Rashmika Mandanna
-
రష్మిక వ్యాఖ్యలపై కన్నడ వాసుల ఆగ్రహం..
-
Chhaava OTT Release : ఓటీటీలోకి ‘ఛావా’.. ఎప్పుడు, ఎక్కడ?
ఛావా(Chhaava )..ప్రస్తుతం బాలీవుడ్ బాక్సాఫీస్ని షేక్ చేస్తుంది. విక్కీ కౌశల్, రష్మిక(Rashmika Mandanna) జంటగా నటించిన ఈ చిత్రం ఫిబ్రవరి 14న థియేటర్స్లో రిలీజై హిట్ టాక్తో దూసుకెళ్తోంది. ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ జీవిత కథ ఆధారంగా లక్ష్మణ్ ఉటేకర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. శంభాజీ పాత్రలో విక్కీ కౌశల్, ఆయన భార్య ఏసుబాయిగా రష్మిక నటించి మెప్పించారు. దాదాపు రూ.130 కోట్లతో తెరకెక్కిన ఈ మూవీ ఫస్ట్ రోజే మంచి కలెక్షన్లు రాబట్టింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం రూ.31 కోట్లు ఓపెనింగ్స్ని రాబట్టింది. ఈ ఏడాదిలో బాలీవుడ్లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్(రూ.31 కోట్లు) సొంతం చేసుకున్న చిత్రంగా ఛావా నిలిచింది. అంతేకాదు విక్కీ కౌశల్ కెరీర్లోనే తొలి రోజు అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా ఛావా రికార్డుకెక్కింది. ఈ మూవీ సూపర్ హిట్ టాక్ సంపాదించుకోవడంతో ఓటీటీ రిలీజ్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.భారీ ధరకు ఓటీటీ రైట్స్ఛావా చిత్రంపై మొదటి నుంచి మంచి అంచనాలే ఉన్నాయి. ట్రైలర్ రిలీజ్ తర్వాత ఆ అంచనాలు మరింత పెరిగాయి. సినిమాకు ఉన్న డిమాండ్ దృష్టిలో పెట్టుకొని డిజిటల్ రైట్స్ని భారీ ధరకే కొనుగోలు చేసిందట ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్. యావరేజ్ టాక్ వస్తే నెల రోజుల్లో ఓటీటీలో రిలీజ్ చేయాలనుకున్నారట. కానీ ఊహించని విధంగా భారీ హిట్ టాక్ రావడంతో ఓటీటీ రిలీజ్ని పోస్ట్పోన్ చేసినట్లు తెలుస్తోంది. దాదాపు ఎనిమిది వారాల తర్వాత ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉందని బాలీవుడ్ మీడియా పేర్కొంది. అంటే ఏప్రిల్ మూడో వారంలో ఈ సినిమా ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉంది.ఛావా కథేంటంటే..ఛత్రపతి శివాజీ మరణం మరాఠా సామ్రాజ్యంపై మొగల్ చక్రవర్తి ఔరంగజేబు (అక్షయ్ ఖన్నా) కన్నేస్తాడు. వారిని ఎదుర్కొని తన రాజ్యాన్ని కాపాడుకునేందుకు రంగంలోకి దిగుతాడు శంభాజీ మహారాజ్(విక్కీ కౌశల్). ఈ విషయం ఔరంగజేబుకు తెలిసి తానే స్వయంగా సైన్యంతో యుద్ధానికి బయల్దేరుతాడు. శక్తిమంతమైన మొగల్ సేనను శంభాజీ ఎలా ఎదుర్కొన్నాడు? ఈ క్రమంలో అతడికి ఎదురైన పరిస్థితులు ఏంటి? ఈ యుద్దంలో సంభాజీకి ఆయన సతీమణి మహారాణి ఏసుభాయి(రష్మిక) ఎలాంటి నైతిక మద్దతు ఇచ్చారు? చివరకు మొఘల్ అహంకారాన్ని తన పోరాటంతో ఎలా అణచివేశాడు? అనేది ఈ సినిమా కథ. -
అభిమానుల ఆగ్రహానికి గురైన రష్మిక .. అంతా ఆ కామెంట్స్ వల్లే..! (ఫోటోలు)
-
వాటితో జీవితానికి ఎలాంటి ఉపయోగం లేదు: రష్మిక ఆసక్తికర కామెంట్స్
వరుస సక్సెస్లతో దూసుకెళ్తున్న బ్యూటీ, నేషనల్ క్రష్ నటి రషి్మక మందన్నా. మాతృభాష అయిన కన్నడ చిత్రపరిశ్రమలో కథానాయకిగా పరిచయమైంది. ఆ తర్వాత మలయాళం, తెలుగు, తమిళం, హిందీ భాషల్లో నటించే స్థాయికి చేరుకున్నారు. ఇటీవల ఈమె తెలుగులో అల్లు అర్జున్ ఫ్యాషన్ నటించిన పుష్ప– 2 చిత్రం ప్రపంచవ్యాప్తంగా రికార్డులను బద్దలు కొట్టిన విషయం తెలిసిందే. ఆ చిత్రంలో అందం, అభినయంతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది.అయితే ఇటీవల హిందీలో గుడ్ బై అనే చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన రష్మిక మందన్నా ఆ చిత్రం నుంచి ఆశించిన విజయాన్ని సాధించకపోయినా.. అక్కడ వరుసగా అవకాశాలు మాత్ర వస్తూనే ఉన్నాయి. ఆ తర్వాత నటించిన యానిమల్ చిత్రం ఈ కన్నడ బ్యూటీని నేషనల్ క్రష్గా మార్చింది. తాజాగా విక్కీ కౌశల్తో సరసన ఛావా అనే చిత్రంలో నటించారు. ఈ చిత్రం ప్రేమికుల రోజు సందర్భంగా శుక్రవారం తెరపైకి వచ్చింది. మొదటి రోజే ఈ సినిమా సక్సెస్ ఫుల్ టాక్ తెచ్చుకుంది.ఇందులో నటి రష్మిక మహారాణి పాత్రలో తన సత్తాను చాటారు. ఈ సందర్భంగా నేషనల్ క్రష్ వంటి బిరుదులు జీవితంలో ఏ విధంగానూ ఉపకరించవని పేర్కొన్నారు. దీని గురించి రష్మిక ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సినిమాల్లో లభించే బిరుదులు , పేర్లు జీవితంలో ఉపయోగపడవు అన్నారు. అవీ అభిమానుల ఆదరాభిమానాలతో వచ్చేవి అన్నారు. అందుకే అవి కూడా పేర్లు మాత్రమేనని పేర్కొన్నారు.అయితే తన మంచిని కోరేవారిని తాను గుండెల్లో పెట్టుకున్నారని, అందుకే అభిమానులు ఆదరించే చిత్రాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అభిమానుల ప్రేమనే ప్రధానంగా భావిస్తానన్నారు. వారి కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నానన్నారు. ఇప్పుడు దక్షిణాది ఉత్తరాది చిత్రాలకు సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొనడం శ్రమగా మారిందన్నారు. అదే సమయంలో అభిమానుల ప్రేమ కోసం తాను తన నిద్రకే గుడ్ బై చెబుతున్నానని నటి రష్మిక మందన్నా. -
నేషనల్ క్రష్మికా
భాష ఏదైనా; ప్రాంతం ఏదైనా; తన ఎంట్రీతో రికార్డులన్నీ క్రాష్ చేసేస్తున్న నటి, సోషల్ మీడియాలో ఎప్పుడూ ట్రెండింగ్లో ఉండే బ్యూటీ; నేషనల్ (National Crush) క్రష్ రష్మికా మందన్న(Rashmika Mandanna) గురించిన కొన్ని విషయాలు.⇒ రష్మిక పుట్టింది కర్ణాటకలోని కొడగు జిల్లా. బెంగళూరులోని ఎం.ఎస్.రామయ్య కళాశాలలో సైకాలజీ, జర్నలిజంలో డిగ్రీ పూర్తి చేసింది. కాలేజీ రోజుల్లో జరిగిన అందాల పోటీలు రష్మికను సినీ ప్రపంచంవైపు నడిచేలా చేశాయి.⇒ కన్నడ చిత్రం ‘కిరాక్ పార్టీ’తో సినీ ప్రయాణం మొదలుపెట్టింది. తెలుగులో ‘ఛలో’ సినిమాతో పలకరించి, ‘గీతగోవిందం’, ‘డియర్ కామ్రేడ్’,‘సరిలేరు నీకెవ్వరు’ వంటి సినిమాల్లో నటించి, వరుస విజయాలు అందుకుంది.⇒ ‘పుష్ప: దిరైజ్’.. రష్మికకు దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిపెట్టింది. ఇందులో శ్రీవల్లిగా తను కనబరచిన నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ‘గుడ్ బై’, ‘మిషన్ మజ్ను’, ‘యానిమల్’ వంటి బాలీవుడ్ చిత్రాల్లోనూ నటించింది. తాజాగా విక్కీ కౌశల్తో కలిసి ‘ఛావా’ అంటూ సందడి చేయనుంది.⇒ జపానీస్ వెబ్ సిరీస్ ‘నరుటో’కు రష్మిక వీరాభిమాని. అంతేకాదు, జపనీస్ ఫ్యాషన్ బ్రాండ్ ‘ఒనిట్సుకా టైగర్’కు ఆమె బ్రాండ్ అంబాసిడర్గా కూడా వ్యవహరించింది.⇒ రష్మికకు అన్నింటికంటే ఆనందాన్నిచ్చే ప్రదేశం తన ఇల్లు. సినీ స్టార్గా ఎంతోమంది ప్రేమాభిమానాలు పొందినప్పటికీ ఒక కుమార్తె, సోదరి, భాగస్వామిగా తన జీవితాన్ని గౌరవిస్తుంది. ⇒ గోరువెచ్చని కొబ్బరి నూనెను ముఖానికి, తలకు పట్టించి చక్కగా మర్దన చేసుకోవటమే రష్మిక సౌందర్య రహస్యం. ఆరోగ్యకరమైన ఆమె జుట్టుకు, చర్మసౌందర్యానికి అదే కారణం.⇒ కళ్లు మన మనసుకు ప్రతిబింబాలు. కళ్లతో పలికించే హావభావాలను నేను నమ్ముతాను. నవ్వుతూ ఉండే వ్యక్తులు, ఎదుటివారిని గౌరవించే వారంటే నాకు ఇష్టం. – రష్మికా మందన్న. -
నోరు జారిన రష్మిక.. ఫైర్ అవుతున్న కన్నడ ప్రజలు!
