అనంతపురం అగ్రికల్చర్: ఉలవ, పెసర, అలసంద, కొర్ర, సజ్జ, మినుము లాంటి ప్రత్యామ్నాయ విత్తనాలపై రైతులు ఆసక్తి చూపడం లేదు. 26 మండలాల పరిధిలో రిజిస్ట్రేషన్లు మొదలై నెల కావస్తున్నా... ఇప్పటి వరకూ 2,200 మంది రైతులు 785 క్వింటాళ్లకు మాత్రమే పేర్లు నమోదు చేసుకోవడమే ఇందుకు నిదర్శనం. విత్తన సరఫరా, పంపిణీ ప్రక్రియలో అంతులేని జాప్యం చోటు చేసుకుంటోంది. ఖరీఫ్లో ప్రధాన పంటల సాగుకు జూలై ఆఖరున గడువు ముగిసినా ఇప్పటికీ ప్రత్యామ్నాయ విత్తనాలు ఇవ్వకపోవడంతో రైతులు విసిగిపోయి పంట విరామం ప్రకటించినట్లుగా తెలుస్తోంది. ప్రధాన పంటల విత్తు గడువు ముగిసిన వారం లేదా పది రోజులకై నా ప్రత్యామ్నాయ విత్తనాలు అందుబాటులో పెట్టి ఉంటే విస్తీర్ణం గణనీయంగా పెరిగేదని కొందరు రైతులు అంటున్నారు. అయితే కూటమి సర్కారు, వ్యవసాయశాఖ ఆలస్యంగా స్పందించడంతో ప్రత్యామ్నాయ విత్తుకు రైతులు వెనుకాడుతున్నారు. కాగా, ఏపీ సీడ్స్ ద్వారా ఇప్పటి వరకూ 2,600 క్వింటాళ్ల ఉలవలు, 70 క్వింటాళ్ల అలసందలు, 62 క్వింటాళ్ల పెసలు, 18 క్వింటాళ్ల జొన్నలు, 8 క్వింటాళ్ల కొర్రలు సరఫరా చేసినట్లు అధికారులు తెలిపారు. అయితే పంపిణీ మాత్రం మొదలు పెట్టకపోవడం విశేషం.
విత్తన సరఫరా, పంపిణీలో ఆలస్యమే ప్రధాన కారణం
Comments
Please login to add a commentAdd a comment