warangal mgm hospital
-
ఎంజీఎంలో అర్ధరాత్రి పవర్కట్.. రోగి మృతి
ఎంజీఎం: షార్ట్ సర్క్యూట్తో వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో కరెంటు సరఫరా నిలిచిపోయింది. ఒక్కసారి ఆస్పత్రి చీకటిమయంగా మారడంతో రోగులతోపాటు వారివెంట ఉన్న బంధువులు ఆందోళనకు గురయ్యారు. వెంటిలేటర్పై చికిత్స పొందుతున్న ఓ రోగి చనిపోయాడు. అయితే ఆ రోగి వ్యాధి తీవ్రతతోనే చనిపోయినట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రకటించారు. అసలేం జరిగిందంటే.. ఎంజీఎం ఆస్పత్రిలో ఏఎంసీ వార్డు వెనుకాల ఉన్న విద్యుత్ తీగలపై కోతులు చేసిన ఆగ డాలతో వైర్లు ఒక్కోటి పరస్పరం తాకాయి. షార్ట్ సర్క్యూట్ జరిగి వైర్లు కాలిపోయాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఆస్పత్రిలో సాధారణ వార్డుకు విద్యుత్ సరఫరా నిలిచిపోయినా.. జనరేటర్ ద్వారా అత్యవసర వార్డుల(ఏఎంసీ, ఐఎంసీ, ఆర్ఐసీయూ, ఎస్ఎన్సీయూ, ఎంఓటీ, ఈఓటీ)కు విద్యుత్ సరఫరా జరిగేది. కానీ జనరేటర్తో లింక్ ఉన్న ఉన్న విద్యుత్వైర్లు కూడా కాలిపోవడంతో గంటపాటు అంధకారం నెలకొంది. విద్యుత్ సరఫరా లేకపోవడంతో మృతి: రోగి బంధువుల ఆరోపణ ఆస్పత్రిలో శుక్రవారం రాత్రి ఏర్పడిన విద్యుత్ అంతరాయం కారణంగా ఆర్ఐసీయూ విభాగంలో చికిత్స పొందుతున్న బొజ్జ భిక్షపతి(45) మృతి చెందినట్లు రోగి బంధువులు ఆరోపిస్తున్నారు. వరంగల్ జిల్లా నర్సంపేట మండలం రాజేశ్వర్రావు పల్లె గ్రామానికి చెందిన భిక్షపతి ఆల్కహాల్ లివర్ సిరోసిస్ సమస్యతో శుక్రవారం తెల్లవారుజామున ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యాడు. వైద్యులు అతనికి ఆర్ఐసీయూలో వెంటిలెటర్ ద్వారా చికిత్స అందిస్తున్నారు. శుక్రవారం రాత్రి ఆస్పత్రిలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో భిక్షపతికి అమర్చిన వెంటిలైటర్ నిలిచి శ్వాస తీసుకోవడం తీవ్రమైనట్లు మృతుడి బంధువులు చెబుతున్నారు. దీంతో చనిపోయాడని వాపోతున్నారు. ఈ విషయంపై ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్ ఒక ప్రకటన విడుదల చేశారు. విద్యుత్ అంతరాయం ఏర్పడిన విషయం వాస్తవమేనని తెలిపారు. బాధితుడి మృతిచెందిన సమయంలో వెంటిలెటర్ బ్యాటరీ బ్యాకప్తో కొనసాగుతోందని పేర్కొన్నారు. భిక్షపతి మృతికి విద్యుత్ అంతరాయం కాదని, వ్యాధి తీవ్రతే కారణమని స్పష్టం చేశారు. -
వరంగల్ ఎంజీఎంలో ఇద్దరికి కరోనా పాజిటివ్
సాక్షి, వరంగల్: వరంగల్ ఎంజీఎంలో కరోనా కలకలం మొదలైంది. ఎంజీఎం ఆసుపత్రిలో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఎంసీ వైరాలజీ ల్యాబ్లో ఆరు శాంపిల్స్ ఆర్టీపీసీటీ టెస్ట్కు పంపగా.. రెండు పాజిటివ్గా వచ్చాయి. భూపాలపల్లికి చెందిన యాదమ్మ అనే మహిళతోపాటు మరో వ్యక్తి రాజేందర్కు పాజిటివ్గా వైద్యులు నిర్ధారించారు. వీరిద్దరికి కోవిడ్ వార్డులో చికిత్స అందిస్తున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆసుపత్రి అధికారులు అప్రమత్తమయ్యారు. మాస్క్లు లేకుండా ఎవరిని ఆసుపత్రిలోకి అనుమతించడం లేదు. ఆసుపత్రిలో కోవిడ్ పాజిటివ్ కేసులు వెలుగుచూడటంతో రోగులు, అటెండెంట్లు ఆందోళనకు గురవుతున్నారు. మరోవైపు కొవిడ్ వ్యాప్తిపై అపోహలు వద్దని వరంగల్ ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్ సూచించారు. ఎంజీఎం ఆస్పత్రి ఆవరణలో 50 పడకలతో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశామన్నారు. 70కిపైగా కోవిడ్ వెంటిలెటర్లు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. -
వరంగల్ ఎంజీఎంలో కరోనా కలకలం.. వైద్యులు ఏమన్నారంటే
సాక్షి, వరంగల్: వరంగల్ ఎంజీఎంలో కరోనా కలకలం రేపుతోంది. భూపాలపల్లి జిల్లాకు చెందిన ఒక వ్యక్తికి కొత్త వైరస్ సోకి.. ఎంజీఎం కోవిడ్ వార్డులో చేరినట్లు తెలుస్తోంది. అంతేగాక నగరానికి చెందిన మరో ముగ్గురిని సైతం అనుమానితులుగా గుర్తించినట్లు వాట్సాప్లో సమాచారం చక్కర్లు కొట్టింది. దీంతో రోగులు, అటెండెంట్లు ఆందోళనకు గురవుతున్నారు. కాగా కరోనా భయంతో ఆసుపత్రి సిబ్బంది నో మాస్క్, నో ఎంట్రీ విధానాన్ని పాటిస్తున్నట్లు సమాచారం. మాస్క్లు లేకుండా ఎవరిని లోపలికి రావొద్దని సెక్యూరిటీ చెబుతున్నారు. ఆసుపత్రిలో కరోనా కేసులు నమోదయ్యాయన్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి ఇదిలా ఉండగా కోవిడ్ పాజిటివ్పై వార్తలు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇప్పటి వరకు ఎంజీఎం కొవిడ్ వార్డులో ఎలాంటి అనుమానితులు గానీ, కరోనా జేఎన్1 లక్షణాలు ఉన్న వారు గానీ నమోదు కాలేదని స్పష్టం చేశారు. కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ఆదేశాలను అనుసరించి 50 పడకలతో కొవిడ్ వార్డును ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. చదవండి: సింగరేణి ఎన్నికలకు హైకోర్టు గ్రీన్సిగ్నల్ -
ఇక ఆరోగ్యశ్రీ డిజిటల్ కార్డులు
సాక్షి, హైదరాబాద్: కొత్త ఆరోగ్యశ్రీ డిజిటల్ కార్డులను రూపొందించి స్థానిక ప్రజాప్రతినిధుల ద్వారా జిల్లాల్లోని లబ్దిదారులకు అందజేయాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు ఆదేశించారు. మంగళవారం ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ కార్యాలయంలో ఆరోగ్యశ్రీ బోర్డు సమావేశం జరిగింది. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ పరిమితి రూ.2లక్షల నుంచి రూ.5లక్షలకు పెంచినందున కొత్త ఆరోగ్యశ్రీ డిజిటల్ కార్డులను రూపొందిస్తున్నామని చెప్పారు. అందుకోసం లబ్దిదారుల ఈ–కేవైసీ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. నిమ్స్ స్పెషలిస్టు డాక్టర్ల ద్వారా ఆరోగ్యశ్రీ కేసుల మెడికల్ ఆడిట్ నిర్వహించాలని సూచించారు. కోఠి ఈఎన్టీ ఆసుపత్రికి రూ.1.30 కోట్ల ప్రోత్సాహకం కోవిడ్ సమయంలో ఎక్కడా చేయని విధంగా రికార్డు స్థాయిలో 856 బ్లాక్ ఫంగస్ సర్జరీలు విజయవంతంగా నిర్వహించిన కోఠి ఈఎన్టీ ఆసుపత్రికి రూ.1.30 కోట్ల అదనపు ప్రోత్సాహకం ఇవ్వనున్నట్టు మంత్రి వెల్లడించారు. మూగ, చెవిటి పిల్లలకు చికిత్స అందించి బాగు చేసే కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీలు ప్రస్తుతం కోఠి ఈఎన్టీ ఆసుపత్రిలో ప్రభుత్వం ఉచితంగా అందిస్తోందన్నారు. ఈ తరహా సేవలను వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలోనూ అందుబాటులోకి తెచ్చేందుకు కమిటీ ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. కిడ్నీ బాధితులకు మరింత నాణ్యంగా డయాలిసిస్ సేవలు అందించేందుకు ఆన్లైన్ పర్యవేక్షణ చేసే విధంగా ప్రత్యేక సాఫ్ట్ వేర్ రూపొందించి, వినియోగించడానికి ఆరోగ్యశ్రీ బోర్డు అనుమతి ఇచ్చిందన్నారు. దీంతోపాటు ఆరోగ్యశ్రీ రోగులకు ఫేస్ రెకగ్నిషన్ సాఫ్ట్ వేర్ వినియోగానికి కూడా అనుమతి ఇచ్చిందని వెల్లడించారు. బయోమెట్రిక్ విధానం వల్ల కొంత ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో మరింత పారదర్శకంగా ప్రజలకు సేవలు అందించేందుకు ఈ విధానం తేవాలని నిర్ణయించిందని తెలిపారు. ఆరోగ్యశ్రీ ప్యానెల్ బృందంలో ఉన్న కాంట్రాక్టు డాక్టర్ల వయోపరిమితిని 65 ఏళ్ల నుంచి 70 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్టు హరీశ్ రావు వెల్లడించారు. సమావేశంలో ఆ శాఖ కార్యదర్శి రిజ్వీ, ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ సీఈవో విశాలాచ్చి, సీఎం ఓఎస్డీ గంగాధర్, డీఎంఈ రమేష్ రెడ్డి, ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ గడల శ్రీనివాసరావు, టీవీవీపీ కమిషనర్ అజయ్ కుమార్, నిమ్స్ డైరెక్టర్ బీరప్ప పాల్గొన్నారు. -
కాలులేని భార్యను భుజంపై మోసుకొని..
ఎంజీఎం: వరంగల్ ఎంజీఎంలో స్ట్రెచర్ అందుబాటులో లేక చికిత్స అనంతరం ఓ వృద్ధుడు తన భార్యను భుజాలపై మోసుకెళ్లిన ఘటన శుక్రవారం సోషల్ మీడియాలో వైరల్ అయింది. భద్రాది కొత్తగూడెం జిల్లాకు చెందిన మాలోతు లక్ష్మికి నవంబర్లో కుడికాలి రక్తప్రసరణ ఆగిపోయింది. శస్త్రచికిత్స నిర్వహించిన వైద్యులు మోకాలు కింద నుంచి కాలును తొలగించారు. రోగిని 15 రోజులకోసారి డ్రెస్సింగ్ కోసం తీసుకురావాలని సూచించారు. దీంతో లక్ష్మి ని ఆమె భర్త శుక్రవారం ఆస్పత్రికి తీసుకుచ్చాడు. అక్కడున్న సిబ్బంది ‘పెద్ద సార్ లేరు.. రేపు రావాలని చెప్పారు. ఆ సమయంలో స్ట్రెచర్ అందుబాటులో లేకపోవడంతో మండుతున్న ఎండలోనే భుజాలపై మోసుకుంటూ తీసుకెళ్లాడు. ఈ ఘటనపై ఎంజీఎం సూపరింటెండెంట్ చంద్రశేఖర్ స్పందించారు. డ్రెస్సింగ్ అనంతరం సిబ్బంది రోగిని వీల్చైర్లో క్యాజువాలిటీ నుంచి బయటకు తీసుకొచ్చారన్నారు. కాలిపర్ (కాలుకు అమర్చే లోహ పరికరం) కోసం వెళ్లగా శనివారం అందుబాటులో ఉంటుందని, అప్పుడు రావాలని సిబ్బంది చెప్పారన్నారు. తిరిగి వెళ్లే క్రమంలో ఎండ తీవ్రత దృష్ట్యా భర్త తన భార్యను ఒక చెట్టు వద్దకు తీసుకెళ్లేందుకు భుజంపై ఎక్కించుకొని వెళ్తుండగా వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారన్నారు. ఇలాంటి ఘటనలతో ఆస్పత్రిని అభాసుపాలు చేయవద్దని కోరారు. -
వీడిన మిస్టరీ.. డాక్టర్ ప్రీతిది ఆత్మహత్యే
సాక్షి, వరంగల్: వరంగల్ కాకతీయ వైద్య కళాశాల పీజీ వైద్య విద్యార్థిని డాక్టర్ ధారావత్ ప్రీతి కేసు మిస్టరీ ఎట్టకేలకు వీడింది. ఆమెది ఆత్మహత్యేనని, ఆమె శరీరంలో పాయిజన్ ఉన్నట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైందని వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ శుక్రవారం ప్రకటించారు. ప్రీతి మృతికి సీనియర్ విద్యార్థి డాక్టర్ సైఫ్ వేధింపులే కారణమని ప్రాథమికంగా నిర్ధారించిన పోలీసులు అతన్ని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. అతను బెయిల్పై ఇటీవలే బయటికి వచ్చాడు. డాక్టర్ ప్రీతిది హత్యేనని ఆమె కుటుంబసభ్యులు ప్రకటించడంతో ఈ కేసుకు మరింత ప్రాధాన్యత చోటుచేసుకుంది. అయితే రెండు నెలలు గడుస్తున్నా పోలీసులు ప్రీతి కేసు విషయంలో ఎటూ తేల్చకపోవడంతో పెద్దఎత్తున అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీనిపై ‘సాక్షి’జిల్లా పేజీలో ‘ప్రీతి మృతిపై వీడని మిస్టరీ’శీర్షికన శుక్రవారం ప్రత్యేక కథనం కూడా ప్రచురితమైంది. దీంతో శుక్రవారం సాయంత్రం వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్ ప్రీతిది ఆత్యహత్యేనని ప్రకటించారు. పోస్టుమార్టం, ఫోరెన్సిక్ నివేదికల్లో ప్రీతి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆధారాలున్నాయని తెలిపారు. ప్రీతి ఆత్మహత్యకు డాక్టర్ సైఫ్ వేధింపులే కారణమన్నారు. ఘటనాస్థలిలో ఆత్మహత్యకు కారణమైన సిరంజీ ఉందని, సూది మాత్రం కనిపించలేదన్నారు. వారం, పది రోజుల్లో చార్జిషీట్ దాఖలు చేస్తామని తెలిపారు. సాక్షి వరంగల్ జిల్లా పేజీలో శుక్రవారం ప్రచురితమైన కథనం.. చదవండి: వీడిన సనత్ నగర్ బాలుడి హత్య కేసు మిస్టరీ.. అదే కారణం! -
మెడికో ప్రీతి మృతిపై వీడని మిస్టరీ
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మెడికో ప్రీతి మృతి మిస్టరీగానే మిగిలింది. రెండు నెలలు కావస్తున్న ప్రీతి డెత్ ఆత్మహత్యనా.. హత్యనా తేలక అనుమానస్పద మృతిగానే పోలీసులు పరిగణిస్తున్నారు. ప్రీతి ఏలా చనిపోయిందో స్పష్టమైన ఆధారాలు లభించకపోయినప్పటికి ర్యాగింగే ప్రీతి డెత్కు కారణమని పోలీసులు ఆ దిశగా చర్యలు చేపట్టారు. అందుకు కారణమైన సీనియర్ వైద్య విద్యార్ధి సైఫ్ను అరెస్టు చేసి జైల్ కు పంపగా 56 రోజుల అనంతరం షరతులతో కూడిన బెయిల్ మంజూరయ్యింది. ఈ ఏడాది పిబ్రవరి 22న వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో పీజీ మెడికల్ విద్యార్థి ప్రీతి అపస్మారక స్థితిలో పడిపోయింది. నిమ్స్కు తరలించి మెరుగైన వైద్యం అందించినా ప్రీతి ప్రాణాలు కోల్పోయారు. ప్రీతి మృతిపై అనేక అనుమానాలు ఆందోళనలు వ్యక్తం కావడంతో పోలీసులు విచారణ చేపట్టి సీనియర్ వైద్య విద్యార్థి సైఫ్ వేధింపులు ర్యాగింగే కారణమని తేల్చారు. ముందుగా ప్రీతి మత్తు ఇంజక్షన్ తీసుకొని ఆత్మహత్య చేసుకుందని భావించినప్పటికీ టాక్సికాలజీ రిపోర్టులో ఎలాంటి మత్తు రసాయనాలు తీసుకున్నట్లు ఆధారాలు లభించలేదు. ఎవరైనా హత్య చేశారా అంటే అందుకు సంబంధించి ఎవిడెన్స్ దొరకలేదు. హత్య కాదు... ఆత్మహత్య చేసుకోలేదు.. మరి ప్రీతి ఎలా చనిపోయిందనేది అందరి మదిని తోలుస్తున్న ప్రశ్న. పోలీసులు మాత్రం అనుమానాస్పద మృతిగా బావిస్తూ అన్ని కోణాల్లో విచారిస్తున్నారు. దాదాపు రెండు నెలలుగా సాగిస్తున్న విచారణలో ఏమి తేలలేదు. పోలీసులకు సవాల్గా మారిన ఈ కేసులో కీలకంగా ఉన్న ఎంజీఎం ఆసుపత్రిలో అత్యవసర శస్త్రచికిత్స విబాగంలో ప్రీతి పడిపోయిన విశ్రాంతి గది సీజ్ను తొలగించారు. ఘటన జరిగిన రోజున మట్టెవాడ పోలీసులు ఈ గదిని సీజ్ చేసి పలుమార్లు సిపి రంగనాథ్ సందర్శించి స్వయంగా విచారణ చేశారు. ఇప్పటి వరకు కేసులో ఏలాంటి పురోగతి కనిపించకపోగా, మట్టెవాడ పోలీసులు సీజ్ చేసిన గది తాళాలను తొలగించి ఎంజీఎం అధికారులకు అప్పగించారు. ఈ కేసును పోలీసులు ఎటు తేల్చకుండానే గది తాళాలను ఎంజీఎం అధికారులకు అప్పగించడం చర్చనీయాంశంగా మారింది. ప్రీతి డెత్పై ఎలాంటి క్లారిటీ ఇవ్వకుండా క్రమంగా కేసు తీవ్రతను తగ్గిచే ప్రయత్నాలు జరుగుతున్నాయనే అనుమానాలను ప్రీతి కుటుంబ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు. దర్యాప్తు జరుగుతున్న తీరు సరిగాలేదని, ఇప్పటివరకు పోస్ట్ మార్టమ్ రిపోర్ట్, ఫోరెన్సిక్ రిపోర్ట్ లేకుండా కేఎంసీ ప్రిన్సిపల్ హెచ్ఓడీపై చర్యలు తీసుకోకుండా హాస్పిటల్ లో రూమ్ ఎందుకు సీజ్ తొలగించారని ప్రీతి సోదరుడు పృథ్వి ప్రశ్నిస్తున్నారు. కార్డియాక్ అరెస్ట్తో చనిపోయిందని ఇండైరెక్ట్ గా చెబుతున్నారని, అదే నిజమైతే ఎందుకు రక్తం ఎక్కించారు.. కడుపుకు ఆపరేషన్ ఎందుకు చేశారనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. ఇప్పటికైనా పోలీసులు నిష్పాక్షపాతంగా దర్యాప్తు చేయాలని కోరుతున్నారు. ప్రీతి అపస్మారక స్థితిలో పడిపోయిన గది సీజ్ను తొలగించడానికి కారణం పీజీ వైద్య విద్యార్థులు, సిబ్బందికి అత్యవసర చికిత్స కోసం అవసరం కావడంతోనే సీజ్ తొలగించి ఆసుపత్రికి అప్పగించినట్లు పోలీసులు తెలిపారు. ప్రీతి తల్లిదండ్రుల అనుమానాలను నివృత్తి చేస్తూ ఏ ఒక్క చిన్న అంశాన్ని వదిలిపెట్టకుండా అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నామని సిపి రంగనాథ్ తెలిపారు. తప్పు చేసిన వారు తప్పించుకోవడానికి వీలు లేకుండా జాగ్రత్తగా లోతైన విచారణ చేస్తున్నామని చెప్పారు. ఫైనల్గా పోస్టుమార్టం రిపోర్టు వస్తే కానీ నిర్ణయానికి రాలేమన్నారు సిపి రంగనాథ్. ఒకవేళ గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయినా, సాధారణ మరణమే అయినా అందుకు ర్యాగింగే కారణమని స్పష్టం చేశారు. సైఫ్, ప్రీతి సెల్ ఫోన్ మెసేజ్లు, వాట్సాప్ గ్రూప్ చాటింగ్ల ఆధారంగా ప్రీతి ర్యాగింగ్కు గురైందని నిర్ధారించామని, ర్యాగింగ్ యాక్ట్ ప్రకారం సైఫ్ కు పదేళ్ళ శిక్షతోపాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు శిక్ష అదనంగా ఉండే అవకాశం ఉందని ఇటీవల సీపి ప్రకటించారు. మరోవైపు సైఫ్ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించగా.. మూడుసార్లు బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురికాగా 56 రోజుల అనంతరం షరతులతో కూడిన బెయిల్ లభించింది. పది వేల బాండ్, ఇద్దరు పూచీకత్తుపై ఎస్సీ ఎస్టీ కోర్టు న్యాయమూర్తి సత్యేంద్ర బెయిల్ ఇచ్చి, ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల మధ్య విచారణ అధికారి ఎదుట హాజరు కావాలని షరతు విధించారు. చార్జిషీటు దాఖలు చేసే వరకు లేదా 16 వారాల వరకు విచారణ అధికారి ఎదుట హాజరు కావాల్సి ఉంటుంది. ఇక దాదాపు రెండు నెలలు కావస్తున్న ఇంకా పోస్ట్ మార్టమ్ రిపోర్టు రాకపోవడం, కేసు మిస్టరీ వీడకపోవడంతో కన్నవారు మానసిక ఆవేదనతో ఆందోళన చెందుతున్నారు. తన కూతురు ఎలా చనిపోయిందో స్పష్టం చేసి ఇక ముందు ఇలాంటి సంఘటనలు పునఃరావృతం కాకుండా కఠిన చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. -
ప్రీతి హత్య కేసు.. సైఫ్కి బెయిల్ మంజూరు
సాక్షి, వరంగల్: కాకతీయ వైద్య కళాశాల పీజీ విద్యార్థిని డాక్టర్ ప్రీతి హత్య కేసులో నిందితుడు సీనియర్ విద్యార్థి డాక్టర్ సైఫ్కి ఎస్సీ, ఎస్టీ కోర్టు జడ్జి సత్యేంద్ర షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు. 60 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ బుధవారం నాటికి 58 రోజులు అవుతున్న సందర్భంగా నిందితుడి తరఫు న్యాయవాదులు కోర్టు ఎదుట వాదనలు విన్పించారు. వాదనల అనంతరం కోర్టు సైఫ్కి బెయిల్ మంజూరు చేసింది. అయితే చార్జి షీట్ దాఖలు చేసేనాటికి లేదా 16 వారాల వరకు ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల మధ్య సంబంధిత విచారణ అధికారి ఎదుట హాజరుకావాలని షరతు విధించింది. వ్యక్తిగతంగా రూ.10 వేల బాండ్, ఇద్దరు జమానత్దారుల పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో సాక్షులపై కానీ, మృతురాలి కుటుంబ సభ్యులపై కానీ ఎలాంటి బెదిరింపులకు పాల్పడకూడదని, నిబంధనలను ఉల్లంఘించిన పక్షంలో ప్రాసిక్యూషన్ వారికి బెయిల్ రద్దు కోరే అవకాశం ఇస్తూ కోర్టు ఆదేశించింది. చదవండి: లండన్లో హైదరాబాద్ యువతి మృతి.. సెలవు తీసుకుని ఇంటికొస్తానని చెప్పి.. -
పీజీ మెడికో ఆత్మహత్యాయత్నం.. ఇంజక్షన్ కోసం మొబైల్లో సెర్చ్ చేసి!
