-
అందుబాటులో ఉండి అభివృద్ధి చేస్తా
● ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్కలోకేశ్వరం: అందుబాటులో ఉండి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క హామీ ఇచ్చారు. బుధవారం మండల కేంద్రంలోని లక్ష్మి కల్యాణ మండపంలో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం నిర్వహించగా, సీతక్క హాజరై మాట్లాడారు. పిప్రి ఎత్తిపోతల పథకానికి నిధులు మంజూరు చేసి సాగు నీరందించేలా చూస్తానని తెలిపారు. వచ్చే యాసంగి నాటికి అర్లి వంతెన నిర్మాణ పనులు పూర్తి చేస్తానని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తున్నామని చెప్పారు. మాజీ కేంద్రమంత్రి వేణుగోపాలాచారి, మాజీ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు నారాయణ్రావు పటేల్, విఠల్రెడ్డి, డెయిరీ మాజీ చైర్మన్ లోక భూమారెడ్డి, జెడ్పీ మాజీ చైర్మన్ జట్టు అశోక్, నాయకులు ఆనంద్రావు పటేల్, పండరిగౌడ్, ప్రేంనాథ్రెడ్డి, గడ్డం సుదర్శన్రెడ్డి, సాయారెడ్డి, భోజన్న, రత్నాకర్రావు, భుజంగ్రావు, కపిల్, శంకర్ చంద్రే, వినోద్, దత్తు, గంగాధర్, నర్సారెడ్డి, షఫీ, సుధాకర్, శ్రీనివాస్, రాంచందర్రావు, శేఖర్రెడ్డి, ముత్యంరెడ్డి, ముత్తగౌడ్ తదితరులున్నారు. బడి, గుడి అభివృద్ధి బాధ్యత నాదే.. లక్ష్మణచాంద: ఉమ్మడి జిల్లాలోని ప్రతీ గుడి, బడి అభివృద్ధి బాధ్యత తనదేనని మంత్రి సీతక్క హామీ ఇచ్చారు. మండలంలోని రాచపూర్, వడ్యాల్, బాబాపూర్ గ్రామాల్లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణను గెలిపించాలని కోరారు. ఎంపీ అభ్యర్థి సుగుణ మాట్లాడుతూ.. తనను ఎంపీగా గెలిపిస్తే పార్లమెంట్లో ప్రజాసమస్యలపై పోరాడతానని చెప్పారు. డీసీసీ అధ్యక్షుడు శ్రీహరిరావు, పార్టీ మండలాధ్యక్షుడు రాజేశ్వర్, నాయకులు ఈటెల శ్రీనివాస్, రవీందర్రెడ్డి, నరేశ్రెడ్డి, లింగారెడ్డి, రాంరెడ్డి, గంగాధర్గౌడ్, రవి, భీమన్న తదితరులు పాల్గొన్నారు. -
15 రోజుల్లో తీర్పు అమలు చేయండి
● లేకుంటే జైలుకు వెళ్లక తప్పదు ● నిర్మల్ కలెక్టర్, మున్సిపల్ కమిషనర్కు హైకోర్టు హెచ్చరిక సాక్షి, హైదరాబాద్: ఆరోగ్య కార్యకర్తలకు సంబంధించి గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాల ను 15 రోజుల్లోగా అమలు చేయాలని.. లేని పక్షంలో నిర్మల్ కలెక్టర్, మున్సిపల్ క మిషనర్ జైలుకు వెళ్లాల్సి ఉంటుందని హై కోర్టు హెచ్చరించింది. చట్టప్రకారం ఆరోగ్య కార్యకర్తల వేతనాలు చెల్లించాలని కలెక్టర్, కమిషనర్కు హైకోర్టు గతంలో ఆదేశాలు జారీ చేసింది. అయినా వారి ఆ ఆదేశాలు అమలు చేయకపోవడంతో నిర్మల్ జిల్లాకు చెందిన హెల్త్ వర్కర్ వజ్రాదేవితో పాటు మరో 28 మంది పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై వి చారణ చేపట్టిన జస్టిస్ మాధవీదేవి తుది ఉత్తర్వులు వెలువరించారు. ‘నిర్మల్ కలెక్టర్, ము న్సిపల్ కమిషనర్కు చివరి అవకాశం ఇస్తున్నాం. 15 రోజుల్లోగా గతంలో కోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయాలి. ఒకవేళ అమలు చేయని పక్షంలో కలెక్టర్ నెల రోజులు, క మిషనర్ 15 రోజుల పాటు సాధారణ జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. రూ.2వేలు, రూ.వెయ్యి చొప్పున జరిమానా కూడా కట్టా లి. ఒకవేళ జరిమానా చెల్లించకుంటే మరో ప ది రోజులు, వారం చొప్పున కలెక్టర్, కమిషన ర్ సాధారణ జైలు శిక్ష అనుభవించాలి. తప్పు డు సమాచారం ఇచ్చినందుకు కూడా వారు శి క్షకు అర్హులు. దీనిపై వారికి నోటీసులు జారీ చేయాలని రిజిస్ట్రీని ఆదేశిస్తున్నాం. ఈ తీర్పు పై అప్పీల్కు వెళ్లేందుకు కోర్టు సెలవుల కారణంగా రెండు నెలల సమయం ఇస్తున్నాం. అప్పటి వరకు తీర్పు అమలును సస్పెన్షన్లో ఉంచుతున్నాం’ అని తీర్పులో న్యాయమూర్తి పేర్కొన్నారు. -
రుణ పరిమితి ఖరారు
● 124 రకాల పంటలకు వర్తింపు ● ఈసారి స్వల్పంగా పెంపుదల ● ఏటా పెరుగుతున్న పెట్టుబడి ● తగినంతా పెంచలేదన్న రైతులువడ్డీ వ్యాపారుల వద్దకు పరుగులుస్కేల్ ఆఫ్ ఫైనాన్స్లో రుణ పరిమితి ఖరారు చేస్తున్నా రైతులు బ్యాంకుల ద్వారా పూర్తి స్థాయిలో రుణాలు అందుకోలేక పోతున్నారనే ఆరోపణలున్నాయి. దీంతో వారు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించక తప్పడం లేదు. వ్యవసాయం కోసం రైతులకు జిల్లాలో అనుకూల పరిస్థితులున్నా ప్రైవేట్ వ్యక్తుల ద్వారా రుణాలు పొందక తప్పడం లేదు. బ్యాంకుల్లో ప్రధానంగా ప్రభుత్వం రుణమాఫీ ఆశలు చూపుతుండడంతో పాతవి చెల్లించి కొత్తరుణాలు తీసుకుంటే మాఫీ వర్తించదనే అనుమానంతో రైతులు వేచి చూస్తున్నారు. దీంతో రుణాల లక్ష్యం కూడా నెరవేరడం లేదని తెలుస్తోంది.నిర్మల్చైన్గేట్: ఈ ఆర్థిక సంవత్సరం 2024–25కు గాను బ్యాంకర్లు, నాబార్డు వ్యవసాయ రుణ ప్రణాళికను ఖరారు చేశారు. రాష్ట్రస్థాయి సాంకేతిక కమిటీ సిఫారసుల మేరకు రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంక్ పంట రుణ పరిమితిని పెంచింది. రాబోయే వానాకాలం, యాసంగి పంటలకు సంబంధించి 10శాతం వరకు రుణ పరిమితి పెంచింది. దీనిని 124 రకాల పంటలకు వర్తింపజేస్తూ నిర్ణయం తీసుకుంది. కాగా, ఏటేటా పెరుగుతున్న సాగు ఖర్చులకు తగినట్లు రుణ పరిమితి లేదని రైతులు అసంతృప్తి వ్యక్తంజేస్తున్నారు. పంపిణీ లక్ష్యం నెరవేరితేనే.. సాగునీటి కల్పన, వ్యవసాయ యాంత్రీకరణ, పాడి పరిశ్రమ, ఎద్దులు, ఎడ్లబండ్లు భూముల అభివృద్ధి విత్తనోత్పత్తి, సేంద్రియసాగు రుణాలు చాలామంది రైతులకు అందడం లేదు. 2024–25లో జిల్లాలో రైతులకు రుణ ప్రణాళికను నాబార్డు అందించేందుకు నివేదిక విడుదల చేసింది. పంట రుణాలు, వ్యవసాయ అనుబంధ రుణాల పంపిణీ లక్ష్యం చేరుకుంటేనే రైతులకు ఆర్థిక చేదోడుగా ఉంటుంది. బ్యాంకులు పంట రుణ పరిమితిని పెంచి ఇవ్వడంతో పాటు సక్రమంగా చెల్లించిన రైతులకు 30శాతం రుణాన్ని పెంచి ఇచ్చే వీలుంది. జిల్లాలో నూతనంగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొంది ఇదివరకు రుణం పొందనివారు వేలల్లో ఉన్నారు. గత ప్రభుత్వం అమలు చేసిన రూ.లక్ష రుణమాఫీ వర్తించనివారు జిల్లాలో వేల మంది ఉండగా, నూతన ప్రభుత్వం చేయాల్సిన రూ.2లక్షల రుణమాఫీపై అన్నదాతలు ఆశలు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో పంట రుణాలకు కేంద్రం రాయితీ ఇస్తుండగా.. రాష్ట్ర ప్రభుత్వం కూడా వడ్డీ రాయితీని కొనసాగించాలని, ఎప్పటిలాగే వడ్డీ బకాయిని రీయింబర్స్మెంట్గా ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. 4.20 లక్షల ఎకరాల్లో సాగు జిల్లాలో గత వానాకాలంలో 4.20 లక్షల ఎకరాల్లో రైతులు పంటలు సాగుచేశారు. ఇందులో వానాకాలంలో లక్ష ఎకరాల్లో వరి, 1.50 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేస్తున్నారు. ప్రస్తుతం యాసంగి సీజన్లో కొనుగోళ్లు కూడా ప్రారంభమయ్యాయి. మరోవైపు ప్రణాళిక ఖరారు కావడంతో రైతులు రుణాలు పొందడానికి సిద్ధమవుతున్నారు. -
నేటి కార్నర్ మీటింగ్కు కేటీఆర్
భైంసాటౌన్: లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం భైంసాలో నిర్వహించే కార్నర్ మీటింగ్కు హాజరు కానున్నట్లు ఆదిలాబాద్ జెడ్పీ చైర్మన్, ముధోల్ ఎన్నికల ఇన్చార్జి రాథోడ్ జనార్దన్ తెలిపారు. మీటింగ్కు దాదాపు 10వేలకుపైగా జనం హాజరు కానున్నట్లు పేర్కొన్నారు. సాయంత్రం 4 గంటలకు కేటీఆర్ హెలీకాప్టర్ ద్వారా భైంసాకు చేరుకుంటారని, అక్కడి నుంచి పాత పోస్టాఫీస్ వద్ద నిర్వహించే కార్నర్ మీటింగ్లో పాల్గొంటారని తెలిపారు. ఈ మేరకు ముధోల్ నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు విలాస్ గాదేవార్, పీ రమాదేవి, లోలం శ్యాంసుందర్, డాక్టర్ కిరణ్ కొమ్రేవార్తో కలిసి బుధవారం హెలీప్యాడ్ స్థలాన్ని పరిశీలించారు. సాయంత్రం 5 గంటలకు రోడ్షో ప్రారంభమవుతుందని, నియోజకవర్గంలోని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అధికసంఖ్యలో వచ్చి విజయవంతం చేయాలని కోరారు. -
రేపటి వరకు పోస్టల్ బ్యాలెట్కు అవకాశం
భైంసాటౌన్: లోక్సభ ఎన్నికల విధులు నిర్వహించే ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునేందుకు ఈనెల 10వరకు గడువు పెంచారు. ఈనెల 3న పోస్టల్ బ్యాలెట్ ప్రారంభం కాగా, భైంసా ఆర్డీవో కార్యాలయంలో ఓటరు ఫెసిలియేషన్ కేంద్రం ఏర్పాటు చేశారు. భైంసా డివిజన్ పరిధిలో 1,645 మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసుకోగా, బుధవారం వరకు 1,456 మంది ఓటు వినియోగించుకున్నారు. ఇంకా 189 మంది ఓటు వేయాల్సి ఉంది. ఈ నెల 3న 86మంది, 4న 312, 5న 192, 6న 370, 7న 286, 8న 210 మంది ఓటు వినియోగించుకున్నారు. -
నిర్మల్
12వ తేదీలోగా రండి వేసవి సెలవులు కావడంతో జిల్లాకు చెందిన పలువురు టూర్లకు వెళ్లారు. ఈ నెల 13న ఎంపీ ఎన్నికల పోలింగ్ ఉండగా ఒకరోజు ముందే రావాలని అధికారులు సూచిస్తున్నారు.IIIలోuగురువారం శ్రీ 9 శ్రీ మే శ్రీ 2024IIలోu13న వేతనంతో కూడిన సెలవునిర్మల్చైన్గేట్: ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 13న ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థల్లో పని చేసే ఉద్యోగులు, సిబ్బందికి వేతనంతో కూడిన సెలవు మంజూరు చేస్తున్నట్లు జిల్లా ఎన్నికలాధికారి, కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎన్నికల సంఘం ఆదేశాలు తప్పకుండా పాటించాలని, సెలవును సద్వినియోగం చేసుకుని ఓటు వినియోగించుకోవాలని సూచించారు.నిర్మల్: జిల్లాలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారం ‘అసెంబ్లీ’ విజేతలు వర్సెస్ పరాజితులు అన్నట్లుగా సాగుతోంది. మూడు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు, ప్రత్యర్థి పార్టీల నేతలకు ప్రతిష్టాత్మకంగా మారింది. ఎంపీ అభ్యర్థుల కంటే ఎక్కువగా వీరి పోరే సీరియస్గా కనిపిస్తోంది. ఎమ్మెల్యేలు పట్టునిలుపుకొనే ప్రయత్నంలో ఉండగా, తమ ఎంపీ అభ్యర్థిని గెలిపించుకుని అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని ప్రత్యర్థులు ప్రయత్నిస్తున్నారు. మొన్నటి ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీచేసిన వాళ్లు కాంగ్రెస్లో చేరడంతో హస్తం బలం కాస్త పెరిగింది. అదనంగా ఉమ్మడిజిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క అధిక సమయం ఆదిలాబాద్ పార్లమెంట్కే వెచ్చిస్తున్నారు. అందుకే బీజేపీ ఎమ్మెల్యేలు మరింత శ్రమించాల్సి వస్తోంది. నిర్మల్లో పోటాపోటీ.. తమ పార్టీ అభ్యర్థి గోడం నగేశ్ను గెలిపించుకునేందుకు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి నిర్మల్ నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణ తరఫున నిర్మల్ నియోజకవర్గంలో డీసీసీ అధ్యక్షుడు శ్రీహరిరావు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అందరికంటే ముందు ఆయన