ఈవీఎంలు సిద్ధం చేయాలి | Sakshi
Sakshi News home page

ఈవీఎంలు సిద్ధం చేయాలి

Published Tue, May 7 2024 4:45 AM

ఈవీఎంలు సిద్ధం చేయాలి

అశ్వారావుపేట: అశ్వారావుపేట నియోజకవర్గంలో ఈవీఎంలను పకడ్బందీగా కమిషనింగ్‌ చేయాలని ఖమ్మం కలెక్టర్‌, పార్లమెంట్‌ రిటర్నింగ్‌ అధికారి వీ.పీ. గౌతమ్‌ అధికారులను ఆదేశించారు. అశ్వారావుపేట వ్యవసాయ కళాశాలలో సోమవారం చేపట్టిన ఈవీఎం, వీవీ ప్యాట్‌ల కమిషనింగ్‌ ప్రక్రియను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అశ్వారావుపేట అసెంబ్లీ సెగ్మెంట్‌ పరిధిలోని 184 పోలింగ్‌ కేంద్రాలకు చెందిన బ్యాలెట్‌ యూనిట్లు, కంట్రోల్‌ యూనిట్లు, వీవీ ప్యాట్‌లను కమిషనింగ్‌ చేపడుతున్నట్లు వివరించారు. బ్యాలెట్‌ యూనిట్‌ల అమరికలో జాగ్రత్తలు వహించాలని, సీలింగ్‌ సక్రమంగా నిర్వహించాలని సూచించారు. కళాశాలలో ఏర్పాటు చేసిన పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగ కేంద్రాన్ని, పోస్టల్‌ బ్యాలెట్‌ రిజిస్టర్‌ నిర్వహణ తీరును పరిశీలించారు. భద్రత పరంగా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆయన వెంట అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారి వేణుగోపాల్‌, తహసీల్దార్‌ కృష్ణప్రసాద్‌ తదితరులు ఉన్నారు.

 
Advertisement
 
Advertisement