సాక్షి వరంగల్/ఎంజీఎం: ఆస్పత్రిలో డ్యూటీ సమయంలో సీనియర్ వేధింపులు భరించలేక. గట్టిగా మాట్లాడితే ఎక్కడ మార్కులు తగ్గిస్తారోనని భయపడింది. ప్రిన్సిపాల్కు ఫిర్యాదు చేసినా వేధింపులు తగ్గలేదు. ఇద్దరికి కౌన్సెలింగ్ ఇచ్చిన గంటల వ్యవధిలోనే తనలోతాను కుమిలిపోయి ఓ పీజీ వైద్య విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన వరంగల్ నగరంలో కలకలం రేపింది. అదీ ఆస్పత్రిలో డ్యూటీగా ఉండగా జరగడంతో కలకలం సృష్టించింది. జనగామ జిల్లా కొడకండ్ల మండలం మొండ్రాయి గిర్నితండాకు చెందిన ధరావత్ నరేందర్ వరంగల్లోని ఆర్పీఎఫ్లో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ కుటుంబం హైదరాబాద్లో సెటిల్ అయ్యింది. ఆయనకు ముగ్గురు కుమార్తెలు ఉండగా.. చిన్న కుమార్తె అయిన ప్రీతి(26) ఎంబీబీఎస్ పూర్తి చేసుకుని కేఎంసీలో అనస్తీషియా పీజీ కోర్సులో 2022లో చేరింది. ప్రస్తుతం థియరిటికల్ క్లాస్లు జరుగుతున్నాయి. ఇక్కడే వేధింపులు అనస్తీషియా వైద్య విభాగ డ్యూటీ చార్టులో భాగంగా ఎంజీఎం ఆస్పత్రిలోని ఎమర్జెన్సీ ఆపరేషన్ థియేటర్(ఈఓటీ)లో రోజూ సాయంత్రం నాలుగు గంటల నుంచి ఉదయం తొమ్మిది గంటల వరకు ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్, ఒక ఎస్ఆర్, ఒక సీనియర్ పీజీ, ఇద్దరు జూనియర్ పీజీ విద్యార్థులు విధులు నిర్వర్తిస్తుంటారు. కొన్ని రోజులుగా ఇక్కడే విధులు నిర్వర్తిస్తోంది. ఇక్కడ పరిచయమైన సీనియర్ సైఫ్ కొంతకాలంగా వేధిస్తున్నట్లు ప్రిన్సిపాల్కు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ప్రిన్సిపాల్ మోహన్దాసు ఆదేశాల మేరకు అనస్తీషియా విభాగాధిపతి డాక్టర్ నాగార్జునరెడ్డి మంగళవారం సాయంత్రం సైఫ్, ప్రీతిలను పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించారు. ఇది జరిగిన గంటల వ్యవధిలోనే ప్రీతి ఆత్మహత్యకు యత్నించడంతో ఆమెకు వేధింపులు ఏ స్థాయిలో ఉన్నాయనే అనుమానం కలుగుతోంది. ట్రెమడాల్ ఇంజక్షన్ ఎప్పుడు వాడుతారంటే.. ట్రెమడాల్ హైడ్రోక్లోరైడ్ 50 ఎంజీ ఇంజక్షన్ కీళ్లు, కండరాలను ప్రభావితం చేసే పరిస్థితుల్లో మితమైన, తీవ్రమైన నొప్పి నుంచి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది. మనకు నొప్పి ఉందని చెప్పే మెదడులోని రసాయన దూతలను నిరోధించడం ద్వారా ఇది పనిచేస్తుంది. ఇది రుమటాయిడ్ ఆర్థరైటిస్, అస్టియో ఆర్థరైటిస్ వంటి పరిస్థితుల్లో నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది. చికిత్స పొందుతున్న పరిస్థితినిబట్టి మోతాదు, వ్యవధిని డాక్టర్ నిర్ణయిస్తారని వైద్యులు పేర్కొంటున్నారు. మానసిక ఒత్తిళ్లకు తలొగ్గే వ్యక్తి కాదు.. విద్యలో ఎదురయ్యే ఎలాంటి మానసిక ఒత్తిళ్లకు తలొగ్గే విద్యార్థిని ప్రీతి కాదని బంధుమిత్రులు పేర్కొంటున్నారు. కరోనా సమయంలోనూ సికింద్రాబాద్ రైల్వే ఆస్పత్రిలో ఉద్యోగులకు సేవలందించిందని తెలిపారు. ప్రీతి తండ్రి రైల్వే విభాగంలో చేస్తున్న క్రమంలో తన తండ్రితో విధులు నిర్వర్తిస్తున్న వారి ఆరోగ్య సంరక్షణకు సికింద్రాబాద్ రైల్వే ఆస్పత్రిలో విస్తృత సేవలందించిందని రైల్వే అధికారులు తెలిపారు. ప్రీతి ఏ ఇంజక్షన్ వేసుకుంది..? ప్రీతి ఏ ఇంజక్షన్ వేసుకుని ఆత్మహత్యకు యత్నించిందో ఎవరూ అధికారికంగా ధ్రువీకరించడం లేదు. ప్రీతి అనస్తీషియా ఇంజక్షన్ల సమాచారం కోసం తన సెల్ఫోన్లో తీవ్రంగా సెర్చ్ చేసినట్లు సమాచారం. ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్న ఆమె తీవ్రమైన నొప్పులతో బాధపడుతున్న సందర్భంలో తీసుకునే ట్రెమడాల్ ఇంజక్షన్ తీసుకున్నట్లు కొందరు వైద్యులు పేర్కొంటున్నారు. కానీ.. ప్రీతి ట్రెమడాల్ ఇంజక్షన్ కాకుండా అనస్తీషియా తీసుకోవడం వల్ల కార్డియాక్ అరెస్టుతోపాటు తన శరీరంలో పలు అవయవాలు పనిచేయకుండా పోయాయని మరికొందరు వైద్యులు చర్చించుకుంటున్నారు. ఆరు నెలల క్రితం ఎంజీఎం ఆస్పత్రిలో అనస్తీషియా ఇంజక్షన్ వికటించిన సందర్భంలో సైతం ఇద్దరు రోగులు కార్డియాక్ అరెస్టు కావడం వల్ల చనిపోయిన సందర్భాలను గుర్తుచేసుకుంటున్నారు. మంత్రుల ఆరా.. ప్రీతి ఘటనపై రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు స్పందించారు. కేఎంసీ ప్రిన్సిపాల్ మోహన్దాసు, ఎంజీఎం సూపరింటెండెంట్ చంద్రశేఖర్తో ఫోన్లో మాట్లాడి ఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. వేధింపులు అయితే విచారణ కేసు పక్కదారి పట్టకుండా చూడాలని ఆదేశించారు. ఈ ఘటనపై రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు కూడా స్పందించారు. సీపీ రంగనాథ్తో మాట్లాడి విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. ప్రాణాపాయస్థితిలో కొట్టుమిట్టాడుతున్న విద్యార్థినికి మెరుగైన వైద్యసేవలందించాలని వైద్యులను ఆదేశించినట్లు పేర్కొన్నారు. తల్లిదండ్రులు ఏమంటున్నారంటే.. కాలేజీ, ఆస్పత్రిలో ర్యాగింగ్, వేధిస్తున్న సీనియర్ విద్యార్థి సైఫ్పై ప్రిన్స్పాల్కు ఫిర్యాదు చేస్తా అంటే వద్దు డాడీ అంటూ నివారించిందని తండ్రి తెలిపారు. ఈనెల 20న ఏడుస్తూ కాల్ చేసిందని, పీజీ సీనియర్ డాక్టర్ అరాచకంపై ఏసీపీ కిషన్కు చెప్పినట్లు తెలిపారు. ప్రిన్సిపాల్కు ఫిర్యాదు చేయడంతో తనపై ఫిర్యాదు చేస్తావంటూ మరోసారి సైఫ్ ప్రీతిని బెదిరించగా మనస్తాపానికి లోనై ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని చెప్పాడు. ఎంజీఎం సూపరింటెండెంట్ ఏమన్నారంటే.. ఈ ఘటనపై ఎంజీఎం సూపరింటెండెంట్ చంద్రశేఖర్ విలేకరుల సమావేశంలో పలు అంశాలు వివరించారు. ఆపరేషన్ థియేటర్లో ప్రీతి కాకుండా విధుల్లో ఉన్న మరో అమ్మాయి, అబ్బాయితో మాట్లాడితే ఇంజక్షన్ ఏమీ తీసుకోలేదన్నారని తెలిపారు. ఆమెను పరిశీలిస్తే కార్డియాక్ అరెస్టు రావడంతో వైద్య బృందంతో సీపీఆర్(కార్డియో పులుమోనరీ రెసిటేషన్) ద్వారా చికిత్స చేసి ట్రీట్మెంట్ అందించామని చెప్పారు. గుండెకు సంబంధించి 28 శాతం ఏజెక్షన్ ఫ్రాక్షన్ ఒఫ్ హార్ట్, గ్లోబల్ హిపోకైనేషియా, పాంక్రియాటైటిస్, అసైటీస్, ఊపిరితిత్తుల సమస్య ఉన్నట్టు తేలిందన్నారు. ప్రీతికి థైరాయిడ్ సమస్య, కీళ్లవాతానికి సంబంధించి మందులు వాడుతున్నట్టుగా తేలిందని చంద్రశేఖర్ తెలిపారు. కొన్ని రోజుల నుంచి ఓ అబ్బాయి వేధిస్తున్నాడు.. కొద్ది రోజుల నుంచి ఓ అబ్బాయి వేధింపులకు గురిచేస్తున్నాడు. ఈ విషయాన్ని తన సోదరికి, కుటుంబ సభ్యులకు చెప్పింది. మాట్లాడుదామని భరోసా ఇచ్చాం. ఉదయం ప్రీతి ఆత్మహత్యకు యత్నించిందని మాకు చెప్పారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. – దేవేందర్, ప్రీతి మేనమామ -
వరంగల్ ఎంజీఎంలో పీజీ వైద్య విద్యార్థిని ఆత్మహత్యాయత్నం.. నిమ్స్కు తరలింపు
సాక్షి, వరంగల్: వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో పిజీ వైద్య విద్యార్థిని ఆత్మహత్యాయత్నం కలకలం సృష్టిస్తుంది. పాయిజన్ ఇంజక్షన్ తీసుకుని ఆత్మహత్యకు యత్నించడంతో పరిస్థితి విషమంగా ఉంది. సీనియర్ పీజీ వైద్య విద్యార్థి వేధింపులే కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఇప్పటికే వేధింపులకు గురిచేసిన వైద్య విద్యార్థులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా హైదరాబాద్లో ఏఎస్ఐగా విధులు నిర్వర్తిస్తున్న నరేందర్ కూతురు ప్రీతి కాకతీయ మెడికల్ కళాశాలలో పీజీ మొదటి సంవత్సరం చదువుతుంది. విధి నిర్వహణలో సీనియర్ వైద్య విద్యార్థి ఇబ్బందులకు గురిచేస్తున్నాడని కేఎంసీ ప్రిన్సిపల్కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఫిర్యాదు చేసినప్పుడు వెంటనే అధికారులు స్పందించి చర్యలు తీసుకుంటే ఇలాంటి సంఘటనకు దారితీసేది కాదంటున్నారు కుటుంబ సభ్యులు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వైద్య విద్యార్థిని తల్లిదండ్రులు ఆవేదనతో కోరుతున్నారు. నిమ్స్కు తరలింపు మరోవైపు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ నిమ్స్కు తరలించారు. సీనియర్ విద్యార్థి వేధింపుల వల్లే.. విద్యార్థిని ఆత్మహత్యకు యత్నించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. విద్యార్థిని మల్టీ ఆర్గాన్స్ దెబ్బతిన్నట్లు తెలుస్తోందని ఎంజీఎం సూపరింటెండెంట్ తెలిపారు. శ్వాస తీసకోవడంతో బాధితురాలు ఇబ్బంది పడుతోందని, విద్యార్థినిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు. ర్యాగింగ్ జరిగిందా లేదా అన్నది నిర్ధారణ కాలేదని పేర్కొన్నారు. వేధింపులపై విచారణకు కమిటీ వేస్తున్నామని.. మూడు కమిటీలతో విచారణ జరిపిస్తున్నామని వెల్లడించారు. సీనియర్ తప్పు ఉంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. చదవండి: Kushaiguda: గుడిలో చోరీకి యత్నించి ప్రాణాలు కోల్పోయిన దొంగ -
పేషెంట్ బెడ్ కింద పాము.. పరుగులు తీసిన రోగులు, వైద్య సిబ్బంది
