్న కాలానుగుణంగా మానవ మెదడులో సరికొత్త ఆలోచనలు పుట్టుకొస్తున్నాయి. ఏదైనా కొత్తగా, వింతగా, తక్కువ ఖర్చు, సులభంగా ఉండేట్లుగా ఆలోచిస్తున్నారు. విషయంలోకి వెళితే.. టీ తాగని వారు.., ఆ రుచి ఇష్టపడని వారు కూడా ఈ సరికొత్త టీ-స్టాల్ని చూశారో ఓసారైనా ట్రై చేద్దామనుకుంటారు. ఇక అదేంటో చూసేద్దాం! వినియోగదారులను ఆకట్టుకునేందుకు వ్యాపారులు వినూత్న ప్రయోగాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే పెద్ద కంపెనీలు ప్రవేశించి జిల్లాలు, మండలాల వారీగా ప్రాంచైజీలు ఇస్తున్నారు. ఇక ఎక్కడ పడితే అక్కడ మొబైల్ టీ స్టాళ్లూ ఏర్పాటువుతున్నాయి. ఈమేరకు పాత ఆటోలను మొబైల్ టీ స్టాళ్లుగా హైదరాబాద్లో సిద్ధం చేయించిన నిర్వాహకులు ఆంధ్రప్రదేశ్కు తీసుకెళ్తూ ఖమ్మంలో ఆగారు. ఖమ్మంలోని పటేల్ స్టేడియం వద్ద ఆపిన ఈ టీ స్టాల్ వాహనాలను పలువురు ఆసక్తిగా తిలకించారు. ఇవి కూడా చదవండి: పాత జీన్స్ను ఇలా కూడా వాడవచ్చని మీకు తెలుసా? -
నెట్టింట అందమైన అమ్మాయి ఫోటో రియలా? ఏఐ మాయా?
అందమైన ఓ మహిళ ఫోటో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. అది నిజంగా అందమైన అమ్మాయి ఫోటోనా లేదా ఏఐ ఫోటోనా అని అందరిలోనూ పలు సందేహాలు రేకెత్తించింది. ఐతే ఆ ఫోటో అధికారిక ప్రయోజనాలకోసం పెట్టిందని కొందరూ లేదు పోలీస్ రికార్డుల్లోనిది అంటూ పలు కామెంట్లు చేస్తూ పోస్టు పెట్టారు నెటిజన్లు. ఏదీఏమైన ఒక అందమైన మహిళ ఫోటో నెటిజన్ల మనుసుల్లో చాలా ఉత్సుకతనే రేపింది. మరొకందరూ ఇంతలా ఆ మహిళ ఎవరని? అంతలా ఆరా తీస్తున్నారంటే..మగవాళ్ల బుద్ధి అలానే ఉంటుంది కాబోలు అని కౌంటర్లు ఇచ్చారు. ఎక్కువ మంది ఏఐతో క్రియోట్ చేసిన ఫోటో అని చెప్పగా చాలామంది మాత్రం ఇది సెల్ఫీ ఫోటో అయ్యి ఉండొచ్చని లేదా దేనికో ఉపయోగించేందుకు తీసిన ఫోటో అంటూ పోస్టులు పెట్టారు. అయితే ఈ ఫోటో ఏఐ ఆధారిత ఫోటోనే అనేది క్లియర్గా తెలియదు గానీ వెబ్సైట్ ప్రకారం అది ఏఐ ఫోటో అని 99.4% మంది చెప్పడం గమనార్హం. ఇక్కడొక విషయం క్లియర్గా అర్థమవుతుంది. ఇంతకు మునుపు ఏ అమ్మాయి ఫోటో కనిపించినా ఎవరా బ్యూటీ అని ఆరా తీసేవారు. ఏ ఊరు ఏం చేస్తుంది ఈ తరహాలో ప్రశ్నలు ఉండగా. ఇప్పుడూ అదసలు రియలేనా లేక ఏదైన ప్రకటన కోసం ఉపయోగిస్తున్న ఫోటో అయ్యి ఉండొచ్చనే డౌట్లు లేవెనెత్తుతున్నారు. టెక్నాలజీ తోపాటు మనుషుల్లోనే ఆలోచనల్లో మార్పు వచ్చిందనాలా లేకా టెక్నాలజీ పుణ్యమా! అని అన్ని అనుమానాలు రేకెత్తిస్తున్నాయి అనాలా ఆలోచించండి. మీకైతే ఈ ఫోటో ఏమనిపిస్తుంది రియల్ అనా? లేక ఏఐ ఆధారిత ఫోటోనా?. గెస్ చేయండి. (చదవండి: అద్భుతం చేసిన అమ్మాయిలు: బాడీనే కాన్వాస్గా..వీడియో వైరల్!) -
చెక్కేద్దామా.. అందమైన లోకానికి! (ఫోటోలు)
-
అయోధ్య రామ మందిరం గర్భగుడి ఫోటో విడుదల
ఢిల్లీ: అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవానికి సిద్ధమవుతోంది. ఆలయ గర్భగుడి ఫోటోలను రామ్ మందిర్ ట్రస్ట్ సెక్రటరీ చంపత్ రాయ్ ట్విట్టర్(ఎక్స్)లో ఫొటోలు పోస్ట్ చేశారు. రామాలయ ప్రారంభోత్సవ వేడుక జనవరి 22న అంగరంగ వైభవంగా జరగనుంది. ప్రాణప్రతిష్ఠాపన కార్యక్రమానికి అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేస్తున్నారు. దశాబ్దాల సమస్య తీరిపోయి అయోధ్యలో దివ్యమైన రామ మందిర నిర్మాణం శరవేగంగా నిర్మాణం జరిగింది. దీంతో ప్రారంభోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని యూపీ ప్రభుత్వం భారీ సన్నాహాలు చేస్తోంది. प्रभु श्री रामलला का गर्भ गृह स्थान लगभग तैयार है। हाल ही में लाइटिंग-फिटिंग का कार्य भी पूर्ण कर लिया गया है। आपके साथ कुछ छायाचित्र साझा कर रहा हूँ। pic.twitter.com/yX56Z2uCyx — Champat Rai (@ChampatRaiVHP) December 9, 2023 వేద మంత్రాల నడుమ కన్నుల పండువగా జరిగే శ్రీరాముడి ప్రాణప్రతిష్టకు దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక అతిథిగా హాజరవుతున్నారు. అంతేకాదు ఈ కార్యక్రమానికి దేశంలోని 8వేల మంది ప్రముఖులను కూడా ఆహ్వానిస్తున్నారు. ఇదీ చదవండి: అయోధ్య రామాలయం రెడీ -
సౌర కళలు సూపర్
సూళ్లూరుపేట (తిరుపతి జిల్లా): సూర్యునిపై పరిశోధనల నిమిత్తం ఇస్రో ప్రయోగించిన ఆదిత్య ఎల్1 ఉపగ్రహం అపూర్వమైన ఫొటోలను అందించింది. తొలిసారిగా సూర్యుని ఫుల్ డిస్క్ ఇమేజీలను భూమికి పంపింది. ఉపగ్రహంలోని సోలార్ అల్ట్రా వయొలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్ (సూట్) విజయవంతంగా ఈ ఫొటోలు తీసినట్టు ఇస్రో శుక్రవారం పేర్కొంది. వాటిని తన వెబ్సైట్లో ఉంచింది. ఈ ఫొటోలను 200–400 ఎన్ఎం తరంగదైర్ఘ్య పరిధిలో తీసినట్టు వెల్లడించింది. ఈ ఫొటోల్లో సూర్యుని తాలూకు ఫొటోస్పియర్, క్రోమోస్పియర్లను 11 వేర్వేరు శాస్త్రీయ ఫిల్టర్లను ఉపయోగించి ఆదిత్య ఎల్1 బందించింది. ఆ స్పియర్లపై లోతైన సమాచారాన్ని ఈ ఫొటోలు అందించినట్టు ఇస్రో తెలిపింది. భూ వాతావరణంపై సౌర ధారి్మకత ప్రభావం తదితరాలను మరింత లోతుగా అధ్యయనం చేయడానికి తాజా ఫొటోలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపింది. వాటిలో సూర్య వలయాల వంటివి కొట్టొచి్చనట్టు కని్పస్తున్నాయి. గత సెపె్టంబర్ 2న ప్రయోగించిన ఆదిత్య ఎల్1 సూర్యుని దిశగా ప్రయాణంలో భాగంగా లాంగ్రేజియన్ పాయింట్1కు చేరింది. దీంట్లోని ఏడు పేలోడ్లను పూర్తిగా దేశీయంగానే రూపొందించారు. -
వైట్హౌస్, పెంటగాన్, యుద్ధ నౌకలు...
సియోల్: అమెరికా అధ్యక్షుడి నివాసం వైట్హౌస్, రక్షణశాఖ కార్యాలయం పెంటగాన్, అమెరికా విమాన వాహక నౌకల స్పష్టమైన ఫొటోలను సోమవారం తమ నిఘా ఉపగ్రహం పంపించినట్లు ఉత్తరకొరియా ప్రకటించుకుంది. వీటిని తమ నేత కిమ్ జొంగ్ ఉన్ పరిశీలించారని తెలిపింది. మల్లిగియోంగ్–1 అనే నిఘా ఉపగ్రహం ప్రయోగాన్ని కిమ్ తిలకిస్తున్న ఫొటోలను గత మంగళవారం అధికార వార్తా సంస్థ కేసీఎన్ఏ విడుదల చేసింది. శాటిలైట్ విడుదల చేసిన చిత్రాల్లో అమెరికా నేవీ కేంద్రం, నౌకాశ్రయం, వర్జీనియాలోని వైమానిక కేంద్రం ఉన్నాయని తెలిపింది. -
ఆసక్తికరమైన విషయాలు మీకు తెలుసా?
-
ఫొటో పంపు.. పైసలు తీసుకో!
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ఎన్నికల ప్రచారంలో అభ్యర్థులు పెట్టిన ప్రతీ పైసాకు ఫలితం దక్కేలా జాగ్రత్త వహిస్తున్నారు. తమ నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఓటర్ల వద్దకు వెళ్లి ప్రచారం చేయాలని స్థానిక నాయకులు, కార్యకర్తలను పురమాయిస్తున్నారు. కొందరు ప్రచారం చేయకున్నా చేసినట్టు చెబుతూ అభ్యర్థుల జేబులకు చిల్లు పెడుతున్నారు. వీటిని నివారించేందుకు ‘ఫొటో పంపు, పైసలు తీసుకో’ అనే పద్ధతి అనుసరిస్తున్నారు. ప్రతిరోజూ ఎంతమంది వచ్చారో, ఫొటోలు, వీడియోలు తీసి వాట్సాప్ చేయాలనే నిబంధన విధిస్తున్నారు. వీటిని పార్టీ వాట్సాప్ గ్రూపుల్లో పోస్టు చేస్తున్నారు. ఉదాహరణకు ఓ వాడలో వంద మంది ప్రచారం నిర్వహించామని సంబంధిత ఇన్చార్జ్ చెబితే ఆ వంద మంది తప్పనిసరిగా ఫొటో, వీడియోల్లో కనిపించాలి. ఒకవేళ తక్కువ మంది కనిపిస్తే ఆ మేర డబ్బులు ఇవ్వడం లేదు. ఇక బైక్ ర్యాలీలు, ఆటోలు, ప్రచార రథాలు గ్రామాలు, పట్టణాల్లో తిరిగే సమయంలో మీటర్ రీడింగ్లను ఫొటో తీసి పంపి, రాత్రి వరకు ఎన్ని కిలోమీటర్లు తిరిగి ప్రచారం చేశారో లేదో చెక్ చేస్తున్నారు. దీంతో చేసేదేమీ లేక ఎన్నికల్లో తీసుకున్న డబ్బుల ప్రకారం తప్పనిసరిగా పనిచేయాలి వస్తోంది. -
మరోసారి నోరు జారిన ఎస్పీ నేత.. ఏమన్నారంటే..
ఉత్తరప్రదేశ్కు చెందిన సమాజ్వాదీ పార్టీ నేత స్వామి ప్రసాద్ మౌర్య మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ సారి ఆయన దీపావళివేళ భక్తులు పూజించే లక్ష్మీదేవిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. అదే సందర్భంలో తన భార్యను పూజిస్తున్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. వైరల్గా మారిన ఈ ఫొటోలపై మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరుగుతోంది. ఎస్పీ నాయకుడు స్వామి ప్రసాద్ మౌర్య సోషల్ మీడియా ప్లాట్ఫారం ‘ఎక్స్’లో దీపావళి సందర్భంగా తన తన భార్యను పూజిస్తున్న ఫొటోను షేర్ చేస్తూ.. ‘ప్రపంచంలోని ఏ మతం, కులం, జాతి, వర్ణం, వ్యవస్థలో పుట్టిన ఏ బిడ్డకైనా రెండు చేతులే ఉంటాయన్నారు. రెండు కాళ్లు, రెండు చెవులు, రెండు కళ్లు ఉన్న మహిళకు.. నాలుగు చేతులు, ఎనిమిది చేతులు, పది చేతులు, ఇరవై చేతులు, వెయ్యి చేతులు కలిగిన శిశువు ఇప్పటి వరకు పుట్టలేదన్నారు. నాలుగు చేతులతో లక్ష్మీదేవి ఎలా పుట్టింది? ఎవరైనా లక్ష్మీ దేవిని ఆరాధించాలనుకుంటే, దేవతలాంటి భార్యను పూజించండి. గౌరవించండి.. ఎందుకంటే ఆమె మీ కుటుంబ పోషణ కోసం పనిచేస్తూ, ఆనందం, శ్రేయస్సు అందిస్తూ, ఆహారం సంరక్షణ బాధ్యతలను ఎంతో శ్రద్ధతో నిర్వర్తిస్తుందని పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: దీపావళి వేళ.. వళ్లంతా దీపాలే! दीपोत्सव के अवसर पर अपनी पत्नी का पूजा व सम्मान करते हुए कहा कि पूरे विश्व के प्रत्येक धर्म, जाति, नस्ल, रंग व देश में पैदा होने वाले बच्चे के दो हाथ, दो पैर, दो कान, दो आंख, दो छिद्रों वाली नाक के साथ एक सिर, पेट व पीठ ही होती है, चार हाथ,आठ हाथ, दस हाथ, बीस हाथ व हजार हाथ वाला… pic.twitter.com/CP5AjKODfq — Swami Prasad Maurya (@SwamiPMaurya) November 12, 2023 -
కన్నప్పలో ఎంట్రీ
సీనియర్ నటులు మంచు మోహన్బాబు, శరత్కుమార్ ‘కన్నప్ప’ మూవీ సెట్స్లో ఎంట్రీ ఇచ్చారు. మంచు విష్ణు కలలప్రాజెక్ట్గా రూపొందుతోన్న చిత్రం ‘కన్నప్ప’. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీపై నటుడు, నిర్మాత మోహన్బాబు నిర్మిస్తున్న ఈ మూవీ చిత్రీకరణ ప్రస్తుతం న్యూజిల్యాండ్లో జరుగుతోంది. హీరో ప్రభాస్, మోహన్లాల్, శివరాజ్కుమార్ వంటి స్టార్స్ ఈ చిత్రంలో నటించనున్న విషయం తెలిసిందే. తాజాగా నటుడు మంచు మోహన్బాబు, శరత్ కుమార్ ‘కన్నప్ప’లో భాగమైనట్లు ప్రకటించి, వారిద్దరూ కలిసి ఉన్న ఫొటోని విడుదల చేశారు. ‘‘శివ భక్తుడు కన్నప్ప జీవిత చరిత్ర చుట్టూ ఈ చిత్రకథ తిరుగుతుంది’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. -
పారిస్ ఎయిర్ పోర్టులో నమాజ్.. సమర్థించుకున్న ప్రభుత్వం!
