యాడికి: చాగల్లు రిజర్వాయర్లో పూర్తిస్థాయిలో నీరు నింపేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వినోద్కుమార్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం పెద్దపప్పూరు మండలంలో పర్యటించిన కలెక్టర్.. చాగల్లు రిజర్వాయర్ను అధికారులతో కలిసి క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. నీటి సామర్థ్యం.. ఇన్ఫ్లో.. నిల్వ చేయడానికి సమస్యలు ఏమైనా ఉన్నాయా అని అధికారులతో ఆరా తీశారు. 1.5 టీఎంసీల సామర్థ్యం గల రిజర్వాయర్లో ప్రస్తుతం 0.9 టీఎంసీలు మాత్రమే నిల్వ చేశారు. మిగిలిన 0.6 టీఎంసీల నీటిని నిల్వ చేసేందుకు ఉన్న అడ్డంకులను గుర్తించి, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. రిజర్వాయర్లో ఏవైనా మరమ్మతులు చేయాల్సి ఉంటే వాటిపై దృష్టి సారించాలన్నారు. కార్యక్రమంలో హెచ్చెల్సీ ఎస్ఈ రాజశేఖర్, ఇరిగేషన్ ఈఈ రమణారెడ్డి, తహసీల్దార్ బాలాజి, ఎంపీడీఓ రామకృష్ణ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment