వైఎస్సార్‌సీపీలో చేరిక | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీలో చేరిక

Published Tue, Apr 23 2024 8:35 AM

- - Sakshi

కలికిరి : కలికిరి పర్యటనకు విచ్చేసిన రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమక్షంలో పెద్ద ఎత్తున టీడీపీ యువత వైఎస్సార్‌సీపీలో చేరారు. మండలంలోని మర్రికుంటపల్లి గ్రామం కొత్తగజ్జలవారిపల్లికి చెందిన టీడీపీ యువత మహమ్మద్‌ రఫీ, రఫీఖాన్‌, మహ్మద్‌ ఉస్మాన్‌, అజీముల్లా, ఫకృద్దీన్‌, బడేబాబు, సైఫుల్లా, ఖాజా, ఖాదర్‌బాషా, సయ్యద్‌ అహ్మద్‌, అల్తాఫ్‌, న్యామతుల్లా, షారు, జాకీర్‌, మునీర్‌ ఖాన్‌, అహ్మద్‌బాషా, రియాజ్‌, అమీర్‌ఖాన్‌, బాబ్‌జాన్‌, ఇర్ఫాన్‌, యాసిన్‌, నాగూర్‌, బాలాజీ, మొహ్మద్‌సమీర్‌, మహ్మద్‌బాబు తదితరులతో పాటు 70 కుటుంబాలు చేరాయి. అలాగే కలికిరి పట్టణానికి చెందిన రఫీ తదితరులు స్థానిక వైఎస్సార్‌సీపీ నాయకులు హరీష్‌ రెడ్డి, సతీష్‌రెడ్డి ఆధ్వర్యంలో మంత్రి సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. మంత్రి పెద్దిరెడ్డి వీరికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎన్నికలలో వైఎస్సార్‌సీపీ విజయానికి కృషి చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. అనంతరం క్రాస్‌ రోడ్డు మదనపల్లి రోడ్డు విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ ఎదురుగా వైఎస్సార్‌సీపీ నూతన కార్యాలయాన్ని మంత్రి ప్రారంభించారు.

Advertisement
Advertisement