వందశాతం పోలింగ్‌ నమోదు చేయాలి | Sakshi
Sakshi News home page

వందశాతం పోలింగ్‌ నమోదు చేయాలి

Published Mon, May 6 2024 10:35 AM

వందశాతం పోలింగ్‌ నమోదు చేయాలి

● జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ రాజర్షి షా

తాంసి: ఈనెల 13న నిర్వహించే పార్లమెంట్‌ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకొని, ఓటింగ్‌ను పండుగలా జరుపుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ రాజర్షి షా కోరారు. భీంపూర్‌ మండలకేంద్రంలో స్వీప్‌ ఆధ్వర్యంలో ఓటు హక్కు వినియోగంపై గ్రామస్తులకు ఆదివారం అవగాహన కల్పించారు. తొలుత గ్రామస్తులతో కలిసి కలెక్టర్‌ ఎడ్లబండిపై ర్యాలీగా వెళ్లారు. అనంతరం పంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు. ఈనెల 13న ఎన్ని పనులున్నా అందరూ ఓటు వేసి వందశాతం పోలింగ్‌ నమోదు చేయాలన్నారు. అనంతరం కలెక్టర్‌ను గ్రామస్తులు శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి కిషన్‌, తహసీల్దార్‌ సత్యనారాయణరావు, ఏపీఎం ప్రసాద్‌, డిప్యూటీ తహసీల్దార్‌ హరిదాస్‌, ఆయా గ్రామాల పటేళ్లు దా దారావు, మారుతి, యువజన సంఘం అధ్యక్షుడు వెంకటేశ్‌, ఏపీవో సంగీత, ఆర్‌ఐలు అశోక్‌, శారద, బీఎల్‌వోలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement