కౌన్సిలర్‌ అనుమానాస్పద మృతి | Sakshi
Sakshi News home page

కౌన్సిలర్‌ అనుమానాస్పద మృతి

Published Tue, Apr 23 2024 8:35 AM

-

జమ్మలమడుగు రూరల్‌ : జమ్మలమడుగు మున్సిపాలిటీ వైఎస్సార్‌సీపీకి చెందిన 4వ వార్డ్‌ కౌన్సిలర్‌ జ్ఞాన ప్రసూన (32) సోమవారం రాత్రి అనుమానాస్పదంగా మృతి చెందినట్లు స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. జమ్మలమడుగు పట్టణానికి చెందిన వంగల నాగేంద్ర కుమార్తె అయిన జ్ఞాన ప్రసూన వివాహం అయినప్పటి నుంచి తమిళనాడులోని కోయంబత్తూర్‌లో ఉంటోంది. అప్పుడప్పుడు జమ్మలమడుగుకు వస్తూ ఉండేది. కాగా సోమవారం రాత్రి కోయంబత్తూర్‌లోని ఇంట్లో అనుమానాస్పదంగా మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.

Advertisement
Advertisement