రాజ్యాంగ పరిరక్షణకు నడుం బిగించాలి | Sakshi
Sakshi News home page

రాజ్యాంగ పరిరక్షణకు నడుం బిగించాలి

Published Wed, May 8 2024 12:25 AM

రాజ్యాంగ పరిరక్షణకు నడుం బిగించాలి

ఎదులాపురం: భారత రాజ్యాంగ పరిరక్షణ కోసం కార్మికవర్గం నడుం బిగించాలని సీ ఐటీయూ అఖిల భారత కోశాధికారి ఎం. సాయిబాబు అన్నారు. మేడే వారోత్సవాల ముగింపు బహిరంగ సభను సీఐటీ యూ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని సెంట్రల్‌ గార్డెన్‌లో మంగళవారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా యూనియన్‌ కార్యాలయం నుంచి సభా స్థలి వరకు కార్మికులతో కలిసి ప్రదర్శనగా వచ్చారు. అనంతరం సభనుద్దేశించి మా ట్లాడారు. రాజ్యాంగంతో పాటు ప్రభుత్వరంగ సంస్థల పరిరక్షణ కోసం కార్మికవర్గమంతా ఏ కమై పోరాడాలన్నారు. ఈ పార్లమెంటు ఎన్నికల్లో మతోన్మాద, కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న బీజేపీని ఓడించాలన్నారు. కార్యక్రమంలో యూనియన్‌ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బొజ్జ ఆశన్న, కిరణ్‌, కోశాధికారి సునిత, ఉపాధ్యక్షులు మల్లేశ్‌, చిన్నన్న, శో భ, వెంకటమ్మ, సహాయ కార్యదర్శులు సు జాత, జితేందర్‌, దేవిదాస్‌, స్వామి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి రాఘవులు, రైతు సంఘం జిల్లా కార్యదర్శి దత్తాత్రి, జిల్లాకమిటీ సభ్యులు పొచ్చన్న, అక్రం ఖాన్‌ తదితరులు పాల్గొన్నారు.

 
Advertisement
 
Advertisement