ఇజ్రాయెల్- హమాస్ మధ్య నెల రోజులుగా యుద్ధం నడుస్తోంది. ఈ యుద్ధం కారణంగా ఫ్రాన్స్లో ఉద్రిక్తతలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా పారిస్లోని చార్లెస్ డి గల్లె విమానాశ్రయం డిపార్చర్ హాల్లో 30 మంది ముస్లింలు నమాజ్ చేశారు. విమానాశ్రయంలోని టెర్మినల్ 2లో ఈ ప్రార్థనలు జరిగాయి. ఈ ఉదంతంపై ఫ్రాన్స్ మాజీ మంత్రి నోయెల్ లెనోయ్ స్పందిస్తూ ఎయిర్ పోర్టులో నమాజ్ చేయడం విచారకరమని అన్నారు. ప్రార్థనల కోసం తగిన ప్రార్థనా స్థలాలు ఉన్నాయని, అక్కడ వీటిని నిర్వహించుకోవాలని అన్నారు. ఎయిర్ పోర్టులో ఇలాంటి చర్యలను అరికట్టాలని, నిఘా మరింతగా పెంచాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ ఘటనకు సంబంధించిన ఫొటోను ఆయన సోషల్ మీడియాలో షేర్ చేశారు. విమానాశ్రయం ప్రార్థనా స్థలంగా మారినప్పుడు సీఈఓ ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. కాగా ‘విమానాశ్రయంలో ప్రత్యేక ప్రార్థన స్థలం అందుబాటులో ఉందని, ఎయిర్పోర్టులో నిబంధనలను అమలు చేసేందుకు విమానాశ్రయ అధికారులు కట్టుబడి ఉన్నారని ఫ్రెంచ్ రవాణా మంత్రి క్లెమెంట్ బ్యూన్ ట్విట్టర్లో తెలిపారు. ఇజ్రాయెల్- హమాస్ యుద్ధ నేపధ్యంలో ముస్లింలకు మద్దతుగా పారిస్ ఎయిర్పోర్టులో నమాజ్ చేశారని భావిస్తున్నారు. ఇది కూడా చదవండి: మనిషి దీర్ఘాయుష్షు ఎంత? -
స్మార్ట్ఫోన్లకు మైక్రోస్కోప్.. దీనివల్ల ఉపయోగం ఏంటంటే?
వేలి మొన మీద తేలికగా పట్టేంత ఈ లెన్స్ స్మార్ట్ఫోన్కు మైక్రోస్కోప్ చూపునిస్తుంది. స్మార్ట్ఫోన్ కెమెరా లెన్స్కు దీనిని అతికించుకుంటే చాలు, అరచేతిలో మైక్రోస్కోప్ ఉన్నట్లే! దీని ద్వారా సుదూరంలో ఉన్న వాటిని సమీపంలో ఉన్నంత స్పష్టంగా ఫొటోలు తీయవచ్చు. ఈ లెన్స్ స్మార్ట్ఫోన్ లెన్స్లో సాధారణంగా కనిపించే వస్తువులను వాటి పరిమాణానికి పన్నెండువందల రెట్లు ఎక్కువగా చూపిస్తుంది. దీని ద్వారా తీసే ఫొటోల రిజల్యూషన్ 700ఎన్ఎం ఉంటుంది. ఈ మైక్రోస్కోపిక్ లెన్స్ను స్మార్ట్ఫోన్కు అమర్చుకుంటే, రాత్రివేళ ఆకాశంలో కనిపించే నక్షత్రాలను, చంద్రుడిని అద్భుతంగా ఫొటోలు తీయవచ్చు. ఆరుబయటకు వెళ్లేటప్పుడు సుదూర దృశ్యాలను అత్యంత స్పష్టంగా ఫొటోలు తీయవచ్చు. అమెరికన్ కంపెనీ ‘ఐ మైక్రోస్కోప్’ ఈ లెన్స్ను ‘ఐమైక్రో క్యూ3’ పేరుతో ఇటీవల మార్కెట్లోకి తెచ్చింది. దీని ధర 35 డాలర్లు (రూ.2,910) మాత్రమే! -
ఏపీ హైకోర్టు నూతన న్యాయమూర్తులతో సీఎం వైఎస్ జగన్
-
రొమాంటిక్ ఫోటో క్లిక్ చేసిన ఏఐ కెమెరా.. వావ్ అంటున్న నెటిజన్లు!
ఆధునిక కాలంలో టెక్నాలజీ చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది. దీనిని ఉపయోగించుకుంటూ మనుషులు తమ పనిని మరింత సులభతరం చేసుకుంటున్నారు. కేరళ ప్రభుత్వం ట్రాఫిక్ రూల్స్ మరింత కఠినతరం చేయడానికి ఈ ఏడాది ప్రారంభంలో సుమారు 726 ఏఐ కెమెరాలను ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి ఆ ఫోటోలను గమనించి చలానాలు విధిస్తున్నారు. ఇటీవల ఒక AI ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఏఐ కెమెరా తీసిన ఫోటోలో ఓ క్యూట్ రొమాంటిక్ జంటను చూడవచ్చు. ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. హైరిజల్యూషన్ కెమెరా రాత్రి సమయంలో కూడా అద్భుతంగా వైట్ అండ్ బ్లాక్ ఫోటో తీసింది. ఇందులో బైక్ రైడర్ హెల్మెట్ ధరించాడు, వెనుక ఉన్న అమ్మాయి హెల్మెట్ ధరించలేదు. ఈ కారణంగా వారికి జరిమానా విధించారు. ఈ ఫోటోలు అమ్మాయి నవ్వుతుండటం చూడవచ్చు. వండి భ్రాంతన్మార్ తమ ఇన్స్టాగ్రామ్ పేజీలో ఈ ఫోటో పోస్ట్ చేస్తూ.. డబ్బులిచ్చి పెట్టుకునే పెయిడ్ ఫోటోగ్రాఫర్లు కూడా ఇంతమంచి ఫోటో తీయలేరేమో? అయితే ఇది కలర్ ఫోటో అయితే ఇంకా బాగుండేదని వెల్లడించాడు. అయితే జరిమానా అందుకున్న వ్యక్తి ఇలాగే భావించాడా? లేదా అనే తెలియాలి. ఇదీ చదవండి: యూజ్లెస్ ఫెలో.. గెట్ లాస్ట్ అన్నారు! అక్కడే చైర్మన్ అయ్యాను.. ఏఐ కెమెరాలు అందుబాటులోకి వచ్చిన తరువాత కేరళలో ప్రమాదాలలలో మరణించే వారి సంఖ్య దాదాపు సగానికి తగ్గింది. ఈ ప్రాజెక్టు కోసం ఆ రాష్ట్ర ప్రభుత్వం 232 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. దీంతో ట్రాఫిక్ ఉల్లంఘన సంఖ్య కూడా బాగా తగ్గింది. హెల్మెట్ లేకుండా బైక్ నడిపితే రూ. 500, టూ వీలర్ మీద ముగ్గురు వ్యక్తులు వెళ్తే రూ. 1,000. డ్రైవింగ్ చేసేటప్పుడు లేదా రైడింగ్ చేస్తున్నప్పుడు మొబైల్ ఫోన్ను ఉపయోగిస్తే రూ. 2000 జరిమానా విధించబడుతుంది. View this post on Instagram A post shared by Vandibhranthanmar (@vandi_bhranthanmar) -
వాట్!.. ఫుడ్ ఐటెమ్స్ని ఫోటోలు తీస్తే బరువు పెరుగుతారా!
ఇటీవల స్మార్ట్ ఫోటోలు వచ్చాక తెగ క్లిక్ మనిపించేస్తున్నారు జనాలు. జస్ట్ చేతిలో ఫోను ఉంటే చాలు ప్రతిదాన్ని క్లిక్ మనిపించేయడమే!. ఇది.. అది.. అని ఏం ఉండదు. ఇక ఈ సోషల్ మీడియాల పుణ్యామా అని ఆ పిచ్చి మరీ ఎక్కువయ్యింది. ఏదోక రెసీపీ తయారు చేయడం వెంటనే సోషల్ మీడియాలోనే లేదా వాట్సాప్లో ఫ్రెండ్కో షేర్ చేయడం చేస్తుంటారు. అయితే ఇలా ఫుడ్ ఐటెమ్స్ గనుక ఫోటోలు తీస్తే తెలియకుండానే బరువు పెరగుతారట. ఏంటిది? ఫోటోలు తీస్తే బరువులు పెరగడమా! అని ఆశ్చర్యపోకండి. ఇది నిజం. యూఎస్లోని ఓ యూనివర్సిటి చేసిన అధ్యయనంలో ఈ షాకింగ్ విషయం వెల్లడైంది. వివరాల్లోకెళ్తే..యూఎస్లో జార్జియా సదరన్ యూనివర్సిటీ పరిశోధకులు జరిపిన అధ్యయనంలో వందలో దాదాపు 70 మంది తినడానికి ముందు ఫుడ్ ఐటెమ్స్ని ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నట్లు తేలింది. అలా చేస్తున్న వాళ్లు అనూహ్యంగా బరువు పెరుగుతున్నట్లు గమనించారు. ఇలా ఫోటో తీసిన వాళ్లంతా మాములుగా తినేదాని కంటే ఎక్కువుగా తింటున్నట్లు అధ్యయనంలో వెల్లడైంది. ఫోటో తీయడం వల్ల ఆహారంపై మక్కువ పెరిగి మళ్లీమళ్లీ కావాలనిపిస్తుందట. ఈ మేరకు జార్జియన్ యూనివర్సిటీ 145 మంది స్టూడెంట్స్పై పరిశోధన నిర్వహించింది. ఆ స్టూడెంట్స్ని రెండు గ్రూపులుగా విభజించి ఒక్కొక్కరికి ఒక్కో ప్లేట్ ఛీజ్క్రాకర్స్ ఇచ్చారు. ఒక గ్రూప్ని వెంటనే తినమని, మరో గ్రూప్ని ఫోటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాక తినమని చెప్పారు పరిశోధకులు. అలాగే తిన్న తర్వాత ఫుడ్ రేటింగ్ ఇవ్మమని కూడా అడిగారు. అయితే సోషల్ మీడియాలో పోటో తీసిన వాళ్లంతా ఫుడ్ని చాలా ఎంజాయ చేశామని రేటింగ్ ఇవ్వడమే గాక, ఇంకా కావాలని అడిగినట్లు పరిశోధకులు వెల్లడించారు. ఇలా ఫోటోలు తీయడం అనేది ఒక స్వీట్ మెమొరీ కాబట్టి అది మనకు తెలియకుండానే తినేదానిపై ప్రభావం చూపుతుందన్నారు పరిశోధకులు. దీంతో బ్రెయిన్ మనలో మళ్లీ మళ్లీ తినాలనే కోరికను బలంగా ప్రేరేపిస్తుందన్నారు. అందువల్ల ఎవరైనా ఎక్కువగా తినకుండా ఉండాలన్నా లేదా జంక్ ఫుడ్ మానేయాలనుకున్నా ఇలా ఫుడ్ ఐటెమ్స్ని ఫోటోలు తీసుకోకపోవడమే మంచిదని జార్జియా యూనివర్సిటీ పరిశోధకులు చెబుతున్నారు. (చదవండి: తల్లిదండ్రుల చేసిన ఘాతుకానికి..ఏకంగా ఆ చిన్నారి 80 ఏళ్లుగా..) -
లక్ష సైనికుల కోటి కన్నుల కెమెరా!
నా చేతిలో కెమెరా ఉంటే నాకు భయమనేదే లేదు’ అనేది ఫొటోగ్రాఫర్ గౌరీ గిల్కు ఇష్టమైన మాట. ఈ కారణం వల్లే కావచ్చు ఆమె ఏ భయమూ లేకుండా మారుమూల పల్లెల నుంచి మహా అరణ్యాల వరకు వెళ్లింది. తన భుజాల మీద కెమెరా ఉంటే, తన చుట్టూ లక్షల సైన్యం ఉన్నట్లే. వర్తమాన చరిత్ర, సంస్కృతి, సంబరాన్ని తన కెమెరా కంటితో పట్టుకుంది గౌరీ గిల్. తన ఫొటో సిరీస్ ‘నోట్స్ ఫ్రమ్ ది డిజర్ట్’తో ప్రతిష్ఠాత్మకమైన ప్రిక్స్ పిక్టెట్ అవార్డ్ గెలుచుకుంది. స్విట్జర్లాండ్కు చెందిన మల్టీనేషనల్ ప్రైవేట్ బ్యాంక్, ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ పిక్టెట్ ‘ప్రిక్స్ పిక్టెట్’ (ఇంటర్నేషనల్ అవార్డ్ ఇన్ ఫొటోగ్రఫీ)కి 2008లో శ్రీకారం చుట్టింది... చండీగఢ్లో పుట్టిన గౌరి గిల్ దిల్లీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్లో బీఎఫ్ఏ చేసింది. న్యూయార్క్లోని ‘పార్సన్ స్కూల్ ఆఫ్ డిజైన్’లో ఫొటోగ్రఫీలో బీఎఫ్ఏ, స్టాన్ఫర్డ్ యూనివర్శిటీలో ఫొటోగ్రఫీలో ఎంఎఫ్ఏ చేసింది. అమెరికా, ఇండియాలో ఉన్న బంధువులను ఫొటోలు తీయడంతో తన ప్రయాణం మొదలైంది. రాజస్థాన్లోని అట్టడుగు వర్గాల జీవితాలను అధ్యయనం చేసిన తరువాత తాను చేసిన ఫొటో ప్రాజెక్ట్ ‘నోట్స్ ఫ్రమ్ ది డెజర్ట్’కు మంచి పేరు వచ్చింది. ‘ది మార్క్ ఆన్ ది వాల్’ ‘జన్నత్’... మొదలైన ఎగ్జిబిషన్లు, ప్రాజెక్ట్లతో ప్రశంసలు అందుకుంది. నోట్స్ ఫ్రమ్ ది డెజర్ట్ ప్రాజెక్ట్ విషయానికి వస్తే... ఈ ప్రాజెక్ట్ కోసం రాజస్థాన్లోకి అడుగు పెట్టినప్పుడు అక్కడి పరిస్థితుల గురించి పెద్దగా ఏమీ తెలియదు. ఒక్కొక్క అడుగు వేస్తూ అక్కడి సమాజాన్ని అర్థం చేసుకోవడం ప్రారంభించింది. సంచారుల నుంచి రైతుల వరకు ఎంతోమందితో మాట్లాడింది. కాలాలతో పాటు మారే వ్యక్తుల జీవితాలను గమనించింది. తాను పరిశీలించిన జీవితాల గురించి డైరీలో రాసుకుంది. ఆ తరువాత తన కెమెరా ప్రయాణం రాజస్థాన్ మారుమూల ప్రాంతాల నుంచి మహారాష్ట్రలోని ఆదివాసుల ఇళ్ల దగ్గరకు చేరింది. వర్లీ ఆర్ట్ను ఒడిసిపట్టుకుంది. ఫలానా ఊళ్లో ఫలానా ప్రత్యేకత ఉందనే మాట చెవికి సోకగానే రెక్కలు కట్టుకొని అక్కడ వాలుతుంది. మోహడా అనే ఊళ్లో గ్రామస్థులు పురాణ పాత్రల మాస్క్లను ధరించి పెద్ద ఊరేగింపు తీస్తారు. ఈ మాస్క్లనే సబ్జెక్ట్గా తీసుకొని ఫొటోప్రాజెక్ట్ చేసింది. ఒకరోజు ఒక గ్రామంలోని పశువుల ఆస్పత్రికి వెళ్లింది. డాక్టర్ లేడు. అయితే ఆ డాక్టర్ సీట్లో దోమ మాస్క్ పెట్టుకొని ఒక వ్యక్తి కూర్చున్నాడు. పేషెంట్ సీట్లో కూర్చున్న వ్యక్తి ఏదో మాస్క్ పెట్టుకున్నాడు. ఆ ఆస్పత్రిలోని పాత సామాను, గోడలకు వేసిన రంగులు, ఆస్పత్రి చుట్టుపక్కల రకరకాల ఆవులు, వాటిని కాచుకు కూర్చున్న రైతులు... ఈ అంశాలన్నీ వచ్చేలా ఫొటోలు తీసింది. ఈ ఫోటోల నుంచి ఆలోచించిన వారికి ఆలోచించినన్ని కోణాలు కనిపిస్తాయి. ఎవరి వ్యాఖ్యానాలూ అవసరం లేకుండానే సమాధానాలు దొరుకుతాయి. మొదట్లో ఒక పక్షపత్రికలో ఫొటోగ్రాఫర్గా పనిచేసింది గౌరి. తన ఆసక్తి గ్రామాలు, మారుమూల పల్లెల్లోని స్కూళ్లపై ఉండేది. అయితే తన ఉద్యోగం ద్వారా పల్లెలకు వెళ్లే అవకాశం రాలేదు. దీంతో పల్లెబాట పట్టడానికి ఉద్యోగాన్ని వదిలింది. ఎన్నో స్కూళ్ల చుట్టూ తిరిగింది. ‘ఇది స్కూల్ కాదు. ఇదే అసలు సిసలు ప్రపంచం’ అనుకుంది. ‘ది మార్క్ ఆన్ ది వాల్’ ప్రాజెక్ట్తో ప్రభుత్వ పాఠశాలల్లోని గోడలపై ఉన్న రాతలు, చిత్రాలను డాక్యుమెంట్ చేసింది. ‘ట్రేసెస్’ పేరుతో సమాధులపై చేసిన ప్రాజెక్ట్ మరో అద్భుతం. నిజానికి గౌరీ గిల్ అద్భుతాలు సృష్టించడానికి కెమెరా పట్టుకోలేదు. భిన్న సంస్కృతులు, భౌగోళిక అందాలపై ఆసక్తే అద్భుతాలను సృష్టించి ఆమెను అంతర్జాతీయ ఫొటోగ్రాఫర్ని చేశాయి. 2011లో కెనడాలోని ప్రతిష్ఠాత్మకమైన ఫొటోగ్రఫీ అవార్డ్ గ్రాంజ్ గెలుచుకొని ప్రపంచ దృష్టిని ఆకర్షించిన గౌరికి వినడం ఇష్టమైన పని. విన్న విషయాలను విశ్లేషించుకొని తన కెమెరాకు ముడిసరుకుగా మార్చుకోవడం మరింత ఇష్టమైన పని. (చదవండి: కార్ డిజైనర్ థార్ డిజైనర్!) -
గాంధీ వాడిన ఊతకర్ర కథ ఏమిటి? ఇప్పుడు ఎక్కడుంది?
దండి మార్చ్కు ముందు.. ఆ తరువాత గాంధీ ఫోటోల మధ్య వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తుంది. అదే ఊతకర్ర. గాంధీ 1930లో దండి మార్చ్తో శాసనోల్లంఘన ఉద్యమాన్ని ప్రారంభించినప్పుడు చేతిలో ఊతకర్ర చేరింది.ఇంతకీ ఈ ఊతకర్ర కథ ఏమిటి? దీనిని ఎవరు గాంధీకి ఇచ్చారు? 1930, మార్చి 12న తన 60 ఏళ్ల వయసులో మహాత్మా గాంధీ అహ్మదాబాద్లోని సబర్మతి ఆశ్రమం నుండి ఉప్పు చట్టాన్ని ఉల్లంఘించడానికి చారిత్రాత్మక యాత్రకు బయలుదేరారు. అప్పుడు గాంధీ సహచరుడు, స్నేహితుడు కాకా కలేల్కర్ మహాత్మునికి ఊతమిచ్చేందుకు ఒక కర్ర అవసరమని భావించారు. గాంధీ సాగించే అంత సుదీర్ఘ నడకలో ఆ కర్ర ఉపయోగకరంగా ఉండవచ్చనుకున్నారు. ఈ ఊతకర్రను తీసుకుని గాంధీ 24 రోజుల పాటు ప్రతిరోజూ పది మైళ్లు నడిచేవారు. ఈ నేపధ్యంలోనే ఆ ఊతకర్రకు అంత ప్రాధాన్యత ఏర్పడింది. కాగా గాంధీ తన జీవితంలో అనేక ఊతకర్రలను ఉపయోగించారు. అయితే ఆయన దండి మార్చ్లో ఉపయోగించిన ఊతకర్ర ఆ ఉద్యమానికి ప్రతీకగా మారింది. ఇది గాంధీ ఊతకర్రగా ప్రసిద్ధి చెందింది. ఈ కర్ర బలంగా ఉంటుంది. 54 అంగుళాల ఎత్తు కలిగిన వెదురు కర్ర ఇది. ఈ ప్రత్యేకమైన వెదురు కర్ణాటక తీర ప్రాంతంలోని మల్నాడులో మాత్రమే పెరుగుతుంది. 1948 జనవరి 30వ తేదీ వరకు అంటే గాంధీ హత్యకు గురయ్యే వరకు ఈ ఊతకర్ర గాంధీ దగ్గరే ఉంది. ప్రస్తుతం ఈ ఊతకర్ర న్యూఢిల్లీలోని రాజ్ఘాట్లో ఉన్న నేషనల్ గాంధీ మ్యూజియంలో ఉంది. ఇది కూడా చదవండి: ఏ రాష్ట్రంలో మహిళలకు రిజర్వేషన్లలో పెద్దపీట? -
‘ఫొటో చూసి ఎత్తు చెప్పండి’ అమ్మడి ప్రశ్నకు ఐఫోన్తో నెటిజన్ సమాధానం!
సోషల్ మీడియాలో రోజురోజుకూ విచిత్రమైన పోస్టులు కనిపిస్తున్నాయి. తాజాగా x (గతంలో ట్విట్టర్)లో ఒక యువతికి సంబంధించిన పోస్టు వైరల్గా మారింది. దీనిలో ఆమె యూజర్స్కు ఒక ప్రశ్న సంధించింది. వెంటనే దీనికి సమాధానాలు, కామెంట్ల వెల్లువ మొదలయ్యింది. తన ఎత్తు ఎంతో చెప్పమన్న ఆ అమ్మడిని కంగుతినిపిస్తూ యూజర్స్ సమాధానాలిస్తున్నారు. guess my height 👀 pic.twitter.com/02t86D25a7 — S. (@daalmakhniiii) August 12, 2023 xలో దాల్మఖనీ పేరు కలిగిన యూజర్ తనకు సంబంధించిన ఒక ఫోటోను షేర్ చేసింది. ఆ ఫొటోలో ఆమె ఒక ఐఫోన్ పట్టుకుంది. ‘నా హైట్ ఎంతో చెప్పండి’ అని అడిగింది. ఈ పోస్టుకు ఇప్పటి వరకూ లక్షల్లో సమాధానాలు వచ్చాయి. 1500కు పైగా యూజర్స్ ఈ పోస్టును లైక్ చేశారు. సాగర్ అనే యూజర్ చేసిన కామెంట్ ఎంతో ప్రత్యేకంగా ఉంది. ఆమె చేతిలోని ఐఫోన్-12 పొడవు 14.6 సెంటీమీటర్లు అని పేర్కొంటూ, ఆమె ఫొటో పక్కన అంటే తల మొదలు కొని పాదాల వరకూ ఒక్కొక్కటిగా 9 ఫోన్లను పెడుతూ వచ్చాడు. దీనిని మొత్తం లెక్కించాక ఆమె ఎత్తు 4 అడుగుల 31 ఇంచీలు అని తేల్చిచెప్పాడు. రాహుల్ అనే యూజర్ ఎన్నో దుర్గుణాలు కలిగిన రావణుడు కూడా ఏనాడూ ఇటువంటి ప్రశ్న అడగలేదని కామెంట్ చేశాడు. ఇది కూడా చదవండి: ఒక్కరోజు పెళ్లికి లెక్కలేనంత డిమాండ్.. ఆనక వధువు ఏంచేస్తుందంటే.. 4.31 ft pic.twitter.com/mmtgmh1LAk — Sagar Budhwani (@Sagarbudhwani_) August 12, 2023 -
బేబి ఫేమ్ 'వైష్ణవి చైతన్య' తమ్ముడు చేసినపనికి భారీ ట్రోలింగ్
ఇండస్ట్రీలో చాలామంది నటుల్లానే విజయ్ దేవరకొండ కూడా సొంత టాలెంట్తోనే ఎదిగాడు. సినిమా అవకాశాల కోసం నిర్మాతల ఆఫీసుల చుట్టూ తిరిగాడు. వచ్చిన అవకాశాన్ని కాదనకుండా ఎలాంటి పాత్ర వచ్చినా నటించాడు. అలా ఒక్కోమెట్టు ఎదుగుతూ నేటి యువతకు బ్రాండ్గా మారాడు. అలాంటి 'లైగర్' పక్కన బేబి ఫేమ్ వైష్ణవి చైతన్య తమ్ముడు దిగిన ఫోటో ఒకటి ట్రోలింగ్ ట్రెండింగ్లో టాప్లో ఉంది. (ఇదీ చదవండి: అందరి ముందు కన్నీరు పెట్టుకున్న ‘బిగ్ బాస్’ ఫేమ్ సయ్యద్ సోహైల్) బేబి సినిమాతో వైష్ణవి చైతన్య, ఆనంద్ దేవరకొండ ట్రెండింగ్లోకి వచ్చారు. సినిమా సక్సెస్ అయ్యాక విజయ్ దేవరకొండతో వారిద్దరు కలిసి ఫోటోలు దిగారు. అందులో వైష్ణవి తమ్ముడు కూడా ఉన్నాడు. ఆపై వాటిని షోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇంకేముంది విజయ్ ఫ్యాన్స్ ఫైర్ అవుతూ కామెంట్లు చేస్తున్నారు. ఆ ఫోటోలో వైష్ణవి తమ్ముడే హైలెట్ అవుతూ స్టిల్ ఇవ్వడంతో వారికి నచ్చలేదు. అంతేకాకుండా విజయ్పైన చెయి వేయడంతో ఈ ట్రోలింగ్కు మరింత దారి తీసింది. (ఇదీ చదవండి: యంగ్ హీరోపై బాహుబలి నిర్మాత శోభు సంచలన వ్యాఖ్యలు) వైష్ణవి తమ్ముడి పైనా విజయ్ ఫ్యాన్స్ ఇలా కామెంట్లు చేస్తున్నారు. విజయ్ ఏమైనా సాధారణ వ్యక్తిలా ఫీలయ్యావా ఏంటి అంటూ వారు విరుచుకుపడుతున్నారు. 'నువ్వేమైనా హీరో అనుకుంటున్నావా..? అలా విజయ్ పైనా చెయి వేసి ఫోజు కొడుతున్నావ్.. నీతో ఫోటో దిగేందుకు విజయ్, ఆనంద్లు మీ ఇంటికి వచ్చారా..? కొంచెం ఇలాంటి ఆటిట్యూడ్ తగ్గించుకుంటే మంచిది.' అని ఆయన ఫ్యాన్స్ మండిపడుతున్నారు. కొందరైతే వీడేంటి అర్జున్ రెడ్డిలో ప్రీతి తమ్ముడులా లుక్ ఇచ్చాడు అంటుంటే మరికొందరేమో వీడు చైల్డ్ ఆర్టిస్టా? అంటూ ట్రోల్ చేస్తున్నారు. ఈ ఫోటో వార్ ఇంతటితో ఆపేయండని పలువురు అంటుంటే.. పెద్దవారితో ఎలా ప్రవర్తించాలో వైష్ణవి అయినా తమ్ముడికి చెప్పాలి కదా అని పలువురు కామెంట్ చేస్తున్నారు. -
నది దగ్గర తన పనిలో మునిగిన పాల వ్యాపారి.. కలెక్టర్ ఫొటోతో గుట్టు రట్టు
నది దగ్గరకు వెళ్లి పాలలో నీళ్లు కలుపుతున్న పాల వ్యాపారికి సంబంధించిన ఫొటో వైరల్గా మారింది. ఈ ఫొటోను క్లిక్ మనిపించిన మధ్యప్రదేశ్లోని శ్యోపూర్ జిల్లా కలెక్టర్ దానిని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫొటోలో ఒక పాల వ్యాపారి ఒక నది దగ్గర నిలుచుని పాల క్యాన్లలో నీటిని కలపడం కనిపిస్తుంది. ఈ ఫొటోను స్వయంగా కలెక్టర్ తన మొబైల్ ఫోనుతో క్లిక్ మనిపించారు. తరువాత దీనిని సోషల్ మీడియాలో షేర్ చేసి, వైరల్ చేశారు. వివరాల్లోకి వెళితే శ్యోపూర్ పట్టణానికి సమీపంలో ఉన్న మోర్డోంగరీ నది దగ్గరకు ఒక పాల వ్యాపారి తన బైక్కు పాల క్యాన్లను తగిలించుకుని వచ్చాడు. తరువాత ఒక క్యాన్లో నదిలోని నీటిని నింపి, ఆ నీటిని మిగిలిన పాల క్యాన్లలో నింపాడు. ఈ సమయంలో మార్నింగ్ వాక్ చేస్తూ, అక్కడికి వచ్చిన జిల్లా కలెక్టర్ సంజయ్ కుమార్ ఆ పాల వ్యాపారికి ఫొటో తీశారు. అనంతరం ఆ పాల వ్యాపారిని అడ్డుకుని, పాలలో నీటిని కలపవద్దంటూ మందలించి అక్కడి నుంచి పంపివేశారు. కలెక్టర్ చేసిన ఈ పనితో మిగిలిన పాల వ్యాపారులలో వణుకు పుట్టింది. సదరు పాల వ్యాపారి ఫోటోను కలెక్టర్ సోషల్ మీడియాలో షేర్ చేసిన నేపధ్యంలో జనం రకకాలుగా స్పందిస్తున్నారు. ఈ ఉదంతం గురించి కలెక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ తాను మార్నింగ్ వాక్కు వెళుతుండగా డోంగరీ నది దగ్గర ఒక పాల వ్యాపారి పాల క్యాన్లలో నీటిని కలుపుతుండగా చూశానని అన్నారు. అతని దగ్గరకు వెళ్లి మందలించానని తెలిపారు. ఇప్పటీకీ పాల వ్యాపారులు తమ తీరుమార్చుకోకపోతే తగిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. ఇది కూడా చదవండి: రోడ్డుపై సావధానంగా వెళ్లండి.. చక్కని సంగీతం వినండి.. వీడియో వైరల్ -
పాస్పోర్ట్ ఫొటోకు సహకరించని చిన్నారి.. శభాష్ అనిపించుకుంటున్న తండ్రి ఐడియా!
చంటిపిల్లలతో ఏదైనా పనిచేయించాలంటే తల్లిదండ్రులకు తల ప్రాణం తోకకువస్తుంటుంది. అదొక పెద్ద టాస్క్లా మారిపోతుంది. చిన్నపిల్లలకు హెయిర్ కటింగ్ చేయించాలన్నా, ఇంజక్షన్ చేయించాలన్నా, ఫొటో తీయాలన్నా అది పెద్దలకు శక్తికి మించిన పనిగా మారుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో పిల్లలు ఏడుపునకు దిగితే ఇక తల్లిదండ్రుల తల పట్టుకోవాల్సిందే. అయితే ఇటువంటి సమయంలో ఒక తండ్రి అనుసరించిన పద్దతి ఎంతో చక్కగా ఉన్నదంటూ, అతనిని అభినందనలతో ముంచెత్తుతున్నారు. ఒక తండ్రి తన కుమార్తెకు పాస్పోర్ట్ సైజ్ ఫొటో తీయించాలనుకున్నాడు. అయితే అతని కుమార్తె ఫొటోకు అనుగుణంగా కుర్చీలో కూర్చొనేందుకు సహకరించ లేదు. ఆ చిన్నారి కుర్చీలో కూర్చుంటేనే ఫొటో తీయగలనని ఫొటోగ్రాఫర్ అన్నాడు. దీనికి అతని తండ్రి సమాధానమిస్తూ తన కుమార్తె తన చంకలో నుంచి దిగడం లేదని, కుర్చీలో కూర్చొనేందుకు సహకరించడం లేదని తెలిపాడు. అయితే ఇప్పుడు ఏం చేయాలని? ఫొటోగ్రాఫర్ అడగగా, నా దగ్గర ఒక ఐడియా ఉందని తండ్రి సమాధానమిచ్చాడు. కుమార్తెకు ఫొటో తీయించేందుకు ఆ తండ్రికి వచ్చిన ఐడియా ఏమిటో తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు. తన కుమార్తెకు ఫొటో తీయించేందుకు ఆ తండ్రి కుర్చీలో కూర్చుని, తనపై ఒక తెల్లని వస్త్రాన్ని కప్పుకున్నాడు. ఒడిలో కుమార్తెను కూర్చోబెట్టుకున్నాడు. తరువాత ఆ చిన్నారికి ఫొటో తీశారు. దీనికి సంబంధించిన ఫొటో ట్విట్టర్లో వైరల్గా మారింది. ఈ ఫొటో చూసిన యూజర్స్ తండ్రి అనుసరించిన టెక్నిక్ను ఎంతగానో ఇష్టపడుతున్నారు. ఒక యూజర్ ‘మీ అమ్మాయి ఎంతో ముద్దొస్తోంది. మీరు ఎంతో తెలివైనవారు’ అని కామెంట్ చేయగా, మరొకరు ‘నా కుమారుని పాస్పోర్ట్ సైజ్ ఫొటో కూడా ఇలానే తీయాల్సి వచ్చిందని’ పేర్కొన్నాడు. ఇది కూడా చదవండి: అది ‘వితంతువుల గ్రామం’.. పురుషుల అకాల మృతికి కారణమిదే..! Passport worker - We're gonna need the baby to sit on the chair for the photo. Dad - She won't let me put her down. Passport worker - You're gonna need to figure something out if you want a passport picture. Dad - I got an idea... pic.twitter.com/cx9sm5EsBl — Yair Menchel (@yairmenchel) July 20, 2023 -
‘70 ఏళ్ల మా అమ్మ నా పక్క సద్దుతుంది’.. అనగానే..
సోషల్ మీడియాలో ఒక వ్యక్తి షేర్ చేసిన ఫొటో ఇప్పుడు చర్చల్లోకి వచ్చింది. కిశోర్ స్వామి అనే అనే వ్యక్తి తన ట్విట్టర్ ఖాతాలో తన తల్లి 70 ఏళ్ల వయసులోనూ తన బెడ్ నీట్గా సద్దుతుందని, దీనిని చూస్తే ఆమె ఒక శక్తివంతమైన గృహిణి అనిపిస్తుందని పేర్కొన్నారు. ఈ ట్వీట్ చూసిన నెటిజన్లు పలు విధాలుగా రియాక్ట్ అవుతున్నారు. కొందరు ఈ ఫొటోను షేర్ చేసిన కిశోర్ తీరుకు మండిపడుతున్నారు. అతని దృష్టికోణం మారాలని, అతను ఆలోచనా తీరు మార్చుకోవాలని సూచిస్తున్నారు. ఆ వ్యక్తి ఫొటోకు క్యాప్షన్గా..‘70 ఏళ్లు దాటిన మా అమ్మ నేను ఇంటికి వచ్చేసరికి నా కోసం అవసరమైన ఏర్పాట్లు చేస్తుంది. నా పక్కను పరిశుభ్రంగా ఉంచుతుంది. దీనిని చూస్తే ఆమె అత్యుత్తమ గృహిణి అని అనిపిస్తుందని రాశారు. ఆమెకు ఇటువంటి పనులు చేయాల్సిన అవసరం లేదని, అయినా ప్రేమతో ఈ పనులను చేస్తుందని’ పేర్కొన్నారు. ఈ పోస్టుకు ట్విట్టర్లో వెంటనే ప్రతిస్పందనలు వచ్చాయి. ఒక యూజర్ ‘మీకు సిగ్గులేదు. మీరు ఉదయాన్నే మీ పక్క సద్దుకోకుండా, మీ 70 ఏళ్ల అమ్మ చేత ఈ పని చేయిస్తున్నారు. మీరంటున్నట్లు ఇది గృహధర్మం కాదు.. పెద్దలను పీడించడం. వారికి గౌరవం ఇవ్వకపోవడం’ అని పేర్కొన్నారు. మరో యూజర్.. ఈ వ్యక్తి ఇటువంటి పోస్టుతో అపనమ్మకాన్ని పోషించే పనిచేస్తున్నారు’ అని ఆరోపించారు. ఇంకొక యూజర్ ‘మీ అమ్మ అంత పెద్ద వయసులోనూ పనులు చేస్తుంటే మీరు దానిని గొప్పగా చెప్పడం వింతగా ఉందని కామెంట్ చేశారు. Though 70+ my mom ensures that when I reach home , my bed is comfortable. The power of a home maker. There is no compulsion for her to do it. Yet she does it out of love. The value system that our dharma has inculcated protects this society. pic.twitter.com/t58Fir5IrT — kishore k swamy 🇮🇳 (@sansbarrier) July 7, 2023 దీనికి భిన్నంగానూ కొందరు యూజర్లు కామెంట్ చేశారు. ‘ఈ ఫొటోపై వస్తున్న కామెంట్లు చూస్తే, ఆశ్చర్యం కలుగుతున్నదని, మనం తల్లి మాతృత్వంలోని గొప్పదనాన్ని అర్థం చేసుకోలేమని, ఇటువంటి పనులు చేయడంలో ఆమెకు ఆనందం కలుగుతుందని’ ఒక యూజర్ పేర్కొన్నారు. మరో యూజర్ ‘అతని తల్లి ఈ పనులను బలవంతం మీద చేయడంలేదని, ప్రేమతోనే చేస్తున్నదని పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: వైద్యునికి షాకిచ్చిన సమోసాలు.. రూ.1.40 లక్షలకు టోకరా! -
కీర్తి సురేష్తో ఉన్న వ్యక్తి ఎవరు.. ఫోటో వైరల్?
టాలీవుడ్ మహానటి కీర్తి సురేశ్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనుందని, దుబాయ్కు చెందిన వ్యాపారవేత్తతో సంబంధం సెట్ అయిందని ఆ మధ్య తెగ వార్తలు వచ్చాయ్. వాటిపై కీర్తి తల్లిదండ్రులు రియాక్ట్ అయ్యారు కూడా.. తనకు పెళ్లి చేసే సమయంలో అందరికీ చెప్పే చేస్తామని వారు తెలిపారు. ఇదే విషయాన్ని కీర్తి సురేశ్ కూడా తన ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలిపింది. దాంతో ఆ గొడవ సద్దుమనిగింది. (ఇదీ చదవండి: నిర్మాతపై లైంగిక వేధింపుల కేసు.. స్టేట్మెంట్లో సంచలన విషయాలు!) తాజాగా కీర్తి సురేష్కు సంబంధించిన ఒక ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఎరుపు రంగు డ్రెస్లో కీర్తి సురేష్ నవ్వుతూ ఉండగా.. ఆమెతో పాటు ఒక వ్యక్తి ఎంతో సన్నిహితంగా ఫోటోలో కనిపించాడు. ఇంకేముంది ఇప్పుడా ఫోటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అంతేకాదు ఆ ఫోటోకు క్యాప్షన్గా మెకానిక్తో ప్రేమాయణం అంటూ రాసుకొచ్చారు. (ఇదీ చదవండి: ఆ ఫోటోలు నావి కావు. . నాకు ట్వీటర్ ఖాతానే లేదు: జయవాణి) ఈ ఫోటో విషయంపై కీర్తి అభిమానులు మండిపడుతున్నారు. సినిమా షూటింగ్ సమయంలో ఎవరితో అయినా ఒక్క ఫోటో దిగితే ఇలాంటి చెత్త కామెంట్లు చేస్తారా? అంటూ ఫైర్ అవుతున్నారు. అసలు ఇలాంట ఆలోచనలు ఎలా వస్తాయని వారు మండిపడుతున్నారు. ‘భోళా శంకర్’ చిత్రం షూటింగ్ సమయంలో కీర్తి సురేష్తో ఒక టెక్నిషియన్ ఫోటో దిగాడని, దానిని పట్టుకుని అసభ్యంగా ప్రచారం చేయడం ఎంటని, వారు కామెంట్ చేస్తున్నారు. మరోసారి కీర్తీ సురేష్పై ఇలాంటి ప్రచారాలు చేస్తే పోలీసులకు కూడా ఫిర్యాదు చేస్తామని ఆమె అభిమానులు సోషల్ మీడియా వేదికగా తెలుపుతున్నారు. -
వైరల్ అవుతున్న విజయ్ వర్మ పెళ్లి నాటి ఫోటో!
బాలీవుడ్తో పాటు టాలీవుడ్లో విజయ్ వర్మ పేరు ఎక్కడికెళ్లినా వినిపిస్తోంది. తను నటించిన దహాద్, డార్లింగ్స్, మీర్జాపూర్, గల్లీబాయ్, లస్ట్ స్టోరీస్-2 సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ తమన్నాతోనే అతనికి మరింత గుర్తింపు దక్కింది. తాజాగా విజయ్ వర్మని ఇష్టపడుతున్నట్లు తమన్నా ఓపెన్ అయింది. దీంతో అతను మరింత పాపులర్ అయ్యాడు. విజయ్ ఏ ఇంట్లో ఉంటాడో అనే ఆసక్తి చాలా మందికి ఉంటుంది. సినీ పరిశ్రమలో స్థిరపడిన అతనికి ఇప్పటికీ ముంబయిలో సొంత ఇల్లు లేదు. ప్రస్తుతం అక్కడ సముద్రానికి ఎదురుగా ఉన్న ఓ అపార్ట్మెంట్లో అద్దెకు ఉంటున్నాడు. గత 10 సంవత్సరాలలో, అతను వివిధ కారణాల వల్ల 14 అద్దె ఇళ్లకు మారాల్సి వచ్చింది. ఇదే విషయాన్ని అతని ఇంట్లో ఒక మీడియా ప్రతినిధితో పంచుకున్నాడు. (ఇదీ చదవండి: Adipurush: ఫస్ట్ డే కలెక్షన్స్ తుఫాన్.. పక్కాగా ఆ సినిమాలను దాటేస్తుంది) అలియా భట్తో విజయ్ వర్మ పెళ్లి ఫోటో స్టోరీ ఇదే విజయ్ వర్మ ఇంటి హాలులో కొన్ని ఫోటో ఫ్రేమ్లు ఉన్నాయి. వాటిలో ఒక ఫోటో ఆసక్తగా కనిపిస్తోంది. అదేమిటంటే, స్టార్ హీరోయిన్ అలియా భట్, విజయ్ వర్మ కలిసి ఒకే ఫోటోలో ఉన్నారు. అది కూడా పెళ్లి బట్టలతో.. ఇదేమిటని ప్రశ్నించగా.. 'ఇది డార్లింగ్ సినిమా కోసం ఫోటోషాప్ చేసిన ఫోటో.. అందులో అలియా నా భార్యగా నటించారు. ఆ సమయంలోనే మేకర్స్ ఈ ఫోటో తీశారు.. మా అమ్మ కూడా ఈ ఫోటోను చూసినప్పుడు, షాక్ కావడమే కాకుండా ఎప్పుడు పెళ్లి చేసుకున్నావ్'? అని అడిగిందంటూ చెప్పుకొచ్చాడు. చివరగా కిచెన్ రూమ్ను మాత్రం చూపించలేనని తెలిపాడు. ఎందుకంటే? 'నువ్వు ఇక్కడ వీడియో షూట్ చేయబోతున్నావు కాబట్టి నా దగ్గరకు వచ్చిన వారిని వంటింట్లో ఉంచాను' అంటూ నవ్వుతూ మరో రూమ్ వద్దకు మీడియా ప్రతినిధిని తీసుకెళ్లాడు. (ఇదీ చదవండి: Adipurush: ప్రభాస్ ఎక్కడ అంటూ ఫ్యాన్స్ కామెంట్లు) -
ఎంగేజ్మెంట్ తర్వాత తొలిసారి ఫోటో షేర్ చేసిన లావణ్య త్రిపాఠి!
ఇటీవలే మెగా హీరో వరుణ్తేజ్, లావణ్య త్రిపాఠి ఎంగేజ్మెంట్ ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ మణికొండలోని నాగబాబు నివాసంలో జరిగిన ఈ వేడుకలో మెగాస్టార్ దంపతులు, రామ్ చరణ్, ఉపాసన పాల్గొన్నారు. అయితే నిశ్చితార్థం జరిగిన తర్వాత దిగిన తొలిసారి ఓ ఫొటోను తాజాగా అభిమానులతో పంచుకున్నారు కాబోయే మెగా కోడలు. తమ ఎంగేజ్మెంట్కు విషెస్ తెలిపిన వారందరికీ కృతజ్ఞతలు చెబుతూ వరుణ్తో దిగిన ఫోటోను షేర్ చేశారు. (ఇది చదవండి: సర్జరీ చేయించుకున్న ప్రముఖ నటి.. వారి కోసం ఓ సలహా!) వరుణ్ కూడా అదే ఫోటోను ఒకే క్యాప్షన్తో షేర్ చేశారు. అందులో లావణ్య.. వరుణ్ తేజ్ చేయి పట్టుకుని లావణ్య చిరునవ్వు చిందిస్తూ కనిపించారు. ఇది చూసిన అభిమానులు కాబోయే వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట్లో వైరల్గా మారింది. కాగా.. 2017లో విడుదలైన ‘మిస్టర్ చిత్రంలో తొలిసారి వరుణ్- లావణ్య కలిసి నటించారు. ఆ సమయంలోనే వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ఏడాదిలోనే వీరూ అంతరిక్షం మూవీలో కనిపించారు. ఇక ఈ ఏడాది చివర్లో వీరి వివాహం జరగనున్నట్లు సమాచారం. కాగా.. వరుణ్ తేజ్ ప్రస్తుతం ‘గాండీవధారి అర్జున’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీ ఆగస్టు 25న విడుదల కానుంది. (ఇది చదవండి: పెళ్లికి ముందే వరుణ్కు లావణ్య కండీషన్.. మెగా ఫ్యామిలీ గ్రీన్ సిగ్నల్!) Thanks to and each & everyone for the warm wishes! ♾️♥️@Itslavanya pic.twitter.com/x0rpL27Ovw — Varun Tej Konidela (@IAmVarunTej) June 13, 2023 Thanks to each & everyone for the warm wishes! ♾♥️ Thankful 🫶🏻 grateful pic.twitter.com/N4bw8WSSSm — LAVANYA (@Itslavanya) June 13, 2023 -
Social Hulchul: అందాల ప్రదర్శనలో అనుపమతో తమన్నా పోటీ
► బ్లాక్ డ్రెస్లో డోస్ పెంచుతున్న అనుపమ పరమేశ్వరన్.. ఘాటైన పోజులతో లేటెస్ట్ ఫోటలు వైరల్ ► భూమిపై నిజమైన స్వర్గం ఇదేనేమో అంటూ.. కుటుంబంతో పాటు స్నేహితులతో ఎంజాయ్ చేస్తున్న హనీరోజ్ ► ఎవర్గ్రీన్ అందంతో మెరిసిపోతున్న టబు ► లగ్జరీ బైక్పై సింగిల్గా రైడ్ చేస్తూ తగ్గేదెలే అంటున్న మంజు వారియర్ ►లస్ట్ స్టోరీస్-2 వెబ్ సిరీస్ ఫోటో షూట్లో రెచ్చిపోయిన తమన్నా View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by Honey Rose (@honeyroseinsta) View this post on Instagram A post shared by Manju Warrier (@manju.warrier) View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) View this post on Instagram A post shared by Suhasini Hasan (@suhasinihasan) View this post on Instagram A post shared by Krithi Shetty (@krithi.shetty_official) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) -
తన బాయ్ఫ్రెండ్ ఫోటో రివీల్ చేసిన ఇలియానా
తన వయ్యారంతో అందరినీ ఆకట్టుకున్న నటి ఇలియానా.. టాలీవుడ్లో 'దేవదాసు'తో ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ. తన తొలి సినిమాతోనే గుర్తింపు పొంది.. యూత్ క్రష్గా మారింది. కెరీర్ ఆరంభించిన అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్గా చక్రం తిప్పింది. స్టార్ హీరోలతో పాటు యంగ్స్టర్స్ తోనూ జతకట్టింది ఈ భామ. తర్వాత ఏమైందో ఏమో కానీ టాలీవుడ్కు ఫుల్స్టాప్ పెట్టేసి బాలీవుడ్కు మకాం మార్చేసింది. కానీ అక్కడ అనుకున్నంతగా రానించలేకపోయింది. (ఇదీ చదవండి: నిన్న తిరుమల, నేడు గురుద్వార్.. మీరు మారరా?) ప్రస్తుతం ప్రెగ్నెన్సీ మూడ్ను ఎంజాయ్ చేస్తుంది ఇలియానా. ఈ విషయంలో ఆమెపై నెటిజన్లు పలు విమర్శలు చేశారు. ఇప్పటి వరకు ఆమె తన బాయ్ఫ్రెండ్ గురించి ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. దీంతో భారీ ట్రోలింగ్కు గురైంది. పెళ్లి చేసుకోకుండానే తల్లి అయినందుకు నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. తాజాగా ఇలియానా తొలిసారిగా తన బాయ్ఫ్రెండ్ ఫోటోను ఇన్స్టాలో పోస్ట్ చేసింది. కానీ ఆ ఫోటో అంత క్లారిటీగా లేదు. (ఇదీ చదవండి: ఆ నిర్మాత అవసరం తీరాక ముఖం చాటేస్తాడు: ప్రేమమ్ హీరోయిన్) తన వాల్లో ఇలా రాసుకొచ్చింది. 'ప్రెగ్నెన్సీ అనేది అతిపెద్ద వరం. నేను ఇప్పుడు మరింత అందంగా ఉన్నాను. నా బేబీ బంప్ చూస్తుంటే చాలా ముద్దొస్తుంది. నా బేబీని త్వరలో కలుస్తాను. ఈ ప్రయాణంలో నా ప్రియమైన వ్యక్తి ఎంతో సహకరించాడు. నాకు సమస్యలు ఎదురైన ప్రతిసారి నా కన్నీళ్లు తుడిచాడు. రాయిలా నాకు అండగా నిలబడ్డాడు. ఇప్పుడు ఏదీ అంత కష్టంగా అనిపించడం లేదు' అని ఇన్స్టాలో తెలిపింది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ సోదరుడు సెబాస్టియన్ లారెంట్ మిచెల్తో ఇలియానా ఎఫైర్లో ఉన్నట్లు గతంలో ప్రచారం జరిగింది. ఈ విషయంపై వారిద్దరూ ఇప్పటి వరకు ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. -
ఆకాష్ అంబానీ ముద్దుల తనయ ఫస్ట్ పిక్ - వీడియో వైరల్
ఇటీవల అంబానీ కుమారుడు ఆకాష్ అంబానీ, అతని భార్య శ్లోకా మెహతా రెండవ బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. అంబానీ ఇంటికి వారసురాలు రావడంతో సంబరాలు అమరాన్నంటాయి. కుటుంబ సభ్యులంతా హాస్పిటల్కి వెళ్లి దంపతులను అభినందించారు. అంతే కాకుండా ఆ బిడ్డను ఇంటికి తీసుకెళుతున్నప్పుడు నీతా అంబానీ ఎంతగానో ఉప్పొంగిపోయింది. శ్లోకా మెహతా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తరువాత బిడ్డతో కలిసి భర్త ఆకాష్ అంబానీ, నీతా అంబానీ, ముఖేష్ అంబానీతో కలిసి ఇంటికి ఖరీదైన లగ్జరీ కారులో బయలుదేరారు. దీనికి సంబంధించిన ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇందులో ఆకాష్ అంబానీ ముద్దుల తనయని కూడా చూడవచ్చు. బేబీ పింక్ క్యాప్లో పాప ముద్దుగా ఉన్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా వారసురాలితో బయలుదేరిన కుటుంబం చాలా ఆనందంగా ఉంటడం ఇక్కడ గమనించవచ్చు. యువరాణి స్వాగతం పలకడానికి అప్పటికే ఇంటిని చాలా అందంగా అలంకరించారు. ఇప్పటికే ఆకాష్ అంబానీ & శ్లోకా మెహతా దంపతులకు పృథ్వీ అనే రెండేళ్ల కొడుకు కూడా ఉన్నాడు. కాగా ప్రస్తుతానికి రెండవ బిడ్డ పేరుని ప్రకటించలేదు. త్వరలోనే ప్రకటించే అవకాశం ఉందని భావిస్తున్నారు. View this post on Instagram A post shared by Ambani Family (@ambani_update) -
బుల్లి మస్క్ భలే ఉన్నాడే.. ఏఐ చిత్రానికి మస్క్ ఫిదా! వైరల్ ట్వీట్
ట్విటర్ బాస్, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ చిన్న పిల్లాడిలా మారిపోయారు. ఏంటి మస్క్ ఏమైనా టైమ్ ట్రావెల్ చేస్తున్నాడా అని అనుకోవద్దు. అదేం లేదు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్తో ఎలాన్ మస్క్ చిత్రాలను రోజుకోరకంగా మారుస్తున్నారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్తో చిన్న పిల్లాడిలా రూపొందించిన మస్క్ చిత్రాన్ని ఓ ట్విటర్ యూజర్ షేర్ చేశారు. ‘బ్రేకింగ్: ఎలాన్ మస్క్ యాంటీ ఏజింగ్ ఫార్ములాపై పని చేస్తున్నాడు’ అంటూ దీనికి టైటిల్ పెట్టాడు. వైరల్గా మారిన ఈ పోస్ట్కు ఇప్పటివరకు 3 మిలియన్లకు పైగా వీవ్స్ వచ్చాయి. 45 వేల మందికిపైగా లైక్ చేశారు. ఎలాన్ మస్క్పై ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్తో రూపొందించిన ఫోటో రోజుకొకటి ఇంటర్నెట్లో హల్చల్ చేస్తోంది. వీటికి మస్క్ సైతం అంతే వైవిధ్యంగా స్పందిస్తున్నారు. BREAKING: Elon Musk was reportedly working on some anti aging formula but it got way out of hand pic.twitter.com/uvAkWI3FgT — Not Jerome Powell (@alifarhat79) June 3, 2023 ఇదీ చదవండి: పెళ్లికొడుకు లుక్లో జబర్దస్త్గా..మస్క్: ఫోటోలు వైరల్ -
ఆధార్ కార్డులో ఫోటో మార్చాలా? ఇలా చేయండి!
ఆధునిక కాలంలో ఆధార్ కార్డు ప్రత్యేకత గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడానికి, లైసెన్స్ వంటి వాటికి అప్లై చేసుకోవడానికి ప్రధాన ఆధారం ఆధార్ కార్డే. అయితే ఇంత ముఖ్యమైన ఆధార్ కార్డులో ముఖాలు చాలా వరకు గుర్తు పట్టలేని విధంగా ఉంటాయి. అలాంటి ఫోటోలను మనకు నచ్చిన విధంగా మార్చుకోవడానికి కూడా కొన్ని మార్గాలు ఉన్నాయి. ఆధార్ కార్డులో ఫోటో మాత్రమే కాకుండా పేరు, అడ్రస్, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్ వంటి వాటిని మార్చుకునే వెసులుబాటు కూడా ఉంది. బయోమెట్రిక్ మార్చుకోవడానికి ఆధార్ సెంటర్కి వెళ్లాల్సి ఉంటుంది. కానీ ఇతర వివరాలను ఆన్లైన్లోనే మార్చుకోవచ్చు. ఆధార్ కార్డులో ఫోటో మార్చుకోవడం ఎలా? ఆధార్ కార్డులో ఫోటో మార్చుకోవడానికి ముందుగా ఆధార్ ఎన్రోల్మెంట్ కేంద్రానికి వెళ్ళాలి. https://appointments.uidai.gov.in/ వెబ్ సైట్ ద్వారా కూడా మీకు సమీపంలో ఉన్న ఆధార్ సెంటర్ గురించి తెలుసుకోవచ్చు. ఆధార్ సెంటర్ చేరుకున్న తరువాత అక్కడ దానికి సంబంధించిన ఒక డాక్యుమెంట్ ఫిల్ చేసే అందించాలి. అప్పుడు వారు మీ బయోమెట్రిక్ తీసుకుంటారు. ఆధార్ కార్డులో మీ ఫోటో మార్చాలనుకుంటే ఆపరేటర్ ఫోటోగ్రాఫ్ తీసుకుంటాడు. కావలసిన అన్నీ తీసుకున్న తరువాత అక్నాలెడ్జ్మెంట్ స్లిప్ అందిస్తారు. ఈ అక్నాలెడ్జ్మెంట్ స్లిప్ అప్డేట్ రిక్వెస్ట్ గురించి తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. దీని కోసం రూ. 100 చెల్లించాల్సి ఉంటుంది. ఆధార్ కార్డు అప్డేట్ అయిన తరువాత డిజిటల్ కాఫీని అధికారిక వెబ్ సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. (ఇదీ చదవండి: ఒకప్పుడు ఆసియాలో అత్యంత ధనవంతుడు! ఇప్పుడు ఆస్తులు సున్నా అంటున్నాడు..) నిజానికి ఆధార్ కార్డు ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగమైపోయింది. ఇందులో 12 అంకెల యూనిక్ నెంబర్ ఉంటుంది. దీనిని యుఐడిఏఐ జారీ చేస్తుంది. ఇది ప్రపంచంలోనే అతి పెడా బయోమెట్రిక్ ఐడి సిస్టం అని చెబుతారు. ఇందులో సంబంధిత వ్యక్తి వేలిముద్రలు మొదలైనవి ఉంటాయి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ ఫాలో అవ్వండి. మీ అభిప్రాయాలను, సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. -
అన్నా తమ్ముళ్ల ఫోటో క్షణాల్లో వైరల్...ఎందుకంటే ?
-
తొలిసారి మనోజ్తో దిగిన ఫోటోను షేర్ చేసిన మౌనిక రెడ్డి
టాలీవుడ్ యంగ్ హీరో మంచు మనోజ్ ఇటీవలె పెళ్లిబంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. భూమా మౌనిక మెడలో మూడు ముళ్లు వేసి ఆమెతో కొత్త జీవితం ప్రారంభించాడు. ఇరు కుటుంబాలు, సన్నిహితుల సమక్షంలో మనోజ్- మౌనికలు గత నెలలో ఒక్కటయ్యారు. 12 ఏళ్ల పరిచయం, నాలుగేళ్ల ప్రేమ తర్వాత పెళ్లితో తమ బంధాన్ని పదిల పర్చుకున్నారు. ఇక మనోజ్ తొలిసారిగా తన భార్య మౌనికను ఓ టాక్ షోకి తీసుకెళ్లాడు. ఈ సందర్భంగా తమ ప్రేమ, పెళ్లి వరకు సాగిన మానసిక సంఘర్షణలను పంచుకున్నారు. దీనికి సంబంధించిన ప్రోమో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఇదిలా ఉంటే మౌనిక రెడ్డి తొలిసారిగా భర్త మంచు మనోజ్తో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. మనోజ్తో పోలిస్తే సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్గా ఉండని మౌనిక పెళ్లి ఫోటోలను ఇంతవరకు బయటపెట్టలేదు. తాజాగా ఓ టాక్ షోకి హాజరైన నేపథ్యంలో ఇద్దరూ దిగిన ఫోటోను తొలిసారిగా ఇన్స్టాగ్రామ్లో నెటిజన్లతో పంచుకుంది. ఇక ఇందులో మౌనిక సెలబ్రిటీ స్టైలిస్ట్ సబ్యసాచి శారీను ధరించింది. ప్రస్తుతం ఈ పిక్ నెట్టింట చక్కర్లు కొడుతుంది. View this post on Instagram A post shared by Manoj Manchu (@manojkmanchu) -
వాహ్ క్యా పోజ్ హై.. రాహుల్ గాంధీపై బీజేపీ మంత్రి ప్రశంసలు
న్యూఢిల్లీ: రాహుల్ గాంధీ లండన్ టూర్పై కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం జరుగుతున్న సమయంలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. కమలం పార్టీ నేత, నాగాలాండ్ మంత్రి తెజ్మెన్ ఇమ్నా అలోంగ్ రాహుల్పై ప్రశంసల వర్షం కురిపించారు. దీంతో నెటిజన్లు అవాక్కయ్యారు. లండన్లోని ఛాథం హౌస్లో రాహుల్ గాంధీ మాటామంతీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన సూటు ధరించి జేబులో చేతులు పెట్టుకున్న ఫొటోను కాంగ్రెస్ ట్విట్టర్లో షేర్ చేసింది. 'మీరు ఒంటరిగా ఉన్నా సరే.. మీరు నమ్మినదాని కోసమే నిలబడండి' అని రాసుకొచ్చింది. దీనిపై స్పందించిన తెజ్మెన్ .. రాహుల్ ఫొటో చాలా బాగా వచ్చిందని, అందరూ దీన్ని ఒప్పుకోవాల్సిందేని ప్రశంసించారు. అలాగే ఆయన పోజు నెక్స్ట్ లెవల్ అని ఆకాశానికెత్తారు. Stand up for what you believe in, even if it means you stand alone. pic.twitter.com/dV3fG4NfB9 — Congress (@INCIndia) March 6, 2023 ఏంటీ ఈయన రాహుల్ను ఇంతలా పొగుడుతున్నారు అని అనుకునేలోపే అసలు ట్విస్ట్ ఇచ్చారు తెజ్మన్. ఈ ఫొటో బాగుంది కానీ, దీని క్యాప్షనే ఒరిజినల్ కాదని సైటర్లు వేశారు. కనీసం క్యాప్షన్ అయినా సొంతంగా రాసుకోవచ్చుగా అని ఎద్దేవా చేశారు. कम से कम Caption तो खुद लिखा करो 🙄 pic.twitter.com/YvHUyfKGZF — Temjen Imna Along (@AlongImna) March 8, 2023 చదవండి: త్రిపుర సీఎంగా డాక్టర్ మాణిక్ సాహా ప్రమాణం -
‘డ్యాన్స్ ఆఫ్ ది ఈగల్’.. 5 వేల ఫోటోలను దాటి విజేతగా నిలిచింది
నేషనల్ జియోగ్రాఫిక్ ‘పిక్చర్ ఆఫ్ ది ఇయర్’ పోటీలో విజేతగా నిలిచిన చిత్రమిది. అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కోలో భారతీయ సాఫ్ట్వేర్ డెవలపర్, ఫోటోగ్రాఫర్ కార్తీక్ సుబ్రమణియన్ ఈ ఫోటో తీశారు. అలాస్కాలోని చిల్కాట్ బాల్డ్ ఈగల్ అభయారణ్యంలో తీసిన ఈ ఫోటోకు ‘డ్యాన్స్ ఆఫ్ ది ఈగల్’ అని పేరు పెట్టారు. ప్రకృతి, ప్రజలు, ప్రాంతాలు, ప్రాణులు కేటగిరీలో వచ్చిన 5000 ఫోటోల్లోంచి చివరికి దీన్ని ఎంపిక చేసినట్లు సంస్థ తెలిపింది. ఈ పోటీలో గుర్తింపు పొందిన కొన్ని ఫోటోలుపై ఓ లుక్కేద్దాం. -
బుజ్జాయిల కోసం బుల్లి కెమెరా
స్మార్ట్ఫోన్లకు అలవాటుపడిన పిల్లలను ఆ అలవాటు నుంచి దూరం చేయాలంటే, ఈ బుల్లి కెమెరానే సరైన సాధనం అని చెబుతున్నారు దీని తయారీదారులు. చిన్నారులు సులువుగా ఉపయోగించుకునేలా దీనిని ప్రత్యేకంగా రూపొందించారు. పాతకాలం పోలరాయిడ్ కెమెరా మాదిరిగానే ఇది పనిచేస్తుంది. దీంతో తీసే ఫొటోలో ఎప్పటికప్పుడు ప్రింట్ అయి బయటకు వచ్చేస్తాయి. శక్తిమంతమైన లెన్స్, ఫ్లాష్ ఉండటంతో వెలుతురు తక్కువగా ఉన్నప్పుడు కూడా దీంతో చక్కని ఫొటోలు తీసుకోవచ్చు. అయితే, దీని నుంచి బ్లాక్ అండ్ వైట్ ఫొటోలో మాత్రమే వస్తాయి. జపాన్కు చెందిన ‘కూల్ డిజైన్స్’ కంపెనీ ఈ కెమెరాను రూపొందించింది. దీని ధర 129 డాలర్లు (రూ.10,527) మాత్రమే! -
Photojournalist Smita Sharma: ఉయ్ క్రై ఇన్ సైలెన్స్
ఈ పరిశోధనాత్మక ఛాయాచిత్ర పుస్తకంలో ‘అయ్యో!’ అనిపించే జీవితాలు ఉన్నాయి. కన్నీటి సముద్రాలు ఉన్నాయి. ఏడు సంవత్సరాల పాటు ఎన్నో ప్రాంతాలు తిరిగి, పరిశోధించి దిల్లీకి చెందిన ఫొటో జర్నలిస్ట్ రూపొందించిన ఈ పుస్తకం బాధిత హృదయానికి నిలువుటద్దం... దిల్లీలోని ఒక వ్యభిచార గృహం నుంచి పదిహేడు సంవత్సరాల యువతిని కాపాడారు పోలీసులు. ఆ అమ్మాయితో మాట్లాడిన ఫొటో జర్నలిస్ట్ స్మితాశర్మకు ‘తెలుసుకోవాల్సి విషయాలు చాలా ఉన్నాయి’ అనిపించింది. అలా తన పరిశోధన మొదలైంది. ఏడు సంవత్సరాలు ఎన్నెన్నో కష్టాలు పడి, ఎంతో పరిశోధించి ‘ఉయ్ క్రై ఇన్ సైలెన్స్’ అనే ఫొటోబుక్ తీసుకువచ్చింది. ఇంగ్లీష్, హిందీ, బెంగాలీ భాషలలో ఈ పుస్తకం ప్రచురితం అయింది. తన పరిశోధనలో భాగంగా స్మిత తెలుసుకున్న ముఖ్యవిషయం ఏమిటంటే, చాలా కేసుల్లో మానవ అక్రమ రవాణా అనేది బెదిరింపులతో బలవంతంగా జరగడం లేదు. అమ్మాయిల అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని రకరకాల మోసాలతో ఉచ్చులోకి దించుతున్నారు. ఉదాహరణకు మీనా(పేరు మార్చడమైనది) ఒక రోజు మీనాకు ఒక యువకుడి నుంచి ఫోన్ వచ్చింది. ‘నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఒకసారి కలవాలనుకుంటున్నాను’ అన్నాడు. రెండోరోజు మీనా దగ్గరకు వచ్చి ‘ వీరు మా అమ్మా,నాన్నలు’ అంటూ ఇద్దరిని పరిచయం చేసి పెళ్లి ప్రపోజ్ చేశాడు. ఆ అద్దె తల్లిదండ్రులు కూడా తమ నటనతో రెచ్చిపోయారు. ‘నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం’ అని నమ్మించారు. తన సోదరికి దిల్లీలో వస్త్రవ్యాపారం ఉందని, ఇద్దరం అక్కడే పనిచేద్దాం అన్నాడు యువకుడు. వీరి మాయమాటలు నమ్మి దిల్లీకి చేరిన మీనా దుర్మార్గుల బారిన పడింది. బంగ్లాదేశ్కు చెందిన 12 సంవత్సరాల బాలికకు కుటుంబ పరిస్థితుల వల్ల ఉద్యోగం చేయడం అనివార్యం అయింది. తమ కుటుంబంతో కాస్త పరిచయం ఉన్న ఒక వ్యక్తి ‘ముంబైలో ఉద్యోగం ఇప్పిస్తాను’ అంటూ తీసుకెళ్లి బ్రోతల్ హౌస్కు అమ్మేశాడు. రెండు సంవత్సరాల తరువాత ఈ అమ్మాయి పోలీసుల సహాయంతో విముక్తి అయింది. ఒక ఆశ్రయంలో చేరింది. కొద్దిరోజులకు ఆమెకు ఒక మహిళ పరిచయం అయింది. ‘మీ దేశం తీసుకెళతాను’ అని నమ్మించి పశ్చిమ బెంగాల్లోని నమ్ఖానా అనే ఊరిలోని బ్రోతల్కు అమ్మేసింది... ఇలా చెప్పుకుంటూ పోతే ఈ పుస్తకంలో ఎందరో బాధితులు ఉన్నారు. యాంటీ–హ్యూమన్ ట్రాఫికింగ్ ఆర్గనైజేషన్స్, లాయర్లు, పోలీస్ అధికారుల సహాయంతో మీనాలాంటి ఎంతోమంది అమ్మాయిలతో మాట్లాడింది స్మిత. దీనివల్ల అమ్మాయిల అమాయకత్వం, నేరగాళ్లు ఎన్ని రకాలుగా నమ్మిస్తారు? ఆ తరువాత ఎలా తమ స్వాధీనంలోకి తెచ్చుకుంటారు? ఎలా మోసం చేస్తారు? మానవ అక్రమ రవాణా నేరవ్యవస్థ మూలాలు ఏమిటి?... ఇలా ఎన్నో విషయాలు తెలుసుకోగలిగింది స్మిత. కొన్ని ప్రాంతాలలో అమ్మాయిలు ఇల్లు ఎందుకు విడిచి పెట్టాలనుకుంటున్నారనే విషయానికి వస్తే కొన్ని వాస్తవాలు తెలుస్తాయి. ఎన్నో కిలోమీటర్ల దూరం నడిచి నీళ్లు తేవడం, వంట వండడం, బట్టలు ఉతకడం, పొలానికి వెళ్లి పనులు చేయడం... పొద్దున లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ఈ అంతులేని బండచాకిరీతో తమకు తెలియకుండానే ఇల్లు, ఊరు దాటే స్వేచ్ఛను కోరుకుంటున్నారు. ఈ సమయంలోనే మోసగాళ్ల బారిన పడుతున్నారు. ‘సున్నితమైన అంశంపై పనిచేస్తున్నాను’ అనే ఎరుకతో కెమెరాను చాలా జాగ్రత్తగా ఉపయోగించింది స్మిత. బాధితుల ముఖాలు కనిపించకుండా స్పాట్లైట్లు, షాడోస్... ఇతరత్రా క్రియేటివ్ మెథడ్స్ను ఉపయోగించింది. ‘లైట్లు, షాడోస్ నా ప్రాజెక్ట్లో కీలక పాత్ర పోషించాయి’ అంటుంది స్మితా శర్మ. హైదరాబాద్లో జరిగిన ‘ఇండియన్ ఫొటో ఫెస్టివల్–2022’లో పరిశోధనాత్మక ఫొటోబుక్ ‘ఉయ్ క్రై ఇన్ సైలెన్స్’ ఆవిష్కరణ జరిగింది. -
చిన్నారిని వీపుకి తగిలించుకున్న బాలుడెవరో తెలుసా!
చిన్నారిని వీపుకి తగిలించుకుని నుడుచుకుంటూ వెళ్తున్నాడు ఒక బాలుడు. అతన్ని చూసిన ఒక సైనికుడు ఆ చిన్నారిని కిందకి దించి వెళ్లిపో అన్నాడు. ఐతే ఆ బాలుడు చెప్పిన మాటలు ప్రపంచ గతిని మార్చే చక్కటి సందేశం ఇచ్చాడు. ఇంతకీ ఆ బాలుడెవరు ఏంటా కథ! వివరాల్లోకెళ్తే... ఒక చిన్నారిని వీపుకి తగిలించుకుంటూ వెళ్తున్న బాలుడి చిత్రాన్ని డిసెంబర్ 30 2017న వాటికన్ప్రెస్ తర పత్రికలో ప్రచురించింది. ఇది నాగసాకిపై అణుదాడి తర్వాత జరిగిన పరిణామాల ఫోటోలలో ఒకటి ఇది. జపాన్ యుద్ధ సమయంలో దాదాపు 10 ఏళ్ల బాలుడు చనిపోయిన తన తమ్ముడిని ఖననం చేసేందుకు వీపుకి తగలించుకుని వెళ్తున్నాడు. అప్పుడూ అక్కడే ఉన్న ఒక సైనికుడు ఆ చిన్నారి చనిపోయాడు కాబట్టి ఇక్కడ వదిలి వెళ్లిపోమని సలహ ఇచ్చాడు. ఆ బాలుడు ఆ చిన్నారిని మోసుకుని వెళ్లలేక నీరసించిపోతాడని అలా చెబుతాడు సైనికుడు. కానీ ఆ చిన్నారి తన తమ్ముడని, ఇది తనకు బరువు కాదని చెబుతాడు. పడిపోతే సాయం చేయండి, ఎత్తండి, తప్పు చేస్తే క్షమించండి అని ఏడుస్తూ చెబుతాడు. ఐనా ఆ చిన్నారి బరువుగా ఉండడు కాబట్టి మీ భుజాలపైకి తీసుకుని సాయం చేయండి అని అర్థిస్తాడు. ఆ బాలుడి మాటలకు సైనికుడి కళ్లలో నీళ్లుతిరుగతాయి. అప్పటి నుంచి ఈ చిత్రం జపాన్లో ఐక్యతకు చిహ్నంగా మారింది. ఈ చిత్రాన్ని యూఎస్కి చెందిన మెరైన్ కార్ప్స్ ఫోటోగ్రాఫర్ జోసెఫ్ రోజర్ ఓడొనెల్ తన కెమారాలో బంధించారు. 1945లో హిరోషిమా, నాగసాకిపై అణు బాంబు దాడుల తర్వాత దృశ్యాలను డాక్యుమెంట్ చేసే బాధ్యతను ఓడొనెల్కు అప్పగించడంతో ఆయన ఈ చిత్రాన్ని తీశారు. ఆ ఫోటో వెనుక పోప్ ఫ్రాన్సిస్ 'ది ఫ్రూట్ ఆఫ్ వార్' అని రాసి సంతకం చేశారు. నాటి విషాధ ఘటన ప్రపంచానికి ఒక గొప్ప సందేశం ఇచ్చిదనడంలో సందేహం లేదు. (చదవండి: దాడులను తీవ్రతరం చేసిన రష్యా...బలవంతంగా ఉక్రెయిన్ పౌరుల తరలింపు) -
మిహికా ఇన్స్టా పోస్ట్ వైరల్ .. రానా దంపతులకు శుభాకాంక్షల వెల్లువ!
టాలీవుడ్ యంగ్ హీరో రానా దగ్గుబాటి-మిహికీ బజాజ్ దంపతులు పేరెంట్స్ కాబోతున్నట్లుగా గత కొన్నిరోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలె మిహికా షేర్చేసిన ఫోటోల్లో ఆమె కాస్త బొద్దుగా కనిపించడంతో ఈ రూమర్స్ తెరపైకి వచ్చాయి. అఫీషియల్గా అనౌన్స్మెంట్ రాకముందే మిహికా ప్రెగ్నెంట్ అంటూ పలు వార్తలు గుప్పుమన్నాయి. ఇదివరకే ఈ విషయంపై మిహికా క్లారిటీ ఇస్తూ.. హ్యాపీ మ్యారీడ్ లైఫ్లో ఉన్నాను.. అందుకే కాస్త హెల్దీగా మారాను అంటూ పేర్కొన్న సంగతి తెలిసిందే. తాజాగా ఓ పాపని ఎత్తుకున్న ఫోటోని మిహికా తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తూ.. 'నా ఏంజెల్తో మొదటి ఫోటో..ప్రేమతో మిహికా బజాజ్' అంటూ పోస్ట్ చేసింది. దీంతో ఆ పోస్ట్ చూసిన నెటిజన్లు.. పలువురు ప్రముఖులు సహా నెటిజన్లు రానా, మిహికాలకు కంగ్రాట్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరేమో ఒకడుగు ముందుకేసి సరోగసా అంటూ ప్రశ్నించారు. దీంతో ఆ పాప తమ బిడ్డ కాదని, తన మేనకోడలు అంటూ మిహికా క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది. View this post on Instagram A post shared by Miheeka Daggubati (@miheeka) -
శివసేన నేత దారుణ హత్య.. నిందితుడి కారులో కమెడియన్ ఫోటో!
పంజాబ్కు చెందిన శివనేత నేత సుధీర్ సూరి శుక్రవారం దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. సుధీర్ను కాల్చి చంపిన నిందితుడిని సంఘటన స్థలంలోనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాల్పులకు ఉపయోగించిన ఏ30 తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని సందీప్ సింగ్ అలియాస్ సన్నీగా గుర్తించారు. కాల్పులు జరిగిన ప్రాంతానికి సమీపంలోనే బట్టల దుకాణం నడుపుతున్నట్లు పేర్కొన్నారు. సందీప్ తన దగ్గర ఉన్న లైసెన్స్ తుపాకీతోనే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు పేర్కొన్నారు. అంతేగాక అతని కారులో బాలీవుడ్ కమెడియన్ భారతీ సింగ్, ఆల్ ఇండియా యాంటీ టెర్రరిస్ట్ ఫ్రంట్ చైర్మన్ మణిందర్జీత్ సింగ్ బిట్టా ఫోటోలు లభించినట్లు పంజాబ్ పోలీసులు తెలిపారు. కాగా అమృత్సర్ నగరంలోని గోపాల్ దేవాలయం ఎదుట నిరసన చేస్తున్న శివసేన నేత సుధీర్ సూరిపై శుక్రవారం గుర్తు తెలియని వ్యక్తి తుపాకీతో కాల్పులు జరపడంతో ఆయన అక్కడికక్కడే కుప్పకూలిన విషయం తెలిసిందే. తీవ్ర గాయాలపాలైన బాధితుడిని ఆసుపత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. అయితే శివసేన నేత సుధీర్ చుట్టూ భారీ పోలీసుల భద్రత ఉన్నప్పటికీ ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. ఆలయం వెలుపల చెత్తకుప్పలో కొన్ని విగ్రహ శకలాలు కనిపించగా.. దేవాలయ అధికారులకు వ్యతిరేకంగా కార్యకర్తలతో కలిసి సూరి ధర్నా చేపట్టారు. ఈ క్రమంలో గుంపులో నుంచి బయటకు వచ్చిన దుండగుడు ఆయనపై కాల్పులు జరిపాడు. సూరి అయిదుసార్లు కాల్పులు జరిపినట్లు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. Punjab #Live : Shiv Sena leader Sudhir Suri shot dead in Amritsar in presence of Police. They were sitting on a dharna outside the temple against the desecration of hindu idols. Security personnel are also stationed with Suri at all times !! + pic.twitter.com/1reGHy5ypT — Ashwini Shrivastava (@AshwiniSahaya) November 4, 2022 ఇదిలా ఉండగా ఆలయ నిర్వహణ విషయంలో రెండు వర్గాల మధ్య వివాదం జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని పోలీసు కమిషనర్ అరుణ్ పాల్ సింగ్ తెలిపారు. వర్గాల మధ్య వాగ్వాదం జరగడంతో ఈ ఘటన చోటుచేసుకుందని పేర్కొన్నారు. దీనిపై మరింత లోతుగా విచారిస్తన్నట్లు వెల్లడించారు. ఓ వర్గాన్ని ఉద్దేశిస్తూ సోషల్ మీడియాలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు సూరి ఇప్పటికే గ్యాంగ్స్టర్లు కొన్ని రాడికల్ సంస్థల హిట్-లిస్ట్లో ఉన్నారని పోలీసులు పేర్కొన్నారు. ఆయనకు వై కేటిగిరీ భద్రత కల్పించామని, ఆయన సెక్యూరిటీలో 12 మందికి పైగా పోలీసులు ఉన్నారని తెలిపారు. -
నిర్మాత దిల్రాజు కొడుకును చూశారా? ఫోటో వైరల్
ప్రముఖ నిర్మాత దిల్రాజు మరోసారి తండ్రైన విషయం తెలిసిందే. ఆయన సతీమణి తేజస్విని ఈ ఏడాది జూన్లో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. అయితే దిల్రాజు ఇప్పటివరకు తన కొడుకు ఫోటోను రివీల్ చేయలేదు. అయితే తాజాగా దిల్రాజు వారసుడి ఫోటో నెట్టింట లీక్ అయ్యింది. తమిళ స్టార్ హీరో విజయ్ దిల్రాజు కొడుకును ఎత్తుకున్న ఓ పిక్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వంశీ పైడిపల్లి దర్శక్తవం వహిస్తున్న ఈ చిత్రానికి దిల్రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్లో జరుగుతుంది. ఈ క్రమంలో దిల్రాజు ఇంటికి వచ్చిన విజయ్ ఆయన కొడుకును ఎత్తుకొని ఆడించారు. ఇక ఈ ఫోటో చూసిన నెటిజన్లు క్యూట్ అంటూ కామెంట్స చేస్తున్నారు. కాగా భారీ బడ్జెట్తో నిర్మాస్తున్న ఈ సినిమా వచ్చే సంక్రాంతికి విడుదల కానుంది. రష్మిక మందన్నా ఇందులో హీరోయిన్గా నటిస్తుంది. -
రేషన్ షాపుల్లో కాదు.. గుండెల్లో పెట్టుకుంటాం!
‘న్యాయమైన, సురక్షితమైన, ఆరోగ్యకరమైన ప్రపంచం అన్నది ప్రతి ఒక్కరి హక్కు.. నిజం చెప్పాలంటే ప్రపంచం ఏమంత బాగాలేదు’.. – ఐక్యరాజ్యసమితి సర్వ ప్రతినిధి సమావేశంలో వారం క్రితం నటి ప్రియాంక చోప్రా మాట ఇది.. .... బ్రిటన్ ను దాటి ఐదో అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఇండియా.. కాలరెత్తుకున్న ఇండియన్ – ఓ మెట్టు ఎక్కిన ఆర్థిక భారతం. మానవాభివృద్థి సూచీలో 132వ స్థానంలో మనం.. – విద్య, ఆరోగ్యం, జీవన ప్రమాణాల్లో మరో మెట్టుజారిన పేద భారతం.. .... ఈ రెండూ దాదాపు వారం తేడాతో వచ్చిన వార్తలే. కానీ పరస్పర విరుద్ధం. ఇది చూస్తే పాత జోక్ ఒకటి జ్ఞాపకం వస్తుంది. ఓ రిచ్ స్టూడెంట్ పేదవాడిపై రాసిన వ్యాసం.. ‘వాళ్లింట్లో తల్లి, తండ్రి, పిల్లలు అంతా పేదవాళ్లే. వారి ఇంట్లో పనిమనిషి పేదవాడే, తోటమాలీ పేదవాడే.. చివరికి కారు డ్రైవరూ బాగా పేదవాడే..’ అని.. .... ఎకానమీ గణాంకాలు ఎప్పుడూ ‘ద్రవ్యోల్బణం’లా ఉంటాయి.. అర్థమైనట్టే ఉన్నా అయోమయంగా తోస్తాయి. పెరిగాయో, తగ్గాయో తెలియదు.. ఎక్కడ, ఎందుకు పెరుగుతాయో, తగ్గుతాయో సామాన్యులెవరికీ అర్థంకాదు. ... ‘ఏమంత బాగాలేదు’.. అన్న విషయం మాత్రం అనుభవంలోకి వస్తుంది.. ఏదీ సెక్యూరిటీ? విద్య, వైద్యంతో కూడిన మానవాభివృద్థి సూచీకి ప్రాధాన్యం ఎంత ఉంటుందో ఓ నెటిజెన్ షేర్ చేసిన ఈ మెసేజ్ చూస్తే తెలుస్తుంది. ‘‘.. నేను పెద్దవాళ్లు చెప్పినట్టుగా డిగ్రీ చేశా.. మంచి ఉద్యోగం సంపాదించా.. సమాజ నియమాలకు అనుగుణంగా పెళ్లి చేసుకున్నా.. ఆర్థిక నిపుణుల సూచన మేరకు నడుచుకుని పొదుపు చేసుకున్నా. రిటైర్మెంట్ ప్లాన్ చేసుకున్నా.. క్రెడిట్ కార్డుల జోలికి వెళ్లనే లేదు. సర్కార్ చెప్పినట్టుగా ట్యాక్స్లు కట్టా.. లైఫ్ అంతా మంచి సిటిజెన్గా ఉన్నా.. నా భార్యకు కేన్సర్ వచ్చింది. ఇన్సూరెన్స్ పోను 20 లక్షలు ఖర్చయింది. పొదుపు చేసిందంతా పోయింది. పాతికేళ్ల కష్టం రోగం పాలైంది. ఇంటి ఈఎంఐలు ఆగిపోయాయి. పిల్లల చదువులు గందరగోళంలో పడ్డాయి. ... ఇప్పుడు చెప్పండి మీరు చెప్పే నీతులపై, ఈ ప్రభుత్వాలపై నాకు ఎందుకు గౌరవం ఉండాలి? నాకు ఏం రక్షణ ఉందని నమ్మాలి. నా పిల్లల భవిష్యత్తుకు సొసైటీ, గవర్నమెంట్ ఉపయోగపడుతుందని విశ్వసించాలా? పిల్లల్ని నాలా ఒబీడియెంట్ సిటిజెన్లా పెంచమంటారా?’’ – జీవితంపైనా.. ప్రభుత్వంపైనా సంపూర్ణంగా ఆశలు పోయిన సందర్భం ఇది ఇదీ ప్రయారిటీ.. 132వ స్థానంలో ఉన్న మనం ఇలా ఉంటే.. కొద్ది సంవత్సరాలుగా ‘మానవాభివృద్థి సూచీ’లో అందరి కన్నా ముందు ఉంటున్న నార్వే ఎలా ఉందో చూద్దాం.. చమురు, సహజ వాయువు నిక్షేపాలు నార్వేకు ప్రధాన ఆదాయ వనరు. అయితే ఇలా వచ్చిన డబ్బును ఆ దేశం ప్రజాపనులు, ఆరోగ్యం, మౌలిక సదుపాయాలపై ఖర్చు చేస్తుంటుంది. నార్వే అద్భుతమైన ఆరోగ్య రంగాన్ని రూపొందించుకుంది. ఎంతలా అంటే.. ఆ దేశంలో ప్రతి ఒక్కరికీ ప్రభుత్వమే ఆరోగ్య బీమా కల్పిస్తుంది. అన్నిరకాల వైద్యం ఉచితంగా అందిస్తుంది. ప్రపంచంలో అత్యంత పరిశుభ్రమైన గాలి, నీరు లభించే ప్రాంతాల్లో ఒకటిగా నార్వే పేరు పొందింది. ప్రపంచంలో అతి ఎక్కువగా ఎలక్ట్రిక్ వాహనాలు అమ్ముడుపోయేది ఆ దేశంలోనే.. కాలుష్య రహిత వాతావరణం, మంచి వైద్య సదుపాయాలు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, మంచి ఆదాయం అన్నీ ఉన్న నార్వే ప్రజల ఆయుష్షు కూడా ఎక్కువే. అక్కడివారి సగటు జీవితకాలం 82.3 ఏళ్లు. అక్కడి ప్రభుత్వ యూనివర్సిటీల్లో చదువు పూర్తిగా ఉచితం. విదేశీ విద్యార్థులకు కూడా ఫీజులు తీసుకోరు. నార్వే ప్రభుత్వం ఆ దేశ జీడీపీలో 6.6శాతం విద్యా రంగంపైనే ఖర్చుపెడుతుంది . విద్య, వైద్యం కోసం తమ సంపాదన అంతా ఖర్చుపెట్టాల్సిన పరిస్థితి లేకపోవడంతో ఆ దేశంలో ధనిక, పేద అంతరం మరీ ఎక్కువగా ఉండదు. ప్రతి కుటుంబం మెల్లగా ధనిక స్థాయికి ఎదిగే వాతావరణం ఉంటుంది. ఖర్చు విషయంలో వెసులుబాటు కారణంగా.. ఇప్పటితరం తమ తాతలు, తండ్రుల కంటే ఎక్కువగా విహార యాత్రలు చేయడం, ఎంజాయ్ చేయడం పెరిగింది. నార్వేలో ఉద్యోగిత రేటు 74.4 శాతం. మిగతావారు స్వయం ఉపాధి రంగాల్లో ఉంటారు. అంటే నిరుద్యోగం అతి తక్కువ. అక్కడ టెలి కమ్యూనికేషన్స్, టెక్నాలజీ రంగాల్లో చాలా ఉద్యోగాలు ఖాళీగా ఉంటుంటాయి. డెన్మార్క్, ఫిన్లాండ్, స్విట్జర్లాండ్ వంటి దేశాలు కూడా నార్వే తరహాలో ఉద్యోగ, ఉపాధి కల్పనలో మెరుగ్గా ఉన్నాయి. శాంతి భద్రతల విషయంలో నార్వే ప్రజలు ఎంతో సంతృప్తితో ఉన్నామని చెప్తుంటారు. రాత్రిపూట ఒంటరిగా నడుచుకుంటూ వెళ్లడానికి ఏమాత్రం భయం అనిపించదని 88 శాతం మంది చెప్పడం గమనార్హం. ఆ దేశంలో సంభవించే మొత్తం మరణాల్లో హత్యలు అరశాతం (0.5%) లోపే కావడం గమనార్హం. ఆ దేశంలోని జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు సుమారు నాలుగు వేల మంది మాత్రమే. అక్కడి మహిళా ఉద్యోగులు గర్భం దాల్చితే.. పూర్తి జీతంతో కూడిన 8 నెలల (35 వారాలు) సెలవు (మెటర్నిటీ లీవ్) ఇస్తారు. లేదా 80 శాతం జీతంతో పది నెలలు (45 వారాలు) సెలవు తీసుకోవచ్చు. అవసరమైతే తండ్రులు కూడా పెటర్నిటీ లీవ్ తీసుకునే అవకాశం ఉంటుంది. పిల్లలు పుట్టిన మూడేళ్లలోపు 12 వారాల పాటు వేతనంతో కూడిన సెలవు ఇస్తారు. ఇదేం చారిటీ ..! ఈ మధ్య ఓ రేషన్ షాప్ ముందు స్టాండప్ కామెడీ సీన్ ఒకటి జరిగింది. సాక్షాత్తూ దేశ ఆర్థిక మంత్రి పేదవారికి ఇచ్చే కిలో బియ్యంలో కేంద్రం, రాష్ట్రవాటాల లెక్కలేశారు. పేదవారికి పెడుతున్న తిండిలో తమ వాటా 28 రూపాయలనీ, రాష్ట్రం వాటా 4 రూపాయలనీ, ప్రజల వాటా ఒక్క రూపాయనీ తేల్చారు. తమ వాటా ఇంత ఉండగా ప్రధాని మోదీ ఫొటో ఏదని నిలదీశారు... (క్లిక్ చేయండి: సదా.. మీ ‘చెప్పు’ చేతుల్లోనే..) ‘‘.. ఓ దేశం పేదరికాన్ని దాటడమనేది ‘చారిటీ’ కాదు. సహజ న్యాయంగా జరగాలి’’ అన్న నెల్సన్ మండేలా మాట ఆ సమయంలో గుర్తుకొచ్చి ఉంటే బాగుండేది. సహజన్యాయం జరిగితే... నేతలు తమ ఫొటోలను రేషన్ షాపుల్లో వెతుక్కోనక్కర్లేదు. అందరి ఇళ్లలో, గుండెల్లో అవి కనిపిస్తాయి. మానవాభివృద్థి సూచీ దానికదే పరుగులు పెడుతుంది. (క్లిక్ చేయండి: 75 ఏళ్లుగా ఉరుకుతున్నా... ఉన్నకాడే!) -
సగం కేంద్రం, మిగతా సగం రాష్ట్రం సాయం చేస్తున్నాయని అలా ఫొటో పెట్టాను మేడం!
సగం కేంద్రం, మిగతా సగం రాష్ట్రం సాయం చేస్తున్నాయని అలా ఫొటో పెట్టాను మేడం! -
ఫోటోలకు ఫోజులిచ్చి.. ఘోరంగా తిట్టించుకుంది: వీడియో వైరల్
చారిత్రక ప్రదేశాలు, మ్యూజియంలు సందర్శించేటప్పుడూ అక్కడ పాటించాల్సిన కొన్ని నియమ నిబంధనలకు సంబంధించిన బోర్డులు ఉంటాయి. పైగా అక్కడ మనకు ఈ వస్తువులను తాకవద్దు అని కూడా రాసి ఉంటుంది. అయినప్పటికీ కొంతమంది అత్యుత్సహంతో ఎవరికంట పడకుండా ఆ వస్తువులను తాకేందుకు తెగ ట్రై చేస్తుంటారు. ఈ క్రమంలో ఆ వస్తువు గనుక కిందపడి పగిలిందో ఇక అంతే సంగతులు. అచ్చం అలానే ఇక్కడొక మహిళ ఒక చారిత్రత్మక ప్రదేశానికి వెళ్లి ఫోటోలు తీసుకునే క్రమంలో ఊహించని షాకింగ్ ఘటనను ఎదుర్కొంటుంది. అసలేం జరిగిదంటే....ఒక మహిళ లండన్ పర్యటనకు వెళ్లింది. అక్కడ ఆమె ప్రసిద్ధిగాంచిన బకింగ్హామ్ ప్యాలెస్ని సందర్శించింది. అక్కడకు వెళ్లిన ప్రతిఒక్కరూ రకరకాల ఫోజులతో ఫోటోలు తీసుకోవడం సర్వసాధారణం. ఆ క్రమంలోనే ఒక టూరిస్ట్ మహిళ గుర్రం మీద ఉన్న క్వీన్ గార్డుతో కలిసి ఫోటో తీసుకోవాలనుకుంటుంది. అనుకున్నదే తడువుగా ఆ క్వీన్గార్డుకి దగ్గరగా నుంచుని ఒక ఫోటో తీసుకుంటోంది. ఐతే ఫోటోలు తీసుకునే క్రమంలో ఆ గుర్రాన్ని తాకేందుకు యత్నించకూడదని హెచ్చరిక బోర్డులు ఉంటాయి. పైగా అక్కడ ఉన్న సంరక్షణాధికారులు కూడా పర్యాటకులకు ఈ నియమాలు గురించి చెబుతారు. ఐతే సదరు మహిళ అవేమి పట్టించుకోకుండా తనదారి తనది అన్నట్టుగా గుర్రం పై ఉన్న క్వీన్ గార్డుతో కలసి ఫోటో తీసుకుంటున్న నెపంతో ఆ గుర్రాన్ని తాకడమే కాక తనవైపుకు తిప్పుకుంటూ ఫోటోలకు ఫోజులిస్తుంది. అంతే ఒక్కసారిగా ఆ క్వీన్గార్డు బిగ్గరగా అరుస్తూ...గుర్రాన్ని, వాటికి ఉన్న పగ్గాలను తాకొద్దు అంటూ ఆమె పై సీరియస్ అయ్యాడు. ఈ హఠాత్పరిణామానికి ఆ మహిళ ఒక్కసారిగా తత్తరపాటుకి గురవుతుంది. పైగా ఆ గుర్రం కూడా కాస్త బెదురుగా ముందుకు కదులుతుంది. ఈ ఊహించని ఘటనకు ఆ మహిళ తెగ బాధపడిపోతూ...ఇక లండన్కి ఎప్పటికీ రానంటూ శపథం చేసింది. ఈ మేరకు ఈ ఘటన తాలుకా వీడియోని కూడా ట్విట్టర్లో పోస్ట్ చేసింది. దీంతో నెటిజన్లు ఆ గార్డు చర్యను తప్పుపడితే, మరికొందరూ అక్కడ తాకకుడదని కొన్ని నియమాలు ఉన్నాయి కాబట్టే అతను అలా ప్రవర్తించాడంటూ క్వీన్ గార్డుని సమర్థిస్తూ... రకరకాలుగా ట్వీట్ చేశారు. He scared me for a moment too. 😂😂pic.twitter.com/6dD8Fmx62q — Figen (@TheFigen) July 31, 2022 (చదవండి: అనూహ్య ఘటన!. పైలెట్ దూకేశాడా? పడిపోయాడా!) -
మంత్రి రోజా అరుదైన రికార్డ్.. 3వేల మంది ఫోటోగ్రాఫర్లు.. సింగిల్ క్లిక్..
