Ukraine Russia War
-
అగ్ర రాజ్యాల స్నేహగీతం
రియాద్: డొనాల్డ్ ట్రంప్ రెండోసారి పాలనా పగ్గాలు చేపట్టగానే అమెరికా విదేశాంగ విధానంలో కీలక మార్పుచేర్పులు చోటుచేసుకుంటున్నాయి. అందులో భాగంగా అన్నిరకాలుగానూ మూడేళ్లుగా దాదాపుగా వెలి వేసిన రష్యాతో ఏకంగా ఉన్నతస్థాయి చర్చలకు అమెరికా తెర తీసింది. దాని మిత్ర దేశం సౌదీ అరేబియా వేదికగా మంగళవారం జరిగిన ఈ చర్చలకు అమెరికా, రష్యా విదేశాంగ మంత్రులు మార్కో రూబియో, సెర్గీ లవ్రోవ్ స్వయంగా సారథ్యం వహించడం విశేషం. సౌదీ విదేశాంగ మంత్రి యువరాజు ఫైసల్ బిన్ ఫర్హాన్ అల్ సౌద్, అమెరికా, సౌదీ ఆ దేశ జాతీయ భద్రతా సలహాదార్లు తదితరులు ఇందులో పాల్గొన్నారు. ద్వైపాక్షిక బంధాలను మెరుగు పరుచుకోవడంతో పాటు ఉక్రెయిన్ యుద్ధానికి తెర దించడం ప్రధాన ఎజెండాగా చర్చలు జరిగాయి. కానీ ఈ కీలక చర్చల్లో ఉక్రెయిన్కే ప్రాతినిధ్యం కల్పించకపోవడం విశేషం. దీనిపై ఆ దేశం తీవ్ర అసంతృప్తి వెలిగక్కింది. తమ భాగస్వామ్యం లేకుండా తీసుకునే ఎలాంటి నిర్ణయాలనూ అంగీకరించబోయేది లేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ కుండబద్దలు కొట్టారు.ఉక్రెయిన్పై జరుపుతున్న చర్చల్లో తమను పక్కన పెట్టడం ఏమేరకు సబబంటూ పలు యూరప్ దేశాలు కూడా నొసలు విరుస్తున్నాయి. రష్యాతో యుద్ధంలో ఉక్రెయిన్కు అమెరికా దన్ను పూర్తిగా తగ్గిపోతున్న నేపథ్యంలో భావి కార్యాచరణపై యూరప్ దేశాలన్నీ సోమవారం కీలక సమావేశం జరపడం తెలిసిందే. ఈ పరిణామాలన్నీ అంతర్జాతీయంగా సరికొత్త సమీకరణాలకు, పునరేకీకరణలకు దారితీసేలా కనిపిస్తున్నాయని పరిశీలకులు భావిస్తున్నారు. త్వరలో ట్రంప్, పుతిన్ భేటీ ఉక్రెయిన్పై దాడి నేపథ్యంలో అమెరికాతో పాటు పలు యూరప్ దేశాలు రష్యాపై తీవ్ర ఆంక్షలు విధించడం, ఆ దేశాన్ని అంతర్జాతీయంగా దాదాపుగా ఏకాకిని చేయడం తెలిసిందే. అలా మూడేళ్లుగా అట్టడుగుకు దిగజారిన అమెరికా, రష్యా సంబంధాలను మెరుగుపరుచుకునే దిశగా రూబియో, లవ్రోవ్ భేటీలో పలు నిర్ణయాలు జరిగాయి. వాషింగ్టన్, మాస్కో రాయబార కార్యాలయాల్లో సిబ్బంది సంఖ్యను పెంచాలని నిర్ణయించినట్టు రూబియో మీడియాకు తెలిపారు.‘‘అలాగే ఇరు దేశాల అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్, వ్లాదిమిర్ పుతిన్ వీలైనంత త్వరగా భేటీ కానున్నారు. తేదీ తదితరాలు ఖరారు కావాల్సి ఉంది’’ అని వివరించారు. అధినేతలిద్దరూ గత వారం సుదీర్ఘంగా ఫోన్లో సంభాషించుకోవడం తెలిసిందే. ఈ పరిణామం అంతర్జాతీయంగా సంచలనం సృష్టించింది. ఆ వెంటనే రష్యాపై యుద్ధంలో ఇప్పటిదాకా ఉక్రెయిన్కు అమెరికా అందిస్తూ వస్తున్న సహాయ సహకారాలకు చాలావరకు తెర దించుతూ ట్రంప్ వరుస నిర్ణయాలు తీసుకున్నారు.ఈయూలో ఉక్రెయిన్ చేరికకు... అభ్యంతరం లేదు: రష్యాశాంతి చర్చలకు రష్యా ఎప్పుడూ సిద్ధమేనని అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మీడియా కార్యదర్శి ద్మిత్రీ పెస్కోవ్ స్పష్టం చేశారు. అందులో భాగంగా అవసరమైతే జెలెన్స్కీతో చర్చలకు కూడా పుతిన్ సిద్ధమేనన్నారు. అయితే, ఉక్రెయిన్ అధ్యక్షునిగా జెలెన్స్కీ చట్టబద్ధతపైనే తమకు అభ్యంతరాలున్నాయంటూ మెలిక పెట్టారు. ఉక్రెయిన్ యూరోపియన్ యూనియన్లో చేరడంపై తమకు అభ్యంతరాలు లేవన్నారు. ‘‘ఇలాంటివి ఒక దేశ సార్వభౌమత్వానికి సంబంధించిన నిర్ణయాలు. వాటిలో వేలు పెట్టే ఉద్దేశం మాకు లేదు’’ అని చెప్పుకొచ్చారు. కానీ రష్యా భద్రత తదితరాల దృష్ట్యా ఉక్రెయిన్కు నాటో సభ్యత్వానికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకునేది లేదన్నారు. -
చర్చలకు రాకపోతే ఆంక్షలే : పుతిన్కు ట్రంప్ హెచ్చరిక
వాషింగ్టన్: రష్యా అధినేత పుతిన్ను కలుసుకోవడానికి ఆసక్తితో ఉన్నానని, ఎప్పుడైనా సరే ఆయనతో చర్చలకు తాను సిద్ధమని అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టంచేశారు. చర్చలకు ముందుకు రాకపోతే రష్యాపై అదనపు ఆంక్షలు విధించే అవకాశం ఉంటుందని హెచ్చరించారు. చర్చల బల్ల వద్ద కలుసుకుందామని పుతిన్కు సూచించారు. ఉక్రెయిన్–రష్యా యుద్ధంలో ఇప్పటికే లక్షలాది మంది మరణించారని ఆవేదన వ్యక్తంచేశారు. సైనికులతోపాటు సామాన్య ప్రజలు ప్రాణాలు కోల్పోతుండడం, నగరాలు, పట్టణాలు శిథిలాలుగా మారుతుండడం బాధాకరమని అన్నారు. మీడియాలో వస్తున్న వార్తల కంటే ఉక్రెయిన్లో మృతుల సంఖ్య అధికంగా ఉందన్నారు. వాస్తవాలు చెప్పడం లేదని మీడియాపై మండిపడ్డారు. ట్రంప్ స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. నాలుగేళ్ల క్రితం తాను అధ్యక్షుడిగా ఎన్నికై ఉంటే ఉక్రెయిన్–రష్యా యుద్ధం జరిగేది కాదని స్పష్టంచేశారు. సమర్థుడైన పాలకుడు అధికారంలో ఉంటే యుద్ధాలకు ఆస్కారం ఉండదని అన్నారు. పుతిన్ చాలా తెలివైన వ్యక్తి అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. తమ గత అధ్యక్షుడు జో బైడెన్ను, రష్యా ప్రజలను పుతిన్ అగౌరవపర్చారని ఆక్షేపించారు. పుతిన్ గురించి తనకు బాగా తెలుసని చెప్పారు. తాను పదవిలో ఉంటే మధ్యప్రాచ్యంలో సంక్షోభం తలెత్తేది కాదని పునరుద్ఘాటించారు. 200 మిలియన్ డాలర్లు అధికంగా ఖర్చు చేశాం ఉక్రెయిన్కు ఆయుధాల సరఫరా, ఆర్థిక సాయం నిలిపివేసే అంశాన్ని పరిశీలిస్తామని డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో మాట్లాడుతున్నామని, త్వరలో పుతిన్తోనూ మాట్లాడుతామని చెప్పారు. ‘‘ఉక్రెయిన్– రష్యా యుద్ధానికి యూరోపియన్ యూనియన్ కంటే అమెరికా 200 మిలియన్ డాలర్లు అధికంగా ఖర్చు చేసింది. మాతో సమానంగా యూరోపియన్ యూనియన్ భారం భరించాల్సిందే. మేము ఎక్కువ ఖర్చు పెట్టాం అంటే నిజంగా మూర్ఖులమే. అందులో సందేహం లేదు’’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. శాంతిని కోరుకుంటున్నట్లు జెలెన్స్కీ తనతో చెప్పారని వివరించారు. ఏం జరుగుతుందో చూద్దామని చెప్పారు. పుతిన్ ఎప్పుడు కోరుకుంటే అప్పుడు చర్చలకు సిద్ధమని ట్రంప్ తేలి్చచెప్పారు. యుద్ధంలో మరణాలు ఇక ఆగిపోవాలని అన్నారు. కృత్రిమ మేధలో 500 బిలియన్ డాలర్ల పెట్టుబడులు చైనా నుంచి వచ్చే దిగుమతులపై 10 శాతం టారిఫ్ విధించాలని భావిస్తున్నట్లు ట్రంప్ తెలిపారు. ఫిబ్రవరి 1 నుంచి ఇది అమల్లోకి వచ్చే అవకాశం ఉందన్నారు. చైనా నుంచి ఫెంటానైల్ అనే ప్రమాదకరమైన మాదకద్రవ్యం రాకుండా అడ్డుకోనున్నట్లు చెప్పారు. చైనా నుంచి మెక్సికో, కెనడా వంటి దేశాలకు, అక్కడి నుంచి అమెరికాకు ఫెంటానైల్ చేరుకుంటోందని ఆందోళన వ్యక్తంచేశారు. డ్రగ్స్తోపాటు అక్రమ వలసదార్లను అమెరికాలోకి పంపిస్తున్న దేశాల ఉత్పత్తులపై భారీగా పన్నులు విధిస్తామని ఆయన గతంలోనే హెచ్చరించిన సంగతి తెలిసిందే. కృత్రిమ మేధ(ఏఐ) మౌలిక సదుపాయాల కల్పనకు 500 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టబోతున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఒక కొత్త కంపెనీ ద్వారా నిధులు ఖర్చు చేస్తామన్నారు. ఒరాకిల్, సాఫ్ట్బ్యాంక్, ఓపెన్ ఏఐ భాగస్వామ్యంతో ఈ కంపెనీని స్థాపిస్తామన్నారు. స్టార్గేట్గా పిలిచే ఈ ప్రాజెక్టు ద్వారా లక్ష ఉద్యోగాలు లభిస్తాయని వివరించారు. -
‘పట్టుబడితే.. ఆ నరకం కన్నా చావడమే నయం!’
