
అమెరికా, యూరప్ దేశాల ఆంక్షలపై రష్యా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇష్టానుసారంగా ఆంక్షలు పెడితే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ను కూల్చేస్తామని హెచ్చరించింది. స్పేస్ స్టేషన్ను యూరప్ దేశాలపై కూల్చేస్తే మీకు ఓకేనా అంటూ ప్రశ్నించారు రష్యా స్పేస్ ఏజెన్సీ చీఫ్ రొగొజిన్. ఆంక్షలతో రష్యాను కట్టడి చేయాలంటే ఫలితం వేరేలా ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు.
శుక్రవారం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వైట్హౌస్ లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ...ఉక్రెయిన్లోని సామాన్య ప్రజలపై రష్యా సైన్యం పాశవిక దాడులు చేస్తోందని మండిపడ్డారు. ఉక్రెయిన్ విషయంలో రష్యాకు మద్దతుగా నిలుస్తూ తమకు(నాటోకు) వ్యతిరేకంగా ఉన్న దేశాలకు జో బైడెన్ సుతిమెత్తని హెచ్చరిక చేశారు. అంతేకాదు ఈ అరాచకత్వానికి పుతిన్ కొన్ని నెలల నుంచే ప్రణాళిక రూపొందించారని, 1,75,000 మంది జవాన్లను ఉక్రెయిన్ సరిహద్దులకు తరలించారని చెప్పారు. ఉక్రెయిన్ వల్ల భద్రతకు ప్రమాదం పొంచి ఉందంటూ రష్యా ఒక రాజకీయ నాటకాన్ని మొదలుపెట్టిందని దుయ్యబట్టారు.అయితే బైడెన్ ఈ హెచ్చరికలు జారీ చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే.. రష్యా బెదిరింపు ధోరణికి దిగింది.
రష్యా అంతరిక్ష సంస్థ రోస్కోమోస్ చీఫ్ డిమిత్రి రోగోజిన్ బైడెన్కు దమ్కీ ఇచ్చారు. మమ్మల్ని ఆంక్షలతో కంట్రోల్ చేయాలని చూస్తే స్పేస్ స్టేషన్ను ఎవరు కాపాడతారు?" అని ప్రశ్నిస్తూ వరుస ట్వీట్లు చేశారు. "మీరు మమ్మల్ని అడ్డుకోవాలని చూస్తే యూఎస్ లేదా, ఐరోపా దేశాల్లో స్పేస్ స్టేషన్ పడకుండా ఎవరు కాపాడతారు? అంటూ రోగోజిన్ ట్వీట్లో పేర్కొన్నారు. యూరప్? భారత్ - చైనా దేశాల మీద 500టన్నుల స్పేస్ స్టేషన్ కూల్చే అవకాశం ఉంది. ఇలాంటి ప్రవర్తనతో వాళ్లను ప్రమాదంలో పడేయాలని అనుకుంటున్నారా?’ ఐఎస్ఎస్ రష్యా మీదగా ఎగరదు, కాబట్టి ప్రమాదాలన్నీ మీకే. మీరు వాటికి సిద్ధంగా ఉన్నారా? అంటూ రష్యా అంతరిక్ష సంస్థ చీఫ్ ట్వీట్ చేయడం సంచలనంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment