purchasing
-
బంగారం కొనుగోలులో కొత్త ట్రెండ్: నెల నెలా కొనేద్దాం!
ఒకేసారి 10 గ్రాముల ఆభరణం కొనుగోలు చేద్దామంటే.. ధరల తీవ్రత. దీనితో వినియోగదారులు నెలవారీ డిపాజిట్, కొనుగోళ్ల పథకాలవైపు మొగ్గుచూపుతున్నారు. ఈ ధోరణి క్రమంగా పెరుగుతోందని బంగారం వర్తకులు తెలిపారు. తమ మొత్తం అమ్మకాల్లో ‘నెలవారీ డిపాజిట్ పథకాల ద్వారా జరుగుతున్న విక్రయాల’ వాటా 50 శాతం దాటినట్లు కొందరు వర్తకులు వెల్లడించారు. దాదాపు ప్రతి గోల్డ్ రిటైల్ చైన్ డిపాజిట్ స్కీమ్లను కస్టమర్లకు అందిస్తున్నాయి. కొన్ని సంస్థల నుంచి అందిన వివరాలు.. తనిష్క్ రూ.3,890 కోట్ల సమీకరణ టాటా గ్రూప్నకు చెందిన తనిష్క్ మార్చితో ముగిసిన గడచిన ఆర్థిక సంవత్సరంలో (2022–23) డిపాజిట్ల రూపంలో రూ.3,890 కోట్లు సమీకరించింది. అంతక్రితం (2021–22) ఆర్థిక సంవత్సరంలో ఈ విలువ రూ.2,701 కోట్లు. రిలయన్స్ రిటైల్లోనూ ఇదే ధోరణి.. 2021–22తో పోల్చితే 2022–23లో ఈ పథకాల ద్వారా రిలయన్స్ రిటైల్ సమీకరణ మొత్తం రూ.184 కోట్ల నుంచి రూ.282 కోట్లకు ఎగసింది. వినియోగదారులను ఆకర్షించడానికి ఈ సంస్థ పలు పథకాలను రూపకల్పన చేస్తున్నట్లు సమాచారం. పీఎన్జీ జ్యూవెలర్స్లో 27 శాతం అప్ పీఎన్జీ జ్యూవెలర్స్... డిపాజిట్ పథకాల ద్వారా పసిడి కొనుగోళ్లకు 2022–23లో రూ. 700 కోట్లు సమీకరంచింది. 2021–22తో పోల్చితే ఈ పరిమాణం 27 శాతం అధికం. మహారాష్ట్ర, గోవాల్లో ఈ సంస్థ 42 స్టోర్లను ఆపరేట్ చేస్తోంది. శాన్కో గోల్డ్ పథకాల ద్వారా పసిడి కొనుగోళ్లకు సంబంధించి కోల్కతాకు చెందిన శాన్కో గోల్డ్ 2022–23 ఆర్థిక సంవత్సరంలో రూ. 192 కోట్లు సమీకరించింది. 2021–22తో పోల్చితే ఈ విలువ భారీగా 89 శాతం పెరిగినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. డిస్కౌంట్ల ఆకర్షణ డిపాజిట్ పథకాల ద్వారా పసిడి కొనుగోళ్లు పెరగడానికి రిటైలర్లు కూడా పలు ఆఫర్లు, ప్రోత్సాహకాలు అందజేస్తుండడం గమనార్హం. 10 నెలల స్కీమ్లో మొదటి ఇన్స్టాల్మెంట్లో 75 శాతం వరకూ డిస్కౌంట్ ఇస్తున్నట్లు తనిష్క్ గోల్డెన్ హార్వెస్ట్ వర్గాలు తెలిపాయి. ‘‘కోవిడ్ పసిడి ఆభరణాల కొనుగోళ్ల పథకాలపై ప్రభావం చూపాయి. అయితే మళ్లీ ఈ విభాగం ఇప్పుడు పురోగమిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి జూన్ మధ్య గత ఏడాది ఇదే కాలంతో పోల్చిచూస్తే పసిడి పథకాల ద్వారా కొనుగోళ్ల విలువ 50 శాతం పెరిగింది’’ అని తనిష్క్ చైన్ నిర్వహించే టైటాన్ కంపెనీ జ్యూవెలరీ విభాగ సీఈఓ అజయ్ చావ్లా తెలిపారు. 2022–23 ఆర్థిక సంవత్సరంలో తమ మొత్తం తనిష్క్ అమ్మకాల్లో పసిడి పథకాల ద్వారా విక్రయాలు 19 శాతమని చావ్లా తెలిపారు. ఈ రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 21 శాతానికి పెరుగుతుందని భావిస్తున్నట్లు వెల్లడించారు. పసిడి పథకాల్లో ఒక నిర్దిష్ట కాలానికి నెలవారీ డిపాజిట్ల ద్వారా చివరకు ఒక ఆభరణాన్ని పొందగలగడం ఒక అనుభూతిగా కస్టమర్లు భావిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మన్ముందు సంవత్సరాల్లో నెలవారీ డిపాజిట్ల ద్వారా పసిడి కొనుగోళ్ల ధోరణి మరింత పెరుగుతుందన్న అభిప్రాయాన్ని ఈ రంగంలోని నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. -
ఐబీఎస్ సాఫ్ట్వేర్ చేతికి ఏఎఫ్ఎల్ఎస్
తిరువనంతపురం: యాక్సెంచర్ ఫ్రైట్ అండ్ లాజిస్టిక్స్ సాఫ్ట్వేర్ (ఏఎఫ్ఎల్ఎస్)ను కొనుగోలు చేసినట్లు ఐబీఎస్ సాఫ్ట్వేర్ తెలిపింది. అయితే డీల్ విలువ మాత్రం వెల్లడి కాలేదు. ఈ ఒప్పందంతో తాము ఆకాశ, సముద్ర మార్గంలో రవాణా కార్యకలాపాలు నిర్వహించే కంపెనీలకు టెక్నాలజీ సర్వీసులు అందించడానికి సాధ్యపడనున్నట్లు కంపెనీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ వీకే మాథ్యూస్ తెలిపారు. తమ కార్గో, లాజిస్టిక్స్ వ్యాపారాన్ని అలాగే కార్యకలాపాలను అంతర్జాతీయంగా మరింత విస్తరించుకునేందుకు ఇది తోడ్పడగలదని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ట్రావెల్ పరిశ్రమకు సాఫ్ట్వేర్ సర్వీసులను (ఎస్ఏఏఎస్) ఐబీఎస్ అందిస్తోంది. ట్రావెల్, రవాణా, లాజిస్టిక్స్ కోసం చెన్నైలో కొత్తగా డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు కంపెనీ తెలిపింది. ఇది భారత్లో తమకు నాలుగోదని వివరించింది. -
ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై విచారణ వాయిదా
-
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక పరిణామం
-
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తెలంగాణ ప్రభుత్వం అప్పీల్ దాఖలు
-
ఫామ్ హౌస్ కేసుపై BL సంతోష్ సంచలన వ్యాఖ్యలు
-
సిట్ రద్దు.. సీబీఐకి ఎమ్మెల్యే కొనుగోలు కేసు
-
కిషన్ రెడ్డి మాట్లాడిన తీరు అనుమానాలకు తావిస్తోంది: మంత్రి తలసాని
-
అటు ఈడీ ఇటు సీబీఐ.. జంక్షన్ లో బీఆర్ఎస్
-
ఫామ్ హౌస్ ఫైల్స్ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే కేసీఆరే : కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
-
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ట్విస్ట్
-
నందకుమార్ కు బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు
-
ఆధ్యాత్మిక గురువుగానే సింహయాజీని కలిసాను : కోదండరాం
-
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కౌంటర్ సమర్పించిన సిట్ అధికారులు
-
ఎమ్మెల్యే కొనుగోలు కేసులో వాడీ వేడీగా సాగిన వాదనలు
-
బీజేపీ నేత బీఎల్ సంతోష్ కు ఊరట
-
సుప్రీంకోర్టులో ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విచారణ
-
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ముగిసిన నిందితుల కస్టడీ
-
మహీంద్రా లాజిస్టిక్స్ చేతికి రివిగో ‘బీ2బీ’ వ్యాపారం
ముంబై: లాజిస్టిక్స్ సంస్థ రివిగో సర్వీసెస్కు చెందిన బీ2బీ ఎక్స్ప్రెస్ వ్యాపార విభాగాన్ని కొనుగోలు చేస్తున్నట్లు మహీంద్రా లాజిస్టిక్స్ (ఎంఎల్ఎల్) వెల్లడించింది. వ్యాపార బదిలీ ఒప్పందం (బీటీఏ) రూపంలో ఈ డీల్ ఉంటుందని పేర్కొంది. దీని ప్రకారం రివిగోలోని బీ2బీ ఎక్స్ప్రెస్ వ్యాపారం అసెట్స్, కస్టమర్లు, టీమ్, టెక్నాలజీ ఫ్లాట్ఫాం మొదలైనవి ఎంఎల్ఎల్కు దక్కుతాయి. ఎక్స్ప్రెస్ నెట్వర్క్ ప్రస్తుతం 250 ప్రాసెసింగ్ కేంద్రాలు, శాఖల ద్వారా దేశవ్యాప్తంగా 19,000 పిన్ కోడ్లకు సర్వీసులు అందిస్తోంది. తమ వ్యాపారా సామర్థ్యాలను మరింత పటిష్టపర్చుకునేందుకు ఈ డీల్ ఉపయోగపడగలదని ఎంఎల్ఎల్ ఎండీ రామ్ప్రవీణ్ స్వామినాథన్ తెలిపారు. -
స్థానిక ఉత్పత్తులే కొనండి
అహ్మదాబాద్: భారత్ అన్ని రంగాల్లోనూ స్వయం సమృద్ధి సాధించాలంటే ప్రజలంతా స్థానిక ఉత్పత్తులనే కొనుగోలు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. 25 ఏళ్ల పాటు ఇలా స్థానిక ఉత్పత్తుల్నే కొంటే దేశంలో నిరుద్యోగ సమస్య తీరిపోతుందన్నారు. ‘‘స్థానిక ఉత్పత్తులకు ఆదరణ పెరిగితే అందరికీ ఉద్యోగావకాశాలు వస్తాయి. అందుకోసమే వోకల్ ఫర్ లోకల్ పథకం తెచ్చాం’’ అని చెప్పారు. ప్రపంచ దేశాలన్నీ స్వయంసమృద్ధిని సాధనకు కృషి చేస్తున్నందున మనం కూడా అదే బాటన ముందుకెళ్లాలన్నారు. హనుమజ్జయంతి సందర్భంగా గుజరాత్లోని మోర్బిలో 108 అడుగుల భారీ విగ్రహాన్ని శనివారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆవిష్కరించారు. దేశం నాలుగు దిక్కులా హనుమంతుడి భారీ విగ్రహాలను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన హనుమాన్జీ చార్ధామ్ ప్రాజెక్టులో భాగంగా పశ్చిమాన దీన్ని ఏర్పాటు చేశారు. ఉత్తరాన సిమ్లాలో 2010లో ఇలాంటి విగ్రహాన్నే ఆవిష్కరించారు. దక్షిణాన రామేశ్వరంలో సన్నాహాలు సాగుతున్నాయి. 3 రోజులు గుజరాత్కు మోదీ ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న గుజరాత్లో సోమవారం నుంచి మోదీ మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చేస్తారని పీఎం కార్యాలయం వెల్లడించింది. అల్లర్లపై మాట్లాడరేం? శ్రీరామనవమి సందర్భంగా దేశంలో పలు ప్రాంతాల్లో జరిగిన మత ఘర్షణలపై ప్రధాని ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రతిపక్షాలు ప్రశ్నించాయి. విద్వేష ప్రసంగాలు, మతహింస ఘటనలపై ఆయన స్పందించకపోవడం దారుణమంటూ సోనియాగాంధీ (కాంగ్రెస్), శరద్పవార్ (ఎన్సీపీ), మమతా బెనర్జీ (తృణమూల్ కాంగ్రెస్), ఎంకె స్టాలిన్ (డీఎంకే) సహా 13 విపక్ష పార్టీల అధ్యక్షులు ధ్వజమెత్తారు. శనివారం వారు సంయుక్త ప్రకటన విడుదల చేశారు. మతఘర్షణలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలంతా శాంతి, సహనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. ప్రధాని ఖండించకపోతే ఆయన మౌనాన్ని మద్దతుగా తీసుకుని మత విద్వేషకులు మరింత రెచ్చిపోతారన్నారు. ఇలాంటి కుట్రదారులందరినీ కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. -
చిన్న ఇన్వెస్టర్లకూ ప్రభుత్వ బాండ్లు!!
న్యూఢిల్లీ: ఇప్పటిదాకా బ్యాంకులు, బీమా కంపెనీల్లాంటి పెద్ద సంస్థలకు మాత్రమే అందుబాటులో ఉంటున్న ప్రభుత్వ బాండ్లను ఇకపై చిన్న స్థాయి రిటైల్ ఇన్వెస్టర్లు కూడా కొనుగోలు చేయొచ్చు. అంతే కాదు, బ్యాంకింగ్ సేవా లోపాలకు సంబంధించి వివిధ సంస్థల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఒకే అంబుడ్స్మన్కు ఫిర్యాదు చేయొచ్చు. ఇందుకు సంబంధించిన రెండు స్కీములను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం వర్చువల్గా ఆవిష్కరించారు. ఆర్బీఐ రిటైల్ డైరెక్ట్ స్కీమ్, సమగ్ర అంబుడ్స్మన్ స్కీమ్ వీటిలో ఉన్నాయి. దేశీయంగా పెట్టుబడి అవకాశాలను మరింతగా పెంచడానికి, సురక్షితమైన వ్యవస్థ ద్వారా క్యాపిటల్ మార్కెట్లలో సులువుగా ఇన్వెస్ట్ చేయడానికి రిటైల్ డైరెక్ట్ స్కీమ్ తోడ్పడగలదని ఈ సందర్భంగా ప్రధాని తెలిపారు. అభివృద్ధి పనుల కోసం నిధులు సమీకరించుకునేందుకు కూడా ఇది దోహదపడగలదని ఆయన పేర్కొన్నారు. ‘‘మధ్య తరగతి, ఉద్యోగులు, చిన్న వ్యాపారులు, సీనియర్ సిటిజన్లు మొదలైన వర్గాల వారంతా తమ పొదుపు మొత్తాలను నేరుగా, సురక్షితంగా ప్రభుత్వ సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్ చేయడానికి రిటైల్ డైరెక్ట్ స్కీమ్ ఉపయోగపడుతుంది. ప్రభుత్వ సెక్యూరిటీలకు కచ్చితమైన సెటిల్మెంట్ హామీ ఉంటుంది కాబట్టి చిన్న ఇన్వెస్టర్లకు భరోసా ఉంటుంది’’ అని మోదీ చెప్పారు. ఇటీవలి కాలంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు మరింతగా ప్రభావం చూపేందుకు రిజర్వ్ బ్యాంక్ విధానాలు కూడా తోడ్పడ్డాయని ఆయన తెలిపారు. సమష్టి కృషితో ఎకానమీ రికవరీ: ఆర్థిక మంత్రి కోవిడ్–19తో దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థ, ఇటు ఆర్థిక శాఖ అటు ఆర్బీఐ కలిసికట్టుగా పనిచేయడం వల్ల, వేగంగా కోలుకుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. రిటైల్ డైరెక్ట్ స్కీముతో బాండ్ల మార్కెట్ మరింతగా విస్తరించగలదని ఆమె తెలిపారు. మరోవైపు, తమ సర్వీసులను మెరుగుపర్చుకునేందుకు రిజర్వ్ బ్యాంక్ టెక్నాలజీ, నూతన ఆవిష్కరణలను గణనీయంగా ఉపయోగించుకుంటోందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. ఆర్బీఐ రిటైల్ డైరెక్ట్ స్కీమ్.. ఈ స్కీముతో వ్యక్తిగత రిటైల్ ఇన్వెస్టర్లు ఇకపై ప్రైమరీ, సెకండరీ మార్కెట్ల ద్వారా ట్రెజరీ బిల్లులు, ప్రభుత్వ బాండ్లు, సావరీన్ గోల్డ్ బాండ్లు, రాష్ట్రాల అభివృద్ధి రుణాలకు సంబంధించిన బాండ్లు మొదలైన వాటిని నేరుగా కొనుగోలు చేయొచ్చు. ఇతర ఇన్వెస్టర్లకు గిఫ్టుగా కూడా ఇవ్వొచ్చు. ఇందుకోసం ఆర్బీఐ వద్ద ఆన్లైన్ రిటైల్ డైరెక్ట్ గిల్ట్ అకౌంట్ (ఆర్డీజీ ఖాతా) తెరవాల్సి ఉంటుంది. ఈ అకౌంట్లు ఆయా ఇన్వెస్టర్ల పొదుపు ఖాతాలకు అనుసంధానమై ఉంటాయి. ఎన్డీఎస్–ఓఎం అనే ఎలక్ట్రానిక్ వ్యవస్థ ద్వారా ప్రభుత్వ బాండ్ల జారీ, సెకండరీ మార్కెట్ లావాదేవీల్లో రిటైల్ ఇన్వెస్టర్లు పాల్గొనవచ్చు. ప్రస్తుతం ఇది కేవలం బ్యాంకులు, ప్రైమరీ డీలర్లు, బీమా కంపెనీలు, మ్యూచువల్ ఫండ్స్ వంటి బడా సంస్థలకు మాత్రమే అందుబాటులో ఉంటోంది. ఒకే అంబుడ్స్మన్.. సమగ్ర అంబుడ్స్మన్ స్కీమ్ 2021 కింద, రిజర్వ్ బ్యాంక్ పరిధిలో పనిచేసే ఆర్థిక సంస్థలు అందించే సేవల్లో లోపాలపై కస్టమర్లు ఒకే చోట ఫిర్యాదు చేయొచ్చు. ప్రస్తుతం బ్యాంకులు, నాన్–బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు, పేమెంట్ సిస్టమ్ ఆపరేటర్లు వంటి వాటికి వేర్వేరుగా అంబుడ్స్మన్ ఉంటున్నారు. వీటికి సంబంధించిన బ్యాంకింగ్ అంబుడ్స్మన్ స్కీమ్ 2006, అంబుడ్స్మన్ స్కీమ్ ఫర్ నాన్–బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ 2018, అంబుడ్స్మన్ స్కీమ్ ఫర్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ 2019 అనే 3 స్కీములను కలిపి కొత్తగా సమగ్ర అంబుడ్స్మన్ స్కీమ్ 2021ను రూపొందించారు. రూ. 50 కోట్ల పైగా డిపాజిట్ పరిమాణం ఉన్న షెడ్యుల్యేతర సహకార బ్యాంకులనూ దీనిలోకి చేర్చారు. ఫిర్యాదులపై ఆయా ఆర్థిక సంస్థలు 30 రోజుల్లోగా సంతృప్తికరమైన పరిష్కారం చూపకపోతే, కస్టమర్లు సమగ్ర అంబుడ్స్మన్ను ఆశ్రయించవచ్చు. -
టాటా గూటికి మహారాజా!!
న్యూఢిల్లీ: పారిశ్రామిక దిగ్గజం టాటా గ్రూప్.. దశాబ్దాల క్రితం తాను నెలకొల్పిన విమానయాన సంస్థను తిరిగి దక్కించుకోవడానికి చేరువలో ఉంది. రుణభారంలో కూరుకుపోయిన ప్రభుత్వ రంగ ఎయిరిండియాను కొనుగోలు చేసే క్రమంలో అత్యధికంగా కోట్ చేసిన బిడ్డర్గా టాటా గ్రూప్ నిలి్చనట్లు సమాచారం. కేంద్ర హోం మంత్రి అమిత్ షా సారథ్యంలో ఎయిరిండియా విక్రయంపై ఏర్పాటైన మంత్రుల కమిటీ (ఏఐఎస్ఏఎం) ఈ బిడ్పై ఆమోదముద్ర వేయాల్సి ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఎయిరిండియా కొనుగోలుకు సంబంధించి ప్రైవేట్ రంగ విమానయాన సంస్థ స్పైస్జెట్ ప్రమోటర్ అజయ్ సింగ్, టాటా గ్రూప్ దాఖలు చేసిన ఆర్థిక బిడ్లను డిజిన్వెస్ట్మెంట్పై ఏర్పాటైన కార్యదర్శుల కీలక బృందం బుధవారం పరిశీలించిందని వారు వివరించారు. నిర్దేశించిన రిజర్వ్ ధరతో పోల్చి చూసినప్పుడు టాటా గ్రూప్ అత్యధికంగా కోట్ చేసిన సంస్థగా నిలి్చందని పేర్కొన్నారు. ఇక ఈ ప్రతిపాదనను ఎయిరిండియా ప్రైవేటీకరణపై ఏర్పాటైన మంత్రుల కమిటీ ముందు ఉంచనున్నట్లు సంబంధిత వర్గాలు వివరించాయి. అయితే, ఇటు ఆర్థిక శాఖ అటు టాటా సన్స్ దీనిపై స్పందించేందుకు నిరాకరించాయి. ఏఐఎస్ఏఎంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్, పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఉన్నారు. మరోవైపు, ఎయిరిండియా ఆర్థిక బిడ్లను ప్రభుత్వం ఆమోదించేసిందంటూ వచి్చన వార్తలను పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం (దీపం) కార్యదర్శి తుహిన్ కాంత పాండే తోసిపుచ్చారు. ‘ఎయిరిండియా డిజిన్వెస్ట్మెంట్ అంశంలో ఆర్థిక బిడ్లను కేంద్ర ప్రభుత్వం ఆమోదించిందంటూ మీడియాలో వస్తున్న వార్తలు సరి కావు. ఈ విషయంలో ఎప్పుడు నిర్ణయం తీసుకుంటే అప్పుడు మీడియాకు తెలియజేస్తాం’ అని ట్వీట్ చేశారు. టాటా గ్రూప్నకు ఇప్పటికే ఎయిర్ఏíÙయా ఇండియాలో మెజారిటీ వాటాలు ఉన్నాయి. ఇక, సింగపూర్ ఎయిర్లైన్స్తో కలిసి విస్తారా అనే జాయింట్ వెంచర్ నిర్వహిస్తోంది. 2017 నుంచి అమ్మకానికి ప్రయత్నాలు.. ఇండియన్ ఎయిర్లైన్స్ను విలీనం చేసుకున్నాక 2007 నుంచి ఎయిరిండియా నష్టాల్లోనే కొనసాగుతోంది. భారీ రుణభారంలో కూరుకుపోయిన ఎయిరిండియాను ప్రైవేటీకరించేందుకు 2017 నుంచే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అప్పట్లో కంపెనీని కొనుగోలు చేసేందుకు ఇన్వెస్టర్లు ఎవరూ ఆసక్తి చూపకపోవడంతో.. కేంద్రం గతేడాది అక్టోబర్లో ఆసక్తి వ్యక్తీకరణ పత్రాల (ఈవోఐ) నిబంధనలను సడలించింది. 2020 జనవరిలో దీపం జారీ చేసిన ఈవోఐ ప్రకారం 2019 మార్చి 31 నాటికి ఎయిరిండియా రుణం రూ. 60,074 కోట్లుగా ఉంది. ఇందులో దాదాపు రూ. 23,286.5 కోట్ల భారాన్ని కొత్త ఇన్వెస్టరు తీసుకోవాల్సి ఉంటుంది. మిగతాది ఎయిరిండియా అసెట్స్ హోల్డింగ్ (ఏఐఏహెచ్ఎల్) పేరిట ఏర్పాటు చేసే స్పెషల్ పర్పస్ వెహికల్కి బదలాయిస్తారు. బిడ్డింగ్లో గెలుపొందిన సంస్థకు దేశీ ఎయిర్పోర్టుల్లో 4,400 దేశీ, 1,800 అంతర్జాతీయ సర్వీసుల విమానాల ల్యాండింగ్, పార్కింగ్ స్లాట్లు లభిస్తాయి. అలాగే విదేశీ ఎయిర్పోర్టుల్లో 900 పైచిలుకు స్లాట్లు దక్కుతాయి. అలాగే చౌక విమాన సేవల సంస్థ ఎయిరిండియా ఎక్స్ప్రెస్లో 100 శాతం, దేశీయంగా ప్రధాన విమానాశ్రయాల్లో కార్గో, గ్రౌండ్ హ్యాండ్లింగ్ సేవలు అందించే ఏఐఎస్ఏటీఎస్లో 50 శాతం వాటాలు లభిస్తాయి. 1932లో మహారాజా ప్రస్థానం ప్రారంభం... మహారాజా మస్కట్తో ఎంతో ప్రాచుర్యం పొందిన ఎయిరిండియా ప్రస్థానం .. 1932లో టాటా ఎయిర్లైన్స్ గా ప్రారంభమైంది. జహంగీర్ రతన్జీ దాదాభాయ్ (జేఆర్డీ) దీన్ని నెలకొల్పారు. తొలినాళ్లలో దీన్ని బాంబే, కరాచీ మధ్య పోస్టల్ సర్వీసులకు ఉపయోగించారు. ఆ తర్వాత ప్రయాణికులకు విమాన సరీ్వసులను ప్రారంభించాక కంపెనీ చాలా వేగంగా ప్రాచుర్యంలోకి వచి్చంది. సం స్థ ప్రకటనల్లో అప్పటి ప్రముఖ బాలీవుడ్ నటీమణులు దర్శనమిచ్చేవారు. విమానంలో ప్రయాణించే వారికి ఖరీ దైన షాంపేన్, ప్రసిద్ధ చిత్రకారుడు శాల్వడోర్ డాలీ గీసిన చిత్రాలతో రూపొందించిన పోర్సెలీన్ యాష్ట్రేలు వంటి విలాసాలు అందుబాటులో ఉండేవి. 1946లో టాటా సన్స్ ఏవియేషన్ విభాగం ఎయిరిండియాగా లిస్టయ్యింది. 1948లో యూరప్కు విమాన సేవలతో ఎయిరిండియా ఇంటర్నేషనల్ ఏర్పాటైంది. దేశీయంగా ప్రభుత్వ–ప్రైవేట్ భాగస్వామ్యానికి ఈ ఇంటర్నేషనల్ సరీ్వసే నాం ది. అప్పట్లో ఈ సంస్థలో ప్రభుత్వానికి 49 శాతం, టాటాలకు 25 శాతం, మిగతా వాటా పబ్లిక్ దగ్గర ఉండేది. 1953లో ఎయిరిండియాను కేంద్రం జాతీయం చేసింది. 1990లు, 2000ల దాకా ఎయిరిండియా ఆధిపత్యం కొ నసాగినా ఆ తర్వాత ప్రైవేట్ సంస్థలు కూడా రంగంలోకి దిగడం మొదలయ్యాక క్రమంగా ప్రాభవం తగ్గడం మొదలైంది. -
పిరమల్ గ్రూప్ చేతికి డీహెచ్ఎఫ్ఎల్
ముంబై: ఆర్థిక సమస్యల్లో ఇరుక్కుని ఎన్సీఎల్టీకి చేరిన దివాన్ హౌసింగ్ ఫైనాన్స్(డీహెచ్ఎఫ్ఎల్) కొనుగోలు ప్రక్రియను పూర్తిచేసినట్లు పిరమల్ ఎంటర్ప్రైజెస్ తాజాగా వెల్లడించింది. డీహెచ్ఎఫ్ఎల్ రుణదాతలకు రూ. 34,250 కోట్లు చెల్లించినట్లు తెలియజేసింది. రుణ పరిష్కారంలో భాగంగా ఫిక్స్డ్ డిపాజిట్దారులతోపాటు.. రుణదాతలు మొత్తం రూ. 38,000 కోట్లు రికవర్ చేసుకున్నట్లు వివరించింది. నగదు, మారి్పడిరహిత డిబెంచర్ల(ఎన్సీడీలు) జారీ ద్వారా పిరమల్ క్యాపిటల్ అండ్ హౌసింగ్ ఫైనాన్స్(పీసీహెచ్ఎఫ్ఎల్) సుమారు రూ. 34,250 కోట్లు చెల్లించినట్లు పేర్కొంది. రిజల్యూషన్లో భాగంగా డీహెచ్ఎఫ్ఎల్ వద్దగల మరో రూ. 3,800 కోట్లను రుణదాతలు పొందగలిగినట్లు తెలియజేసింది. ఐబీసీ నిబంధనల ప్రకారం ఫైనాన్షియల్ సరీ్వసుల రంగంలో విజయవంతమైన తొలి రుణ పరిష్కార ప్రణాళికగా డీహెచ్ఎఫ్ఎల్ను పిరమల్ గ్రూప్ చైర్మన్ అజయ్ పిరమల్ పేర్కొన్నారు. ఇకపై రిజల్యూషన్లకు ఇది నమూనాగా నిలవనున్నట్లు అభిప్రాయపడ్డారు. రెండు కంపెనీలను(పీసీహెచ్ఎఫ్ఎల్, డీహెచ్ఎఫ్ఎల్) విలీనం చేయనున్నట్లు వెల్లడించారు. విలీన సంస్థను పిరమల్ క్యాపిటల్ పిరమల్ క్యాపిటల్ అండ్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్గా వ్యవహరించనున్నట్లు తెలియజేశారు. -
ఏప్రిల్లో స్తంభించిన తయారీ
న్యూఢిల్లీ: తయారీ పరిశ్రమ ఉత్పత్తి ఏప్రిల్లో దాదాపు మార్చి స్థాయిలోనే నిలిచింది. ఐహెచ్ఎస్ మార్కిట్ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ పర్చేజింగ్ ఇండెక్స్ (పీఎంఐ) ఏప్రిల్లో 55.5 వద్ద ఉంది. మార్చిలో ఇండెక్స్ 55.4 వద్ద (ఎనిమిది నెలల కనిష్ట స్థాయి) ఉంది. దాదాపు యథాతథ స్థితికి కరోనా వైరెస్ సెకండ్వేవ్ సృష్టించిన అనిశ్చితి వాతావరణమే కారణమని నిపుణులు భావిస్తున్నారు. సూచీ 50లోపునకు పడిపోతేనే క్షీణతగా భావిస్తారు. ఆపై వృద్ధి ధోరణిగా పరిగణిస్తారు. తాజా సమీక్షా నెల్లో కొత్త ఆర్డర్లలో వృద్ధి నమోదుకాలేదు. ముడి పదార్థాల ధరల స్పీడ్... 2014 జూలై తరువాత ఎన్నడూ లేనంత వేగంగా ముడి పదార్థాల ధరలు పెరిగినట్లు తమ సర్వేలో వెల్లడైందని ఐహెచ్ఎస్ మార్కిట్ ఎకనమిక్స్ అసోసియేట్ డైరెక్టర్ పొలియన్నా డి లిమా పేర్కొన్నారు. కాగా ఏప్రిల్లో వరుసగా ఎనిమిదవ నెల ఎగుమతుల ఆర్డర్లు పెరిగినట్లు డి లిమా వెల్లడించారు. భారతీయ వస్తువులకు అంతర్జాతీయ డిమాండ్ దీనికి ప్రధాన కారణమని తెలిపారు. ఇక తయారీ రంగంలో వరుసగా 13వ నెలా ఉపాధి అవకాశాలు తగ్గాయని వెల్లడించారు. తయారీకి సంబంధించి పీఎంఐ సూచీ 50పైన కొనసాగడం ఇది వరుసగా తొమ్మిదవ నెల. -
లాక్డౌన్ నుంచి వీటికీ మినహాయింపు
సాక్షి, న్యూఢిల్లీ: లాక్డౌన్ నుంచి మరికొన్ని రంగాలకు మినహాయింపునిస్తూ కేంద్రం శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. గతంలో ప్రకటించిన మినహాయింపులకు అదనంగా ఇవి ఉంటాయని పేర్కొంది. గ్రామీణ ప్రాంతాల్లో నిర్మాణ కార్యక్రమాలు, నీటి సరఫరా, పారిశుద్ధ్య రంగానికి చెందిన నిర్మాణ పనులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు, కో ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీల కార్యకలాపాలకు తాజాగా అనుమతినిచ్చింది. కలపేతర అటవీ ఉత్పత్తుల సేకరణ, కొనుగోలు, ప్రాసెసింగ్.. తదితరాలకు కూడా అనుమతినిచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లోని నిర్మాణ పనుల్లో.. విద్యుత్ స్తంభాలు, విద్యుత్ లైన్లు, టెలికం ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ ఏర్పాటు.. మొదలైనవి ఉన్నాయి. హౌజింగ్ ఫైనాన్స్ సంస్థలు, మైక్రో ఫైనాన్స్ సంస్థలు కొద్దిపాటి సిబ్బందితో పనులు చేసుకోవచ్చు. వెదురు, కొబ్బరి, వక్క, కొకొవా తదితర ఉత్పత్తుల ప్లాంటేషన్, ప్యాకేజింగ్, అమ్మకం, మార్కెటింగ్ మొదలైన పనులను ఈ లాక్డౌన్ కాలంలో చేసుకోవచ్చు. -
రైతులకు అసౌకర్యం కలగొద్దు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లకు ఏమాత్రం ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అధికారులను ఆదేశించారు. రైతు చెం తకే వెళ్లి ధాన్యం కొనుగోళ్లు జరపాలని సూ చించారు. రాష్ట్రంలో లాక్డౌన్ ప్రకటించిన పరిస్థితులలో ప్రభుత్వ ఆంక్షలకు అడ్డురాకుండా చర్యలు తీసుకోవాలని, కొనుగోలు కేంద్రాల వద్ద ఎక్కువ మంది రైతులు గుమి కూడకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. సోమవారం ధాన్యం కొనుగోళ్లపై మంత్రి బీఆర్కేఆర్ భవన్లో సమీక్షా సమా వేశం నిర్వహించారు. సమావేశానికి పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, ప్ర భుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా నిరంజన్రెడ్డి మాట్లాడుతూ, ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పా టు విషయంలో పరిమితులు అవసరం లేదని, రూ.25 వేల కోట్లకు బ్యాంక్ గ్యారంటీకై ఆర్థిక శాఖకు సీఎం కేసీఆర్ ఆదేశాలిచ్చారన్నా రు. గ్రామాల వారీగా ధాన్యం అ మ్మకానికి వచ్చే పరిస్థితులు అం చనా వేసి కొనుగోళ్లకు టోకెన్ ద్వా రా ఏర్పాట్లు చేయాలన్నారు. అకాల వర్షాలు వస్తే కొనుగోలు కేం ద్రాలలో రైతులకు ఇబ్బందులు కలగకుండా టార్పాలిన్లను సరఫ రా చేయాలన్నారు. టార్పాలిన్లను కొనుగోలు కేంద్రాల వద్ద అందుబాటులో ఉంచాలని, కొత్తగా 60 వేల టార్పాలిన్లను త్వరగా కొనుగోలు చేయాలని మార్కెటింగ్ శాఖ కు ఆదేశాలు జారీ చేశారు. తేమ ని ర్ధారణ యంత్రాలు కొరత లేకుండా చూసుకోవాలని, గన్నీ బ్యాగులను ముందే సిద్ధం చేసుకోవాలన్నారు. రైతులు ప్రాథమిక సహకార సంఘా లు, ఐకేపీ కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పట్టణ వ్యవసాయ మార్కెట్ల వరకూ రైతులు ధా న్యం తెచ్చే అవకాశం రానివ్వమని చెప్పారు. రబీలో పండిన మొక్కజొన్నలను రూ.1,760 కి కొనుగోలు చేయాలని తెలిపారు. పౌల్ట్రీ సంక్షోభం నేపథ్యంలో రైతులు నష్టపోకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. విధిగా ఏ గ్రామ రైతు ఆ గ్రామంలోనే ధాన్యం అమ్మకాలు చేసుకునే అవకాశం కల్పించాలన్నారు. నిత్యావసరాలకు గ్రీన్ ఛానల్.. ఇతర రాష్ట్రాల, రాష్ట్రం నుంచి పట్టణాలు, గ్రామాలకు వచ్చే పాలు, కూరగాయలు, ఇతర నిత్యావసరాలు ట్రాఫిక్ జామ్ కారణంగా ఆగిపోకుండా గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేయాలని తెలిపారు. టోల్ ప్లాజాలు చెక్ పోస్ట్ల వద్ద అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అధిక ధరలకు నిత్యావసరాలు అమ్మితే కఠిన చర్యలు తప్పవని, దీనిని అరికట్టేందుకు టాస్క్ఫోర్స్ జీవో విడుదల చేశామన్నారు. విత్తనాలు, ఫర్టిలైజర్ ఈసీ యాక్ట్లో ఉన్నందున వాటి రవాణా, సరఫరాపై ఎటువంటి ఆంక్షలుండవని వెల్లడించారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి జనార్దన్రెడ్డి, పౌరసరఫరాల శాఖ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, మార్క్ఫెడ్ చైర్మన్ గంగారెడ్డి, పౌరసరఫరాల శాఖ కమిషనర్ సత్యనారాయణరెడ్డి, సహకార శాఖ కమిషనర్ వీరబ్రహ్మయ్య తదితరులు హాజరయ్యారు. -
కొనుగోలు శక్తి తగ్గొచ్చు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఈసారి రుతుపవనాలు సాధారణం కంటే మెరుగ్గా ఉన్నాయి. చాలా ప్రాంతాల్లో నీటి లభ్యత పెరిగింది. అయితే నాట్లు ఆలస్యం కావడం, పంట విస్తీర్ణం తగ్గడంతో ప్రజల్లో కొనుగోలు శక్తి పడిపోయి ఆర్థిక వ్యవస్థ మరింత నెమ్మదించే అవకాశం ఉందని ఎస్బీఐ గ్రూప్ చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ సౌమ్య కాంతి ఘోష్ అన్నారు. ఇన్స్టిట్యూట్ ఫర్ అడ్వాన్స్డ్ స్టడీస్ ఇన్ కాంప్లెక్స్ చాయిసెస్ ఆధ్వర్యంలో మంగళవారం ప్రారంభమైన రెండు రోజుల సదస్సులో ఆయన మాట్లాడారు. ‘వాహన విక్రయాలు గణనీయంగా పడిపోవడాన్ని బట్టి రానున్న రోజుల్లో పరిస్థితి ఎలా ఉండబోతోందో అంచనా వేయొచ్చు. అయితే వాహన రంగంపై ఇటీవల ఎస్బీఐ ఓ అధ్యయనం చేసింది. దాంట్లో తేలిందేమంటే ప్రాంతం, వయసు, లింగ భేదం లేకుండా ఆర్థిక స్తోమతను బట్టి కార్లను కొంటున్నారు. అత్యధికులు ఖరీదైన మోడళ్లను కైవసం చేసుకుంటున్నారు. వీటి కోసం రూ.10 లక్షలకుపైగా ఖర్చు చేస్తున్నారు. ముఖ్య విషయమేమంటే భారత్లో మహిళా ఉద్యోగుల సంఖ్య పెరుగుతున్నట్టే.. కార్లను కొంటున్న మహిళలూ అధికమవుతున్నారు. అమెజాన్ సేల్లో ఎస్బీఐ కార్డ్ కస్టమర్లు ఖర్చు చేసినదాన్ని బట్టి... ద్వితీయ శ్రేణి నగరాల నుంచీ డిమాండ్ ఉంది. దీనినిబట్టి చూస్తే సెంటిమెంట్ లేకపోతే ఇంత డిమాండ్ ఎలా వచ్చిందనే ప్రశ్న తలెత్తుతోంది’ అని వివరించారు. బంగారం ధరలు తగ్గే సూచనలు ఇప్పట్లో కనపడడం లేదని వ్యాఖ్యానించారు. -
రేప్ కేసుల సత్వర విచారణకు ప్రత్యేక కిట్లు
న్యూఢిల్లీ: అత్యాచార కేసుల్లో విచారణను త్వరితగతిన పూర్తిచేసేందుకు వీలుగా కేంద్ర హోంశాఖ లైంగికదాడి సాక్ష్యాల సేకరణ కిట్ల(ఎస్ఏఈసీకే)ను కొనుగోలు చేయనున్నట్లు ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. వీటి సాయంతో నేరం జరిగిన చోట రక్తం, వీర్యం నమూనాలను సేకరిస్తారని వెల్లడించారు. తొలుత పైలట్ ప్రాజెక్టుగా రూ.79.2 లక్షల వ్యయంతో 3,960 ఎస్ఏఈసీకే కిట్లను కొనుగోలు చేస్తారు. తొలిదశలో ఒక్కోరాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతానికి 100 కిట్లను అందజేస్తామనీ, క్రమంగా ఒక్కో పోలీస్స్టేషన్కు మూడు కిట్లు ఉండేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. -
85 వేల టన్నుల పసుపు కొనుగోలు లక్ష్యం
నంద్యాల అర్బన్ : మార్క్ఫెడ్ల ద్వారా 85 వేల టన్నుల పసుపును కొనుగోలు చేసేలా ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించిందని మార్క్ఫెడ్ జీఎం శివకోటిప్రసాద్ తెలిపారు. స్థానిక టెక్కె మార్కెట్ యార్డులో మార్క్ఫెడ్ ద్వారా నిర్వహిస్తున్న పసుపు కొనుగోళ్లను బుధవారం మార్క్ఫెడ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పీపీనాగిరెడ్డితో కలిసి ఆయన పరిశీలించారు. అనంతరం జీఎం స్థానిక విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలోని కడప, నంద్యాల, ఉదయగిరి, దుగ్గిరాళ్ల, వేమూరు, కంకిపాడు తదితర ప్రాంతాల్లో మార్క్ఫెడ్ల ద్వారా పసుపు కొనుగోళ్లు నిర్వహిస్తున్నామన్నారు. ఇప్పటి వరకు 15 వేల టన్నుల పసుపును కొనుగోలు చేసి రూ.94 కోట్లు రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేశామన్నారు. అదే విధంగా మార్క్ఫెడ్ల ద్వారా 87 వేల టన్నుల కందులను కొనుగోలు చేసి రూ.450 కోట్లు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్లు చెప్పారు. నిల్వ సామర్థ్యం ఉన్న గోదాములు లేకపోవడంతో మిరప పంటను కొనుగోలు చేయలేకపోయామని చెప్పారు. నెలాఖరు వరకు పసుపు కొనుగోళ్లు జరిగేలా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. పీపీ నాగిరెడ్డి మాట్లాడుతూ నంద్యాల మార్కెట్ యార్డుకు పసుపు రైతుల తాకిడి అధికమైందని, మరో ఆరు కాటాలు తెప్పించి పసుపు కొనుగోళ్లను వేగవంతం చేయాలన్నారు. అమ్మకాలు జరిగిన రెండు మూడురోజుల్లో రైతుల ఖాతాల్లోకి నగదు జమ అయ్యేలా చూడాలన్నారు. సీనియర్ ప్రొక్యూర్మెంట్ మేనేజర్ సంజీవరెడ్డి, నంద్యాల మార్క్ఫెడ్ బ్రాంచ్ మేనేజర్ నాగరాజు, మహేశ్వరరెడ్డి, రవి పాల్గొన్నారు. -
16 నుంచి 24 వరకు మిర్చి కొనుగోళ్లు బంద్
కర్నూలు(వైఎస్ఆర్ సర్కిల్) : కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులోఈనెల 16వ తేదీ నుంచి 24వ తేదీ వరకు మిర్చి కొనుగోళ్లను బంద్ చేస్తున్నట్లు మార్కెట్ యార్డు కార్యదర్శి శివరామకృష్ణ శాస్త్రి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. వాస్తవంగా 13వ తేదీ నుంచి 28వ తేదీ వరకు మిర్చి కొనుగోళ్లను నిలిపివేస్తామని కమీషన్ ఏజెంట్లు పట్టుపట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కమీషన్ ఏజెంట్లను, వ్యాపారులను చర్చలకు పిలిపించి ఒప్పందం కుదిర్చారు. పక్షం రోజుల పాటు కాకుండా వారం రోజుల వరకు కొనుగోళ్లు బంద్ చేయవచ్చన్నారు. ఈ మేరకు మార్కెట్ యార్డు శాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేస్తూ ప్రకటన జారీ చేశారు. ప్రకటించిన రోజుల్లో మిర్చిని యార్డుకు తీసుకురావద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు. -
ముగిసిన కందుల కొనుగోలు
కర్నూలు(అగ్రికల్చర్): కనీస మద్దతు ధరతో కందులు కొనుగోలు చేసే కార్యక్రమం బుధవారంతో ముగిసింది. గత ఏడాది ఇదే సమయంలో క్వింటాల్ ధర రూ.9వేలకు పైగా ఉండగా ఈ ఏడాది మద్దతు కరువైంది. క్వింటా ధర రూ. 4000 కు పడిపోయింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు మార్క్ఫెడ్.. 80 రోజుల క్రితం జిల్లాలో 16 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఇవి ఈ నెల 28వ తేదీతో ముగియగా.. దాదాపు 3 లక్షల క్వింటాళ్ల కందులు కొనుగోలు చేశారు. అయితే 40 శాతం మంది రైతులు నగదు చెల్లించాల్సి ఉంది. -
కొనుగోళ్లలో అప్రమత్తత అవసరం
– జిల్లా వినియోగదారుల ఫోరం అధ్యక్షురాలు నజీరున్నీసా నంద్యాల: వస్తువుల కొనుగోళ్లలో అప్రమత్తంగా ఉండాలని జిల్లా వినియోగదారుల ఫోరం అధ్యక్షురాలు నజీరున్నీసా సూచించారు. స్థానిక రామకృష్ణ పీజీ కాలేజీలో వినియోగదారుల అవగాహన సదస్సు శనివారం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వినియోగదారులకు సేవలు, వస్తువుల నాణ్యతలో లోపాలు, మోసాలు జరిగినట్లు భావిస్తే హక్కుల పరిరక్షణకు ఫోరంను ఆశ్రయించవచ్చన్నారు. వినియోగదారులకు ఎలాంటి అసౌకర్యం కలిగినా రాష్ట్ర, జిల్లా స్థాయిలో ఫిర్యాదు చేయవచ్చన్నారు. రామకృష్ణ విద్యాసంస్థల అధినేత డాక్టర్ రామకృష్ణారెడ్డి వినియోగదారుల రక్షణ చట్టం హక్కులు, బాధ్యతల గురించి వివరించారు. డాక్టర్ రామసుబ్బా రెడ్డి మాట్లాడుతూ వినియోగదారుల చట్టం ద్వారా కల్తీని, మోసాలను నివారించవచ్చన్నారు. వినియోగదారులు బిల్లు చెల్లించేటపుడు రసీదును పొందాలన్నాన్నారు. కళాశాల సంచాలకుడు ఆచార్య చంద్రశేఖర్రావు వినియోగదారుల చట్టం గురించి వివరించారు. అనంతరం నజీమున్నీసాను సన్మానించారు. కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది ఎల్లయ్య, హేమంత్ రెడ్డి, నాగరాజమ్మ, రత్నారెడ్డి, శ్రావణకుమారి, వెంకట్రావు పాల్గొన్నారు. -
మౌలికంతోనే స్థిరాస్తి వృద్ధి!
⇒ మౌలిక సదుపాయాలు కల్పిస్తేనే ధరల్లో పెరుగుదల ⇒ అందుబాటు ధరలకు శివారు ప్రాంతాలే ఉత్తమం భాగ్యనగరంలో స్థలం ఎక్కడ కొనాలి? ఎక్కడ కొనుగోలు చేస్తే విలువ పెరుగుతుంది? సొంతిల్లు ఎక్కడ కొంటే ఆఫీసుకు వెళ్లేందుకు సౌకర్యంగా ఉంటుంది? అసలు అందుబాటు ఇళ్లు ఎక్కడ దొరుకుతాయి? వీటన్నింటికీ ఒకటే సమాధానం మౌలిక సదుపాయాలున్న చోటే! అంటే రోడ్లు, మంచి నీరు, విద్యుత్ వంటి మౌలిక వసతుల ప్రాజెక్ట్లకు ప్రాధాన్యమిస్తే చుట్టుపక్కల భూములకు విలువ పెరగడంతో పాటూ మెరుగైన రవాణాతో శివార్లకు అనుసంధానం పెరిగి సొంతింటికి చేరువవుతారు. సాక్షి, హైదరాబాద్: నగరంలో కొత్తగా ప్రాజెక్ట్ వస్తుందంటే చాలు అందరి దృష్టి అటువైపే ఉంటుంది. స్థిరాస్తి రంగం వృద్ధికి ఇదే ఇంధనం. ప్రభుత్వం కావొచ్చు, ప్రైవేట్ ప్రాజెక్ట్ కావొచ్చు ఏదైనా డెవలపర్లు అందిపుచ్చుకోవటంలో ముందుంటారు. వీరి మాటలు విశ్వసించి కొనుగోలు చేసినవారిలో లాభపడిన వారు, నష్టపోయిన వారూ కనిపిస్తారు. అన్ని మౌలిక వసతుల ప్రాజెక్ట్లు స్థిరాస్తిపై ఒకే తరహా వృద్ధి ఉండదని గుర్తించాలని నిపుణుల సూచన. కొన్నిసార్లు కృత్రిమంగా డిమాండ్ సృష్టించి ధరలు పెంచి మోసం చేస్తారని ఇలాంటి వాటిపై అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఔటర్, మెట్రోలే బలం.. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం, మెట్రో రైలు, ఔటర్ రింగ్ రోడ్డు ఈ మూడు ప్రాజెక్ట్లే హైదరాబాద్ స్థిరాస్తి రంగానికి చోదక శక్తులు. సిటీ చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు కొన్ని కండ్లకోయ రూట్ మినహా పూర్తిగా అందుబాటులోకి వచ్చేసింది. పీవీ ఎక్స్ప్రెస్వేతో ఔటర్ రింగ్ రోడ్డు, విమానాశ్రయానికి సిటీ నుంచి అనుసంధానం పెరిగింది. ఇది కాకుండా ఈ ఏడాది మెట్రో రైలు కూడా అందుబాటులోకి రానుంది. హైదరాబాద్కు చోదకశక్తులైన ఈ ప్రాజెక్ట్ల పేర్లు చెప్పే దశాబ్దకాలంగా ఇళ్లు, స్థలాలు, విల్లాలు, కార్యాలయ స్థలాల క్రయవిక్రయాలు జరుగుతున్నాయి. మరో దశాబ్దం కూడా వీటి చుట్టూనే స్థిరాస్తి రంగ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని డెవలపర్లు అంటున్నారు. ⇒ కొత్త విమానాశ్రయం సహజంగా నగరం బయట ఏర్పాటు చేస్తుంటారు. శంషాబాద్ విమానాశ్రయం ప్రకటన మొదలు నిర్మాణం పూర్తయ్యే వరకూ ప్రతి ఏటా ఆయా ప్రాంతాల్లో స్థిరాస్తి ధరల్లో పెరుగుదల కనిపించింది. మొదట్లో కొన్నవారు లబ్ధిపొందారు కూడా. ప్రయాణికుల రాకపోకలు పెరగడంతో వాణిజ్య, కార్యాలయ స్థలాలకు కూడా గిరాకీ పెరిగింది. చుట్టూపక్కల ఎయిరో సెజ్లు ఉపాధి కేంద్రాలుగా ఉన్నాయి. ⇒ మెట్రో రైలు అభివృద్ధి చెందిన నగరం మధ్య నుంచి వెళుతుంది. ప్రస్తుతానికి రైలు పరుగులు పెట్టకముందే ఆయా కారిడార్లలో 5–10 కి.మీ. వరకు ధరల్లో పెరుగుదల కనిపిస్తుంది. ఒక్క కూత మొదలయ్యాక ప్రధాన మార్గానికి ఇరువైపులా 2 కి.మీ. వరకూ వాణిజ్య, కార్యాలయాల స్థలాలకు డిమాండ్ వస్తుంది. ⇒ ఔటర్ రింగ్ రోడ్డు ప్రకటనతో భూముల ధరలు పెరిగాయి. తక్కువ ధరలోనే స్థలాలను కొనుగోలు చేసిన వారు లబ్ధిపొందారు. ప్రభుత్వం కూడా ఔటర్ చుట్టూ శాటిలైట్ టౌన్షిప్పులను, మంచినీటి వసతులను ఏర్పాటు చేస్తోంది. దీంతో మున్నుందు అభివృద్ధి ఔటర్ చుట్టూనే ఉండనుంది. అందుకే తక్కువ ధరలో సొంతింటి కలను సాకారం చేసుకోవాలంటే ఓఆర్ఆర్ సరైన మార్గమని నిపుణులు సూచిస్తున్నారు. ఇప్పటికే పలు ఐటీ, ఐటీ ఆధారిత సంస్థలు, లాజిస్టిక్, ఈ–కామర్స్ సంస్థలు ఔటర్ రింగ్ రోడ్డును ఆధారం చేసుకొని కార్యకలాపాలను ప్రారంభించాయి. అంటే సమీప భవిష్యత్తులో అభివృద్ధికి ఓఆర్ఆర్ చిరునామాగా మారనుందన్నమాట. శివార్లే బెటర్ తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన పలు అభివృద్ధి ప్రాజెక్ట్లు నగరం చుట్టుపక్కల వస్తున్నాయి. అయితే అవి ఎక్కడొస్తున్నాయి. పూర్తయ్యే నాటికి ఎంత కాలం పడుతుంది? వంటి అంశాలను క్షుణ్నంగా పరిశీలించాకే స్థలం, ఫ్లాట్ల కొనుగోలు నిర్ణయాన్ని తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. లేకపోతే కష్టార్జితం బూడిదలో పోసిన పన్నీరవుతుంది మరి. ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ ఫార్మాసిటీ, ఫిల్మ్ సిటీ, నిమ్జ్ వంటి వేర్వేరు నగరాలు రానున్నాయి. ⇒ ఓఆర్ఆర్ లోపల పలు ప్రాంతాలను కలుపుతూ గ్రిడ్ రోడ్లు రాబోతున్నాయి. 100 అడుగుల రోడ్లు పలు ప్రాంతాల్లో వస్తున్నాయి. ⇒ రెండో దశలో మెట్రో రైలును శివారు ప్రాంతాలకు అనుసంధానించనున్నారు. -
నాలుగు రోజులు మిర్చి కొనుగోళ్లు బంద్
- హోలీ సందర్భంగా సెలవు ప్రకటించిన వ్యాపారులు కర్నూలు (వైఎస్ఆర్ సర్కిల్): కర్నూలు మిర్చి యార్డులో నాలుగు రోజుల పాటు మిర్చి కొనుగోళ్లు బంద్ కానున్నాయి. ఈమేరకు యార్డు కార్యదర్శి నారాయణమూర్తి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 11, 12, 13, 14 తేదీల్లో కొనుగోళ్లను నిలిపివేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. మిర్చి వ్యాపారలందరూ రాజస్థాన్తో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన వారు కావడం, హోలీ వేడుకల నిర్వహణ కోసం సొంతూళ్లకు వెళ్లడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. నాలుగు రోజుల పాటు అనుమతినివ్వాలని వ్యాపారులు కూడా వినతి పత్రం అందించడంతో కొనుగోళ్లు నిలిపివేస్తన్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ మేరకు యార్డు పరిధిలోని పలు గ్రామాలకు ఈ సమాచారం చేరవేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. -
కందుల కొనుగోలులో అంతులేని జాప్యం
– కర్నూలు, నందికొట్కూరులో మాత్రమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు –గిట్టుబాటు ధర లేక గగ్గోలు పెడుతున్నా స్పందించని వైనం కర్నూలు(అగ్రికల్చర్): కందుల ధరలు పడిపోయి రైతులు గగ్గోలు పెడుతున్నా అధికారులు కనికరించడం లేదు కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో మార్క్పెడ్ అధికారులు అంతులేని నిర్లక్ష్యాన్ని వహిస్తున్నారు. జిల్లాల్లో కర్నూలు, డోన్, ఎమ్మిగనూరు, పత్తికొండ, నందికొట్కూరు, బనగానపల్లె, ఆత్మకూరు, నంద్యాల మార్కెట్ యార్డుల్లో కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు. ఇంతవరకు కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసి కొనుగోలు ప్రారంభించారు. నందికొట్కూరులో కేంద్ర ఏర్పాటు చేసినా కొనుగోలు మొదలుపెట్టలేదు. మిగతా చోట ఆ ఊసే లేదు. దీంతో కొనుగోలు కేంద్రాలు లేక కంది రైతులు మద్దతు ధరకు దూరమ వుతున్నారు. కందులకు కేంద్ర ప్రభుత్వం క్వింటాల్కు బోనస్తో కలిపి రూ.5050 మద్దతు ధర ప్రకటించింది. అయితే, ప్రస్తుతం కర్నూలు వ్యవసాయ మార్కెట్లో నాణ్యమైన కందులకు సైతం లభిస్తున్న ధరం రూ.4000 నుంచి రూ. 4100 మాత్రమే. అంటే మద్దతు ధరలో రైతులు రూ.950 నుంచి 1100 వరకు నష్టపోతున్నారు.దీంతో మార్క్పెడ్ ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాల కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకుంటే రూ.5050 ధర లభిస్తుందని ఆశతో ఉన్నారు. 2015లో పండిన కందులు రైతుల దగ్గర, గోదాముల్లో భారీగా నిల్వఉన్నాయి. 2016లో కందిసాగు పెరిగినా దిగుబడులు రాలేదు. ఈ సమయంలో ధరలు పెరగాల్సి ఉన్నా 2015లో పండిన కందులు మార్కెట్లో భారీగా ఉండటంతో ధరలు పడిపోయాయి. రైతులు నష్టపోకుండా చూడాల్సిన జిల్లా యంత్రాంగం పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం: పరిమళ, జిల్లా మేనేజర్ మార్క్పెడ్ కందులను మద్దతు ధర, బోనస్తో కలిపి రూ.5050 ప్రకారం కొనుగోలు చేస్తున్నాం. ఇందుకు 8 కొనుగోలు కేంద్రాలు ఏర్పటు చేయనున్నాం. ముందుగా కర్నూలు, నందికొట్కూరు వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో ప్రారంభించి కొనుగోళ్లు చేపట్టాం. త్వరలోనే మిగిలిన చోట కేంద్రాలను ప్రారంభిస్తాం. -
కందుల కొనుగోలు కేంద్రం ప్రారంభం
కర్నూలు(అగ్రికల్చర్): ఎట్టకేలకు కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో కందుల కొనుగోలు కేంద్రం ప్రారంభమైంది. మార్క్పెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ కేంద్రాన్ని మార్కెట్ కమిటీ చైర్పర్సన్ శమంతకమణి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కందుల ధరలు పడిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, ఈ క్రమంలో వారిని ఆదుకునేందుకు మార్క్ఫెడ్ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. మార్క్పెడ్ మద్దతు, బోనస్తో కలిపి రూ.5050 ప్రకారం కొనుగోలు చేస్తుందని ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మార్క్పెడ్ జిల్లా మేనేజర్ పరిమల మాట్లాడుతూ... రైతులు కందులను తగిన నాణ్యతా ప్రమాణాలతో తీసుకవస్తే రూ.5050 ధర లభిస్తుందన్నారు. జిల్లాకు సంబంధించి త్వరలో మరో 7 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ కార్యదర్శి నారాయణమూర్తి, మార్క్ఫెడ్ అసిస్టెంట్ మేనేజర్ రాజు తదితరులు పాల్గొన్నారు. -
కందుల కొనుగోలుకు 8 కేంద్రాలు
- ఎంఎస్పీ, బోనస్ కలిపి రూ.5050 మద్దతు ధర కర్నూలు(అగ్రికల్చర్) : జిల్లా వ్యాప్తంగా రైతుల నుంచి కందులు కొనుగోలు చేసేందుకు 8 కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ హరికిరణ్ తెలిపారు. మంగళవారం సాక్షిలో కందులు..ఆశలు తలకిందులు శీర్షికతో ప్రచురించిన కథనానికి జేసీ స్పందించారు. వెంటనే మార్క్ఫెడ్ అధికారులతో కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై సమీక్షించారు. మార్కెట్లో కందుల ధర పడిపోవడంతో రైతులు నష్టపోకుండా ఉండేందుకు మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఎంఎస్పీ, బోనస్ కలిపి రూ.5050 కొనుగోలు చేస్తామని, రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. కర్నూలు, డోన్, ఎమ్మిగనూరు, పత్తికొండ, నందికొట్కూరు, బనగానిపల్లె, ఆత్మకూరు, నంద్యాల మార్కెట్ యార్డుల్లో కేంద్రాలను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఇతర వ్యర్థ పదార్థాలు 2 శాతం, ఇతర వ్యర్థ పంటల గింజలు 1 శాతం, దెబ్బతిన్న గింజలు 3, పగిలిన, విరిగిన గింజలు 3 శాతం, పురుగు పట్టిన గింజలు 3 శాతం, పూర్తిగా తయారుకాని గింజలు 3 శాతం, తేమ 12శాతం వరకు ఉండాలని వివరించారు. మరిన్ని వివరాలకు ఫోన్(08518–229110)లో సంప్రదించాలన్నారు. -
జిల్లాలో 4 వేరుశనగ కొనుగోలు కేంద్రాలు
- రూ.4220తో కొనుగోలుకు ఆయిల్ఫెడ్ సిద్ధం కర్నూలు(అగ్రికల్చర్): జిల్లాలో వేరుశనగ కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు. కేంద్రం క్వింటాలు కనీస మద్దతు ధరగా రూ.4220గా ప్రకటించింది. మార్కెట్లో చాల వరకు ఈ ధర కంటే తక్కువగా కొనుగోలు చేస్తున్నారు. ఈ నేపధ్యంలో జిల్లాలో నాలుగు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడానికి ఆయిల్ ఫెడ్ రంగం సిద్ధం చేసింది. నాఫెడ్ ఆధ్వర్యంలో ఆయిల్ఫశ్రీడ్ కొనుగోలు కేంద్రాలను నిర్వహిస్తుంది. వేరుశనగ సాగు ఎక్కువగా ఉన్న ఆదోని, డోన్, పత్తికొండ, ఎమ్మిగనూరు మార్కెట్ యార్డుల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు ఆయిల్ఫెడ్ జిల్లా ఇన్చార్జీ అంకిరెడ్డి తెలిపారు. కేంద్రాలను ఎప్పుడు ప్రారంభించేది ఒకటి, రెండు రోజుల్లోలో తెలియజేస్తామన్నారు. -
ఉల్లి రైతు కుదేలు
– మళీ్ల నిలిచిపోయిన ఉల్లి కొనుగోళ్లు – కనీసం రూ. 3 లక్షల నగదు లేక క్రయ, విక్రయాలు నిలుపుదల – మార్కెట్ బయటనే తక్కువ ధరలకు అమ్ముకుంటున్న రైతులు పెద్ద నోట్ల మార్పిడితో ఏర్పడిన నగదు సంక్షోభం నుంచి రైతులు బయటపడ లేకపోతున్నారు. ముఖ్యంగా ఉల్లి రైతుల పరిస్థితి దారుణంగా మారింది. రాష్ట్రంలో ఉల్లి పండే ఏకైక జిల్లా కర్నూలు మాత్రమే. క్రయ, విక్రయాలు కూడా కర్నూలు మార్కెట్లోని జరుగుతాయి. పెద్ద నోట్ల రద్దు ప్రకటించిన మరుసటి రోజు నుంచి మార్కెట్ బంద్ కావడంతో పంట ఉత్పత్తుల కొనుగోళ్లు నిలిచిపోయాయి. వారం రోజుల తర్వాత ఉల్లి కొనుగోళ్లు చేపట్టారు. అయితే కనీస అవసరాలకు సైతం డబ్బులు లేవని ఈ పరిస్థితుల్లో కొనుగోలు చేయలేమని సోమవారం వ్యాపారులు చేతులెత్తేశారు. దీంతో ఉల్లి రైతులు కష్టాలు మళ్లీ మొదటికి వచ్చాయి. - కర్నూలు(అగ్రికల్చర్) కర్నూలు మార్కెట్లో వ్యాపారులు కొనుగోలు చేసిన ఉల్లిని తరలించడానికి కనీస అవసరాలకు అవసరమైన నగదు ఇచ్చేందుకు బ్యాంకులు సహకరించకపోవడంతో లావాదేవీలు మళ్లీ నిలిచిపోయాయి. కొనుగోలు చేసిన ఉల్లిని తరలించేందుకు కనీసం దారి ఖర్చులకు కూడా డబ్బులు లేవంటూ కొనుగోలుదారులు ముందుకు రాలేదు. మరో వైపు మార్కెట్లోకి ఉల్లిని అనుమతించకపోవడంతో తిరిగి ఇంటికి తీసుకెళ్లలేక మార్కెట్ బయటనే అతి తక్కువ ధరలకు అమ్ముకొని వెళ్తున్నారు. వేరుశనగ, పత్తి, ప్రొద్దుతిరుగుడు, మొక్కజొన్న, ఆముదం తదితర పంటల కొనుగోళ్లు ఆలస్యం అయినప్పటికి నష్టం లేదనే ఉద్దేశంతో ప్రస్తుతానికి వీటి గురించి పట్టించుకోవడం లేదు. ఉల్లి పచ్చి సరకు కావడం, అదీ కూడా ఎక్కువ రోజులు నిల్వ ఉందేది కాకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఉల్లి రైతుల ఇబ్బందులు తీర్చాలని మార్కెట్ కమిటీ చైర్మన్ శమంతకమణి ప్రయత్నిస్తున్నప్పటకి బ్యాంకర్లు సహకరించకపోవడంతో ఉల్లి క్రయ, విక్రయాలు అనిశ్చితిలో పడ్డాయి. జిల్లాలో 12 మార్కెట్ కమిటీలు ఉండగా కేవలం కర్నూలు, ఆదోని, ఎమ్మిగనూరు మార్కెట్ల్లో మాత్రమే వ్యవసాయ ఉత్పత్తుల క్రయ, విక్రయాలు జరుగుతున్నాయి. నగదు కొరత కారణంగా పెద్ద నోట్లు రద్దు అయిప్పటి నుంచి మార్కెట్లో క్రయవిక్రయాలు నిలిచిపోవడంతో రైతులు ఆర్థి«క సంక్షోభంలో చిక్కుకున్నారు. కనీసం రోజుకు మూడు లక్షలు ఇస్తే. నగదు కొరతతో ప్రభుత్వం ఎలక్ట్రానిక్స్ లావాదేవీలు చేపట్టాలను భావిస్తోంది. ఇందుకు ఉల్లి కొనుగోలు దారులు అనుకూలంగానే ఉన్నారు. రైతులు డబ్బులు ఆలస్యంగా ఇచ్చినా ఉంటామని స్పష్టం చేస్తున్నారు. అయితే కనీస అవసరాలకు డబ్బులు లేకపోవడం సమస్యను జటిలమవుతోంది. కర్నూలు ఉల్లి 80 శాతం వరకు కోల్కతకు ఎగుమతి చేస్తారు. మిగిలినది దేశంలోని వివిధ ప్రాంతాలకు తరలిస్తారు. డీజిల్, బాడుగలు చెక్ల ద్వారా ఇస్తున్నా లారీలు కర్నూలు నుంచి గమ్యం చేరుకోవాలంటే ఖర్చులకు ఒక్కో లారీకి రూ.10వేల అవసరం అవుతాయి. కర్నూలు నుంచి రోజుకు 30 లారీలు పోతున్నందున రోజుకు రూ.3 లక్షలు బ్యాంకుల ద్వారా సమకూరిస్తే కొనుగోళ్లు చేపడుదామని కొనుగోలు దారులు పేర్కొంటున్నారు. కాని ఇందుకు బ్యాంకర్లు సహకరించడం లేదు. ఇపుడున్న పరిస్థితుల్లో ఆర్బీఐ నిబంధనల మేరకు మాత్రమే నగదు ఇస్తామని అదనపు మొత్తం ఇవ్వలేమంటూ స్పష్టం చేస్తున్నారు. దీంతో ఉల్లి కొనుగోళ్ల వ్యవహారం ఆగమ్యగోచరంగా మారింది. నగదు సంక్షోభం రైతులకు నష్టాలను మిగిలుస్తోంది. అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం: శమంతకమణి, కర్నూలు మార్కెట్ కమిటీ చైర్మన్ ఉల్లి రైతులు నష్టపోకుండా కొనుగోళ్లు చేపట్టేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. లారీ డ్రైవర్ల దారి ఖర్చులకు రోజు రూ. 3 లక్షలు అవసరమని కోరుతున్నా బ్యాంకర్లు సహకరించడం లేదు. అదీ కూడా 100 నోట్లు అంతకంటే తక్కువ విలువ నోట్లే కావాలని అడుగుతున్నారు. ఉల్లి రైతులు నష్టపోకుండా సహకరించాలని బ్యాంకులను కోరుతున్నా స్పందనలేదు. నిబంధనలకు అనుగుణంగా ఇస్తామని అంతకంటే ఏమీ చేయలేమని చెబుతున్నారు. నగదు కొరతతో ఉల్లి రైతులు సష్టపోతున్న విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తాను. -
నిలిచిన ఉల్లి కొనుగోళ్లు
రైతుల ఆందోళన కర్నూలు(అగ్రికల్చర్): పెద్ద నోట్ల రద్దు వ్యవసాయ మార్కెట్ యార్డులపై తీవ్ర ప్రభావం చూపింది. కరెన్సీ కొరత కారణంగా పంట ఉత్పత్తుల క్రయ, విక్రయాలు స్తంభించిపోయారు. కర్నూలు వ్యవసాయ మార్కెట్లో కొనుగోలు చేసే ఉల్లిని 80 శాతం వరకు కోల్కతకు తరలిస్తారు. ఇందుకు అడ్వాన్స్ల కింద 50 శాతం బాడుగలు చెల్లించాల్సి ఉంది. పెద్దనోట్లు ఉన్నా పనికిరాకపోవడం, బ్యాంకులు పనిచేయకపోవడం, ఏటీఎంలు మూతపడటంతో వ్యాపారులు బాడుగలు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో వ్యాపారులు ఉల్లి కొనుగోళ్లను పూర్తిగా నిలిపివేశారు. దీంతో రైతులు బుధవారం సాయంత్రం రోడ్డెక్కారు. తక్షణం ఉల్లి కొనుగోళ్లు చేపట్టాలంటూ ఆందోళన చేపట్టారు. మార్కెట్ కమిటీ కార్యాలయం ఎదుట అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సమస్య తీవ్రం కావడంతో పోలీసులు జోక్యం చేసుకొని మార్కెట్ కమిటీ అధికారులు, వ్యాపారులు, లారీ ఓనర్ల అసోషియేషన్ ప్రతినిధులతో చర్చలు జరిపారు. గురువారం ఉల్లి వేలంపాట నిర్వహించాల్సిందేనని రైతులు మార్కెట్ కమిటీపై ఒత్తిడి పెంచారు. ఎన్నిరోజులుండాలి: పాపన్న, ఉల్చాల, కర్నూలు మండలం మూడు రోజుల క్రితం 37 ప్యాకెట్ల ఉల్లిని తీసుకొని మార్కెట్కు వచ్చాం. వ్యాపారులు కొనుగోలు చేయలేదు. ఈ రోజు కొనుగోలు చేయాల్సి ఉండగా పెద్ద నోట్లు చెల్లుబాటు కావడం లేదని చెప్పారు. ఈ కారణంతో ఉల్లి కొనుగోళ్లు బంద్ చేస్తే మా పరిస్థితి ఏమిటి, ఎన్నాళ్లు మార్కెట్లో ఉండాలి? -
ఉల్లి కొనుగోళ్లలో అక్రమాలను సహించం
కర్నూలు(అగ్రికల్చర్): ఉల్లి కొనుగోళ్లలో ఎలాంటి అక్రమాలను సహించేది లేదని జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ అన్నారు. శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో కమీషన్ ఏజెంట్ల అసోసియేషన్ ప్రతినిధులు, ఉల్లి వ్యాపారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ...ఉల్లి ధరలు పడిపోవడంతో రైతులకు న్యాయం జరిగే విధంగా మద్దతు ధర రూ.600 నిర్ణయించామన్నారు. ఈ నేపధ్యంలో ఎలాంటి అక్రమాలకు తావు ఉండరాదని అర్హులయిన ప్రతి రైతుకు తగిన మద్దతు లభించాలన్నారు. ఉల్లి నాణ్యత, గ్రేడింగ్ను బట్టి వేలంపాటలో ధర నిర్ణయించాలని సూచించారు.మద్దతు ధర కేవలం కర్నూలు జిల్లా రైతులకు మాత్రమేనని స్పష్టం చేశారు. ఉల్లి కొనుగోళ్లలో కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఏ రోజు కొన్ని ఉల్లిని అదే రోజు బయటికి తరలించాలన్నారు. సమావేశంలో ఏడీఎం సత్యనారాయణచౌదరి, మార్కెట్ కమిటీ సెక్రటరీ నారాయణమూర్తి, కమీషన్ ఏజెంట్ల సంఘం ప్రతినిధులు పల్లె శ్రీనివాసులురెడ్డి, కట్టా శేఖర్, శేఖర్ రెడ్డి, కేశవరెడ్డి, ఉల్లి వ్యాపారులు ప్రసన్న, సంజీవయ్య, గోకారి తదితరులు పాల్గొన్నారు. -
టూ వీలర్ కొంటే హెల్మెట్ ఫ్రీ..!
కేరళ: ద్విచక్ర వాహనం నడిపేప్పుడు హెల్మెట్ పెట్టుకోవాలన్న నిబంధన దాదాపు అన్ని రాష్ట్రాల్లో తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. రూల్స్ అధిగమించేవారికి, నిర్లక్ష్యంగా వ్యవహరించినవారికి జరిమానాలు విధించడం, ఆర్టీఏ వెబ్ సైట్లో చలాన్లు పంపించడం చేస్తున్నారు. దీంతో ఇంతకు ముందు హెల్మెట్ లేని వారు కూడా ఇప్పుడు కొనాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదే విషయాన్ని దృష్టిలో పెట్టుకొన్న కేరళ రవాణా, రోడ్ సేఫ్టీ కమిషనర్ టామిన్ జె థచంకరీ నూతన దిశా నిర్దేశాలను అమల్లోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేపట్టారు. ఏప్రిల్ ఒకటి నుంచి కొత్తగా ద్విచక్రవాహనాలు కొనుగోలు చేసిన వారికి ఉచితంగా ఐఎస్ఐ మార్క్ హెల్మెట్ ను బహూకరించేందుకు కేరళ ప్రభుత్వం సన్నాహాలు చేసింది. దీంతోపాటు వాహనానికి కావలసిన నెంబర్ ప్లేట్, అద్దాలు, శారీ గార్డ్, వంటి కొన్ని ఉపకరణాలను ఉచితంగా అందించేందుకు ఏర్పాట్లు చేశారు. కేరళలోని సుమారు 50 మోటార్ సైకిల్ తయారీదారులతో సమావేశం నిర్వహించిన అనంతరం మార్చి 29న ఈ నూతన నిర్ణయాన్ని తీసుకున్నట్లు అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. ఉపకరణాలకు కొనుగోలుదారుల వద్ద ఎటువంటి డబ్బు వసూలు చేయకూడదని సమావేశంలో నిర్ణయించారు. అయితే ఇలా హెల్మెట్ ఉచితంగా పంపిణీ చేసిన తర్వాత కూడా నిబంధనలు ఉల్లంఘిస్తే భారీగా జరిమానాలు విధించటంతో పాటు, లైసెన్సులను సైతం రద్దు చేసేందుకు కేరళ సర్కార్ రంగం సిద్ధం చేస్తోంది. అధికారిక గణాంకాల ప్రకారం కేరళలో గతేడాది 20,000 లకు పైగా ప్రమాదాలు చోటు చేసుకోవడం, ముఖ్యంగా రాష్ట్ర రాజధానిలో ప్రమాదాల సంఖ్య ఎక్కువగా ఉండటంతో ఈ తాజా నిర్ణయాన్ని తీసుకుంది. -
కెల్టన్ చేతికి బోకన్యి సంస్థ..!
హైదరాబాద్: అమెరికాకు చెందిన క్లౌడ్, ఎనలిటిక్స్ సర్వీసెస్ సంస్థ. బోకన్యి కంపెనీని హైదరాబాద్కు చెందిన కెల్టన్ టెక్నాలజీస్ కొనుగోలు చేసింది. ఈ కంపెనీ కొనుగోలుకు కావలసిన నిధులను అంతర్గత వనరుల ద్వారా సమకూర్చుకున్నట్లు కెల్టన్ టెక్నాలజీస్ ఒక ప్రకటనలో తెలిపింది. ఇటీవలే పదవ వార్షికోత్సవం జరుపుకున్న బోకన్యి... గత ఏడాది 80 లక్షల డాలర్ల ఆదాయాన్ని ఆర్జించిందని కంపెనీ చైర్మన్ నిరంజన్ చింతమ్ పేర్కొన్నారు. తాము ఐఎస్ఎంఏసీ(ఇంటర్నెట్ ఆఫ్ ధింగ్స్, సోషల్, మొబైల్, ఎనలిటిక్స్, క్లౌడ్) అంశాలపై ప్రధానంగా దృష్టి సారిస్తున్నామనేది బోకన్యి కంపెనీ కొనుగోలు సూచిస్తోందని తెలిపారు. బోకన్యి కంపెనీ కొనుగోలుతో ఈ అంశాల్లో తాము మరింత శక్తివంతం అవుతామని చెప్పారు.