-
ఒక్క ఫొటో నా జీవితాన్నే మార్చేసింది
సాక్షి, అమరావతి/లబ్బీపేట(విజయవాడ తూర్పు): ఒక్క ఫొటో తన జీవితాన్నే మార్చేసిందని పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా చెప్పారు. ఓ ఫొటోగ్రాఫర్ తీసిన ఫొటో వల్లే తనకు సినిమాలో ఆఫర్ వచ్చిందని చెప్పారు. వెయ్యి అక్షరాలతో చెప్పలేని భావాన్ని ఒక్క ఫొటోతో చెప్పవచ్చన్నారు. విజయవాడలో శనివారం విజయవాడ ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్స్ వెల్ఫేర్ సొసైటీ, ఫొటో వీడియో గ్రాఫర్స్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్నివాల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పెళ్లిళ్లు, వేడుకలే కాదు.. పేదల ఆకలిని ప్రపంచం దృష్టికి తీసుకెళ్లేది, వరదల్లో చిక్కుకున్న వారి స్థితిని కళ్లకు కట్టినట్లు చూపించేది, యుద్ధాల్లో భయానక పరిస్థితి ప్రపంచానికి తెలియచేసేది ఫొటోగ్రాఫర్లు, వీడియో గ్రాఫర్లేనని అన్నారు. ఫొటో కార్నివాల్లో మంత్రి రోజా వేదికపై జాతీయ పతాకాన్ని పట్టుకోగా.. ఒకేసారి 3 వేల మందికిపైగా ఫొటోగ్రాఫర్లు తమ కెమెరాలతో ఏకకాలంలో ఫొటోలు తీశారు. ఇంతమంది ఒకేసారి ఫొటో తీయడం ‘ఇండియాస్ యూనిక్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇంటర్నేషనల్’లో నమోదైంది. దీనిని వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కోసం కూడా పంపనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో అసోసియేషన్ చైర్మన్ మాదల రమేష్, అధ్యక్షుడు మెట్ట నాగరాజు, వర్కింగ్ ప్రెసిడెంట్ కృష్ణప్రసాద్, ప్రధాన కార్యదర్శి మోహన్రాజ్, కోశాధికారి చిలంకుర్తి శేషు, గెల్లా రాజు, కె.కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
వ్యర్థాల నుంచి అర్థాలు: హీనంగా చూడకు దేన్నీ పనికొచ్చేవేనోయ్ అన్నీ!
వ్యాపారానికి సామాజిక కోణం తోడైతే బాగుంటుంది. అలాంటి వ్యాపారానికి ఆవిష్కరణలు తోడైతే మరీ బాగుంటుంది. ‘లిఫాఫ’ బ్రాండ్తో తనదైన ట్రెండ్ను సృష్టించింది కనిక అహుజా. ఆమె వ్యాపార సారాంశం... ‘హీనంగా చూడకు దేన్నీ... పనికొచ్చేవేనోయ్ అన్నీ’ ఢిల్లీకి చెందిన కనిక అహుజాకు పర్యావరణ స్పృహ అనేది పాఠ్యపుస్తకాలలో నుంచో, సభలలో నుంచో వచ్చింది కాదు. చెప్పాలంటే ... బాల్యం నుంచి పర్యావరణ విషయాలను వింటూ పెరిగింది. తల్లిదండ్రులు నెలకొల్పిన ‘కన్జర్వ్ ఇండియా’ అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా పర్యావరణకోణం లో తనకు ఎన్నో విషయాలపై అవగాహన కలిగింది. కర్ణాటకలో ఇంజినీరింగ్ చేసిన తరువాత ఎంబీఏ చేసింది కనిక. ఆ తరువాత ఒక మార్కెట్ రిసెర్చ్ సంస్థలో చేరింది. అంతా బాగానే ఉంది. ‘నేను ఉండాల్సింది ఇక్కడ కాదు’ అనే ఆలోచన కొందరిలో వస్తుంది. ‘ఎక్కడో ఒకచోట, ఎక్కడైతేనేం’ అనుకునేవారు అక్కడే ఆగిపోతారు. అక్కడ నుంచి కొత్త ప్రయాణం ప్రారంభించే వారు మాత్రం విజయశిఖరాలకు చేరువవుతారు. మార్కెట్ రిసెర్చ్ సంస్థలో పనిచేస్తున్న కనిక ‘నేను ఉండాల్సింది ఇక్కడ కాదు’ అనుకుంది ఒకరోజు. వెంటనే తల్లిదండ్రుల ఆధ్వర్యంలోని స్వచ్ఛందసంస్థలో చేరి పనిచేయడం మొదలుపెట్టింది. అలా పనిచేస్తున్న క్రమంలో తనకు ‘లిఫాఫ’ బ్రాండ్ ఐడియా వచ్చింది. ఎక్కడో ఒకచోట మురికిగా, చెత్తగా కనిపించే ప్లాస్టిక్ వ్యర్థాలపై మన దృష్టి మరలదు. మరి వాటినే అందమైన వస్తువులుగా తయారుచేస్తే? వ్యర్థాలకు ఒక అర్థం దొరుకుతుంది. పదిమందికి ఉపాధి దొరుకుతుంది. గొంగళి పురుగులు సీతాకోకచిలుకలై అందంగా ఎగిరే రోజులు వచ్చాయి! పేదలు, అనాథలు.. మొదలైన వారికి ప్లాస్టిక్ వ్యర్థాలను ఎలా రీసైకిలింగ్ చేయాలో నేర్పించింది. ఈ హ్యాండ్మేడ్ రీసైకిల్డ్ ప్లాస్టిక్ పనిని ఆ తర్వాత ఎంతోమంది నేర్చుకున్నారు. గ్లోబల్ వెంచర్ ఫండ్ అశోక నుంచి ఫండింగ్ దొరకడం తన ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది. ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి అందమైన బ్యాగులు, రకరకాల యాక్సెసరీలు తయారయ్యాయి. ఎంత బాగున్నాయో! ‘మన సంబరం సరే, జనాలు ఏమనుకుంటారో’ అనుకుంది కనిక. అయితే లాక్మే ఫ్యాషన్ వీక్లో ‘లిఫాఫ’ ఉత్పత్తులకు అద్భుతమైన స్పందన వచ్చింది. ‘వీటిని ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి తయారుచేశాం’ అని చెబితే నమ్మిన వారు తక్కువ! ఒక విధంగా చెప్పాలంటే ఈ ఫ్యాషన్ వీక్ తమ ఉత్పత్తులకు బ్రేక్ ఇచ్చింది. మన దేశంలోనే కాదు అమెరికా, యూరప్లలో కూడా ‘లిఫాఫ’ ఉత్పత్తులకు డిమాండ్ పెరిగింది. ‘ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి తయారుచేశారు’ అనేది సెల్లింగ్ పాయింట్గా మారింది. ‘లిఫాఫ ద్వారా ఉపాధి దొరకడంతోపాటు పర్యావరణానికి సంబంధించిన ఎన్నో మంచి విషయాలను తెలుసుకోగలిగాను. నేను తెలుసుకున్న విషయాలను వేరే వాళ్లకు చెబుతున్నాను’ అంటుంది ఇరామ్ అలి. ప్లాస్టిక్–టు–ఫ్యాబ్రిక్, జీరో–వేస్ట్ ప్రాడక్షన్ మెథడ్స్, లో–కార్బన్ టెక్ట్స్టైల్ రీసైకిలింగ్... మొదలైన పదునైన బాణాలు ‘లిఫాఫ’ అమ్ములపొదిలో ఉన్నాయి. అందుకే లక్ష్యాన్ని చేధించడం సులువు అయింది! ఇక ఇప్పటి వరకు ఈ సంస్థ సుమారు 12 టన్నుల వ్యర్థాల నుంచి వాలెట్లు, బ్యాగులు ఇతర ఉత్పత్తులు తయారయ్యాయి. గతేడాది వరకు కోటి రెవెన్యూ వచ్చింది. చదవండి: West Bengal: ఇబ్బందికరమైన పరిస్థితులలో సీటుకు ఉండే ప్యానిక్ బటన్ను నొక్కితే చాలు! -
‘అద్దంలో నా ముఖం చూసి గుర్తుపట్టలేకపోయా’ .. ఇన్స్టాలో ఫోటోలు షేర్ చేసిన నటి
సాధారణంగా సినీ తారలు కొంత మంది తమ పర్సనల్ విషయాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. తాజాగా ఫ్రెంచ్ నటి జుడిత్ చెమ్లా గాయాలతో ఉన్న తన ఫోటోలను ఇన్స్టాలో షేర్ చేసి పలు విషయాలను పంచుకుంది. అయితే ఆ ఫోటోతో పాటు తన కుమార్తె తండ్రే దీనంతటికి కారణమని తెలిపింది కానీ అతని పేరును మాత్రం చెప్పలేదు. ఫ్రెంచ్ సినిమా ‘మెస్ ఫ్రెరెస్ ఎట్ మోయి’ తో మంచి పేరు సంపాదించుకుంది నటి జుడిత్ చెమ్లా. ఆమె తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో గృహ హింస ఫలితంగా ఒక సంవత్సరం క్రితం తాను తీవ్రంగా గాయపడ్డ ఫోటోలను చేస్తూ ఇలా రాసింది.. “ఒక సంవత్సరం క్రితం ఒకరి వల్ల నా ముఖం గాయపడింది. ఎంతలా అంటే నన్న నేను గుర్తపట్టలేనంత. ఆ సమయంలో నన్ను నేను అద్దంలో చూసుకుంటే చాలా బాధేసింది. చాలా రోజుల వరకు బయట ప్రపంచంలోకి రాలేకపోయాను. అయితే కొన్ని రోజుల తర్వాత నాకు అర్థమైంది, ఇకపై నా ముఖాన్ని దాచలేనని తెలుసుకుని, దాని నుంచి బయటపడ్డానని’’ చెప్పుకొచ్చింది. అయితే తన పరిస్థితికి కారణమైన వాడిపై ఫిర్యాదు చేశానని, అయితే పోలీసులు పెద్దగా స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేసింది. అందుకే అతనిపై పలుమార్లు ఫిర్యాదు చేయాల్సి వచ్చిందని చెప్పాంది. కాగా చెమ్లా గతంలో చిత్ర దర్శకుడు యోహన్ మాన్కాతో డేటింగ్లో ఉంది. అతడిని నటిపై గృహ హింస కేసు విషయంలో ఎనిమిది నెలల జైలు శిక్ష విధించారు. ఆ ఘటన జరిగిన రెండు నెలల తర్వాత ఆమె ఈ పోస్ట్ చేయడం గమనార్హం. View this post on Instagram A post shared by Judith Chemla (@judithhhhhhhhhhhhhh) చదవండి: ఏదైనా సూటిగా చెప్తా.. డబుల్ మీనింగ్ ఉండదు : నాగచైతన్య -
వ్యాక్సినేషన్ సక్సెస్ను వదిలేసి.. నా ఫొటోపై పడ్డారు
గాంధీనగర్: కోవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్పై మోదీ ఫొటో ఎందుకంటూ ప్రతిపక్షాలు నిలదీయడంపై ప్రధాని మోదీ తీవ్రంగా స్పందించారు. కోవిడ్ వ్యాక్సిన్ లబ్ధిదారులకు తక్షణమే సర్టిఫికెట్ను అందజేసిన భారత్ను చూసి ప్రపంచమంతా చర్చించుకుంటుండగా, కొందరు మాత్రం ఆ సర్టిఫికెట్పై తన ఫొటో ఉండటంపై రాద్ధాంతం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. గాంధీనగర్లో సోమవారం ఆయన డిజిటల్ ఇండియా వీక్–2022ను ప్రారంభించిన అనంతరం మాట్లాడారు. ఆన్లైన్ చెల్లింపుల విధానం తీసుకురావద్దంటూ కొందరు పార్లమెంట్లో వాదించారని, కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత పి.చిదంబరంను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. దేశంలో డిజిటల్ సాంకేతిక ప్రవేశంతో ప్రజల జీవితాలు మారిపోయాయని ప్రధాని చెప్పారు. యూపీఐ ఫలితంగా చిరు వ్యాపారులు కూడా తమ రోజువారీ కార్యకలాపాలను సాగిస్తున్నారన్నారు. బిహార్లోని ఓ వ్యక్తి డిజిటల్ విధానంలో కూడా తనకు దానం చేయవచ్చంటూ క్యూఆర్ కోడ్ ప్లకార్డును మెడలో కట్టుకుని బిచ్చమెత్తుకుంటున్న విషయం ప్రస్తావించారు. వివిధ రకాల సేవలు ఆన్లైన్లో అందుబాటులోకి వచ్చాక ప్రజలు క్యూల్లో నిల్చోవాల్సిన బాధ తప్పిందన్నారు. ఆధునిక సాంకేతికతను భారత్ అందిపుచ్చుకోనట్లయితే ఇప్పటికీ వెనుబడి ఉండేదన్నారు. ‘పదేళ్ల క్రితం ప్రజలు బర్త్ సర్టిఫికెట్లు, బిల్లుల చెల్లింపు, పరీక్షల ఫలితాలు, ప్రవేశాల కోసం క్యూల్లో నిలబడేవారు. ఇప్పుడు అన్ని సేవలను ఆన్లైన్ చేసి క్యూలు లేకుండా చేశాం’ అని చెప్పారు. డిజిటల్ ఇండియా కార్యక్రమం ఫలితంగా అన్ని రంగాల్లో దళారీ వ్యవస్థను అరికట్టగలిగినట్లు చెప్పారు. ముఖ్యంగా కోవిడ్ మహమ్మారి ప్రబలిన సమయంలో 80 కోట్ల మంది పేదలకు సులువుగా ఉచిత రేషన్ అందించామన్నారు. ఇలా ఉండగా, ప్రధాని మోదీ గురువారం సొంత నియోజకవర్గం వారణాసిలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన సుమారు రూ.1,800 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారని పీఎంవో తెలిపింది.