తీరని రోదన | Sakshi
Sakshi News home page

తీరని రోదన

Published Tue, Apr 23 2024 8:35 AM

పసిపాప వద్ద రోదిస్తున్న తల్లి స్నేహలత  - Sakshi

వేటపాలెం: ఎదురుగా వేగంగా వచ్చిన లారీ స్కూటీని ఢీ కొట్టిన ఘటనలో అమ్మమ్మ, మనవరాలు మృతి చెందారు. ఈ ఘటన చీరాల – వేటపాలెం బైపాస్‌ రోడ్డులో అక్కాయిపాలెం ఐస్‌ ఫ్యాక్టరీ దగ్గరలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. చిన్నగంజాం మండలం కొత్త పాలేనికి చెందిన స్నేహలత తన ఏడాది కూతురు అన్విత, తల్లి బొడ్డు సుబ్బరావమ్మ (57)ను స్కూటీ పై ఎక్కించుకొని బాపట్ల అత్తగారింటికి బయలుదేరింది. అక్కాయిపాలెం దగ్గరకు రాగానే ఎదురుగా ఒంగోలు వైపు వెళ్తున్న లారీ వీరిని ఢీ కొట్టింది. స్కూటీ వెనక కూర్చొన్న సుబ్బరావమ్మ, తనఒడిలో ఉన్న ఏడాది పాప లారీ కింద పడ్డారు. దీంతో వీరిద్దరూ అక్కడికక్కడికే మృతి చెందారు. స్నేహలత మరో వైపునకు పడి పోవడంతో స్వల్ప గాయాలతో బయటపడింది. కళ్లెదుటే తన పాప, తల్లి మృత్యువాత పడటంతో స్నేహలత బోరున విలపించింది. ఘటనా స్థలానికి ఎస్సై జి.సురేష్‌ చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.

స్కూటీని ఢీకొట్టిన లారీ అమ్మమ్మ, ఏడాది మనవరాలు మృతి

Advertisement
Advertisement