అండర్-14 చాంప్ నిఖిత
జింఖానా, న్యూస్లైన్: వశిష్ట ఓపెన్ టెన్నిస్ టోర్నీలో బాలికల అండర్-14 విభాగంలో సింహబట్ల నిఖిత టైటిల్ కైవసం చేసుకుంది. సైనిక్పురిలోని కార్నివాల్ క్లబ్లో జరుగుతున్న ఈ టోర్నీ ఫైనల్లో నిఖిత 7-4తో టి.నిఖితపై విజయం సాధించింది. బాలుర అండర్-10 విభాగం ఫైనల్లో శశిధర్ 7-3తో యశ్వంత్ను ఓడించి విజేతగా నిలిచాడు. తనతో పాటు అండర్-8 విభాగంలో రోహిత్ సాయి చరణ్ 6-4తో పూర్వా పారిఖ్పై, బాలికల అండర్-8 విభాగంలో దియా రెడ్డి 7-4తో అపూర్వపై, అండర్-10 విభాగంలో అదితి 7-4తో షేక్ కమ్రీన్పై గెలుపొందారు.
బాలుర అండర్-12 సెమీఫైనల్లో రాహుల్ 6-2తో బ్రిహత్ను, శశిధర్ 6-2తో షేక్ రెహాన్ను ఓడించి ఫైనల్స్కు చేరుకున్నారు. బాలికల అండర్-12 సెమీఫైనల్లో అమూల్య 6-3తో సృజనపై, సింహబట్ల నిఖిత 6-0తో విదీషిపై నెగ్గి ఫైనల్స్కు అర్హత సాధించారు.
ఇతర ఫలితాలు : బాలుర అండర్-14 క్వార్టర్ ఫైనల్స్: ఉద్ధవ్ ఠాకూర్ 6-1తో మోహిత్ సాయి కుమార్పై, రాహుల్ 6-3తో ఆదిత్యపై, యశోదన్ 6-3తో కుషాల్పై, అఖిలేష్ రెడ్డి 6-0తో అభిషేక్పై గెలిచారు.