‘దోస్త్‌’ సహాయ కేంద్రం ప్రారంభం | Sakshi
Sakshi News home page

‘దోస్త్‌’ సహాయ కేంద్రం ప్రారంభం

Published Wed, May 8 2024 12:25 AM

-

ఆదిలాబాద్‌టౌన్‌: 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి డిగ్రీ కళాశాలల్లో ప్రవేశ ప్రక్రియ ప్రా రంభమైంది. ఉన్నత విద్యాశాఖ కమిషనర్‌ ఆదేశాల మేరకు ఆదిలాబాద్‌లోని ప్రభుత్వ సైన్స్‌ డిగ్రీ కళాశాలలో మంగళవారం ‘దోస్త్‌’ సహాయ కేంద్రాన్ని ప్రా రంభించారు. రిజిస్ట్రేషన్‌, ఇతర అనుమానాలను ఇక్కడ నివృత్తి చేయనున్నారు. రిజిస్ట్రేషన్‌ ప్రక్రియలో తలెత్తే సాంకేతిక లోపాలు సరిదిద్దేందుకు సహా య కేంద్రంలో సంప్రదించాలని ప్రిన్సిపాల్‌ అచ్చి శ్రీనివాస్‌, దోస్త్‌ కోఆర్డినేటర్‌ నర్సింగ్‌రావు ప్రకటనలో తెలిపారు. వివరాలకు 9703533626, 94410 15766 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.

 
Advertisement
 
Advertisement