పరవాడ: అనకాపల్లి కలెక్టర్ విజయకృష్ణన్, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ కె.హరిప్రకాష్ పిలుపు మేరకు విజయవాడ వరద బాధితుల సహయ నిధికి విశాఖ ఫార్మాసిటీ రూ.10 లక్షలు విరాళంగా అందించింది. ఈ మొత్తాన్ని రాష్ట్ర విపత్తు నివారణ సంస్థకు పంపించినట్లు ఫార్మాసిటీ డీజీఎం గిరిధర్ భక్షి తెలిపారు. వరదల వల్ల జరిగిన నష్టాన్ని ఎవరూ పూడ్చలేరని.. బాధితులను ఆదుకునేందుకు తమ వంతు సాయంగా రూ.10 లక్షలు అందించినట్లు ఆయన చెప్పారు. వరద బాధితులను ఆదుకోవడానికి ఫార్మాసిటీ ఉద్యోగులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment