చోడవరం రూరల్: ఏపీ స్కిల్ హబ్ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన జాబ్ మేళాలో 64 మందిని ఉద్యోగార్థం ఎంపిక చేశారు. మేళాకు 157 మంది నిరుద్యోగులు హాజరు కాగా, ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంకు, హెటిరో ఫార్మా కంపెనీలు చెరి 15 మందిని, కె.ఎల్.గ్రూప్స్ 34 మందిని ఎంపిక చేసినట్లు ప్రిన్సిపాల్ పి.కిరణ్కుమార్, స్కిల్ హబ్ జిల్లా కోఆర్డినేటర్ శ్రీనివాసరావు తెలిపారు. ఆయా కంపెనీల హెచ్ఆర్ మేనేజర్లు ఎంపికై న వారికి అపాయింట్మెంట్ ఆర్డర్స్ అందజేశారన్నారు. జాబ్మేళాకు ముందు ప్రిన్సిపాల్ మాట్లాడుతూ గతేడాది రెండు సార్లు ఇటువంటి మేళాలు నిర్వహించామని, ఈ ఏడాది మరిన్ని నిర్వహించడానికి ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ అప్పలనాయుడు, జిల్లా ఎంప్లాయిమెంట్ ఆఫీసర్ రితీష్, ఎన్ఎస్ఎస్ పీవో డి.మాల్యాద్రి, పీడీ మూర్తి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment