Uttej
-
నటుడు, రచయిత ఉత్తేజ్ను ఇలా ఎప్పుడైనా చూశారా? (అరుదైన ఫొటోలు)
-
నా సంస్కారం ఎలాంటిది అంటే: హీరో ఉత్తేజ్
-
ఉత్తేజ్ వల్లే నేను ఈరోజు ఇలా ఉన్న
-
అలా చేస్తే నా కూతురిని చచ్చిపొమ్మని చెప్పా
-
ఆర్జీవీ భార్య పై ఉత్తేజ్ కామెంట్స్
-
జ్ఞాపకాలు మిగిల్చి పోయావా అమ్మ.. కుమార్తెలు ఎమోషనల్ పోస్ట్!
ఉత్తేజ్ తెలుగువారికి పరిచయం అక్కర్లేని పేరు. చాలా సినిమాల్లో తనదైన నటనతో టాలీవుడ్ ప్రేక్షకులను అలరించారు. నటుడిగా, రచయితగా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తొలి సారిగా శివ అనే చిత్రంతో ఎంట్రీ ఇచ్చాడు. రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ప్రతి సినిమాలో మెప్పించారు. గాయం, అనగనగా ఒకరోజు చిత్రాల్లో నటించారు. అయితే 2021లో ఆయన కుటుంబం తీవ్ర విషాదం చోటు చేసుకుంది. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న బసవతారకం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సెప్టెంబర్ 13న మరణించారు. ఆమె మృతి చెంది నేటికి రెండేళ్లు పూర్తయింది. (ఇది చదవండి: ఖరీదైన ఫ్లాట్ కొనుగోలు చేసిన దబాంగ్ బ్యూటీ.. ఎన్ని కోట్లంటే? ) ఈ సందర్భంగా అమ్మను తలుచుకుంటూ ఆమె కుమార్తెలు చేతన, పాట ఎమోషనలయ్యారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అమ్మను తలుచుకుంటూ మాకు జ్ఞాపకాలను మిగిల్చి వెళ్లిపోయావంటూ గుర్తు చేసుకున్నారు. పెద్దకూతురు చేతన సైతం అమ్మతో ఉన్న ఫోటోలు, వీడియోలు పంచుకుంటూ ఎమోషలైంది. కాగా.. ఉత్తేజ్ పెద్ద కూతురు చేతన 2017లో పిచ్చిగా నచ్చావ్ అనే చిత్రంతో హీరోయిన్గా పరిచయం అయింది. ఆ సినిమా ప్లాప్ కావడంతో కొరియోగ్రాఫర్గా సత్తా చాటుతోంది. చిన్న కూతురు పాటకి కూడా మంచి టాలెంట్ ఉంది. ఇటీవలే అకీరా నందన్ పియానో వాయిస్తూ ఉండగా, పాట అద్భుతంగా పాడి అలరించింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరలైంది. (ఇది చదవండి: సమాధిపై పడుకుంటూ కూతురితో ఆడుకున్న హీరో, వీడియో వైరల్ ) View this post on Instagram A post shared by paata...music ... (@paatauttej1424) View this post on Instagram A post shared by paata...music ... (@paatauttej1424) -
'మేమిద్దరం ఎలాంటోళ్లమంటే.. ఆ హీరోయిన్ థైస్ చూసేందుకు కారులో వెళ్లాం'
టాలీవుడ్లో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ‘శివ’ సినిమాతో జర్నీ మొదలుపెట్టిన జేడీ చక్రవర్తి తాజాగా మర్డర్ మిస్టరీగా రూపొందిన 'దయ' వెబ్సీరిస్తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. డిస్నీ + హాట్స్టార్లో ఆగస్టు 4 నుంచి స్ట్రీమింగ్ కానుంది. పవన్ సాధినేని దర్శకత్వంలో వస్తున్న ఈ వెబ్సిరీస్లో ఈషా రెబ్బా,విష్ణు ప్రియ, పృథ్వీరాజ్, కమల్ కామరాజు తదితరులు కీలకపాత్రలు పోషించారు. ట్రైలర్ లాంచ్ కార్యక్రమాన్ని చిత్రబృందం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో జెడి స్నేహితుడు ఉత్తేజ్ కూడా పాల్గొని పలు ఆసక్తకరమైన వ్యాఖ్యలు చేశాడు. (ఇదీ చదవండి: వాళ్ల కోసమే బూతు సినిమాలు చేశా.. పాత రోజుల్ని గుర్తుచేసుకున్న సన్నీ లియోన్) జేడీ గురించి చెబుతూ.. 'చాలా ఏళ్ల క్రితం ఇద్దరం కలిసి పంజాగుట్ట దగ్గర అర్థరాత్రి సమయంలో హీరోయిన్ రంభ తొడలు చూడటానికి వెళ్లిన బ్యాచ్ మేమిద్దరం. అక్కడ ఒక సినిమాకు చెందిన రంభ కటౌట్ చాలా పెద్దది పెట్టారు. అబ్బా ఏముందిరా రంభ అని కారులో వెళ్లి చూసొచ్చిన బ్యాచ్ మాది. తర్వాత అదే రంభతో బొంబాయి ప్రియుడు సినిమాలో హీరోగా చేసిన ఫ్రెండ్ వీడు' అంటూ ఉత్తేజ్ ఫన్నీగా చెప్పుకొచ్చాడు. జేడీకి సినిమాలంటే పిచ్చి. దర్శకత్వం అని ఎదో కొంచెం రూట్ మార్చాడు కానీ లేదంటే టాప్ హీరోలలో జేడీ కూడా ఒకడిగా ఉండేవాడని ఉత్తేజ్ తెలిపాడు. ఒకరకంగా చెప్పాలంటే జేడీ టాలీవుడ్ అమిర్ఖాన్ అంటూ ప్రశంసించాడు. అతనికి సినిమా తప్పితే ఇంకేమి తెలియదు. ఏ సినిమా గురించి అయినా కానివండి అర్దరాత్రి అడిగినా.. ఆ సినిమాకు సబంధించిన దర్శకుడు, సినిమాటోగ్రాఫర్ ఇలా పేర్లన్నీ చెప్పేస్తాడని పేర్కొన్నాడు. అంతలా అతనిలో సినిమా గురించి నాలెడ్జి ఉందని తెలిపాడు. బొంబాయి వెళ్లి 'సత్య' చేసినా... హైద్రాబాదులో 'బొంబాయి ప్రియుడు' చేసినా... అతనికి సినిమా తప్ప ఇంకేమి తెలియదని జేడీ గురించి ఉత్తేజ్ చెప్పుకొచ్చాడు. -
ఉత్తేజ్, బ్రహ్మాజీ కీలక పాత్రల్లో సస్పెన్స్ థ్రిల్లర్
ఉత్తేజ్, బ్రహ్మాజీ, ప్రభాస్ శ్రీను, ప్రొఫెసర్ దేవన్న, బేబి ధార్వి కీలక పాత్రల్లో ఓ చిత్రం ప్రారంభమైంది. ఊర శ్రీను దర్శకత్వంలో ఈ చిత్రాన్ని లెక్కల మహేంద్రా రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ప్రారంభోత్సవంలో దర్శఖుడు వి. సముద్ర, నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ, నిర్మాత బాల బ్రహ్మచారి,మన్నెపల్లి అప్పారావు, శ్రీలక్ష్మి, పి. జగన్మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సస్పెన్స్ థ్రిల్లర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. హీరో హీరోయిన్లుగా కొత్తవారు నటిస్తున్నారు అన్నారు నిర్మాతలు. -
చాలా నొప్పిగా ఉంది పద్దూ.. ఉత్తేజ్ ఎమోషనల్ పోస్ట్
Actor Uttej Very Emotional Words About His Wife: ప్రముఖ నటుడు, రచయిత ఉత్తేజ్ సతీమణి పద్మ ఇటీవల కన్నుమూసిన విషయం తెలిసిందే. క్యాన్సర్ సంబంధిత వ్యాధితో సెప్టెంబర్ 13న ఆమె మృతి చెందారు. ఆ సమయంలో ఉత్తేజ్ భార్యను తలచుకొని వెక్కివెక్కి ఏడ్చాడు. ఉత్తేజ్ను చూసి మెగాస్టార్ చిరంజీవి సైతం కంటతడి పెట్టుకున్నారు. నేడు(నవంబర్ 24) పద్మ పుట్టిన రోజు. గతేడాది పుట్టిన రోజుకు పక్కనే ఉన్న భార్య.. ఇప్పుడు లేకపోవడంతో ఉత్తేజ్ మరోసారి భావోద్వేగానికి గురయ్యాడు. తన భార్యను తలచుకుంటూ.. సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ పోస్ట్ చేశాడు. ‘పుట్టినరోజు శుభాకాంక్షలు పద్దమ్మ… ఉన్నంత కాలం నాకు పరిష్కారమై.. ఇపుడు ప్రశ్న నిచ్చి వెళ్ళావు.. చాలా నొప్పి పద్దు… నా చివరిశ్వాస తోనే నువ్వు నాలోంచి వెళ్ళేది…. లవ్ యూ పద్దమ్మా. మయూఖ పిల్లలంతా నిన్ను గుర్తు చేసుకుంటూనే ఉన్నారు…’అని ఫేస్బుక్లో రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
ఘనంగా ఉత్తేజ్ కూతురి సీమంతం.. ఫోటోలు వైరల్
Actor Uttej Daughter Chetana Baby Shower Photos Goes Viral: నటుడు ఉత్తేజ్ కూతురు చేతన త్వరలోనే తల్లి కాబోతుంది. ఈ సందర్భంగా వైభవంగా సీమంతం వేడుక జరిపించారు. దీనికి సంబంధించిన ఫోటోలను ఉత్తేజ్ చిన్నకూతురు పాట తన ఇన్స్టాగ్రామ్లో షేర్చేసింది. త్వరలోనే నా హీరో లేదా హీరోయిన్ వస్తున్నారు అంటూ ఇన్స్టాలో పోస్ట్ పెట్టింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. సీమంతం వేడుకకు సింగర్స్ గీతా మాధురి, శృతి సహా నటుడు తనీష్ సైతం హాజరయ్యారు. చదవండి: నటుడు ఉత్తేజ్ కూతురు బేబీ బంప్ ఫోటోలు వైరల్ హాట్ టాపిక్గా మారిన కృతిశెట్టి లిప్లాక్ సీన్ -
నటుడు ఉత్తేజ్ కూతురు బేబీ బంప్ ఫోటోలు వైరల్
Actor Uttej Daughter Chetana Baby Bump Photos Viral: నటుడు ఉత్తేజ్ కూతురు చేతన త్వరలోనే తల్లి కాబోతుంది. ప్రస్తుతం నిండు గర్భిణిగా ఉన్న ఆమె మెటర్నటీ షూట్ చేయించుకుంది. దీనికి సంబంధించిన ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసుకుంది. కూతురు పుడితే మా అమ్మ మళ్లీ పుట్టింది అని సంతోషిస్తానని, కొడుకు పుట్టినా ఆనందమే అని పేర్కొంది. కాగా ఇటీవలె ఉత్తేజ్ సతీమణి పద్మావతి మరణించిన సంగతి తెలిసిందే. క్యాన్సర్తో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచింది. ఇక చిత్రం సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్గా కెరీర్ ప్రారంభించిన చేతన పలు సినిమాల్లో నటించింది. అయితే హీరోయిన్గా మాత్రం సక్సెస్ కాలేకపోయింది. నటుడు రవిరాజాను ప్రేమ వివాహం చేసుకోవడంతో ఉత్తేజ్ కొంతకాలం పాటు కూతురితో మాట్లాడలేదు. -
నా భార్య చనిపోతే నరేష్ ఒక్క ఫోన్ కూడా చేయలేదు: ఉత్తేజ్
MAA Elections 2021: Actor Uttej About Naresh: భిన్నాభిప్రాయాలకు అవకాశం లేకుండా తాము తప్పుకుంటున్నామని నటుడు ఉత్తేజ్ అన్నారు. పోలింగ్ రోజున నరేష్ యుద్ధవాతావరణం సృష్టించారని, తనని తన కుటుంబ సభ్యులను బండబూతులు తిట్టారని పేర్కొన్నారు. 'నా భార్య పద్మ చనిపోతే చిరంజీవి, జీవితా రాజశేఖర్, ప్రకాశ్రాజ్ సహా పలువురు హస్పిటల్ వద్దనే ఉండి తన ఓదార్చారు. కానీ నరేష్ నుంచి మాత్రం ఒక్క ఫోన్ కాల్ కూడా రాలేదు. నా 25 ఏళ్ల కెరీర్లో బెనర్జీ అన్న ఏడవటం చూడలేదు. నరేష్ వల్లే "మా" శ్రేయస్సు కుంటుపడుతూ వచ్చింది. విష్ణు బాగా పనిచేయాలని ఆశిస్తున్నాం' అని ఉత్తేజ్ పేర్కొన్నారు. చదవండి: మోహన్ బాబు కించపరిచే బూతులు తిట్టారు: తనీష్ -
ఉత్తేజ్ భార్య గురించి చెబుతూ ఏడ్చేసిన చిరంజీవి
-
ఉత్తేజ్ భార్య సంతాప సభ
-
ఉత్తేజ్ భార్య పద్మావతి సంతాప సభలో చిరు భావోద్వేగం
ప్రముఖ నటుడు, రచయిత ఉత్తేజ్ భార్య పద్మావతి ఇటీవల మృతి చెందిన సంగతి తెలిసిందే. క్యాన్సర్ సంబంధిత వ్యాధితో ఈ నెల 13న ఆమె కన్నుమూశారు. ఈ నేపథ్యంలో నేడు (సెప్టెంబర్ 30) ఉత్తేజ్ తన భార్య పద్మ సంస్మరణ సభను హైదరాబాద్లోని ఫిలింనగర్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి, పలువురు టాలీవుడ్ ప్రములు హజరై పద్మకు ఘన నివాళి అర్పించారు. చిరును చూడగానే ఉత్తేజ్ ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యి ఆయనను పట్టుకుని కన్నీరు పెట్టుకున్నారు. అనంతరం ఆయనను, కూతురు చేతనను ఓదార్తూ చిరు సైతం భావోద్వేగానికి లోనయ్యారు. చదవండి: చిరంజీవిని పట్టుకుని కన్నీరు మున్నీరైన ఉత్తేజ్ ఇక ఈ కార్యక్రమంలో చిరు మాట్లాడుతూ.. ‘భార్యా వియోగం అన్నది చాలా దుర్భరం. అన్ని విధాల జీవితంలో సెటిల్ అవుతున్న సమయంలో పద్మ చనిపోవడం మమ్మల్ని అందరినీ కలిచివేసింది. ఈ వార్త విని నేను చలించిపోయాను. హిట్లర్ సినిమా నుంచి ఉత్తేజ్తో నాకు మంచి అనుబంధం ఏర్పడింది. ఈ ఆపద సమయంలో ఉత్తేజ్కు మనమందరం అండదండగా ఉండాలి. ఈ విషాదం నుండి ఉత్తేజ్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను’ అని వ్యాఖ్యానించారు. ఈ సంతాప సభకు మెగాస్టార్తో పాటు మెగా బ్రదర్ నాగాబాబు, హీరోలు డా. రాజశేఖర్, శ్రీకాంత్, ప్రముఖ రచయిత తనికెళ్ల భరణి, గీత రచయిత ఉత్తేజ్ మేనమామ సుద్దాల అశోక్ తేజ , దర్శకులు ఎస్.వి. కృష్ణారెడ్డి, నిర్మాత అచ్చిరెడ్డి, దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, యాంకర్ ఝాన్సీ, ప్రముఖ రంగస్థల నటుడు గుమ్మడి గోపాలకృష్ణ , నటి హేమ తదితరులు పాల్గొన్నారు. చదవండి: బూతులు తిడుతూ పెద్దపెద్ద రాళ్లతో దాడి చేశారు: పోసాని వాచ్మెన్ భార్య -
చిరంజీవిని పట్టుకుని కన్నీరు మున్నీరైన ఉత్తేజ్
Uttej Wife Padmavati Died: ప్రముఖ నటుడు ఉత్తేజ్ కుటుంబంలో విషాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఆయన భార్య పద్మావతి అనారోగ్యంతో సోమవారం కన్నుమూశారు. ఇటీవల క్యాన్సర్ బారిన పడిన ఆమె బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం(సెప్టెంబర్ 13) తుదిశ్వాస విడిచారు. ఈ విషయం తెలిసి మెగాస్టార్ చిరంజీవి, ప్రకాశ్ రాజ్, జీవిత రాజశేఖర్, బ్రహ్మాజితో పాటు పలువురు సినీ ప్రముఖులు బసవతారకం ఆసుపత్రికి చేరుకున్నారు. అనంతరం ఉత్తేజ్ను, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. చదవండి: Actor Uttej: నటుడు ఉత్తేజ్ భార్య పద్మావతి కన్నుమూత ఇన్నాళ్లు ప్రతి పనిలో తనకు చేదోడు వాదోడుగా ఉన్న భార్య మరణాన్ని తట్టుకోలేని ఉత్తేజ్.. చిరంజీవిని చూడగానే కన్నీటి పర్యంతం అయ్యారు. చిరంజీవి కాళ్లమీద పడి ఉత్తేజ్ కన్నీరు మున్నీరుగా విలపిస్తుండటంతో చిరు, ప్రకాశ్ రాజ్లు సైతం భావోద్యేగానికి లోనయ్యారు. ఆయన కూతురు చేతన, ఉత్తేజ్.. చిరుని పట్టుకుని ఏడుస్తున్న సన్నివేశం చూసి అక్కడ ఉన్న వారు కన్నీటి పర్యంతం అయ్యారు. వారిని ఓదార్చడం ఎవరి తరం కావడం లేదు. ఇక కూతురు చేతనను జీవిత ఓదార్చే ప్రయత్నం చేశారు. కాగా పద్మావతి.. ఉత్తేజ్ చేసే సేవా కార్యక్రమాల్లో భాగస్వామ్యం అయ్యేవారు. అంతేగాక ఆయనకు చెందిన మయూఖ టాకీస్ ఫిల్మ్ యాక్టింగ్ స్కూల్ నిర్వహణలో ఆమె విధులు నిర్వర్తించేవారు. చదవండి: మరో కాస్ట్లీ కారు కొన్న రామ్ చరణ్, వీడియో వైరల్ (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
చిరంజీవి, ప్రకాష్ రాజ్ కంటతడి...
-
నటుడు ఉత్తేజ్కి సతీ వియోగం.. పరామర్శించిన పలువురు ప్రముఖులు
-
ప్రముఖ నటుడు ఉత్తేజ్ ఇంట విషాదం
ప్రముఖ నటుడు ఉత్తేజ్ ఇంట విషాదం చోటుచేసుకుంది. ఆయన సతీమణి పద్మావతి సోమవారం ఉదయం కన్నుమూశారు. కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఆమె ఆరోగ్యం క్షీణించడంతో ఇటీవల బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో చేర్పించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ సోమవారం ఆస్పత్రిలో ఆమె తుదిశ్వాస విడిచారు. దీంతో ఉత్తేజ్కు, ఆయన కుటుంబసభ్యులకు సినీ ప్రముఖులు, సహా నటీనటులు సంతాపం తెలుపుతున్నారు. ఇక ఈ విషయం తెలిసిన వెంటనే మెగాస్టార్ చిరంజీవి, ప్రకాశ్ రాజ్, జీవిత రాశేఖర్తో పాటు పలువురు సినీ ప్రముఖు బసవతారకం ఆసత్రికి వెళ్లి అక్కడ ఉత్తేజ్ను, ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు. -
నిన్న రావు రమేష్.. నేడు ఉత్తేజ్
హైదరాబాద్: సోషల్ మీడియా వేదికగా కొందరు ఆకతాయిలు రెచ్చిపోతున్నారు. సినీ సెలబ్రెటీల పేరుతో నకిలీ అకౌంట్లను సృష్టించి వివాదస్పద పోస్టులు చేస్తున్నారు. ఇప్పటికే విలక్షణ నటుడు రావు రమేశ్ పేరుతో ట్విటర్లో ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై, టాలీవుడ్లో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులపై వివాదస్పదంగా ట్వీట్లు చేశారు. క్షణాల్లోనే ఈ ట్వీట్లు వైరల్ అయ్యాయి. దీంతో ఈ ట్వీట్లపై రావు రమేశ్ స్పందించారు. ‘సోషల్ మీడియాలో నా పేరుతో వచ్చిన పోస్టులకు నాకెలాంటి సంబంధం లేదు. నా పేరుతో సోషల్ మీడియాలో నకిలీ అకౌంట్ క్రియేట్ చేసి.. పోస్టులు చేసినవారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తా’అని రావు రమేష్ మీడియాకు వెల్లడించారు. తాజాగా నటుడు ఉత్తేజ్ కూడా నకిలీ అకౌంట్ల సమస్య బారిన పడ్డారు. ఆయన పేరుతో ఫేక్ ట్విటర్ అకౌంట్ క్రియేట్ చేసి పలు అభ్యంతకర పోస్టులు చేస్తున్నారు. దీంతో ఈ ట్వీట్లపై ఉత్తేజ్ స్పందించారు. ‘నమస్తే!! సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లో నాకు ట్విటర్ అకౌంట్ లేనే లేదు. నా పేరుతో వస్తున్న తప్పుడు వార్తల్ని ఖండిస్తున్నాను. సంఘంలో ఓ అస్తిత్వం, వ్యక్తిత్వం లేని వాళ్లు మాత్రమే ఇలాంటి చీప్ ట్రిక్స్ తో వాగుతుంటారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తున్నాను’ అని ఉత్తేజ్ మీడియాకు వివరించారు. ఇక నకిలీ ఆకౌంట్లపై టాలీవుడ్ ప్రముఖులు అందోళన చెందుతున్నారు. నకిలీ ఖాతాలను నియంత్రించేలా పోలీసులు తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. చదవండి: ట్విటర్ పోస్టులపై క్లారిటీ ఇచ్చిన రావు రమేష్ మహేశ్ సర్ప్రైజ్ వచ్చింది.. ట్రెండింగ్లో టైటిల్ -
‘కేసీఆర్ సర్.. నిన్ను నాయినా అని పిలవనా?’
నటుడు, రచయిత ఉత్తేజ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తెరపై వైవిధ్య పాత్రల్లో కనిపించి మెప్పించే ఈ నటుడిలో గొప్ప రచయిత దాగి ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుత, వాస్తవిక సంఘటనలపై తన అంతరంగంలో మెదిలిన భావాలను సూటిగా, నిక్కశ్చిగా చెప్పడం పాఠకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. గతంలో షార్ట్ కట్ అంటూ మానవాళి చేస్తున్న తప్పిదాలను ఉత్తేజ్ వేలెత్తి చూపించాడు. తాజాగా తెలంగాణ గడ్డపై కరోనా బారి నుంచి ప్రతీ ఒక్కరినీ కాపాడేవిధంగా నిర్ణయాలు తీసుకుంటూ, వారికి అండగా నిలుస్తూ భరోసా ఇస్తున్న సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలుపుతూ ఓ వీడియోను విడుదలచేశాడు. తన పదునైన, గుండెబరువెక్కె విధంగా ఉత్తేజ్ పలికిన మాటలు అందరని ఆకట్టుకునే,ఆలోచించే విధంగా ఉన్నాయి. ప్రస్తుతం ఉత్తేజ్కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘మహమ్మారి కరోనా వైరస్ ప్రపంచ మానవాళిని, మానవ మనుగడను, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తోంది. ఈ సమయంలో ప్రజలందరూ స్వీయ నియంత్రణ, వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ యుద్దం చేస్తున్నాం. అటువైపు మనందరి శ్రేయస్సు కోసం ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. మన ముఖ్యమంత్రి కేసీఆర్ అహర్నిశలు, అలుపులేకుండా ప్రజాశ్రేయస్సే పరమావరిధిగా తన పరిపాల దక్షతతో సరైన నిర్ణయాలతో తెలంగాణ గడ్డపై ప్రతీ ఒక్కరినీ కాపాడేవిధంగా కొండంత అండగా నిలువెత్తు మానవత్వంతో మనందరికోసం, మనకోసం నడుస్తున్నందుకు కేసీఆర్ సర్ నిన్ను నాయినా అని పిలవాలని ఉందే.. నిన్ను నాయినా అని పిలవాలని వుంది పిలవనా.. మొన్ననిన్ను టీవీలో చూసినంక నీ మాటలు ఇన్నంకా నీ చెయ్యితోని మా కండ్ల నీళ్లు తుడిచినట్టు.. మా భుజాల మీద చేయి వేసి ధైర్యం చెప్పినట్టు.. మా ఇంట్లో మనిషివైనట్టు కొట్టిందే. నిన్ను నాయినా అని పిలవాలనుంది పిలవనా నాయినా. మొన్న నువ్వు ఇచ్చిన భరోసాకు ఆల్లు ఈల్లని కాదు మొత్తం అందరు ఊపిరి పీల్సుక్నురు పానాలు లేచివచ్చినయ్ అన్నరు తెలంగాణ వెన్నుపూసగ నిల్శినవ్ గుండె దమ్మువై నడుస్తున్నవ్ మా బాగోగులు పట్టించుకుంటున్నవ్నిన్ను చూసినా నీ మాటలిన్నా బ్రతుకుమీద నమ్మకం వస్తది.. భయం అన్నది ఆమడ దూరం బోతది. దేన్నైనా జయిస్తాం అనిపిస్తది. మేం చేసుకున్న అదృష్టమే నువ్వు. ఇది నా ఒక్కడి మాట కాదు, తెలంగాణ వాళ్లే కాదు తెలుగు వాళ్లందరి మాట. అందరు సల్లగుండాలె మనుషులు పోతే వస్తరా అని మానవ వనరుల విలువలు చెప్తివి. తెలంగాణ బిడ్డలే కాదు ఈ గడ్డమీద వున్న ఏ బిడ్డ కూడా ఉపాసం పండొద్దని అమ్మలెక్క అర్సుకున్నవ్ ఆఫీసర్లకి ఆర్డర్లిస్తివి ఆపన్నుల ఆదుకుంటివి అనాథల అక్కున చేర్చుకుంటివి గీ ‘కరోనా’ని తరుముకుంట పానాలు నిలుపుతుంటివి..! నాయిన లెక్క చూసుకున్నవ్. అప్పుడెప్పుడో ఎనకట శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతమెత్తి గోవులను కాపాడినట్టు కరోనా బారిన పడకుండా ఆ గడ్డ మీదున్నోళ్లు ఓటర్లు కాదు మనుషులని కాపాడినవ్. కనపడన వాడు దేవుడైతే నాయినా నువ్వు మాకు కనిపించే దేవునివి. నువ్వు సల్లగుండాలె నాయినా.. నీ కొడుకులు బిడ్డలు సల్లగుండాలే’అంటూ ఉత్తేజ్ ఆ వీడియోలో పేర్కొన్నాడు. చదవండి: కేసీఆర్ తాత నిన్ను పాస్ చేసిండుపో.. లాక్డౌన్: ఏకబిగిన 70 కి.మీ. నడక ‘మా ఇంటి బిడ్డ(కేసీఆర్) పైసలు పంపిండు’ -
సినీ రంగానికి నూతన ఆర్టిస్టులు అవసరం
సిటీబ్యూరో: ‘‘ ఫిలిం ఇండస్ట్రీకి ఎప్పటికప్పుడు నూతన నటీనటులు కావాలి. నా చేతుల మీదుగా ప్రారంభించిన మయూఖ టాకీస్ ఫిలిం యాక్టింగ్ స్కూల్ మంచి ఆర్టిస్టులను అందిం చగలదన్న నమ్మకం ఉంది’’ అని దర్శకుడు పూరి జగన్నాథ్ అన్నారు. నటుడు ఉత్తేజ్ హైదరాబాద్ ఎల్లారెడ్డి గూడలో ఏర్పాటు చేసిన మయూఖ టాకీస్ యాక్టింగ్ స్కూల్ను పూరి జగన్నాథ్ జ్యోతి ప్రజ్వ లన చేసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఉత్తేజ్ 32 ఏళ్లుగా నాకు మంచి మిత్రుడని రామ్గోపాల్ వర్మకు పరిచయం చేసి, నేను దర్శకుడు కావటానికి కారకుడయ్యాడని చెప్పారు. నటుడిగా, రచయితగా, డబ్బింగ్ ఆర్టిస్ట్గా, యాక్టింగ్ కోచ్గా ఉత్తేజ్కు ఉన్న అనుభవం అపారమని అన్నారు. మా అబ్బాయి ఆకాష్కు కూడా ఉత్తేజ్ దగ్గరే శిక్షణ ఇప్పించానని చెప్పారు. ఉత్తేజ్ మాట్లాడుతూ.. సమర్థులు, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ దొరికినప్పుడు మాత్రమే ఫిల్మ్ ఇనిస్టిట్యూట్స్ విజయవంతం అవుతా యన్నారు. పూరి జగన్నాథ్ , కృష్ణవంశీ, సురేందర్ రెడ్డి, జె.డి.చక్రవర్తి, నందినీరెడ్డి వంటి దర్శకుల ప్రోత్సాహంతోనే స్కూల్ను ప్రారంభించాన్నారు. తొలి బ్యాచ్కి 32 అప్లికేషన్స్ రాగా కేవలం 18 మందిని మాత్రమే తీసుకున్నామని చెప్పారు. సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ ప్రభు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో నటుడు, దర్శకుడు జేడీ చక్రవర్తి, ప్రముఖ రచయిత లక్ష్మీ భూపాల్, మ్యాంగో మ్యూజిక్ అండ్ మ్యాంగో న్యూస్ అధినేత రామకృష్ణ వీరపనేని, ప్రముఖ రచయిత నడిమింటి నరసింహారావు పాల్గొన్నారు. -
ఆ ఇద్దరిలోను ఉత్తేజం...
శ్రీనగర్కాలనీ: ఒకరు ‘చెల్డ్ ఆర్టిస్ట్’గా సుపరిచితురాలు. కూచిపూడి నృత్యకారిణి..మరొకరు తన అభినయంతో.. గాత్రంతో అదరగొడుతున్న చిచ్చరపిడుగు. ఈ ఇద్దరుఅక్కాచెల్లెళ్లూ.. కళా రంగానికి వన్నె తేవాలని, తండ్రిని మించిన కూతుళ్లుగా పేరుతెచ్చుకోవాలని తపన పడుతున్నారు. అంతేకాదు.. తమ ప్రతిభతో అవకాశాలనుఅందిపుచ్చుకుంటున్నారు. వారెవరో కాదు.. నటుడు, రచయిత ఉత్తేజ్ కుమార్తెలు ఒకరు చేతన, మరొకరు పాట (చేతన చిన్న కూతురు పేరు పాట). ‘వియ్ ఆర్ హైదరాబాదీస్’ అంటూతమ ప్రతిభా పాటవాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. ఆ విషయాలు వారి మాటల్లోనే.. నా గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే చైల్డ్ ఆర్టిస్ట్ని. అందరికి గుర్తుండేది తేజ దర్శకత్వంలోని ‘చిత్రం’ సినిమాలో ‘అన్నయ్యా.. కుక్క కావాలి’ అంటూ ఏడుస్తూ డైలాగ్ చెప్పానే.. హీరో ఉదయ్కిరణ్ తమ్ముడిని. చైల్డ్ ఆర్టిస్ట్గా 20 చిత్రాల వరకూ చేశాను. నా తొలి చిత్రం ‘గిల్లికజ్జాలు’. తర్వాత ‘బ్రది, భద్రాచలం’ వంటి సినిమాలు చేశాను. పుట్టి పెరిగింది మొత్తం హైదరాబాదే. శ్రీనగర్కాలనీలో స్కూలింగ్. సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజీలో బీఏ మాస్ కమ్యూనికేషన్స్ చేశాను. డిప్లొమా ఇన్ స్క్రీన్ప్లే రైటింగ్ చేశాను. ఇక్కడే పుట్టి పెరిగా కాబట్టి.. హైదరాబాద్తో చాలా అనుబంధం ఉంది. శ్రీనగర్కాలనీ.. యూసుఫ్గూడ మా అడ్డాలు. అమ్మకి బొటిక్ ఉంది.. చార్మినార్ వద్ద షాపింగ్ అంటే చాలా ఇష్టం. హైదరాబాద్లో అన్నిప్రదేశాలు చుట్టేశా. బిర్యానీతోపాటు అమ్మ చేసినసీ ఫుడ్ అంటే చాలా ఇష్టం. థియేటర్ ఆర్టిస్ట్ని.. నేను థియేటర్ ఆర్టిస్ట్ని. తెలుగులో నాటకాలు చాలా వేశాను. కూచిపూడి ప్రదర్శనలు ఇచ్చాను. కొత్తగా ప్రొడక్షన్ ప్రారంభించి ప్రదర్శనలు ఇస్తున్నాను. ఇంట్లోనే నటుడు ఉన్నందన నటన అంటే భయం లేదు. సినిమా అవకాశాల కోసం ఆఫీసుల చుట్టూ తిరిగాను. ‘పిచ్చిగా నచ్చావ్’ చిత్రం హీరోయిన్గా నా మొదటి సినిమా. ‘సైరా’లో ఓ మంచి పాత్ర చేస్తున్నాను. తెలుగు, తమిళ భాషల్లో నిర్మిస్తున్న మరో చిత్రంలో కూడా నటిస్తున్నాను. కూచిపూడి అంటే ప్రాణం.. నా ఏడేళ్ల వయసు నుంచి కూచిపూడి నాట్యం నేర్చుకుంటున్నారు. నా గురువు బాలత్రిపుర సుందరి. ప్రస్తుతం హెచ్సీయూలో కూచిపూడిలో మాస్టర్స్ చేస్తున్నాను. నాట్యం అంటే ప్రాణం. ఎప్పటికీ నాట్యాన్ని వదలను. కొత్త నృత్యాలు నేర్చుకొని కూచిపూడితో కలిపి కొత్త నృత్యరీతిలో చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. ‘కలరీ స్టంట్స్’ కూడా నేర్చుకున్నాను. ఒడిస్సీ కూడా నేర్చకుంటాను. అన్ని నృత్యాలపై అవగాహన పెంచుకుని కూచిపూడి రూట్స్ను మార్చకుండా కొంగొత్తగా చేయడానికి కృషి చేస్తున్నాను. మొదటి గురువు నాన్నే.. నాన్న ఉత్తేజ్ చెల్లికి, నాకు కూడా మొదటి గురువు. చాలా ప్రొఫెషనల్గా ఉంటారు. ఏ అంశంపైనైనా అనర్గళంగా మాట్లాడగలరు. మా అభిప్రాయాలను గౌరవిస్తారు. అది చెయ్.. ఇది చెయ్ అని అనరు.. ఇష్టాలను గౌరవించి ప్రధాన్యతను ఇస్తారు. ఉత్తేజ్ కూతురు కదా అని అవకాశాలు రావు. ప్రతిభ ఉంటేనే ఇండస్ట్రీలో ఉంటాం. అమ్మ నాకు అన్ని అంశాల్లో సపోర్ట్గా ఉంటుంది. చెల్లి ‘పాట’ అల్లరి పిల్ల. చిన్నతనంలో నేను ఎలా ఉన్నానో.. అంతకు రెట్టింపుగా ఉంటుంది. ఎవరినైనా ఇమిటేట్ చేయగలదు. చాలా యాక్టివ్.. సినిమాల్లో అన్ని క్యారెక్టర్స్ చేయాలని ఉంది. తెలుగు అమ్మాయిగా అవకాశాలు వస్తే తప్పక నిరూపించుకుంటా. నా పేరే పాట.. మా నాన్న ఉత్తేజ్కు సంగీతం అంటే చాలా ఇష్టం. అందుకే నాకు ‘పాట’ అని పేరు పెట్టారు. చాలా కొత్తగా ఉంది కదూ..! విన్నవాళ్లంతా నా పేరును ప్రశంశిస్తున్నారు. ప్రస్తుతం ఏడో తరగతి చదువుతున్నాను. కర్ణాటిక్ సంగీతం నేర్చుకున్నాను. ఎవరినైనా ఇమిటేట్ చేయడం బాగా అలవాటు. నవ్వు చాలా మంచింది. అందుకే నేను ఎప్పుడూ నవ్వుతూ యాక్టివ్గా ఉంటాను. ‘ఓరయ్యో..ఓలమ్మో’ సూపర్హిట్ ‘రంగస్థలం’ సినిమా తెలుగు ఇండస్ట్రీలో ఘన విజయం సాధించింది. అందులోని ‘రంగమ్మ..మంగమ్మ’ సాంగ్ పేరడిగా సినిమా విజయాన్ని తెలుపుతూ ‘ఓరయ్యో.. ఓలమ్మో’ అంటూ పాట రూపొందించారు. అక్క నృత్యాన్ని అందించింది. సినిమా జర్నలిస్ట్ ప్రభు అంకుల్ పాట రాస్తే నేను పాడాను. చిన్న ప్రయత్నంగా చేసిన ఈ పాట యూట్యూబ్లో మంచి హిట్టయ్యి ఆరు మిలియన్ వ్యూస్ సాధించింది. చాలా మంది ప్రముఖులు సైతం మెచ్చుకున్నారు. పాప్ సాంగ్స్ చేస్తా.. మంచి సింగర్ అవ్వాలని కోరిక.. పాప్ సాంగ్స్ చేయాలని ఉంది. తెలుగమ్మాయిగా పాప్ గాయనిగా పేరు తెచ్చుకోవాలని ఉంది. ప్రస్తుతానికి మరో కవర్సాంగ్ చేస్తున్నా. మెగాస్టార్ చిరంజీవి ‘సైరా’ చిత్రంతో పాటు కళ్యాణ్రామ్ చిత్రంలోనటిస్తున్నాను. పలు చిత్రాల్లో అవకాశాలు వస్తున్నాయి. మంచి గాయనిగా, నటిగా పేరు తెచ్చుకొని మా నాన్న పేరును నిలబెట్టాలి. -
పోలీసులకు నటుడు ఉత్తేజ్ ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: సినీ నటుడు, రచయిత ఉత్తేజ్ పోలీసులను ఆశ్రయించారు. ఆయనకు చెందిన ఓ బట్టల షాపులో దొంగతనం జరగటంతో ఎస్సార్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళ్తే... అలంకార్ డిజైనర్స్ పేరిట అమీర్పేట ఎల్లారెడ్డి గూడలో ఉత్తేజ్కు ఓ బట్టల షాపు ఉంది. ఉత్తేజ్ భార్య పద్మావతి ఆ షాపును నిర్వహిస్తున్నారు. శనివారం ముగ్గురు మహిళలు షాపులోకి వచ్చి కస్టమర్లలాగా నటిస్తూ ఖరీదైన చీరలను దొంగిలించుకెళ్లారు. దొంగతనం జరిగిన విషయాన్ని కాస్త ఆలస్యంగా గుర్తించిన పద్మావతి విషయాన్ని భర్తకు తెలియజేశారు. సీసీ ఫుటేజీలను పరిశీలించిన ఉత్తేజ్ దొంగతనం జరిగిన విషయాన్ని గుర్తించి.. ఎస్సార్ నగర్ పోలీసులకు నిన్న సాయంత్రం ఫిర్యాదు చేశారు. చోరీకి గురైన చీరల విలువ రూ.80 వేలుగా ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫుటేజీ ఆధారంగా పోలీసులు కేసును దర్యాప్తు చేపట్టారు. -
‘రంగమ్మ మంగమ్మ’ పేరడీ సాంగ్
-
‘ఇంతలోనే ఎంత ఎదిగే రామ్ చరణూ’
రంగస్థలం సినిమా రిలీజై ఐదు వారాలు గడుస్తున్నా సినిమా హవా మాత్రం ఇంకా కనిపిస్తూనే ఉంది. ఇప్పటికీ మంచి వసూళ్లు సాధిస్తున్న ఈ సినిమాకు సంబంధించి రకరకాల వీడియోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. ముఖ్యంగా రంగమ్మ మంగమ్మ పాటకు చిన్నారులు డ్యాన్స్ చేసిన వీడియోలో పదుల సంఖ్యలో యూట్యూబ్లో దర్శనమిస్తున్నాయి. తాజాగా ఈ పాటకు పేరడీగా రూపొందించిన వీడియోను చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ తన అధికారిక యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ చేశారు. రంగమ్మ మంగమ్మ పాటను రామ్ చరణ్ నటనకు తగ్గట్టుగా‘ఓరయ్యో ఓలమ్మో ఏం పిల్లడూ.. ఇన్ని నాళ్లు యాడదాగే ఇంత నటుడు’ అంటూ పేరడీ చేశారు. ఈ పాటను ప్రముఖ నటుడు రచయిత ఉత్తేజ్ చిన్న కూతురు పాట ఉత్తేజ్ స్వయంగా ఆలపించి, నటించారు. -
ఉత్తేజంగా.. ఉల్లాసంగా..
-
ఇది కొత్తవాళ్ళ హౌస్!
‘‘నటుడు ఉత్తేజ్ వద్ద అసిస్టెంట్గా పనిచేశా. ఆయన్ను బాగా అబ్జర్వ్ చేయడం వల్ల ప్రతి విషయంపై అవగాహన వచ్చింది. ఆ అనుభవంతోనే కామెడీ ఎంటర్టైనర్గా ‘హౌస్’ తెరకెక్కించా. దర్శకుణ్ణి కావాలనే నా కల ఈ చిత్రంతో నెరవేరింది’’ అన్నారు దర్శకుడు రాజుశెట్టి. జై, వసుంధర జంటగా ఆయన దర్శకత్వంలో బోయన కృష్ణారావు నిర్మించిన చిత్రం ‘హౌస్’. శశాంక్ భాస్కరుణి స్వరపరచిన ఈ చిత్రం పాటల సీడీలను నిర్మాత కేఎల్ దామోదర్ ప్రసాద్ విడుదల చేశారు. త్వరలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నామన్నారు నిర్మాత. ‘‘నా శిష్యుడు రాజుశెట్టి కల నెరవేరినందుకు చాలా సంతోషంగా ఉంది. కొత్త వారందరూ కలిసి చేసిన ఈ చిత్రం విజయవంతమవ్వాలి’’ అని ఉత్తేజ్ అన్నారు. కృష్ణారావు, దర్శకుడు క్రాంతిమాధవ్, నిర్మాత ముత్యాల రాందాస్, హీరో మానస్ పాల్గొన్నారు. -
ఆమెకి అతనే విలన్!
‘మిస్సమ్మ’, ‘అదిరిందయ్యా చంద్రం’,‘మిస్టర్ అండ్ మిసెస్ శైలజా కృష్ణమూర్తి’ తదితర చిత్రాలతో హీరోగా తనకంటూ ఓ స్థానాన్ని ఏర్పరచుకున్నారు శివాజీ. కొంత విరామం తర్వాత ఆయన అంగీకరించిన చిత్రం ‘షీ’. ఈ చిత్రంలో శివాజీ నెగటివ్ రోల్ చేయడం విశేషం. శ్వేతామీనన్, మహత్ రాఘవేంద్ర, చేతనా ఉత్తేజ్, సోనియా అగర్వాల్ ప్రధాన పాత్రల్లో పర్స రమేష్ మహేంద్ర దర్శకత్వంలో మహేశ్వర ఆర్ట్స్ పతాకంపై కల్వకుంట్ల తేజేశ్వర్ రావు(కన్నారావ్) ఈ చిత్రం నిర్మిస్తున్నారు. నిర్మాత మాట్లాడుతూ - ‘‘ప్రస్తుతం ఈ చిత్రం మూడో షెడ్యూల్ జరుపుకుంటోంది. ఫిబ్రవరి 15కు ఈ షెడ్యూల్ పూర్తి చేస్తాం. దీంతో టాకీ పార్ట్ పూర్తవుతుంది. పాటల చిత్రీకరణ బ్యాలెన్స్ ఉంటుంది. ఓ పాటను బెల్జియంలో చిత్రీకరిస్తాం. తమిళ హీరో శింబు, సంగీత దర్శకుడు అనిరుధ్ ఇందులో ఓ పాట పాడుతున్నారు’’ అని తెలిపారు. ‘‘కొంచెం గ్యాప్ తరువాత మళ్లీ సినిమాలపై దృష్టి పెట్టాను. ఇందులో నెగటివ్ రోల్తో పాటు మరో రెండు చిత్రాల్లో డిఫరెంట్ రోల్స్ చేస్తున్నా’’ అని శివాజీ అన్నారు. దర్శకుడు రమేష్, శ్వేతామీనన్, దీక్షా పంత్ తదితరులు కూడా మాట్లాడారు. -
శ్మశానంలో 'షి'
హైదరాబాద్: విలక్షణ నటుడు, రచయిత ఉత్తేజ్ కుమార్తె హీరోయిన్గా నటిస్తున్న సినిమా షూటింగ్ కార్యక్రమం లాంఛనంగా మొదలైంది. ఈ విషయాన్ని ఉత్తేజ్ సోమవారం సోషల్ మీడియాలో అఫీయల్గా ప్రకటించారు. షీ అనే తెలుగు సినిమా ద్వారా వెండితెరకు పరిచయమవుతున్న తన కుమార్తెను ఆశీర్వదించాలని కోరారు. ఆ విశేషాలను, ఫొటోలను ట్విట్టర్లో పంచుకున్నారు. మలయాళ కుట్టి శ్వేతా మీనన్ ప్రధాన పాత్రలో ఉత్తేజ్ కూతురు చేతన టాలీవుడ్లో తెరంగేట్రం చేయనుంది. పర్స రమేష్ మహేంద్ర దర్శకత్వంలో కల్వకుంట్ల తేజేశ్వర్ రావు పరమేశ్వర ఆర్ట్స్ పతాకంపై నిర్మిస్తున్న చిత్రం ''షీ''. 'ఈజ్ వెయిటింగ్' అనే ట్యాగ్ లైన్తో వస్తున్న ఈ సినిమా కొన్ని దృశ్యాలను శ్మశానంలో చిత్రీకరించారు. ముహూర్తం సన్నివేశానికి నిర్మాత కల్వకుంట్ల తేజేశ్వర్ రావు సోదరి రమ్య క్లాప్ కొట్టగా , అనూప్ సింగ్ కెమెరా స్విచాన్ చేశారు. పూరీ జగన్నాథ్ గౌరవ దర్శకత్వం వహించారు. తాను ఇంతకు ముందు బాలనటిగా నటించినా, హీరోయిన్గా మాత్రం ఇదే తొలి సినిమా అని, ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నానని చేతన మీడియాతో చెప్పారు. మరి ఈమె కూడా తండ్రిలాగే విలక్షణ నటనతో ఆకట్టుకుంటుందా.. హీరోయిన్గా రాణిస్తుందా అనేది తెలియాలంటే షీ సినిమా విడుదల వరకు వేచిచూడాల్సిందే. -
పూరి చెప్పిన కధలపై ఉత్తేజ్ స్పందన
-
డ్రైనేజీ బతుకులు
స్టార్ రిపోర్టర్ - ఉత్తేజ్ నగరంలో అద్దాల్లా మెరిసే రోడ్ల పొడవునా.. భూగర్భంలో పరుచుకున్న అంధకూపాలకు పాలకులు వాళ్లు. తెల్లవారడంతోనే వీరి బతుకులు మురుగులో కూరుకుపోతాయి. పొద్దెక్కే వరకూ అందులోనే మురిగిపోతాయి. ఊపిరి సలపనివ్వని దుర్గంధంలో గంటల తరబడి పని చేస్తే గానీ వారి బతుకులు ముందుకు సాగవు. సాటి మనుషులు ఇదేం పనని మలినంలా చూస్తున్నా.. పొట్టకూటి కోసం మలినంలోనే మసలుతుంటారు. అదే మనుషుల వ్యర్థాలతో పేరుకుపోయిన మ్యాన్హోల్స్ను శుభ్రం చేసి.. అందరికీ స్వస్థత చేకూరుస్తారు. మురికిలో మగ్గుతున్న ఆ కార్మికులను ‘సాక్షి’ సిటీప్లస్ తరఫున స్టార్ రిపోర్టర్గా నటుడు ఉత్తేజ్ పలకరించారు. హలో అంటూ వారితో చేయి కలిపి ఆ మనసులోని మాటలు మన ముందుంచారు. ఉత్తేజ్: స్వచ్ఛ భారత్.. దేశం మొత్తం వినిపిస్తున్న మాట. నిజానికి మనం స్వచ్ఛ బారత్ నినాదాలం మాత్రమే. మీరు స్వచ్ఛ భారత్కు పునాదులు. డ్రైనేజ్ క్లీనర్స్.. ఈ మాట పలుకుతుంటేనే ముఖం చిట్లిస్తారు. కానీ, మీరే లేకుంటే మేం రోడ్డుపై ఒక్క నిమిషం నిలబడలేం. మీరు మురికిలో ఉంటూ మమ్మల్ని శుభ్రంగా ఉంచుతున్నారు. చెప్పండి భయ్యా ఎలా ఉన్నారు? యాదయ్య: చూస్తున్నరు కదా సార్! మురికిగుంటల పని చేసుకుంటున్నం. ఉత్తేజ్: మీరు ఈ పనిచేయవట్టే కదా! మేమింత హాయిగా ఉన్నాం. లేదంటే మ్యాన్హోల్స్లో పడి కాదు.. రోడ్డుపై పారే బురదలో కొట్టుకుపోయే వాళ్లం. వెంకటేష్: మమ్మల్ని పలకరించడానికి వచ్చినందుకు సంతోషం సార్. రాములు: అవ్ సార్.. మమ్మల్ని చూసి మా చుట్టాలే దూరం జరుగుతరు. యాదయ్య: పనైపోయినాంక స్నానం చేసే ఇంటికి వోతం. అయినా వాసనొస్తుందంటరు. ఉత్తేజ్: తప్పు భయ్యా.. చిన్న పిల్లల మలమూత్రాలు ఎత్తిపోసే అమ్మ ఎంత గొప్పదో.. వీధుల్లో డ్రైనేజీ క్లీన్ చేసే మీరు అంతేనయ్యా. అంజయ్య: గట్ల అర్థం చేసుకునేటోళ్లు ఎవరు సార్ ! ఉత్తేజ్: బతకడానికి ఎన్నో వృత్తులుండగా మీరు ఇదే ఎందుకు ఎంచుకున్నారు? రాములు: బతకడానికే సార్. గీ పనీ దొరకక బాధలు పడేటోళ్లు చానామందున్నరు. యాదయ్య: సార్ మేం ఉండేది జనగాం దగ్గర. పని చేసేది ఖైరతాబాద్లో. ఉత్తేజ్: ఎక్కడ జనగాం.. ఎక్కడ ఖైరతాబాద్ ! పొద్దున ఎన్ని గంటలకు బయలుదేరుతావు ? యాదయ్య: మూడు గంటలకు సైకిల్ మీద రైలు స్టేషన్కు పోత. ఆడ రెలైక్కి సిటీల దిగుత. మళ్లీ బస్సెక్కి ఖైరతాబాద్ చేరుకుంట. ఉత్తేజ్: ఓ మైగాడ్.. ఈ పని చేయడానికా? రాములు: అంతేగా సార్. పొట్టకూటి కోసం.. ఏదో ఒకటి చేసుకోవాలే. ఉత్తేజ్: మీ పని వేళల గురించి చెప్పండి? మహ్మద్ చాద్మియ: పొద్దుగాళ్ల ఏడు గంటలకే షురువైతది. అంతేనా.. ఎప్పుడు ఫోనొస్తే అప్పుడు ఉరకాలే. మేం బండి మీద పని చేసేటోళ్లం. ఏడ కంప్లైంటొస్తే ఆడికి పోతం. ఉత్తేజ్: మురిగునీటిపై వాలిన దోమలు, ఈగలు ఇంట్లోకి వస్తేనే రకరకాల జబ్బులొస్తాయంటారు కదా! అలాంటిది మీరు పొద్దంతా మ్యాన్హోల్స్లోనే ఉంటారు. మరి మీ ఆరోగ్యాల పరిస్థితి ఏంటి? అంజయ్య: జ్వరాలొస్తయ్. దగ్గు, దమ్ము ఉండనే ఉంటయి. చర్మరోగాలు ఎక్కువొస్తుంటయి. ఉత్తేజ్: అలాంటి జబ్బులొచ్చినప్పుడు మీకు ఉచితంగా వైద్యం అందుతుందా? యాదయ్య: ఎన్ని జబ్బులొచ్చినా.. డాక్టర్ కాడికి పోతే సొంతం పైసలే పెట్టుకోవాలే. సర్కార్ నుంచి ఏ సాయం ఉండదు. ఉత్తేజ్: చాలాసార్లు విన్నాను. మీ కార్మికులు పనులు చేస్తూ మ్యాన్హోల్లో పడి గాయాలపాలైనట్టు.. ప్రాణాలు కోల్పోయినట్టు..! వెంకటేష్: చిన్న చిన్న దెబ్బలు తగిలితే వెంటనే మా ఆఫీసుల మందురాసి కట్టుకట్టేటోళ్లు ఉంటరు సార్. పెద్ద దెబ్బలు తాకితే సర్కార్ దవాఖానకు పోతం. అప్పుడప్పుడూ ఊపిరాడకనో.. దెబ్బ బలంగా తాకో ప్రాణాలే పోతయ్ సార్. ఉత్తేజ్: మ్యాన్హోల్లో పడి సామాన్య ప్రజలు ప్రాణాలు పోగొట్టుకున్నట్టు వార్తలు పేపర్లో చదువుతుంటాం. దానికి కారణం ఎవరు..? మీరు కాదంటారా ? రాములు: కచ్చితంగా మేం కాదు సార్. రోడ్డుపక్కన షాపుల వాళ్లు వారి షాపు ముందు నిలిచిపోయిన నీళ్లు పోయేందుకు రాత్రి పూట అక్కడున్న మ్యాన్హోల్ మూత తీసి పక్కన పెడ్తరు. నీళ్లు పోయినాంక మూత పెట్టరు. మేం చూస్తే మూసేస్తాం. లేదంటే అది గట్లనే ఉంటది. ఈ విషయం తెల్వక అందరూ మమ్మల్ని అంటరు. ఉత్తేజ్: రోడ్డుపై మ్యాన్హోల్స్ పక్కన లోపలి నుంచి తీసిన చెత్తను కుప్పగా పెట్టి వదిలేస్తారు? దాని వల్ల దుర్వాసనతో పాటు రోడ్డంతా పాడవుతుంది కదా? వెంకటేష్: అది మా పొరపాటే సార్. దానికీ కారణం ఉంది. మా దగ్గర మ్యాన్హోల్స్లో దిగి క్లీన్ చేసే ఉద్యోగులు చానమంది ఉన్నరు. చెత్త తీస్కవోయేటోళ్లు, బండ్లు తక్కువున్నయి. మహ్మద్ చాద్మియ: అదొక్కటే కారణం కాదు సార్. గప్పట్ల ఏడపడ్తే ఆడ చెత్తకుండీలు ఉండేటియి. మేం ఎండిపోయిన చెత్తను తీస్కవోయి వాటిల్ల వేసేటోళ్లం. ఇప్పుడు కాలనీలళ్ల చెత్తకుండీలు పెట్టనిస్తలేరు. దాంతో ఎప్పటికప్పుడు చెత్తను తీసేయ్యడం కష్టమైతుంది. ఉత్తేజ్: మీకు జీతాలు ఎట్లుంటయి భయ్యా ? యాదయ్య: ఏదో ఉంటయి సార్. ఐదేళ్లు అనుభవం ఉంటే పది,పదిహేను వేల దాకా వస్తుంది. కానీ ఇప్పటి ఖర్చులకు ఏడ సరిపోతది సార్. ఈ సిటీల సంసారమంటే గీ ైపైసలు ఏడికి రావు. ఉత్తేజ్: మీకు సొంతిళ్లో, ప్రభుత్వం ఇచ్చిన ఇళ్లో ఏమన్న ఉన్నాయా..? రాములు: అందరం అద్దె ఇళ్లల్లనే ఉంటున్నం సార్. ఉత్తేజ్: చివరి ప్రశ్న.. మీరు మందుకొట్టి ఈ పనిచేస్తారని అంటారు నిజమేనా? అంజయ్య: మామూలుగా మ్యాన్హోల్ దగ్గరికి వస్తేనే కళ్లు తిరుగుతయ్. గసొంటిది తాగి దాంట్లకు దిగితే మళ్లీ పైకొస్తమా సార్. ఏ మాత్రం తేడా అయినా.. లోపల పడి చస్తం. పని అయినాంక మాత్రం తాగుతం. కష్టం మరచిపోనికి తాగుతం సార్. ఉత్తేజ్: ఓ.. సారీ. నేను ఎక్కడో విని మిమ్మల్ని అడిగాను. మీరు చెప్పిన మాట నిజమే. బుర్ర సరిగా పని చేయనపుడు మ్యాన్హోల్ చుట్టుపక్కలకు రావొద్దు. చాలా ప్రమాదం. జగ్గయ్య: అంతేగా సార్. ఉత్తేజ్: రోడ్డుపై నుంచి వెళ్తున్నప్పుడు ఓపెన్ చేసి ఉన్న మ్యాన్హోల్ కనిపించగానే కారు అద్దాలు ఎత్తేసుకుంటాం. అలాంటిది అందులోకి దిగి అక్కడ జీవన పోరాటం సాగించే మిమ్మల్ని కలసి మాట్లాడినందుకు హ్యాపీగా ఉంది భయ్యా. థ్యాంక్యూ. ఉత్తేజ్: ఇక బయలుదేరుతాను.. చెయ్యి ఇవ్వండి యాదయ్య: అయ్యో వద్దుసార్. అంతా బురదవట్టింది. వాసనొస్తది. ఉత్తేజ్: నీ చెయ్యి మురికిగా ఉంది కాబట్టే మేమంతా శుభ్రంగా ఉన్నాం. ఒక్కసారికి ఏం కాదు. -
25 ఏళ్ళ 'శివ'తో మేము..! Part 2
-
25 ఏళ్ళ 'శివ'తో మేము..! Part 3
-
ఎందరికో జన్మనిచ్చిన 'శివ'
అక్కినేని నాగార్జున - అమల జంటగా రామ్గోపాల్ వర్మ దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్, ఎస్.ఎస్.క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించిన 'శివ' చిత్రం ఎందరికో జన్మనిచ్చిందని ఆ చిత్రంలో నటించిన పలువురు చెప్పారు. ట్రెడ్సెట్టర్ క్రియేట్ చేసిన ఈ సినిమా విడుదలై 25 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా సాక్షి టీవీ నిర్వహించిన 'శివ 25 ఏళ్లు-స్పెషల్ ఎడిషన్'లో తనికెళ్ల భరణి, జెడి చక్రవర్తి, ఉత్తేజ్ పాల్గొన్నారు. దర్శకుడు శివనాగేశ్వర రావు, నటుడు, నిర్మాత చిన్న, రామ్ జగన్.....మరికొందరు ఫోన్లో మాట్లాడారు. రామ్గోపాల్ వర్మ కూడా ఫోన్లో మాట్లాడారు. శివ నిర్మాణం గురించి డాక్యుమెంటరీ విడుదల చేయబోతున్నట్లు రామ్ గోపాల్ వర్మ చెప్పారు. స్పెషల్ ఎడిషన్'లో పాల్గొన్నవారందరూ ఆ నాటి శివ సినిమా నిర్మాణ ఘట్టాలను, షూటింగ్, రీరికార్డింగ్ సందర్భంగా జరిగిన విషయాలను, ఈ చిత్రంతో తమ అనుబంధాన్ని, తమ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. తాము నటులుగా ఎంపికైన వివరాలు తెలిపారు. ముందు మాటల రచయితగా మాత్రమే ఎంపికైన తనికెళ్ల భరణి, ఆ తరువాత ఆ చిత్రంలో నానాజీ పాత్రకు ఎలా విధంగా పోషించారో తెలిపారు. ఈ మూవీలో బాగా పాపులర్ అయిన సైకిల్ చైన్ ఫైటింగ్ సన్నివేశాన్ని రామ్గోపాల్ వర్మతోపాటు తానుకూడా కలిసి రూపొందించినట్లు జెడి చక్రవర్తి చెప్పారు. తొలుత ఆ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేసిన తాను అనుకోకుండా అందులో యాదగిరి పాత్ర పోషించినట్లు ఉత్తేజ్ చెప్పారు. తమకు కొత్త సినీజీవితాలను ఆ చిత్రం ప్రసాదించినట్లు రామ్ జగన్, చిన్న పేర్కొన్నారు. తాను పుట్టి 25 ఏళ్లైందని చిన్న సవినయంగా చెప్పారు. తనకు ఈ చిత్రం కొత్త గుర్తింపును ఇచ్చిందని, అందువల్లే దర్శకుడు రాము పేరుతో కలిపి తన పేరును రామ్ జగన్గా మార్చుకున్నట్లు వివరించారు. ఈ స్పెషల్ ఎడిషన్'లో పాల్గొన్నవారు శివ లాంటి చిత్రం ఎవరూ తీయలేరు - రామూ కూడా తీయలేరు - రామూ తీసినా అంతబాగా తీయలేరు... అని చెప్పారు. వారు చెప్పిన కొన్ని ముఖమైన విషయాలు: తొలుత రామ్గోపాల్ వర్మను ఒక్క నాగార్జున మాత్రమే నమ్మారు. శివ ఇంత హిట్ అవుతుందని అనుకోలేదు. ఈ సినిమాలో హాస్య సన్నివేశాలను రామూ అసలు అంగీకరించలేదు. కథనం-ఫొటోగ్రఫీ-మ్యూజిక్-ఫైటింగ్స్-డైలాగ్స్...అన్నీ కొత్తతరహాగానే ఉన్నాయి. తెలుగు సినిమాకు కొత్త నడక నేర్పింది. ** -
25 ఏళ్ళ 'శివ'తో మేము..! Part 1
-
కుక్క కావాలి!
కుక్క కావాలి.. అనే మాటలు వింటే, ‘చిత్రం’ సినిమాలో ఉత్తేజ్ కూతురు చేతన గుర్తొస్తుంది. ఆ సినిమాలో చిన్నారి చేతన కుక్క కావాలని మారాం చేస్తుంటుంది. చిన్నప్పుడు తమన్నా కూడా అలానే మారాం చేసేవారట. ‘ఓ కుక్కను పెంచుకుంటా మమ్మీ’ అంటే.. తమన్నా అమ్మ ససేమిరా అనేవారట. అలా తమన్నా చిన్ని కోరిక నెరవేరలేదు. ఇన్నేళ్ల తర్వాత ఇటీవలే ఆమె కోరిక తీరింది. అందుకు కారణం హిందీ చిత్రం ‘ఇట్స్ ఎంటర్టైన్మెంట్’. అక్షయ్కుమార్ సరసన తమన్నా నటించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఇందులో ఓ కుక్కపిల్ల కీలక పాత్ర చేసింది. ఈ చిత్రం షూటింగ్ సమయంలో ఆ కుక్కపిల్లకు తమన్నా బాగా దగ్గరయ్యారట. దాంతో కుక్కపిల్లను కొనుక్కోవాలనే చిన్ననాటి కోరిక ఆమెలో రెట్టింపయ్యింది. ఇప్పుడైనా కుక్కపిల్లను కొనుక్కోవడానికి అనుమతివ్వమని తన తల్లిని బతిమాలుకున్నారట. ఈసారి తమన్నా తల్లి ఆమెకు పచ్చజెండా ఊపారు. దాంతో ఓ కుక్కపిల్లను కొనుక్కుని దానికి ‘పెబెల్’ అని నామకరణం చేశారు తమన్నా.