నేషనల్ క్రష్ రష్మిక(Rashmika Mandanna)పై కర్ణాటక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పుట్టిన ఊరిని మర్చిపోయావంటూ ఆమెపై మండిపడుతున్నారు. దీనికి కారణం ‘ఛావా’(Chhaava) ప్రమోషన్స్ ఈవెంట్లో రష్మిక చేసేన వ్యాఖ్యలే. విక్కీ కౌశల్, రష్మిక జంటగా నటించిన హిందీ చిత్రం ‘ఛావా’. ఈ మూవీ ఈ నెల 14న విడుదలై హిట్ టాక్తో దూసుకెళ్తుంది. రిలీజ్కి ముందు ముంబైలో జరిగిన ఓ ఈవెంట్లో రష్మిక పాల్గొంది. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. తాను హైదరాబాద్ నుంచి వచ్చానని చెప్పింది. ఈ వ్యాఖ్యలు కర్ణాటకలో చర్చకు దారీ తీశాయి. పుట్టిన ప్రాంతం(కర్ణాటక) పేరు చెప్పడానికి రష్మికకు వచ్చిన సమస్య ఏంటంటూ కన్నడ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. (చదవండి: బాక్సాఫీస్పై ‘ఛావా’ దండయాత్ర.. బిగ్గెస్ట్ ఓపెనింగ్స్, ఎన్ని కోట్లంటే..?)కర్ణాటకలోని కొడగు జిలా విరాజ్ పేట రష్మిక జన్మస్థలం. కిరిక్ పార్టీ అనే కన్నడ సినిమాతో ఆమె చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. ‘ఛలో’తో తెలుగులోకి అడుగుపెట్టింది. గీత గోవిందం సినిమాలో సూపర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత టాలీవుడ్లో వరస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ లిస్ట్లోకి చేరిపోయింది. పుష్ప చిత్రంతో నేషనల్ క్రష్గా మారింది.(చదవండి: తమన్కి ఖరీదైన కారుని గిఫ్ట్గా ఇచ్చిన బాలయ్య.. ధర ఎంతంటే?)అయితే ఛావా ప్రమోషనల్ ఈవెంట్లో తన సొంతూరు హైదరాబాద్ అన్నట్లుగా మాట్లాడడంతో కన్నడ ఫ్యాన్స్ తీవ్రంగా హర్ట్ అయ్యారు. సోషల్ మీడియా వేదికగా తమ అసంతృప్తిని తెలియజేస్తూ రష్మికను ట్రోల్ చేస్తున్నారు. వరుస హిట్లు వచ్చే సరికి సొంతూరును మర్చిపోవడం సరైన పద్దతి కాదంటూ ట్వీట్స్ చేస్తున్నారు. కాగా, గతంలోనూ రష్మికపై ఇలాంటి ట్రోలింగే జరిగింది. పుష్ప రిలీజ్ సమయంలో తన తొలి సినిమా కిరిక్ పార్టీ నిర్మాణ సంస్థ పేరును చెప్పకుండా...‘పేపర్లో వచ్చిన తన ఫొటో చూసి ఓ నిర్మాణసంస్థ తనకు హీరోయిన్గా అవకాశం ఇచ్చింది’ అని రష్మిక చెప్పడంతో నెటిజన్స్ ఫుల్ ఫైర్ అయ్యారు. అవకాశం ఇచ్చిన నిర్మాణ సంస్థ పేరు చెప్పడానికి కూడా ఇష్టపడడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రష్మిక నటించిన సినిమాలను బ్యాన్ చేయాలంటూ అప్పట్లో ట్వీట్స్ చేశారు. మళ్లీ చాలా రోజుల తర్వాత రష్మిక ట్రోలింగ్కి గురైంది. దీనికి ఈ నేషనల్ క్రష్ ఎలా స్పందిస్తుందో చూడాలి. '@iamRashmika, I sometimes feel pity for you for receiving unnecessary negativity/targeting from our fellow Kannadigas. But when you make statements like this I think they are right and you deserve the backlash.👍#Kannada #Chaava #RashmikaMandanna pic.twitter.com/RBY7RcpHgP— Virat👑Rocky✨️ (@Virat_Rocky18) February 14, 2025 -
ఇయర్ ఎండ్ కు గీతగోవిందం మ్యారేజ్?
-
బాక్సాఫీస్పై ‘ఛావా’ దండయాత్ర.. బిగ్గెస్ట్ ఓపెనింగ్స్!
విక్కీ కౌశల్(Vicky Kaushal), రష్మిక ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘ఛావా’(Chhaava Movie). మరాఠా రాజు ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవిత కథతో తెరకెక్కిన ఈ చిత్రం ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చి..తొలి రోజే హిట్ టాక్కి అందుకుంది. విక్కీ యాక్టింగ్తో పాటు దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ మేకింగ్పై ప్రశంసలు కురిపిస్తున్నారు. చాలా అద్భుతంగా తీశారని సినిమా చూసిన ప్రేక్షకులు చెబుతున్నారు. పాజిటివ్ టాక్ రావడంతో తొలి రోజే ఈ చిత్రం రికార్డు స్థాయిలో కలెక్షన్స్ని రాబట్టింది. మొదటి రోజు ఈ చిత్రం దాదాపు రూ.31 కోట్లు వసూలు చేసిందని ట్రేడ్ వర్గాల అంచనా వేశాయి. ఈ ఏడాదిలో బాలీవుడ్లో ఇదే బిగ్గెస్ట్ ఓపెనింగ్. విక్కీ కౌశల్ కెరీర్లోనే ఈ స్థాయి ఓపెనింగ్స్ రాబట్టిన తొలి చిత్రంగా ‘ఛావా’ నిలిచింది. గతంలో విక్కీ నటించిన సినిమాలలో తొలి రోజు అత్యధికంగా బాడ్ న్యూజ్(2024) రూ.8.62 కోట్లు, సామ్ బహదూర్ రూ.5.75 కోట్లు, జరా హాట్కే జరా బచ్కే రూ.5.49 కోట్లు సాధించాయి. ఛావా సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో వీకెండ్లో కలెక్షన్స్ భారీగా పెరిగే చాన్స్ ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.విక్కీపై ప్రశంసలు..‘ఛావా’విజయంలో విక్కీ కౌశల్ కీలక పాత్ర పోషించాడు. శంభాజీగా విక్కీ కౌశల్ను తప్ప మరొకరిని ఊహించుకోలేని విధంగా నటించాడని పలు వెబ్సైట్స్ తమ రివ్యూలో తెలిపాయి. వార్ యాక్షన్స్ అదరగొట్టేశాడట. క్లైమాక్స్ ఫైట్ సీన్లో వీక్కీ రుద్ర తాండవం చేశాడని చెబుతున్నారు. శంభాజీ భార్య ఏసుబాయిగా రష్మిక కూడా తనదైన నటనతో ఆకట్టుకుంది. ఉటేకర్ ఎంచుకున్న పాయింట్లో గొప్ప కథ, ఊహించని ట్విస్ట్లు లేకపోయినా శంభాజీ పాత్ర, యాక్షన్ సీక్వెన్స్ సినిమాను నిలబెట్టాయి. -
'ఛావా' ట్విటర్ రివ్యూ.. టాక్ ఎలా ఉందంటే?
విక్కీ కౌశల్, రష్మిక మందన్నా (Rashmika Mandanna) ప్రధాన పాత్రల్లో నటించిన చారిత్రాత్మక చిత్రం ఛావా (Chhaava Movie). ఛత్రపతి శివాజీ మహారాజ్ తనయుడు శంభాజీ మహారాజ్ (Chhatrapati Sambhaji Maharaj) జీవితం ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది. లక్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విక్కీ శంభాజీ మహారాజ్గా, అతడి భార్య మహారాణి ఏసుబాయిగా రష్మికా మందన్నా నటించారు.భారీ బడ్జెట్తో దినేష్ విజన్ నిర్మించిన ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. వాలంటైన్స్ డే (ఫిబ్రవరి 14) సందర్భంగా శుక్రవారం ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. మరి సినిమాకు వస్తున్న స్పందన ఏంటో తెలియాలంటే ఎక్స్ (ట్విటర్) రివ్యూ చూసేయండి..'విక్కీ కౌశల్.. గొప్ప నటుడు అని ఛావాతో మరోసారి నిరూపించుకున్నాడు. ప్రతి ఫ్రేమ్ అదిరిపోయింది. ఛత్రపతి శంభాజీ మహారాజ్కు ఈ సినిమా ఒక నివాళి' అని ఒక నెటిజన్ పేర్కొన్నాడు.#ChhaavaInCinemasEvery frame & every tear is a tribute to the #ChhatrapatiSambhajiMaharaj 🔥Every Hindu should watch #Chhaava#VickyKaushal has proven he is one of the best Actor in Bollywood, way ahead of Khans pic.twitter.com/D0SOlTQHMN— Hemir Desai (@hemirdesai) February 14, 2025 ఛావా చాలా బాగుంది. క్లైమాక్స్లో ఫుల్ ఎమోషనల్ అయ్యా అని ఓ తెలుగు యూజర్ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.#chhaava movie chala bagundi 🔥Full Emotional ayya climax lo 🥺😔Jai Sambhu Raje 🚩— 𝐒𝐫𝐢𝐤𝐚𝐧𝐭𝐡 𝐏𝐒𝐏𝐊™🚩 (@Srikanth_OG) February 14, 2025నిజమైన సూపర్ హీరో ఎవరనేది ప్రపంచానికి చూపించిన లక్ష్మణ్ ఉటేకర్ సర్కు ధన్యవాదాలు. పాత్రకు ప్రాణం పోసిన విక్కీ కౌశల్కు థాంక్స్. షేర్ శంభాజీ మన మనసులో ఎప్పటికీ నిలిచి ఉంటాడు అని మరో యూజర్ పేర్కొన్నాడు.Thank you Laxman Utekar sir✨You showed world about the real superhero.Thank you @vickykaushal09 for the justice to the role.Sher sambhaji lives on✨ #Jagdamb💖#Chhaava #ChhatrapatiSambhajiMaharaj— Manifest For Good 💫 (@SHUBHAMGAIKAR14) February 14, 2025 Kindness & valour were Chhatrapati Sambhaji Maharaj's strongest virtues. #VickyKaushal knew all that & more thus raising the bar once more with precision & accuracy. To see this guy mould into something which only could’ve read & heard about is beyond awards & ratings.#Chhaava pic.twitter.com/De7eQ5JuEo— Amar Singh Rathore (@amarsr_1990) February 14, 2025Real Bollywood magic!Vicky Kaushal's performance is mind-blowing, giving pure goosebumps. Housefull at 5:45 AM show🎥🔥#Chhaava #ChhaavaInCinemas #ChhaavaOn14Feb pic.twitter.com/mpRkGabPr0— Mr. Perfect (@DS24IN) February 14, 2025The film is good, but Vicky is EXCEPTIONAL!!! What a performance! The end will leave you numb. Took me a while to get up from my seat when the credits rolled. Please watch it in theatres! Phone, laptop, tv pe wo feel nahi ayegi. ⭐️⭐️⭐️⭐️ Detailed review soon! #Chhaava… pic.twitter.com/VZgZT5grpj— OCD Times (@ocdtimes) February 14, 2025#VickyKaushal shines in #Chhaava, but other actors are just okay. The film feels long, and the BGM doesn’t fit the era. Still, it’s decent. The last 20 minutes hit hard & stay with you. 💔 Highly recommend watching in theaters! 🎬🔥 #ChhaavaReview pic.twitter.com/TLEu3kxteP— Movies Talk Official (@moviestalkhindi) February 14, 2025My Final Verdict: Chhaava is a gripping, performance-driven historical drama that shines through its stellar cast. The second half takes the intensity to another level. Vicky Kaushal delivers a career-defining act while Akshaye Khanna as Aurangzeb is chillingly ruthless#Chhaava pic.twitter.com/pURGeZfBkf— Cinema Fable (@cinemafable1) February 14, 2025Chhaava is blockbuster 😊vicky is absolute charm born to play this role, rashmika brings best out of her, akshay khanna take a bow man , maddcok films is the top production house in india they should enter into south for sure. 🎶 & direction super #Chhaava #VickyKaushal pic.twitter.com/cYDbY4SbWI— @Politics& Popcorn 📖 (@Political_star1) February 14, 2025ChhaavaInCinemas #Chhaava Every frame & every tear is a tribute to the Maratha pride🫡💥#VickyKaushal fierce portrayal makes u feel his pain, power, & unbreakable will🙏🏻😍@iamRashmika is heartbeat of the story😍 Animal, Pushpa & now this. #Chhaava pic.twitter.com/AixrmULfw5— 🖤⃝ 𝐑𝐚𝐯𝐚𝐧😂🖤🫀 (@RavanDJ1210) February 14, 2025 -
‘చావా’ మూవీ ప్రీమీయర్ షోలో రష్మిక సందడి (ఫొటోలు)
-
'విజయ్ దేవరకొండ కింగ్డమ్ టీజర్'.. రష్మిక పోస్ట్ వైరల్!
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ ఫుల్ యాక్షన్ థ్రిల్లర్తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో వస్తోన్న ఈ సినిమాకు కింగ్డమ్ అనే టైటిల్ ఖరారు చేశారు. తాజాగా టైటిల్ రివీల్ చేయడంతో పాటు టీజర్ను కూడా మేకర్స్ విడుదల చేశారు. ఈ టీజర్కు టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ను అందించారు. ఈ మాస్ యాక్షన్ థ్రిల్లర్ రౌడీ హీరో అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.అయితే ఈ మూవీ టీజర్ విడుదలైన కొన్ని క్షణాల్లోనే నేషనల్ క్రష్ రష్మిక మందన్నా తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ మేరకు తన ఇన్స్టా స్టోరీస్లో కింగ్డమ్ టీజర్ పోస్టర్ను పంచుకుంది. 'ది మ్యాన్ కమ్స్ విత్ సమ్థింగ్ మెంటల్.. విజయ్ను చూస్తుంటే గర్వంగా ఉంది' అంటూ క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది. ఇది కాస్తా నెట్టింట వైరల్ కావడంతో అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.కొన్నేళ్లుగా డేటింగ్ రూమర్స్..టాలీవుడ్లో ఈ జంటపై కొన్నేళ్లుగా డేటింగ్ రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. గతంలో చాలాసార్లు వీరిద్దరు పెట్టిన పోస్టులతో ఫ్యాన్స్కు దొరికిపోయారు. గతేడాది దీపావళికి సైతం విజయ్ దేవరకొండ ఫ్యామిలీతో సెలబ్రేషన్స్ చేసుకుంది ముద్దుగుమ్మ. ఆ తర్వాత మరోసారి ఈ జంటపై రూమర్స్ వైరలయ్యాయి. తాజాగా కింగ్డమ్ టీజర్ను రష్మిక షేర్ చేయడంతో మరోసారి చర్చ మొదలైంది. కాగా.. వీరిద్దరు గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాల్లో జంటగా నటించారు. ప్రస్తుతం ఛావా మూవీతో ప్రేక్షకులను పలకరించనుంది రష్మిక. ఈ బాలీవుడ్ చిత్రంలో విక్కీ కౌశల్ సరసన హీరోయిన్గా కనిపించనుంది. -
నా హృదయంలో ప్రత్యేక స్థానం: రష్మికా మందన్నా
‘పుష్ప: ది రైజ్’, ‘పుష్ప 2: ది రూల్’ (‘Pushpa 2: The Rule) సినిమాల్లో శ్రీవల్లి పాత్రతో జాతీయ స్థాయిలో ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నారు రష్మికా మందన్నా(Rashmika Mandanna). అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వం వహించిన ‘పుష్ప: ది రైజ్’(2021), ‘పుష్ప 2: ది రూల్’(2024) సినిమాలు ఏ స్థాయిలో విజయం సాధించి, వసూళ్లతో పాటు రికార్డులు సాధించాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్లో ‘పుష్ప 2: ది రూల్’ థ్యాంక్స్ మీట్ ఘనంగా నిర్వహించారు మేకర్స్.అయితే జిమ్లో కాలికి తగిలిన గాయం కారణంగా విశ్రాంతి తీసుకుంటున్న రష్మిక ఈ థ్యాంక్స్ మీట్కు హాజరుకాలేకపోయారు. దీంతో చిత్రయూనిట్కి కృతజ్ఞతలు చెబుతూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు రష్మిక. ‘‘శనివారం జరిగిన ‘పుష్ప 2: ది రూల్’ థ్యాంక్స్ మీట్లో నేను పాల్గొనలేకపోయాను. కానీ, ఈ మూవీ గురించి కొన్ని విషయాలు పంచుకోవాలనుకుంటున్నా.సుకుమార్ సర్, అల్లు అర్జున్, మైత్రీ మూవీ మేకర్స్ సంస్థకు కృతజ్ఞతలు. మీరు ఎంతో శ్రమించి మాకు ఇలాంటి మాస్టర్పీస్ను ఇచ్చినందుకు ఒక ప్రేక్షకురాలిగా థ్యాంక్స్. అదేవిధంగా శ్రీవల్లిగా చె΄్పాలంటే మీకు ఎప్పటికీ నా హృదయంలో ప్రత్యేక స్థానం ఉంటుంది. ఈ చిత్రం కోసం అన్ని విభాగాలు బాగా పని చేశాయి. ఈ ప్రయాణంలో నన్ను భాగం చేసినందుకు, నాకు ఎప్పటికీ గుర్తుండిపోయే స్పెషల్ రోల్ ఇచ్చినందుకు ధన్యవాదాలు’’ అని పేర్కొన్నారు రష్మిక. -
టైట్ సెక్యూరిటీ మధ్య స్టార్ హోటల్లో 'పుష్ప' ఫైనల్ టచ్
అల్లు అర్జున్ - సుకుమార్ల యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కిన చిత్రం ‘పుష్ప2: ది రూల్’. ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 4న విడుదలైన ఈ సినిమా థియేటర్లలో ఎన్నో రికార్డులు నెలకొల్పి చరిత్ర సృష్టించింది. అయితే, సినిమా ప్రీమియర్ సమయంలో జరిగిన తొక్కిసలాటతో సక్సెస్ మీట్ వంటి కార్యక్రమాలు జరపలేదు. అయితే, పుష్ప2 థియేటర్ రన్ కూడా పూర్తి అయింది. జనవరి 30న నెట్ఫ్లిక్స్ వేదికగా అందుబాటులోకి కూడా వచ్చేసింది. దీంతో సినిమా చిత్ర యూనిట్ కీలక నిర్ణయం తీసుకుంది. సినిమా విజయంలో కీలకంగా పనిచేసిన పుష్ప2 నటీనటులతో పాటు టెక్నీషయన్లతో ఫైనల్ టచ్గా ఒక థ్యాంక్స్ మీట్ను ఏర్పాటు చేశారు.హైదరాబాద్లోని ఒక స్టార్ హోటెల్లో ఈ రోజు (ఫిబ్రవరి 8) సాయింత్రం పుష్ప2 థ్యాంక్స్ మీట్ జరగనుంది. టైట్ సెక్యూరిటీ మధ్య చాలా లిమిటెడ్గా ఆహ్వానాలు పంపారు. సినిమా కోసం పనిచేసిన అందరికీ షీల్డ్లు అందించి వారిని సత్కరించనున్నారు. పుష్ప2తో భారీ విజయాన్ని అందుకున్న బన్నీ ఈ కార్యక్రమంలో ఏం మాట్లాడనున్నాడోనని తెలుసుకునేందుకు ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. అయితే, సంధ్య థియేటర్ ఘటన గురించి ఆయన ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోవచ్చని తెలుస్తోంది. కేవలం తన తర్వాతి సినిమాల గురించి మాత్రమే ఆయన మాట్లాడతారని సమాచారం ఉంది.పుష్ప 2 విషయానికి వస్తే ఇది 2021లో వచ్చిన పుష్ప మూవీకి సీక్వెల్గా తెరకెక్కింది. అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా నటించారు. సుకుమార్ దర్శకత్వం వహించగా దేవి శ్రీప్రసాద్ సంగీతం అందించారు. ఫహద్ ఫాజిల్, రావు రమేశ్, జగపతి బాబు, సునీల్, అనసూయ, జగదీశ్ కీలకపాత్రల్లో నటించారు. మైత్రీ మూవీ మేకర్స్ భారీ ఎత్తున నిర్మించారు. -
ట్రెండింగ్లో రష్మిక మందన్న 'ఛావా' సాంగ్
రష్మిక మందన్న- విక్కీ కౌశల్ కాంబినేషన్లో రానున్న హిస్టారికల్ మూవీ ‘ఛావా’. ఛత్రపతి శివాజీ మహారాజ్ తనయుడు శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా దర్శకుడు లక్మణ్ ఉటేకర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రంలో శంభాజీ మహారాజ్గా విక్కీ కౌశల్ నటించగా, శంభాజీ మహారాజ్ భార్య మహారాణి ఏసుబాయి పాత్రలో రష్మికా మందన్నా నటించారు. తాజాగా ఈ చిత్రం నుంచి విడుదలైన సాంగ్ యూట్యూబ్లో ట్రెండ్ అవుతుంది. సుమారు 35 మిలియన్ల వ్యూస్తో నెట్టింట వైరల్ అవుతుంది. సాంగ్లో విజువల్స్ అద్భుతంగా ఉండటంతో ఈ సాంగ్ ప్రేక్షకులను మెప్పిస్తుంది.ఇప్పటికే విడుదలైన ట్రైలర్కు మంచి రెస్పాన్స్ రావడంతో చిత్ర యూనిట్ కూడా భారీగా ప్రమోషన్స్ కార్యక్రమాలను చేపడుతుంది. మొగల్ షెహన్షా ఔరంగజేబు పాత్రలో అక్షయ్ ఖన్నా నటిస్తున్నారు. దినేష్ విజన్ నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 14న రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి సంగీతం ఏఆర్ రెహమాన్ అందించారు.తాజాగా ఛావా సినిమా ప్రమోషన్స్ కార్యక్రమం హైదరాబాద్లో జరిగింది. అయితే, నడవలేని స్థితిలో ఉన్న రష్మిక ఈవెంట్లో పాల్గొనడంతో అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. నిన్న జరిగిన ఈవెంట్లో కూడా బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ వీల్చైర్లో స్టేజీపైకి తీసుకొచ్చాడు. అనంతరం రష్మిక.. అతడికి మంగళహారతిచ్చింది. అంతేకాదు.. విక్కీ కౌశల్ (Vicky Kaushal)కు కొంత తెలుగు కూడా నేర్పించింది. అందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. -
సీనియర్ హీరోతో 'రష్మిక'కు గోల్డెన్ ఛాన్స్
కోలీవుడ్ స్టార్ హీరో రజనీకాంత్(Rajinikanth) మరోసారి బాలీవుడ్ చిత్రంలో నటించనున్నారా..? అన్న ప్రశ్నకు కోలీవుడ్ వర్గాల నుంచి అవుననే సమాధానమే వస్తోంది. ప్రస్తుతం ఈయన లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో కూలీ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. నటి శృతిహాసన్ ముఖ్యపాత్రను పోషిస్తున్న ఈ చిత్రం చివరి దశకు చేరుకుంది. తదుపరి నెల్సన్ దర్శకత్వంలో జైలర్– 2 చిత్రం చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అలాంటిది తాజాగా రజనీకాంత్ ఓ హిందీ చిత్రంలో నటించటానికి పచ్చజెండా ఊపినట్లు సమాచారం. విశేషం ఏమిటంటే ఇందులో కథానాయకగా నేషనల్ క్రష్ రష్మిక మందన్నను(Rashmika Mandanna) నటింపజేయడానికి చర్చలు జరుగుతున్నట్లు తెలిసింది. ఇప్పటికే పలు హిందీ చిత్రాల్లో ఆమె నటించారు. తాజాగా సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న సికిందర్ చిత్రంలో రష్మిక నటిస్తున్నారు. కోలీవుడ్ స్టార్ దర్శకుడు మురగదాస్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ను మార్చి నెలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా తాజాగా సల్మాన్ ఖాన్, రష్మిక మందన్న జంటగా మరో చిత్రంలో నటించటానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి దర్శకుడు అట్లీ( Atlee Kumar) తెరకెక్కించబోతున్నట్లు తెలిసింది. కాగా ఈ క్రేజీ చిత్రంలోనే రజనీకాంత్ కూడా ఒక ముఖ్యపాత్ర పోషించనున్నట్లు సమాచారం. ఈ పాత్రలో ముందుగా నటుడు కమల్ హాసన్ నటింపజేసే ప్రయత్నాలు జరిగినట్లు సమాచారం. అయితే, ఆయన నిరాకరించడంతో, ఇప్పుడు రజనీకాంత్ ను నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అట్లీ ఇంతకుముందు రజనీకాంత్ కథానాయకుడిగా నటించిన ఎందిరన్ (రోబో) చిత్రానికి సహాయ దర్శకుడిగా పని చేశారు. ఆ పరిచయంతో ఇప్పుడు తాను దర్శకత్వం వహించబోయే హిందీ చిత్రంలో రజనీకాంత్ను ముఖ్యపాత్రలో నటింపజేయనున్నట్లు తెలుస్తోంది. అలా సల్మాన్ ఖాన్, రజనీకాంత్, రష్మిక మందన్నలతో రేర్ కాంబినేషన్లో చిత్రాన్ని చేయడానికి అట్లీ సిద్ధమవుతున్నట్లు సమాచారం. దీని షూటింగ్ ఈ ఏడాదిలోనే ప్రారంభం కాబోతున్నట్లు తెలిసింది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలవడ లేదు. -
వీల్చైర్లో ప్రమోషన్స్కు రష్మిక ‘ఛావా’ మూవీ ప్రెస్మీట్ (ఫొటోలు)
-
వీల్చైర్లో రష్మిక.. సాయం చేసిన హీరోకు మంగళహారతిచ్చి..