ప్రచారాన్ని ప్రారంభించారు. ఇటీవల హస్తం పార్టీలో చేరిన మాజీమంత్రి ఇంద్రకరణ్రెడ్డి కూడా మూడు, నాలుగు రోజులుగా ప్రచారవేగాన్ని పెంచారు. జోరుగా చేరికలు చేపడుతూ పల్లెల్లో దూసుకుపోతున్నారు. తన నియోజకవర్గంలో బీజేఎల్పీ నేత మహేశ్వర్రెడ్డి ఈ ఇద్దరు రాజకీయ ఉద్దండులను ఎదుర్కొంటున్నారు. వీరిద్దరినీ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ తేడాతో ఓడించారు. ఇప్పుడు అల్లోల, కూచాడి ఒకే పార్టీ కోసం శ్రమిస్తున్నారు. తమ మధ్య వైరుధ్యమున్నా.. వేర్వేరుగా ప్రచారం చేస్తున్నా.. అధిష్టానం ఆదేశాల మేరకు పార్టీ ఎంపీ అభ్యర్థి గెలుపు కోసం శ్రమిస్తున్నారు. తమ అభ్యర్థిని గెలిపించుకుని ‘ఏలేటి’కి దెబ్బ కొట్టడంతో పాటు పార్టీలో తమ పరపతిని పెంచుకునేందుకూ వారు ప్రయత్నిస్తున్నారు. ఈ ఇద్దరి ప్రచార వేగాన్ని ‘ఏలేటి’ దాటే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ మాజీమంత్రి కాంగ్రెస్లో చేరడంతో బీఆర్ఎస్ తరఫున ప్రచారానికి ఈ స్థాయి ఉన్న నాయకులెవరూ లేకపోవడం గమనార్హం. ముధోల్లో ముగ్గురి మధ్య.. మహారాష్ట్ర సరిహద్దు నియోజకవర్గమైన ముధోల్లో మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ జెండా పాతింది. ఎమ్మెల్యేగా గెలిచిన రామారావుపటేల్ పార్టీ ఎంపీ అభ్యర్థిని గెలిపించుకునేందుకు శాయశక్తులా ప్రయత్నం చేస్తున్నారు. తన బలగాన్ని మొత్తం ప్ర చారంలోకి దింపారు. అసెంబ్లీపోరులో ఆయన చేతి లో ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యేలు విఠల్రెడ్డి, నారాయణరావుపటేల్ ఇద్దరూ ఒకే పార్టీలో ఉన్నా రు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత విఠల్రెడ్డి సీఎం రేవంత్రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. మాజీ ఎమ్మెల్యేలిద్దరూ తమ ప్రత్యర్థి రామారావుపటేల్ను దెబ్బతీసేందుకు పార్లమెంట్పోరులో తీవ్రంగా శ్రమిస్తున్నారు. వీరిద్దరికీ సమన్వయం లేకపోయినా.. ఎవరికి వారు కాంగ్రెస్ గెలుపు కోసమే పనిచేస్తున్నారు. వీరికి అదనంగా ముధోల్ మరో మాజీ ఎమ్మెల్యే, కేంద్ర మాజీమంత్రి వేణుగోపాలాచారి తోడయ్యారు. ఆయన కూడా ఇటీవల కాంగ్రెస్లో చేరారు. ఇలా.. ఇక్కడ ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలను ప్రస్తుత ఎమ్మెల్యే రామారావుపటేల్ ఎదుర్కొంటూ తమ పార్టీ ఎంపీ అభ్యర్థికి మెజార్టీ తీసుకువచ్చేందుకు యత్నిస్తున్నారు.న్యూస్రీల్ ముమ్మరంగా ఎంపీ ఎన్నికల ప్రచారం ఎమ్మెల్యేగా గెలిచిన.. ఓడినోళ్లకు పోటీ పట్టు నిలుపుకొనే పనిలో ఎమ్మెల్యేలు ప్రతీకారం తీర్చుకునేలా పరాజితులు అభ్యర్థులకు మించి జోరుగా ప్రచారం ఖానాపూర్లో మూడుపార్టీలు..జిల్లాలోని నిర్మల్, ముధోల్ నియోజకవర్గాలతో పోలిస్తే ఖానాపూర్లో పరిస్థితి కొంత వేరుగా ఉంది. ఇక్కడ బీఆర్ఎస్ తరఫున కూడా ప్రచారం కొనసాగుతోంది. ఆ పార్టీ నుంచి అసెంబ్లీలో పోటీపడ్డ కేటీఆర్ మిత్రుడు జాన్సన్నాయక్ తమ ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు కోసం ప్రచారం చేస్తున్నారు. మరోవైపు బీజేపీ సీనియర్ నేత రాథోడ్ రమేశ్ కూడా తమ అభ్యర్థి గోడం నగేశ్ కోసం గ్రామగ్రామాన ప్రచారంలో పాల్గొంటున్నారు. వీరిద్దరినీ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించిన ఎమ్మెల్యే వెడ్మబొజ్జు పటేల్ కాంగ్రెస్ పార్టీకి ఈ నియోజకవర్గంతో పాటు జిల్లా వ్యాప్తంగా పనిచేస్తున్నారు. ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్కతో కలిసి బొజ్జుపటేల్ నిర్మల్ జిల్లావ్యాప్తంగా కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణ కోసం ప్రచారం చేస్తున్నారు. ఆయనను దెబ్బకొట్టాలంటే తమ నియోజకవర్గంలో తమ పార్టీ అభ్యర్థులకు మెజార్టీ తీసుకురావాలని రాథోడ్ రమేశ్, జాన్సన్నాయక్ శ్రమిస్తున్నారు. -
రైతులకు ఇబ్బందులు రానివ్వొద్దు
నిర్మల్చైన్గేట్: ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఇ బ్బందులు రానివ్వొద్దని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆ దేశించారు. బుధవారం కలెక్టరేట్లోని తన కార్యాలయంలో ధాన్యం కొనుగోళ్లు, సీఎంఆర్ సరఫరా తదితర అంశాలపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కొనుగోళ్ల ప్రక్రియ నిరంతరం కొనసాగించాలని, ధాన్యం మిల్లులకు తరలించేందుకు అదనపు లారీలు సమకూర్చుకోవాలని సూచించారు. గన్నీ బ్యాగులు, టార్పాలిన్లు, టెంట్లు, తాగునీరు అందుబాటులో ఉంచాలని తెలిపారు. ప్యాడీ క్లీనింగ్ యంత్రాల ద్వారా ధాన్యాన్ని శుభ్రపరిచేలా చూడాలని సూచించారు. అధికారులు క్షేత్ర స్థాయిలో కేంద్రాలను పరిశీలించి రోజువారీ నివేదికలు అందించాలని ఆదేశించారు. విధులను నిర్లక్ష్యం చే స్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. సీఎంఆర్ సరఫరా వేగవంతం చేయాలని సూచించారు. అనంత రం మిలర్ల వారీగా లక్ష్యం, సరఫరా, పెండింగ్ త దితర అంశాలపై చర్చించారు. అదనపు కలెక్టర్ కిశోర్కుమార్, డీఎస్వో నందిత, డీఎం సివిల్ సప్లయీస్ శ్రీకళ, డీసీవో నర్సయ్య, డీఏవో అంజిప్రసాద్, మార్కెటింగ్ ఏడీ అశ్వాక్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ధాన్యం కొనుగోళ్లపై సమీక్ష -
అబద్ధ్దాల్లో కేసీఆర్ను మించిన రేవంత్
● గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ● ఖానాపూర్లో రోడ్షో, కార్నర్ మీటింగ్ ఖానాపూర్: అబద్ధాల్లో మాజీ సీఎం కేసీఆర్ను ప్ర స్తుత సీఎం రేవంత్రెడ్డి మించిపోయారని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ విమర్శించారు. బుధవా రం పట్టణంలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన రోడోషోలో పాల్గొని కార్నర్మీటింగ్లో మాట్లాడా రు. మూడోసారి బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు తొలగిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్షా అన్నట్లు ఆరోపిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న సీఎం రేవంత్కు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన గ్యారంటీలు ఏమయ్యాయో రేవంత్ చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటేనని, దేశాభివృద్ధి, దేశ రక్షణకు మూడోసారి మోదీ ని ప్రధానిగా గెలిపించాలని కోరారు. దేశంలో బీజేపీ గెలిచే సీట్లలో ఆదిలాబాద్ కూడా ఉంటుందని ధీమా వ్యక్తంజేశారు. ఎంపీ అభ్యర్థి గోడం నగేశ్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఏ బూత్లో ఎక్కువ ఓట్లు వస్తే వారిని తానే స్వయంగా సన్మానిస్తానని చెప్పారు. ‘పాకిస్థాన్ దగ్గర ఆటంబాంబు’ అంటూ కశ్మీర్ మాజీ సీఎం ఫారూక్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలు దురదృష్టకరమన్నారు. ప్రతీ భారత పౌరుడు అనుబాంబుతో సమానమని హెచ్చరించారు. పాకిస్థాన్ గురించి గొప్పగా చెప్పే కాంగ్రెస్ నాయకులు ఈ దేశంలో ఉండడం అవసరమా? అని ప్రశ్నించారు. అనంతరం నాయకులు రాజాసింగ్ను సన్మానించారు. ఎంపీ అభ్యర్థి గోడం నగేశ్, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు అంజుకుమార్రెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకుడు రితీశ్ రాథోడ్, నాయకులు అంకం మహేందర్, ఆకుల శ్రీనివాస్, నాయిని సంతోష్, తోకల బుచ్చన్న, టేకు ప్రకాశ్ తదితరులున్నారు. -
‘ఉపాధి’ పథకం కూలీలకు వరం
కుంటాల: ఉపాధిహామీ పథకం కూలీలకు వ రంలా మారిందని డీఆర్డీవో విజయలక్ష్మి పేర్కొన్నారు. మండల వ్యాప్తంగా ఏప్రిల్ 2023 నుంచి 2024 మార్చి 31 వరకు రూ.4 కోట్లతో చేపట్టిన పనులపై 14వ సామాజిక తనిఖీలో భా గంగా ఐకేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎన్నికల నిబంధనలు పాటిస్తూ ఆమె మాట్లాడారు. కూలీలకు ఉపాధి కల్పించడంలో రాష్ట్రంలోనే జిల్లా అగ్రగామిగా నిలిచిందని తెలిపారు. జిల్లాలో కుంటాల మండలం ముందంజలో ఉందని పేర్కొన్నారు. ఏపీవో గ ట్టుపల్లి నవీన్, సిబ్బందిని అభినందించారు. వే సవి దృష్ట్యా పని ప్రదేశాల్లో కూలీలకు అన్ని సౌ కర్యాలు కల్పించాలని సూచించారు. సామాజి క తనిఖీలో ఎలాంటి అక్రమాలు జరగలేదని, ఇది సిబ్బంది పనితీరుకు నిదర్శనమని ప్రశంసించారు. ఎంపీడీవో అబ్దుల్ రహీం, హెచ్ఆర్ మేనేజర్ సుధాకర్, ఎస్సార్పీ భగవంత్రావు, ఏపీవో గట్టుపల్లి నవీన్, సిబ్బంది పాల్గొన్నారు. కొనుగోలు కేంద్రాల పరిశీలన లింబా (బీ) గ్రామంలోని ఐకేపీ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని డీఆర్డీవో విజయలక్ష్మి ప రిశీలించి నిర్వాహకులకు పలు సూచనలు చేశా రు. లింబా (కే)లోని మోడల్ పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించారు. వసతులు కల్పించి, పచ్చని తోరణాలు కట్టి ఓటర్లను ఆహ్వానించాలని ఆదేశించారు. అమ్మ ఆదర్శ పాఠశాలల పనులు వేగవంతం చేయాలని సూచించారు. ఎంపీడీవో అబ్దుల్ రహీం, హెచ్ఆర్ మేనేజర్ సుధాకర్, ఏపీఎం అశోక్, పంచాయతీ కార్యదర్శి గంగాప్రసాద్, సీసీ యూసఫ్ తదితరులున్నారు. -
No Headline
సోన్: మాదాపూర్ జెడ్పీ హైస్కూల్లో 2003–2004 బ్యాచ్ పదో తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని బుధవారం నిర్వహించారు. ఉద్యోగ, ఉపాధి, వ్యాపార నిమిత్తం వివిధ ప్రాంతాల్లో స్థిరపడ్డవారంతా పాఠశాలలో కలుసుకున్నారు. పాఠశాలలో చదవిన జ్ఞాపకాలను నెమరువేసుకుని రోజంతా సరదాగా గడిపారు. ఆప్యాయంగా పలకరించుకుని ఒకరి యోగక్షేమాలు ఒకరు తెలుసుకున్నారు. అప్ప టి గురువులను ఆహ్వానించి సన్మానించారు. అనంతరం నృత్యాలు చేసి ఆనందంగా గడిపారు. అప్ప టి ఉపాధ్యాయులు పోశెట్టి, సదానందం, రమేశ్, శంకర్, వేణుమాధవ్, సుధార్సింగ్ పాల్గొన్నారు. -
కొత్త రుణ ప్రణాళిక ఇలా..
వరి సాగు చేసే రైతులకు ఎకరాకు రూ.43 వేల నుంచి రూ.45వేలకు రుణపరిమితి పెంచారు. శ్రీవరికి రూ.36 వేల నుంచి రూ.38 వేలకు, విత్తన వరికి రూ.48 వేల నుంచి రూ.50 వేలకు పెంపు చేశారు. జొన్నకు రూ.18 వేల నుంచి రూ.20 వేల వరకు, సజ్జకు రూ.15 వేల నుంచి రూ.17 వేలకు పెంచారు. మక్కకు రూ.32 వేల నుంచి రూ.34 వేలు, కందికి రూ.22 వేల నుంచి రూ.24 వేలు, మినుముకు రూ.19 వేల నుంచి రూ.21 వేలకు, పెసరకు రూ.20 వేల నుంచి రూ.22 వేలకు పెంచేశారు. వేరుశనగకు రూ.28 వేల నుంచి రూ.30 వేలు, నువ్వుకు రూ.19 వేల నుంచి రూ.21 వేలకు, పత్తికి రూ.44 వేల నుంచి రూ.46 వేలకు, చెరుకుకు రూ.82 వేల నుంచి రూ.84 వేలకు, అరటికి రూ.95 వేల నుంచి రూ.97 వేలకు పెంచారు. కూరగాయలకు రూ.33 వేల నుంచి రూ.66 వేల వరకు, మామిడికి రూ.42 వేల నుంచి రూ.44 వేలకు, జామకు రూ.45 వేల నుంచి రూ.47 వేలకు పెంచేశారు. పూల మొక్కలకు రూ.50 వేల నుంచి రూ.62 వేలకు, మిద్దె తోటలకు రూ.30 వేల నుంచి రూ.33వేల వరకు పెంచారు. -
‘బీఆర్ఎస్, కాంగ్రెస్ మోసగించాయి’
భైంసాటౌన్: బీఆర్ఎస్, కాంగ్రెస్ మాదిగలను మోసం చేశాయని ఎమ్మార్పీఎస్ జాతీయ ఉపాధ్యక్షుడు రేగుంట కేశవ్ మాదిగ ఆరోపించారు. మంగళవారం పట్టణంలోని ఎస్ఎస్ కాటన్లో మాట్లాడుతూ.. పెద్దపల్లి, నాగర్కర్నూల్, వరంగల్ పార్ల మెంట్ స్థానాలు ఎస్సీ రిజర్వ్డ్ అయినప్పటికీ నేతలు కాంగ్రెస్ టికెట్ ఇవ్వకుండా అన్యాయం చేశారని ఆరోపించారు. గతంలో కేంద్రం, రాష్ట్రంలో అధికా రంలో ఉన్నా వర్గీకరణ చేయకుండా ఓటు బ్యాంక్ కోసమే వాడుకున్నారని ఆరోపించారు. మందకృష్ణ మాదిగను మాజీ సీఎం కేసీఆర్ జైలుకు పంపి ఇబ్బందులకు గురి చేశారని గుర్తు చేశారు. ఎమ్మార్పీఎస్ లక్ష్యం వర్గీకరణ, అది బీజేపీతోనే సాధ్యమని పేర్కొన్నారు. మాదిగలమంతా లోక్సభ ఎన్నికల్లో బీజేపీకే ఓటు వేస్తామని తెలిపారు. ఆయన వెంట జాతీయ కార్యదర్శి నందకుమార్, నాయకులు గడ్డం తుకారాం, కత్తిబాబు, అంబేకర్ సాయిచరణ్, గంగాధర్, రాములు, సాయినాథ్, శివ తదితరులు పాల్గొన్నారు. -
కరాటేలో శ్రీదేవికి బ్లాక్బెల్ట్
కడెం: మండలంలోని నవాబ్పేట్ గ్రామానికి చెందిన కొమురవెల్లి సిరిచందన–రమేశ్ దంపతుల కూతురు శ్రీదేవి కరాటేలో బ్లాక్బెల్ట్ సాధించింది. మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ చదివిన శ్రీదేవి పదేళ్లుగా ఒకినావ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఇన్స్ట్రక్టర్ భూమేశ్ ఆధ్వర్యంలో కరాటేలో శిక్షణ పొందింది. ఈ నెల 5వ తేదీన కరీంనగర్లో నిర్వహించిన కార్యక్రమంలో ప్రతిభ కనబరిచి ఒకినావ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ డిప్యూటీ గ్రాండ్ మాస్టర్ షిహాన్ కే వసంత్ చేతుల మీదుగా బ్లాక్బెల్ట్, సర్టిఫికెట్ అందుకుంది. -
రేపు భైంసాలో కేటీఆర్ రోడ్షో
భైంసాటౌన్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈనెల 9న భైంసాకు రానున్నారని ఆదిలాబాద్ జెడ్పీ చైర్మన్, ముధోల్ ఎన్నికల ఇన్చార్జి రాథోడ్ జనార్దన్ తెలిపారు. మంగళవారం పట్టణంలో నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులతో ఆయన విలేకరులతో మాట్లాడారు. గురువారం సాయంత్రం 5గంటలకు పట్టణంలోని పాత పోస్టాఫీస్ ప్రాంతంలో కేటీఆర్ రోడ్షోలో భాగంగా కార్నర్ మీటింగ్లో పాల్గొంటారని పేర్కొన్నారు. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. సమన్వయ కమిటీ సభ్యులు పీ రమాదేవి, విలాస్ గాదేవార్, కిరణ్ కొమ్రేవార్, లోలం శ్యాంసుందర్ ఉన్నారు. -
భక్తి మార్గంలో నడవాలి
లోకేశ్వరం: ప్రతి ఒక్కరూ భక్తి మార్గంలో నడవాలని అఖిల భారత హనుమద్దీక్షా పీఠాధిపతి దుర్గాప్రసాద్ స్వామీజీ సూచించారు. మంగళవారం మండలంలోని గడ్చాంద, ధర్మోర గ్రామాల్లోని హనుమాన్ మందిరాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా గ్రామాల్లో ఊరేగింపుతో స్వామీజీకి భక్తులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా దుర్గాప్రసాద్ స్వామిజీ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ గోవులను రక్షించి పూజించాలని సూచించారు. హనుమాన్ మాలలు ధరించే భక్తులు నియమనిష్టలతో ఉండాలన్నారు. ధర్మోరలో హనుమాన్ మందిరాన్ని నిర్మించే స్థలాన్ని స్వామీజీ పరిశీలించారు. కిష్టాపూర్ హనుమాన్ గురుస్వామి నర్సాగౌడ్, హనుమాన్ మందిర నిర్మాణ పూజారి హన్మంత్రెడ్డి, వైస్ ఎంపీపీ మామిడి నారాయణ్రెడ్డి, హనుమాన్ మందిర నిర్మాణ కమిటీ సభ్యులు రమేశ్గౌడ్, సాయాగౌడ్, సంజీవ్రెడ్డి, బాజన్న, భూమయ్య, భూమన్న, భైండ్ల సాయన్న, నవీన్, భోజన్న, భూమేశ్, నాయకులు భూమగౌడ్, నర్సాగౌడ్, అనిల్, శ్రీధర్, భోజారెడ్డి, సాయన్న, ముత్యంరెడ్డి, మోహన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
‘కాంగ్రెస్, బీజేపీ మాటలు నమ్మొద్దు’
తానూరు: కాంగ్రెస్, బీజేపీ నాయకుల మాటలు నమ్మి మోసపోవద్దని మాజీ మంత్రి జోగు రామన్న పిలుపునిచ్చారు. మంగళవారం మండల కేంద్రంలోని కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొని మాట్లాడారు. హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వాటిని అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. పెట్టుబడి సాయం అందక రైతులు ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. ఇప్పటివరకు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపట్టలేదని విమర్శించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి చేసిన మేలు ఏమీ లేదని తెలిపారు. రామమందిరంపై ఓట్లడగడం సరికాదని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.కోట్లు ఖర్చు చేసి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆలయాలు నిర్మాణాలు చేపట్టినా ఇప్పటివరకు తాము దేవాలయాల పేర్లు చెప్పి ఓట్లు అడగలేదని పేర్కొన్నారు. బీఆర్ఎస్ తరఫున ఆదిలాబాద్ ఎంపీ బరిలో ఉన్న అత్రం సక్కుకు రెండుసార్లు ఎమ్మెల్యేగా పని చేసిన అనుభవం ఉందని తెలిపారు. అతడిని ఎంపీగా గెలిపిస్తే పార్లమెంట్లో సమస్యలు పరిష్కరిస్తారని పేర్కొన్నారు. పార్టీ కార్యకర్తలు గ్రామాల్లో ప్రచారం నిర్వహించి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి అత్రం సక్కును భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. బీఆర్ఎస్ కోఆర్డినేటర్లు డాక్టర్ రమాదేవి, డాక్టర్ కిరణ్ కోమ్రేవార్, లోలం శ్యాంసుందర్, విలాస్ గాదేవార్, నాయకులు విష్ణువర్ధన్రెడ్డి, గజానంద్, గంగాధర్, లక్ష్మణ్, లచ్చన్న తదితరులు పాల్గొన్నారు. -
తలసేమియా.. ప్రాణాంతకం!
తలసేమియా ప్రాణాంతక వ్యాధి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రెండు వేలకు పైగా వ్యాధిగ్రస్తులున్నారు. 15రోజులకోసారి వీరికి రక్తం ఎక్కించకుంటే ప్రమాదమే.. IIలోuఅంతా వ్యంగ్యమే.. రాజకీయ నేతల ప్రసంగాలతోపాటు సోషల్ మీడియా పోస్టుల్లోనూ ప్రచారశైలి మారిపోయింది. ప్రతీ అంశాన్ని వివాదాస్పదం చేసి, ఓటర్లలో చర్చనీయాంశంగా మార్చాలన్న తీరు కనిపిస్తోంది. ఒకప్పుడు ప్రత్యర్థి పార్టీలపై ఆరోగ్యకరమైన విమర్శలు చేసేవాళ్లు. కానీ.. ఇప్పుడు నేరుగా అభ్యంతరకరమైన, వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న తీరు పెరుగుతోంది. ఏదిఏమైనా జనాల్లోకి చొచ్చుకు వెళ్లాలన్న లక్ష్యంతో నేతలు హద్దు మీరి మాట్లాడుతున్నారు. జిల్లాలో ప్రస్తుతం పార్టీల మధ్య ప్రచారతీరు అలాగే ఉంది. నేతలను మించి కార్యకర్తలు, అభిమానులు సామాజిక మాధ్యమాల్లో చేస్తున్న వ్యాఖ్యలు వివాదాస్పదంగా ఉంటున్నాయి. -
No Headline
నిర్మల్ జిల్లాలో.. ● నిర్మల్ ఎమ్మెల్యేగా బీజేపీ అభ్యర్థి ఏలేటి మహేశ్వర్రెడ్డి బీఆర్ఎస్కు చెందిన మాజీ మంత్రి ఇంద్రకరణ్రెడ్డిపై గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థి శ్రీహరిరావు ఇక్కడ మూడో స్థానంలో నిలిచారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఇక్కడ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ప్రస్తుతం మాజీ మంత్రి ఐకే రెడ్డి కాంగ్రెస్లో ఉన్నారు. కొంత మంది ద్వితీయ శ్రేణి నాయకులు కూడా హస్తం గూటికి చేరారు. కాగా, బీజేపీలోకి జెడ్పీ మాజీ చైర్పర్సన్ శోభ సత్యనారాయణ గౌడ్ దంపతులు చేరారు. బీజేఎల్పీ నేతగా ఉన్న మహేశ్వర్రెడ్డి అసెంబ్లీ ఎన్నికల నాటి ప్రభావం ఈ నియోజకవర్గంలో తీసుకురావాల్సిన బాధ్యత ఉంది. దీంతో ఆయన ప్రచారంలో వేగం పెంచారు. ● ముధోల్ ఎమ్మెల్యేగా బీజేపీ అభ్యర్థి రామారావు పటేల్ బీఆర్ఎస్ అభ్యర్థి విఠల్రెడ్డిపై గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థి నారాయణరావు పటేల్ మూడో స్థానంలో నిలిచారు. ఆ ఎన్నికల తర్వాత ప్రస్తుతం ఈ నియోజకవర్గంలో భారీగా మార్పులు చోటుచేసుకున్నాయి. కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాలాచారి, మాజీ ఎమ్మెల్యే విఠల్రెడ్డి కాంగ్రెస్లో చేరారు. ఇక్కడ ముధోల్ బీజేపీ ఎమ్మెల్యే రామారావు పటేల్కు ప్రతిష్టాత్మకంగా మారింది. తన ప్రత్యర్థులంతా కాంగ్రెస్లో కలవడంతో ఇప్పుడు ఆయన ఈ ఎన్నికలను సవాల్గా తీసుకోవాల్సిన పరిస్థితి. ● ఖానాపూర్ ఎమ్మెల్యేగా కాంగ్రెస్ అభ్యర్థి వెడ్మ బొజ్జు బీఆర్ఎస్ అభ్యర్థి భుక్యా జాన్సన్ నాయక్పై గెలుపొందారు. బీజేపీ అభ్యర్థి రాథోడ్ రమేశ్ మూడో స్థానంలో నిలిచారు. ఇక్కడ బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పైడిపల్లి రవీందర్రావు ఇటీవలే కాంగ్రెస్లో చేరారు. కాగా ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిన ఏకై క నియోజకవర్గం ఇదే. దీంతో ఈ ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి పార్టీ అభ్యర్థి ఆత్రం సుగుణకు మంచి మెజార్టీ తీసుకురావాల్సిన బాధ్యత ఎమ్మెల్యే బొజ్జుపై ఉంది. -
ప్రతి ఒక్కరూ ఓటు వేయాలి
● కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ● స్వీప్ ఆధ్వర్యంలో 5కే రన్నిర్మల్చైన్గేట్: ఈ నెల 13న నిర్వహించనున్న పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని జిల్లా ఎన్నికలాధికారి, కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ కోరారు. జిల్లాలో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు, ఓటర్లకు అవగాహన కల్పించేందుకు మంగళవారం స్వీప్ ఆధ్వర్యంలో స్థానిక ఆర్డీవో కార్యాలయం నుంచి నిర్వహించిన 5కే రన్ను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఆర్డీవో కార్యాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీ బస్టాండ్ సమీపంలోని అంబేద్కర్ చౌక్ వరకు కొనసాగింది. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ.. ఓటు రాజ్యాంగం కల్పించిన గొప్ప వరమని పేర్కొన్నారు. గత ఎన్నికల్లో గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణ ప్రాంతాల్లో తక్కువ ఓటింగ్ నమోదైందని తెలిపారు. ఈ ఎన్నికల్లో పట్టణ ప్రాంత ఓటర్లంతా ఓటు వినియోగించుకుని వందశాతం పోలింగ్ నమోదయ్యేలా కృషి చేయాలని సూచించారు. ఇప్పటికే జిల్లాలో ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చెప్పారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పోలింగ్ కేంద్రాల వద్ద టెంట్లు, తాగునీరు, బెంచీలు, అత్యవసర మందులు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, వైద్య సిబ్బంది, దివ్యాంగుల కోసం వీల్ చైర్లు, ర్యాంప్ తదితర సౌకర్యాలు కల్పించనున్నట్లు వివరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిశోర్కుమార్, డీఆర్వో భుజంగ్రావ్, డీఆర్డీవో విజయలక్ష్మి, డీఈవో రవీందర్రెడ్డి, డీపీఆర్వో విష్ణువర్ధన్, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఇంట గెలువాలె
● ఎమ్మెల్యేలకు ప్రతిష్టాత్మకంగా పార్లమెంట్ ఎన్నికలు ● ప్రచారంపై దృష్టి పెట్టిన ప్రజాప్రతినిధులు ● అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాత మారిన పరిస్థితులు ● అధికార కాంగ్రెస్లో చేరికలు ప్రభావం చూపేనా..?కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో.. ● ఆసిఫాబాద్ ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ అభ్యర్థి కోవ లక్ష్మి కాంగ్రెస్ అభ్యర్థి అజ్మీరా శ్యామ్నాయక్పై గెలుపొందారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థి మూడో స్థానంలో నిలిచారు. ఈ నియోజకవర్గంలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత పెద్దగా మార్పులు చేర్పులు జరగలేదు. అయితే బీఆర్ఎస్ అభ్యర్థి సక్కుకు ఇక్కడినుంచి మంచి మెజార్టీ కల్పించిన పక్షంలో అది ఉపయుక్తంగా ఉంటుందనేది పార్టీ భావన. ఈ నేపథ్యంలో కోవ లక్ష్మి మరింత శ్రమించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ● సిర్పూర్ ఎమ్మెల్యేగా బీజేపీ అభ్యర్థి పాల్వాయి హరీశ్బాబు బీఆర్ఎస్ అభ్యర్థి కోనేరు కోనప్పపై గెలుపొందారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత కోనప్ప కాంగ్రెస్లో చేరగా ఇక్కడ ఆ పార్టీ పటిష్టమైంది. బీఆర్ఎస్ మరో నేత అరిగెల నాగేశ్వర్రావు కూడా హస్తం గూటికి చేరారు. ఈ నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యే హరీశ్బాబు పార్టీ అభ్యర్థి నగేశ్కు మంచి మెజార్టీ సాధించేందుకు గట్టిగా కృషి చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.సాక్షి,ఆదిలాబాద్: పార్లమెంట్ సెగ్మెంట్లో పార్టీ గెలుపు ఒక లెక్క అయితే.. తమ నియోజకవర్గంలో అభ్యర్థికి అత్యధిక ఓట్లు సాధించడం మరో లెక్క. ఎమ్మెల్యేలకు ఇది ప్రతిష్టాత్మకంగా మారింది. దీంతో తమ నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు ఆదరించినట్టే ఇప్పుడు తమ పార్టీకి వెన్నంటి నిలుస్తారా.. లేకపోతే పరిస్థితులు ఎలా ఉంటాయోనని ఆలోచన చేస్తున్నారు. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో శాసనసభ ఎన్నికల నాటికి, ఇప్పటికీ పరిస్థితులు మారాయి. ప్రధానంగా అధికార కాంగ్రెస్లో చేరికలు పెరిగాయి. ఆ ప్రభావం ఏ విధంగా ఉంటుందనేది ఈ ఎన్నికల్లో స్పష్టం కానుంది. ఆదిలాబాద్ జిల్లాలో.. ●అసెంబ్లీ ఎన్నికల్లో ఆదిలాబాద్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి పాయల్ శంకర్ బీఆర్ఎస్ అభ్యర్థి రామన్నపై గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థి కంది శ్రీనివాసరెడ్డి మూడో స్థానంలో నిలిచారు. ప్రస్తుతం ఆయన్నే ఆ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జిగా కొనసాగుతున్నారు. ఇదిలా ఉంటే ఈ నియోజకవర్గంలో పార్టీని మరింత పటిష్టం చేయాలని అధిష్టానం ఆలోచించినప్పటికీ చేరికల విషయంలో కాంగ్రెస్ అసమ్మతి నాయకులు సుజాత, సాజిద్ ఖాన్, సంజీవ్రెడ్డి కి భంగపాటు ఎదురైంది. అయినప్పటికీ తాజాగా కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణకు మద్దతుగా ప్రచారం చేస్తామని వారు ప్రకటించారు. ఇక బీజేపీ పార్లమెంట్ ఎన్నికల్లో అప్పటి మాదిరి ఓట్లు గడించాలని ఎమ్మెల్యే శంకర్ గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు. అది ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాల్సిందే. ● బోథ్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా అనిల్ జాదవ్ బీజేపీ అభ్యర్థి సోయం బాపూరావుపై గెలుపొందారు. ఇక్కడ కూడా కాంగ్రెస్ అభ్యర్థి ఆడే గజేందర్ మూడో స్థానంలో నిలిచారు. ఆయనే నియోజకవర్గ ఇన్చార్జిగా కొనసాగుతున్నారు. కాగా, బీఆర్ఎస్కు చెందిన బోథ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, డాక్టర్ వన్నెల అశోక్ ఇటీవల కాంగ్రెస్లో చేరారు. ఏఐసీసీ సభ్యుడు నరేశ్ జాదవ్, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ కూడా ప్రచారంలో పాల్గొంటున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఈ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి ఆత్రం సక్కుకు మంచి మెజార్టీ ఇప్పించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. -
నిర్మల్
బుధవారం శ్రీ 8 శ్రీ మే శ్రీ 2024నేడు బీజేపీ బైక్ ర్యాలీ ఖానాపూర్: స్థానిక సాయిబాబా ఆలయం నుంచి బస్టాండ్ వరకు బుధవారం సాయంత్రం 4 గంటలకు చేపట్టనున్న బైక్ ర్యాలీ, అనంతరం నిర్వహించనున్న కార్నర్ మీటింగ్ను విజయవంతం చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు అంజుకుమార్రెడ్డి, రాష్ట్ర నాయకుడు రితీశ్రాథోడ్ కోరారు. బీజేపీ నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కార్యక్రమాలకు హాజరు కానున్నట్లు పేర్కొనారు. మంగళవారం పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో వారు విలేకరులతో మాట్లాడారు. పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ గెలుపే లక్ష్యంగా పని చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులతో కలిసి కార్నర్మీటింగ్ స్థలాన్ని పరిశీలించారు. వారి వెంట పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి సామ రాజేశ్వర్రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ అంకం మహేందర్, పట్టణాధ్యక్షుడు నాయిని సంతోష్, నాయకులు ఆకుల శ్రీనివాస్, రవీందర్రెడ్డి, బుచ్చన్న, మల్లయ్య, శ్రీనివాస్, రమేశ్, రవి తదితరులున్నారు. నిర్మల్: సమయం దగ్గర పడుతున్న కొద్దీ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో వేగం పెరుగుతోంది. ఓటర్ల వద్దకు విస్తృతంగా చేరేందుకు పార్టీలు పలురకాలుగా ప్రయత్నిస్తున్నాయి. ప్రతీ ఓటరును చేరేలా సోషల్మీడియాను వాడుకుంటున్నాయి. ఇటీవల పలు ఘటనలతో సామాజిక మాధ్యమాల్లో పార్టీల మధ్య వాడీవేడిగా మాటలయుద్ధం కొనసాగుతోంది. తాజాగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్సభలో ఆ పార్టీ నేతల ప్రసంగాల తీరుపై జిల్లాలో సోషల్మీడియా వేదికగా బీజేపీ ఆరోపణలు, కాంగ్రెస్ ప్రత్యారోపణల పోరు నడుస్తోంది. హీటెక్కిస్తున్న మాటలు ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో జాతీయ పార్టీల మధ్య పోటాపోటీగా ప్రచారపర్వం సాగుతోంది. ఓటర్లను ఆకట్టుకునేందుకు ఏ చిన్న అంశాన్నీ వదులుకోవడం లేదు. ఎదుటి పార్టీ ఏమాత్రం నోరుజా రినా.. ప్రత్యర్థి పార్టీ ఎదురుదాడి చేస్తోంది. తాజా గా ఆదివారం నిర్మల్లో నిర్వహించిన రాహుల్గాంధీ సభలో కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ చేసిన ప్రసంగంలో చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఆయన మాటలపై బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేస్తోంది. పార్టీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు రాచకొండ సాగర్ నిర్మల్ పట్టణ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో దయాకర్పై కేసు కూడా నమోదైంది. మరోవైపు అద్దంకి దయాకర్ చేసిన వ్యాఖ్యలు సోషల్మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిపై అద్దంకి దయాకర్ క్లారిటీ ఇచ్చినప్పటికీ ఆయనపై కామెంట్లు మాత్రం తగ్గడం లేదు. మరోవైపు బీజేపీ పోస్టులపై కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులూ ప్రతికామెంట్లు పెడుతున్నారు. గత ఎన్నికల్లో కేసులు.. సామాజిక మాధ్యమాల్లో వివిధ పార్టీల కార్యకర్తలు పెడుతున్న సందేశాలు చాలాసార్లు వివాదాస్పదం అవుతున్నాయి. సాధారణ సమయాల్లో పెద్దగా పట్టించుకోకపోయినప్పటికీ ఎన్నికల సమయంలో ప్రత్యర్థి పార్టీల నాయకులు సీరియస్గా తీసుకుంటున్నారు. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికలు, అంతకుముందు ఎన్నికల్లోనూ ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు సామాజిక మాధ్యమాల్లో పెట్టిన సందేశాలు వివాదాస్పదం కావడంతో, ప్రత్యర్థులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సదరు వ్యక్తులపై కేసులు కూడా నమోదయ్యాయి. సామాజిక మాధ్యమాల్లో వచ్చిన సందేశాలపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదులూ చేసిన సందర్భాలున్నాయి. పార్టీలకు సంబంధం ఉన్న వారితో పాటు సంబంధం లేని వారూ కేసుల్లో ఇరుక్కున్న పరిస్థితి అసెంబ్లీ ఎన్నికల్లో కనిపించింది. న్యూస్రీల్ రాజకీయ పార్టీల మధ్య తీవ్ర పోరు సామాజిక మాధ్యమాల్లో అదేతీరు నోరుజారుతున్న నేతలపై పోస్టులు హద్దు మీరుతున్నవారిపై కామెంట్లు ప్రత్యేక దృష్టి సారించిన అధికారులు -
విధులు బహిష్కరించిన న్యాయవాదులు
నిర్మల్టౌన్: ఖానాపూర్కు చెందిన న్యాయవాదిపై ఇద్దరు దుండగులు శుక్రవారం హత్యా ప్రయత్నం చేశారు. ఈ ఘటనను ఖండిస్తూ.. నిర్మల్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు సోమవారం విధులు బహిష్కరించారు. న్యాయవాదుల పరిరక్షణ చట్టం తేవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మహేందర్, ఉపాధ్యక్షురాలు కవితారెడ్డి, లైబ్రరీ సెక్రటరీ అర్చన, న్యాయవాదులు శ్యాంసుందర్రెడ్డి, నూనె గంగాధర్, రమణారావు, నరేందర్, మధుకర్, రాజు, సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు. న్యాయవాదికి పరామర్శ ఖానాపూర్: పట్టణంలోని శివాజీనగర్ కాలనీకి చెందిన సీనియర్ న్యాయవాది వెంకట్మహేంద్రపై శుక్రవారం దాడి జరిగింది. బాధిత న్యాయవాదిని మంచిర్యాలబార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం పరామర్శించారు. పట్టణంలోని వెంకటమహేంద్ర నివాసానికి వచ్చి దాడికి కారణాలను అడిగి తెలుసుకున్నారు. న్యాయవాదిపై దాడిని ఖండించారు. దాడులను ప్రభుత్వం అరికట్టాలని కోరారు. పరామర్శించిన వారిలో బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జగన్, ప్రధాన కార్యదర్శి మురళీకృష్ణ, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రటరీ సంతోష్గౌడ్, ఖానాపూర్ బార్ అసోసియేషన్ చైర్మన్ మంత్రరాజం సురేష్, మంచిర్యాల జిల్లా కార్యవర్గ సభ్యులు పీసర శ్రీకాంత్, ప్రదీప్చంద్ర తదితరులు ఉన్నారు. -
ఆత్రం సుగుణ గెలుపు ఖాయం
నిర్మల్చైన్గేట్: ఆదిలాబాద్ ఎంపీగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆత్రం సుగుణ భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని డీసీసీ అధ్యక్షుడు శ్రీహరిరావు అన్నారు. సారంగాపూర్ మండలం జెండానగర్కు చెందిన ప లువురు శ్రీహరిరావు సమక్షంలో సోమవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి కండువాలు కప్పి పా ర్టీలోకి ఆహ్వానించారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతీ పేదవాడికి సంక్షేమ పథకాలు అమలు చేయడంలో ముందుందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చామని, ఇప్పుడు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కేంద్రంలో అధికారంలోకి రావడానికి సమష్టిగా కృషిచేద్దామన్నారు. ఎన్నికలకు మరో ఏడు రోజుల గడువు ఉందని ప్రతీ కార్యకర్త ఆత్రం సుగుణ గెలుపు కోసం కష్టపడి పనిచేయాలని సూచించారు. ఇంటింటికీ వెళ్లి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ మతతత్వ విధానాలు వివరించాలన్నారు. పార్టీ మండల అధ్యక్షుడు బొల్లోజి నర్సయ్య , మాజీ ఏఎంసీ చైర్మన్ రాజ్మహమ్మద్, శ్రీనివాస్రెడ్డి, రవీందర్రెడ్డి, విలాస్రావ్, సలీం, భూమన్న పోతన్న గంగాధర్, మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పొల్గొన్నారు. -
మోదీ పాలనలోనే దేశం అభివృద్ధి
సారంగపూర్: ప్రధాని నరేంద్రమోదీ పాలనలోనే దేశం అన్నిరంగాల్లో అభివృద్ధి చెందిందని బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డి అన్నారు. మండలంలోని జామ్, చించోలి(బి)గ్రామాల్లో సోమవారం ఉపాధిహామీ కూ లీలను కలిసి ఎన్నికల ప్రచారం చేశారు. పదేళ్ల ప్రస్థానంలో నరేంద్రమోదీ ఎలాంటి అవినీతికి తావులేకుండా పాలన సాగించారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పదేళ్లు అఽధికారంలో ఉన్న బీఆర్ఎస్గానీ, ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్గానీ ఎలాంటి అభివృద్ధి చేయలేదని దుయ్యబట్టారు. ఉపాధిహామీ పథకం నిర్వరా మంగా అమలు చేస్తూ కూలీలకు బాసటగా నిలిచిన ఏకైక ప్రభుత్వం బీజేపీ అని పేర్కొన్నా రు. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే యువకులు, రైతులు, మహిళలు, కూలీలు, ఇలా అన్నివర్గాల వారికి ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. దేశవ్యాప్తంగా పలు సంక్షేమ పథకాలు అమలు చేసేందుకు ప్రణాళిక రూపొందించామని పేర్కొన్నారు. కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి ఎంపీగా గోడం నగేశ్ను గెలిపించాలని కోరారు. ప్రచారంలో నాయకులు సత్యనారాయణగౌడ్, విలాస్, చంద్రప్రకాశ్గౌడ్, మంతెన గంగారెడ్డి, రాంశంకర్రెడ్డి, చెన్న రాజేశ్వర్, శ్రావణ్కుమార్, సాహెబ్రావు, పోతన్న, తిరుమలాచారి, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. -
సప్లిమెంటరీ ర్యాండమైజేషన్
పారదర్శకంగా ఈవీఎంల నిర్మల్చైన్గేట్: ఈవీఎంల సప్లిమెంటరీ ర్యాండమైజేషన్ ప్రక్రియను పారదర్శకంగా చేపట్టడం జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ తెలి పా రు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ రాజ కీయ పార్టీల ప్రతినిధులతో ఎన్నికల నిర్వహణ, ఈవీఎంల ర్యాండమైజేషన్పై సోమవారం స మావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ మొదటి, రెండో ర్యాండమైజేషన్, ఈ వీఎంల కమిషనింగ్ అనంతరం రాజకీయ పా ర్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎంల సప్లిమెంటరీ ర్యాండమైజేషన్ ప్రక్రియను పూర్తి చేయడం జరిగిందన్నారు. జిల్లాలో ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామని తెలిపారు. ఎండలు అధికంగా ఉన్నందున ఓటర్లకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా పోలింగ్ కేంద్రాల్లో టెంట్లు, తాగునీరు, బెంచీలు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. నేడు 5కె రన్.. జిల్లాలో పోలింగ్ శాతం పెంచేలా ఓటర్లకు అవగాహన కల్పించేందుకు స్వీప్ ఆధ్వర్యంలో మంగళవారం పట్టణంలోని ఆర్డీవో కార్యాలయం నుంచి ఉదయం 6 గంటలకు 5కె రన్ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఇందులో అన్నివర్గాల ప్రజలు, యువత అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. అనంతరం కలెక్టరేట్ సమీపంలోని ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ను కలెక్టర్, రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో తెరిచారు. గోదాంలోని ఈవీఎంలను పరిశీలించారు. ఈవీఎంల సెగ్రిగేషన్ ప్రక్రియ పూర్తిచేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కిశోర్కుమార్, నిర్మల్, ముధోల్, ఉట్నూర్ ఆర్డీవోలు రత్నకళ్యాణి, కోమల్రెడ్డి, జివాకర్, రాజకీయ పార్టీల ప్రతినిధులు శ్రవణ్రెడ్డి, రవి, సిరికొండ రమేశ్, గండ్రత్ రమేశ్, మజార్, హైదర్, ఎన్నికల సూపరింటెండెంట్ శ్రీనివాస్, తహసీల్దార్లు, అధికారులు పాల్గొన్నారు. ● జిల్లా ఎన్నికల అధికారి ఆశిష్ సంగ్వాన్
Pagination
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
సీఎం నితీష్కు షాకిచ్చి.. లాలూ చెంతకు బడా నేత!
టీడీపీ నేతలు కలసి రాకపోవడంతో నైరాశ్యం
ఓటమి భయంతో వసంత బూతు పురాణం
సంక్షేమం వైఎస్సార్ సీపీతోనే సాధ్యం
మేనిఫెస్టో అమలు ఘనత వైఎస్ జగన్దే
వైఎస్సార్ సీపీలో కొనసాగుతున్న చేరికలు
మరోసారి సీఎం వైఎస్ జగన్ను ఆశీర్వదించండి
రూ.1000 కోట్లు దాటిన టాటా కంపెనీ లాభం
ఆఖరికి మోదీ కూడా..దిగజారుడు మాటలు ఎందుకు..?
సంక్షేమ పథకాలతో ప్రతి కుటుంబంలో సంతోషం
తప్పక చదవండి
- PK: 'పులుసు కారుతోంది'..!
- ఓటీటీకి వచ్చేసిన పుష్ప విలన్ హిట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- సీఎం నితీష్కు షాకిచ్చి.. లాలూ చెంతకు బడా నేత!
- నాడు తిట్లు.. నేడు కౌగిలింతలు!
- నల్ల ఖజానా గేట్లు తెరచిన బాబు
- ‘సూపర్ సీఎం’ పాండియన్!
- Lok Sabha Election 2024: ఎన్నికల చరిత్రలో ఏకగ్రీవాలు
- Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
- బర్త్ డే స్పెషల్.. విజయ్ దేవరకొండ ఎక్కడ తప్పు చేస్తున్నాడు?
- మొలకలతో బోలెడన్ని ప్రయోజనాలు, ఈ సైడ్ ఎఫెక్ట్స్తెలుసుకోండి!
Advertisement