-
సామాజిక సేవకు పునరంకితం కావాలి
గద్వాల అర్బన్: రెడ్క్రాస్ సొసైటీ వ్యవస్థాపకుడు హెన్రీ డ్యూనాంట్ జన్మదినం, ప్రపంచ రెడ్క్రాస్ దినోత్సవాన్ని బుధవారం జిల్లా కేంద్రంలోని బాలసదనంలో ఘనంగా జరుపుకొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి గంట కవిత హాజరయ్యారు. హెన్రీ డ్యూనాంట్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆనంతరం బాలసదనంలోని చిన్నారులకు పండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా ఇండియన్ రెడ్క్రాస్ సామాజిక సేవకు పునరంకితం కావడం ఎంతో అభినందనీయమన్నారు. రెడ్క్రాస్ సేవలు గద్వాల జిల్లాలో ఇంకా పురోగతి చెందాలని, అందుకు తనవంతు సహకారం అందిస్తానని తెలిపారు. కార్యక్రమంలో రెడ్క్రాస్ సోసైటి చైర్మన్ రమేష్, డిడబ్ల్యూఓ సుధారాణి, డీసీపీఓ నర్సింహ్మ తదితరులు ఉన్నారు. -
ఈదురు గాలులతో నష్టం
ధరూరు: మండలంలో మంగళవారం రాత్రి భారీ ఈదురు గాలులకు పంట నష్టం వాటిల్లింది. రాత్రి 9 గంటల నుంచి 11 గంటల వరకు భారీగా గాలులు వీచాయి. దీంతో పాటు భారీగా వీచిన గాలులతో చెట్లు, పంటలు నేలకొరాగాయి. గాలి దాటికి విద్యుత్ సరపాను నిలిపివేశారు. మండలంలోని బూరెడ్డిపల్లి గ్రామ శివారులో భారీ వర్షానికి రైతు ఆనంద్రెడ్డి పొలంలో దాదాపు 100 మునక్కాయల చెట్లు విరిగిపోయాయి. గత ఏడాది కూడా ఇదే తరహాలోనే మునగ చెట్టు నేలకొరిగి తీవ్ర నస్టాల పాలయ్యారు. మంగళవారం రాత్రి 8 గంటల నుంచి 10.30 గంటల వరకు విద్యుత్ సరఫాను నిలిపివేశారు. అక్కడక్కడ వర్షాలు కురవడంతో బుధవారం వాతావరణం కాస్త చల్లబడడంతో జనం ఉక్కపోత, మండే ఎండల నుంచి ఉపశమనం పొందారు. నేలకొరిగిన పంటలు.. విరిగిన చెట్లు -
కేంద్ర పథకాలతో పేదలకు లబ్ధి
రాజోళి: కేంద్రంలో రానున్నది బీజేపి ప్రభుత్వమేనని అలంపూర్ మాజీ ఎమ్మెల్యే రావుల రవీంద్ర నాథ్ రెడ్డి అన్నారు. మండల కేంద్రమైన రాజోళితో పాటు చిన్నదన్వాడ,నసనూరు,మాన్దొడ్డి తదిదర గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. చిన్న దన్వాడలో 50 మందికి పైగా పార్టీలో చేరగా వారికి కండువాలు కప్పి, పార్టీలోకి ఆహ్వానించారు. రాజోళిలో మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచులను ఆయన కలిసి మాట్లాడారు. కేంద్రంలో నరేంద్ర మోదీ మూడో సారి ప్రధాని కాబోతున్నారని, ప్రస్తుతం వీస్తున్న బీజేపి గాలిలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు రెండవ స్థానం కోసం మాత్రమే పోటీ పడుతున్నాయని అన్నారు. మోదీ తీసుకువచ్చిన సంక్షేమ పథకాల వల్ల దేశంలోని పేదలకు ఎంతో మేలు జరిగిందని అన్నారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు సంజీవ రెడ్డి, బల్గెర శివారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు మదుసూదన్ గౌడ్, స్వప్న,రమాదేవి తదిదరులు పాల్గొన్నారు. -
బీఆర్ఎస్ హయాంలోనే సమగ్రాభివృద్ధి
గద్వాల రూరల్: కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న పదేళ్ల కాలంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని, సంక్షేమాభివృద్ధి పథకాలైన షాదీముభారక్ కళ్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్టు, రైతుబంధు, రైతుబీమా, మిషన్భగీరథ తాగునీరు అందించిందని, మరోసారి పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థికి ఓటు వేయాలని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి అన్నారు. బుధవారం ఆయన గద్వాలలోని 1వ వార్డులో ఇంటింటి ప్రచార కార్యక్రమం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలతో గెలుపొందిందని అధికారం చేపట్టి ఐదు నెలలు గడచిన ఇచ్చిన హామీలను గాలికొదిలేసి ప్రజలను మోసం చేశారని విమర్శించారు. మరోవైపు ధర్మం గురించి పదేపదే మాట్లాడుతున్న బీజేపీ పార్టీ పెట్రోల్, డీజిల్ ధరలు మొదలుకుని నిత్యవసరాల ధరలను కూడ సామాన్యుడికి అందుబాటులో లేకుండా చేసిందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ మోసాలకు అడ్డుపడి ప్రజల హక్కుల కోసం పోరాడే ఉన్నత విద్యావంతుడైన ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ను అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బాబర్, ఎంపీపీ ప్రతాప్, గోవిందు, సాయిశ్యాంరెడ్డి, ధర్మనాయుడు, కురుమన్న, వంశీ, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. పోస్టల్ బ్యాలెట్కు గడువు పెంపు గద్వాల రూరల్: పార్లమెంట్ ఎన్నికల విధులు నిర్వహిస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు తమ ఓటు హక్కును పోస్టల్ బ్యాలెట్ ద్వారా వినియోగించుకోవడానికి మరో రెండు రోజుల పాటు గడువు పొడగిస్తున్నట్లు బుధవారం కలెక్టర్ సంతోష్ ఒక ప్రకటనలో తెలిపారు. ఐడీఓసీలో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ సెంటర్లో ఈ నెల 10 వరకు పోస్టల్ బ్యాలెట్ సమర్పించవచ్చని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. దరఖాస్తుల ఆహ్వానం బాలానగర్: ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని బాలానగర్, కల్వకుర్తి ఏకలవ్య ఆదర్శ బాలుర గురుకుల కళాశాలల్లో ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశానికిగాను గిరిజన విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు బాలానగర్ గురుకుల కళాశాల ప్రిన్సిపాల్ లక్ష్మారెడ్డి బుధవారం ప్రకటనలో తెలిపారు. పదో తరగతి ఉత్తీర్ణత సాధించిన గిరిజన విద్యార్థులు ఎంపీసీ, బైపీసీ, సీఈసీ కోర్సులలో చేరడానికి అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తిగల విద్యార్థులు ఈనెల 20వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పదో తరగతి మెమో, ఆధార్, కుల, ఆదాయ ధ్రువపత్రాలు జతపర్చాలని సూచించారు. పూర్తి వివరాలకు 92931 29393 నంబర్ను సంప్రదించాలని సూచించారు. 31లోపు పరీక్ష ఫీజు చెల్లించండి మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ సెమిస్టర్–4, 6 ఫీజులను చెల్లించాలని రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణగౌడ్ బుధవారం ప్రకటనలో తెలిపారు. ఈ నెల 31లోగా ఆన్లైన్లో చెల్లించాలని, బీఏ, బీకాం వారు పేపర్కు రూ.150, బీఎస్సీ వారు పేపర్కు రూ.150తో పాటు ప్రాక్టికల్స్ రూ.150 చెల్లించాలని, 7382929609 నంబర్కు ఫోన్ చేయాలని సూచించారు. -
బీఆర్ఎస్ ఏం తక్కువ చేసిందో చెప్పాలి..
నాగర్కర్నూల్ ఎంపీ రాములు పార్టీకి వెన్నుపోటు పొడిచి బీజేపీలో చేరారని.. బీఆర్ఎస్ ఏం తక్కువ చేసిందో ప్రజలకు చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. బీజేపీ మళ్లీ అధికాంలోకి వస్తే, రాజ్యాంగం రద్దు చేస్తోందని.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు రిజర్వేషన్లు కోల్పోతారని ఆందోళన వ్యక్తంచేశారు. నిత్యావసర ధరలు పెంచడంతో పాటు రిజర్వేషన్లు రద్దు చేస్తానన్న మోదీని పార్లమెంట్ ఎన్నికల్లో ఓడించి తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ప్రవీణ్కుమార్ను ఎంపీగా గెలిపిస్తే, ఈప్రాంతానికి గౌరవం పెరుగుతుందని.. స్థానికుడైన ఆర్ఎస్పీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. -
లక్ష్యం నెరవేరలే..!
అర్హులు అందరికీ రుణాలిస్తాం పంట పెట్టుబడుల్లో భాగంగా పంట రుణాలకు దరఖాస్తు చేసుకునే అర్హులైన రైతులందరికి రుణాలు అందిస్తాం. 2023–24 ఆర్థిక సంవత్సరంలో రుణ లక్ష్యం మేరకు రుణాలు అందించేందుకు చర్యలు తీసుకున్నాం. అయితే చాలా మంది రైతులు తమ పంట రుణాలను బ్యాంకులకు వెళ్లి రెన్యువల్ చేసుకోలేదు. – అయ్యపురెడ్డి, ఎల్డీఎం ● 2023–24లో జిల్లాకు రూ.3530.58 కోట్లు పంట రుణ లక్ష్యం ● 53.27 శాతం మాత్రమే చేరిన వైనం ● రెన్యువల్స్ చేయించుకోని రైతులు ● రుణమాఫీ ప్రధాన కారణం గద్వాల న్యూటౌన్: 2023–24 ఆర్థిక సంవత్సరానికి గాను జిల్లాలో పంట రుణ లక్ష్యం నెరవేరలేదు. నిర్ధేశించిన లక్ష్యంలో 53.27 శాతం మాత్రమే రుణ లక్ష్యం అయ్యింది. రుణమాఫీ అవుతుందన్న ఉద్దేశ్యంతో చాలా మంది రైతులు తమ పంట రుణాలను రెన్యువల్స్ చేయించుకోలేదు. దీని ఫలితంగానే పంటరుణ లక్ష్యం నెరవేరలేదని బ్యాంకర్లు అంటున్నారు. పంట రుణ పరిమితి మేర రుణాలు పంటలపై ఆయా బ్యాంకులు ఆ ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించిన పంట రుణ పరిమితి మేరకు రైతులకు రుణాలు అందిస్తాయి. ఇందులో బాగంగా ఆయా బ్యాంకుల వారీగా రెండు సీజన్లకు రుణ లక్ష్యాన్ని లీడ్ బ్యాంక్ అధికారులు నిర్ధేశిస్తారు. అయితే రైతులు సీజన్కు ముందు లేదా సీజన్ మధ్యలో పంట రుణాల కోసం బ్యాంకులను ఆశ్రయిస్తారు. అంతకుముందు ఏడాదిలో సంబందిత రైతు తాను తీసుకున్న రుణాన్ని చెల్లించవచ్చు లేదా చెల్లించకపోయిన వడ్డీ చెల్లించి, మరో పంటను వేస్తున్నట్లు వ్యవసాయ అధికారుల దృవీకరణ పత్రాన్ని సమర్పించి లేదా తనకు ఎక్కువగా ఉన్న భూమిపై మళ్లీ రుణాన్ని తీసుకోవచ్చు. ఇలా రైతు బ్యాంకుకు వచ్చి రెన్యూవల్ చేసుకుంటేనే బ్యాంకులు పంట రుణాలు అందిస్తాయి. అయితే గడిచిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు అప్పటి ప్రభుత్వం రుణమాఫీ ప్రకటించింది. దీంతో చాలా మంది రైతులు తమ రుణాలు మాఫీ అవుతాయన్న ఉద్ధేశ్యంతో పంట రుణాలు తీసుకోవడానికి వెళ్లలేదు. అయితే ఈ రుణమాఫీ కొంత గందరగోళానికి దారి తీసింది. చాలా మంది రైతులకు వచ్చిన మాఫీ వడ్డీకే సరిపోయింది. అదికూడా అందరికి రాలేదు. ఇదే సమయంలో ఎన్నికల తర్వాత రుణమాఫీ చేస్తామని ప్రస్తుత ప్రభుత్వం కూడా ప్రకటించింది. దీనివల్ల కూడా రైతులు బ్యాంకులకు వెళ్లి రెన్యూవల్ చేసుకోలేదు. పంట రుణాలను రెన్యువల్ చేసుకుంటే రుణమాఫీ కాదేమో అన్న భయం అన్నదాతలను వెంటాడింది. వీటి ఫలితంగానే 2023–24 ఆర్థిక సంవత్సరానికి సంబందించి పంట రుణాలకై బ్యాంకులకు నిర్ధేశించిన లక్ష్యం నెరవేరలేదు. ఇదిలా ఉంటే చాలా మంది రైతులు పంట పెట్టుబడులకై అధిక వడ్డీలకు ప్రైవేట్గా అప్పులు చేశారు. జిల్లా పరిస్థితి ఇలా.. నడిగడ్డ వ్యవసాయ ఆధారిత జిల్లా. ఇక్కడ వ్యవసాయమే ప్రధాన జీవనాధారం. జూరాల, ఆర్డీఎస్ ప్రాజెక్ట్లతో పాటు, నెట్టెంపాడు ఎత్తిపోథల పథకం, దీని కింద ఏడు రిజర్వాయర్లు, వందకు పైగా చెరువులు, కుంటలు ఉన్నాయి. వీటికి అదనంగా బోర్లు, బావులు కూడా ఇక్కడి రైతులు ఏర్పాటు చేసుకున్నారు. ఏటా రెండు సీజన్లలో దాదాపు 5లక్షల ఎకరాల వరకు వివిద రకాల పంటలు సాగు చేస్తుంటారు. ఇంకా పండ్లతోటలు, కూరగాయలు పండిస్తున్నారు. అయితే జిల్లాలో సన్న, చిన్నకారు రైతులు వేల సంఖ్యలో ఉన్నారు. రైతుబంధు, పీఎం కిసాన్ సమ్మాన్ యోజన వంటి పంట పెట్టుబడుల పథకాలు కేంద్ర, రాష్ట్రాలు అమలు చేస్తున్నా, వాటితో పూర్తి పంట పెట్టుబడుల అవసరాలు తీరడం లేదు. దీంతో వీరంతా బ్యాంకులు అందించే పంట రుణాలనే పంట పెట్టుబడులుగా ఉపయోగిస్తూ, సేద్యం చేస్తున్నారు. -
వలస ఓటరు ఎటు వైపు?
బుధవారం శ్రీ 8 శ్రీ మే శ్రీ 2024● లోక్సభ ఎన్నికల్లో వలస కూలీలపై దృష్టిసారించని ప్రధాన పార్టీలు ● ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో గణనీయంగా ప్రభావం చూపిన వైనం ● గ్రామీణ ప్రాంతాల్లో 20 శాతం వరకు వారివే.. ● ఉమ్మడి జిల్లాలో 3.5 లక్షల మందికిపైనే ఓటర్లు ● ఖర్చుతో ఎక్కువ కావడంతో పార్టీల వెనుకంజ న్యూస్రీల్ -
పోలింగ్ కేంద్రాల్లో నిర్లక్ష్యం వహించొద్దు
గద్వాల రూరల్: పార్లమెంట్ ఎన్నికల విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించరాదని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సంతోష్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఎంఏఎల్డీ కళాశాలలో పీఓ, ఏపీఓ, ఓపీఓలకు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. పోలింగ్ కేంద్రాల్లో ఎలాంటి పొరపాట్లు తావు లేకుండా సమర్థవంతంగా ఎన్నికల నిర్వహణ చేపట్టాలన్నారు. పోలింగ్ జరిగే ముందురోజు ఎన్నికల సామగ్రిని డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి సకాలంలో సేకరించుకొని పోలింగ్ సామగ్రిని తీసుకెళ్లాలన్నారు. శిక్షణ తరగతులు సద్వినియోగం చేసుకుని పోలింగ్ రోజు ఉదయం 5:30కు అన్ని రాజకీయ పార్టీల ఏజెంట్ల సమక్షంలో మాక్ పోలింగ్ ప్రారంభించాలన్నారు. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభించాలన్నారు. కార్యక్రమంలో డీఆర్డీఓ నర్సింగ్రావు, పీఓలు, ఏపీఓలు ఎన్నికల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
‘దేశాన్ని పాలించే సత్తా మోదీకే ఉంది’
అయిజ: భారతదేశాన్ని పాలించే సత్తా ప్రధాని నరేంద్రమోదీకే ఉందని, మూడోసారి ఆయనే ప్రధాని అని కేంద్ర మంత్రి ఎల్.మురుగన్, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన మాదిగ, మాదిగ ఉపకులాల ప్రజా ఆశీర్వాద సభకు వారితో పాటు ఆ పార్టీ నాగర్కర్నూల్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి భరత్ ప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ.. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో గద్వాలలో నిర్వహించిన సభలో ఎస్సీ వర్గీకరణ పూర్తిచేసే బాధ్యత కాంగ్రెస్పార్టీ తీసుకుంటుందని రాహుల్గాంధీ హామీ ఇచ్చారని.. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా కేంద్రానికి ఒక లేఖ రాయాలని ఐదేళ్ల పాటు తిరిగానని అన్నారు. 2004 నుంచి 2014 వరకు దేశాన్ని పాలించింది కాంగ్రెస్పార్టీ అని.. ప్రధానిగా ఉన్న మన్మోహన్సింగ్ వద్దకు ఎన్నిసార్లు తిరిగినా న్యాయం చేయలేదని చెప్పారు. కాంగ్రెస్పార్టీ అధినేత్రి సోనియాగాంధీతో ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదని ఆరోపించారు. వీటన్నింటిని గమనిస్తే కాంగ్రెస్పార్టీ న్యాయం చేస్తుందనే నమ్మకం మాదిగలకు ఉండే అవకాశమే లేదన్నారు. ప్రధాని మోదీ దేశ ప్రజల స్వప్నమైన రామమందిరం నిర్మించారని, అగ్రకులాల పేదల ఆవేదనకు పరిష్కారం కోసం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తెచ్చారని వివరించారు. ప్రపంచంలో భారతదేశ గౌరవం రోజురోజుకు పెరుగుతుందని.. నరేంద్రమోదీ ప్రధానమంత్రిగా ఉంటేనే దేశ భద్రత, ఎస్సీ వర్గీకరణ సాధ్యమవుతుందని అన్నారు. నాగర్కర్నూల్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి పోతుగంటి భరత్ప్రసాద్కు మాదిగ జాతి, సమాజం సంపూర్ణ మద్దతు ఇస్తుందని తెలిపారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి, నాయకులు జలగరి అశోక్, మాదన్న, భగత్రెడ్డి, గొంగళ్ల రంజిత్కుమార్, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు రాజేష్, సీనియర్ నాయకుడు ఆంజనేయులు పాల్గొన్నారు. -
కళతప్పిన జీవనదులు
ఇసుకను తవ్వేసిన అక్రమార్కులు ● రాళ్లు తేలి కళ తప్పిన కృష్ణా ● నీటి ప్రవాహం లేక ఎండిన నదులు ● నీటి జల లేక తీర గ్రామాల్లో ఎద్దడి మిగిలిన రాళ్లు.. తుంగభద్ర నదిలో ఇసుక స్థానంలో రాళ్లు మాత్రమే కనిపిస్తున్నాయి. తుంగభద్ర నదిలో ఇసుక తవ్వకాలకు అడపా.. దడపాగా తప్ప ఇసుకను నేరుగా తవ్వడానికి అనుమతులు లభించలేదు. ఇసుక తవ్వకాలకు 2009లో సంభవించిన భారీ వరదల కారణంగా నియోజకవర్గంలోని ఆయా మండలాల్లో ఉన్న ఇసుక మేటలను తరలించడానికి మాత్రమే అనుమతులు వచ్చాయి. అనుమతుల ముసుగులో లారీలకు లారీలు ఇసుకను తరలించి అక్రమార్కులు సొమ్ము చేసుకొని తుంగభద్రను లూటీ చేశారు. సాధారణంగా నదిలో దాదాపు 15 మీటర్ల మేరకు మేటలు ఉన్న ప్రాంతాల్లో 3 మీటర్లు మాత్రమే ఇసుకను తవ్వడానికి అనుమతులు ఉంటాయి. కానీ ఇక్కడ మాత్రం నదిలో రాళ్లు, మట్టి కనిపించే వరకు తవ్వేశారు. దీంతో తుంగభద్ర నదిలో ఇసుక కనుమరుగైంది. అలంపూర్: ప్రశాంత ప్రవాహం.. స్వచ్ఛమైన నీటిని అందించే జలభాండాగారం. వరా్ాష్భవంలోనూ.. వేసవిలోనూ.. నీటి ప్రవాహం తగ్గితే.. గుక్కెడు ఇసుకను తవ్వితే చాలు, తన కడుపులో దాచుకున్న స్వచ్ఛమైన నీటిని అందించి దాహం తీర్చే స్వభావం. అవే కృష్ణా, తుంగభద్ర నదులు. ‘గతమెంతో ఘనం’ అన్నట్టుగా జీవనదుల గురించి మాట్లాడితే ప్రతి నోట వచ్చే మాటలివి. లక్షలాది మందికి భరోసానిచ్చిన కృష్ణా, తుంగభద్ర జీవనదులు జీవచ్ఛవంగా కనిపిస్తున్నాయి. సన్నటి నీటి ప్రవాహంతో వేసవిలోనూ తనలో పెరిగిన పచ్చటి మొక్కలతో ప్రకృతి పరవశానికి నిదర్శనంగా నిలిచిన అదే జీవనదులు కళతప్పి అంధవిహీనంగా మారాయి. ఇసుకాసురులు తుంగభద్ర నదిలోని ఇసుకను తవ్వేయడంతో రాళ్లు తేలి గుర్తుపట్టని స్థాయికి చేరింది. అధికార యంత్రాంగం భవిష్యత్లో వచ్చే కష్టాలను గుర్తించి చట్టపరంగా చర్యలు చేపట్టడంలో విఫలం కావడంతో భరోసా ఉన్న జీవనది బరువుగా మారింది. నదిలో ఇసుకను తవ్వేయడంతో రాళ్లు, రప్పలు, మట్టి కుప్పలతో దర్శనమిస్తోంది. ఇసుకను తవ్వేశారు.. జిల్లాలోని అయిజ, రాజోలి, ఉండవెల్లి, అలంపూర్ మండలాలను తాకుతూ తుంగభద్ర నది ప్రవహిస్తోంది. ఒకప్పుడు ఎల్లప్పుడు సమృద్ధిగా కురిసే వర్షాలతో నది నిండుగా కనిపించేది. ప్రస్తుతం వర్షాభావ పరిస్థితుల కారణంగా తుంగభద్ర నదిలో నీటి ప్రవాహం ఏడాదికి ఏడాది తగ్గుతూనే వస్తోంది. కృష్ణా నది సైతం గద్వాల, ఇటిక్యాల, ఉండవెల్లి, అలంపూర్, మానవపాడు మండలాలను తాకుతూ ప్రవహిస్తోంది. దేశంలోనే ప్రఖ్యాతి గాంచిన జీవ నది రానురాను నీళ్లకు బదులుగా రాళ్లతో దర్శనిమిస్తోంది. తుంగభద్ర నది నుంచి ఇసుకను అక్రమంగా.. అనుమతుల ముసుగులో గత కొన్నేళ్లుగా భారీగా తోడేశారు. ప్రస్తుతం నదిలో నీటి ప్రవాహం లేకపోవడంతో ఇసుకకు బదులుగా రాళ్లు మాత్రమే కనిపిస్తున్నాయి. ఇలా ఏళ్ల తరబడిగా అక్రమ దందా సాగడటంతో నదిలో చూడటానికి ఇసుక కనిపించని పరిస్థితి నెలకొంది. గ్రామాల్లో కష్టాలు... జిల్లాలోని కృష్ణా, తుంగభద్ర నది తీర గ్రామాలు నది నీటితో సస్యశ్యామలంగా విరాజిల్లేవి. తాగుకు.. సాగుకు ఎలాంటి ఇబ్బందులు ఉండేవి కావు. వేసవిలోనూ వరి పంటలు పండించిన దాఖలాలు ఉన్నాయి. వర్షాభావ పరిస్థితులు ఎదురైనా.. నదీ తీర గ్రామాలకు పెద్దగా నీటి ఎద్దడి ఉండేది కాదు. ఇసుక మేటల కారణంగా అక్కడక్కడ గుంతలు ఏర్పడి నీళ్లు నిలిచేవి. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. ప్రస్తుతం ఇసుక తవ్వకాల కారణంగా ఆ అవకాశం లేకుండా పోయింది. ఇప్పటికై నా నదిలో అక్రమ తరలింపులకు చర్యలు చేపట్టి, జీవ నదులకు పూర్వవైభవం తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. -
ఒక్కో నియోజకవర్గంలో 20 వేలపైనే..
ప్రఽదానంగా నారాయణపేట, కొడంగల్, వనపర్తి, దేవరకద్ర, మక్తల్, మహబూబ్నగర్, అచ్చంపేట, కొల్లాపూర్, నాగర్కర్నూల్ నియోజకవర్గాలకు చెందిన వేలాది మంది ఇతర ప్రాంతాలకు ఇక్కడి నుంచి వెళ్లి ఉపాధి పొందుతున్నారు. ఒక్కో నియోజకవర్గంలో కనీసం 20 వేల వరకు వలస ఓటర్లు ఉన్నారు. నారాయణపేట నియోజకవర్గంలోని నారాయణపేటతో పాటు ధన్వాడ, దామరగిద్ద, కోయిలకొండ ప్రాంతాల్లో వలస కార్మికుల సంఖ్య గణనీయంగా ఉంది. మహబూబ్నగర్ జిల్లాలోని గండేడ్, మహమ్మదాబాద్, హన్వాడ మండలాలకు చెందిన తండాలవాసులు భారీగానే ఉన్నారు. కొడంగల్ నియోజకవర్గంలోని మద్దూరు, కోస్గి, బొంరాస్పేట మండలాల ప్రజలు అత్యధికంగా ఇతర రాష్ట్రాల్లో ముంబై, బెంగళూరు, పుణె వంటి చోట్ల స్థిరపడి ఉన్నారు. వీరందరి ఓట్లు, ఆధార్, రేషన్కార్డులు సొంత గ్రామాల్లోనే ఉన్నాయి. ఎన్నికలు ఏవైనా వలస ఓటర్లు తమదైన శైలిలో గెలుపోటముల్లో ప్రభావం చూపుతున్నారు. పంచాయతీ, స్థానిక సంస్థలు, శాసనసభ ఎన్నికల్లో వీరిపైనే ప్రధానంగా ఫోకస్ పెట్టిన ప్రధాన పార్టీలు ఈసారి లోక్సభ ఎన్నికల్లో మాత్రం పెద్దగా ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. -
మాయమాటలు నమ్మొద్దు
గద్వాల రూరల్: అబద్దాలు, మాయమాటలు చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని.. మరోసారి పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఇవే గ్యారంటీలతో ముందుకొస్తుందని.. ప్రజలు ఎవరూ నమ్మవద్దని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్ధి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్కు మద్దతుగా సోమవారం జిల్లా కేంద్రంలోని 32,33వ వార్డుల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ పాలనలోనే గద్వాల పట్టణంలోని ప్రతి వార్డులో డ్రైనేజీ వ్యవస్ధ, సీసీ రోడ్డు, కమ్యూనిటీ హల్స్, పట్టణ ప్రకృతి వనాలు వంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 24గంటల విద్యుత్ సరఫరా చేసేదని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో విద్యుత్ సరఫరా లేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. అదేవిధంగా పదేళ్ల బిజేపీ పాలనలో కుల, మతాల చిచ్చుపెడుతూ, నిత్యావసర ధరలు పెంచి సామాన్యులపై అధిక భారం మోపిన బిజేపీకి బుద్దిచెప్పాలన్నారు. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిని ఆశీర్వాదించాలని కోరారు. కృష్ణారెడ్డి, బాబర్, నరహరి శ్రీనివాసులు, సాయిశ్యామ్ రెడ్డి ఉన్నారు. జాబ్మేళా మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: ఎన్టీఆర్ మహి ళా డిగ్రీ కళాశాలలో పలు ప్రైవేటు కంపెనీల ఆధ్వర్యంలో సోమవారం జాబ్మేళా నిర్వహించారు. వివిధ కళాశాలల నుంచి మొత్తం 450 మంది ఔత్సాహికులు హాజరవగా.. ఇందులో 125 మంది పలు ఉద్యోగాలకు ఎంపికై నట్లు ప్రిన్సిపాల్ విజయ్కుమార్ తెలిపారు. -
ఈవీఎంల పనితీరును స్పష్టంగా తెలుసుకోవాలి
ఎర్రవల్లిచౌరస్తా: ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు పీఓ, ఏపీఓ లు ఈవిఎంల పనితీరుపై స్పష్టంగా తెలుసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ బి.ఎం సంతోష్ అన్నారు. సోమవారం ఎర్రవల్లి మండల కేంద్రంలోని ఏకశీల పాఠశాలలో అలంపూర్ నియోజకవర్గంలో పార్లమెంట్ ఎన్నికల్లో విధులు నిర్వహించే అధికారులకు అందిస్తున్న శిక్షణ తరగతులను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులకు పలు సూచనలు, సలహాలను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శిక్షణ పొందిన పీఓ, ఏపీఓ, ఓపీఓలు పోలింగ్ బూత్లతో సమర్థవంతంగా ఎన్నికల నిర్వహణ చేపట్టాలని సూచించారు. ఎలాంటి సందేహాలున్నా శిక్షణ తరగతుల్లో మాస్టర్ ట్రైనర్లచే నివృతి చేసుకోవాలని తెలిపారు. శిక్షణ తరగతులను అర్థం చేసుకొని ఎన్నికల విధులకు సంభందించిన అన్ని అంశాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. జాగ్రత్తగా విధులు నిర్వహిస్తే ఎలాంటి తప్పులకు ఆస్కారం ఉండదన్నారు. పోలింగ్ జరిగే సమయంలో పోలింగ్ కేంద్రాల్లో పాటించవలసిన నిబందనలు, కంట్రోల్ యూనిట్, వివిప్యాడ్ లను సీల్ చేయడం, తదితర అంశాలపై పూర్తి అవగాహణ కలిగి ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రాంచందర్, ఆయా మండలాల తహశీల్దార్లు, ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారులు ఉన్నారు. -
‘ఉపాధి’ ఖరారు
2024–25 ఏడాదికి 26,17,690 పనిదినాలు లక్ష్యం ● నీటి సంరక్షణ పనులకు అధిక ప్రాధాన్యం ● లక్ష్యం చేరుకునేలా ఏడాది ఆరంభం నుంచే ప్రత్యేక చర్యలు జిల్లా వివరాలిలా.. జిల్లాలో మొత్తం జాబ్కార్డులు: 1,56,658 కూలీల సంఖ్య: 3,51,296 గద్వాల న్యూటౌన్: 2024–25 ఆర్థిక సంవత్సరానికి ఉపాధిహామీ పని దినాల లక్ష్యం ఖరారు అయ్యింది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టాల్సిన పనులను క్షేత్రస్థాయిలో గుర్తించి.. నీటి సంరక్షణ పనులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ.. గ్రామీణ ప్రాంతాల్లో వలసలు నిరోధించేలా 26,17,690 పనిదినాలు లక్ష్యంగా నిర్ణయించారు. పనుల గుర్తింపు.. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద వచ్చే ఆర్థిక సంవత్సరం(2024–25)లో చేపట్టాల్సిన పనులను అధికారులు క్షేత్రస్థాయిలో సిబ్బంది చేత ప్రత్యేకంగా గుర్తించారు. ఇందుకోసం ప్రత్యేకంగా గడిచిన అక్టోబర్, నవంబర్ నెలల్లో పనుల గుర్తింపు చేపట్టారు. ఆయా గ్రామాల్లో రైతులు, కూలీలు, ప్రజలతో కలిసి పనులను గుర్తించారు. పనులను గుర్తించిన అనంతరం గ్రామాల వారీగా ప్రణాళికను తయారు చేశారు. శాశ్వత పనులకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారు. ప్రధానంగా నీటి సంరక్షణ పనులు (ఫాంపాండ్స్, బావుల పుడీకతీత, వాలుకట్టలు) ప్రాధాన్యత కల్పించారు. ఇంకా ఇంకుడు గుంతలు, వ్యవసాయ పొలాల చదును, కంపోస్ట్ పిట్లు, నాడేక్ కంపోస్ట్ పిట్లు, పండ్లతోటలు, పశువుల పాకాలు, గొర్రెల షెడ్లు, పాఠశాలల్లో టాయిలెట్లు, నర్సరీలు, వంటగదులు తదితర పనులు ఉన్నాయి. ఆయా గ్రామాల్లోని చేయాల్సిన పనులు, కూలీల డిమాండ్ను పరిగణలోకి తీసుకుని దాని ద్వానా పనిదినాల సంఖ్యను నిర్ణయించారు. వ్యవసాయ సీజన్ ఉన్నప్పుడు, లేనప్పుడు ఆయా పంచాయతీల పరిధుల్లో ఏరకమైన పనులు చేపట్టవచ్చో ఇలా అన్ని అంశాలు పరిగణలోకి తీసుకొని పనులను గుర్తించారు. పనులు.. పని దినాలు.. బడ్జెట్ 2024–25 ఆర్థిక సంవత్సరంలో చేపట్టాల్సిన పనులను గుర్తించిన అధికారులు అందుకు అవసరమయ్యే పనిదినాల సంఖ్య, బడ్జెట్ను (కూలీల వేతనాలు, మెటిరియల్కు అయ్యే ఖర్చు) పంచాయతీల వారీగా అంచనా వేసి రికార్డుల్లో నమోదు చేశారు. ఈ వివరాలను మండలాల వారీగా క్రోడీకరించి డీఆర్డీఏ కార్యాలయానికి నివేదించారు. అక్కడి అధికారులు మరోసారి మండలాల వారీగా గుర్తించిన పనులను, పనిదినాల వివరాలను పరిశీలించారు. క్షేత్ర స్థాయిలో ఉపాధిహామీ సిబ్బంది సూచించిన దాని కంటే దాదాపు ఒక లక్ష పనిదినాల సంఖ్యను పెంచుతూ కలెక్టర్కు ప్రతిపాదనలు పంపారు. కలెక్టరేట్ నుంచి ప్రభుత్వానికి ప్రతిపాదనలు నివేదించగా ఇటీవలే ప్రతిపాదనలు ఒకే అయ్యి, పనులు, పనిదినాలు ఖరారు అయ్యాయి. దిశానిర్దేశం 2023–24 ఆర్థిక సంవత్సరానికి సంబందించి జిల్లాలో పనిదినాల సంఖ్య లక్ష్యానికి మించి పూర్తి చేశారు. 2024–25 ఆర్థిక సంవత్సరంలో సైతం పనిదినాల సంఖ్య లక్ష్యానికి మించి చేపట్టేలా ఉపాధి హామీ ఉన్నతాధికారులు సిబ్బందికి దిశనిర్దేశం చేశారు. ఇందులో భాగంగా లక్ష్యాన్ని ఆయా మండలాకు నెల వారీగా విభజించారు. దీంతో పాటు ప్రతి నెల ఆయా మండలాల్లో జరిగే పనులు, హాజరవుతున్న కూలీలు, పనిదినాల సంఖ్యపై ప్రత్యేకంగా సమీక్ష నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. ఎక్కడైతే పనులు ముందుకుసాగవో అక్కడ ప్రత్యేక దృష్టి సారించి, పనిదినాల లక్ష్యం నెరవేరేలా ఏప్రిల్ నుంచే చర్యలు తీసుకుంటున్నారు. 2024–25లో జిల్లాలో పనిదినాలు ఇలా.. మండలం పనిదినాల సంఖ్య అయిజ 2,97,270 గద్వాల 2,83,150 కేటీదొడ్డి 2,77,400 ధరూర్ 2,75,500 మల్దకల్ 2,58,177 ఇటిక్యాల 2,42,559 గట్టు 1,88,238 ఉండవల్లి 1,80,365 మానవపాడు 1,77,959 రాజోళి 1,56,100 అలంపూర్ 1,48,702 వడ్డేపల్లి 1,32,270 ప్రతి కూలీకి పని కల్పిస్తాం.. ఈ ఏడాది జిల్లాలో ఉపాధి హమీ కింద చేపట్టాల్సిన పనులు, పనిదినాల సంఖ్య ఇటీవలే ఖరారు అయ్యింది. నడిగడ్డలో వలసలు పూర్తిగా నివారించి, ప్రతి కూలీకి ఉపాధి కింద పని కల్పిస్తాం. ఈ ఏడాదిలో పనిదినాల సంఖ్య లక్ష్యం నెరవేరేలా ఆర్థిక సంవత్సరం ఆరంభం నుంచే చర్యలు తీసుకుంటున్నాం. – నర్సింగరావ్, డీఆర్డీఓ -
వేరుశనగ క్వింటా రూ.6,520
గద్వాల వ్యవసాయం: జిల్లా కేంద్రంలోని మార్కెట్యార్డుకు సోమవారం 548 క్వింటాళ్ల వేరుశనగ రాగా, గరిష్టం రూ.6,520, కనిష్టం రూ.3,029, సరాసరి రూ.6,309 ధరలు పలికాయి. అలాగే, 19 క్వింటాళ్ల ఆముదం రాగా గరిష్టం రూ.5439, కనిష్టం రూ.4000, సరాసరి రూ.5439 ధరలు వచ్చాయి. 1,894 క్వింటాళ్ల వరి (సోన) రాగా గరిష్టం రూ.2,408, కనిష్టం రూ.1701, సరాసరి ధర రూ.1979 ధరలు వచ్చాయి. 25 క్వింటాళ్ల వరి (హంస) రాగా గరిష్టం రూ. 1756, కనిష్టం రూ. 1734, సరాసరి ధర రూ. 1756 పలికింది. 10 క్వింటాళ్ళ కంది రాగా, గరిష్టం రూ. 10026, కనిష్టం రూ. 9466, సరాసరి రూ.10026 ధరలు వచ్చాయి. ఓటింగ్పై చైతన్యం తీసుకురండి నారాయణపేట రూరల్: ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధమని, 18 ఏళ్లు నిండి ఓటు హక్కు కల్గిన ప్రతీ ఒక్కరు తమ ఓటును తప్పకుండా వేయాలని.. ప్రతిఒక్కరూ ఓటు వేసేలా వారిలో చైతన్యం తీసుకురావాలని తపస్ రాష్ట్ర అధ్యక్షుడు హన్మంత్రావు అన్నారు. పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాల ఆవరణలో సోమవారం ఆ సంఘం జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. ముఖ్య అతిధిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఓటింగ్ శాతం పెంచాల్సిన బాధ్యత సమాజంలో విద్యావంతులైన ఉపాధ్యాయులపై ఎంతైన ఉందన్నారు. ప్రతి ఒక్కరు తమ బాధ్యతను విస్మరించకుండా బద్దకాన్ని విడనాడి ఓటు వేసే విధంగా చైతన్య పర్చాలన్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది, జర్నలిస్టులకు పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కల్పించిందని, సద్వినియోగం చేసుకోవాలన్నారు. పెండింగ్ సమస్యలపై పోరాటం గత కొంత కాలంగా పెండింగ్లో ఉన్న ఉపాధ్యాయ సమస్యలపై ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు పోరాటం చేస్తామన్నారు. పదోన్నతులు, బదిలీలు, 2003 డీఎస్సీ టీచర్ల పాత పెన్షన్ అమలు, టెట్ లేకుండా హెచ్ఎం పదోన్నతి, సీపీఎస్ రద్దు, నాలుగు డీఏ పెండింగ్లపై రాష్ట్ర శాఖ దృష్టి సారించనుందన్నారు. మెడికల్, టీఎస్జీఎల్ఐ బాండ్ల డబ్బుల విడుదల విషయం డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. పీయూలో సిలబస్ మార్పుపై సమీక్ష మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీలో బీఈడీ విద్యార్థులకు సిలబస్లో మార్పులు చేయడంపై సోమవారం అధికారులు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ మేరకు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని పలు ప్రైవేటు బీఈడీ కళాశాలల ప్రిన్సిపాళ్లు, బీఓఎస్లు, హెచ్ఓడీలతో పీయూ రిజిస్ట్రార్ మధుసూదన్రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు సిలబస్లో మార్పులు చేపట్టిన నేపథ్యంలో అధ్యాపకులు, ప్రిన్సిపాళ్లు పలు చర్యలు తీసుకోవాలని సూచించారు. రికార్డుల నిర్వహణ తదితర అంశాల పట్ల జాగ్రత్త వహించాలని కోరారు. -
నేడు పాలమూరుకు ఉత్తరాఖండ్ సీఎం రాక
పాలమూరు: మహబూబ్నగర్ జిల్లాకేంద్రంలోని అన్నపూర్ణ గార్డెన్లో సోమవారం నిర్వహించే బీజేపీ ఇంటలెక్చువల్ మీట్కు ముఖ్య అతిథిగా ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి హాజరుకానున్నారు. అలాగే జిల్లాకేంద్రంలోని సుదర్శన్గార్డెన్లో నిర్వహించే మహబూబ్నగర్, దేవరకద్ర, జడ్చర్ల, షాద్నగర్ నియోజకవర్గ కన్వీనర్లు, మండల అధ్యక్షులు, శక్తి కేంద్ర ఇన్చార్జ్లు, పార్టీ సంస్థాగతంగా బాధ్యతలు నిర్వహిస్తున్న కార్యకర్తలతో ముఖాముఖి నిర్వహించనున్నారు. కార్యక్రమానికి బీజేపీ జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఎన్నికల నేపథ్యంలో పార్టీ సంస్థాగతంగా తీసుకుంటున్న కార్యక్రమాలపై చర్చించనున్నారు. -
ప్రశాంతంగా ‘నీట్’
ఎర్రవల్లిచౌరస్తా: జిల్లాలో ఆదివారం నిర్వహించిన నీట్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. జిల్లా నీట్ సిటీ కోఆర్టినేటర్ వెంకటేశ్వర్రావు ఆయా పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. ఎర్రవల్లి సరస్వతి ఇంటర్నేషనల్ పాఠశాలలోని కేంద్రంలో 200 మంది విద్యార్థులకుగాను 193 మంది, అలంపూర్ మాంటిస్సోరి పాఠశాలలో 312 మందికి గాను 309, శాంతినగర్ రాఘవేంద్ర పాఠశాలలో 288 మందికి గాను 283, వీరాపురం ఎస్.ఆర్ విద్యానికేతన్ పాఠశాలలో 312 మందికి గాను 306 మంది విద్యార్థులు పరీక్షకు హాజరైనట్లు ఆయన తెలిపారు. జిల్లాలో మొత్తం 1112 మంది విద్యార్థులకుగాను 1091 మంది హాజరైనట్లు తెలిపారు. 21 మంది గైర్హాజరైనట్లు పేర్కొన్నారు. -
ఆశీర్వదించాలి..
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో సీఎం రేవంత్ రెడ్డి ఆరు గ్యారంటీలు అమలు చేస్తున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలోకి వస్తే రాహుల్గాంధీ ఐదు గ్యారంటీలు అందిస్తారు. కేంద్రం, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంటే ప్రతి ఇంటికి 11 పథకాలు వస్తాయి. ప్రజలు తమ భవిష్యత్ను దృష్టిలో పెట్టుకుని కేంద్రంలో పేదల ప్రభుత్వం ఎన్నుకునేలా కాంగ్రెస్ను ఆశీర్వదించాలి. – మల్లు రవి, నాగర్కర్నూల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి -
No Headline
నేను భారత్ జోడోయాత్రలో నాలుగు వేల కిలోమీటర్లు నడిచాను. బీజేపీ దేశంలో మతవిద్వేషాలు రేకెత్తించింది. మనుషుల మధ్య చిచ్చుపెట్టింది. మేము విద్వేషాల బజారులో ప్రేమ దుకాణం తెరిచాం. విద్వేషాలతో ఏమీ రావు.. ప్రేమతో దేశం ముందుకెళ్తుంది. పేదల ప్రభుత్వం, రైతుల ప్రభుత్వం, బడుగు, బలహీన వర్గాల ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా. మోదీ ధనవంతుల కోసం సర్కారును నడుపుతాడు. దాని వల్ల దేశానికి మేలు జరగదు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులను గెలిపించాలి. -
పక్కాగా పరిశీలన..
సాధారణంగా ఎన్నికలంటే విచ్చలవిడిగా డబ్బులు వెదజల్లి ఓటర్లను మభ్యపెడుతూ తమవైపు తిప్పుకునేందుకు నాయకులు శతవిధాల ప్రయత్నం చేస్తుంటారు. అయితే ఈ అప్రజాస్వామ్యాన్ని అరికట్టేందుకు, ఎన్నికల్లో పారదర్శకత ఉండేందుకు ఎన్నికల కమిషన్ ఖర్చులపై నిబంధన విధించింది. ప్రతి రోజు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎక్కడెక్కడ ప్రచారాలు నిర్వహిస్తున్నారు. ప్రచారంలో భాగంగా ఎన్ని నిధులు ఖర్చు చేస్తున్నారనే దానిపై ఎప్పటికప్పుడు ఈసీ వ్యయ పరిశీలనతో పాటు కేంద్రం, రాష్ట్ర ఎన్పోర్స్మెంట్ సంస్థలు, ఫ్లయింగ్ స్క్వాడ్లు, నిఘా బృందాలు, వీడియో సర్వేలైన్స్ బందాలు సమాచారాన్ని సేకరిస్తాయి. అభ్యర్థుల ఖర్చులను పరిశీలించేందుకు ఆడిట్ బృందాలను ఏర్పాటు చేశారు. ఆయా పార్టీల అభ్యర్థులు నిర్వహించే సభలతోపాటు ర్యాలీలు, రోడ్షోలలో ఖర్చు చేసే కుర్చీల నుంచి భోజనం, టీ, కాఫీ వరకు అంతా లెక్కిస్తారు. అభ్యర్థుల ఖర్చు వివరాలపై పరిమితి ఉన్నా ప్రస్తుత ఎన్నికల్లో ఖర్చులు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా చేస్తున్నారా లేదా అనే విషయంపై ఎన్నో అనుమానాలు ఉన్నాయి. -
కాంగ్రెస్కు అండగా ఉండాలి..
నడిగడ్డలోని బంగ్లా రాజకీయాలు అందరికీ తెలుసు. పొద్దున చెరొకవైపు ఉన్న వారు.. రాత్రయ్యే సరికి ఒకచోటికి చేరుతారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ను ఓడించేందుకు బీఆర్ఎస్, బీజేపీ ఒకటయ్యాయి. అదే బంగ్లా రాజకీయం ఈ ప్రాంతంలో నడుస్తోంది. అదే బంగ్లా రాజకీయానికి గుణపాఠం చెప్పి శాశ్వతంగా సమాధి కట్టాలి. కృష్ణా, తుంగభద్ర నది మధ్యలో ఉన్న నడిగడ్డ పౌరుషానికి, పోరాటానికి పెట్టింది పేరు. నడిగడ్డ బిడ్డలు ఎవరికై న మాట ఇస్తే తల తెగి కిందపడ్డా సరే ఆ మాట నుంచి ఒక్క అడుగు వెనుకేయరు. ఎన్ని కష్టాలు వచ్చినా ఇచ్చిన మాట కోసం నిలబడతారు. 70 ఏళ్ల తర్వాత మన పాలమూరుకు తెలంగాణకు నాయక్వతం వహించే అవకాశం వచ్చింది. మన ప్రాంతంలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు ప్రధానంగా గట్టు, తుమ్మిళ్ల, ఆర్డీఎస్ ఆధునికీకరణ, ఎరవ్రల్లి చౌరస్తా నుంచి రాయచూరు వరకు నాలుగు లైన్లు, పాలమూరు–రంగారెడ్డి పూర్తి చేసుకోవడానికి మీరందరూ కాంగ్రెస్కు అండగా ఉండాలి. నాగర్కర్నూల్ కాంగ్రెస్ అభ్యర్థి మల్లురవిని గెలిపించాలి. మీరందరూ డిసెంబర్లో కేసీఆర్ను ఓడించి పని అయిపోయిందని అనుకుంటున్నారు. డిసెంబర్లో జరిగిన ఎన్నికలు సెమీఫైనల్స్. ఈ నెల 13న ఫైనల్స్ తెలంగాణ వర్సెస్ గుజరాత్ మధ్య జరుగుతున్నాయి. గుజరాత్ను ఓడించి తెలంగాణను గెలిపించుకుందాం. – రేవంత్రెడ్డి, ముఖ్యమంత్రి -
జనజాతర సభ సైడ్లైట్స్
● సాయంత్రం 4.42 గంటలకు ఏఐసీసీ అగ్రనేత రాహుల్గాంధీ, సీఎం రేవంత్రెడ్డి ప్రత్యేక హెలీకాప్టర్లో పదో బెటాలియన్లో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ వద్దకు చేరుకున్నారు. ● 4.48 గంటలకు ప్రత్యేక కాన్వాయ్లో సభా ప్రాంగణానికి బయల్దేరారు. ● 5 గంటలకు రాహుల్గాంధీ, సీఎం రేవంత్రెడ్డి సభావేదికపైకి చేరుకున్నారు. ● ముందుగా ఎంపీ అభ్యర్థి మల్లు రవి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్కుమార్, మంత్రి జూపల్లి కృష్ణారావు, డిప్యూటి సీఎం మల్లు భట్టివిక్రమార్క, సీఎం రేవంత్రెడ్డి ప్రసంగించిన తర్వాత చివరలో రాహుల్గాంధీ మాట్లాడారు. ● రాహుల్గాంధీ ప్రసంగం 5.50 గంటలకు ముగిసింది. ● హెలీకాప్టర్లో 5.55 గంటలకు రాహుల్గాంధీ తిరిగి వెళ్లిపోయారు. ● జై కాంగ్రెస్ అని గట్టిగా నినదిస్తే బంగ్లాలో గుండెలు దద్దరిళ్లాలని సీఎం రేవంత్రెడ్డి కార్యకర్తలను ఉత్తేజపరిచారు. – అలంపూర్ /ఎర్రవల్లి చౌరస్తా/ మానవపాడు/ ఉండవెల్లి -
ఉన్నత స్థాయికి ఎదగాలి
గద్వాల అర్బన్: జీవితంలో కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని జిల్లా న్యాయ అధికార సేవ సంస్ధ సెక్రటరీ, సీనియర్ సివిల్ జడ్జి గంట కవితదేవి అన్నారు. బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో శనివారం జిల్లా కేంద్రంలోని బాలసదనంలో హోమ్ మేనేజ్మెంట్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ బాలికల విద్యకు చిన్నపాటి తోడ్పాటు అందిస్తే చాలు ఉన్నతస్థాయిలో రాణిస్తారనేందుకు నిదర్శనమే బాలనందనమన్నారు. బాలసదనంలో, ఇతర సంరక్షణ గృహంలో నివాసం ఉంటున్న పిల్లలు దేనిలో తక్కువ కాదని, తల్లిదండ్రులు, సంరక్షకులు లేరని చింత వద్దన్నారు. ప్రభుత్వం అన్నీ తానే చూసుకుంటుందన్నారు. అదేవిధంగా ఇటీవల విడుదలైన పదో తరగతి ఫలితాల్లో బాలసదనంలోని చిన్నారులు అనూష (జీపీఏ 8.8), అక్షయ (జీపీఏ 8.7), సునీత (జీపీఏ 6.8) పాయింట్లు సాధించారు. వీరిని జడ్జీ ప్రత్యేకంగా ఆభినందించి బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో ఇంచార్జ్ డీడబ్ల్యూఓ సుధారాణి, బాలల సంక్షేమ సమితి మెంబర్స్ జయభారతి, శైలజ, డీసీపీఓ నర్సింహ్మ, బాలసదనం సూపరింటెండెంట్ సుధారాణి, సిబ్బంది పాల్గొన్నారు. -
నీటి ఎద్దడి రాకుండా పక్కా ప్రణాళిక
రాజోళి: గ్రామాల్లో నీటి ఎద్దడి రాకుండా పక్కా ప్రణాళికతో ముందుకు సాగాలని వాటర్గ్రిడ్ ఎస్ఈ జగన్మోహన్ అన్నారు. మండలంలోని ఆరెంజ్ జోన్లో ఉన్న తుమ్మిళ్ల, పెద్ద తాండ్రపాడు గ్రామాల్లో శనివారం ఆయన పర్యటించారు. తుమ్మిళ్లలో నది నుంచి గ్రామానికి నీరు సరఫరా చేస్తున్న మోటార్లు, నీటి లభ్యత గురుంచి అధికారులను అడిగారు. అనంతరం పెద్ద తాండ్రపాడులో పర్యటించిన ఆయన గ్రామంలో నీటి ట్యాంకులు ఎన్ని ఉన్నాయి వాటి సామర్థ్యం ఎంత అనే విషయాలను అడిగారు. నీటి ఎద్దడి రాకుండా తీసుకుంటున్న చర్యలేంటని అడిగారు. గ్రామంలో ఉన్న బోర్ల ద్వారా గ్రామంలో ఎద్దడి రాకుండా ఎలాంటి ప్రణాళిక అవలంభించాలనే అంశాలను అధికారులకు తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజలు నీటి కష్టాలు రాకుండా ఎప్పటికప్పుడు గ్రామాలపై ప్రత్యేక దృష్టి పెట్టి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఏఈ తేజవర్ధన్, ఎంపీఓ ఖాజా మెయినుద్దీన్ తదిదరులు పాల్గొన్నారు. -
శత్రువంచన చేరి దెబ్బతీయాలని చూస్తున్నారు..
పాలమూరు బిడ్డ సీఎంగా ఉండొద్దు.. ఈ ప్రభుత్వాన్ని పడగొడ్తామని అంటున్నారు. పార్టీలు, జెండాలు, ఎజెండాలకు అతీతంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే అవకాశం ముఖ్యమంత్రిగా నాకు వచ్చింది. కానీ ఇక్కడి వారే శత్రువంచన చేరి మనల్ని దెబ్బతీయాలని చూస్తున్నారని మండిపడ్డారు. డీకే అరుణ ఏమంటాంది.. రేవంత్రెడ్డి నా మీద పగబట్టిండు. రేవంత్ నన్ను ఒడగొట్టాలని చూస్తున్నాడు. నేను మాత్రం కాంగ్రెస్ను ఓడగొట్టే వరకు ఊరుకోను. కాంగ్రెస్ను ఖతం చేస్తా అని అంటది. కాంగ్రెస్ నీకు ఏం అన్యాయం చేసింది? పాన్గల్ నుంచి జెడ్పీటీసీగా, గద్వాల ఎమ్మెల్యేగా, ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిని చేసినందుకు కాంగ్రెస్ను ఓడగొట్టాల్నా? దేశంలో, రాష్ట్రంలో నిన్ను గుర్తు పడుతోంది కాంగ్రెస్తోనే కదా. ఇవి ఆషామాషీ ఎన్నికలు కావు.. మోదీ చుట్టంలాగా వస్తడు, పోతడు. పదేండ్లు ప్రధానమంత్రిగా ఉన్న పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్కు ఎందుకు జాతీయ హోదా ఇవ్వలేదు.. మాదిగల వర్గీకరణ చేయలేదు.. ముదిరాజ్లను ఆదుకోలేదు.. బోయలను ఎస్టీ జాబితాలో చేర్చలేదు? అరుణమ్మ గద్వాలను కదా.. బోయల గురించి ఆమెకు తెలుసుకదా ? వీళ్ల గురించి ఆమె ఎప్పుడైనా మాట్లాడిందా? తుమ్మిళ్ల, ఆర్డీఎస్ పూర్తి చేయాలని చూసిందా? జూరాల నీళ్లు రాకపోతే మాట్లాడిందా? భీమా నెట్టెంపాడు, కోయిల్సాగర్, రామన్పాడు మరమ్మతుల ఆలోచన చేసిందా? కానీ ఆమె మాత్రం బీజేపీలో జాతీయ ఉపాధ్యక్షరాలు పదవి తెచ్చుకుంది. ఆమెకు కర్ణాటకలో వ్యాపారాలకు ఇబ్బంది లేదు. ఏ రోజైనా ఈ జిల్లాకు సంబంధించి హైదరాబాద్–బెంగళూరు హైవేపై పరిశ్రమల కోసం మోదీతో మాట్లాడిందా? ఏ ప్రయత్నం చేయలేదు.. పరిశ్రమలు వస్తే వేలాది మందికి ఉద్యోగాలొచ్చేవి. ఇవి ఆషామాషీ ఎన్నికలు కావు.. ఆలోచన చేయండి. సభలో నాగర్కర్నూల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి మల్లురవి, ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ జిల్లెల చిన్నారెడ్డి, ఢిల్లీలో అధికార ప్రతినిధి ఏపీ జితేందర్ రెడ్డి, మహబూబ్నగర్ జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణ సుధాకర్రెడ్డి, మహబూబ్నగర్ ఎమ్మెల్సీ అభ్యర్థి మన్నె జీవన్రెడ్డి, ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి, వనపర్తి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు రాజుయాదవ్ తదితరులు పాల్గొన్నారు.
Pagination
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- Lok Sabha Election 2024: ఐదో విడత బరిలో..695 మంది
- అ్రస్టాజెనెకా టీకాలు వెనక్కి
- ఐఏఎఫ్ కాన్వాయ్పై దాడి ఘటన..
- చంద్రబాబు ట్రాప్లో షర్మిల, సునీత
- నల్ల ఖజానా గేట్లు తెరచిన బాబు
- ‘సూపర్ సీఎం’ పాండియన్!
- షర్మిలా.. మా బకాయిలిచ్చేయ్!
- Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
- బర్త్ డే స్పెషల్.. విజయ్ దేవరకొండ ఎక్కడ తప్పు చేస్తున్నాడు?
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
Advertisement