స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా (Rashmika Mandanna) చేతిలో అరడజను సినిమాలున్నాయి. క్షణం తీరిక లేకుండా పరుగులు తీస్తున్న రష్మికకు ఇటీవల సడన్ బ్రేక్ పడింది. జిమ్లో కసరత్తులు చేస్తున్న సమయంలో గాయపడింది. ఇంకా ఆ గాయం నుంచి ఆమె కోలుకోలేకపోతోంది. ఓ పక్క గాయం తనను ఇబ్బందిపెడుతున్నా సరే పనికి మాత్రం విశ్రాంతి ఇవ్వనంటోంది.తాజాగా ఈ ముద్దుగుమ్మ హైదరాబాద్లో జరిగిన ఛావా (Chhaava Movie) ఈవెంట్కు హాజరైంది. నడవలేని స్థితిలో ఉన్న ఆమెను బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ వీల్చైర్లో స్టేజీపైకి తీసుకొచ్చాడు. అనంతరం రష్మిక.. అతడికి మంగళహారతిచ్చింది. అంతేకాదు.. విక్కీ కౌశల్ (Vicky Kaushal)కు కొంత తెలుగు కూడా నేర్పించింది. ఆమె సహకారంతో అతడు.. అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? హైదరాబాద్కు రావడం చాలా సంతోషంగా ఉంది అని తెలుగులో మాట్లాడాడు. అటు రష్మిక డెడికేషన్ను, ఇటు విక్కీ కౌశల్ మంచిగుణాన్ని అభిమానులు పొగడకుండా ఉండలేకపోతున్నారు. బిజీగా ఉన్నా, డేట్స్ కుదర్లేదంటూ ప్రమోషన్స్కు డుమ్మా కొట్టేవాళ్లే చాలామంది.. కానీ రష్మిక గాయంతో బాధపడుతున్నా సరే ఈవెంట్కు రావడం గొప్ప విషయం అని ప్రశంసిస్తున్నారు.రష్మిక కెరీర్..‘చూసీ చూడంగానే నచ్చేశావే..’ అని రష్మికాను ఉద్దేశించి పాట పాడుకున్నారు యువతరం ప్రేక్షకులు. అందం, అభినయంతో అంతలా ఆకట్టుకుందామె. కన్నడలో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ‘ఛలో ’(2018) సినిమాతో తెలుగుకి పరిచయమైంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకుంది. ప్రస్తుతం ఆమె చేతిలో అరడజను సినిమాలున్నాయి.వాటిలో ‘రెయిన్ బో, ది గాళ్ ఫ్రెండ్’ వంటి ఉమెన్ సెంట్రిక్ ఫిలింస్ కూడా ఉన్నాయి. శాంతరూబన్ దర్శకునిగా పరిచయమవుతున్న ‘రెయిన్ బో’ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోంది. ది గాళ్ ఫ్రెండ్ విషయానికి వస్తే.. ‘చిలసౌ’ సినిమాతో దర్శకుడిగా మారిన నటుడు రాహుల్ రవీంద్రన్ ఈ మూవీకి డైరెక్షన్ చేయనున్నాడు.సల్మాన్ ఖాన్ హీరోగా మురుగదాస్ తెరకెక్కిస్తున్న హిందీ మూవీ ‘సికందర్’లోనూ రష్మిక కథానాయిక. నాగార్జున, ధనుశ్ హీరోలుగా శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న తెలుగు, తమిళ చిత్రం ‘కుబేర’లోనూ తనే హీరోయిన్. అమర్ కౌశిక్ దర్శకత్వం వహిస్తున్న ‘థామా’ అనే బాలీవుడ్ మూవీలోనూ రష్మిక భాగమైంది.అలాగే విక్కీ కౌశల్ హీరోగా లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించిన బాలీవుడ్ మూవీ ‘ఛావా’లో ఈ బ్యూటీ హీరోయిన్గా చేసింది. ఛత్రపతి శివాజీ తనయుడు సాంబాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. సాంబాజీని చావా (మరాఠీలో పులి బిడ్డ అని అర్థం) అని పిలుస్తారు. చావా మొదటి భార్య యేసుబాయ్గా రష్మిక నటిస్తోంది. ఈ సినిమా ఫిబ్రవరి 14న విడుదల కానుంది. The dedication with which #RashmikaMandanna is promoting this movie will be remembered in the future, showing how serious she is about her work. Despite her current condition, she came to promote the movie in a wheelchair. I'm confident that the pairing of #VickyKaushal and… pic.twitter.com/E4aM1EQ19P— Rashmika Delhi Fans (@Rashmikadelhifc) January 31, 2025చదవండి: శోభితతో పెళ్లి.. జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నా: నాగచైతన్య -
జోరుగా హుషారుగా షూటింగ్కి పోదమా...
‘జోరుగా హుషారుగా షికారు పోదమా...’ అంటూ అక్కినేని నాగేశ్వర రావు, కృష్ణకుమారి అప్పట్లో సిల్వర్ స్క్రీన్పై చేసిన సందడిని నాటి ప్రేక్షకులు ఎంజాయ్ చేశారు. ఇప్పుడు ఈ పాట ప్రస్తావన ఎందుకూ అంటే... జోరుగా హుషారుగా షూటింగ్కి పోదమా... అంటూ కొందరు కథానాయికలు డైరీలో నాలుగుకి మించిన సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు. ఆ హీరోయిన్లు చేస్తున్నసినిమాల గురించి తెలుసుకుందాం...రెండు దశాబ్దాలు దాటినా బిజీగా...చిత్ర పరిశ్రమలో రెండు దశాబ్దాలకుపైగా ప్రయాణం పూర్తి చేసుకున్నారు త్రిష. అందం, అభినయంతో తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ ప్రేక్షకులను అలరిస్తున్న ఆమె ఇప్పటికీ ఫుల్ బిజీ హీరోయిన్గా దూసుకెళుతున్నారు. అంతేకాదు.. అందం విషయంలోనూ యువ హీరోయిన్లకు గట్టి పోటీ ఇస్తున్నారు. ప్రస్తుతం త్రిష చేతిలో తెలుగు, తమిళ్, మలయాళంలో కలిపి అరడజను సినిమాలున్నాయి. ఆమె నటిస్తున్న తాజా తెలుగు చిత్రం ‘విశ్వంభర’. ఈ మూవీలో చిరంజీవికి జోడీగా నటిస్తున్నారామె.‘స్టాలిన్’ (2006) సినిమా తర్వాత చిరంజీవి–త్రిష కలిసి నటిస్తున్న చిత్రం ఇదే కావడం విశేషం. అలాగే మోహన్లాల్ లీడ్ రోల్లో డైరెక్టర్ జీతూ జోసెఫ్ తెరకెక్కిస్తోన్న మలయాళ చిత్రం ‘రామ్’లోనూ నటిస్తున్నారు త్రిష. అదే విధంగా అజిత్ కుమార్ హీరోగా మగిళ్ తిరుమేని తెరకెక్కిస్తున్న ‘విడాముయర్చి’, అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ‘గుడ్ బ్యాడీ అగ్లీ’, కమల్హాసన్ హీరోగా మణిరత్నం రూపొందిస్తున్న ‘థగ్ లైఫ్’, సూర్య కథానాయకుడిగా ఆర్జే బాలాజీ దర్శకత్వం వహిస్తున్న ‘సూర్య 45’ (వర్కింగ్ టైటిల్) వంటి తమిళ చిత్రాల్లో నటిస్తూ జోరు మీద ఉన్నారు త్రిష. తెలుగులో లేవు కానీ...తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో బుట్ట బొమ్మగా స్థానం సొంతం చేసుకున్నారు హీరోయిన్ పూజా హెగ్డే. నాగచైతన్య హీరోగా నటించిన ‘ఒక లైలా కోసం’ (2014) అనే చిత్రంతో తెలుగులో ఎంట్రీ ఇచ్చారీ బ్యూటీ. టాలీవుడ్లో పదేళ్ల ప్రయాణం పూజా హెగ్డేది. కాగా చిరంజీవి, రామ్చరణ్ హీరోలుగా నటించిన ‘ఆచార్య’ (2022) సినిమా తర్వాత ఆమె ఒక్క తెలుగు సినిమా కూడా చేయలేదు. కానీ, బాలీవుడ్, తమిళ చిత్రాలతో బిజీగా ఉన్నారు పూజా హెగ్డే.తమిళంలో స్టార్ హీరోలైన విజయ్, సూర్యలకు జోడీగా నటిస్తున్నారు. విజయ్ హీరోగా హెచ్. వినోద్ దర్శకత్వం వహిస్తున్న ‘జన నాయగన్’ అనే సినిమాతో పాటు, సూర్య కథానాయకుడిగా కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్లో రూపొందుతోన్న ‘రెట్రో’ మూవీస్లో నటిస్తున్నారు పూజా హెగ్డే. అలాగే డేవిడ్ ధావన్ దర్శకత్వం వహిస్తున్న హిందీ చిత్రం ‘హై జవానీ తో ఇష్క్ హోనా హై’ అనే సినిమాలో నటిస్తున్నారామె. షాహిద్ కపూర్ హీరోగా రోషన్ ఆండ్రూస్ దర్శకత్వంలో రూపొందిన హిందీ మూవీ ‘దేవా’. పూజా హెగ్డే హీరోయిన్గా నటించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. హిందీ, తమిళ భాషల్లో బిజీగా ఉన్న పూజా హెగ్డే తెలుగులో మాత్రం ఒక్క సినిమాకి కూడా కమిట్ కాలేదు. జోరుగా లేడీ సూపర్ స్టార్ఇండస్ట్రీలో లేడీ సూపర్స్టార్గా పేరు తెచ్చుకున్నారు నయనతార. నటిగా రెండు దశాబ్దాలకు పైగా ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న ఆమె ఇప్పటికీ వరుస సినిమాలతో దూసుకెళుతున్నారు. కథానాయికగా ఫుల్ క్రేజ్లో ఉన్నప్పుడే దర్శకుడు విఘ్నేశ్ శివన్తో 2022 జూన్ 9న వివాహబంధంలోకి అడుగుపెట్టారు నయనతార. వీరిద్దరికీ ఉయిర్, ఉలగమ్ అనే ట్విన్స్ ఉన్నారు. ఇక కెరీర్ పరంగా ప్రస్తుతం ఆమె చేతిలో ఏడు సినిమాలున్నాయి. తమిళంలో ‘టెస్ట్, మన్నాంగట్టి సిన్స్ 1960, రాక్కాయీ’ వంటి సినిమాలతో పాటు పేరు పెట్టని మరో తమిళ చిత్రం, ‘డియర్ స్టూడెంట్’తో పాటు మరో మలయాళ మూవీ, ‘టాక్సిక్’ అనే కన్నడ సినిమాతో ఫుల్ బిజీ బిజీగా ఉన్నారు నయనతార. అయితే 2022లో విడుదలైన చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ తర్వాత మరో తెలుగు చిత్రానికి పచ్చజెండా ఊపలేదామె.అరడజను సినిమాలతో‘చూసీ చూడంగానే నచ్చేశావే.. అడిగీ అడగకుండా వచ్చేశావే... నా మనసులోకి’ అంటూ రష్మికా మందన్నాని ఉద్దేశించి పాడుకుంటారు యువతరం ప్రేక్షకులు. అందం, అభినయంతో అంతలా వారిని ఆకట్టుకున్నారామె. కన్నడలో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ‘ఛలో ’(2018) సినిమాతో తెలుగుకి పరిచయమయ్యారు. ఆ తర్వాత తెలుగు, తమిళ, హిందీ సినిమాల్లో వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్లలో ఒకరిగా దూసుకెళుతున్నారు ఈ కన్నడ బ్యూటీ. ఓ వైపు కథానాయకులకి జోడీగా నటిస్తూనే.. మరోవైపు లేడీ ఓరియంటెడ్ చిత్రాల్లోనూ నటిస్తున్నారు. ప్రస్తుతం ఆమె చేతిలో అరడజను సినిమాలున్నాయి.వాటిలో ‘రెయిన్ బో, ది గాళ్ ఫ్రెండ్’ వంటి ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ కూడా ఉన్నాయి. శాంతరూబన్ దర్శకునిగా పరిచయమవుతున్న ‘రెయిన్ బో’ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోంది. అదే విధంగా ‘చిలసౌ’ సినిమాతో దర్శకుడిగా మారిన నటుడు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ది గాళ్ ఫ్రెండ్’. అలాగే విక్కీ కౌశల్ హీరోగా లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించిన బాలీవుడ్ మూవీ ‘ఛావా’లో హీరోయిన్గా చేశారు రష్మిక. ఈ సినిమా ఫిబ్రవరి 14న విడుదల కానుంది.ఇక సల్మాన్ ఖాన్ హీరోగా మురుగదాస్ తెరకెక్కిస్తున్న హిందీ మూవీ ‘సికందర్’లోనూ రష్మిక కథానాయిక. అదే విధంగా నాగార్జున, ధనుశ్ హీరోలుగా శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న తెలుగు, తమిళ చిత్రం ‘కుబేర’లోనూ హీరోయిన్గా నటించారు ఈ బ్యూటీ. మరోవైపు అమర్ కౌశిక్ దర్శకత్వం వహించిన ‘థామా’ అనే బాలీవుడ్ మూవీలోనూ నటిస్తున్నారు రష్మికా మందన్నా.ఏడు చిత్రాలతో బిజీ బిజీగా...మలయాళ, తెలుగు, తమిళ, కన్నడ సినిమాల్లో నటించి, ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు హీరోయిన్ సంయుక్తా మీనన్. ‘భీమ్లా నాయక్’ (2022) చిత్రంతో టాలీవుడ్కి పరిచయమయ్యారు ఈ మలయాళ బ్యూటీ. ‘భీమ్లా నాయక్, బింబిసార, సార్, విరూపాక్ష’ వంటి వరుస హిట్లను తన ఖాతాలో వేసుకున్నారు సంయుక్త. ప్రస్తుతం ఆమె చేతిలో ఏడు సినిమాలున్నాయి. వాటిలో తెలుగులోనే ఐదు చిత్రాలుండగా, ఓ హిందీ ఫిల్మ్, ఓ మలయాళ సినిమా కూడా ఉంది.నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్న ‘స్వయంభూ’, శర్వానంద్ కథానాయకుడిగా రామ్ అబ్బరాజు డైరెక్షన్లో రూపొందుతున్న ‘నారి నారి నడుమ మురారి’, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కథానాయకుడిగా లుధీర్ బైరెడ్డి తెరకెక్కిస్తున్న ‘హైందవ’, బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న ‘అఖండ 2: తాండవం’ సినిమాల్లో నటిస్తున్నారు సంయుక్తా మీనన్. అదే విధంగా తొలిసారి ఓ లేడీ ఓరియంటెడ్ సినిమాలోనూ నటిస్తున్నారామె.యోగేష్ కేఎంసీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా హైదరాబాద్లో ప్రారంభమైంది. అలాగే ఆమె నటిస్తున్న తొలి హిందీ చిత్రం ‘మహారాజ్ఞి–క్వీన్ ఆఫ్ క్వీన్స్’. ఈ మూవీకి చరణ్ తేజ్ ఉప్పలపాటి దర్శకత్వం వహిస్తున్నారు. అదే విధంగా మోహన్లాల్ లీడ్ రోల్లో జీతూ జోసెఫ్ దర్వకత్వంలో రూపొందుతోన్న మలయాళ చిత్రం ‘రామ్’లోనూ నటిస్తున్నారు సంయుక్తా మీనన్. ఇలా ఏడు సినిమాలతో ఫుల్ బీజీ బీజీగా ఉన్నారామె. హుషారుగా యంగ్ హీరోయిన్టాలీవుడ్లో మోస్ట్ సెన్సేషన్ హీరోయిన్గా దూసుకెళుతున్నారు శ్రీలీల. ‘పెళ్లిసందడి’ (2021) సినిమాతో తెలుగులో హీరోయిన్గా పరిచయమైన ఈ బ్యూటీ అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్ని సొంతం చేసుకున్నారు. రవితేజ హీరోగా నటించిన ‘ధమాకా’ (2022) సినిమాతో తెలుగులో తొలి హిట్ని తన ఖాతాలో వేసుకున్న శ్రీలీల వరుస చిత్రాలతో యమా జోరు మీదున్నారు. ప్రస్తుతం ఆమె చేతిలో మూడు తెలుగు సినిమాలతో పాటు ఓ తమిళ చిత్రం ఉన్నాయి.నితిన్ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందుతోన్న ‘రాబిన్ హుడ్’, రవితేజ హీరోగా భాను భోగవరపు తెరకెక్కిస్తున్న ‘మాస్ జాతర’, పవన్ కల్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ‘ఉస్తాద్ భగత్సింగ్’ వంటి తెలుగు చిత్రాల్లో నటిస్తున్నారు శ్రీలీల. అదే విధంగా శివ కార్తికేయన్ హీరోగా సుధ కొంగర దర్శకత్వం వహిస్తున్న ‘పరాశక్తి’ అనే తమిళ చిత్రంలోనూ నటిస్తూ బిజీగా ఉన్నారామె.హిందీలోనూ...దుల్కర్ సల్మాన్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ‘సీతా రామం’ (2022) సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చారు మృణాళ్ ఠాకూర్. ఆ సినిమా మంచి హిట్గా నిలిచింది. మృణాళ్ నటనకి మంచి మార్కులే పడ్డాయి. ఆ తర్వాత తెలుగులో ‘హాయ్ నాన్న, ది ఫ్యామిలీ స్టార్’ చిత్రాల్లో హీరోయిన్గా నటించిన ఈ బ్యూటీ ప్రభాస్ ‘కల్కి: 2898 ఏడీ’ చిత్రంలో అతిథి పాత్ర చేశారు. ప్రస్తుతం మృణాళ్ ఠాకూర్ బాలీవుడ్లో బిజీ హీరోయిన్గా మారారు. ఆమె హిందీలో ‘పూజా మేరీ జాన్, హై జవానీతో ఇష్క్ హోనా హై, సన్ ఆఫ్ సర్దార్ 2’, తుమ్ హో తో’ వంటి చిత్రాలు చేస్తున్నారు. అదే విధంగా అడివి శేష్ హీరోగా తెలుగు, హిందీ భాషల్లో రూపొందుతోన్న ‘డెకాయిట్’ చిత్రంలో నటిస్తూ బిజీగా ఉన్నారు మృణాళ్ ఠాకూర్.రెండు తెలుగు... రెండు హిందీ ప్రేక్షకుల హృదయాల్లో అతిలోక సుందరిగా అభిమానం సొంతం చేసుకున్న దివంగత నటి శ్రీదేవి, నిర్మాత బోనీకపూర్ వారసురాలిగా పెద్ద కుమార్తె జాన్వీ కపూర్ హిందీలో ఎంట్రీ ఇచ్చారు. యూత్ కలల రాణిగా మారారు ఈ బ్యూటీ. ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వం వహించిన ‘దేవర: పార్ట్ 1’ (2024) సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు జాన్వీ. ప్రస్తుతం ఆమె చేతిలో కూడా నాలుగు సినిమాలుఉన్నాయి. వాటిలో రెండు తెలుగు కాగా రెండు హిందీ మూవీస్.రామ్చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతోన్న ‘ఆర్సీ 16’ (వర్కింగ్ టైటిల్) చిత్రంలో నటిస్తున్నారు. అలాగే ఎన్టీఆర్ ‘దేవర: పార్ట్ 2’ సినిమా కూడా ఉండనే ఉంది. అదే విధంగా హిందీలో ‘సన్నీ సంస్కారీ కీ తులసీ కుమారి, పరమ్ సుందరి’ వంటి సినిమాల్లో నటిస్తున్నారు. ఇలా నాలుగైదు సినిమాలతో బిజీ బిజీగా షూటింగ్స్ చేస్తున్న కథానాయికలు ఇంకొందరు ఉన్నారు. – డేరంగుల జగన్ మోహన్ -
ఓటీటీలోకి వచ్చేసిన పుష్పరాజ్.. ఫ్యాన్స్కు బోనస్
పుష్పగాడు ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేశాడు. దేశవ్యాప్తంగా సినిమా ప్రియులు పుష్ప2(Pushpa 2: The Rule) ఓటీటీ స్ట్రీమింగ్ కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. అయితే, జనవరి 30 అర్ధరాత్రి నుంచే ఓటీటీలో 'పుష్పగాడి' రూల్ మొదలైంది. నెట్ఫ్లిక్స్ వేదికగా తెలుగుతో పాటు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రీలోడెడ్ వెర్షన్ స్ట్రీమింగ్ అవుతుంది. పాన్ ఇండియా రేంజ్లో అల్లు అర్జున్(Allu Arjun) హీరోగా సుకుమార్(Sukumar) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో అనేక రికార్డులను దాటేసింది. ఇప్పటికి 50 రోజులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం రూ. 1896 కోట్ల కలెక్షన్స్ వచ్చినట్లు మేకర్స్ ప్రకటించారు.మరో నాలుగు నిమిషాలు అదనంగతేడాది డిసెంబరు 5న భారీ అంచనాలతో విడుదలైన పుష్ప2 మొత్తం రన్టైమ్ 3 గంటల 20 నిమిషాలుగా ఉంది. అయితే, సంక్రాంతి రేసులో ఈ సినిమా నిడివి అదనంగా మరో 20 నిమిషాలు జోడించారు. అప్పుడు పుష్ప రన్ టైమ్ 3:40 నిమిషాలు అయింది. ఫ్యాన్స్కు బోనస్గా ఇప్పుడు ఓటీటీ వర్షన్లో మరో 4 నిమిషాల సీన్లు అదనంగా మరోసారి జత చేశారు. దీంతో పుష్ప2 మొత్తం రన్ టైమ్ 3:44 గంటలు ఉంది. -
'అలాంటి వ్యక్తి అంటే చాలా ఇష్టం'.. రిలేషన్షిప్పై రష్మిక ఆసక్తికర కామెంట్స్
పుష్ప భామ రష్మిక మందన్నా మరో మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. గతేడాది పుష్ప-2తో బ్లాక్బస్టర్ హిట్ కొట్టిన ముద్దుగుమ్మ.. కొత్త ఏడాదిలో బాలీవుడ్ చిత్రం ఛావాతో అభిమానులను పలకరించనుంది. ఇటీవల తన కాలికి గాయమైనప్పటికీ మూవీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్కు హాజరైంది. ఈ చిత్రంలో విక్కీ కౌశల్ సరసన కనిపించనుంది. ప్రస్తుతం ఛావా ప్రమోషన్స్తో బిజీగా ఉన్న నేషనల్ క్రష్ తాజా ఇంటర్వ్యూలో ఆసక్తికర కామెంట్స్ చేసింది. తన రిలేషన్షిప్ గురించి తొలిసారి ఓపెన్ అయిపోయింది.రష్మిక మాట్లాడుతూ.. " నా ఇల్లే అత్యంత సంతోషకరమైన ప్రదేశం. అది నాకు ఎప్పటికీ అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుంది. జీవితంలో గెలుపు అనేది వస్తూ, పోతూ ఉంటుంది. విజయమనేది మన లైఫ్లో శాశ్వతం కాదు. కానీ నా ఇల్లు ఎప్పటికీ శాశ్వతం. అందుకే అక్కడి నుంచే పనిచేస్తున్నా. అక్కడ నేను పొందిన ప్రేమ, కీర్తి ఎప్పటికీ గుర్తుంటాయి. ఒక వ్యక్తి పట్ల ఆకర్షణ విషయానికొస్తే తన కళ్లే ప్రధానమని నేను నమ్ముతా. అంతే కాదు తాను ఎప్పుడు నవ్వుతూనే ఉంటాను.. అంటే ఎప్పుడు స్మైలీ ఫేస్తో పాటు తన చుట్టు ఉన్నవారిని గౌరవించే వాళ్లంటే నాకు ఇష్టం.' అని ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.రిలేషన్పై రూమర్స్..కాగా.. గత కొన్నేళ్లుగా టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండతో రిలేషన్లో ఉన్నట్లు రూమర్స్ వస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా గతంలో ఓ ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండ కూడా రిలేషన్ షిప్లో ఉన్నట్లు బయటికి చెప్పారు. అయితే ఎవరనేది మాత్రం పేరును వెల్లడించలేదు. సరైన సమయం వచ్చినప్పుడు మాత్రమే ఆ వివరాలను పంచుకుంటానని కూడా స్పష్టం చేశాడు.అయితే రష్మిక మందన్నా చాలాసార్లు విజయ్ దేవరకొండ ఇంట్లో జరిగే పండుగ వేడుకల్లో మెరిసింది. గతేడాది విజయ్ దేవరకొండ కుటుంబంతో కలిసి దీపావళిని సెలబ్రేట్ చేసుకుంది. చాలాసార్లు తన ఫోటోలతో అభిమానులకు దొరికిపోయింది. విజయ్ ఇంట్లో ఉన్న ఫోటోలను సోషల్ మీడియా వేదిక షేర్ చేస్తూనే ఉంటుంది. దీంతో విజయ్, రష్మిక రిలేషన్లో ఉన్నట్లు ఏదో ఒక సందర్భంలో రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. వీరిద్దరిలో ఎవరో ఒకరు రిలేషన్పై క్లారిటీ ఇస్తే కానీ వీటికి ఎండ్ కార్డ్ పడేలా కనిపించడం లేదు. కాగా.. ప్రస్తుతం రష్మిక నటిస్తోన్న ఛావా చిత్రానికి లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించారు. -
విడుదలకు ముందే వివాదం.. రష్మిక చిత్రాన్ని అడ్డుకుంటామంటూ వార్నింగ్!
పుష్ప భామ రష్మిక మందన్నా ప్రస్తుతం ఛావా మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీలో విక్కీ కౌశల్ సరసన నటించింది. మరాఠా రాజు ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఇటీవల ఛావా ట్రైలర్ను కూడా మేకర్స్ రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమా రిలీజ్కు ముందే వివాదానికి కారణమైంది. ఇంతకీ అదేంటో తెలుసుకుందాం.ఛావా మూవీపై మహారాష్ట్ర మంత్రి ఉదయ్ సమంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమాలోని ఒక డ్యాన్స్ సీన్పై తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఆ సీన్ తొలగించకపోతే సినిమాకు విడుదలకు అనుమతించేది లేదని స్పష్టం చేశారు. ఛత్రపతి చరిత్రను ప్రపంచానికి అర్థమయ్యేలా చెప్పే ఇలాంటి ప్రయత్నాలు అవసరమని.. అయితే ఈ సినిమాలో అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నాయని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారని మంత్రి ఓ ప్రకటనలో తెలిపారు.కాగా.. ఈ సినిమాలో ఛత్రపతి శంభాజీ మహారాజ్ పాత్రలో విక్కీ కౌశల్ డ్యాన్స్ చేస్తున్నట్లు చూపించడంపై మంత్రి మండిపడ్డారు. దర్శకుడు ఆ సీన్ కట్ చేయాలని.. అంతేకాదు ఈ సినిమాను చరిత్రకారులు, మేధావులకు చూపించాలని అన్నారు. వారు ఏదైనా అభ్యంతరాలు వ్యక్తం చేస్తే ఈ సినిమా విడుదల కాదని స్పష్టం చేశారు. చిత్ర నిర్మాతలు చరిత్రకారులను సంప్రదించి వివాదాస్పద కంటెంట్ ఉంటే విడుదలకు ముందే తొలగించాలని సమంత్ పిలుపునిచ్చారు. మేం సూచించిన మార్పులు చేయకపోతే సినిమా విడుదలను అడ్డుకుంటామని ఆయన హెచ్చరించారు. మహారాజ్ గౌరవానికి భంగం కలిగేలా వ్యవహరిస్తే సహించేది లేదని ఆయన పేర్కొన్నారు. కాగా.. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించిన ఈ పీరియాడికల్ చిత్రం ఫిబ్రవరి 14న థియేటర్లలోకి రానుంది.ఆ సీన్లు తొలగిస్తాం.. డైరెక్టర్శంభాజీ మహారాజ్.. మహారాణి యేసుబాయితో కలిసి నృత్యం చేస్తున్న దృశ్యాలను తొలగిస్తున్నట్లు చావా దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ వెల్లడించారు. ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ థాకరేతో జరిగిన సమావేశం అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇది కేవలం డ్యాన్స్ సీక్వెన్స్ మాత్రమేనని.. మరాఠా రాజు వారసత్వం కంటే మరేది ముఖ్యం కాదని ఉటేకర్ తెలిపారు. -
సక్సెస్ కోసం ఆ విషయాల్లో రాజీ పడ్డాను : రష్మిక
నేషనల్ క్రష్ రష్మిక(rashmika mandanna) ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. ఇటీవల పుష్ప 2(pushpa 2)తో భారీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ బ్యూటీ.. త్వరలోనే ఛావా అనే మూవీతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఇలా వరుస సినిమాల్లో నటించడం కోసం పెద్ద త్యాగమే చేశానంటోంది రష్మిక. కొన్ని విషయాల్లో రాజీ పడడం వల్లే ఈ స్థాయి సక్సెస్ని అందుకుంటున్నానని చెబుతోంది. తాజాగా ఈ బ్యూటీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘కెరీర్ పరంగా బిజీగా ఉండడం వల్ల కుటుంబంతో ఎక్కువ సమయం గడపలేకపోతున్నానని బాధ పడింది. తనకు ఫ్యామిలీ అంటే చాలా ఇష్టమని.. కానీ కెరీర్ కోసం వాళ్లకు దూరంగా ఉండాల్సి వస్తోందని ఎమోషల్ అయింది.‘ఫ్యామిలీనే నా బలం. ఎక్కువ సమయం కుటుంబంతోనే గడిపేదాన్ని. నా చెల్లి అంటే నాకు చాలా ఇష్టం. ప్రతి రోజు చాటింగ్ చేసుకుంటాం. కానీ షూటింగ్స్ కారణంగా తనను కలువలేకపోతున్నాను. తను చాలా స్మార్ట్. రానున్న రోజుల్లో అద్భుతమైన మహిళగా మారనుందని నమ్ముతున్నా. ‘వ్యక్తిగత, వృత్తిపరమైన విషయాలకు ఒకేసారి సమయాన్ని కేటాయించడం అంత సులభం కాదు. ఒకదాని కోసం మరొకటి త్యాగం చేయాల్సి ఉంటుంది’ అని మొదట్లోనే మా అమ్మ చెప్పింది. నా విషయంలో ఇప్పుడు అదే జరుగుతుంది. వృత్తిపరమైన కమిట్మెంట్స్ నిలబెట్టుకోవడానికి ఫ్యామిలీ టైమ్ త్యాగం చేయాల్సి వస్తోంది. వీలున్నప్పుడల్లా కుటుంబసభ్యులకు ఫోన్ చేసి మాట్లాడుతుంటా’ అని రష్మిక చెప్పుకొచ్చింది.సినిమాల విషయాలకొస్తే.. ప్రస్తుతం లక్ష్మణ్ ఉదేకర్ దర్శకత్వంలో ఛావా(Chhava) అనే హిందీ చిత్రంలో నటిస్తోంది. ఛత్రపతి శివాజీ మహరాజ్ కుమారుడు శంభాజీ మహరాజ్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విక్కీ కౌశల్ హీరోగా నటిస్తున్నాడు. ఇందులో శంభాజీ భార్య ఏసుబాయిగా రష్మిక నటిస్తోంది. ఫిబ్రవరి 14న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో పాటు ‘సికందర్’, ‘థామ’, ‘కుబేర’, ‘ది గర్ల్ఫ్రెండ్’, ‘రెయిన్ బో’ చిత్రాల్లో రష్మిక నటిస్తున్నారు. -
నాకు ఇష్టమైన ఫోటోలు ఇవే అంటూ.. షేర్ చేసిన 'రష్మిక మందన్న'
-
ఈ ఒక్క పాత్ర చాలు.. ఇక రిటైర్ అయిపోతా: రష్మిక కామెంట్స్ వైరల్
పుష్ప-2 అభిమానులను అలరించిన రష్మిక మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం విక్కీ కౌశల్ సరసన ఛావా చిత్రంతో అలరించనుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఛావా ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్కు హాజరైన రష్మిక ఆసక్తికర కామెంట్స్ చేసింది.ఈ మూవీలో మరాఠా రాణి యేసుబాయి భోన్సాలే పాత్రలో నటించే అవకాశం ఇచ్చినందుకు డైరెక్టర్కు ధన్యవాదాలు తెలిపింది. ఇలాంటి గొప్ప పాత్ర చేయడం తనకెంతో సంతోషంగా ఉందని పేర్కొంది. ఈ పాత్రతో ఇక తాను సినిమాల నుంచి రిటైర్ అయిపోయినా సంతోషమేనని రష్మిక వెల్లడించింది. ట్రైలర్ లాంఛ్ సందర్భంగా రష్మిక మాట్లాడుతూ.. 'ఇది నాకు గొప్ప గౌరవం. మహారాణి యేసుబాయి పాత్రను పోషించడానికి దక్షిణాది అమ్మాయిగా చాలా సంతోషంగా ఉంది. నా సినీ కెరీర్లో అత్యంత విశేషమైన, ప్రత్యేకమైన పాత్ర. అందుకే నేను డైరెక్టర్ లక్ష్మణ్ ఉటేకర్ సార్తో ఒక విషయం చెప్పాను. ఈ పాత్ర చేశాక నేను సంతోషంగా రిటైర్ అయిపోతా అని చెప్పా' అని అన్నారు.తననే ఈ పాత్రకు ఎంపిక చేయడంపై స్పందిస్తూ..' ఈ విషయంలో నేను షాక్ అయ్యా. అసలు లక్ష్మణ్ సర్ నాకు ఇలాంటి పాత్ర ఇవ్వాలని ఎలా డిసైడ్ చేశాడు. నాకు లక్ష్మణ్ సర్ ప్రత్యేక పాత్ర ఇవ్వడంతోనే ఫిదా అయిపోయా. ఇక్కడ నాకు భాషతో పాటు ప్రతిదీ చాలా రిహార్సల్గా అనిపించింది. కానీ లక్ష్మణ్ సార్కు ఏది అడిగినా చేయడానికి నేను ఉన్నా అన్న ధైర్యమిచ్చా' అని అన్నారు.గాయంతోనే ఈవెంట్కు..కాగా.. ఇటీవల రష్మిక మందన్నా కాలికి గాయమైన సంగతి తెలిసిందే. అయినప్పటికీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్లో మెరిసింది. కాలు ఎంత ఇబ్బంది పెడుతున్నా కుంటుతూనే ఈవెంట్కు హాజరైంది ముద్దుగుమ్మ.కాగా.. ఛావాలో విక్కీ కౌశల్ హీరోగా నటించారు. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబుగా అక్షయ్ ఖన్నా కనిపించనున్నారు. ఈ చిత్రంలో అశుతోష్ రాణా, దివ్య దత్తా, నీల్ భూపాలం, సంతోష్ జువేకర్, ప్రదీప్ రావత్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని మడాక్ ఫిల్మ్స్ నిర్మించింది. ఫిబ్రవరి 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. -
నడవలేని స్థితిలో శ్రీవల్లి