కలెక్టర్ దినేష్కుమార్ ఆదేశం
సాక్షి,పాడేరు: స్థానిక వైద్య కళాశాల భవన నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ ఏఎస్ దినేష్కుమార్ ఆదేశించారు.గురువారం ఆయన వైద్యకళాశాలకోసం నిర్మిస్తున్న అన్ని బ్లాక్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్మాణ పనులు నాణ్యతగా ఉండాలని లేకుంటే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఇటీవల జాతీయ మెడికల్ కౌన్సిల్ ఈఏడాది నుంచి వైద్య విద్య తరగతులకు అనుమతి ఇవ్వడం తెలిసిందే. ఈ నేపథ్యంలో త్వరితగతిన నిర్మాణాలు పూర్తి చేసి తరగతుల నిర్వహణకు అప్పగించాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ హేమలతాదేవి, ఏపీఎస్ఎంఐడీసీ ఈఈ అచ్చెంనాయుడు, డీఈఈ వర్మ, ఏఈఈ సురేష్, డీజీఎం మధు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment