Satya raj
-
నటుడు సత్యరాజ్ కుమార్తెకు కీలక పదవి
సినీ నటుడు, బాహుబలితో కట్టప్పగా ప్రపంచవ్యాప్తంగా ముద్రపడ్డ సత్యరాజ్ తనయ దివ్య సత్యరాజ్ కొద్దిరోజుల క్రితమే డీఎంకే పార్టీలో చేరారు. అయితే, తాజాగా ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ ఆమెకు కీలక పదవి అప్పగించారు. ఆ పార్టీ అనుబంధ ఐటీ విభాగం డిప్యూటీ కార్యదర్శిగా ఆమెను నియమించారు. ఈ మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి దురై మురుగన్ ప్రకటించారు. సినీ నటుడు సత్యరాజ్ తనయుడు సీబీ రాజ్ తండ్రిబాటలో వెండి తెర మీద రాణిస్తున్న విషయం తెలిసిందే. ఆయన కుమార్తె దివ్య సత్యరాజ్ పోషకాహార నిపుణులుగా ఉన్నారు. గతకొంత కాలంగా రాజకీయాల్లో రావాలని ప్రయత్నాలు చేస్తూ వచ్చిన ఆయన కుమార్తె దివ్య గత నెలలో డీఎంకేలో చేరారు. సీఎం స్టాలిన్ సమక్షంలో డీఎంకే సభ్యత్వం పుచ్చుకున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం డీఎంకేలో పలు జిల్లాలకు కార్యదర్శులు, ఇన్చార్జ్లు, అనుబంధ విభాగాలకు కొత్త వారి నియామకం వేగం పుంజుకుంది. ఆ దిశగా ఆదివారం ఐటీ విభాగంలో పదవులను భర్తీ చేశారు. ఇందులో దివ్యకు ఐటీ విభాగం డిప్యూటీ కార్యదర్శి పదవి అప్పగించారు. అలాగే డీఎంకే అనుబంధ మైనారిటీ విభాగం, వర్తక తదితర విభాగాలతో పాటూ మరికొన్ని విభాగాల పదవులను భర్తీ చేస్తూ దురై మురుగన్ ప్రకటించారు. అలాగే పార్టీ ఉన్నత స్థాయి కమిటీ సభ్యుడిగా ముబారక్ను నియమించారు. -
'స్వీయ నాశనానికి మూడు ద్వారాలు ఉన్నాయి'.. ఆసక్తిగా టీజర్
పొలిమేర మూవీ సిరీస్తో టాలీవుడ్ ప్రేక్షకులను భయపెట్టిన టాలీవుడ్ నటుడు సత్యం రాజేశ్(satyam Rajesj>). తాజాగా మరో హిస్టారికల్ స్టోరీతో ఆడియన్స్ ముందుకు రానున్నాడు. భీముడి మనవడు, ఘటోత్కచుడి కుమారుడైన బార్బరికుడి కథతో వస్తోన్న లేటేస్ట్ మూవీ 'త్రిబాణధారి బార్బరిక్'. ఈ చిత్రంలో సత్యరాజ్, వశిష్ఠ ఎన్.సింహ, ఉదయభాను కీలక పాత్రలు పోషిస్తున్నారు.తాజాగా ఈ మూవీ టీజర్ను(Tribanadhari Barbarik Teaser) మేకర్స్ రిలీజ్ చేశారు. పురాణాల్లో పాత్రల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. 'స్వీయ నాశనానికి మూడు ద్వారాలు ఉన్నాయి' అనే డైలాగ్ ఈ చిత్రంపై మరింత ఆసక్తి పెంచుతోంది. ఈ చిత్రానికి మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో క్రాంతి కిరణ్, వీటీవీ గణేష్, మొట్టా రాజేంద్ర, ప్రభావతి, మేఘన, కార్తికేయ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. -
రాజుగారి అమ్మాయి ప్రేమకథ
రవితేజ నున్న, నేహా జురెల్ జంటగా సత్య రాజ్ దర్శకత్వం వహించిన చిత్రం ‘రాజుగారి అమ్మాయి –నాయుడుగారి అబ్బాయి’. రామిసెట్టి సుబ్బారావు, ముత్యాల రామదాసు నిర్మించారు. సంగీత దర్శకుడు కోటి తనయుడు రోషన్ సాలూరి సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘ఐ లవ్ యు..’ అనే లిరికల్ సాంగ్ని విడుదల చేశారు. రెహమాన్ సాహిత్యం అందించిన ఈ పాటని యాజిన్ నిజర్, నూతన్ మోహన్ పాడారు. ‘‘అందమైన ప్రేమకథతో రూపొందిన చిత్రం ఇది. త్వరలో విడుదల కానున్న ఈ సినిమా యువతతో పాటు కుటుంబ ప్రేక్షకులనూ అలరిస్తుంది’’ అని దర్శక–నిర్మాతలు పేర్కొన్నారు. -
అప్పుడు రాజమౌళి ఎలా అడిగాడో ఈయన కూడా అలాగే..: సత్యరాజ్
ప్రముఖ నటుడు సత్యరాజ్ మళ్లీ విలన్ అవతారమెత్తారు. జూలియన్ అండ్ జీరో మా ఇంటర్నేషనల్ పతాకంపై జోమోన్ ఫిలిప్, జీనా రోమోన్ కలిసి నిర్మిస్తున్న చిత్రం అంగారకన్. శ్రీపతి కథానాయకుడిగా నటించి, కథనం, క్రియేటివ్ దర్శకత్వం బాధ్యతలను నిర్వహించిన ఈ సినిమాలో సత్యరాజ్ డేరింగ్ పోలీస్ అధికారిగా ప్రతినాయకుడి పాత్రలో నటించారు. మలయాళ బ్యూటీ నియా కథానాయకిగా నటించింది. ఈ చిత్రంలో అంగాడి తెరు ఫేమ్ మహేష్, రెయినా కారత్, రోషన్, అప్పుకుట్టి, దియా, నేహా రోస్, గురు చంద్రన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ప్రభాస్ కాలును మీ తలపై పెట్టుకోవాలి.. ఓకేనా? దర్శకుడు రామ్ గోపాల్ వర్మ శిష్యుడు మోహన్ డచ్చు ఈచిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న అంగారకన్ సెప్టెంబర్ 8వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా శనివారం సాయంత్రం చైన్నెలో చిత్ర యూనిట్ మీడియా సమావేశాన్ని నిర్వహించింది. నటుడు సత్యరాజ్ మాట్లాడుతూ.. చిత్ర దర్శకుడు శ్రీపతి తనకు కథ చెప్పే ముందే ఇందులో తాను హీరో, మీరు విలన్ ఓకేనా అని అడిగారన్నారు. బాహుబలి చిత్రంలో నటించినప్పుడు దర్శకుడు రాజమౌళి కూడా ఇలానే అడిగారన్నారు. ప్రభాస్ కాలును మీ తలపై పెట్టుకోవాలి అందుకు ఓకేనా..? అని ఆయన అడిగారన్నారు. అలా బోర్ కొట్టేసింది.. ఈ చిత్ర దర్శకుడు శ్రీపతి కథ పూర్తిగా చెప్పగా తనకు నచ్చిందన్నారు ఇందులో నటించడానికి మంచి అవకాశం ఉందన్నారు. వరుసగా తండ్రి పాత్రల్లో నటించడం బోర్ కొట్టడంతో మంచి విలన్ పాత్ర వస్తే నటించాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. రాజకీయాల గురించి మాట్లాడుతూ.. పార్టీ ప్రారంభించడం అనేది ప్రస్తుతం ఓటు బ్యాంకు రాజకీయం అన్నారు. అయితే ప్రజలకు మంచి సందేశం ఇవ్వడం కూడా రాజకీయమేనని, అలాంటి వారి వెనుక తాను ఉంటానని చెప్పారు. సూపర్ స్టార్ చర్చ గురించి మాట్లాడుతూ.. ఎళిసై మన్నర్, మక్కల్ తిలకం, నడిగర్ తిలకం అంటూ కాలానికి తగ్గట్టుగా పట్టం మారుతూ ఉంటుందని తనకు తెలిసినంతవరకు నటుడు రజనీకాంత్ మాత్రమే నిజమైన సూపర్ స్టార్ అని సత్యరాజ్ పేర్కొన్నారు. చదవండి: అడ్డగోలు పారితోషికాలు, అవసరం లేని రికార్డులు.. సినీ పరిశ్రమకే ‘మెగా ’కష్టం! -
కట్టప్ప కొత్త సినిమా.. AI టెక్నాలజీతో యంగ్ లుక్లో..
నటుడు, బాహుబలి 'కట్టప్ప' సత్యరాజ్, వసంత రవి ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం వెపన్. చాగల్లు సురేష్ మేళం, నటి తాన్య హోప్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని స్టూడియో పతాకంపై ఎంఎస్ మంజూర్ నిర్మిస్తున్నారు. గుహన్ సినీయప్పన్ కథ, దర్శకత్వం బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సోమవారం సాయంత్రం దర్శకుడు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశాడు. ఆయన మాట్లాడుతూ.. హాలీవుడ్ చిత్రాలు సూపర్ మాన్, సూపర్ వుమెన్ చిత్రాల తరహాలో సాగే మరో భవిష్య భరిత కథా చిత్రం వెపన్ అని చెప్పాడు. ఇందులో నటుడు సత్యరాజ్ సూపర్ మాన్గా నటించారన్నాడు. అయితే ఆయనకు ఆ ఆసక్తి ఎలా వచ్చిందన్నది సస్పెన్స్ అన్నారు. ఆయన్ని చంపడం ఎవరి తరం కాదన్నాడు. హాలీవుడ్ చిత్రాల్లో ముంచుకొస్తున్న ముప్పు నుంచి ప్రపంచాన్ని సూపర్ హీరోలు కాపాడతారని, ఈ చిత్రంలో సత్యరాజ్ తన శక్తితో ఎవరినీ కాపాడకుండా తన వ్యక్తిగత విషయాల కోసం వాడుకుంటారని పేర్కొన్నాడు. ఇందులో ఆయన అడవిలో దారి తప్పిన ఏనుగులను కాపాడే వ్యక్తిగా నటించారన్నాడు. సత్యరాజ్కి సీన్ వివరిస్తున్న దర్శకుడు ఫిదా నటుడు వసంత రవి బయట ప్రపంచంలోని అద్భుత వ్యక్తుల గురించి పరిచయం చేసే యూట్యూబర్గా నటించినట్లు చెప్పాడు. సురేష్ వేణు ప్రతి నాయకుడిగా నటించారని తెలిపాడు. కాగా ఈ చిత్రంలో ఫ్లాష్ బ్యాక్లో నటుడు సత్యరాజ్ చాలా యంగ్గా కనిపిస్తారన్నాడు. అందుకోసం ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్) అనే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించినట్లు వెల్లడించాడు. నిర్మాత ఎమ్మెస్ ముంజూర్ మాట్లాడుతూ వెపన్ చిత్రాన్ని సెప్టెంబర్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పాడు. మరో విషయం ఏంటంటే దీన్ని హాలీవుడ్ చిత్రాల తరహాలో పలు ఫ్రాంచైజీలుగా రూపొందించనున్నట్లు చెప్పాడు. చదవండి: ఇకపై నరేశ్ ఇంట్లోకి రమ్య రఘుపతికి నో ఎంట్రీ.. తీర్పు వెల్లడించిన కోర్టు -
ప్రిన్స్ రివ్యూ: జాతిరత్నాలు డైరెక్టర్ నవ్వించాడా?
టైటిల్: ప్రిన్స్ తారాగణం: శివకార్తికేయన్, మరియా, సత్యరాజ్, ప్రేమ్జీ తదితరులు దర్శకుడు: అనుదీప్ కేవి సంగీతం: తమన్ సినిమాటోగ్రాఫర్: మనోజ్ పరమహంస నిర్మాతలు: సునీల్ నారంగ్, సురేశ్ బాబు, పుష్కర్ రామ్ మోహన్ రావు విడుదల తేదీ: అక్టోబర్ 21, 2022 ఒక సినిమా విజయం సాధించిందంటే ఆ డైరెక్టర్ బాధ్యత రెట్టింపు అవుతుంది. తర్వాతి సినిమా అంతకు మించి విజయాన్ని సాధించేలా తీయాల్సి ఉంటుంది. ప్రేక్షకులు కూడా నెక్స్ట్ ఎలాంటి మూవీ తీస్తారోనని ఉత్సుకతతో ఎదురుచూస్తుంటారు. అలాంటి పరిస్థితే ఎదురైంది దర్శకుడు కేవీ అనుదీప్కి. గతేడాది జాతిరత్నాలు మూవీతో ఊహించనంత సక్సెస్ను ఖాతాలో వేసుకున్న అనుదీప్ ఈసారి ప్రిన్స్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. శివకార్తికేయన్ హీరోగా నటించిన ఈ మూవీ తెలుగు, తమిళ భాషల్లో రిలీజైంది. మరి అనుదీప్ మరోసారి పొట్ట చెక్కలయ్యేలా నవ్వించాడా? ప్రిన్స్ మూవీ ఎలా ఉంది? ఓసారి చూసేద్దాం.. కథ: ఓ స్వతంత్ర సమరయోధుల కుటుంబానికి చెందిన వారసుడు ఆనంద్(శివకార్తికేయన్). ఇతడో స్కూలు టీచర్. హీరో తండ్రి విశ్వనాథ్(సత్యరాజ్) కులమతాలకు వ్యతిరేకి, అందరూ కలిసి ఉండాలనుకునే వ్యక్తి. ఇక హీరో తన స్కూల్లోనే మరో టీచర్(బ్రిటీష్ అమ్మాయి) అయిన జెస్సిక (మరియా ర్యాబోషప్కా)తో లవ్లో పడతాడు. ఇంగ్లండ్కు చెందిన జెస్సిక తండ్రికి ఇండియన్స్ అంటేనే గిట్టదు. దీంతో వారి ప్రేమకు అతడు రెడ్ సిగ్నల్ ఇస్తాడు. రానురానూ ఇద్దరి మధ్య లవ్స్టోరీ కాస్తా రెండు దేశాల మధ్య వార్లా మారుతుంది. మరి ఆనంద్ ప్రేమ సక్సెస్ అయిందా? అతడిని ఊరి నుంచి ఎందుకు గెంటేశారు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే! విశ్లేషణ: ప్రిన్స్ సినిమాలో మూడు కోణాలు ఉన్నాయి. కామెడీ, లవ్ స్టోరీ, మానవత్వం అనే అంశాలను టచ్ చేశాడు డైరెక్టర్. అనుదీప్ అంటేనే కామెడీ కాబట్టి ఎక్కువగా కామెడీనే నమ్ముకున్నాడు. కానీ అక్కడక్కడా కామెడీ పండించే సీన్లను సాగదీయడం కొంత చిర్రెత్తిస్తుంది. ముఖ్యంగా బాటిల్ గార్డ్ ఎపిసోడ్ చూసిన జనాలకు అరె ఏంట్రా ఇది అనిపిస్తుంది. లవ్ సీన్స్ కొన్నిచోట్ల అమాయకత్వం ఉట్టిపడుతూ బాగుంటాయి. అనుదీప్ టేకింగ్, శివకార్తికేయన్ నటన రెండూ కరెక్ట్గా సరిపోయాయి. కానీ విలేజ్ బ్యాక్గ్రౌండ్లో వచ్చే కొన్ని కామెడీ సీన్లు మాత్రం రొటీన్ ఫార్మాట్లోనే వెళ్లినట్లు అనిపించక మానదు. ఫస్టాఫ్ అక్కడక్కడ బాగుంటుంది. కానీ సెకండాఫ్ మాత్రం తన ట్రేడ్ మార్క్ కామెడీతో కడుపుబ్బా నవ్వించాడు అనుదీప్. డైలాగ్స్ బాగున్నాయి. క్లైమాక్స్లో హీరో దేశభక్తి కంటే హ్యుమానిటీనే గొప్పదని చెప్పే స్పీచ్ బాగుంటుంది. అనుదీప్ ఎంచుకున్న కాన్సెప్ట్ సీరియస్గా కనిపించినా దాన్ని కూడా ఎంటర్టైన్మెంట్ పద్ధతిలోనే డీల్ చేశాడు. ఏం చేసినా ఏం రాసినా అంతా నవ్వించడం కోసమే అన్నట్లు ఉంటుందీ చిత్రం. మరీ జాతిరత్నాలు రేంజ్లో కాకపోయినా కామెడీ ఇష్టపడేవారికి ప్రిన్స్ నచ్చుతుంది. ఎవరెలా చేశారంటే? శివ కార్తికేయన్ అదిరిపోయే కామెడీ టైమింగ్తో ఆకట్టుకున్నాడు. సత్యరాజ్ పాత్ర సినిమాకే హైలెట్. ప్రేమ్ జీ పంచులతో ఎంటర్టైన్ చేశాడు. హీరోయిన్ మరియా లుక్, నటన ఫ్రెష్గా ఉంది. అనుదీప్ కామెడీ చేస్తూనే మనుషులంతా ఒక్కటేనని సింపుల్గా చెప్పాడు. ప్రధాన పాత్రల మాటలు ఫన్ క్రియేట్ చేస్తూనే ప్రేక్షకులను ఆలోచింపజేసేలా ఉంటాయి. తమన్ అందించిన సంగీతం కొంతవరకు ఆకట్టుకుంది. మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ బాగుంది. కొన్ని సీన్లు సాగదీయకుండా కట్ చేస్తే బాగుండేది. ఓవరాల్గా ప్రిన్స్.. నో లాజిక్.. ఓన్లీ కామెడీ మ్యాజిక్! చదవండి: సర్దార్ మూవీ రివ్యూ సౌత్ సినిమాలు చేయాలనుంది -
కట్టప్ప కొడుకు హీరోగా 'మాయోన్'
“కట్టప్ప” సత్యరాజ్ కుమారుడు సిబిరాజ్ హీరోగా యువ దర్శకుడు కిషోర్ దర్శకత్వంలో రూపొందిన ప్రతిష్ఠాత్మక చిత్రం “మాయోన్”. ఈ చిత్ర హక్కులను మూవీమ్యాక్స్ అధినేత, ప్రముఖ నిర్మాత మామిడాల శ్రీనివాస్ సొంతం చేసుకున్నారు. “మాయోన్” చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో జూలై 7న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్బంగా చిత్ర నిర్మాత మామిడాల శ్రీనివాస్ మాట్లాడుతూ.. 'పురాతన దేవాలయానికి సంబంధించిన ఒక రహస్య పరిశోధన నేపథ్యంలో హై టెక్నికల్ వాల్యూస్తో రూపొందిన మిస్టరీ థ్రిల్లర్ “మాయోన్” చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. గాడ్ వెర్సస్ సైన్స్ మెయిన్ థీమ్గా మిస్టరీ థ్రిల్లర్గా రూపొందిన ఈ చిత్రాన్ని నిర్మాత అరుణ్ మోజి మాణికం భారీ బడ్జెట్తో నిర్మించారు. ఆయనే ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే రాయడం విశేషం. కిషోర్ ఎన్ దర్శకత్వం వహించిన ఈ మిస్టరీ థ్రిల్లర్కు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) ‘U’ సర్టిఫికేట్ మంజూరు చేసింది. అలాగే ఈ చిత్రానికి మాస్ట్రో ఇళయరాజా సంగీతం ప్రధాన ఆకర్షణ అని చెప్పవచ్చు. ఇప్పటికే ఇసైజ్ఞాని ఇళయరాజా స్వరపరిచిన పాటలకు సంగీత ప్రియుల నుంచి మంచి స్పందన లభించింది. ఈ చిత్రంలో హీరో సిబిరాజ్ ‘అర్జున్’ అనే ఆర్కియాలజిస్ట్గా నటిస్తుండగా, తాన్య రవిచంద్రన్ ఎపిగ్రాఫిస్ట్ పాత్రలో కనువిందు చేయనుంది. ఇందులో నటించిన సత్యరాజ్ కుమారుడు సిబిరాజ్ కు మంచి భవిష్యత్ ఉంటుంది' అన్నారు. చదవండి: మొదట్లో కన్ను గీటాను, చివరికి పక్షవాతం అని తేలింది హనీమూన్కు చెక్కేసిన నయనతార దంపతులు -
ఈటీ (ఎవరికీ తలవంచడు) మూవీ రివ్యూ
టైటిల్: ఈటీ (ఎవరికీ తలవంచడు) నటీనటులు: సూర్య, ప్రియాంక అరుల్ మోహన్, వినయ్ వర్మ, సత్యరాజ్ తదితరులు నిర్మాత: కళానిధి మారన్ రచన, దర్శకుడు: పాండిరాజ్ సంగీతం: డి. ఇమ్మాన్ సినిమాటోగ్రఫీ: ఆర్. రత్నవేలు ఎడిటర్: రూబెన్ విడుదల తేది: మార్చి 10, 2022 సూర్య అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈటీ (ఎదుర్కుమ్ తునిందవన్) తెలుగులో 'ఎవరికీ తలవంచడు' సినిమా వచ్చేసింది. విభిన్నమైన రోల్స్లో అదరగొట్టే సూర్య సినిమాలపై భారీగానే అంచనాలుంటాయి. ఇదివరకూ సూర్య చేసిన 'ఆకాశమే నీ హద్దురా', 'జై భీమ్' సినిమాలు కరోనా కారణంగా ఓటీటీల్లో రిలీజయ్యాయి. అయితేనేం బ్లాక్ బస్టర్ హిట్ సాధించాయి. సుమారు మూడేళ్ల తర్వాత 'ఎవరికీ తలవంచడు'తో థియేటర్లలోకి వచ్చాడు. సన్ పిక్చర్స్ అధినేత కళానిధి మారన్ నిర్మించిన ఈ చిత్రాన్ని పాండిరాజ్ డైరెక్ట్ చేశారు. ఈ సినిమాలో సూర్య సరసన ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్గా నటించింది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ఫ్యాన్స్ను తెగ ఆకట్టుకుంది. అమ్మాయిల సమస్యలపై పోరాడే పవర్ఫుల్ పాత్రలో సూర్య నటించాడని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఎట్టకేలకు ఈ మూవీ మార్చి 10న (గురువారం) తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదలైంది. మరీ సూర్య నటించిన ఈటీ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. కథ: దక్షిణపురంలో అందరితో సరదాగా గడుపుతూ జీవిస్తుంటాడు లాయర్ కృష్ణమోహన్ (సూర్య). ఇతడు ఉత్తరపురంలోని అధిర (ప్రియాంక అరుల్ మోహన్)ను ప్రేమిస్తాడు. వీరిద్దరు ప్రేమించుకునే క్రమంలోనే వారి గ్రామంలోని అమ్మాయిలు ఆత్మహత్యలు, యాక్సిడెంట్ల ద్వారా చనిపోతుంటారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఏం ఫలితముండదు. ఇదిలా ఉంటే కృష్ణ మోహన్, అధిరలు పెళ్లి చేసుకునే క్రమంలో అధిర స్నేహితురాలు ఆపదలో ఉన్నట్లు మెసేజ్ వస్తుంది. దీంతో ఆమెను కాపాడేందుకు వెళ్లిన లాయర్ కృష్ణమోహన్కు అమ్మాయిల ఆత్మహత్యలు, యాక్సిడెంట్లకు కారణం, ఆ చావుల వెనక ఉంది ఎవరనేది తెలుస్తుంది. సూర్య వారిని ఎదుర్కొన్నాడా? 500 మంది అమ్మాయిలను ఎలా కాపాడాడు ? దక్షిణపురం, ఉత్తరపురం గ్రామాలకు మధ్య ఉన్న సంబంధం ఏంటి ? కృష్ణ మోహన్ చిన్నతనంలో తన చెల్లెలికి ఏం జరిగిందనేదే సినిమా కథ. ఎలా ఉందంటే ? రెండు గ్రామాల మధ్య జరిగిన సంఘటన ద్వారా ప్రారంభమైన సినిమా అమ్మాయిలపై జరిగే ఆకృత్యాల గురించి ప్రస్తావించే ప్రయత్నం చేశారు డైరెక్టర్ పాండిరాజ్. అమ్మాయిలు అంటే బలహీనం కాదు బలవంతులు అని చాటి చెప్పారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా అమ్మాయిలు మనోధైర్యంతో ఎలా ఎదుర్కొవాలో నేర్పిన చిత్రమిది. రొటీన్ ఫార్ములా అయినా పవర్ప్యాక్ యాక్షన్ సీన్స్తో మాస్ ప్రేక్షకులకు నచ్చేలా తెరకెక్కించి మంచి సందేశమిచ్చారు. హీరో, విలన్ల మధ్య వచ్చే సీన్స్ ఛాలెంజింగ్గా ఉంటాయి. ఇంటర్వెల్ యాక్షన్ సీన్, మహిళల నగ్న చిత్రాలు, అశ్లీల చిత్రాలు చూసే జనానికి వాటికి కారకులు ఎవరో తెలిసేలా చేయాలని చూపించే సీన్ సినిమాలో హైలెట్గా నిలుస్తాయి. తప్పు చేయని మహిళలు కాదు అశ్లీల చిత్రాలు తీసేవారు సిగ్గుపడాలని చెబుతూ మహిళలకు ఈ సినిమాతో ధైర్యమిచ్చే ప్రయత్నం చేశారు. 