సాక్షి, వరంగల్: వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో ఎలుకల అలజడే కాదు, పాములు కలకలం సృష్టిస్తున్నాయి. పేషెంట్లను వైద్య సిబ్బందిని భయాందోళనకు గురిచేస్తున్నాయి. పేషెంట్లను పరుగులు పెట్టిస్తున్నాయి. పదిరోజుల క్రితం క్యాన్సర్ వార్డులోని బాత్రూంలోకి చొరబడ్డ నాగుపాము, తాజాగా వార్డులోకే వచ్చింది. ఓ పేషెంట్ బెడ్ కిందకి రావడంతో పామును చూసిన పేషెంట్లు వారి బంధువులు భయంతో పరుగులు తీశారు. అప్రమత్తమైన ఆసుపత్రి సిబ్బంది వెంటనే పాములు పట్టేవారికి సమాచారం ఇచ్చి దాక్కున్న పామును పట్టేశారు. పదిరోజుల వ్యవధిలో రెండుసార్లు పాము ఆసుపత్రిలో ప్రత్యక్షం కావడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. 15 రోజుల వ్యవధిలో మూడు సార్లు ఆసుపత్రిలో పాములు కనిపించడం, గతంలో ఎలుకలు అలజడి సృష్టించడం స్థానికంగా కలకలం సృష్టిస్తుంది. పురాతన భవనం, డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడం వల్లే పాములు ఎలుకలకు ఆవాసంగా ఆసుపత్రి మారుతుందనే ఆందోళన వ్యక్తమవుతుంది. చదవండి: రెస్టారెంట్లో బిర్యానీ తింటున్నారా?.. అయితే మీకో చేదు వార్త -
ఎంజీఎంలో బాలుడి మృతి.. తెలంగాణ ప్రభుత్వం సీరియస్
సాక్షి, వరంగల్: వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో మత్తుమందు అధిక మోతాదులో ఇవ్వడం వల్ల విహాన్ (8) అనే బాలుడు మృతి చెందాడని అతని కుటుంబ సభ్యుల ఆరోపణలు.. ఆందోళనను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ఈ ఘటనపై విచారణ జరపాలని ఆదేశించిన నేపథ్యంలో బుధవారం అడిషనల్ కలెక్టర్ శ్రీవాత్సవ ఎంజీఎం ఆస్పత్రిలో విచారణ చేపట్టారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్ ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులు పీడియాట్రిక్ సర్జన్ డాక్టర్ అనిల్బాల్రాజు, ప్లాస్టిక్ సర్జరీ విభాగాధిపతి డాక్టర్ రంగస్వామిలతో అడిషనల్ కలెక్టర్ మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఆర్ఐసీయూలోని స్టాఫ్నర్సులు, అనస్తీషియా విభాగాధిపతి, ఆర్థో విభాగాధిపతులతో మాట్లాడారు. తుది నివేదికను ప్రభుత్వానికి సమర్పించనున్నారు. విహాన్ కేసు పూర్వాపరాలను మంత్రి హరీశ్రావు, వైద్యారోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రిజ్వీ స్వయంగా అడిగి తెలుసుకున్నారు. చదవండి: హైదరాబాద్లో రాగల 24 గంటల్లో భారీ వర్షం -
ఇద్దరు డాక్టర్ల సస్పెన్షన్ కు కారణమైన ఎలుకలు
-
రోగి కాళ్లు, చేతులు కొరికిన ఎలుకలు
ఎంజీఎం: ఉత్తర తెలంగాణ జిల్లాల్లోకెల్లా ప్రభుత్వ పెద్దాసుపత్రిగా పేరుగాంచిన వరంగల్లోని మహాత్మాగాంధీ స్మారక ఆస్పత్రి (ఎంజీఎం) ఐసీయూలోకి ఎలుకలు జొరబడ్డాయి. వెంటిలేటర్ల ద్వారా కృత్రిమశ్వాస అందించే వార్డులో చికిత్స పొందుతున్న ఓ రోగిపై ఐదు రోజుల వ్యవధిలో రెండుసార్లు దాడి చేశాయి. కాళ్లు, చేతులు కొరికి తీవ్రంగా గాయపరిచాయి. అధిక రక్తస్రావం కావడంతో ప్రస్తుతం ఆ రోగి పరిస్థితి విషమంగా ఉంది. ఏమీ కాదులే అంటూ... రోగి బంధువుల కథనం ప్రకారం హనుమకొండ జిల్లా భీమారానికి చెందిన శ్రీనివాస్ (42) కిడ్నీ వ్యాధితో బాధపడుతూ గత నెల 26న ఎంజీఎం ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యాడు. పరిస్థితి విషమించడంతో ఆయన్ను ఆర్ఐసీయూ వార్డుకు తరలించి వెంటిలేటర్ ద్వారా చికిత్స అందిస్తున్నారు. గత నెల 27న శ్రీనివాస్ కుడిచేతి వేళ్లను ఎలుకలు కొరికినట్లు బంధువులు గమనించారు. వెంటనే విషయాన్ని వైద్య సిబ్బంది దృష్టికి తీసుకెళ్లగా వారు కట్టుకట్టి ఏమీ కాదులే అని వదిలేశారు. అయితే గత నెల 30న అపస్మారక స్థితిలో ఉన్న శ్రీనివాస్పై ఎలుకలు మరోసారి దాడి చేశాయి. ఆయన ఎడమ చేయి, కాలి వేళ్లతోపాటు మడమ వద్ద కొరకడంతో తీవ్ర రక్త స్రావమైంది. వెంటనే అతని సోదరుడు శ్రీకాంత్ విషయాన్ని వైద్యులతోపాటు ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రీనివాస్ దృష్టికి తీసుకెళ్లాడు. ఇదేమి ఆస్పత్రి.. వైద్యం అంటూ అసహనం వ్యక్తం చేశాడు. దీంతో స్పందించిన వైద్యులు రోగికి చికిత్స అందించారు. ప్రస్తుతం శ్రీనివాస్ ప్రాణపాయ స్థితిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆస్పత్రిని సందర్శించిన అదనపు కలెక్టర్.. ఈ ఘటన వివరాలు తెలుసుకునేందుకు అదనపు కలెక్టర్ శ్రీవాత్సవ గురువారం ఎంజీఎంకు చేరుకొని సూపరిండెంట్ శ్రీనివాస్, వైద్య బృందంతో కలసి ఆర్ఐసీయూ వార్డును సందర్శించారు. ఎలుకల సంచారం వెనక ఎవరి నిర్లక్ష్యం ఉందంటూ పరిపాలనాధికారులను ప్రశ్నించారు. నిత్యం వైద్యుల పర్యవేక్షణలో ఉండే ఆర్ఐసీయూ వార్డుతోపాటు ఆస్పత్రిలో సాధారణ వార్డులన్నీ కలియతిరిగి వాటి స్థితిగతులపై ఆరా తీశారు. ఆస్పత్రిలో పారిశుద్ధ్యం తీరును పరిశీలించారు. ప్రాణంపోతే ఎవరిది బాధ్యత? శ్రీనివాస్ను తొలిసారి ఎలుకలు గాయపరిచిన ఘటనను ఆస్పత్రి అధికారులతోపాటు వైద్యుల దృష్టికి తీసుకెళ్లాం. అయినా పరిపాలనాధికారులు పట్టించుకోలేదు. వైద్యాధికారుల అలసత్వం వల్లే మరోసారి ఎలుకలు శ్రీనివాస్ను కొరికిపెట్టాయి. దీనివల్ల ఆయనకు తీవ్ర రక్తస్రావమైంది. ఇప్పుడు ఆయన ప్రాణం పోతే ఎవరు బాధ్యులవుతారో చెప్పాలి? – రోగి బంధుమిత్రులు సూపరింటెండెంట్, ఇద్దరు వైద్యులపై చర్యలు... సాక్షి, హైదరాబాద్: ఎంజీఎం ఆస్పత్రి ఘటనపై వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు వెంటనే స్పందించారు. పూర్తి వివరాలతో తక్షణమే నివేదిక పంపాలని, రోగికి నాణ్యమైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. దీంతో వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు, వివిధ విభాగాధిపతులు ఆర్ఐసీయూ, ఆస్పత్రి ప్రాంగణాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఘటనకు కారణాలపై నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు. ఈ రిపోర్టు ఆధారంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఎంజీఎం సూపరింటెండెంట్ను బదిలీ చేయడంతోపాటు విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ఇద్దరు కాంట్రాక్టు వైద్యులు యాకుబ్, ఆబీబీలను సస్పెండ్ చేస్తూ వైద్య, ఆరోగ్యశాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో సూపరింటెండెంట్గా పనిచేసిన చంద్రశేఖర్కు పూర్తి బాధ్యతలు అప్పగించింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, వైద్య సేవల్లో నిర్లక్ష్యం వహిస్తే ప్రభుత్వం ఉపేక్షించబోదని హరీశ్రావు హెచ్చరించారు. -
పాజిటివ్ వచ్చినా తల్లి పాలివ్వొచ్చా? డాక్టర్లు చెప్తున్నదేంటి..
వరంగల్ ఎంజీఎం: ‘కరోనా వైరస్ కొద్ది రోజులుగా విస్తరిస్తోంది. కేసులు పెరుగుతూ వస్తున్నాయి. ఈ క్రమంలో పాజిటివ్ నిర్ధారణ అయిన కుటుంబంలో చిన్న పిల్లలు ఉంటే మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రస్తుతానికి చిన్నారులెవరూ కరోనాతో అస్వస్థతకు గురికాకపోవడం మంచి పరిణామమే’ అని ఎంజీఎం పిడియాట్రిక్ ప్రొఫెసర్ డాక్టర్ ఎ.సుధాకర్ శుక్రవారం ‘సాక్షి ఫోన్ ఇన్’లో పేర్కొన్నారు. పలువురు చిన్న పిల్లల తల్లులు తమకు పాజిటివ్ వస్తే.. పిల్లలకు పాలు పట్టించొచ్చా అని డాక్టర్ను ప్రశ్నించగా.. పిల్లలకు పాలు ఇవ్వొచ్చని, పాల ద్వారా కరోనా వ్యాప్తి జరగదని స్పష్టం చేశారు. గర్భిణులు 12 వారాల తర్వాత కచ్చితంగా వ్యాక్సినేషన్ చేసుకోవాలని సూచించారు. లేదంటే పుట్టిన పిల్లలకు కరోనా సోకే అవకాశం ఉందన్నారు. ఫోన్ ఇన్ కార్యక్రమంలో మాట్లాడుతున్న డాక్టర్ సుధాకర్ నాకు రెండేళ్ల చిన్నారి ఉంది. కరోనా లక్షణాలుంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? – ప్రియ, హన్మకొండ డాక్టర్ : ఇంట్లో ఎవరికైనా పాజిటివ్ వచ్చినప్పుడు చిన్నపిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాలి. పిల్లల్లో జలుబు, జ్వరం, దగ్గును కరోనా లక్షణాలుగా పరిగణిస్తాం. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే కరోనా పరీక్షలు చేయించాలి. నిర్ధారణ అయితే వైద్యుల సలహా మేరకు మందులు వాడాలి. సాధారణ జ్వరం వస్తే పారాసిటమాల్ సిరఫ్ వాడుకోవచ్చు. (చదవండి: కరోనా పాజిటివ్ ఉన్నా.. లేనట్లుగా..) నాకు ఈనెల 13న పాజిటివ్ వచ్చింది. ఐదు రోజుల తర్వాత జ్వరం తగ్గింది. మళ్లీ టెస్టు చేయించుకోమంటారా? – నసీరొద్దీన్, హన్మకొండ డాక్టర్ ::ప్రస్తుతానికి మీకు కరోనా లక్షణాలేమీ లేకపోతే పది రోజుల తర్వాత హోం ఐసోలేషన్ పూర్తి చేసుకుని బయటకు వెళ్లొచ్చు. 14 రోజుల వరకు మాస్క్ తప్పనిసరిగా ధరించి మీ కార్యక్రమాలు చేసుకోవచ్చు. నెగెటివ్ కోసం మళ్లీ పరీక్ష చేసుకోవాల్సిన అవసరం లేదు. పాజిటివ్ నిర్ధారణ అయి ఆరు రోజులైంది. ప్రస్తుతానికి నీరసంగా ఉంది. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోమంటారు? – ఈశ్వర్, భీమారం డాక్టర్ : కరోనా తగ్గిన తర్వాత కొద్దిగా నీరసంగా ఉన్నా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నడుస్తున్నప్పుడు ఇబ్బందిగా ఉన్నా.. శ్వాసకోశ ఇబ్బందులు ఉన్నా వైద్యుడిని సంప్రదించి ఆ మేరకు చికిత్స పొందాలి. కరోనా తగ్గిన తర్వాత కూడా మల్టీ మిటమిన్ మాత్రలు వేసుకోవడం మంచిది. ఒకే గదిలో ఇద్దరు మిత్రులం ఉంటాం. నా మిత్రుడికి పాజిటివ్ వచ్చింది? నాకు కొద్దిగా తలనొప్పిగా ఉంది. పరీక్ష చేసుకోవడం తప్పనిసరా? – లక్ష్మణ్, రాయపర్తి డాక్టర్ : కరోనా పాజిటివ్గా నిర్ధారణ జరిగిన వ్యక్తికి అతి దగ్గరగా ఉన్న ప్రతి ఒక్కరూ పరీక్ష చేసుకోవాల్సిందే. తలనొప్పి.. కొద్ది నీరసంగా ఉందని చెబుతున్నారు కదా.. కరోనా పరీక్ష చేసుకున్న తర్వాత చికిత్స పొందాలి. కోవిడ్ పాజిటివ్గా నిర్ధారణ జరిగిన తర్వాత వ్యాక్సిన్ ఎప్పుడు తీసుకోమంటారు? – భూక్య రామ్, వరంగల్ డాక్టర్ : కరోనా వ్యాధికి గురైన సమయంలో మన శరీరంలో యాంటీబాడీస్ వృద్ధి చెందుతాయి. అందుకే మూడు నెలల తర్వాత వ్యాక్సిన్ తీసుకుంటే మంచిది. మా ఇంట్లో నా భర్తకు పాజిటివ్ వచ్చింది. నాకు ఏడాది పాప ఉంది. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోమంటారు? – భీమారం, అనూష డాక్టర్ : ఇంట్లో ఎవరికైనా పాజిటివ్ నిర్ధారణ జరిగినప్పుడు వారికి దూరంగా పిల్లలను ఉంచాలి. వారికి ఎలాంటి లక్షణాలు లేకపోతే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. జ్వరం, జలుబు, దగ్గు వంటి లక్షణాలు కనిపిస్తే వైద్యుడి సలహా మేరకు మాత్రమే మందులు వాడాలి. పాజిటివ్గా నిర్ధారణ జరిగిన తర్వాత చిన్నారులకు పాలు ఇవ్వొచ్చా? – భానుప్రియ, పోచమ్మమైదాన్ డాక్టర్ : కరోనా పాజిటివ్గా నిర్ధారణ జరిగిన తర్వాత కూడా మాస్క్, చేతులకు గ్లౌజ్లు ధరించి జాగ్రత్తలు పాటిస్తూ చిన్నారులకు పాలు ఇవ్వొచ్చు. తల్లిపాల ద్వారా చిన్నారులకు కరోనా వ్యాప్తి జరగదు. మా ఇంట్లో అందరికి పాజిటివ్ వచ్చింది. ప్రభుత్వం ద్వారా అందిస్తున్న కిట్టు మందులు వాడితే సరిపోతుందా? – సిద్ధార్థ, పలివేల్పుల డాక్టర్ : ప్రభుత్వం అందిస్తున్న కిట్టు మందులు వాడుతున్న సందర్భంలో శ్వాసకోశ ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి. ఆక్సిజన్ లెవల్స్ను ఎప్పటికప్పుడు చేక్ చేసుకోవాలి. శ్వాసకోశ ఇబ్బందులు ఏర్పడితే వెంటనే వైద్యుడిని సంప్రదించి ఆస్పత్రిలో చేరాలి. (చదవండి: కరోనా ఎఫెక్ట్.. 55 రైళ్లు రద్దు..) -
వరంగల్ ఎంజీఎం: భయంతో భవనంపై నుంచి దూకి ఆత్మహత్య
ఎంజీఎం: కోవిడ్ పాజిటివ్ బాధితుడతను. ఆస్పత్రిలో చేరిన సమయంలో ఆక్సిజన్ లెవల్స్ 66 శాతమే ఉన్నాయి. మనిషి కూడా మానసిక ఆందోళనతో కనిపించాడు. ఇలాంటి తరుణంలో ఆరు రోజులు డాక్టర్లు అతనికి మనోధైర్యం చెబుతూ చికిత్స అందించారు. దాంతో ఆక్సిజన్ లెవల్స్ 93 శాతానికి పెరిగాయి. ఇక రెండు రోజుల్లో పూర్తి ఆరోగ్యవంతుడివి అవుతావని డాక్టర్లు చెప్పారు. కుటుంబ సభ్యులు కూడా బాగవుతావని భరోసా ఇచ్చారు. అయినా అతనిలో మానసిక ఆందోళన తొలగిపోలేదు. తనకు ఏదో అయిందన్న భయంతో ఆస్పత్రి భవనంపైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో శుక్రవారం తెల్లవారుజామున ఈ సంఘటన చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. వరంగల్ రూరల్ జిల్లా సంగెం మండలకేంద్రానికి చెందిన రాయపురం లింగమూర్తి (34) ఈ నెల 24న కోవిడ్తో తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఎంజీఎం ఆస్పత్రిలో చేరాడు. 66 ఉన్న ఆక్సిజన్ లెవల్స్ ఆరు రోజుల్లో 93కు పెరిగాయి. అయినా రెండు రోజులుగా అతను తీవ్ర మానసిక ఆందోళన చెందుతున్నాడు. శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఆస్పత్రి భవనం రెండో అంతస్తునుంచి కిందకు దూకాడు. తలకు తీవ్ర గాయాలు కావడంతో వైద్యులు అతనికి చికిత్స అందిస్తున్న క్రమంలోనే మృతిచెందాడు. మరో రెండు రోజులు చికిత్స పొందితే అతను కోలుకుని ఇంటికి వెళ్లేవాడని ఎంజీఎం అధికారులు తెలిపారు. మనోధైర్యమే కరోనాకు సగం మందు అని పేర్కొన్నారు. మృతుడి తమ్ముడు ఉప్పలయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఆగిపోయిన గుండెకు మళ్ళీ ఊపిరి పోసిన అంబులెన్స్ సిబ్బంది..
కరీంనగర్: అంబులెన్స్ సిబ్బంది సమయస్ఫూర్తీతో ఆగిపోయిన గుండెకు మళ్లీ ఊపిరిపోసి మానవత్వం చాటుకున్నారు. ఈ అరుదైన సంఘటన కరీంనగర్లో చోటుచేసుకుంది. కాగా, మంథని మండలం గంగిపల్లికి చెందిన సుజాత అనే మహిళకు మూడు రోజుల క్రితం బాలుడు జన్మించాడు. బాబుకు అనారోగ్యం కారణంగా నిన్న కరీంనగర్ సివిల్ ఆస్పత్రిలో చేర్చి చికిత్సను అందిస్తున్నారు. ఈ క్రమంలో ఒక్కసారిగా, బాబు పరిస్థితి ఆందోళనకరంగా మారింది. వెంటనే వరంగల్ ఆస్పత్రికి తరలించాలని డాక్టర్లు తల్లిదండ్రులకు సూచించారు. దీంతో సీరియస్ కండిషన్లో ఉన్న తమ బాలుడిని కరీంనగర్ నుంచి వరంగల్కు అంబులెన్స్లో తరలిస్తున్నారు. అయితే, అంబులెన్స్లో ప్రయాణిస్తుండగా.. పసికందు గుండె ఒక్కసారిగా కొట్టుకోవడం ఆగిపోయింది. దీంతో అంబులెన్స్ సిబ్బంది వెంటనే.. హార్ట్ బీట్ చెస్ట్ కంప్రెషన్ విధానంలో మళ్ళీ గుండె కొట్టుకునేలా చేశారు. దీంతో ఆ బాలుడు తిరిగి సాధారణంగా స్థితికి చేరుకున్నాడు. ఆ తర్వాత వెంటనే వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించి మెరుగైన చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం బాలుడి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. -
ఎంజీఎంలో ఇంటిదొంగలు!
ఎంజీఎం: వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి సెంట్రల్ డ్రగ్ స్టోర్స్ ద్వారా సరఫరా చేసిన రెమ్డెసివిర్ ఇంజక్షన్ల వినియోగంలో అవకతవకలు జరిగినట్లు తెలుస్తోంది. ఈ విషయమై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. వెంటనే విచారణకు ఆదేశించినట్లు సమాచారం. ఆస్పత్రిలో రెమ్డిసివిర్ ఇంజక్షన్లు, ఆక్సిజన్ ఫ్లో మీటర్లు మాయం ఘటనలపై ఉన్నతాధికారులు ఆరా తీస్తు న్నారు. అయితే, ఎంజీఎం మాజీ పరిపాలనాధికారి ఇంజెక్షన్లను బయటకు తరలించారని, దీనిపై ఆరోగ్యశాఖ మాజీ మంత్రిని సైతం తప్పుదోవ పట్టించారనే ఆరోపణలు ఉన్నాయి. సదరు అధికారి ఎంజీఎం ఆస్పత్రికి ప్రభుత్వం కేటాయించిన రెమ్డెసివిర్లను ప్రైవేట్ క్లినిక్కు తరలించినట్లు తెలుస్తోంది. ఈ దందాలో ఆ క్లినిక్ కాంపౌండర్ కీలకంగా వ్యవహరించినట్లు చర్చ జరుగుతోంది. కమిటీ వేశాం: సూపరింటెండెంట్ ఈ ఘటనపై విచారణ కోసం సీనియర్ ప్రొఫెస ర్లతో కమిటీ వేసినట్లు ఎంజీఎం సూపరింటెండెంట్ చంద్రశేఖర్ తెలిపారు. సదరు కమిటీ రెండు నెలలుగా ఆస్పత్రికి వచ్చిన ఇంజక్షన్లు, వినియో గంపై ఆరా తీస్తుందన్నారు. ఇక ఎంజీఎం ఆస్ప త్రిలో ఫ్లోమీటర్లు కూడా చోరీకి గురయ్యాయని పరి పాలనాధికారులు నిర్ధారణకు వచ్చారు. చోరీ బాధ్యులను గుర్తించేందుకు సీసీటీవీ పుటేజీలు పరిశీలిస్తున్నట్లు సూపరింటెండెంట్ వెల్లడించారు. -
మద్యం సేవించి భార్యకు వేధింపులు..ఇటుకలతో కొట్టిన భార్య
గీసుకొండ: భర్త నిత్యం మద్యం తాగొచ్చి కొడుతుండడంతో తట్టుకోలేక ఓ మహిళ ఇటుకలతో కొట్టగా.. ఆ వ్యక్తి మృతి చెందాడు. వివరాలిలా ఉన్నాయి.. గూడూరు మండలం నాంపల్లికి చెందిన నాగమణిని శనిగరం కార్తీక్ (35) ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా, నాలుగేళ్ల నుంచి నాగమణి అక్కతో కార్తీక్ వివాహేతర సంబంధం కొనసాగిస్తుండడంతో ఆమెను భర్త వదిలేశాడు. దీంతో నాగమణి, ఆమె అక్కతో కలసి కార్తీక్ వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్లో నివాసం ఉంటున్నాడు. కార్తీక్ తరచూ నాగమణిని కొడుతుండగా, ఇటీవల గాయపడిన ఆమె హన్మకొండలో చికిత్స చేయించుకుంది. అక్కడి నుంచి నాగమణి మరో సోదరి సుగుణ నివాసముండే కీర్తినగర్కు ఈనెల 11న వచ్చింది. అదేరోజు రాత్రి కార్తీక్ మద్యం తాగొచ్చి గొడవ పడగా, నాగమణి భర్తను నెట్టి వేయడంతో కింద పడ్డాడు. ఆమె ఇటుకలతో కార్తీక్ను తీవ్రంగా కొట్టింది. గాయపడిన అతడిని 108 అంబులెన్స్లో వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. మృతుడి తమ్ముడు కుమారస్వామి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు గీసుకొండ ఇన్స్పెక్టర్ రాయల వెంకటేశ్వర్లు తెలిపారు. (చదవండి: కిరోసిన్ పోసి.. నిప్పంటించి..) -
మైనర్పై అత్యాచారం.. తీవ్ర రక్తస్రావంతో మృతి
సాక్షి, వరంగల్: జిల్లాలోని దుగ్గొండి మండలంలో 14 ఏళ్ల బాలిక కామాంధుల కాటుకు బలైంది. వివరాల్లోకెళ్తే.. వరంగల్ రూరల్ జిల్లాలో జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రేపల్లె గ్రామానికి చెందిన ఒక మహిళ తన భర్త చనిపోవడంతో కూతురు, తల్లితో కలిసి నివాసముంటోంది. ఆమె కూతురు భూపాలపల్లి జిల్లా కాటారంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 7వ తరగతి పూర్తి చేసింది. ప్రస్తుతం పాఠశాలలు పూర్తిగా తెరచుకోకపోవడంతో బాలిక ఇంటివద్దనే ఉంటుంది. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు బాలికకు మాయమాటలు చెప్పి లొంగదీసుకున్నారు. అనంతరం పలుమార్లు అత్యాచారం చేయడంతో బాలిక గర్భం దాల్చింది. అయితే అది గమనించిన యువకులు బాలికకు గర్భం పోవడానికి గత నెల 26వ తేదీన కొన్ని మాత్రలు ఇచ్చారు. దీంతో తీవ్రంగా రక్తస్రావం కావడంతో బాలికను ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించి బాలిక మృతి చెందింది. అయితే ఆ బాలికకు జ్వరం రావడం వల్లనే మృతి చెందింది అంటూ యువకులు చనిపోయిన బాలిక తల్లితో పోలీసులకు చెప్పించారు. చదవండి: (హైటెక్ వ్యభిచారం: వాట్సాప్లో ఫొటోలు.. ఓకే అయితే) అయితే అసలు విషయము గ్రామంలో తెలిసిపోవడంతో మృతురాలి తల్లి ఈ నెల 3వ తేదీన తన కూతురు ముగ్గురు యువకులు వేధించడం వల్లనే చనిపోయిందని పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా, దుగ్గొండి మండలానికి చెందిన ఇద్దరు యువకులతో పాటు వర్ధన్నపేట మండలానికి చెందిన ఇంకో యువకుడు కూడా అమ్మాయిని వేధించినట్లు తెలుస్తోంది. అయితే ఈ సంఘటనపై ఎస్సై రవి కిరణ్ని వివరణ కోరగా మృతురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. చదవండి: (అమెరికాలోనే ప్రేమలత అంత్యక్రియలు) -
కడుపులో కత్తెర మరిచారు
-
కడుపులో కత్తెర మర్చిపోయారు
సాక్షి, వరంగల్ : కడుపు నొప్పితో వచ్చిన రోగికి ఆపరేషన్ చేసి కడుపులోనే కత్తెర మర్చిపోయారు వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి వైద్యులు. కడుపునొప్పి ఎక్కువై తిరిగి మళ్లీ ఆస్పత్రికి రాగా, ఎక్స్రే తీయడంతో డాక్టర్ల తీరు బట్టబయలు అయింది. వివరాల్లోకి వెళితే.. వరంగల్ జిల్లా బెల్లంపల్లి శాంతిఖనికి చెందిన రాజాం(55) కొద్దిరోజులుగా అల్సర్తో బాధపడుతుండటంతో కుటుంబ సభ్యులు ఆయనను ఎంజీఎంకు తీసుకొచ్చారు. ఇక్కడ అన్ని టెస్టులు చేసిన డాక్టర్లు ఆరు నెలల కింద ఆయనకు సర్జరీ చేశారు. కొద్దిరోజులుగా ఆయనకు కడుపులో నొప్పి ఎక్కువవుతుండటంతో రెండు రోజుల కిందట మళ్లీ ఎంజీఎం ఆసుపత్రికి తీసుకొచ్చారు. బుధవారం ఎక్స్రే తీయగా కడుపులో కత్తెర ఉన్నట్లు తేలడంతో డాక్టర్లు తలపట్టుకున్నారు. ఈ విషయం బయటకు రాకుండా దాచే ప్రయత్నం చేశారు. దీంతో బాధితుడి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. వైద్య సిబ్బంది తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. -
వరంగల్ ఎంజీఎం సూపరింటెండెంట్ రాజీనామా
-
వరంగల్ ఎంజీఎం సూపరింటెండెంట్ రాజీనామా
సాక్షి, వరంగల్: వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బత్తుల శ్రీనివాసరావు తన పదవికి రాజీనామా చేశారు. ఆరోగ్యం సహకరించడం లేదంటూ తన రాజీనామాను అంగీకరించాలని ఆయన డీఎంఈకి లేఖ రాశారు. అయితే, కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ ప్రభుత్వాస్పత్రుల సూపరింటెండెంట్ల రాజీనామాలు తెలంగాణలో సంచలనం రేపుతున్నాయి. ఆస్పత్రిలో నెలకొన్న పరిస్థితులపై తీవ్ర మనస్తాపానికి గురై నిజామాబాద్ సూపరింటెండెంట్ డాక్టర్ నాగేశ్వర్రావు కూడా ఇటీవల రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తాజాగా అలాంటి ఘటన మరొకటి జరగడం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీస్తోంది. కాగా, వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రీనివాసరావు రాజీనామాకు చాలా కారణాలు ఉన్నాయని ఆస్పత్రి వర్గాలు చెప్తున్నాయి. (చిన్నారికి సరికొత్త జీవితం!) -
గీసుకొండ ఘటన: పోస్ట్మార్టం నివేదిక
సాక్షి, వరంగల్ : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన వరంగల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంట బావిలో వెలుగుచూసిన తొమ్మిది మృతదేహాలకు పోస్ట్మార్టం పూర్తయింది. వరంగల్ ఎంజీఎంలో వైద్యులు శనివారం పోస్ట్మార్టం చేసి, ప్రాథమిక నివేదికను విడుదల చేశారు. ఆ తొమ్మిదిమంది నీటిలో మునిగే చనిపోయినట్లు పోస్ట్మార్టం నివేదికలో వెల్లడి అయింది. అలాగే బావిలో పడినప్పుడు ఎనిమిదిమంది శరీరాలపై గాయాలు ఏర్పడినట్లు తెలుస్తోంది. (పోలీసుల అదుపులో యాకూబ్.. సెల్ఫోన్లు ఎక్కడ?) మృతదేహాల నుంచి శాంపిల్స్ సేకరించి, నమునాలను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపారు. కాగా సాయిదత్త ట్రేడర్స్కు చెందిన గోనె సంచులు కుట్టే గోదాం పక్కన ఉన్న బావిలో మొత్తం 9 మంది శవాలు లభ్యమైన ఉదంతం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. వీరందరి మరణానికి దారితీసిన కారణాలు ఏంటని పోలీసులు ఆరా తీస్తున్నారు. వీరందరికీ మత్తు ఇచ్చారా? లేక విష ప్రయోగం జరిగిందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. (గీసుకొండ బావిలో 9 మృత దేహాలు) -
మానవమృగం
హన్మకొండ చౌరస్తా: మానవత్వమే కన్నీరు పెట్టింది. తాను మనిషిని అని మరిచిన ఓ మృగం అభం శుభం తెలియని ఓ చిన్నారిపై అఘాయిత్యానికి తెగబడ్డాడు. ఊపిరి ఆడకుండా చేసి హత్య చేశాడు. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో మంగళవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం..హన్మకొండలోని కుమార్పల్లి జెండా ప్రాంతానికి చెందిన జంపాల యాదగిరి, నిర్మల దంపతులకు కుమారులు భరత్, నరసింహరాజుతో పాటు కుమార్తె రచన సంతానం. రచనను మూడేళ్ల క్రితం నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ సమీప మాడుగుల గ్రామానికి చెందిన కమ్మోజీ జగన్కు ఇచ్చి వివాహం చేశారు. వీరికి 9 నెలల శ్రీహిత ఉంది. పాప ఆధార్ కార్డు నమోదు కోసం ఈనెల 17న కూతురుని తీసుకుని హన్మకొండలోని తల్లిగారింటికి రచన భర్త జగన్తో వచ్చింది. మరుసటి రోజు ఆధార్ సెంటర్కు వెళ్లగా జనం అధికంగా ఉండటంతో మరుసటి రోజు రావాలని నిర్వాహకులు సూచించారు. అయితే జగన్కు ఆఫీసులో అత్యవసర పని ఉండటంతో భార్య, కుమార్తెను ఇక్కడే ఉంచి హైదరాబాద్ వెళ్లిపోయాడు. అర్ధరాత్రి అపహరణ రాత్రి భోజనం చేశాక నిద్రించేందుకు డాబాపైకి వెళ్లారు. అర్ధరాత్రి 1.30 గంటల తర్వాత రచనకు మెలకువ రాగా పక్కనే పాప శ్రీహిత లేదని గ్రహించి ఆందోళన చెందింది. రచన తమ్ముడు భరత్ బైక్పై వెతకడానికి బయలుదేరాడు. ఇంటి పక్క గల్లీలో ఓ వ్యక్తి భుజాన టవల్లో చుట్టుకుని పాపను తీసుకెళ్తున్నట్లు గుర్తించి కేకలు వేశాడు. దీంతో ఆ మానవ మృగం భరత్ను చూసి పాపను ఒక్కసారిగా నేలపై విసిరేసి పారిపోయే ప్రయత్నం చేశాడు. అయితే, దుండగుడిని పట్టుకున్న భరత్ చితకబాదాడు. చిన్నారిని చూసేసరికి ఎలాంటి కదలిక లేకపోవడం.. శరీరం నుంచి అధిక రక్తస్రావం కావడాన్ని గుర్తించాడు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. హన్మకొండ జంక్షన్లో ఆందోళన చేస్తున్న చిన్నారి తల్లిదండ్రులు, బంధువులు, శ్రీహిత (ఫైల్) ఆస్పత్రికి తీసుకెళ్లగా.. చిన్నారి శ్రీహితను ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే, చిన్నారి మృతి చెందిందని వైద్యులు ధ్రువీకరించడంతో గుండెలవిసేలా ఏడ్చారు. పంచనామా చేసిన హన్మకొండ పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తీసుకెళ్లారు. రెండు నెలల క్రితం చితకబాదారు నిందితుడు వరంగల్ రూరల్ జిల్లా శాయంపేట మండలం వసంతపూర్కు చెందిన పోలెపాక ప్రవీణ్గా పోలీసులు గుర్తించారు. రెండేళ్లుగా హన్మకొండ కుమార్పల్లిలో అద్దె గదిలో ఉంటూ స్థానికంగా ఓ రెస్టారెంట్లో స్వీపర్గా పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మద్యానికి బానిసైన ప్రవీణ్..మత్తులో సైకోగా మారుతాడని తెలిసింది. రెండు నెలల క్రితం అర్ధరాత్రి ఓ ఇంట్లో నిద్రిస్తున్న దంపతుల పట్ల అసభ్యంగా వ్యవహరిస్తుండటంతో గమనించిన స్థానికులు చితకబాది పోలీస్స్టేషన్లో అప్పగించినట్లు చెబుతున్నారు. హన్మకొండ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన పోలీసుల నుంచి స్పష్టమైన హామీ వచ్చే వరకు పోస్టుమార్టం చేయనిచ్చేది లేదని చిన్నారి తల్లిదండ్రులు, బంధువులు ఎంజీఎం మార్చురీ వద్ద ఆందోళనకు దిగారు. అలాగే.. హన్మకొండ జంక్షన్లో రాస్తారోకో నిర్వహించారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటామని భరోసా ఇవ్వడంతో వారు శాంతించారు. కఠిన చర్యలు తీసుకోండి ఈ ఘటనపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్రంగా స్పందించారు. ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. నిందితుడిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని సూచించారు. అత్యాచారం చేసి ఆపై హత్య ఫోరెన్సిక్ నివేదికలో వెల్లడి ఎంజీఎం : శ్రీహిత మృతదేహానికి వరంగల్లోని ఎంజీఎం ఆస్పత్రిలో పోస్టుమార్టం చేసిన వైద్యనిపుణుడు డాక్టర్ రజాం అలీఖాన్ వివరాలు వెల్లడించారు. చిన్నారిపై అత్యాచారం చేసి హత్య చేసినట్లు నివేదికలో తేలిందని పేర్కొన్నారు. అత్యాచారం చేయడమే కాకుండా ఊపిరి ఆడకుండా చేసి హతమార్చినట్లు తేలిందని తెలిపారు. ఈ ఘటనలో చిన్నారి తలపై రెండు ప్రదేశాల్లో గాయాలైనట్లు నిర్ధారించారు. -
వరంగల్ ఎంజీఎంలో మంటలు
సాక్షి, వరంగల్ : జిల్లాలోని ఎంజీఎం ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం జరిగింది. ఆస్పత్రిలోని పిల్లల వార్డులో షార్ట్ సర్క్యుట్తో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది ఆస్పత్రి అద్దాలు పగలగొట్టారు. సిబ్బంది, తల్లిదండ్రుల సాయంతో చిన్నపిల్లలను బయటకు తీసుకొచ్చారు. ఒక్కసారిగి ఆస్పత్రి మొత్తం పొగతో నిండిపోవడంతో రోగులు భయాందోళనకు గురయ్యారు. సిబ్బందితో సహా ఆస్పత్రిలోని అన్ని వార్డులోన్ని రోగులు అందరూ భయటకు పరుగు తీశారు. అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టింది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
రీజినల్ నేత్ర వైద్యశాలపై శీతకన్ను
ఎంజీఎం: ప్రజల్లో దృష్టి సమస్యను పరిష్కరించేందుకు కంటి వెలుగు కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతుండగా వరంగల్ ప్రాంతీయ నేత్ర వైద్యశాలలో అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు లేవు. ఇప్పటికే ఇక్కడ సిబ్బంది కొరత ఉండగా బుధవారం ప్రారంభమయ్యే కంటివెలుగు కార్యక్రమంతో పెరగనున్న రద్దీకి తగ్గట్టుగా ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. ప్రస్తుతం ఆస్పత్రిలో కొనసాగుతున్న నాలుగు యూనిట్లలో నలుగురు ప్రొఫెసర్లు అవసరం ఉండగా, ఒక్క ప్రొఫెసర్ స్థాయి అధికారి కూడా లేరు. ఈ క్రమంలో అసోసియేట్ ప్రొఫెసర్కు ప్రభుత్వం సూపరింటెండెంట్ హోదా కల్పిస్తూ సోమవారం పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు సైతం జారీ చేసింది. వైద్యుల కొరత.. వరంగల్, కరీంనగర్, ఖమ్మం జిల్లాల ప్రజల నేత్ర సమస్యల కోసం వరంగల్ ప్రాంతీయ వైద్యశాల ఉంది. వంద పడకల సామర్థ్యం గల ఈ ఆస్పత్రికి నిత్యం 300 నుంచి 400 మంది కంటి వ్యాధిగ్రస్తులు వస్తుంటారు. ఇందులో నిత్యం 40 మందికి ఆపరేషన్లు అవసరమవుతున్నాయి. ఆపరేషన్ చేసేందుకు ఒక రోజు, అబ్జర్వేషన్కు ఒక రోజు ఇక్కడే ఉంటున్నారు. దీంతో రోజూ 80కి పైగా పడకలు నిండుగా ఉంటున్నాయి. ఔట్ పేషెంట్ విభాగం కాకుండా ఆపరేషన్లు పర్యవేక్షించేందుకు నాలుగు యూనిట్లు ఇక్కడ పనిచేస్తున్నాయి. ఒక్కో యూనిట్లో ఒక ప్రొఫెసర్, ఇద్దరు అసోసియేట్ ప్రొఫెసర్లు, ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫెసర్లు అవసరం. కానీ నలుగురు ప్రొఫెసర్లు, ఇద్దరు అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు ప్రస్తుతం ఖాళీగా ఉన్నాయి. ఒక్క ఆనస్తీషియా యూనిట్ వైద్యులు విధులు నిర్వర్తించాల్సి ఉండగా, ఒకే ఒక్క డిప్యూటేషన్ అస్తీషియా వైద్యురాలితో సేవలను కొనసాగిస్తున్నారు. నిత్యం 360 మంది.. కంటి వెలుగు ప్రత్యేక బృందాలు కంటి సమస్యలు గుర్తించేందుకు ఆగస్టు 15 నుంచి ఫిబ్రవరి 28 వరకు రోజూ గ్రామాల్లో ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేస్తున్నారు. రోజూ గ్రామీణ ప్రాంతాల్లో 250, పట్టణ ప్రాంతాల్లో 300 మందిని పరిశీలించాలని నిర్ణయించారు. ఈ లెక్కన రోజూ సగటున 50 మంది వరకు ఆపరేషన్ కోసం ఆస్పత్రులకు రెఫర్ చేయాల్సిన వస్తుంది. వరంగల్ నగరంలో రీజనల్ ఐ ఆస్పత్రిని మినహాయిస్తే మరో ఎనిమిది ఆస్పత్రులను కంటి వెలుగు కోసం ఎంపిక చేశారు. ఈ ఎనిమిది ఆస్పత్రుల సామర్థ్యం రీజనల్ ఐ ఆస్పత్రికి సమానంగా లేదు. ఇతర జిల్లాల నుంచి.. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు కంటి ఆస్పత్రుల్లో వైద్యులు లేరు. వరంగల్ రూరల్ జిల్లాకు చెందిన ప్రజలకు వరంగల్ నగరమే దిక్కు. ఇది కాకుండా జనగామ, మహబూబాబాద్ జిల్లాలకు చెందిన వారు వరంగల్లో ఆపరేషన్ చేయించుకోవడంపై ఆసక్తి చూపిస్తున్నారు. వీరందరికీ తగ్గట్లుగా పూర్తి స్థాయిలో రీజనల్ నేత్ర వైద్యశాలలో ఏర్పాట్లు చేయలేదని ప్రభుత్వ వైద్యులే అంటున్నారు. కంటి వెలుగు కోసం సమీక్షలు నిర్వహిస్తున్నా అధికార గణం మౌలిక సదుపాయాల మీద దృష్టిసారించడం లేదని విమర్శిస్తున్నారు. అద్దాలు, మందుల సరఫరాపై చూపిన శ్రద్ధ ఆపరేషన్ థియేటర్ల ఏర్పాటుపై పెట్టడం లేదని చెబుతున్నారు. ప్రస్తుతం కంటి ఆస్పత్రిలో ఉన్న వైద్య సిబ్బంది కొరత కారణంగా 40 ఆపరేషన్లకు పరిమితం అవుతున్నారు. రేపు పెరగబోయే రోగులకు తగ్గట్లుగా సిబ్బందిని అందుబాటులో ఉంచకపోతే ఇబ్బందులు ఎదురయ్యేందుకు ఆస్కారం ఉంది. పడకలు, ఆపరేషన్ థియేటర్ల సామర్థ్యం పెంచకుండా హడావుడిగా ఆపరేషన్లు నిర్వహించి, అబ్జర్వేషన్ లేకుండా రోగులకు బయటకు పంపితే ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. మరోవైపు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఇకపై నేత్ర వైద్యశాలకు వచ్చే రోగులందరూ కంటి వెలుగు ద్వారా వస్తారని అభ్రిపాయ పడుతున్నారు. పది రోజుల్లో భర్తీ చేస్తాం.. కంటి వెలుగు కార్యక్రమం ద్వారా శస్త్రచికిత్సలు అవసరం ఉన్న వారిని గుర్తించి రెఫరెల్ ఆస్పత్రులకు పంపిస్తాం. నేత్ర వైద్యశాలలో ఖాళీగా ఉన్న పోస్టులను కాంట్రాక్టు పద్ధతిన పదిరోజుల్లో నియామకాలు జరిగేలా చూస్తాం. అంతేకాకుండా ప్రభుత్వానికి కూడా ఖాళీలను భర్తీ చేయాలని నివేదించాం. శస్త్రచికిత్సల సంఖ్య ప్రకారం ఏర్పాట్లు చేస్తాం. – హరీష్రాజు, డీఎంహెచ్ఓ, వరంగల్ అర్బన్ జిల్లా -
నర్సింగ్ కాలేజీలో వసూళ్లు
వరంగల్ : ఎంజీఎం ఆస్పత్రి ఆవరణలో ఉన్న నర్సింగ్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ డే, ఫేర్వెల్ పేరుతో విద్యార్థుల నుంచి వేలాది రూపాయలు వసూలు చేశారు. సాధారణంగా ఏటా ఆఖరు సంవత్సరం నర్సింగ్ విద్య పూర్తి చేసిన విద్యార్థినులు గ్రాడ్యుయేషన్ డే నిర్వహించుకుంటారు. అది కాలేజీలోని విద్యార్థులు ఇచ్చినంత డబ్బులు తీసుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అయితే ఈ కళాశాల ప్రిన్సిపాల్ ఇటీవల ఉద్యోగ విరమణ పొందారు. ఆ పోస్టుపై కన్నేసిన ఉద్యోగులు గ్రాడ్యుయేషన్ డేను భారీగా నిర్వహించాలని ప్రణాళికలు రూపొందించారు. అనుకున్న ప్రకారం విద్యార్థినుల నుంచి భారీ వసూళ్లకు పాల్పడ్డారు. నర్సింగ్ విద్య పూర్తి చేసిన విద్యార్థినుల నుంచి రూ.1500, ద్వితీయ, తృతీయ సంవత్సరం చదువుతున్న వారి నుంచి రూ.500 చొప్పున వసూలు చేశారు. ఆ డబ్బుతో ఇటీవల గ్రాడ్యుయేషన్ డేను భారీగా నిర్వహించి రాజ కీయ నాయకులను ప్రసన్నం చేసుకున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గ్రాడ్యుయేషన్ డే కోసం రూ.1500 చొప్పున ఇచ్చేందుకు విద్యార్థి నుల తల్లిదండ్రులు నిరాకరించినప్పటికీ కాలేజీలోని కొందరు ఉద్యోగులు విద్యార్థినులపై ఒత్తిడి తేవడంతో చేసేదేమీ లేక ఇచ్చినట్లు కొందరి పేరెంట్స్ తెలిపారు. గ్రాడ్యుయేషన్ డే చేసుకోవాలన్న నిబంధనలు లేకున్నా కాలేజీలోని కొందరు తమ పలుకుబడి పెంచుకునేందుకు భారీగా నిర్వహించారని పేరెంట్స్ వాపోతున్నారు. కాలేజీలో మూడేళ్లుగా విద్యనభ్యసిస్తున్న విద్యార్థుల వద్ద సుమారు రూ.1.50లక్షలు వసూలైనట్లు తెలుస్తోంది. తమ పిల్లల వద్ద బలవంతంగా వసూలు చేసిన సుమారు రూ.3లక్షలను వాపస్ ఇవ్వాలని నర్సింగ్ విద్యార్థుల తల్లిదండ్రులు ఎంజీఎం ఆస్పత్రి సూపరింటెండెంట్ను కోరుతున్నారు. ఈ విషయంపై ‘సాక్షి’ కార్యాలయానికి తల్లిదండ్రులు ఇటీవల ఓ లేఖ పంపారు. అందులోని ఈ విషయాలపై ఆరా తీయగా ఇంచార్జి ప్రిన్సిపాల్ సెలవులో ఉన్నట్లు కార్యాలయ ఉద్యోగులు తెలిపారు. గ్రాడ్యుయేషన్ ఫంక్షన్కు, తమకు ఎలాంటి సంబంధం లేదని, కాలేజీలోని విద్యార్థులే కమిటీగా ఏర్పడి ఫంక్షన్ నిర్వహించుకున్నారని ఉద్యోగులు తెలిపారు. అది పూర్తిగా విద్యార్థులకార్యక్రమం అది గ్రాడ్యుయేషన్ డే, ఫ్రెషర్స్ కోసం నిర్వహించిన కార్యక్రమం. ఆ కార్యక్రమ నిర్వహణకు డాక్టర్లు, నర్స్లు ఆర్థికసాయం అందించారు. మిగిలిన డబ్బులు విద్యార్థులే వసూలు చేసుకుని నిర్వహించుకున్నారు. ఈసందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యకమాల్లో ఉపయోగించే డ్రెస్సులు, ఫైనల్ ఇయర్ విద్యార్థులు వేసుకునే డ్రస్లకు అద్దె ఈ డబ్బుల నుంచే చెల్లించారు. ఆ డబ్బులు ఎవరు నిరుపయోగం చేయలేదు. – డాక్టర్ శ్రీనివాస్, సూపరింటెండెంట్, ఎంజీఎం ఆస్పత్రి -
టైరు పేలి మినీవ్యాన్ బోల్తా
వాజేడు/ఏటూరునాగారం: సామర్థ్యానికి మించి కూలీలతో వెళ్తున్న మినీవ్యాన్ టైరు పేలి బోల్తా పడటంతో ఇద్దరు మృతి చెందారు. మరో 43 మంది గాయపడ్డారు. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా వాజేడు మండలం మండపాక వద్ద జాతీయ రహదారిపై శనివారం ఉదయం జరిగింది. ఏటూరునాగారం మండలం శివాపురం గ్రామానికి చెందిన 50 మంది కూలీలు వాజేడు మండలం పెద్దగొల్లగూడెంలోని ఓ రైతు పొలంలో మిర్చి ఏరేందుకు తెల్లవారుజామున మినీ వ్యాన్లో బయల్దేరారు. ఈ క్రమంలో వాజేడు మండలం మండపాక గ్రామం దాటగానే వాహనం ముందు టైరు పంక్చర్ అయి అదుపు తప్పింది. డ్రైవర్ వాహనాన్ని అదుపు చేసేందుకు విఫలయత్నం చేయగా.. చివరకు హ్యాండ్ బ్రేక్ను ఉపయోగించాడు. దీంతో ఒక్కసారిగా వాహనం నిలిచిపోవడంతో అదుపుతప్పి బోల్తాపడింది. కూలీలు జాతీయ రహదారిపై చెల్లాచెదురుగా ఎగిరిపడ్డారు. మండపాక గ్రామస్తులు క్షతగాత్రులను ఏటూరు నాగారం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పూనెం చంద్రమ్మ (50) ఘటన స్థలంలోనే మృతిచెందగా, చికిత్స పొందుతూ ఐలయ్య(40) తుదిశ్వాస విడిచాడు. తీవ్రంగా గాయపడిన 20 మందిని వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి, మరో ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా.. మిగతా 23 మంది ఏటూరునాగారం ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారు. మృతులు, క్షతగాత్రులంతా ఒకే గ్రామానికి చెందిన ఆదివాసీలు కావడంతో వారి స్వగ్రామం శివాపురంతోపాటు ఇతర ఆదివాసీగూడెల్లో విషాదం అలుముకుంది. క్షతగాత్రులను చూసి కుటుంబ సభ్యులు కన్నీళ్లపర్యంతమయ్యారు. -
ఔషధ బాధితుడు మాయం
సాక్షి ప్రతినిధి, వరంగల్: క్లినికల్ ప్రయోగాల కేసు కొత్త మలుపు తీసుకుంది. ఔషధాల ప్రయోగం వికటించి వరంగల్ ఎంజీఎంలో చికిత్స పొందుతున్న బాధితుడు ఆస్పత్రి నుంచి వెళ్లిపోయాడు. అయితే, బాధితుడు స్వచ్ఛందంగా వెళ్లిపోయాడా.. లేదా ఎవరైనా తప్పించారా... అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన ఔషధ ప్రయోగ బాధితుడు బోగ సురేశ్ రక్తపు వాంతులు చేసుకోవడంతో అతడిని వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి ఆదివారం తీసుకువచ్చారు. అయితే, ఈ కేసు విచారణ నిమిత్తం సెంట్రల్ డ్రగ్ కంట్రోల్ అధికారులు ఎంజీఎంలో మంగళవారం ఉదయం 11 గంటలకు విచారణ చేపట్టాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో 7 గంటలకే సురేశ్ ఎంజీఎం నుంచి వెళ్లిపోయాడు. ఐదుగురు అపరిచితులు విచారణ రోజే బాధితుడు మాయం కావడం అనుమానాలకు తావిస్తోంది. విచారణ నుంచి తమను కాపాడుకునేందుకు ఫార్మా కంపెనీలు ఏమైనా పన్నాగం పన్నాయా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మంగళ వారం ఉదయం 6 గంటల సమయంలో ఐదుగురు వ్యక్తులు సురేశ్తో మాట్లాడేందుకు వార్డుకు వచ్చారు. పదిహేను నిమిషాల పాటు అక్కడే ఉన్నారు. తర్వాత అందరూ కలసి వెళ్లిపోయారు. ఎంతకీ తిరిగి రాకపో వటంతో వైద్య సిబ్బంది అప్రమత్తమై ఉన్నతాధికారులకు సమాచారం అందిం చారు. సురేశ్ను కలిసిన ఐదుగురు వ్యక్తులు ఎవరనేది మిస్టరీగా మారింది. -
వివాహితపై యాసిడ్ దాడి కలకలం
సాక్షి, వరంగల్ : వివాహితపై యాసిడ్ దాడి ఘటన స్థానికంగా కలకలం రేపింది. జనగామ జిల్లా జఫర్ ఘడ్ సమీపంలోని గరిమిల్లపల్లి వద్ద ...ఆమెను కొంతమంది యువకులు చేతులు, కాళ్లు కట్టివేసి యాసిడ్ దాడికి పాల్పడ్డారు. తీవ్రంగా గాయపడిన ఆమె అరుపులు విన్న బాటసారులు వెంటనే పోలీసులకు సమాచారం అందించి ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో న్యాయమూర్తి వాగ్మూలం తీసుకొన్నారు. కాగా వరంగల్లోని కొత్తవాడ ప్రాంతానికి చెందిన మాధురి కొద్దిరోజులుగా భర్త చందుకు దూరంగా ఉంటూ పుట్టింట్లోనే ఉంటోంది. ఆమెకు ఒక కొడుకు కూడా ఉన్నాడు. కొద్ది రోజుల క్రితం చంటి అనే వ్యక్తితో మాధురికి మళ్లీపెళ్లి అయినట్లు తెలుస్తోంది. ఇటీవల అతనితో కూడా గొడవపడినట్లు తెలుస్తోంది. అసలు మాధవి ఆ గ్రామానికి ఎందుకు వెళ్లింది? ఎలా వెళ్లింది? దాడి ఎవరు, ఎందుకు చేశారు? అనే విషయాలపై పోలీసులు దృష్టి పెట్టారు. ఈ ఘటన జిల్లాలో కలకలం రేపుతోంది. -
ప్రియుడు మోసం చేశాడని యువతి ఆత్మహత్య
అక్కన్నపేట(హుస్నాబాద్): మూడేళ్లు ప్రేమించి.. పెళ్లికి నిరాకరించడంతో ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన సిద్దిపేట జిల్లా జనగామ గ్రామంలో వెలుగులోకి వచ్చింది. పూదరి మేఘమాల(23) ఎంసీఏ పూర్తిచేసి ఇంటి వద్దే ఉంటోంది. బంధువైన గౌరవెల్లి నివాసి హరిప్రసాద్, ఆమె మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇంతలో హరిప్రసాద్ మరో పెళ్లికి సిద్ధం అవుతున్న విషయం తెలిసి.. మేఘమాల నిలదీయడంతో అతను పెళ్లికి నిరాకరించాడని గ్రామస్తులు చెబుతున్నారు. దీంతో మనస్తాపానికి గురైన ఆమె సోమవారం రాత్రి నూనెలో నెయిల్పాలిష్ కలుపుకొని తాగింది. ఇది గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందింది. మృతురాలి తండ్రి బతుకుదెరువు కోసం వలస వెళ్లగా.. ఇంటి వద్ద తల్లి, ఇద్దరు మగ పిల్లలు ఉంటున్నారు. -
ప్రాణం తీసిన నిర్లక్ష్యం
- ట్రాక్టర్ డ్రైవర్ అశ్రద్ధతో ఉపాధి కూలీ మృతి - చావుబతుకుల్లో మరొకరు.. గణపురం(వరంగల్ జిల్లా): ట్రాక్టర్ డ్రైవర్ నిర్లక్ష్యం ఓ మహిళ ప్రాణాలు బలిగొనగా, మరో మహిళ తీవ్రంగా గాయపడింది. గణపురం మండలం ధర్మారావుపేటలో గురువారం జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నారుు.. ధర్మారావుపేటలో జరుగుతున్న ఉపాధి పనుల్లో భాగంగా ట్రాక్టర్లోని మట్టిని బయటకు తరలించిన డ్రైవర్.. తిరిగి వస్తున్న క్రమంలో నిర్లక్ష్యంగా వ్యవహరించి కూలీలు కూర్చున్నవైపే రానిచ్చాడు. గమనించిన పలువురు కూలీలు తప్పించుకోగా విషయం తెలియని బాపని జయసుధ(28), జీడీ భాగ్యమ్మ అలాగే ఉండిపోయారు. దీంతో ట్రాక్టర్ వారి పైనుంచి వెళ్లగా జయసుధ తీవ్రంగా గాయపడింది. భాగ్యమ్మ రెండు కాళ్లు విరిగిపోయాయి. జయసుధ భర్త రవీందర్ అక్కడికి చేరుకుని ఆస్పత్రికి తరలిస్తుండగా.. భర్త ఒడిలోనే కన్నుమూసింది. తీవ్రంగా గాయపడిన భాగ్యమ్మను వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. గణపురం ఎస్సై విజయ్కుమార్, తహసీల్దార్ జీవాకర్రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. -
పంటలెండాయి.. ప్రాణాలు పోయాయి
అప్పుల బాధతో ఏడుగురు అన్నదాతల ఆత్మహత్య సాక్షి, నెట్వర్క్: ఎండనకా, వాననకా ఇంటిల్లిపాదీ ఆరుగాలం కష్టపడి, లక్షల్లో అప్పులు చేసి పంటలు వేస్తే.. ప్రకృతి వైపరీత్యంతో వేసిన ఆ పంటలు ఎండిపోతున్నాయి. దీంతో పెట్టుబడుల కోసం చేసిన అప్పులు కూడా తీర్చే మార్గం లేక వేదనతో అన్నదాతలు ప్రాణాలు తీసుకుంటున్నారు. తెలంగాణలోని వివిధ జిల్లా ల్లో గురువారంరాత్రి నుంచి శుక్రవారంరాత్రి వరకు ఏడుగురు అన్నదాతలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. గుండెపోటుతో ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం రేజర్లకు చెందిన కౌలు రైతు దుగ్గిరాల ముత్యం (36) మృతి చెందాడు. నల్లగొండ జిల్లా సూర్యాపేట మండలం గాంధీనగర్కి చెందిన పొన్నెబోయిన నారాయణ (35) అప్పులు తీర్చలేక మనస్తాపంతో గురువారం రాత్రి పురుగుల మందు తాగాడు. మెదక్ జిల్లా రామాయంపేట మండలం నిజాంపేటకు చెందిన తాడెం సత్తయ్య(40) మూడు బోర్లు వేశారు. సాగుకు కోసం అప్పు లు చేశారు. నీళ్లు అందక వేసిన పంటలు ఎండిపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. వేదనతో గురు వారం రాత్రి ఇంట్లోనే ఉరి వేసుకున్నాడు. ఇదే జిల్లా కోహీర్ మండలం చింతల్ఘాట్ గ్రామానికి చెందిన కర్నె అనిల్ (40) రూ. 3 లక్షల అప్పు ఎలా తీర్చాలనే వేదనతో శుక్రవారం ఉరేసుకున్నాడు. నిజామాబాద్ జిల్లా మాచారెడ్డి మండలం ఎల్లంపేట పంచాయతీ పరిధిలోని వెనుకతండాకు చెందిన రైతు బూక్య భంగ్య(40) 2 లక్షల అప్పు తీర్చలేక ఉరేసు కున్నాడు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం రంగాపూర్కు చెందిన పెద్దిరెడ్డి రాంరెడ్డి(40) తనకున్న ఎకరం భూమితోపాటు మరో ఎకరం భూమిని కౌలుకు తీసుకొని పత్తి పంట వేశాడు. బావిలో నీళ్లు లేక పంట ఎండిపోయింది. దీంతో మనస్తాపం చెందిన రాంరెడ్డి గురువారం ఉదయం క్రిమిసంహారక మందు తాగాడు. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలిం చగా చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. కరెంటు వైర్లు పట్టుకొని.. నిజామాబాద్ జిల్లా బీర్కూర్ మండలం నస్రుల్లాబాద్కి చెందిన గలెంక పెద్ద అంజయ్య(36) నాలుగు ఎకరాల్లో ఖరీఫ్లో వరిపంటసాగు చేశాడు. మూడు బోర్లు వేయించినా, రెండింటిలో నీళ్లే పడలేదు. బోరుబావుల తవ్వకం, పంటల సాగుకు రూ. 5 లక్షల అప్పు అయ్యింది. ఎండిపోతున్న పంటను చూసి అంజయ్య తీవ్ర మానసిక క్షోభకు గురయ్యాడు. గురువారం రాత్రి పొలంలో ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ తీగలను పట్టుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలున్నారు. -
ఫ్లూతో రెండేళ్ల బాలుడి మృతి
ఎంజీఎం(వరంగల్) : వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో స్వైన్ప్లూతో మంగళవారం రాత్రి రెండేళ్ల బాలుడు మృతి చెందాడు. కరీంనగర్ జిల్లా రామగుండానికి చెందిన అంజా (2) అనారోగ్యంతో ఈ నెల 25వ తేదీన ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యాడు. జ్వరం, జలుబు, శ్వాసకోశ వ్యాధితో బాధపడుతున్న బాలుడిని అత్యవసర వార్డులో చికిత్స అందిస్తున్నారు. స్వైన్ఫ్లూ సోకినట్లుగా అనుమానించిన వైద్యులు 27వ తేదీన తెమడ నమూనాలు సేకరించి హైదరాబాద్లోని ప్రీవెంట్ ఆఫ్ మెడిసిన్కు పంపించారు. ఈ క్రమంలో 27వ తేదీ రాత్రి మృతి చెందాడు. సోమవారం పంపించిన బాలుడి నమూనాల ఫలితాలు బుధవారం రాత్రి అందినట్లు ఎంజీఎం ఆర్ఎంఓ హేమంత్, మెడిసిన్ ప్రొఫెసర్ చంద్రశేఖర్ తెలిపారు. కాగా, బాలుడి తల్లి 18వ తేదీన స్వైన్ప్లూ సోకి మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. -
ఎంజీఎంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల మెరుపు సమ్మె
వరంగల్: వరంగల్లోని ఎంజీఎం ప్రభుత్వ ఆస్పత్రిలో ఔట్సోర్సింగ్ ఉద్యోగులు బుధవారం ఉదయం మెరుపు సమ్మెకు దిగారు. ఏడాదిగా తమకు వేతనాలు అందడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. తమ సమస్యను కలెక్టర్తోపాటు గతంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న రాజయ్య దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం కాలేదని తెలిపారు. తమ ఈఎస్ఐ, పీఎఫ్ ఖాతాల్లో చందాలు జమ చేయటం లేదని ఆరోపించారు. విధులు బహిష్కరించి, వారు ధర్నాకు దిగటంతో వైద్య సేవలకు పాక్షికంగా అంతరాయం కలిగింది. కాగా, ఆస్పత్రిలో మూడు ఏజెన్సీలకు చెందిన మొత్తం 130 మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు.