seventh season
-
రానున్న 'కాఫీ విత్ కరణ్' షో 7వ సీజన్.. టీజర్ రిలీజ్
Karan Johar Announces Koffee With Karan Show 7 Season Teaser: అన్ని భాషల్లో పాపులారిటీ సంపాదించుకున్న షోలలో కాఫీ విత్ కరణ్ ఒకటి. ప్రముఖ దర్శక-నిర్మాత కరణ్ జోహార్ హోస్ట్ చేసే ఈ షోలో సెలబ్రిటీలు వచ్చి తమ వ్యక్తిగత, వృత్తిపరమైన విషయాలను పంచుకుంటారు. ఈ షోకి బాలీవుడ్లో విపరీతమైన క్రేజ్ ఉంది. అయితే ఇటీవల ఈ షోను ఇక కొనసాగించనని కరణ్ జోహార్ ప్రకటించి అభిమానులను షాక్గు గురిచేశాడు. కానీ తాజాగా ఆదివారం (జూన్ 19) ఈ షో 7వ సీజన్ను టెలీకాస్ట్ చేస్తున్నట్లు ఓ వీడియో విడుదల చేసి ఆశ్చర్యపరిచాడు కరణ్ జోహార్. ఈ వీడియోలో రణ్బీర్ కపూర్, రణ్వీర్ సింగ్, సైఫ్ అలీ ఖానా, కరీనా కపూర్, ప్రియాంక చోప్రా, షారుక్ ఖాన్, ఐశ్వర్య రాయ్ తదితరులు ఉన్నారు. అలాగే ఈ టీజర్లో 'ఇప్పుడు రాబోయే సీజన్ మరింత పెద్దది, మెరుగైనది, ఇంకా మరింత అందమైనది' అని కరణ్ జోహార్ ఉత్సాహంగా చెప్పడం మనం చూడొచ్చు. కాపీ విత్ కరణ్ సీజన్ 7 ప్రముఖ ఓటీటీ డిస్నీ ప్లస్ హాట్స్టార్లో జులై 7 నుంచి ప్రసారం కానుంది. చదవండి: చెత్త ఏరిన స్టార్ హీరోయిన్.. వీడియో వైరల్ సాయి పల్లవి వివరణపై ప్రకాశ్ రాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు.. థియేటర్లో అందరిముందే ఏడ్చేసిన సదా.. వీడియో వైరల్ View this post on Instagram A post shared by Karan Johar (@karanjohar) -
మూడు నిమిషాల్లో రెండు గోల్స్...
మార్గావ్ (గోవా): ఓటమి ఖాయం అనుకున్న చోట గోవా ఫుట్బాల్ క్లబ్ (ఎఫ్సీ) ఫార్వర్డ్ ఇగోర్ ఎంజులో అద్భుతం చేశాడు. మూడు నిమిషాల వ్యవధిలో రెండు గోల్స్ చేసి జట్టుకు ఓటమిని తప్పించాడు. ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్బాల్ టోర్నీ ఏడో సీజన్లో భాగంగా ఆదివారం ఎఫ్సీ గోవా, బెంగళూరు ఎఫ్సీ మధ్య జరిగిన మ్యాచ్ 2–2 గోల్స్తో ‘డ్రా’గా ముగిసింది. సీజన్ తొలి రెండు మ్యాచ్ల్లో ఒక్కో గోల్ మాత్రమే నమోదు కాగా... మూడో మ్యాచ్ మాత్రం అసలైన ఫుట్బాల్ వినోదాన్ని పంచింది. బెంగళూరు ఆటగాళ్లు సిల్వా (27వ నిమిషంలో), ఆంటోనియో గొంజాలెజ్ (57వ నిమిషంలో) తలా ఓ గోల్ సాధించారు. గోవా తరఫున ఇగోర్ (66వ, 69వ నిమిషాల్లో) రెండు గోల్స్ చేసి జట్టును గట్టెక్కించాడు. సునీల్ చెత్రి నాయకత్వంలోని బెంగళూరు తొలి అర్ధ భాగంలో అదరగొట్టింది. హర్మన్జోత్ సింగ్ లాంగ్ త్రోను ముందుకు దూసుకుంటూ వచ్చిన సిల్వా... తలతో బంతిని గోల్పోస్ట్లోకి పంపి బెంగళూరుకు 1–0 ఆధిక్యాన్నిచ్చాడు. ఇక రెండో అర్ధ భాగంలో ఎరిక్ ఎండెల్ హెడర్తో ఇచ్చిన పాస్ను గోల్గా మలిచిన ఆంటోనియో బెంగళూరును 2–0తో పటిష్ట స్థితిలో నిలిపాడు. ఈ దశలో బెంగళూరు గెలుపు ఖాయంలా కనిపించింది. అయితే బెంగళూరు విజయావకాశాలను ఇగోర్ దెబ్బ తీశాడు. అల్బెర్టో, జెసురాజ్ ఇచ్చిన పాస్లను గోల్స్గా మలిచి... మ్యాచ్ను ‘డ్రా’గా ముగించాడు. నేటి మ్యాచ్లో ఒడిశా ఎఫ్సీతో హైదరాబాద్ ఎఫ్సీ తలపడుతుంది. -
నార్త్ఈస్ట్ యునైటెడ్ బోణీ
వాస్కోడగామా (గోవా): ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్బాల్ టోర్నమెంట్ ఏడో సీజన్లో నార్త్ఈస్ట్ యునైటెడ్ ఫుట్బాల్ క్లబ్ (ఎఫ్సీ) బోణీ కొట్టింది. ఇక్కడి తిలక్ మైదాన్ స్టేడియంలో శనివారం జరిగిన మ్యాచ్లో నార్త్ఈస్ట్ యునైటెడ్ 1–0తో ముంబై సిటీ ఫుట్బాల్ క్లబ్పై గెలుపొందింది. జట్టుకు లభించిన పెనాల్టీని 49వ నిమిషంలో గోల్గా మలిచిన అపియా నార్త్ఈస్ట్కు విజయం దక్కేలా చేశాడు. ఈ మ్యాచ్లో ఫేవరెట్గా బరిలోకి దిగిన ముంబై... ఆ అంచనాలకు తగ్గట్టే మ్యాచ్ను ఆరంభించింది. ముఖ్యంగా అహ్మద్ జాహూ, హ్యూగో బౌమస్, ఒగ్బెచే చక్కటి సమన్వయంతో కదులుతూ నార్త్ఈస్ట్పై ఒత్తిడి పెంచారు. ప్రత్యర్థి గోల్ పోస్ట్ దగ్గరికి బంతిని తీసుకెళ్లినా... ఫినిష్ చేయడంలో సఫలం కాలేకపోయారు. నేటి మ్యాచ్లో గోవా ఎఫ్సీతో బెంగళూరు ఎఫ్సీ తలపడుతుంది. -
సూపర్ ఫుట్బాల్
కళ్లు చెదిరే ఫ్రీ కిక్లు... కళాత్మకమైన పాస్లు... మతి పోగొట్టే హెడర్స్... ఒళ్లు గగుర్పాటుకు గురి చేసే డిఫెండర్ల విన్యాసాలు... వెరసి ప్రేక్షకుల్ని అలరించడానికి ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) సిద్ధమైంది. కరోనా నేపథ్యంలో కట్టు బాట్ల నడుమ బుడగలో కాలికి, బంతికి జరిగే ఈ పోరాటంలో గెలిచేందుకు 11 జట్లు రె‘ఢీ’ అయ్యాయి... మనల్ని ఉత్సాహపరిచేందుకు ఫుట్బాల్ పండుగను తీసుకొచ్చాయి. పనాజీ: నాలుగు నెలల పాటు భారత ఫుట్బాల్ అభిమానులను అలరించడానికి ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) వచ్చేసింది. నేడు కేరళ బ్లాస్టర్స్, ఏటీకే మోహన్ బగాన్ మ్యాచ్తో ఏడో సీజన్కు తెర లేవనుంది. కరోనా విరామం అనంతరం దేశంలో జరగనున్న తొలి క్రీడా ఈవెంట్ ఇదే కావడం విశేషం. దాంతో టోర్నీని ఒకే చోట నిర్వహించడానికి సిద్ధమైన లీగ్ నిర్వాహకులు... అందుకోసం గోవాను ఎంచుకున్నారు. అక్కడే ‘బయో సెక్యూర్ బబుల్’ను ఏర్పాటు చేశారు. మొత్తం మూడు స్టేడియాల్లో మ్యాచ్లు జరగనున్నాయి. క్వారంటైన్ నిబంధనలు ఉండటంతో టోర్నీలో పాల్గొనే ప్లేయర్లు నెల రోజులు ముందుగానే గోవాకు చేరుకున్నారు. ఇక టైటిల్ కోసం పోటీ పడే జట్ల సంఖ్య ఈ సారి పెరిగింది. లీగ్లోకి కొత్తగా స్పోర్టింగ్ క్లబ్ ఈస్ట్ బెంగాల్ వచ్చి చేరడంతో... జట్ల సంఖ్య 11కు చేరింది. టైటిల్ ఫేవరెట్లుగా డిఫెండింగ్ చాంపియన్ ఏటీకే మోహన్ బగాన్, మాజీ చాంపియన్ బెంగళూరు ఎఫ్సీ కనిపిస్తున్నాయి. తమ తొలి సీజన్ (2019–20)లో అనుకున్నంత స్థాయిలో ప్రదర్శన కనబరచని హైదరాబాద్ ఫుట్బాల్ క్లబ్ (ఎఫ్సీ)... ఈ సారి మెరుగైన ప్రదర్శన ఇవ్వాలనే పట్టుదలతో ఉంది. ఇందుకోసం స్పెయిన్కు చెందిన మాన్యుయెల్ మార్కజ్ను తమ హెడ్ కోచ్గా కూడా నియమించింది. గత సీజన్లో హైదరాబాద్ ఎఫ్సీ... రెండు విజయాలు మాత్రమే నమోదు చేసి పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచి నిరాశ పరిచింది. రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిన జరిగే ఈ టోర్నీలో తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీస్కు అర్హత సాధిస్తాయి. అనంతరం సెమీ ఫైనల్స్ జరుగుతాయి. కరోనా ఉండటంతో ఈ సారి ఇంటా, బయట పద్ధతిలో కాకుండా ఒకే చోట సెమీస్ మ్యాచ్లు జరుగుతాయి. ఇక్కడ విజేతలుగా నిలిచిన జట్లు ఫైనల్కు అర్హత సాధిస్తాయి. ఇప్పటి వరకు లీగ్ తొలి అంచె మ్యాచ్ తేదీలను మాత్రమే నిర్వాహకులు ప్రకటించారు. డిసెంబర్లో రెండో అంచె పోటీలతో పాటు సెమీస్, ఫైనల్ తేదీలను ప్రకటించే అవకాశం ఉంది. సబ్స్టిట్యూట్ల సంఖ్య పెరిగింది కరోనా నేపథ్యంలో ఈ ఏడాది మే నెలలో అంతర్జాతీయ ఫుట్బాల్ సంఘాల సమాఖ్య (ఫిఫా) ప్రతిపాదించిన ‘ఐదుగురు సబ్స్టిట్యూట్’ నిబంధన ఐఎస్ఎల్లో కొనసాగనుంది. దాంతో మ్యాచ్ మధ్యలో ఒక జట్టు గరిష్టంగా ఐదుగురు సబ్స్టిట్యూట్లను ఆడించవచ్చు. మ్యాచ్ జరుగుతున్న సమయంలో మూడు సందర్భాల్లో మాత్రమే వీరిని బరిలోకి దించాలి. అంతేకాకుండా సబ్స్టిట్యూట్ బెంచ్ను ఏడుగురి నుంచి తొమ్మిదికి పెంచారు. హైదరాబాద్ ఎఫ్సీ జట్టు: గోల్ కీపర్లు: లాల్బియాక్లువా జోంగ్టే, లక్ష్మీకాంత్, మానస్ దూబే, సుబ్రతా పాల్. డిఫెండర్లు: ఆకాశ్ మిశ్రా, ఆశిష్ రాయ్, చింగ్లెన్సనా సింగ్, డింపిల్ భగత్, కిన్సైలాంగ్ ఖోంగ్సిట్, నిఖిల్ ప్రభు, ఒడి ఒనైందియా, సాహిల్ పన్వార్. మిడ్ ఫీల్డర్లు: అభిషేక్ హల్దార్, ఆదిల్ ఖాన్, సాహిల్ తవోరా, హలిచరన్ నర్జారీ, హితేశ్ శర్మ, జావో విక్టోర్, లల్దాన్మవియా రాల్టే, లూయిస్ సస్ట్రే, మార్క్ జొతాన్పుయా, మొహమ్మద్ యాసిర్, నిఖిల్ పూజారి, సౌవిక్ చక్రవర్తి, స్వీడెన్ ఫెర్నాండెస్. ఫార్వర్డ్స్: సాంటాన, సాండ్రెజ్, ఇషాన్ డే, జోల్ చియానీస్, లాలాంపుయా, లిస్టన్ కొలాకో, రోహిత్ దను, హెడ్ కోచ్: మాన్యుయెల్ మార్కజ్. -
ప్రదీప్ 26, తలైవాస్ 25
కోల్కతా: పట్నా పైరేట్స్ రైడర్ ప్రదీప్ నర్వాల్ విశ్వరూపం ప్రదర్శించాడు. ఏకంగా 26 పాయింట్లు సాధించి జట్టుకు ఒంటి చేత్తో విజయాన్ని అందించాడు. దీంతో ప్రొ కబడ్డీ లీగ్ సీజన్–7లో సోమవారం జరిగిన మ్యాచ్లో పట్నా 51–25తో తమిళ్ తలైవాస్ను చిత్తు చేసింది. పట్నా సాధించిన మొత్తం పాయింట్లల్లో ప్రదీప్ సాధించిన పాయింట్లు సగం ఉండటం విశేషం. అంతే కాకుండా ప్రత్యర్థి సాధించిన పాయింట్ల కంటే ప్రదీప్ సాధించిన పాయింట్లే ఎక్కువ. అంతకుముందు జరిగిన మ్యాచ్లో యూపీ యోధ 33–26తో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్పై విజయం సాధించింది. గుజరాత్ రైడర్ సచిన్ సూపర్ టెన్తో రాణించినా జట్టుకు విజయాన్ని మాత్రం అందించలేకపోయాడు. -
యు ముంబా సిక్సర్...
బెంగళూరు: రైడర్ అభిషేక్ సింగ్ (13 పాయింట్లు), డిఫెండర్ ఫజల్ అత్రాచలి (6 పాయింట్లు) ఆకట్టుకునే ప్రదర్శనతో ప్రొ కబడ్డీ లీగ్ ఏడో సీజన్లో యు ముంబా జట్టు జయాపజయాలను సమం చేసింది. స్థానిక కంఠీరవ స్టేడియంలో శనివారం మ్యాచ్లో యు ముంబా 47–21తో జైపూర్ పింక్ పాంథర్స్ను చిత్తుగా ఓడించి ఈ సీజన్లో ఆరో విజయాన్ని నమోదు చేసింది. దీంతో ఇప్పటివరకు 12 మ్యాచ్లాడిన ముంబా 6 మ్యాచ్ల్లో గెలిచి మరో ఆరింటిలో ఓడినట్లయింది. అభిషేక్ సింగ్ 18 సార్లు రైడింగ్కు వెళ్లి 10 సార్లు సఫలమయ్యాడు. మరో 7 పర్యాయాలు పాయింట్లేమీ తీసుకురాకుండా, ఒకసారి మాత్రం ప్రత్యర్థి డిఫెండర్లకు దొరికిపోయాడు. మరో రైడర్ అర్జున్ (6 పాయింట్లు) ఆకట్టుకున్నాడు. హరేంద్ర ఐదుగురిని పట్టేసి ఐదు పాయింట్లు సాధించాడు. ప్రత్యర్థి ఆటగాళ్లలో రైడింగ్లో నితిన్ రావల్ (5 పాయింట్లు), ట్యాకిల్లో అమిత్ హుడా (3 పాయింట్లు) రాణించారు. మరో మ్యాచ్లో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్ 32–23తో బెంగళూరు బుల్స్పై నెగ్గింది. విజేత జట్టులో సౌరభ్ (8 పాయింట్లు), మహేందర్ సింగ్ (4 పాయింట్లు) రాణించారు. బెంగళూరు జట్టులో సచిన్, జీబీ మోరే చెరో 5 పాయింట్లు సాధించారు. నేడు యూపీ యోధాతో బెంగాల్ వారియర్స్, బెంగళూరు బుల్స్తో తమిళ్ తలైవాస్ ఆడతాయి. -
హరియాణాను గెలిపించిన వికాశ్
న్యూఢిల్లీ: ప్రొ కబడ్డీ లీగ్లో భాగంగా సోమవారం జరిగిన మ్యాచ్లో హరియాణా స్టీలర్స్ 36–33తో బెంగాల్ వారియర్స్ను కంగుతినిపించింది. హరియాణా రైడర్ వికాశ్ కండోలా 11 పాయింట్లతో చెలరేగాడు. మరో రైడర్ వినయ్ 9 పాయింట్లతో వికాశ్కు చక్కని సహకారం అందించాడు. బెంగాల్ వారియర్స్ రైడర్ మణీందర్ సింగ్ 15 పాయింట్లతో ‘టాప్’ స్కోరర్గా నిలిచినా జట్టుకు విజయాన్ని అందించలేకపోయాడు. మరో మ్యాచ్లో యూపీ యోధ 35–30తో పుణేరి పల్టన్పై నెగ్గింది. నేడు ప్రొ కబడ్డీ లీగ్లో విశ్రాంతి దినం. బుధవారం జరిగే మ్యాచ్ల్లో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్తో హరియాణా స్టీలర్స్; యు ముంబాతో దబంగ్ ఢిల్లీ తలపడతాయి. -
టైటాన్స్ మూడో విజయం
న్యూఢిల్లీ: ప్రొ కబడ్డీ లీగ్ ఏడో సీజన్లో తెలుగు టైటాన్స్ మూడో విజయాన్ని సాధించింది. ఢిల్లీ వేదికగా శనివారం జరిగిన మ్యాచ్లో టైటాన్స్ 24–21తో జైపూర్ పింక్ పాంథర్స్కు షాకిచ్చింది. డిఫెండర్ విశాల్ భరద్వాజ్ 8 టాకిల్ పాయింట్లతో ప్రత్యర్థిని పట్టేయడంలో సఫలం అయ్యాడు. చివర్లో టైటాన్స్ సారథి అబొజర్ తన అనుభవంతో ప్రత్యర్థిని పట్టేసి జట్టుకు విజయాన్ని అందించాడు. అంతకుముందు జరిగిన మరో మ్యాచ్లో ఆతిథ్య ఢిల్లీ దబంగ్ 33–31తో బెంగళూరు బుల్స్ను ఓడించింది. నేటి మ్యాచ్ల్లో జైపూర్ పింక్ పాంథర్స్తో బెంగళూరు బుల్స్; యూపీ యోధతో దబంగ్ ఢిల్లీ తలపడతాయి. -
వారియర్స్ విజయం
చెన్నై: ప్రొ కబడ్డీ లీగ్ ఏడో సీజన్లో బెంగాల్ వారియర్స్ ఐదో విజయాన్ని నమోదు చేసుకుంది. గురువారం జరిగిన మ్యాచ్లో బెంగాల్ వారియర్స్ 35–26తో పట్నా పైరేట్స్పై గెలుపొందింది. రైడర్ మణీందర్ సింగ్ సూపర్ ‘టెన్’తో చెలరేగి జట్టుకు విజయాన్ని అందించాడు. అతనికి డిఫెండర్ రింకు నర్వాల్ (5 పాయింట్లు) నుంచి చక్కని సహకారం అందింది. పట్నా తరఫున ఒంటరి పోరాటం చేసిన ప్రదీప్ నర్వాల్ 11 పాయింట్లతో టాప్ స్కోరర్గా నిలిచినా... సహచరులు రాణించకపోవడంతో జట్టుకు విజయాన్ని అందించలేకపోయాడు. మ్యాచ్ లో బెంగాల్ ప్రత్యర్థిని 4 సార్లు ఆలౌట్ చేయగా... పట్నా రెండు సార్లు ఆలౌట్ చేసింది. ఈ విజయంతో బెంగాల్ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది. నేడు జరిగే మ్యాచ్ల్లో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్తో పట్నా పైరేట్స్, తమిళ్ తలైవాస్తో యు ముంబా తలపడతాయి. -
తమిళ్ తలైవాస్ ఓటమి
చెన్నై: సొంత ప్రేక్షకుల మధ్య ఆడిన తొలి మ్యాచ్లో తమిళ్ తలైవాస్ పరాభవాన్ని మూటగట్టుకుంది. ప్రొ కబడ్డీ లీగ్ ఎడో సీజన్లో భాగంగా శనివారం జరిగిన మ్యాచ్లో తమిళ్ తలైవాస్ 21–32తో బెంగళూరు బుల్స్ చేతిలో ఓడింది. తలైవాస్ స్టార్ ఆటగాళ్లు రాహుల్ చౌదరి, మంజీత్ చిల్లర్, అజయ్ ఠాకూర్లు పూర్తిగా విఫలమయ్యారు. బెంగళూరు ఆటగాడు పవన్ షెరావత్ సూపర్ ‘టెన్’ (మొత్తం 11 పాయింట్లు)తో జట్టుకు విజయాన్ని అందించాడు. ఆద్యంతం హోరాహోరీగా సాగిన బెంగాల్ వారియర్స్, దబంగ్ ఢిల్లీల మ్యాచ్ చివరకు 30–30తో ‘టై’గా ముగిసింది. దబంగ్ ఢిల్లీ ఆటగాడు ప్రవీన్ కుమార్ 11 పాయింట్లతో ‘టాప్’ స్కోరర్గా నిలిచాడు. -
యు ముంబా విజయం
అహ్మదాబాద్ వేదికగా శుక్రవారం జరిగిన ప్రొ కబడ్డీ లీగ్ సీజన్–7 మ్యాచ్లో యు ముంబా 34–30తో పట్నా పైరేట్స్పై గెలుపొందింది. యు ముంబా రైడర్ రోహిత్ బలియాన్ 9 పాయింట్లతో జట్టుకు విజయాన్ని అందించాడు. మరో మ్యాచ్లో జైపూర్ పింక్ పాంథర్స్ 22–19తో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్పై విజయం సాధించింది. జైపూర్ రైడర్ దీపక్ నివాస్ హుడా 7 పాయింట్లతో రాణించాడు. నేటి నుంచి చెన్నైలో పోటీలు జరుగుతాయి. తొలి రోజు తమిళ్ తలైవాస్తో బెంగళూరు బుల్స్; బెంగాల్ వారియర్స్తో దబంగ్ ఢిల్లీ తలపడతాయి. -
జైపూర్ విజయాల బాట
అహ్మదాబాద్: జైపూర్ పింక్ పాంథర్స్ మళ్లీ విజయాల బాట పట్టింది. తమ చివరి మ్యాచ్లో దబంగ్ ఢిల్లీ చేతిలో అనూహ్యంగా ఓడిన పింక్ పాంథర్స్ ఆ షాక్ నుంచి త్వరగానే తేరుకున్నట్లు కనిపించింది. ప్రొ కబడ్డీ లీగ్ ఏడో సీజన్లో భాగంగా గురువారం జరిగిన మ్యాచ్లో జైపూర్ 33–25తో పుణేరి పల్టన్ను ఓడించింది. జైపూర్ స్టార్ రైడర్ దీపక్ నివాస్ హుడా మరో సూపర్ ‘టెన్’తో చెలరేగాడు. పుణే తరఫున పంకజ్ మోహిత్ 8 పాయింట్లతో రాణించాడు. ఆట ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన జైపూర్... ఎక్కడా తడబాటుకు గురికాలేదు. తమ రైడింగ్తో ప్రత్యర్థి డిఫెన్స్ను ఛేదిస్తూ... అలాగే పుణే రైడర్లను పట్టేస్తూ దూసుకెళ్లింది. ఇదే జోరులో పుణేని ఆలౌట్ చేసి 17–11తో తొలి అర్ధ భాగాన్ని ముగించింది. రెండో అర్ధ భాగంలోనూ దూకుడును కొనసాగించిన జైపూర్ సీజన్లో 5 విజయాన్ని నమోదు చేసి పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకింది. నేటి మ్యాచ్ల్లో యూ ముంబాతో పట్నా పైరేట్స్; గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్తో జైపూర్ పింక్ పాంథర్స్ తలపడతాయి. -
వారియర్స్తో ‘టై’టాన్స్
అహ్మదాబాద్: గుజరాత్పై విజయంతో ఇక తెలుగు టైటాన్స్ గాడిలో పడిందని అనుకుంటే... ఆ దూకుడు కేవలం ఒక విజయానికి మాత్రమే పరిమితమైంది. సోమవారం బెంగాల్ వారియర్స్తో జరిగిన మ్యాచ్ను టైటాన్స్ 29–29తో ‘టై’ చేసుకుంది. ఈ సీజన్లో టైటాన్స్కిది రెండో ‘టై’ కావడం విశేషం. ఆట ఆరంభంలోనే సిద్ధార్థ్ దేశాయ్ తన రైడ్తో పాయింట్ తెచ్చి జట్టు ఖాతా తెరిచాడు. మ్యాచ్ మొదటి భాగంలో ప్రత్యర్థి నుంచి పోటీ ఎదురవడంతో తెలుగు టైటాన్స్ 13–11తో స్వల్ప ఆధిక్యాన్ని సాధించింది. అయితే రెండో అర్ధ భాగం ఆరంభమైన కాసేపటికే ప్రత్యర్థి జట్టును ఆలౌట్ చేసిన టైటాన్స్ 17–12తో ఆధిక్యంలోకెళ్లింది. అయితే ఆధిక్యంలో ఉన్నామన్న అతివిశ్వాసం జట్టును దెబ్బతీసింది. ప్రతి రైడర్ను పట్టేయాలని డిఫెండర్ విశాల్ భరద్వాజ్ చూపించిన అనవసరపు దూకుడు అతడిని పలుమార్లు కోర్టును వీడేలా చేసింది. అప్పటి వరకు నిలకడగా రాణించిన సిద్ధార్థ్ దేశాయ్, సూరజ్ దేశాయ్ల రైడింగ్ లయ తప్పడంతో ప్రత్యర్థులకు సులభంగా దొరికిపోయారు. ఒక్కో పాయింట్ సాధిస్తూ వచ్చిన వారియర్స్ టైటాన్స్ను ఆలౌట్ చేసి 23–21తో ఆధిక్యంలోకెళ్లింది. అయితే చివర్లో పుంజుకున్న టైటాన్స్ స్కోర్ను సమం చేసి ఊపిరి పీల్చుకుంది. టైటాన్స్ రైడర్ సూరజ్ దేశాయ్ 7 పాయింట్లతో ఆకట్టుకున్నాడు. అనంతరం జరిగిన మరో మ్యాచ్లో యూపీ యోధ జట్టు 35–33తో బెంగళూరు బుల్స్ను ఓడించింది. యూపీ రైడర్ పవన్ శెరావత్ అటు రైడింగ్లో, ఇటు ప్రత్యర్థిని పట్టేయడంలోనూ చెలరేగాడు. మొత్తం 15 పాయింట్ల (6 రైడ్, 3 టాకిల్, 6 బోనస్)తో జట్టుకు ఒంటి చేత్తో విజయాన్ని అందించాడు. నేడు ప్రొ కబడ్డీ లీగ్లో విశ్రాంతి దినం. బుధవారం జరిగే మ్యాచ్ల్లో యూపీ యోధతో హరియాణా స్టీలర్స్; గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్తో బెంగాల్ వారియర్స్ తలపడతాయి. -
జెర్సీ మారింది... బోణీ కొట్టింది
అహ్మదాబాద్: మారిన జెర్సీ రంగు తెలుగు టైటాన్స్ జట్టుకు అదృష్టాన్ని తీసుకొచ్చింది. ఈ సీజన్ ప్రొ కబడ్డీ లీగ్లో అందని ద్రాక్షలా ఉన్న గెలుపు ఎట్టకేలకు తెలుగు టైటాన్స్ను పలకరించింది. ఆదివారం జరిగిన మ్యాచ్లో తెలుగు టైటాన్స్ 30–24తో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్ను ఓడించి ఈ లీగ్లో తొలి విజయాన్ని అందుకుంది. టైటాన్స్ తరఫున సిద్ధార్థ్ దేశాయ్, విశాల్ భరద్వాజ్లు చెరో ఏడు పాయింట్లతో జట్టుకు విజయాన్ని ఖాయం చేశారు. మ్యాచ్ మొత్తంలో 16 టాకిల్ పాయింట్లు, 11 రైడ్ పాయింట్లతో ప్రత్యర్థిని రెండు సార్లు ఆలౌట్ చేసిన తెలుగు జట్టు గెలుపు బోణీ కొట్టింది. సీజన్లో ఇప్పటి వరకు ఆడిన అన్ని మ్యాచ్ల్లోనూ పసుపు రంగు జెర్సీతో బరిలో దిగిన టైటాన్స్... గుజరాత్తో మ్యాచ్లో మాత్రం నల్ల రంగు జెర్సీతో ఆడింది. కొత్త జెర్సీ రంగు ఏం అదృష్టం తెచ్చిందో ఏమో కానీ.. ప్రత్యర్థి జట్టును ఆట ఆరంభమైన ఏడో నిమిషంలోనే ఆలౌట్ చేసింది. మొదటి అర్ధ భాగంలో సిద్ధార్థ్ రైడింగ్లో చెలరేగితే... రెండో అర్ధ భాగంలో విశాల్ భరద్వాజ్ తన పట్టుతో ప్రత్యర్థి రైడర్లను పట్టేశాడు. దీంతో గుజరాత్ సొంత మైదానంలో వరుసగా రెండో ఓటమిని నమోదు చేసింది. అంతకుముందు జరిగిన మ్యాచ్లో బెంగళూరు బుల్స్ 30–33తో హరియాణా స్టీలర్స్ చేతిలో ఓడింది. హరియాణా రైడర్ వికాస్ ఖండోలా 12 పాయింట్లతో రాణించాడు. నేటి మ్యాచ్ల్లో బెంగాల్ వారియర్స్తో తెలుగు టైటాన్స్; యూపీ యోధతో బెంగళూరు బుల్స్ తలపడతాయి. -
వారెవ్వా వారియర్స్
పట్నా: పేరుకు తగ్గట్టే బెంగాల్ వారియర్స్ అసలైన వారియర్లా పోరాడింది. ఒక్కసారి కాదు ఏకంగా రెండు సార్లు 5 పాయింట్ల అంతరాన్ని పూడ్చి విజేతగా నిలిచింది. ఒత్తిడి సమయాన ఎలా ఆడాలో మిగతా జట్లకు నేర్పింది. శుక్రవారం జరిగిన మ్యాచ్లో బెంగాల్ వారియర్స్ 32–30తో యు ముంబాను ఓడించింది. అదిరే ఆరంభం లభించినా... దానిని సద్వినియోగం చేసుకోలేని యు ముంబా సీజన్లో నాలుగో పరాభవాన్ని మూటగట్టుకుంది. యు ముంబా రైడర్ అర్జున్ దేశ్వాల్ సూపర్ ‘టెన్’తో చెలరేగినా... వారియర్స్ సమష్టి కృషి ముందు అది ఏ మాత్రం నిలవలేదు. వారియర్స్ డిఫెండర్లయిన మణీందర్ సింగ్, బల్దేవ్ సింగ్లు చెరో 5 టాకిల్ పాయింట్లతో మెరిశారు. ముంబా... విజయం ముంగిట... మ్యాచ్ మొదటి అర్ధ భాగంలో యు ముంబా ఆడిన తీరు చూస్తే ఆ జట్టు ఖాతాలో మరో విజయం ఖాయమన్నట్లు కనిపించింది. విరామ సమయానికి ఆ జట్టు 16–11తో ఆధిక్యంలో ఉంది. అయితే రెండో అర్ధ భాగం ఆరంభమైన కాసేపటికే సూపర్ రైడ్తో చెలరేగిన వారియర్ రైడర్ ప్రపంజన్ కుమార్ యు ముంబా ఆధిక్యాన్ని 14–16కు తగ్గించాడు. అనంతరం మరో నాలుగు పాయింట్లు సాధించిన బెంగాల్ జట్టు 18–17తో ముందంజ వేసింది. ప్రత్యర్థి ఇచ్చిన షాక్ నుంచి తేరుకున్నట్లు కనిపించిన ముంబై జట్టు వరుసగా పాయింట్లు సాధించి 26–21తో మరోసారి ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఇటువంటి ఒత్తిడి సమయంలో ముంబైని తమ పట్టుతో పట్టేసిన బెంగాల్ డిఫెండర్లు ఆ జట్టును ఆలౌట్ చేసి... అనంతరం ఆధిక్యాన్ని కాపాడుకొని విజయాన్ని అందుకున్నారు. సొంత మైదానంలో పట్నా పైరేట్స్ ఎట్టకేలకు విజయం సాధించింది. అంతకు ముందు ఆడిన మూడు మ్యాచ్ల్లోనూ ఓడిన పట్నా... చివరి మ్యాచ్లో విజయం సాధించి ఊపిరి పీల్చుకుంది. 41–20తో యూపీ యోధపై ఘన విజయం సాధించింది. పట్నా తరపున ప్రదీప్ నర్వాల్ 12 పాయింట్లతో రాణించాడు. నేటి నుంచి గుజరాత్ అంచె పోటీలు అహ్మదాబాద్లో ఆరంభం కానున్నాయి. నేడు జరిగే మ్యాచ్ల్లో తమిళ్ తలైవాస్తో గుజరాత్ ఫార్చున్ జెయింట్స్; పుణేరి పల్టన్తో దబంగ్ ఢిల్లీ తలపడతాయి. -
పరాజయాల టైటాన్స్
పట్నా: ప్రొ కబడ్డీ ఏడో సీజన్లో తెలుగు టైటాన్స్ ఇప్పట్లో బోణీ కొట్టేలా కనిపించడం లేదు. గురువారం బెంగళూరు బుల్స్తో జరిగిన మ్యాచ్లో 47–26తో ఓడిన టైటాన్స్ సీజన్లో మరో పరాభవాన్ని మూటగట్టుకుంది. టైటాన్స్ రైడర్ సిద్ధార్థ్ దేశాయ్ 11 పాయింట్లతో తొలిసారి తన స్థాయికి తగ్గ ప్రదర్శన కనబరిచినా... బుల్స్ రైడర్ పవన్ కుమార్ (17 పాయింట్లు) రైడింగ్ ముందు నిలబడలేకపోయాడు. దీంతో సీజన్లో ఇప్పటి వరకు ఆడిన 6 మ్యాచ్ల్లో ఐదింటిలో ఓడి, ఒక దాంట్లో ‘టై’తో సరిపెట్టుకున్న టైటాన్స్ పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో కొనసాగుతుంది. నేడు జరిగే మ్యాచ్ల్లో యు ముంబాతో బెంగాల్ వారియర్స్, పట్నా పైరేట్స్తో యూపీ యోధ తలపడతాయి. -
హరియాణా స్టీలర్స్ గెలుపు
పట్నా: ప్రొ కబడ్డీ లీగ్ ఏడో సీజన్లో హరియాణా స్టీలర్స్ రెండో విజయాన్ని నమోదు చేసింది. బుధవారం జరిగిన లీగ్ మ్యాచ్ లో హరియాణా 35–26 స్కోరుతో పట్నాపై నెగ్గింది. స్టీలర్స్ జట్టులో రైడర్ వికాస్ (10) చక్కని ప్రదర్శన కనబరిచాడు. వినయ్ (6) కూడా రైడింగ్లో మెరువగా... డిఫెండర్లు రవి కుమార్ (4), సునీల్ (4), ధర్మరాజ్ చేరలతన్ (3) ప్రత్యర్థుల్ని అద్భుతంగా టాకిల్ చేయడంతో విజయం సులువైంది. పట్నా జట్టులో ప్రదీప్ నర్వాల్ 14 పాయింట్లు తెచ్చిపెట్టాడు. జట్టు సాధించిన స్కోరులో సగం కంటే ఎక్కువ పాయింట్లు ఇతనివే అయినా... సహచరుల వైఫల్యంతో జట్టు పరాజయం చవిచూసింది. యూపీ, తమిళ్ మ్యాచ్ టై... అంతకుముందు యూపీ యోధ, తమిళ్ తలైవాస్ జట్ల మధ్య ఉత్కంఠ రేపిన మ్యాచ్ చివరకు 28–28తో టై అయింది. తలైవాస్ స్టార్ రాహుల్ చౌదరి (5 పాయింట్లు) ఆటలు సాగలేదు. నేడు జరిగే మ్యాచ్లో బెంగళూరు బుల్స్తో తెలుగు టైటాన్స్ తలపడుతుంది. -
తమిళ్ తలైవాస్ విజయం
పట్నా: తమిళ్ తలైవాస్ ఖాతా ఆలస్యంగానే తెరిచింది. పుంజు కుంది ఆలస్యంగానే... చివరకు గెలిచింది మాత్రం దర్జాగా! రాహుల్ చౌదరి (14 పాయింట్లు) రైడింగ్ ప్రదర్శనతో... ప్రొ కబడ్డీ లీగ్ మ్యాచ్లో తమిళ్ తలైవాస్ 35–28తో హరియాణా స్టీలర్స్పై విజయం సాధించింది. తొలి అర్ధభాగం ముగిసేసరికి హరియాణా స్టీలర్స్ ధాటికి 19–10 స్కోరుతో తలైవాస్ వెనుకబడింది. కానీ ద్వితీయార్ధంలో అటు రైడింగ్, ఇటు టాకిల్స్తో తమిళ్ జట్టు వేగం పెంచి గెలిచింది. మరో మ్యాచ్లో పట్నా పైరేట్స్ 20–41తో పుణేరి పల్టన్ చేతిలో చిత్తుగా ఓడింది. ఆట మొదలై పది నిమిషాలైనా... ప్రత్యర్థి పుణేరి 14 పాయింట్లు చేసినా... పట్నా మాత్రం ఖాతా తెరువలేకపోయింది. రెండుసార్లు ఆలౌటై భారీ తేడాతో మూల్యం చెల్లించుకుంది. పుణేరి తరఫున అమిత్ 9, పంకజ్ 8, మన్జీత్ 6 పాయింట్లు చేసి జట్టును గెలిపించారు. -
టైటాన్స్ నాన్ టెక్నికల్ టై
ముంబై: తెలుగు టైటాన్స్ ఆటగాళ్ల అత్యుత్సాహం జట్టుకు విజయాన్ని దూరం చేసింది. సాధారణంగా మ్యాచ్ ముగిశాక రిఫరీ వేసే లాంగ్ విజిల్ కంటే ముందుగా కబడ్డీ కోర్టు వెలుపల ఉన్న సహచర ఆటగాళ్లు గెలిచామనే ఆనందంతో కోర్టులోకి దూసుకొచ్చారు. దీంతో ఆగ్రహించిన రిఫరీలు యూపీ యోధకు నాన్ టెక్నికల్ రైడ్ పాయింట్ కేటాయించడంతో... టైటాన్స్కు ఈ సీజన్లో దక్కాల్సిన తొలి విజయం కాస్తా ‘టై’గా ముగిసింది. ముంబై వేదికగా శుక్రవారం ముగిసిన మ్యాచ్లో తెలుగు టైటాన్స్, యూపీ యోధ జట్లు నిర్ణీత సమయానికి 20–20తో సమంగా నిలిచాయి. దీంతో ప్రొ కబడ్డీ సీజన్ – 7లో తొలి ‘టై’ నమోదైంది. టైటాన్స్ తరపున సిద్ధార్థ్ దేశాయ్ (5 పాయింట్లతో) ఫర్వాలేదనిపించాడు. చేజేతులా... ఎలాగైనా విజయాన్ని నమోదు చేయాలనే పట్టుదలతో బరిలో దిగిన టైటాన్స్ మొదట ఆధిక్యాన్ని ఆ తర్వాత గెలుపుని చేజేతులా జారవిడుచుకుంది. మొదట 7–3తో ఆధిక్యంలో ఉన్న సమయంలో అలసత్వం ప్రదర్శించడంతో యూపీ వరుస పాయింట్లను సాధించి స్కోర్ను సమం చేసింది. మళ్లీ చివరి నిమిషంలో అదే అలసత్వం ప్రదర్శించి గెలుపును వదులుకుంది. మ్యాచ్ చివరి క్షణాల్లో కూతకెళ్లిన టైటాన్స్ రైడర్ సిద్ధార్థ్ దేశాయ్ పాయింట్ సాధించి జట్టును 20–19తో ఆధిక్యంలో నిలిపాడు. దీంతో గెలిచామనే ఆనందంలో టైటాన్స్ జట్టు సభ్యులు రిఫరీ లాంగ్ విజిల్ వేశాడా..? లేదా... అనేది చూసుకోకుండా కోర్టులోకి దూసుకురావడంతో రిఫరీలు యూపీ జట్టుకు నాన్ టెక్నికల్ రైడ్ పాయింట్ను కేటాయించారు. దీనిపై టైటాన్స్ సమీక్షకు వెళ్లగా... టీవీ అంపైర్ రిఫరీల నిర్ణయానికే కట్టుబడటంతో గెలవాల్సిన మ్యాచ్ కాస్త టైగా ముగిసింది. ఆఖరి పంచ్ ముంబైదే.. ముంబై వేదికగా జరిగిన ఆఖరి మ్యాచ్లో ఆఖరి పంచ్ ముంబై కొట్టింది. గుజరాత్ ఫార్చున్ జెయింట్స్పై 20–32తో ముంబై గెలిచి వరుస పరాజయాలకు పుల్స్టాప్ పెట్టింది. ముంబై ఆటగాళ్లు సురీందర్ సింగ్ 9 పాయింట్లతో, అభిషేక్ సింగ్ 6 పాయింట్లతో జట్టు విజయంలో కీలక పాత్ర వహించారు. నేడు జరిగే మ్యాచ్ల్లో పట్నా పైరేట్స్తో జైపూర్ పింక్ పాంథర్స్; బెంగాల్ వారియర్స్తో బెంగళూరు బుల్స్ తలపడతాయి. -
దబంగ్ ఢిల్లీకి కళ్లెం
ముంబై: ఈ సీజన్ ప్రొ కబడ్డీ లీగ్లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న దబంగ్ ఢిల్లీకి గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్ కళ్లెం వేసింది. ముంబైలోని సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ ఇండోర్ స్టేడియంలో గురువారం జరిగిన మ్యాచ్లో గుజరాత్ జట్టు 31–26తో ఢిల్లీని కంగుతినిపించింది. మ్యాచ్ ఆసాంతం ఇరు జట్ల మధ్య దోబూచులాడిన విజయం కీలక సమయంలో ఒత్తిడిని జయించిన ఫార్చూన్ జెయింట్స్నే వరించింది. దీంతో లీగ్లో హ్యాట్రిక్ విజయాలను నమోదు చేసిన ఆ జట్టు పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరింది. మ్యాచ్లో ఆల్రౌండ్ ప్రదర్శన చేసిన మోరే 9 పాయింట్ల(4 రైడ్ పాయింట్లు, 4 టాకిల్ పాయింట్లు, ఒక బోనస్ పాయింటు)తో గుజరాత్కు విజయాన్ని అందించాడు. అతనికి రోహిత్ గులియా (8 పాయింట్లు) నుంచి చక్కని సహకారం అందింది. దబంగ్ రైడర్ నవీన్ కుమార్ సూపర్ ‘టెన్’ సాధించినా ఆ జట్టుకు విజయాన్ని అందించలేకపోయాడు. నేడు జరిగే మ్యాచ్లో యూపీ యోధతో తెలుగు టైటాన్స్; యు ముంబాతో గుజరాత్ ఫార్చున్ జెయింట్స్ తలపడతాయి. -
గట్టెక్కిన పట్నా పైరేట్స్
ముంబై: ఉత్కంఠభరిత మ్యాచ్లకు వేదికగా మారిన ప్రొ కబడ్డీ లీగ్ ఏడో సీజన్లో మరో ఆసక్తికర మ్యాచ్ నమోదైంది. విజయం కోసం చివరి వరకు పోరాడిన తమిళ్ తలైవాస్ కేవలం ఒక పాయింట్ తేడాతో పట్నా పైరేట్స్ ముందు తలవంచింది. సోమవారం ముంబైలో జరిగిన మొదటి మ్యాచ్లో పట్నా పైరేట్స్ 24–23 తేడాతో తమిళ్ తలైవాస్పై గెలిచి ఊపిరి పీల్చుకుంది. వరుసగా తానాడిన రెండు మ్యాచ్లలో విజయం అంచుల వరకు వచ్చి ఓడిపోవడంతో తలైవాస్ డీలా పడింది. పైరేట్స్ డిఫెండర్ జైదీప్ 5 టాకిల్ పాయింట్లతో పాటు కీలక సమయంలో రైడ్కు వెళ్లి రెండు బోనస్ పాయింట్లు తెచ్చి హీరోగా నిలిచాడు. మోను 5 పాయింట్లతో అతనికి తన వంతు సాయం చేశాడు. రాహుల్ చౌదరి (5 పాయింట్లు), మంజీత్ చిల్లర్ (4 పాయింట్లు) ఆకట్టుకోలేకపోయారు. తడబడి నిలబడి... పట్నా పైరేట్స్ ఆటను అంత గొప్పగా ఆరంభించలేదు. మరోవైపు తలైవాస్ మొదటి మూడు నిమిషాల్లోనే నాలుగు పాయింట్లు సాధించి 4–0తో అధిక్యంలోకెళ్లింది. అయితే తరువాతి నిమిషంలో రాహుల్ని సూపర్ టాకిల్ చేసిన పట్నా రెండు పాయింట్లు సాధించి ఖాతా తెరిచింది. ఆ వెంటనే రైడ్కు వెళ్లిన ఇస్మాయిల్ రాన్ సింగ్ను ఔట్ చేయడంతో పాటు బోనస్ పాయింట్ను సాధించి స్కోరును సమం చేశాడు. తర్వాత ఇరు జట్లు సమానంగా పాయింట్లను సంపాదించడంతో విరామ సమయానికి 11–11తో సమంగా నిలిచాయి. చివరి మూడు నిమిషాల్లో... ఆట మరో మూడు నిమిషాల్లో ముగుస్తుందనగా తలైవాస్ 18–22తో వెనుకబడింది. ఈ దశలో రాహుల్, రాన్ సింగ్లు తమ రైడ్లతో మూడు పాయింట్లు తెచ్చారు. అదే సమయంలో పైరేట్స్ రెండు పాయింట్లను సాధించడంతో స్కోరు 21–24కు వెళ్లింది. చివరి రైడ్కు వెళ్లిన ప్రదీప్ను సూపర్ టాకిల్ చేసిన తలైవాస్కు రెండు పాయింట్లు వచ్చినా అది విజయాన్ని అందించలేకపోయింది. బెంగాల్ ఘనవిజయం రెండో మ్యాచ్లో బెంగాల్వారియర్స్ 43–23తో పుణేరి పల్టన్ను బోల్తా కొట్టించింది. ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్లో బెంగాల్ ముందు పుణేరి ఏమాత్రం నిలబడలేకపోయింది. బెంగాల్ తరపున మణీందర్ సింగ్ సూపర్ ‘టెన్’ (మొత్తం 14 పాయింట్లు)తో అదరగొట్టాడు. అతనికి ఇస్మాయిల్ నబీబ„Š (8 పాయింట్లు) సహకారం తోడవడంతో బెంగాల్ రెండు విజయాలతో పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది. ఆడిన మూడు మ్యాచ్ల్లోనూ ఓడిన పుణేరి ఇప్పటి వరకు ఖాతా తెరవలేదు. దీంతో పాయింట్ల పట్టికలో 11వ స్థానంలో నిలిచింది. మంగళవారం విశ్రాంతి దినం. బుధవారం జరిగే మ్యాచ్ల్లో హరియాణా స్టీలర్స్తో జైపూర్ పింక్ పాంథర్స్; యు ముంబాతో యూపీ యోధ తలపడతాయి. ప్రొ కబడ్డీలో 900 పాయింట్లను సాధించిన తొలి రైడర్గా రాహుల్ చౌదరి చరిత్ర సృష్టించాడు. మంజీత్ చిల్లర్ 300 టాకిల్ పాయింట్ల మార్క్ను అందుకున్నాడు. అజయ్ ఠాకూర్ రైడింగ్లో 600 పాయింట్లను సాధించాడు. -
జయహో... యు ముంబా
ముంబై: మొదటి అర్ధభాగంలో పోటీ ఇచ్చిన పుణేరి పల్టన్ తర్వాత చేతులెత్తేయడంతో యు ముంబా విజయాన్ని పట్టేసింది. దీంతో ప్రొ కబడ్డీ ఏడో సీజన్లో రెండు మరాఠా జట్ల పోరులో తొలి విజయం ముంబైని వరించింది. శనివారం ముంబైలో జరిగిన మొదటి మ్యాచ్లో మాజీ చాంపియన్ యు ముంబా 33–23తో పుణేరి పల్టన్పై గెలిచింది. అభిషేక్ సింగ్ 5 రైడ్ పాయింట్లతో ఆకట్టుకున్నాడు. యు ముంబా సారథి ఫజేల్ అత్రాచలి, రోహిత్, సురీందర్ సింగ్, సందీప్ నర్వాల్లు చెరో 4 పాయింట్లతో రాణించా రు. పుణేరి తరఫున సుర్జీత్ సింగ్ 6 పాయింట్లతో టాప్ స్కోరర్గా నిలిచాడు. భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ గీతం ఆలపించాడు. నెమ్మదిగా మొదలై.. ఆరంభంలో రెండు జట్లు ఆచితూచి ఆడటంతో పాయింట్లు ఎక్కువగా రాలేదు. పుణే తరఫున తొలి కూతకు వెళ్లిన మంజీత్ రిక్తహస్తాలతో తిరిగొచ్చాడు. అనంతరం ముంబై తరఫున కూతకు వెళ్లిన లీ డాంగ్ జీన్ను పుణే పట్టేయడం అదే సమయంలో లీ బోనస్ లైన్ను దాటడంతో ఇరు జట్లు ఒకేసారి ఖాతా తెరిచాయి. 2–5తో యు ముంబా వెనుకంజలో ఉన్నప్పుడు ఫజేల్ అత్రాచలి మంజీత్ను సూపర్ టాకిల్ చేశాడు. ఆ వెంటనే అభిషేక్ ఒక రైడ్ పాయింట్ తీసుకురావడంతో స్కోరు 5–5తో సమమైంది. పుణే తరఫున సుర్జీత్ సింగ్ సూపర్ టాకిల్ చేయడం, ఆ వెంటనే రైడ్కు వెళ్లి సురీందర్ సింగ్, సందీప్ నర్వాల్లను ఔట్ చేసి పుణేని 9–8తో ఆధిక్యంలోకి తెచ్చాడు. అయితే ఈ దశలో ముంబై చకచకా మూడు పాయింట్లు సాధించి 11–9తో విరామానికి వెళ్లింది. రెండో అర్ధభాగం ఆరంభమైన కాసేపటికే యు ముంబా ప్రత్యర్థిని ఆలౌట్ చేసి 15–10తో దూసుకెళ్లింది. ఇదే అధిక్యాన్ని చివరి వరకు కొనసాగించిన ముంబై జట్టు విజేతగా నిలిచింది. గట్టెక్కిన జైపూర్... మరో మ్యాచ్లో జైపూర్ పింక్ పాంథర్స్ 27–25తో బెంగాల్ వారియర్స్పై నెగ్గింది. చివరి మూడు నిమిషాల్లో తడబడిన బెంగాల్ మూల్యం చెల్లించుకుంది. జైపూర్ డిఫెండర్ సందీప్ ధుల్ (8 టాకిల్ పాయింట్లు)తో బెంగాల్ను పట్టేశాడు. రైడర్ దీపక్ హుడా 6 పాయింట్లతో రాణించాడు. నేడు జరిగే మ్యాచ్ల్లో దబంగ్ ఢిల్లీతో హరియాణా స్టీలర్స్; యు ముంబాతో బెంగళూరు బుల్స్ తలపడతాయి. -
టైటాన్స్ తెలుగు నేలపై చేతులెత్తేసింది..!
సాక్షి, హైదరాబాద్: తెలుగు టైటాన్స్ తెలుగు నేలపై చేతులెత్తేసింది. సొంతప్రేక్షకులు మద్దతిచ్చినా... అసలు బోణీనే కొట్టలేకపోయింది. ఆడిన నాలుగు మ్యాచ్ల్లోనూ ఓటమి పాలయ్యింది. శుక్రవారం జరిగిన హైదరాబాద్ అంచె ఆఖరి పోరులో టైటాన్స్ 22–34 స్కోరుతో పట్నా పైరేట్స్ చేతిలో పరాజయం చవిచూసింది. కోటి ఆశల సిద్ధార్థ్ దేశాయ్ మళ్లీ నిరాశపరిచాడు. స్టార్ రైడర్గా బరిలోకి దిగిన దేశాయ్ 12 సార్లు రైడింగ్కు వెళ్లి కేవలం 5 పాయింట్లే తెచ్చాడు. ఒక టాకిల్ పాయింట్ సాధించాడు. డిఫెండర్లు అబొజర్ మిఘాని (2), విశాల్ భరద్వాజ్ (2)లు ప్రత్యర్థి రైడర్లను టాకిల్ చేయలేకపోయారు. దీంతో తెలుగు జట్టు భారీ తేడాతో ఓడిపోయింది. మరోవైపు పట్నా జట్టులో స్టార్ ఆటగాళ్లయిన ప్రదీప్ నర్వాల్, జైదీప్లు ఆరంభం నుంచే పట్టుబిగించారు. రైడింగ్లో నర్వాల్ 7 పాయింట్లు సాధించగా, డిఫెం డర్ జైదీప్ (6) టైటాన్స్ రైడర్లను చక్కగా ఒడిసిపట్టాడు. మిగతా ఆటగాళ్లలో జంగ్ కున్ లీ (4), నీరజ్ కుమార్ (3) ఆకట్టుకున్నారు. మొహమ్మద్ ఎస్మెల్, హాది ఒస్తరక్ చెరో 2 పాయింట్లు చేశారు. అంతకుముందు మ్యాచ్లో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్ 44–19 స్కోరుతో యూపీ యోధపై ఘనవిజయం సాధించింది. గుజరాత్ తరఫున రైడింగ్లో రోహిత్ గులియా (10), డిఫెన్స్లో పర్వేశ్ బైస్వాల్ (6) రాణించారు. యూపీ జట్టులో రైడర్ శ్రీకాంత్ జాదవ్ (5) ఒక్కడే మెరుగనిపించాడు. నితీశ్ కుమార్, మోను గోయత్, ఆజాద్ రెండేసి పాయింట్లు చేశారు. అతిథిగా కోహ్లి నేటి నుంచి ప్రొ కబడ్డీ లీగ్ ఏడో సీజన్ పోటీలు ముంబైలో జరుగుతాయి. శనివారం ఇక్కడ జరిగే ఆరంభ వేడుకకు భారత కెప్టెన్ విరాట్ కోహ్లి అతిథిగా హాజరు కానున్నాడు. నేటి మ్యాచ్లు యు ముంబా X పుణేరి పల్టన్ రా.గం. 7.30 నుంచి జైపూర్ X బెంగాల్ వారియర్స్ రా.గం. 8.30 నుంచి స్టార్స్పోర్ట్స్–2లో ప్రత్యక్షప్రసారం -
దబంగ్ను గెలిపించిన నవీన్
సాక్షి, హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్ ఏడో సీజన్లో మరో హోరాహోరీ సమరం ప్రేక్షకుల్ని మునివేళ్లపై నిలబెట్టింది. ఆఖరి నిమిషాల్లో అనూహ్యంగా ఢిల్లీ దూసుకొచ్చింది. ఎంతో దూరంలో ఉన్న స్కోరును క్షణాల వ్యవధిలోనే సమం చేసింది. చివరికి ఒకే ఒక్క పాయింట్తో తలైవాస్ గెలుపు తలుపుల్ని మూసేసింది. అప్పటిదాకా తొడగొట్టిన తమిళ్ తలైవాస్ను చావోరేవో రైడింగ్లో నవీన్ కుమార్ పడగొట్టాడు. దీంతో దబంగ్ ఢిల్లీ 30–29 స్కోరుతో తలైవాస్పై విజయం సాధించింది. రైడర్ నవీన్ కుమార్ 8 పాయింట్లు సాధించాడు. తొలి అర్ధభాగం ముగిసేసమయానికి తలైవాస్ 18–11తో స్పష్టమైన ఆధిక్యంలో నిలిచింది. రెండో అర్ధభాగంలో కూడా ఆధిక్యాన్ని కొనసాగించింది. 28–11తో గెలుపుబాటలో పయనించింది. అనూహ్యంగా ఆఖరి 4 నిమిషాలు తలైవాస్ను ముం చాయి. ఢిల్లీ రైడర్ నవీన్ కుమార్ సూపర్ రైడ్ చేయడంతో మూడు పాయింట్లు వచ్చాయి. దీంతో దబంగ్ 27–29తో పోటీలో పడింది. మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. మరో రెండు నిమిషాల్లో 29–29తో స్కోరు సమమైంది. చావోరేవో (డు ఆర్ డై) రైడింగ్కు వెళ్లిన నవీన్... మంజీత్ను ఔట్ చేసి ఢిల్లీని గెలిపించాడు. తమిళ్ తలైవాస్ జట్టులో స్టార్ రైడర్ రాహుల్ చౌదరి 7 పాయింట్లు చేసినప్పటికీ రైడింగ్లో నాలుగుసార్లే సఫలమయ్యాడు. మరో రైడర్ అజయ్ కుమార్ 16 సార్లు కూతకెళ్లి 5 పాయింట్లు తెచ్చాడు. డిఫెండర్ మంజీత్ చిల్లర్ (5) రాణించగా, మిగతా వారిలో అజిత్, మోహిత్ చిల్లర్ చెరో 2 పాయింట్లు చేశారు. నేడు జరిగే మ్యాచ్ల్లో యూపీ యోధతో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్; పట్నా పైరేట్స్తో తెలుగు టైటాన్స్ తలపడతాయి. -
టైటాన్స్ హ్యాట్రిక్ ఓటమి
సాక్షి, హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్ ఏడో సీజన్లో తెలుగు టైటాన్స్ వరుసగా మూడో పరాజయంతో హ్యాట్రిక్ నమోదు చేసింది. కానీ ఈ సారి గెలిచేందుకు చివరిదాకా కష్టపడింది. మ్యాచ్ ముగిసే దశలో కాస్త ఉత్కంఠరేపినా... స్వల్ప ఆధిక్యాన్ని కాపాడుకున్న దబంగ్ ఢిల్లీ కేసీ జట్టు 34–33తో తెలుగు టైటాన్స్పై గట్టెక్కింది. కేవలం పాయింట్ తేడాతో టైటాన్స్ పరాజయం చవిచూసింది. కోటి ఆశల సిద్ధార్థ్ దేశాయ్ నిరాశపరిచాడు. జట్టు తురుపుముక్కగా బరిలోకి దిగిన ఈ రైడర్ 13 సార్లు కూతకు వెళ్లి కేవలం 8 పాయింట్లే చేశాడు. ఇతని సోదరుడు సూరజ్ దేశాయ్ అదరగొట్టాడు. 15 సార్లు రైడింగ్కు వెళ్లి 18 పాయింట్లు తెచ్చిపెట్టాడు. స్టార్ డిఫెండర్ విశాల్ భరద్వాజ్ కూడా నిరాశపరిచాడు. ప్రత్యర్థి రైడర్లను పట్టేందుకు 7 సార్లు కష్టపడిన భరద్వాజ్ కేవలం 4 పాయింట్లే సాధించాడు. మిగతా ఆటగాళ్లలో అమిత్ 2 పాయింట్లు చేశాడు. దబంగ్ ఢిల్లీ జట్టులో రైడర్లు నవీన్ కుమార్ (14 పాయింట్లు), చంద్రన్ రంజీత్ (6) జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. డిఫెండర్లలో జోగిందర్ నర్వాల్ (4), రవీందర్ పహల్ (3) రాణించారు. యూపీ యోధ చిత్తుగా... అంతకుముందు జరిగిన తొలి మ్యాచ్లో యూపీ యోధ 17–48 స్కోరుతో బెంగాల్ వారియర్స్ చేతిలో చిత్తుగా ఓడింది. రైడర్లు మొహమ్మద్ నబీబ„Š (10), మణిందర్ సింగ్ (9) చెలరేగారు. డిఫెండర్లు కూడా తమ వంతుగా రాణించడంతో బెంగాల్ స్కోరు అమాంతం పెరిగింది. బల్దేవ్ సింగ్ 7, రింకూ నర్వాల్ 4, జీవా కుమార్ 3 పాయింట్లు సాధించారు. యూపీ యోధ తరఫున మోను గోయత్ (6), సురేందర్ సింగ్, నితీశ్ కుమార్ చెరో 3 పాయింట్లు చేశారు. నేడు జరిగే మ్యాచ్లో దబంగ్ ఢిల్లీతో తమిళ్ తలైవాస్ జట్టు తలపడుతుంది. -
మళ్లీ ఓడిన తెలుగు టైటాన్స్
సాక్షి, హైదరాబాద్: ఎన్నో అంచనాల నడుమ ప్రొ కబడ్డీ లీగ్ సీజన్–7 బరిలో దిగిన తెలుగు టైటాన్స్ జట్టుకు వరుసగా రెండో పరాజయం ఎదురైంది. సొంత ప్రేక్షకుల మధ్య ఆదివారం జరిగిన మ్యాచ్లో తెలుగు టైటాన్స్ 26–39 స్కోరుతో తమిళ్ తలైవాస్ చేతిలో ఓటమి చవిచూసింది. టైటాన్స్ నుంచి తలైవాస్కు వెళ్లిన స్టార్ ప్లేయర్ రాహుల్ చౌదరి (10 రైడ్ పాయింట్లు, 2 టాకిల్ పాయింట్లు) తమ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అతనికి తోడుగా మంజీత్ చిల్లర్ 5 పాయింట్లతో జట్టు విజయంలో తనవంతు పాత్ర పోషించాడు. టెటాన్స్ తరపున సిద్ధార్థ్ దేశాయ్ (5 పాయింట్లు) మళ్లీ మెరిపించలేకపోయాడు. తొలి పది నిమిషాలే నిలబడింది... తలైవాస్తో పోరులో టైటాన్స్ మొదటి పది నిమిషాలే పోటీ ఇవ్వగలిగింది. తొలి నిమిషంలోనే రాహుల్ తలైవాస్కు బోణీ చేశాడు. అయితే 4వ నిమిషంలో టైటాన్స్ సూపర్ టాకిల్ చేసి స్కోర్ను 3–4కు తగ్గించింది. టెటాన్స్ స్టార్ రైడర్ సిద్ధార్థ్ తన మొదటి పాయింట్ను సాధించడానికి 6 నిమిషాల సమయం పట్టింది. తొలి 10 నిమిషాల ఆట ముగిసేసరికి టైటాన్స్ 7–6తో ఆధిక్యంలో నిలిచింది. ప్రత్యర్థి ఓటమికి తలైవాస్ ఆటగాడు షబీర్ బాపు బాటలు వేశాడు. మొదట సూపర్ టాకిల్తో రెండు పాయింట్లు సాధించిన షబీర్... తర్వాత వెంట వెంటనే రెండు రైడ్ పాయింట్లు తెచ్చాడు. 16వ నిమిషంలో రాహుల్ రెండు రైడ్ పాయింట్లతో.. 18వ నిమిషంలో అజయ్ థాకూర్ సూపర్ రైడ్తో అదరగొట్టడంతో మొదటి అర్ధ భాగం ముగిసే సరికి తలైవాస్ 20–10తో ముందంజలో నిలిచింది. రెండో అర్ధభాగంలో తెలుగు టైటాన్స్ పాయింట్ల కోసం శ్రమించినా తలైవాస్ మోహిత్, మంజీత్ల పటిష్టమైన డిఫెన్స్ను చేధించడంలో సఫలం కాలేకపోయారు. అంతకుముందు జరిగిన మరో లీగ్ మ్యాచ్లో గుజరాత్ ఫార్చున్ జెయింట్స్ 42–24 తేడాతో డిఫెండింగ్ చాంపియన్ బెంగళూరు బుల్స్పై ఘన విజయం సాధించింది. నేడు జరిగే మ్యాచ్ల్లో యు ముంబాతో జైపూర్ పింక్ పాంథర్స్; పుణేరి పల్టన్తో హరియాణా స్టీలర్స్ తలపడతాయి. మ్యాచ్లను రాత్రి గం. 7.30 నుంచి స్టార్ స్పోర్ట్స్–1లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. -
తెలుగు టైటాన్స్ తడబాటు
ప్రొ కబడ్డీ లీగ్ కొత్త సీజన్ కూడా తెలుగు టైటాన్స్కు నిరాశాజనకంగా ఆరంభమైంది. సొంతగడ్డపై జరిగిన ఆరంభ పోరులో మాజీ చాంపియన్ యు ముంబాకు టైటాన్స్ తలవంచింది. కీలక సమయంలో పాయింట్లు సాధించడంలో విఫలమైన తెలుగు జట్టు... చివర్లో వరుస పాయింట్లతో ప్రత్యర్థికి చేరువగా వచ్చేందుకు ప్రయత్నించినా అప్పటికే ఆలస్యమైంది. సాక్షి, హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్ ఏడో సీజన్ తొలి మ్యాచ్లో ఆతిథ్య జట్టు తెలుగు టైటాన్స్కు చుక్కెదురైంది. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో శనివారం జరిగిన మ్యాచ్లో యు ముంబా 31–25 పాయింట్ల తేడాతో టైటాన్స్ను ఓడించింది. తొలి అర్ధ భాగం ముగిసే సరికి 17–10తో ఆధిక్యంలో నిలిచిన ముంబా చివరి వరకు దానిని నిలబెట్టుకుంది. సమష్టి వైఫల్యం... టైటాన్స్ ఆటలో ఆరంభం నుంచి కూడా దూకుడు కనిపించలేదు. స్కోరు 1–1తో ఆట మొదలైన తర్వాత సిద్ధార్థ్ ఖాళీ రైడ్తో వెనక్కి రావడం మొదలు మ్యాచ్లో చాలా వరకు అలాంటి స్థితే కనిపించింది. ముంబా కోర్టులో ఫర్హద్ దొరికిపోవడంతో 4–5తో తొలిసారి వెనుకంజ వేసిన టైటాన్స్ మళ్లీ కోలుకోలేదు. ఆ తర్వాత ముంబా ఆధిక్యం 8–5నుంచి 17–8 వరకు సాగింది. తొలి అర్ధ భాగం చివర్లో రాకేశ్, రోహిత్ రైడ్లతో రెండు పాయింట్లు సాధించిన తెలుగు టీమ్ పాయింట్ల ఆధిక్యాన్ని తగ్గించింది. తొలి అర్ధభాగంలో టైటాన్స్ ఒక సారి ఆలౌట్ అయింది. రెండో అర్ధభాగంలో మాత్రం టైటాన్స్ ప్రత్యర్థితో పోలిస్తే మెరుగైన ప్రదర్శన కనబర్చింది. మరోసారి ఆలౌట్ అయినా కూడా టైటాన్స్ మొత్తం 15 పాయింట్లు సాధించగా, ముంబా 14 పాయింట్లు మాత్రమే గెలుచుకుంది. ముఖ్యంగా చివరి పది నిమిషాల్లో టైటాన్స్కు వరుసగా పాయింట్లు వచ్చాయి. అయితే బలమైన డిఫెన్స్ను ప్రదర్శించిన ముంబా మ్యాచ్ తమ చేజారుకుండా చూసుకుంది. సిద్ధార్థ్ విఫలం... వేలంలో భారీ మొత్తానికి ధర పలకడంతో పాటు ఎన్నో అంచనాలతో తొలి మ్యాచ్ ఆడిన టైటాన్స్ ఆటగాడు సిద్ధార్థ్ దేశాయ్ నిరాశపర్చాడు. తొలి అర్ధభాగంలో ఆరు సార్లు రైడింగ్కు వెళ్లిన అతను ఒక్క పాయింట్ కూడా సాధించలేకపోయాడు. మూడు సార్లు అతడిని ప్రత్యర్థి జట్టు పట్టేయగా, రెండు సార్లు ఉత్త చేతులతో తిరిగొచ్చాడు. ఒకసారైతే ‘డు ఆర్ డై’ రైడ్లో కూడా ఖాళీగా రావడంతో టైటాన్స్ పాయింట్ కోల్పోవాల్సి వచ్చింది. అన్యమనస్కంగా కనిపించిన అతడిని కోచ్ రెండో అర్ధభాగంలో తొలి తొమ్మిది నిమిషాలు డగౌట్లోనే కూర్చోబెట్టాడంటే అతని ఆట ఎలా సాగిందో అర్థమవుతోంది. ఎట్టకేలకు తన ఎనిమిదో ప్రయత్నంలో బోనస్ ద్వారా పాయింట్ సాధించిన అతను చివర్లో మాత్రం బాగా ఆడేందుకు ప్రయత్నించాడు. జట్టు సాధించిన ఆఖరి 10 పాయింట్లలో 5 దేశాయ్ రైడింగ్లో తెచ్చినవే ఉన్నాయి. టైటాన్స్ తరఫున గరిష్టంగా రజనీశ్ 8 పాయింట్లు సాధించగా, కెప్టెన్ అబోజర్ 2 టాకిల్ పాయింట్లకే పరిమితమయ్యాడు. ముంబా తరఫున అభిషేక్ అత్యధికంగా 10 పాయింట్లు సాధించాడు. ఇరు జట్ల మధ్య టాకిల్ పాయింట్లు సమంగా (10) ఉండగా రైడింగ్ పాయింట్లలో ముంబా 1 ఎక్కువగా సాధించింది. అయితే రెండు సార్లు ఆలౌట్ కావడంతో పోగొట్టుకున్న 4 పాయింట్లే తుది ఫలితంలో తేడాగా మారాయి. మరో మ్యాచ్లో విజయంతో డిఫెండింగ్ చాంపియన్ బెంగళూరు బుల్స్ సీజన్–7లో శుభారంభం చేసింది. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్లో బుల్స్ 34–32 స్కోరుతో పట్నా పైరేట్స్పై గెలుపొందింది. బెంగళూరు తరఫున పవన్ సెహ్రావత్ 9 పాయింట్లు స్కోరు చేయగా, పట్నా తరఫున పర్దీప్ నర్వాల్ 10, ఇస్మాయిల్ 9 పాయింట్లు సాధించారు. -
టైటిల్ వేటలో తెలుగు టైటాన్స్
కబడ్డీ... కబడ్డీ... అంటూ ఆరేళ్లుగా తెలుగు టైటాన్స్ ఆడుతోంది. కానీ టైటిల్ వేటలో కనీసం ఫైనల్ మెట్టయినా ఎక్కలేకపోయింది. ఈ సారైనా ఆ ముచ్చట తీర్చుకునేందుకు టైటాన్స్ కష్టపడుతోంది. జట్టులో మార్పులు కూడా చేసింది. కొత్త కెప్టెన్, కొత్త కోచ్లతో జట్టు కూత పెట్టేందుకు సిద్ధమైంది. మరీ ఈ కూత ఎందాకో తెలియాలంటే మనం మూడు నెలలు ఆగాలి! ఎందుకంటే ఫైనల్ అక్టోబర్లో కదా జరిగేది!! సాక్షి, హైదరాబాద్: ఈ సీజన్లో కసిదీరా ఆడేందుకు తెలుగు టైటాన్స్ సన్నద్ధమైంది. ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) ఏడో సీజన్ ఆరంభమే హైదరాబాద్లో జరగనుండటంతో తొలి అంచె పోటీల్లో స్థిరమైన విజయాలు సాధించాలని ఆశిస్తోంది. ఆరేళ్లుగా టైటాన్స్ ఆశల పల్లకి మోసిన స్టార్ రైడర్ రాహుల్ చౌదరి జట్టును వీడాడు. అతని స్థానంలో మరో స్టార్ రైడర్ సిద్ధార్థ్ దేశాయ్ రాగా... సారథ్య బాధ్యతల్ని ఇరానీ డిఫెండర్ అబొజర్ మిఘానికి అప్పగించింది. చీఫ్ కోచ్గా ఇరాన్కు చెందిన గోలమ్ రెజాను నియమించింది. ఇలా జట్టుకు కొత్త దిశను చూపిన యాజమాన్యం తమ దశమారాలని గంపెడాశతో బరిలోకి దిగుతోంది. డిఫెండర్లపై విశ్వాసం ఈ సారి జట్టు కుర్రాళ్లపై నమ్మకముంచింది. దీంతో అనుభవజ్ఞులకంటే యువ ఆటగాళ్లే తొడగొట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా డిఫెన్స్లో విశాల్ భరద్వాజ్, కెప్టెన్ అబొజర్ మిఘానిలు ఓ పట్టుపడితే ప్రత్యర్థులకు కష్టాలు తప్పవు. గత సీజన్లో విశాల్ చక్కగా రాణించాడు. 60 టాకిల్ పాయింట్లు సాధించిన అతడు సగటున మ్యాచ్కు మూడున్నర పాయింట్లు తెచ్చిపెట్టాడు. ఆరో సీజన్లో మూడో ఉత్తమ ప్రదర్శన అతనిదే. ఇక రైట్ కార్నర్లో మెరుగైన డిఫెండర్ అబొజర్. కీలక సమయంలో ప్రత్యర్థులను, పాయింట్లను ఒడిసి పట్టాడు. ఆరో సీజన్లో అతను విశాల్కు కాస్త తక్కువగా 57 పాయింట్లు సాధించాడు. 2.7 సగటు నమోదు చేశాడు. రైడర్ల పాలిట వీళ్లిద్దరు టైటాన్స్కు బ్రహ్మాస్త్రాలైతే తెలుగు జట్టుకు తిరుగుండదు. యు ముంబా మాజీ కోచ్ అయిన గొలమ్ రెజాను చీఫ్ కోచ్గా నియమించడం, కెప్టెన్ కూడా ఇరానీ ఆటగాడే కావడం... ఇద్దరి సమన్వయం జట్టుకు దోహదం చేసే అవకాశముంది. కలిసిరాని హైదరాబాద్ టైటాన్స్కు ఇప్పటివరకు సొంత మైదానం కలిసిరాలేదు. ఆరు సీజన్లలో మూడు వైజాగ్లో ఆడగా మరో మూడు ఇక్కడే ఆడింది. ఆడిన మూడు సీజన్లూ హైదరాబాదీ అభిమానుల్ని టైటాన్స్ నిరాశపరిచింది. ఓవరాల్గా 16 మ్యాచ్లాడిన తెలుగు టైటాన్స్ కేవలం ఐదే మ్యాచ్లు గెలిచింది. 9 మ్యాచ్లో ఓటమి ఎదురవగా... రెండు టైగా ముగిశాయి. ఈ సారైనా తమ తలరాత మారాలని జట్టు ఆశిస్తోంది. సెమీసే అత్యుత్తమం తెలుగు టైటాన్స్ 6 సీజన్లు పోరాడినా టైటిల్ వేటలో ఒక్కసారి కూడా నిలువలేకపోయింది. పీకేఎల్లో తెలుగు టీమ్ అత్యుత్తమ ప్రదర్శన సెమీఫైనలే! రెండు, నాలుగో సీజన్లలో రెండు సార్లు సెమీస్ చేరింది. గత రెండు సీజన్లలోనూ పేలవమైన ప్రదర్శనతో జోన్ ‘బి’లో ఐదో స్థానంలో నిలిచింది. మొత్తమ్మీద ఈ ఆరేళ్లలో గెలిచిన మ్యాచ్లకంటే ఓడిన మ్యాచ్లే ఎక్కువ! 104 మ్యాచ్లాడిన టైటాన్స్ జట్టు 45 మ్యాచ్ల్లో గెలుపొందగా... 47 మ్యాచ్ల్లో ఓడిపోయింది. మరో 13 టైగా ముగిశాయి. తెలుగు టైటాన్స్ జట్టు అబొజర్ (కెప్టెన్), విశాల్, అరుణ్, కృష్ణ, మనీశ్, ఆకాశ్, ఆకాశ్ దత్తు (డిఫెండర్లు); సిద్ధార్థ్ దేశాయ్, అమిత్, అంకిత్, కమల్, ముల శివ, రజనీశ్, రాకేశ్, సూరజ్, మల్లికార్జున్, (రైడర్లు); అర్మాన్, ఫర్హాద్ మిలగర్దన్ (ఆల్రౌండర్లు). అందరి కళ్లు సిద్ధార్థ్పైనే సిద్ధార్థ్ దేశాయ్... ఒక్క సీజన్తో స్టార్ అయిన మహారాష్ట్ర ఆటగాడు. గతేడాది యు ముంబా తరఫున కూత పెట్టించాడు. సంచలన రైడింగ్ ప్రదర్శనతో ప్రత్యర్థులను హడలెత్తించాడు. లీగ్లో గత సీజన్ మాత్రమే ఆడిన ఈ మహారాష్ట్ర కబడ్డీ ప్లేయర్పై తెలుగు టైటాన్స్ భారీ ఆశలే పెట్టుకుంది. అందుకనే ఏకంగా సుమారు రూ. కోటిన్నర (రూ.1.45 కోట్లు) వెచ్చించి మరీ అతన్ని కొనుక్కుంది. ప్రొ కబడ్డీ వేలంలోనే ఇది అత్యధిక మొత్తం కావడం విశేషం. రాహుల్ చౌదరి తరలిపోయిన లోటును దేశాయ్ సమర్థంగా భర్తీ చేయగలడనే విశ్వాసంతో టైటాన్స్ యాజమాన్యం ఎంత మొత్తానికైనా వెనుకాడలేదు. నిజంగా సిద్ధార్థ్కు అంత సీనుందా అంటే... గత సీజన్ ప్రదర్శన చూస్తే ఔననాల్సిందే. పీకేఎల్–6లో ఆడిన 21 మ్యాచ్ల్లో ఏకంగా 218 పాయింట్లు సాధించాడు. సగటున మ్యాచ్కు 10 పాయింట్లు తెచ్చిపెట్టిన రైడర్గా నిలిచాడు. అందుకే ‘ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’ అవార్డును ఎగరేసుకుపోయాడు. గత సీజన్లో కేవలం ముగ్గురు రైడర్లే ఈ ఘనత సాధించారు. ఇక ప్రస్తుత తెలుగు టైటాన్స్ రైడర్లంతా కలిపి చేసిన పాయింట్లు (69), సిద్ధార్థ్ ఒక్కడే చేసిన పాయింట్లకూ ఎంతో వ్యత్యాసముంది. అతని సగం పాయింట్లకు సరిపోని దూరంలో ఉన్నాయి. ఈ ఖరీదైన ఆటగాడు మంచి పాటగాడు (గాయకుడు) కూడా! అంతేనా... డ్యాన్సర్ కూడా. బరిలో కూత పెట్టడమే కాదు... మ్యాచ్లు గెలిస్తే ఆటపాటలతో హోరెత్తిస్తానంటున్నాడు సిద్ధార్థ్. -
అబొజర్కు తెలుగు టైటాన్స్ పగ్గాలు
సాక్షి, హైదరాబాద్: తెలుగు టైటాన్స్ కబడ్డీ జట్టు కెప్టెన్గా ఇరాన్ డిఫెండర్ అబొజర్ మిఘానిని ఫ్రాంచైజీ యాజమాన్యం నియమించింది. ఈ నెల 20 నుంచి ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) ఏడో సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో జట్లన్నీ సన్నాహాల్లో నిమగ్నమయ్యాయి. తొలి అంచె పోటీలు ముందుగా హైదరాబాద్లోనే జరుగనున్నాయి. ఈ సందర్భంగా గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో తెలుగు టైటాన్స్ యాజమాన్యం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కొత్త సారథిని అధికారికంగా ప్రకటించారు. స్టార్ ఆటగాడు రాహుల్ చౌదరి లేకపోయినా జట్టుకు ఢోకా లేదని జట్టు యజమాని శ్రీనివాస్ శ్రీరామనేని తెలిపారు. గతేడాది నిరాశపరిచిన తమ జట్టు ఈ సారి టైటిల్పై గురిపెట్టిందని ఆయన చెప్పారు. ఆరంభం నుంచే ఫలితాలు రాబట్టేందుకు ప్రయత్నిస్తామన్నారు. హైదరాబాద్లో మొదలయ్యే ఈ పోటీలు వివిధ నగరాల్లో సుమారు మూడు నెలల పాటు జరుగుతాయి. అక్టోబర్ 19న గ్రేటర్ నోయిడాలో జరిగే ఫైనల్తో ఏడో సీజన్ ముగుస్తుంది. ఆన్లైన్లో టికెట్లు.... హైదరాబాద్ అంచె ప్రొ కబడ్డీ లీగ్ మ్యాచ్ల టికెట్లు https://www. eventsnow.com వెబ్సైట్లో లభిస్తాయి. టికెట్ల ధరలను రూ. 500; రూ.800; రూ. 3000గా నిర్ణయించారు. మరో రెండు ఫ్రాంచైజీలు కూడా కొత్త కెప్టెన్లను ప్రకటించాయి. యు ముంబా కూడా ఇరానీ ప్లేయర్ ఫజల్ని సారథిగా నియమించగా, పుణేరి పల్టన్ జట్టు సుర్జీత్ సింగ్కు నాయకత్వ బాధ్యతలు అప్పగించింది. -
నేడు ఆల్స్టార్స్ కబడ్డీ మ్యాచ్
సాక్షి, హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) ఏడో సీజన్ ఈనెల 20న ప్రారంభం కానున్న నేపథ్యంలో నిర్వాహకులు ఓ ఆసక్తికర మ్యాచ్ కు రంగం సిద్ధం చేశారు. జాతీయ, అంతర్జాతీయ కబడ్డీ క్రీడాకారుల మధ్య ఆల్స్టార్ మ్యాచ్ను నిర్వహించనున్నట్లు మషాల్ స్పోర్ట్స్ పేర్కొంది. వరల్డ్–7, ఇండియన్–7 జట్ల మధ్య నేడు జరుగనున్న ఈ మ్యాచ్కు గచ్చిబౌలి స్టేడియం వేదిక కానుంది. వరల్డ్ జట్టుకు ఫజల్, భారత జట్టుకు అజయ్ ఠాకూర్ కెప్టెన్లుగా వ్యవహరించనున్నారు. రాత్రి 7 గంటలకు మొదలయ్యే ఈ మ్యాచ్ను స్టార్ స్పోర్ట్స్–2లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. జట్ల వివరాలు ఇండియన్–7: మణీందర్, పవన్, రవీంద్ పహాల్, వికాస్, సునీల్, దీపక్ హుడా, పర్దీప్ నర్వాల్, గిరీశ్, సుర్జీత్, అజయ్ ఠాకూర్ (కెప్టెన్), సందీప్ నర్వాల్, నితీశ్, బల్వాన్ సింగ్ (కోచ్). వరల్డ్–7: ఇస్మాయిల్, లాల్మనోహర్, గఫారి, టిన్ పోన్చో, షాజిద్, డాంగ్ యు కిమ్, జాంగ్ కున్ లీ, ఎమాద్, అబోజర్, ఫర్హాద్, ఫజల్, మసూర్ కరీమ్, ఈపీ రావు (కోచ్). -
రంజుగా ప్లే ఆఫ్ రేసు
పంజాబ్, చెన్నైలకు ఇప్పటికే అర్హత రాజస్థాన్, కోల్కతాలకు మెరుగైన అవకాశాలు ఇండియన్ ప్రీమియర్ లీగ్ కీలక దశకు చేరుకుంది. లీగ్లో 56 మ్యాచ్లకు గాను 48 మ్యాచ్లు ముగిశాయి. ఇంకా ఎనిమిది మ్యాచ్లు జరగాల్సి ఉంది. అయితే ఏడో సీజన్లో ఎవరూ ఊహించని విధంగా సంచలన విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతున్న కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఇంతకుముందే ప్లే ఆఫ్ దశకు చేరుకుంది. మాజీ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ కూడా ప్లే ఆఫ్ బెర్తును ఖరారు చేసుకుంది. ఢిల్లీకి ఎలాంటి అవకాశాలు లేవు. ఇక మిగిలిన రెండు బెర్తుల కోసం ఐదు జట్లు పోటీపడుతున్నాయి. దీంతో ప్లే ఆఫ్ రేసు ఆసక్తికరంగా మారింది. ఆయా జట్ల ప్రస్తుత స్థితి... - సాక్షి క్రీడావిభాగం రాజస్థాన్ రాయల్స్ ప్రస్తుతం: 12 మ్యాచ్ల్లో 14 పాయింట్లు ఆడాల్సినవి: 23న పంజాబ్ (మొహాలీలో)తో, 25న ముంబై (వాంఖడేలో)తో ప్లే ఆఫ్ అవకాశాలు: రెండు మ్యాచ్ల్లో కనీసం ఒకటి నెగ్గినా రాజస్థాన్ రాయల్స్ తదుపరి దశకు సమీకరణాలతో సంబంధం లేకుండానే అర్హత సాధిస్తుంది. ఒకవేళ రాజస్థాన్ రాయల్స్ రెండు మ్యాచ్ల్లో ఓడితే అప్పుడు నెట్ రన్రేట్ కీలకమవుతుంది. రెండు మ్యాచ్ల్లో ఓడటం ద్వారా రాజస్థాన్ రన్రేట్ మరింతగా పడిపోతుంది. లేదంటే బెంగళూరు, హైదరాబాద్, ముంబై జట్లు ఒక్కో మ్యాచ్లో ఓడిపోవాలి. కోల్కతా నైట్ రైడర్స్ ప్రస్తుతం: 12 మ్యాచ్ల్లో 14 పాయింట్లు మిగిలిన మ్యాచ్లు: 22న బెంగళూరు (ఈడెన్లో)తో, 24న హైదరాబాద్ (ఈడెన్లో)తో ప్లే ఆఫ్ అవకాశాలు: కనీసం ఒక్క మ్యాచ్ గెలిచినా ప్లే ఆఫ్ చేరుతుంది. ఒకవేళ రెండూ ఓడితే బెంగళూరు, హైదరాబాద్, ముంబై జట్లు ఒక్కో మ్యాచ్లో ఓడాలి. ముంబై ఇండియన్స్ ప్రస్తుతం: 12 మ్యాచ్ల్లో 10 పాయింట్లు మిగిలిన మ్యాచ్లు: 23న ఢిల్లీతో, 25న రాజస్థాన్తో (రెండు వాంఖడేలోనే) ప్లే ఆఫ్ అవకాశాలు: చివరి రెండు మ్యాచ్ల్లో తప్పనిసరిగా గెలవాలి. రన్రేట్ కూడా మెరుగుపడాలి. అలాగే హైదరాబాద్, బెంగళూరు జట్లు తప్పనిసరిగా ఒక్కో మ్యాచ్లో ఓడాలి. రాజస్థాన్, కోల్కతాలలో ఒక జట్టు రెండు మ్యాచ్లు ఓడాలి. బెంగళూరు రాయల్ చాలెంజర్స్ ప్రస్తుతం: 12 మ్యాచ్ల్లో 10 పాయింట్లు మిగిలిన మ్యాచ్లు: 22న కోల్కతా (ఈడెన్లో)తో, 24న చెన్నై (బెంగళూరులో)తో ప్లే ఆఫ్ అవకాశాలు: చివరి రెండు మ్యాచ్ల్లో తప్పనిసరిగా గెలవాలి. అదే సమయంలో తనకన్నా మెరుగైన స్థానంలో ఉన్న రాజస్థాన్, కోల్కతా జట్లలో ఏదైనా ఒక జట్టు తాను ఆడే రెండు మ్యాచ్ల్లోనూ ఓడిపోవాలి. అదే సమయంలో హైదరాబాద్, ముంబై జట్లు ఒక్కో మ్యాచ్లో అయినా ఓడిపోవాలి. బెంగళూరు రన్రేట్ కూడా మెరుగుపడాలి. హైదరాబాద్ సన్రైజర్స్ ప్రస్తుతం: 12 మ్యాచ్ల్లో 10 పాయింట్లు మిగిలిన మ్యాచ్లు: 22న చెన్నై (రాంచీలో)తో, 24న కోల్కతా (ఈడెన్లో)తో ప్లే ఆఫ్ అవకాశాలు: తదుపరి దశకు చేరాలంటే మిగిలిన రెండు లీగ్ మ్యాచ్ల్లో గెలుపుతో పాటు రేసులో ఉన్న మిగిలిన జట్ల ఫలితాలపై సన్రైజర్స్ భవితవ్యం ఆధారపడి ఉంటుంది. 14 పాయింట్లు సాధించిన రాజస్థాన్, కోల్కతా జట్లలో ఏదైనా ఒక జట్టు తాను ఆడే రెండు మ్యాచ్ల్లోనూ ఓడిపోవాలి. అదే సమయంలో బెంగళూరు, ముంబై జట్లు కచ్చితంగా ఒక్కో మ్యాచ్లో ఓడాలి. హైదరాబాద్ రన్రేట్ కూడా మెరుగుపడాలి. -
ఢిల్లీ కోచ్గా కిర్స్టెన్
హైదరాబాద్: ఐపీఎల్లో ఘోరంగా విఫలమవుతున్న ఢిల్లీ డేర్డెవిల్స్ జట్టు మార్పులకు శ్రీకారం చుట్టింది. ఐపీఎల్ ఏడో సీజన్ కోసం భారత క్రికెట్ జట్టు మాజీ కోచ్ గ్యారీ కిర్స్టెన్ను తమ చీఫ్ కోచ్గా నియమించుకుంది. అసిస్టెంట్ కోచ్గా ఎరిక్ సిమన్స్, మెంటర్గా టీఏ శేఖర్ కొనసాగుతున్నారు. పాక్ స్పిన్నర్ ముస్తాక్ అహ్మద్ మరోసారి స్పిన్ బౌలింగ్ కోచ్ బాధ్యతలు చేపట్టే అవకాశముంది. ఐపీఎల్-6లో ఢిల్లీ జట్టు ఎనిమిదో స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. తన పాత స్నేహితుడు సిమన్స్ చీఫ్ కోచ్ పదవిని స్వీకరించాల్సిందిగా కోరాడని గ్యారీ చెప్పారు. భారత జట్టు కోచ్గా కిర్స్టెన్ 2011 వన్డే ప్రపంచకప్ టైటిల్తో పాటు టెస్టుల్లో నంబర్వన్ స్థానం సంపాదించి పెట్టారు. అరుదైన నైపుణ్యం కోహ్లి సొంతం భారత జట్టు భవిష్యత్ కెప్టెన్గా భావిస్తున్న విరాట్ కోహ్లి చాలా గొప్ప క్రికెటర్ అవుతాడని కిర్స్టెన్ కితాబిచ్చారు. ‘కోహ్లి అంటే నాకు భిన్నమైన అభిప్రాయం ఉంది. అతనిలో అరుదైన నైపుణ్యం ఉంది. రాబోయే రోజుల్లో గొప్ప ప్లేయర్గా పరిణతి చెందుతాడు’ అని గ్యారీ పేర్కొన్నారు. సచిన్ స్థానాన్ని కోహ్లి భర్తీ చేయడంపై ఈ మాజీ కోచ్ ఆచితూచి స్పందించారు. ‘సచిన్ స్థానంలో మరొకరు రావడమనేది చాలా జాగ్రత్తగా జరగాల్సిన అంశం. అది చాలా క్లిష్టమైన స్థానం. ఎవరో ఒకరి పేరును ప్రతిపాదించడం రిస్క్తో కూడుకున్నది. మీడియా ఏవేవో కథనాలు ప్రసారం చేస్తోంది. కానీ నేను అలా చేయలేను. ఏదేమైనా కోహ్లి అద్భుతమైన బ్యాట్స్మన్. అతన్ని అవుట్ చేయాలంటే ప్రత్యర్థి బౌలర్లు చాలా కష్టపడాలి’ అని కిర్స్టెన్ వివరించారు. శిఖర్ ధావన్లో ఆత్మస్థైర్యం ఎక్కువని ప్రశంసించారు.