'అబ్బాయిలు ఏడవద్దు అని చెప్పడం కాదు అమ్మాయిలను ఏడిపించొద్దని చెప్పండి' లాంటి మహిళల కోసం చెప్పే డైలాగ్స్ క్లాప్స్ కొట్టించేలా ఉన్నాయి. డి. ఇమ్మాన్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అదిరిపోయిందనే చెప్పవచ్చు. సీరియస్గా సాగే కథలో అక్కడక్కడా వచ్చే ప్రేమ సన్నివేశాలు, కామెడీ సీన్స్ ఉఫ్ అనిపిస్తాయి. అమ్మాయిల చావులకు కారణమేంటనే విషయం తెలుసుకోవాలని ఎదురుచూసే ప్రేక్షకుడికి ఈ సీన్స్ కొంచెం బోర్ కొట్టిస్తాయి. కానీ లాయర్ కృష్ణ మోహన్, అధిరల మధ్య వచ్చే లవ్ సీన్స్, ఎమోషనల్ సీన్స్ ఆకట్టుకుంటాయి. అక్కడక్కడా కామెడీ బాగానే పండిందని చెప్పవచ్చు. ఆకాశమే హద్దురా, జైభీమ్ తరహాలో కాకపోయినా మహిళల పక్షాన నిలబడిన లాయర్ కృష్ణమోహన్ పాత్రలో నటించిన సూర్య 'ఈటీ' చిత్రం ప్రేక్షకులకు గుర్తుండిపోతుంది. ఎవరెలా చేశారంటే? విభిన్నమైన గెటప్పులతో, రోల్స్తో అదరగొట్టే సూర్య నటన గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ఎప్పటిలానే ఈ సినిమాలో లాయర్ కృష్ణ మోహన్గా తనదైన శైలిలో అద్భుతంగా యాక్ట్ చేశాడు. అధిరగా చేసిన ప్రియాంక అరుల్ మోహన్ నటన కూడా బాగుంది. ఫస్టాఫ్లో సాధారణ యువతిగా నటించి ఆకట్టుకున్న ప్రియాంక సెకండాఫ్లో అశ్లీల చిత్రాలకు గురైన బాధితురాలిగా పరిస్థితులను ధైర్యంగా ఎలా ఎదుర్కోవాలనే పాత్రలో చక్కగా నటించింది. ఇక కృష్ణమోహన్ తండ్రిగా సత్యరాజ్, అమ్మగా శరణ్య పొన్వన్నన్, దేవదర్శిని చేతన్, సుబ్బు పంచు తమదైన పాత్రమేరకు చాలా బాగా యాక్ట్ చేశారు. ఇక ఈ సినిమాలో మరో ప్రధాన పాత్ర కామ (వినయ్ రాయ్). స్త్రీలను కించపరుస్తూ మాట్లాడటం, వాళ్లను హింసించడం, అమ్మాయిలను వీఐపీలకు ఎరగా వేసి వాడుకునే కామేష్ పాత్రలో వినయ్ రాయ్ బాగానే నటించాడు. కార్తీ నటించిన 'చినబాబు' సినిమా ఫేమ్ పాండిరాజ్కు విలేజ్ బ్యాక్డ్రాప్లో ఇది మూడో సినిమా. ఫ్యామిలీ ఆడియెన్స్ను ఆకట్టుకునేలా తీయడంలో పాండిరాజ్ మంచి ప్రతిభ ఉన్న దర్శకుడు. ఈ సినిమాకు రచన, దర్శకత్వం వహించి మహిళలపై జరిగే అరాచాకాలు, వారు ఎలా నిలదొక్కుకోవాలో చెప్పే ప్రయత్నం చేశారు. దాంట్లో పూర్తిగా విజయం సాధించారనే చెప్పవచ్చు. అమ్మాయిలపై జరిగే ఆకృత్యాలు, అరాచకాలపై చాలానే సినిమాలు వచ్చాయి. అయితే అమ్మాయిలను పురుషులు చూసే కోణం మారనప్పుడు, మహిళలు ఎలాంటి పరిస్థితుల్లోనైనా ధైర్యంగా నిలబడే రోజు రానంతవరకూ ఇలాంటి ఎన్ని సినిమాలు వచ్చినా స్వాగతించడంలో తప్పులేదు. -
ఆస్పత్రి నుంచి డిశ్చార్జయిన ‘కట్టప్ప’, కొద్ది రోజుల పాటు విశ్రాంతి..
ప్రముఖ నటుడు, బాహుబలి ‘కట్టప్ప’ సత్యరాజ్ ఇటీవల కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఆయనకు కోవిడ్ లక్షణాలు ఎక్కువగా ఉండటంతో రెండు రోజుల క్రితం కుటుంబ సభ్యులు చెన్నైలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. అప్పటి నుంచి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సత్యరాజ్ తాజాగా కరోనా నుంచి కోలుకున్నారు. అయితే ఆయన ఆసుపత్రిలో చేరడంతో సత్యరాజ్ ఆరోగ్యం విషమంగా ఉందంటూ వార్తలు రావడంతో ఆయన ఫ్యాన్స్ అంతా ఆందోళనకు గురయ్యారు. (చదవండి: బాహుబలి ‘కట్టప్ప’కు కరోనా, అకస్మాత్తుగా ఆస్పత్రిలో చేరిక) చదవండి: సల్మాన్ ఖాన్తో సీక్రెట్ డేటింగ్, క్లారిటీ ఇచ్చిన నటి సమంత.. ఈ నేపథ్యంలో అభిమానులకు ఆయన కుమారుడు శిబి సత్యరాజ్ గుడ్ న్యూస్ చెప్పారు. తన తండ్రి కరోనా నుంచి కోలుకున్నారని ట్విట్టర్ వేదికగా తెలిపాడు. ప్రస్తున్నా నాన్న(సత్యరాజ్) క్షేమంగా ఉన్నారని, నిన్న రాత్రి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారని స్పష్టం చేశాడు. కొన్ని రోజుల పాటు ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటారని... ఆ తర్వాత షూటింగుల్లో పాల్గొంటారని ఆయన కుమారుడు పేర్కొన్నాడు. తన తండ్రి కోలుకోవాలని ప్రార్థించిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నామంటూ ట్వీట్లో రాసుకొచ్చాడు. కాగా సత్య రాజ్ తనయుడైన శిబి సత్యరాజ్ మాయోన్ అనే చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. చదవండి: డబ్బు కోసం ఇంతలా దిగజారతావా, నీ స్థాయి మరిచిపోయావా?: హీరోయిన్పై ట్రోల్స్ Hey guys..Appa got discharged from the hospital last night and back home..He’s totally fine and will resume work after few days of rest..Thank you all for your love and support! 😊🙏🏻 #Sathyaraj — Sibi Sathyaraj (@Sibi_Sathyaraj) January 11, 2022 -
నచ్చిన సినిమాలే చేస్తాను
‘‘దొంగ’ సినిమా పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్. అలానే దర్శకుడు జీతూ జోసెఫ్ సినిమాల్లో కనిపించే సస్పెన్స్, థ్రిల్స్ కూడా ఉంటాయి. నేను చేసిన ‘ఊపిరి, నా పేరు శివ’ సినిమాలను కలిపితే ఎలా ఉంటుందో ఈ సినిమాలో అలాంటి ఛాయలుంటాయి’’ అని హీరో కార్తీ అన్నారు. కార్తీ, నిఖిలా విమల్ జంటగా జ్యోతిక, సత్యరాజ్, ‘షావుకారు’ జానకి ముఖ్య పాత్రల్లో నటించిన తమిళ చిత్రం ‘తంబీ’. తెలుగులో ‘దొంగ’ పేరుతో రిలీజ్ కాబోతోంది. జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రావూరి వి. శ్రీనివాస్ నిర్మించారు. ఈ నెల 20న ఈ చిత్రం రిలీజ్ కాబోతున్న సందర్భంగా కార్తీ పంచుకున్న విశేషాలు.. ► నా కెరీర్లో ఇప్పటి వరకూ 19 సినిమాలు చేశాను. ప్రతి సినిమాకు వంద శాతం కష్టపడ్డాను. స్క్రిప్ట్ నాకు బాగా నచ్చితేనే సినిమా చేశాను. కథల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తలు వహిస్తుంటాను. ఈ సినిమా ‘ఖైదీ’ వచ్చిన రెండు నెలల తర్వాత వస్తుండొచ్చు, కానీ రెండేళ్ల నుంచి పక్కా ప్లానింగ్తో ‘దొంగ’ సినిమా చేశాం. ► ‘రంగ్ దే బసంతి’ రాసిన రచయిత రెన్సిల్ డిసిల్వ ఈ కథను నా దగ్గరకు తీసుకువచ్చారు. ఈ కథ నాకు బాగా నచ్చింది. వదిన(జ్యోతిక) కూడా ఈ కథ విన్నారు. దర్శకుడు ఎవరు? అని అనుకుంటుంటే.. జీతూ జోసెఫ్ కరెక్ట్ అని అనుకున్నాం. నేనూ, వదినా ఈ సినిమా చేయబోతున్నాం అని తెలిసి ఆయన కూడా ఓకే అన్నారు. ఆయనకి ఈ స్క్రిప్ట్ బాగా నచ్చడంతో మాకు మరింత నమ్మకం వచ్చింది. ► వదినతో యాక్ట్ చేయడం ఇంట్లో కూర్చొని మాట్లాడినట్టే ఉండేది. ఎందుకంటే ఈ సినిమాలో మా పాత్రలు కూడా అలానే ఉంటాయి. మేమిద్దరం అక్కాతమ్ముడి పాత్రల్లో నటించాం. నెల రోజుల ముందే డైలాగ్స్ అన్నీ నేర్చుకుని సెట్కి వచ్చేవారు వదిన. ► ఈ సినిమాను అన్నయ్య(సూర్య) ఇంకా చూడలేదు. థియేటర్స్లోనే చూస్తా అని చెప్పారు. ► ఇందులో సత్యరాజ్ మా తండ్రి పాత్రలో నటించారు. ‘షావుకారు’ జానకి మా బామ్మ పాత్ర చేశారు. ఇంతమంది అద్భుతమైన నటీ నటులతో పని చేసినప్పుడు మనం కూడా బాగా చేస్తాం. చాలా నేర్చుకుంటాం. ► నా గత చిత్రం ‘ఖైదీ’ చిరంజీవిగారి సినిమా టైటిలే. ఇది కూడా చిరంజీవిగారి సినిమా టైటిలే. ఆయన కూడా ‘ఖైదీ’ తర్వాత ‘దొంగ’ సినిమా చేశారని నాతో ఎవరో అన్నారు. మంచి శకునం అనుకున్నాను. ► ప్రస్తుతం మణిరత్నంగారి ‘పొన్నియిన్ సెల్వమ్’ షూటింగ్ థాయ్ల్యాండ్లో జరుగుతోంది. ‘దొంగ’ ప్రమోషన్స్ కోసం చిన్న బ్రేక్ తీసుకొని వచ్చాను. మళ్లీ వెళ్లి షూటిం గ్లో జాయిన్ అవుతాను. -
ఖైదీ యాక్షన్
‘ఖైదీ’ వంటి సూపర్హిట్ తర్వాత కార్తీ నటించిన తమిళ చిత్రం ‘తంబి’. ‘దృశ్యం’ ఫేమ్ జీతు జోసెఫ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో జ్యోతిక, నికిలా విమల్, సత్యరాజ్ కీలక పాత్రధారులు. ఈ సినిమా తెలుగులో ‘దొంగ’ అనే టైటిల్తో ఈ నెల 20న రిలీజ్ కానుంది. తెలుగు థియేట్రికల్ రైట్స్ను హర్షిత మూవీస్ అధినేత రావూరి వి. శ్రీనివాస్ సొంతం చేసుకున్నారు. ‘‘యాక్షన్తో కూడిన ఎమోషనల్ చిత్రం ఇది. ఆల్రెడీ విడుదల చేసిన టీజర్, సాంగ్స్కు మంచి స్పందన లభిస్తోంది. గోవింద్ వసంత మ్యూజిక్, ఆర్. డి రాజశేఖర్ విజువల్స్ ఈ సినిమాకు అదనపు ఆకర్షణ. ఈ చిత్రం తెలుగు హక్కులను మాకు అందించడానికి సంపూర్ణ సహకారం అందించిన కె.ఎఫ్.సి ఎంటర్టైన్మెంట్స్ సంస్థకు ప్రత్యేక కృతజ్ఞతలు’’ అన్నారు రావూరి వి. శ్రీనివాస్. -
సిబిరాజ్కు జంటగా నందితాశ్వేత
నటి నందితాశ్వేతాకు నటుడు సిబిరాజ్తో జత కట్టే చాన్స్ వచ్చింది. అట్టకత్తి చిత్రంతో కథానాయకిగా పరిచయమైన ఈ అమ్మడికి ఆ చిత్రం హిట్ అయ్యి మంచి పేరే తెచ్చి పెట్టింది. ఆ తరువాత పలు అవకాశాలు వస్తున్నాయి. అంతేకాదు తెలుగులోనూ నటిస్తూ బహుభాషా నటిగా రాణిస్తోంది. కానీ ఎందుకో అందం కూడా కావలసినంత ఉన్నా స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకోలేకపోతోంది. అంతేకాదు స్టార్ హీరోలతో రొమాన్స్ చేసే అవకాశాలను రాబట్టుకోలేకపోతోంది. ఇటీవల ప్రభుదేవా, తమన్నా జంటగా నటించిన దేవీ 2 చిత్రంలో ఒక హీరోయిన్గా కనిపించింది. ఈ అమ్మడు చివరిగా నటించిన చిత్రం 7. ఈ ద్విభాషా చిత్రం ఇటీవలే తెరపైకి వచ్చింది. తాజాగా నటుడు సిబిరాజ్తో జతకట్టే అవకాశం తలుపు తట్టింది. ఇంతకుముందు సిబిరాజ్ హీరోగా సత్య చిత్రాన్ని తెరకెక్కించిన ప్రదీప్కృష్ణమూర్తి తాజాగా ఆయన హీరోగానే మరో చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. విశేషం ఏమిటంటే ఇందులో సిబి రాజ్ తండ్రి సత్యరాజ్ కూడా నటించనున్నారు. ఇది కన్నడంలో మంచి విజయాన్ని సాధించిన కావలుదారి చిత్రానికి రీమేక్. దీన్ని జీ.ధనుంజయన్ నిర్మించనున్నారు. చాలా కాలం తరువాత తండ్రీ కొడుకులు కలిసి నటిస్తున్న ఈ చిత్రం త్వరలోనే సెట్పైకి వెళ్లనుందని సమాచారం. ఇందులో నటి నందితాశ్వేత జర్నలిస్ట్ పాత్రలో నటించనుందట. చిత్రంలో ఆమెకు రొమాంటిక్ సన్నివేశాలాంటివేవీ ఉండవట. అయితే కథలో చాలా ముఖ్యమైన పాత్ర అని చిత్ర వర్గాలు అంటున్నారు. -
బంధాలను గుర్తు చేసేలా...
మారుతి దర్శకత్వంలో సాయి తేజ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘ప్రతిరోజూ పండగే’. రాశీఖన్నా కథానాయికగా నటిస్తున్నారు. నటులు సత్యరాజ్, రావు రమేష్ కీలక పాత్రలు చేస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్ని’ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎస్కేఎన్ సహ–నిర్మాత. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్లోని ఓ ప్రముఖ స్టూడియోలో జరుగుతోంది. ‘‘హీరో సాయిని ఓ కొత్తరకమైన పాత్రలో, న్యూ లుక్లో చూస్తారు. కుటుంబ బంధాలు, విలువలను గుర్తు చేసేలా ఉంటుందీ చిత్రం. రెండురెట్లు ఎక్కువ ఎంటర్టైన్మెంట్ ఉండేలా మారుతి తెరకెక్కిస్తున్నారు. బుధవారం విడుదల చేసిన సాయితేజ్, సత్యరాజ్ ఉన్న లుక్కు మంచి స్పందన లభిస్తోంది’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ సినిమాను ఈ ఏడాది డిసెంబరులో విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సినిమాకు సంగీతం: తమన్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: బాబు. -
‘నోటా’ మూవీ రివ్యూ
టైటిల్ : నోటా జానర్ : పొలిటికల్ డ్రామా తారాగణం : విజయ్ దేవరకొండ, సత్యరాజ్, నాజర్, మెహరీన్ సంగీతం : సామ్ సీయస్ దర్శకత్వం : ఆనంద్ శంకర్ నిర్మాత : జ్ఞానవేల్ రాజా అర్జున్ రెడ్డి, గీత గోవిందం సినిమాలతో సెన్సేషనల్ స్టార్గా పేరు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం నోటా. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో విజయ్ ముఖ్యమంత్రి పాత్రలో కనిపించాడు. అరిమనంభి, ఇరుముగన్ సినిమాలతో తమిళనాట దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న ఆనంద్ శంకర్ దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాతో విజయ్ కోలీవుడ్కు కూడా పరిచయం అవుతుండటంతో నోటా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఆ అంచనాల నోటా అందుకుందా..? ఈ సినిమాతో విజయ్ తన హిట్ ట్రాక్ను కంటిన్యూ చేశాడా..? కథ ; వరుణ్ (విజయ్ దేవరకొండ) ముఖ్యమంత్రి వాసుదేవ్(నాజర్) కొడుకు. రాజకీయాలంటే గిట్టని వరుణ్ లండన్లో వీడియో గేమ్ డిజైనర్ గా పనిచేస్తుంటాడు. ఇండియాలోని కొన్ని అనాథాశ్రమాలకు మహేంద్ర (సత్యరాజ్) సహకారంతో సాయం చేస్తుంటాడు. ఫ్రెండ్స్తో కలిసి ఎంజాయ్ చేసే వరుణ్ అనుకోకుండా సీఎం కుర్చీలో కూర్చోవాల్సి వస్తోంది. తండ్రి వాసుదేవ్ ఓ కేసు విషయంలో విచారణ ఎదుర్కోవాల్సి రావటంతో రాజకీయాలతో సంబంధంలేని వరుణ్ ని అధికార పీఠం మీద కూర్చోపెట్టి వెనకుండి అంతా నడిపించాలని భావిస్తాడు వాసుదేవ్. కానీ ఆ కేసులో వాసుదేవ్కు శిక్షపడటం, బెయిల్పై తిరిగి వస్తుండగా వాసుదేవ్ మీద హత్యా ప్రయత్నం జరగటంతో వరుణ్ సొంతంగా నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. తండ్రి మీద జరిగినట్టుగానే తన మీద ఇతర కుటుంబ సభ్యుల మీద దాడులు జరిగే అవకాశం ఉందని తెలుస్తుంది. దీని వెనుక వేల కోట్లకు సంబంధించిన లావాదేవీలు ఉన్నాయని ఇంటిలిజెన్స్ వర్గాలు చెపుతాయి. అదే సమయంలో కోలుకున్న వాసుదేవ్.. వరుణ్ అధికారంలో ఉండేందుకు తనను మోసం చేస్తున్నాడని భావించి పార్టీని తన కంట్రోల్లోకి తెచ్చుకునే ప్రయత్నాలు ప్రారంభిస్తాడు. రాజకీయాలతో ఏ మాత్రం సంబంధం లేని వరుణ్ ఈ పరిస్థితులను ఎలా ఎదుర్కొన్నాడు.? మాజీ ముఖ్యమంత్రి వాసుదేవ్ మీద హత్యా ప్రయత్నం చేసింది ఎవరు.? చివరకు వరుణ్ రాజకీయ నాయకుడిగానే కొనసాగాడా.. లేదా? అన్నదే మిగతా కథ. నటీనటులు ; సినిమాకు ప్రధాన బలం విజయ్ దేవరకొండ. ఒక్కో సినిమాలో ఒక్కో డిఫరెంట్ క్యారెక్టర్తో అభిమానులకు షాక్ ఇస్తున్నాడు విజయ్. సినిమా అంతా తన భుజాల మీదే నడిపించాడు. గత చిత్రాలతో పోలిస్తే ఈ సినిమాలో డిఫరెంట్ లుక్, క్యారెక్టరైజేషన్తో మెప్పించాడు. రౌడీ సీఎం పాత్రలో పర్ఫెక్ట్ గా సూట్ అయ్యాడు. ఎమోషనల్ సీన్స్లో విజయ్ నటన సూపర్బ్. మరో ప్రధాన పాత్రలో సత్యరాజ్ ఆకట్టుకున్నాడు. హీరోకు ప్రతీ విషయంలో సాయం చేసే పాత్రలో ఆయన ఒదిగిపోయారు. మరో కీలక పాత్రలో నాజర్ జీవించారు. పార్టీ నాయకుడిగా నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నాజర్ నటన సినిమాకు మరో బలం. హీరోయిన్ మెహరీన్ది దాదాపు అతిధి పాత్రే. ఇతర పాత్రల్లో సంచన నటరాజన్, ప్రియదర్శి, ఎంఎస్ భాస్కర్ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. విశ్లేషణ : ఓ పొలిటికల్ డ్రామాకు విజయ్ దేవరకొండ లాంటి నటుణ్ని ఎంచుకోవటం సాహసం అనే చెప్పాలి. అయితే దర్శక నిర్మాతలు తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని విజయ్ నిలబెట్టుకున్నాడు. తానే ప్రధాన బలంగా మారి సినిమాను నడిపించాడు. హీరోను ప్లేబాయ్ల పరిచయం చేస్తూ సినిమాలు మొదలు పెట్టిన దర్శకుడు ఆనంద్ శంకర్.. ఏమాత్రం ఆలస్యం చేయకుండా అసలు కథ ప్రారంభించాడు. వెంటనే వరుణ్ పాత్ర సీఎం కావటం తరువాత రాజకీయ పరిణామాలతో ఫస్ట్ హాఫ్ గ్రిప్పింగ్గా సాగుతుంది. విజయ్ నటన, స్క్రీన్ప్లే, డైలాగ్స్, ఇంటర్వెల్ బ్యాంగ్ ఇలా ఫస్ట్ హాఫ్ సూపర్బ్ అనిపిస్తుంది. అయితే సెకండ్ హాఫ్ను అదే స్థాయిలో తెరకెక్కించటంలో దర్శకుడు తడబడ్డాడు. ద్వితీయార్థంలో అక్కడక్కడ కథనం నెమ్మదించటం కాస్త ఇబ్బంది పెడుతుంది. ఇటీవల కాలంలో తమిళ రాజకీయల్లో జరిగిన పరిణామాల నేపథ్యంలో కథను తయారు చేసుకున్న దర్శకుడు తెలుగు నేటివిటీకి అనుగుణంగా ఇంకొన్ని మార్పులు చేసి ఉంటే బాగుండనిపిస్తుంది. భారీ థ్రిల్స్ను ఆశించిన ప్రేక్షకులను క్లైమాక్స్ కూడా నిరాశపరుస్తుంది. సినిమాకు ప్రధాన బలం సామ్ సీయస్ మ్యూజిక్. పాటలు పరవాలేదనిపించినా సామ్ అందించిన నేపథ్య సంగీతం ప్రతీ సీన్ను మరో రేంజ్కు తీసుకెళ్లింది. సినిమాటోగ్రఫి, ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ ; విజయ్ దేవరకొండ నటన నేపథ్య సంగీతం డైలాగ్స్ మైనస్ పాయింట్స్ ; క్లైమాక్స్ సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్. -
కార్తీ ‘చినబాబు’ టీజర్ విడుదల
-
'నా భార్య నా సినిమాలు చూడదు'
విలక్షణ నటుడు సత్యప్రకాష్ బ్యాంకు ఉద్యోగం నుంచి సినిమా ప్రపంచానికి.. సాక్షి, కేకే.నగర్: ఆయన కనపడితే చాలు మహిళలు తిట్ల వర్షం కురిపిస్తారు. పిల్లలైతే భయపడి కళ్లు మూసుకుంటారు. క్రూరమైన వికృత చేష్టలతో అరివీర భయంకరుడుగా అందరినీ భయపెడుతుంటాడు. ఇంతకూ ఇది నిజజీవితంలో కాదు వెండితెరపై మాత్రమే. అతనే ప్రేక్షకులను భయపెట్టే నటుడు సత్యప్రకాష్. తెరపై మా చెడ్డ విలన్... నిజ జీవితంలో మా మంచి అన్నయ్య లాంటి వాడు. చాలా మృదుస్వభావి. ఎవరినీ బాధపెట్టడం కానీ, కన్న పిల్లలపై ఇంత వరకు చెయ్యి చేసుకోవడం కానీ, తిట్టడం కాని చేయలేదని అన్నారు. సినీ ప్రపంచంలో వెండి తెరపై కత్తులతో పొడవడం, పైశాచికంగా గొంతు కోయ డం చేసే ఈయన నిజజీవితంలో చీమకు కూడా కీడు తలపెట్టనని అంటున్నారు. సినీ ప్రపంచంలో తనకొక ప్రత్యేక స్థానం, గుర్తింపు రావడానికి కారణం సద్గురు బాబానే అంటున్నారు సత్యప్రకాష్. మా ఊరు, మన ఊరు శీర్షికలో ఆయన తన ఊరి కబుర్లను, చిన్ననాటి చిలిపి చేష్టలను సాక్షి పాఠకులతో ఈ విధంగా పంచుకున్నారు. 'మా అమ్మమ్మ ఊరు విజయనగరం. నాన్నమ్మ వాళ్లది శ్రీకాకుళం. నాన్న నటరాజ్. అమ్మ రత్నం పక్కా గృహిణి. నాకొక తమ్ముడు, చెల్లెలు ఉన్నారు. నాన్న ఒడిశా రూర్కేలాలోని స్టీల్ ప్లాట్లో ఉన్నతాధికారిగా పని చేశారు. అదే ప్లాంట్లో సుమారు 50 మందికి పైగా స్నేహితులను, బంధువులకు ఉద్యోగాలు ఇప్పించి కంపెనీ తరఫున క్వార్టర్స్ ఇచ్చి తన దగ్గరకు పిలిపించుకున్నారు. అంతేకాదు రూర్కేలాలో 50 మంది తెలుగు కుటుంబాలతో తెలుగు అసోసియేషన్ ను ప్రారంభించారు. నేను పుట్టిన రెండో నెలలోనే రూర్కేలాకు వెళ్లిపోయాను. పెరిగింది, ఎంబీఏ చేసి అలహాబాద్ బ్యాంకులో ఉద్యోగం చేసింది అంతా అక్కడే. రూర్కేలా టూ చెన్నై: స్థిరమైన బ్యాంకు ఉద్యోగాన్ని వదిలి సినిమా వేషాల కోసం రూర్కేలా నుంచి చెన్నైకి చేరుకున్నాను. చెన్నైలోని సెంట్రల్ స్టేషన్ లో వెయిటింగ్ రూమ్లో ఆరు నెలలు తలదాచుకున్నాను. పగలంతా తిరగడం రాత్రి అక్కడకు చేరుకోవడం. ఆ తర్వాత సినిమా యూనిట్ అంతా టీనగర్లో ఉం డడంతో వెస్ట్ మాంబళంలోని నాలుగు అంతస్తుల ఇంటిపైన ఒక గుడిసెలో వంద రూపాయల అద్దెలో ఆరేళ్లు గడిపాను. ఆ ఇంట్లో ప్రతి అవసరానికి గ్రౌండ్ఫ్లోర్కు రావాల్సిందే. అప్పట్లో నాకొక డొక్కు బైక్ ఉండేది. పెట్రోలు పోయడానికి డబ్బుల్లేక దానిపై కూర్చుని నడిపిన దాని కంటే దాన్ని తోసుకుంటూ నడిచిన రోజులే నాకు గుర్తున్నా యి. నాకు అమ్మ, నాన్న పూర్తి సహకారం అందించారు. అప్పటి మద్రాసులో సినిమా అవకాశాల కోసం తిరుగుతున్న సమయంలోనే మేనమామ కూతురు హేమతో వివాహం జరిగింది. ఆమెను జంషెడ్పూర్లోని పుట్టింటిలో ఉంచి ఆరేళ్లు కాళ్లు అరిగేటట్లు ప్రతి సినిమా ఆఫీసు ఎక్కడం, దిగడంతో విరక్తి పుట్టింది. ఇక నాకు ఈ సినిమాలో నటించే అదృష్టం లేదని నిరాశ చెందాను. ఫ్రెండ్ సలహాతో 1995లో షిరిడీ వెళ్లి సాయిబాబాను దర్శించుకుని వచ్చాను. వచ్చిన వెంటనే ప్రముఖ దర్శకుడు నిర్మాత విజయబాపినీడు నన్ను పిలిచి మెగాస్టార్ చిరంజీవి బిగ్బాస్ చిత్రంలో విలన్ పాత్ర చేయడానికి అవకాశం ఇచ్చారు. మెగాస్టార్ నన్ను ఎంతో ప్రోత్సహించి నటనలో మెళకువలు నేర్పించారు. ఆ తర్వాత సాయికుమార్ హీరోగా పోలీసు స్టోరీలో నేను చేసిన విలన్ పాత్ర ఒక్కసారిగా నన్ను ఫీల్డులో ఆకాశమంత ఎత్తుకు తీసుకెళ్లింది. ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు. రాత్రికి రాత్రే తిరుగులేని విలన్ అయ్యాను. ఆ తర్వాత అగ్ని ఐపీఎస్లో కూడా సాయికుమార్తో విలన్ పాత్రలో నటించాను. వరుస సినిమాలు వి జయాలతో వడపళని సాలిగ్రామంలో సొంత ఇల్లు, కారు కొనుక్కున్నాను. బాలకృష్ణతో నటించి న సమరసింహారెడ్డి సూపర్ డూపర్ హిట్టయ్యిం ది. సినిమా షూటింగ్కు ముందు బాలకృష్ణ నన్ను పిలిపించి సెట్లో అందరి ముందు ఆప్యాయం గా ఆలింగనం చేసుకుని విలన్ పాత్రలో నువ్వు జీవిస్తున్నావు అని పొగడడం నాకు ఆనంద బాష్పాలు తెప్పించింది. తెరపై చిరంజీవి, బాలకృష్ణలకు విజిల్ వేస్తూ, చప్పట్లు కొడ్తూ రెండు కళ్లు అనుకున్న అభిమాన హీరోలతో విలన్ గా నటిస్తానని నేను కలలో కూడా ఊహించలేదు. కన్నడ, తెలుగు, తమిళం, ఒరియా, మలయాళం, భోజ్పురి, బెంగాళి, రెండు హాలీవుడ్ సినిమాలతో కలిపి 400లకు పైగా సినిమాల్లో నటించాను. అన్నిట్లో 90 శాతం అతిక్రూరమైన విలన్ పాత్రలే. నాకు తెలుగులో కంటే కన్నడంలోనే ఎక్కువ అవార్డులు వచ్చాయి. లింగ ప్రొడ్యూసర్ రాక్లైన్ వెంకటేష్ నాకు ప్రాణస్నేహితుడు. అతను నా కుమారుడు నటరాజ్కు 'మనసు మల్లిగై' అనే కన్నడ సినిమాలో హీరోగా అవకాశం ఇచ్చారు. ఆ సినిమాతో పాటు మరో సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ప్రస్తుతం మూడో సినిమా హైదరాబాద్లో షూటింగ్ జరుపుకుంటోంది. నా కుమార్తె రామచంద్ర మెడికల్ కాలేజీలో బయోమెడికల్ చేస్తోంది. నేను ఇన్ని సినిమాల్లో నటించినా నా భార్య ఒక్క సినిమా కూడా చూడలేదంటే ఎవరూ నమ్మరు. నాకంత ఇంట్రెస్ట్ లేదు అంటుంది. అయితే నా అభివృద్ధికి ఆమె పూర్తి సహకారం అందించింది. ఊరులో సెలబ్రిటీ: ఒకసారి మా ఊరిలో జరిగే పైడితల్లి జాతరకు వెళ్లినపుడు చాలా ఇబ్బంది పడ్డాను. నన్నెవరూ గుర్తుపట్టరనే ధీమాతో ఒంటరిగా వెళ్లాను. అంతే ఎక్కడి నుంచి వచ్చారో కానీ అభిమానులు సముద్రంలా నన్ను చుట్టుముట్టారు. వారి నుంచి తప్పించుకుని గుడిలోకి వెళ్లి దాక్కున్నాను. ఆ తర్వాత పోలీసులకు ఫోన్ చేసి వారి సహాయంతో ఇంటికి చేరాల్సి వచ్చింది. చిన్నతనం తీపి గురుతులు: వేసవి సెలవులకు విజయనగరం, శ్రీకాకు ళం వచ్చి రెండు నెలలు ఎంజాయ్ చేసేవాడిని నా ఏడేళ్ల వయస్సులో కొబ్బరిబొండాలు, మామి డి తాండ్ర దొంగతనం చేయడం, షాపు అతనికి దొరక్కుడా పరుగులు తీయడం సరదాగా అని పించేది. 14 ఏళ్ల వయస్సులో విజయనగరం హోటల్లోని ఇడ్లీ సాంబార్, ప్యూర్ ఫిల్టర్ కాఫీ నాకెంతో ఇష్టం. చిన్నప్పుడు ఊరికి వస్తే చాలు సినిమాలే సినిమాలు ఒంటరిగా ఒకే రోజు మూడు ఆటలు చూసేవాడిని. సినిమా హాల్లో నేల టికెట్టులో కూ ర్చుని ఇంటర్వెల్లో కుర్చీలో కూర్చుని ఫోజు కొ ట్టేవాడిని. నా 17 ఏళ్ల వయసులో ఊరికి వెళ్లడానికి నాన్న రైలు టికెట్కు డబ్బు ఇస్తే నేనే మో టికెట్ కొనకుండా దేశంబండి (దొంగలబండి) అనే పేరుతో పిలుచుకునే రైల్లో విజయనగరం రావడం ఆ డబ్బులతో సినిమాలు చూడ డం, షికార్లు తిరగడం వంటివి చేసేవాడిని. నేనొ క సినిమా పిచ్చాడిని. నాకు సినిమాలంటే తెగ పిచ్చి. మెగా స్టార్, బాలయ్య నాకు రెండు కళ్లు. ఆ సమయంలో అనుకోలేదు నేను వాళ్లతో విలన్ పాత్రలో నటిస్తానని, అలా నటించడం నాకు ఊహకందని విషయం. రూర్కేలాలోని ఇస్పాట్ కాలేజిలో డిగ్రీ పూర్తి చేసుకుని, ఎంబీఏ చేశాను. ఆ తర్వాత అలహాబాద్ బ్యాంక్లో ఐదేళ్లు ఆఫీసర్ గ్రేడ్లో పని చేస్తున్న సమయంలో మనసంతా సినిమాలపైనే ఉండేది. ఎలాగైనా సినిమాల్లో నటించి పేరు తెచ్చుకోవాలి అనే కోరిక పెరిగింది. నా స్నేహితులందరూ ఒరేయ్ నువ్వు అచ్చు హిందీ హీరోలా ఉన్నావు. బాలీవుడ్లో చేరు అని సలహా ఇచ్చారు. ఇక అంతే వెంటనే బాంబే వెళ్లి ప్రయత్నాలు సాగించాను. ఒకసారి రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో తెలుగు సినిమా షూటింగ్ బాంబేలో జరుగుతున్నట్లు తెలిసింది. వెంటనే వెళ్లి ఆయన ను కలిశాను. ఆయన ఒకే మాట అన్నారు. తెలుగు వాడివై ఉండి బాంబేలో ఉంటే పది మందిలో ఒకడివిగా ఉంటావు. అదే చెన్నైలో ఉంటే పది మందిలో నువ్వు ప్రత్యేకంగా కనిపిస్తావు. అందువలన చెన్నైకు వెళ్లు అవకాశాలు వస్తాయని సలహా ఇచ్చారు. -
మరో భారీ చిత్రంలో కట్టప్ప..!
బాహుబలి తరువాత అంతటి భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న దక్షిణాది చిత్రం సంఘమిత్ర. తమిళ దర్శకుడు సుందర్ సి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను తేనాండల్ ఫిలింస్ సంస్థ 250 కోట్ల బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. తమిళ హీరోలు జయం రవి, ఆర్య హీరోలుగా నటిస్తున్న ఈసినిమాకు హీరోయిన్ ఎంపికపై కసరత్తులు జరుగుతున్నాయి. ముందుగా శృతిహాసన్ ను ఫైనల్ చేసినా తరువాత నిర్మాతలతో అభిప్రాయ భేదం రావటంతో ఆమె తప్పుకుంది. శృతిహాసన్ తరువాత సంఘమిత్ర పాత్రకు చాలా మంది హీరోయిన్ల పేర్లను పరిశీలించిన యూనిట్, హన్సికను ఫైనల్ చేసే ఆలోచనలో ఉంది. సినిమాలో మరో కీలకమైన పాత్రకు కోలీవుడ్ సీనియర్ నటుడు సత్యరాజ్ ను తీసుకున్నారు. బాహుబలి సినిమాలో కట్టప్ప పాత్రతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న సత్యరాజ్, సంఘమిత్రలోనూ కీలక పాత్రలో కనిపించనున్నాడు. -
బాహుబలి 2 రిలీజ్కు గ్రీన్ సిగ్నల్
కర్ణాటకలో రెండు వారాలుగా బాహుబలి 2 రిలీజ్ విషయంలో జరుగుతున్న హై డ్రామాకు తెరపడింది. కావేరి జలాల విషయంలో సత్యరాజ్ చేసిన వ్యాఖ్యలతో కన్నడిగుల మనోభావాలు దెబ్బతిన్నాయన్న ఆరోపణతో ఆయన కీలక పాత్రలో నటించిన బాహుబలి 2 రిలీజ్ ను అడ్డుకుంటామంటూ ప్రకటించారు ఆందోళనకారులు. బాహుబలి 2లో కట్టప్ప పాత్రలో నటించిన సత్యరాజ్ క్షమాపణ చెపితేనే రిలీజ్ కు అంగీకరిస్తామని ప్రకటించారు. రాజమౌళి కోరినా కన్నడ ప్రజాసంఘాలు దిగిరాకపోవటంతో కట్టప్ప దిగిరాక తప్పలేదు. శుక్రవారం కట్టప్ప వీడియో మెసేజ్ రూపంలో కన్నడిగులకు క్షమాపణ తెలపటంతో బాహుబలి 2 రిలీజ్ కు లైన్ క్లియర్ అయ్యింది. కొద్ది రోజులుగా ఆందోళన చేస్తున్న కన్నడిగులు సత్యరాజ్ క్షమాపణలు చెప్పిన తరువాత ఆందోళన విరమిస్తున్నట్టుగా ప్రకటించారు. దీంతో ఏప్రిల్ 28న కర్ణాటకలో కూడా బాహుబలి భారీ ఎత్తున రిలీజ్ కు సిద్ధమవుతోంది. -
కన్నడ ప్రజలకు రాజమౌళి విజ్ఞప్తి
బాహుబలి 2 సినిమా రిలీజ్ పై కన్నడ ప్రజలు స్పందిస్తున్న తీరు చిత్రయూనిట్ ను ఇబ్బంది పెడుతోంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా అనుకున్న స్థాయిలో రిలీజ్ కాకపోతే కలెక్షన్ల మీద ప్రభావం పడే అవకాశం ఉంది. దీంతో కన్నడ ప్రజలకు రాజమౌళి స్వయంగా రిలీజ్ అడ్డుకోవద్దంటూ విజ్ఞప్తి చేశారు. తన సోషల్ మీడియా పేజ్ లో ఓ వీడియో పోస్ట్ చేసిన రాజమౌళి కన్నడలో మాట్లాడి వారికి మరింత చేరువయ్యే ప్రయత్నం చేశాడు. నాకు కన్నడ సరిగా రాదు.. ఏవైనా తప్పులుంటే క్షమించండి అంటూ ప్రారంభించిన జక్కన చాలా ఏళ్ల క్రితం సత్యరాజ్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఇప్పుడు సినిమాను అడ్డుకోవద్దని కోరారు. ఆ వ్యాఖ్యలు కేవలం సత్యరాజ్ వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే అని, వాటితో బాహుబలి యూనిట్ కు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. సినిమా కోసం ఎంతో మంది నటీనటులు, సాంకేతిక నిపుణులు కష్టపడి పని చేశారు. రిలీజ్ అడ్డుకుంటే అందరూ నష్టపోవాల్సి వస్తుందని, బాహుబలి తొలి భాగాన్ని ఆదరించినట్టుగానే కన్నడ ప్రేక్షకులు బాహుబలి రెండో భాగాన్ని కూడా ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. An appeal to all the Kannada friends... pic.twitter.com/5rJWMixnZF — rajamouli ss (@ssrajamouli) 20 April 2017 -
కన్నడ ప్రజలకు రాజమౌళి విజ్ఞప్తి
-
'సీక్వల్లో మరింత బలంగా'
బాహుబలి సినిమా హీరో పాత్రలో పాటు అదే స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న మరో పాత్ర కట్టప్ప. తమిళ నటుడు సత్యరాజ్ పోషించిన ఈ పాత్ర ప్రేక్షకుల మనసుల్లో బలమైన ముద్ర వేసింది. ముఖ్యంగా క్లైమాక్స్లో బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడన్న ప్రశ్న ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా వినిపిస్తోంది. కట్టప్ప పాత్రలో ఆకట్టుకున్న సత్యరాజ్ ప్రస్తుతం దెయ్యం పాత్రలో కనిపించబోతున్నాడు. జాక్సన్ దురై పేరుతో తమిళ్లో తెరకెక్కిన సినిమాను దొర పేరుతో తెలుగులో అనువదిస్తున్నారు. ఈ సినిమాలో తన వారసుడు శిభిరాజ్తో కలిసి నటిస్తున్నాడు సత్యరాజ్. ఈ సినిమా ఆడియో రిలీజ్ సందర్భంగా తనకు ఎంతో పేరు తీసుకువచ్చిన కట్టప్ప పాత్ర విశేషాలను తెలియజేశాడు సత్యారాజ్. తొలి భాగంతో పోలిస్తే రెండో భాగంలో కట్టప్ప పాత్ర మరింత బలంగా ఉంటుందన్న సత్యారజ్, త్వరలోనే తాను బాహుబలి షూటింగ్లో పాల్గొనబోతున్నట్టు తెలిపారు. -
కబాలిపై క్లారిటీ ఇచ్చిన కట్టప్ప
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న మోస్ట్ అవెయిటెడ్ మూవీ కబాలి. రెండు భారీ డిజాస్టర్ల తరువాత రజనీ హీరోగా తెరకెక్కిన సినిమా కావటంతో అభిమానులతో పాటు చిత్ర యూనిట్ కూడా ఈ సినిమా మీద భారీ ఆశలు పెట్టుకున్నారు. అందుకు తగ్గట్టుగా రిలీజ్ డేట్ విషయంలో ఎలాంటి రిస్క్ లేకుండా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే ఈ ప్లానింగ్ అభిమానులకు మాత్రం నిరాశే మిగులుస్తోంది. ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడిన కబాలి సినిమాను మరోసారి వాయిదా వేయాలని భావిస్తున్నారట. ఈ విషయాన్ని చిత్రయూనిట్ తెలపకపోయినా.. ఇతర చిత్రాల నిర్మాతలు కన్ఫామ్ చేస్తున్నారు. సాధారణంగా రజనీ సినిమా రిలీజ్ సమయంలో మరే సినిమా రిలీజ్ చేయడానికి సాహసించరు. అయితే కబాలి రిలీజ్ అనుకుంటున్న జూలై 1న కటప్ప పాత్రతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయిన సత్యరాజ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న జాక్సన్ దురైతో పాటు మరో తమిళ సినిమా జోకర్ను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. రంజాన్ సందర్భంగా సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కిన సుల్తాన్ సినిమా రిలీజ్ అవుతోంది. అయితే నేషనల్ మార్కెట్ను టార్గెట్ చేసిన కబాలి టీం... సుల్తాన్తో పోటీ వద్దని తమ సినిమాను వాయిదా వేసుకుంటున్నారట. ఎలాగూ కబాలి వాయిదా పడుతుందన్న నమ్మకంతో ఆ గ్యాప్ను వాడేసుకోవడానికి రెడీ అవుతున్నారు కోలీవుడ్ దర్శక నిర్మాతలు. -
వైఎస్ఆర్ 'మనసున్న నాయకుడు'
దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితకథ ఆధారంగా ఓ సినిమా రూపొందనుంది. వైజాగ్కు చెందిన అడరి రవికుమార్ ఈ సినిమాను నిర్మిస్తుండగా సీనియర్ హీరో సుమన్ రాజశేఖర్ రెడ్డి పాత్రలో కనిపించనున్నారు. మరో ప్రముఖ నటుడు సత్యరాజ్ వైఎస్ఆర్ తండ్రి రాజారెడ్డి పాత్రలో నటిస్తున్నారు. శనివారం లాంఛనంగా ప్రారంభమైన ఈ సినిమాకు మనసున్న నాయకుడు అనే టైటిల్ను కన్ఫామ్ చేశారు. ప్రస్తుతం నటీనటులతో పాటు ఇతర సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగుతోంది. త్వరలోనే సినిమాకు సంబందించిన మరిన్ని వివరాలు వెల్లడించనున్నట్టు చిత్రయూనిట్ తెలిపారు. జూన్ చివరి వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుంది. -
తుంగభద్ర మూవీ స్టిల్స్