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్కి.. పాశ్చాత్య దేశాలకు మధ్య ఉన్న వైరం గురించి తెలిసిందే. ఈ క్రమంలోనే రష్యాకు చేరువయ్యారు ఆయన. అయితే.. మిత్ర దేశం రష్యా కోసం ఇప్పుడు ఆయన ఎంతకైనా తెగించడానికి వెనుకాడడం లేదు. ఈ క్రమంలోనే తన సైన్యాన్ని బలి పెడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రష్యాకు మద్దతుగా ఉత్తర కొరియా సైనికులు(North Korea Soliders) ఉక్రెయిన్ యుద్ధంలో పాల్గొంటున్నారు. అయితే.. ఇటు ఉకక్రెయిన్గానీ, అటు రష్యా గానీ ఆ విషయాన్ని కొట్టిపారేస్తున్నాయి. మరోవైపు.. ఉక్రెయిన్ సైన్యానికి పట్టుబడడం ఇష్టంలేక తమను తాము పేల్చేసుకుని ఆత్మాహుతి దాడులకు తెగబడుతున్నారు ఉత్తర కొరియా సైనికులు!. తాజాగా..గత వారం రోజులుగా ఉక్రెయిన్ ప్రత్యేక దళాలు దూకుడుగా ముందుకు వెళ్తున్నాయి. ఈ క్రమంలో కుర్సుక్ రీజియన్లో దాడులు జరిపి ప్రత్యర్థి బలగాలను మట్టుబెట్టింది. ఆపై ఉక్రెయిన్ సైన్యం కొన్ని మృతదేహాలను స్వాధీనం చేసుకుంది. అయితే అందులో ఓ సైనికుడు సజీవంగానే ఉండగా.. ఉక్రెయిన్ సైనికులను చూసి గ్రెనేడ్తో తనను తాను పేల్చేసుకున్నాడు. అయితే ఈ పేలుడులో ఉక్రెయిన్ సైనికులు సురక్షితంగా బయటపడ్డారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఉక్రెయిన్ స్పెషల్ ఆపరేషన్స్ ఫోర్సెస్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది.Watch how Ukraine’s SOF repel North Korean troops assault in russia’s Kursk region.The special forces eliminated 17 DPRK soldiers. One North Korean soldier had set an unsuccessful trap for the rangers of the 6th Regiment and blew himself up with a grenade. pic.twitter.com/nObBOMnusI— SPECIAL OPERATIONS FORCES OF UKRAINE (@SOF_UKR) January 13, 2025మూడేళ్లుగా కొనసాగుతున్న రష్యా-ఉక్రెయిన్ సంక్షోభంలో.. ఉత్తర కొరియా మాస్కోకు మద్దతుగా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే ఆ సైనికులు తీవ్ర చర్యలకు పాల్పడుతున్నట్లు కీవ్ వర్గాలు ఇప్పుడు ఆధారాలతో సహా చెబుతున్నాయి.యుద్ధంలో ఒకవేళ ఉక్రెయిన్కు పట్టుబడితే.. యుద్ధ ఖైదీగా ఉండిపోవాలి. అంతేకాదు.. యుద్ధ నేరాల్లో ప్యాంగ్యాంగ్ పాత్ర కూడా నిర్ధారణ అయ్యే అవకాశం ఉంది. అందుకే పట్టుబడి ఉక్రెయిన్లో యుద్ధ ఖైదీలుగా ఉండడం కన్నా.. ఆత్మాహుతికి పాల్పడడం మేలు అని వాళ్లు భావిస్తున్నారు అని కీవ్ వర్గాలు భావిస్తున్నాయి.‘‘పట్టబడకుండా ప్రాణం తీసుకోవడం.. ఇదే నార్త్ కొరియా నేర్పేది’’ అని ఉత్తర కొరియా మాజీ సైనికుడు కిమ్(32) చెబుతున్నాడు. రష్యాలో నిర్మాణ ప్రాజెక్టులకు కాపలాగా ఉత్తర కొరియా సైన్యం తరఫు నుంచి వెళ్లి కిమ్ ఏడేళ్లపాటు పని చేశాడు. ఆపై 2022లో దక్షిణ కొరియాకు పారిపోయి తన ప్రాణం రక్షించుకున్నాడతను.‘‘ఉత్తర కొరియా సైన్యంలో చేరాలంటే.. ముందుగా అన్ని బంధాలను తెంచుకోవాలి. ఇళ్లు, భార్యాపిల్లలు అన్నింటిని వదిలేసుకోవాలి. సైన్యంలో వాళ్లకు బ్రెయిన్వాష్ చేస్తారు. కిమ్ జోంగ్ ఉన్(Kim Jong-Un) కోసం అవసరమైతే తమ ప్రాణాలను కూడా వదులుకోవాల్సి ఉంటుంది’’ అని కిమ్ రాయిటర్స్ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. పట్టుబడి తిరిగి ప్యాంగ్యాంగ్కు వెళ్తే చావు కన్నా భయంకరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుంది అని చెబుతున్నాడతను. ఉత్తర కొరియా దృష్టిలో యుద్ధంలో పట్టుబడడం అంటే రాజద్రోహానికి పాల్పడినట్లే. ఆఖరి తూటా దాకా అతని శరీరంలో దిగాల్సిందే.. ఇదే అక్కడి సైన్యంలో అంతా చర్చించుకునేది అని కిమ్ తెలిపాడు.రష్యాకు మద్దతుగా ఉత్తరకొరియా సైనికులు రంగంలోకి దిగారని ఉక్రెయిన్ ఆరోపిస్తూ వస్తోంది. సుమారు 11,000 వేల మంది సైనికులను ఉత్తర కొరియా మోహరింపజేసిందనేది కీవ్ ఆరోపణ. ఇందులో 3 వేల మంది ఇప్పటికే మరణించినట్లు ప్రకటించింది. అందులో వారి పేర్లు, వివరాలను మార్చేసి రష్యాకు చెందిన వారిగా తప్పుడు పత్రాలను గుర్తించినట్లు తెలిపింది. ‘‘వారు తప్పుడు గుర్తింపు కార్డులతో రష్యా సైనికుల తరహా దుస్తుల్ని ధరించి పనిచేస్తున్నారు. చూడడానికి మాస్కో దళాల మాదిరిగానే కనిపిస్తున్నారు. వాళ్ల సంభాషణల్ని రహస్యంగా విన్నప్పుడు వారు ఉత్తర కొరియా భాషలో మాట్లాడుతున్నట్లు బయటపడింది’’ అని కీవ్కు చెందిన ఓ సైన్యాధికారి తెలిపారు. అయితే ఈ ఆరోపణలను ప్యాంగ్యాంగ్ వర్గాలు కొట్టిపారేశాయి. మాస్కో మాత్రం ఎలాంటి ప్రకటనా ఇవ్వలేదు.రష్యానే కాల్చిపారేస్తోందా?ఉత్తరకొరియా సైనికులను సజీవంగా పట్టుకోవడం అంత సులభం కాదని ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ అన్నారు. ఉత్తర కొరియా పాత్ర బయటపడకూడదనే ఉద్దేశంతో గాయపడిన ఆ దేశ సైనికులు తమకు చిక్కకుండా ఉండేందుకు వారిని రష్యా కాల్చి చంపేస్తోందని ఆరోపించారాయన. ఈ పట్టుబడిన సైనికుల గురించి ఉక్రెయిన్ భద్రతా సర్వీస్.. ఎస్బీయూ మరిన్ని వివరాలను వెల్లడించింది. ఒక సైనికుడు దగ్గర ఎలాంటి ధ్రువపత్రం లేదని, మరో సైనికుడి దగ్గర రష్యా మిలిటరీ కార్డు ఉందని తెలిపింది. Communication between captured North Korean soldiers and Ukrainian investigators continues. We are establishing the facts. We are verifying all the details. The world will learn the full truth about how Russia is exploiting such guys, who grew up in a complete information vacuum,… pic.twitter.com/CWcssQjr94— Volodymyr Zelenskyy / Володимир Зеленський (@ZelenskyyUa) January 14, 2025‘‘బందీలకు ఉక్రేనియన్, ఇంగ్లిష్, రష్యన్ భాషలు రావు. దక్షిణ కొరియా అనువాదకుల సాయంతో వారితో మాట్లాడుతున్నాం’’అని పేర్కొంది. మరోవైపు.. రష్యాలో బందీగా ఉన్న తమ సైనికులను విడుదల చేస్తే.. ఉత్తర కొరియా సైనికులను వారి అధినేత కిమ్ జోంగ్ ఉన్కు అప్పగిస్తామని జెలెన్స్కీ ప్రకటించడం తీవ్ర చర్చనీయాంశమైంది.ప్రపంచంలోనే తనది అత్యంత శక్తివంతమైన సైన్యంగా కిమ్ జోంగ్ ఉన్(Kim Jong Un) ఆ మధ్య ప్రకటించుకున్నారు. 1950-53 కొరియన్ వార్ తర్వాత నార్త్ కొరియా సైన్యాన్ని రష్యాలో మోహరించడం ఇదే. అలాగే.. వియత్నాం యుద్ధం, సిరియా అంతర్యుద్ధంలోనూ ఉత్తర కొరియా సైన్యం పాలు పంచుకుంది. -
ట్రంప్తో చర్చలకు సిద్ధం
మాస్కో: అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చర్చలకు సిద్ధంగా ఉన్నట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు. గత నాలుగేళ్లలో ఒక్కసారి కూడా ట్రంప్తో మాట్లాడలేదని ఆయన చెప్పారు. ట్రంప్ హయాంలో అమెరికా విధానాల్లో భారీగా మార్పులు రావొచ్చని అంచనా వేస్తున్నామన్నారు. ఉక్రెయి న్లో విజయం సాధించబోతున్నామని, సిరియాలో ఆశించిన లక్ష్యం నెరవేరిందని చెప్పుకొచ్చారు. గురు వారం దాదాపు నాలు గున్నర గంటలపాటు జరి గిన వార్షిక మీడియా సమావేశంలో ప్రజల నుంచి వచ్చిన ఫోన్కాల్స్కు కూడా పుతిన్ స్పందించారు. అనేక జాతీయ, అంతర్జాతీయ పరిణామాలపై మాట్లాడారు. ట్రంప్ అధికార పగ్గాలు చేపట్టాక ఉక్రెయిన్లో యుద్ధానికి ముగింపు రావొచ్చునంటూ వార్తలు వస్తున్న వేళ పుతిన్ పై వ్యాఖ్యలు చేయడం గమనార్హం.నాలుగేళ్లుగా మేం మాట్లాడుకో లేదుడొనాల్డ్ ట్రంప్తో సమావేశం ఎప్పుడుంటుందన్న ఎన్బీసీ ప్రతినిధి కెయిర్ సిమ్మన్స్ ప్రశ్నకు..‘మా సమావేశం ఎప్పుడు ఉండొచ్చో నాకు తెలియదు. ట్రంప్ కూడా ఈ విషయం ఎన్నడూ చెప్పలేదు. దాదాపు నాలుగేళ్లుగా మేం మాట్లాడుకున్నదీ లేదు. ట్రంప్ సానుకూలంగా ఉంటే చర్చలకు ఎప్పుడైనా నేను సిద్ధమే’అని అన్నారు. ఉక్రెయిన్తో కొనసాగుతున్న యుద్ధం, సిరియా నుంచి రష్యా బలగాలు వైదొలగాల్సి రావడం వంటి పరిణామాలతో మీరు బలహీనపడినట్లుగా భావిస్తున్నారా అన్న ప్రశ్నకు..,గత రెండు, మూడేళ్లలో రష్యా మరింతగా బలం పుంజుకుంది. ఎందుకంటే మేం మరింత స్వతంత్రంగా మారాం. ఎవరిపైనా ఆధారపడకుండా ముందుకు సాగుతున్నాం’అన్నారు. ఉక్రెయిన్లో పరిస్థితులు అనూహ్యంగా మారి పోయాయి. యుద్ధక్షేత్రంలో రోజురోజుకూ చదరపు కిలోమీటర్ల కొద్దీ భూభా గాన్ని స్వాధీనం చేసుకుంటూ ముందుకు సాగు తున్నాం’అన్నారు. అయితే, సరిహద్దుల్లో కస్క్ ప్రాంతాన్ని ఉక్రెయిన్ దళాల నుంచి తిరిగి ఎప్పుడు స్వాధీనం చేసుకుంటారన్న ప్రశ్నకు ఆయన నేరుగా సమాధాన మివ్వలేదు. ‘స్వాధీనం చేసుకుని తీరుతాం. ఫలానా సమయం కల్లా అది పూర్తవుతుందని మాత్రం చెప్పలేను’అని పేర్కొనడం గమనార్హం. తాజాగా ఆర్మీ అణు విభాగం చీఫ్ కిరిల్లోవ్ హత్యను ఆయన ఉగ్రవాద చర్యగా పేర్కొన్నారు. సిరియా పదవీచ్యుత అధ్యక్షుడు అసద్ మాస్కోలోనే ఉన్నట్లు పుతిన్ ప్రకటించడం గమనార్హం. ఇప్పటి వరకు ఆయనతో సమావేశం జరగలేదని, కచ్చితంగా మాట్లాడతానని చెప్పారు. -
ఉక్రెయిన్పై రష్యా భీకర దాడి
కీవ్: ఉక్రెయిన్ సైనిక మౌలిక వసతులను ధ్వంసం చేయడమే లక్ష్యంగా రష్యా శుక్రవారం 93 క్రూయిజ్, బాలిస్టిక్ క్షిపణులతో దాడికి తెగబడింది. ఏకంగా 200 డ్రోన్లతో దాడి చేసింది. గత మూడేళ్లలో రష్యా ఒకే రోజులో చేసిన అతిపెద్ద దాడుల్లో ఇది కూడా ఒకటని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చెప్పారు. రష్యా నుంచి దూసుకొచ్చిన వాటిల్లో 11క్రూయిజ్ క్షిపణులుసహా 81 మిస్సైళ్లను పశి్చమదేశాలు అందించిన ఎఫ్–16 యద్ధవిమానాల సాయంతో నేలమట్టంచేశామని ఆయన చెప్పారు. ‘‘ పెనుదాడులతో ఉక్రేనియన్లను భయపెడుతున్న రష్యాకు, పుతిన్కు వ్యతిరేకంగా అంతర్జాతీయ సమాజం ఐక్యంగా నిలబడాల్సిన తరుణమిది. పెద్ద ప్రతిఘటన, భారీ ఎదురుదాడితో రష్యా ఉగ్రచర్యలను అడ్డుకుందాం’’ అని జెలెన్స్కీ తన టెలిగ్రామ్ ఛానెల్ ద్వారా చెప్పారు. ఉక్రెయిన్ రక్షణ పారిశ్రామికవాడల్లో ఇంధన, శక్తి వనరులు, మౌలిక వసతులను ధ్వంసంచేయడమే లక్ష్యంగా తమ సైన్యం దాడులు చేసినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. తమ బొగ్గు విద్యుత్ ఉత్పత్తికేంద్రాలకు భారీ నష్టం వాటిల్లిందని ఉక్రెయిన్లోని అతిపెద్ద ప్రైవేట్ విద్యుత్ సంస్థ డీటెక్ తెలిపింది. ఉక్రెయిన్లో ఆయుధాలు, మందుగుండు సామగ్రి తయారీని నిలువరించడమే లక్ష్యంగా ఇంధన వ్యవస్థలపైనే రష్యా తరచూ దాడులుచేస్తుండటం తెల్సిందే. నవంబర్ 28న చేసిన ఇలాంటి దాడిలో 200 మిస్సైళ్లు, డ్రోన్లను ప్రయోగించింది. నాటి నష్టం కారణంగా 10 లక్షల కుటుంబాలు అంధకారంలో ఉండిపోయాయి. -
ఉక్రెయిన్పైకి ఖండాంతర క్షిపణి ప్రయోగించిన రష్యా
కీవ్: అమెరికా తొలిసారిగా అందించిన శక్తివంత దీర్ఘశ్రేణి క్షిపణులను రష్యా మీదకు ప్రయోగించిన ఉక్రెయిన్ ఊహించని దాడిని ఎదుర్కొంది. యుద్ధంలో ఎన్నడూలేని విధంగా తొలిసారిగా ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని ఉక్రెయిన్ భూతలం మీదకు రష్యా ప్రయోగించింది. అభివృద్ధిచేశాక పరీక్ష కోసం పలుదేశాలు ఎన్నోసార్లు ఈ రకం క్షిపణులను ప్రయోగించినా యుద్ధంలో వినియోగించడం మాత్రం ఇదే తొలిసారికావడం గమనార్హం. మధ్యతూర్పు ఉక్రెయిన్లోని డినిప్రో నగరంపైకి బుధవారం రాత్రి ఇంటర్కాంటినెంటల్ బాలిస్టిక్ మిస్సైల్(ఐసీబీఎం) వచ్చి పడిందని ఉక్రెయిన్ టెలిగ్రామ్ మెసెంజింగ్ యాప్లో ప్రకటించింది. వేయి కిలోమీటర్ల దూరంలో రష్యాలో కాస్పియన్ సముద్రతీర ఆస్ట్రాఖన్ ప్రాంతం నుంచి అది దూసుకొచ్చిందని ఉక్రెయిన్ వాయుసేన పేర్కొంది. అయితే ఆ క్షిపణి సృష్టించిన విధ్వంసం, జరిగిన ఆస్తి, ప్రాణనష్టం వివరాలను ఉక్రెయిన్ వెల్లడించలేదు. ‘‘ ఐసీబీఎంతోపాటు కింజార్ హైపర్సోనిక్ క్షిపణి, ఏడు కేహెచ్–101 క్రూజ్ క్షిపణులు వచ్చిపడ్డాయి. వీటిలో ఆరింటిని గాల్లోనే ధ్వంసంచేశాం. ఈ దాడిలో ఇద్దరు ఉక్రేనియన్లు గాయపడ్డారు. ఒక కర్మాగారం దెబ్బతింది. వికలాంగుల కోసం ఏర్పాటుచేసిన పునరావాసన శిబిరం నాశనమైంది’ అని స్థానిక యంత్రాంగం పేర్కొంది. అయితే ఆర్ఎస్–26 రూబెజ్ రకం ఐసీబీఎంను రష్యా ప్రయోగించి ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆర్ఎస్–26 క్షిపణి ఏకంగా 800 కేజీల మందుగుండును మోసుకెళ్లగలదు. 5,800 కిలోమీటర్ల దూరం ప్రయాణించి అత్యంత కచ్చితత్వంతో లక్ష్యాన్ని ఛేదించగలదు. ఈ క్షిపణితోపాటు మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీ–ఎంట్రీ వెహికల్స్(ఎంఐఆర్వీ) సాంకేతికతనూ రష్యా వాడినట్లు తెలుస్తోంది. యుద్ధంలో ఎంఐఆర్వీ టెక్నాలజీని వాడటం ఇదే తొలిసారి.క్షిపణితో హెచ్చరించారా?సాధారణంగా ఐసీబీఎంలను అణ్వస్త్రాల వంటి భారీ బాంబులను ప్రయోగించడానికి వినియోగిస్తారు. సాధారణ మందుగుండుతో రష్యా గురువారం ఐసీబీఎంను ప్రయోగించడం వెనుక వేరే ఉద్దేశ్యం ఉందని రక్షణరంగ నిపుణులు చెబుతున్నారు. అమెరికా నుంచి అందుకున్న అత్యాధునిక దీర్ఘశ్రేణి క్షిపణుల అండ చూసుకుని విచక్షణారహితంగా తమపై దాడులకు తెగబడితే అణ్వాయుధం ప్రయోగించేందుకైనా వెనుకాడబోమని హెచ్చరించేందుకే రష్యా ఇలా ఐసీబీఎంను ప్రయోగించి ఉంటుందని భావిస్తున్నారు. అణ్వస్త్ర వినియోగానికి సంబంధించిన దస్త్రంపై సంతకం చేసిన రెండు రోజులకే రష్యా ఉక్రెయిన్పైకి తొలిసారిగా ఖండాంతర క్షిపణిని ప్రయోగించడం గమనార్హం. ‘‘ ఉక్రెయిన్ నుంచి దూసుకొచ్చిన రెండు బ్రిటన్ తయారీ స్టార్మ్ షాడో క్షిపణులు, ఆరు హిమార్స్ రాకెట్లు, 67 డ్రోన్లను నేలకూల్చాం’’ అని గురువారం రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. స్టార్మ్షాడో క్షిపణులను తమ గగనతలరక్షణ వ్యవస్థలు కూల్చేశాయని రష్యా ప్రకటించడం ఇదే తొలిసారి. అయితే గురువారం ఉక్రెయిన్పై ఏ రకం ఖండాంతర క్షిపణిని ప్రయోగించారో, అసలు ప్రయోగించారో లేదో అన్న విషయాన్ని రష్యా వెల్లడించలేదు. ఇతర వివరాలు తెలిపేందుకు రష్యా రక్షణశాఖ అధికార ప్రతినిధి మారియా జఖరోవా సాధారణ పత్రికా సమావేశంలో మాట్లాడుతుండగా ఆమెకు ఫోన్కాల్ వచ్చింది. ‘‘ మనం ప్రయోగించిన ఖండాంతర క్షిపణి గురించి పశ్చిమదేశాలు అప్పుడే మాట్లాడటం మొదలెట్టాయి. ఐసీబీఎంను వాడిన విషయాన్ని ప్రెస్మీట్లో ప్రస్తావించొద్దు’’ అని సంబంధిత ఉన్నతాధికారులు ఆమెకు ఫోన్లో చెప్పారు. సంబంధిత వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది.ఏమిటీ ఖండాంతర క్షిపణి?సుదూరంలోనే శత్రుస్థావరాలను తుదముట్టించేందుకు ఖండాంత క్షిపణి ఉపయోగపడుతుంది. 5, 500 కిలోమీటర్లకు మించి ప్రయా ణించగలవు. అణు, రసాయన, జీవాయుధాలను మోసుకెళ్లగలవు. సంప్రదాయక వార్హెడ్నూ మోస్తాయి. రష్యా వాడినట్లుగా చెబుతున్న ఆర్ఎస్26 రూబెజ్ క్షిపణి ఎంఐఆర్వీ టెక్నాలజీతో పనిచేసే ఘన ఇంధన మిస్సైల్. 2011 దీనిని అభివృద్ధిచేసి 2012లో తొలిసారి విజయవంతంగా పరీక్షించారు. అది ఆనాడు 5,800 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని తుత్తునియలు చేసింది. ద్రవ ఇంధనంతో పోలిస్తే ఘన ఇంధన క్షిపణులను వాడటం చాలా తేలిక. నేలమాళిగ, మొబైల్ లాంఛర్ నుంచి సులభంగా ప్రయోగించవచ్చు. ఇందులోని ఇంధనం, ఆక్సిడైజర్లను రబ్బర్లాంటి దానితో కలిపి మిశ్రమంగా తయారుచేసి ఒక గట్టి పెట్టెలో అమర్చుతారు. ప్రొపెలంట్ మండగానే ఇంధన ప్రజ్వలన రెప్పపాటులో భారీగా జరిగి క్షిపణి శరవేగంగా దూసుకుపోతుంది. ఇంధ్రధనస్సులాగా అర్ధచంద్రాకృతిలో ప్రయాణిస్తుంది. దాదాపు 4,000 కిలోమీటర్ల ఎత్తుకు వెళ్లిన తర్వాత వేగంగా కిందకు పడపోవడం మొదలవుతుంది. ఈ దశలో ఇది ఏకంగా ధ్వని వేగానికి పది రెట్లు వేగంగా దూసుకొస్తుంది. ఎంఐఆర్వీ టెక్నాలజీతో ఒకే క్షిపణిలో వేర్వేరు వార్హెడ్లను ఒకేసారి ప్రయోగించవచ్చు. ఇవి వేర్వేరు లక్ష్యాలను ఛేదించగలవు. వందల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఇవి ఢీకొట్టగలవు. ఒకేసారి ప్రయోగించిన రెండు వార్హెడ్ల మధ్య దూరం 1,500 కిలోమీటర్ల దూరం ఉన్నాసరే వాటిని క్షిపణి ఖచ్చిత దిశలో జారవిడచగలదు. తొలుత కనిపెట్టిన అమెరికాఎంఐఆర్వీ టెక్నాలజీని తొలుత అమెరికా అభివృద్ధిచేసింది. 1970లో ఐసీబీఎంను పరీక్షించింది. 1971లో జలాంతర్గామి వెర్షన్లో ఎస్సీబీఎంను పరీక్షించింది. ఈ సాంకేతికతను 1970 చివర్లో నాటి సోవియట్ రష్యా అభివృద్ధిచేసింది. దీని సాయంతో ఐసీబీఎం, జలాంతర్గామి వెర్షన్ ఎస్ఎల్బీఎంను రూపొందించింది. అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందంలో భాగంగా అమెరికా, రష్యాలు స్వల్ప, దీర్ఘ, ఖండాంతర క్షిపణులను ధ్వంసంచేశాయి. 1991 జూన్ ఒకటోతేదీలోపు మొత్తంగా 2,692 క్షిపణులను నాశనంచేశాయి. అయితే ఈ ఒప్పందం నుంచి 2019లో అమెరికా వైదొలగింది. -
ఉక్రెయిన్పై ఏం చేద్దాం?
వాషింగ్టన్/న్యూఢిల్లీ: రష్యా–ఉక్రెయిన్ యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్తో ప్రధాని నరేంద్ర మోదీ చర్చలు జరిపారు. యుద్ధానికి తెర దించే మార్గాలపై లోతుగా చర్చించారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం శనివారం రాత్రి ప్రధాని అమెరికా చేరుకున్నారు. అనంతరం నేరుగా డెలావెర్లో విల్లింగ్టన్ లోని బైడెన్ నివాసానికి వెళ్లారు. మోదీకి అధ్యక్షుడు ఘనస్వాగతం పలికారు. వారిద్దరూ ఆతీ్మయంగా కౌగిలించుకున్నారు. అనంతరం మోదీ చేయి పట్టుకుని బైడెన్ లోనికి తీసుకెళ్లారు. పలు అంశాలపై నేతలిద్దరూ చాలాసేపు చర్చలు జరిపారు. ఉక్రెయిన్ సంక్షోభానికి ఈ భేటీలో పరిష్కార మార్గం లభించవచ్చని భావిస్తున్నారు. ఇజ్రాయెల్–గాజా ఘర్షణతో పాటు అమెరికా–భారత్ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లడం తదితర అంశాలు కూడా ప్రస్తావనకు వచ్చాయి. అంతకుముందు పెన్సిల్వేనియాలోని ఫిలడెల్ఫియా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో మోదీకి ఘనస్వాగతం లభించింది. ఆయన్ను చూసేందుకు ప్రవాస భారతీయులు భారీగా తరలివచ్చారు. వారితో ఆయన కరచాలనం చేస్తూ అటోగ్రాఫ్లు ఇస్తూ సందడి చేశారు.అమెరికాతో బంధం బలోపేతం ఇండో–పసిఫిక్ ప్రాంతంలో శాంతికి కృషి చేయడానికి భావసారూప్య దేశాలకు ‘క్వాడ్’ అత్యంత కీలకమైన వేదిక అని మోదీ పేర్కొన్నారు. ఈ మేరకు అమెరికా బయల్దేరే ముందు ప్రకటన విడుదల చేశారు. ‘‘బైడెన్, ఆ్రస్టేలియా ప్రధాని అల్బనీస్, జపాన్ ప్రధాని ఫుమియో కిషిదాతో భేటీ అయ్యేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. అమెరికాలోని ప్రవాస భారతీయులను కలుసుకోబోతుండడం ఆనందంగా ఉంది’’ అన్నారు. మోదీ అమెరికాలో కీలక సదస్సులు, సమావేశాల్లో పాల్గొంటారు. బైడెన్తో పాటు పలు దేశాధినేతలతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. విల్మింగ్టన్లో క్వాడ్ సదస్సులో, న్యూయార్క్లో ఐరాస సాధారణ సభలో ‘సమ్మిట్ ఆఫ్ ఫ్యూచర్’లో ప్రసంగిస్తారు. లాంగ్ ఐలండ్లో ప్రవాస భారతీయుల భేటీలో పాల్గొంటారు. ప్రఖ్యాత అమెరికా కంపెనీల సీఈఓలతో సమావేశమై ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్, సెమీకండక్టర్ వంటి అధునాతన సాంకేతికతపై చర్చిస్తారు. -
నా మంచి స్నేహితుడు మోదీ రాక కోసం ఎదురు చూస్తున్నా: పుతిన్
మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ నా స్నేహితుడి కోసం ఎదురు చూస్తున్నాం. ఆయనకు నా శుభాకాంక్షలు’అని రష్యా మీడియా సమావేశంలో పుతిన్ చెప్పినట్లు పేర్కొంది.బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశంలో భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ గురువారం రష్యాలోని సెయింట్ పీటర్స్ వర్గ్లో పుతిన్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పుతిన్తో దోవల్ కరచాలనం చేశారు. ఆ ఫొటోల్ని భారత్లోని రష్యన్ రాయబార కార్యాలయం ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది.🇷🇺🤝🇮🇳 On September 12, #Russia's President Vladimir Putin had a meeting with Ajit Doval, National Security Advisor to the Prime Minister of #India, at the Konstantinovsky Palace in #StPetersburg. 👉🏻 https://t.co/vFQ64S4vMq#RussiaIndia #DruzhbaDosti pic.twitter.com/KxcD9aciDG— Russia in India 🇷🇺 (@RusEmbIndia) September 12, 2024 గత నెలలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీతో ప్రధాని నరేంద్ర మోదీ జరిపిన చర్చల సారాంశాన్ని అజిత్ దోవాల్ పుతిన్కు వివరించారు. మోదీ ఆదేశాల మేరకు రష్యా పర్యటనకు వచ్చినట్లు అజిత్ దోవాల్ పుతిన్కు వివరించారు. ఈ చర్చల్లో సెప్టెంబర్ 22 నుంచి 24 వరకు రష్యాలోని కజన్ వేదికగా బ్రిక్స్ దేశాల సదస్సు జరగనుంది. ఆ సదస్సుకు మోదీ వస్తే, ఆయనతో విడిగా భేటీ కావాలనుకుంటున్నట్లు దోవల్కు పుతిన్ చెప్పారు.ఇదే అంశాన్ని రష్యా మీడియా సైతం ప్రస్తావించింది.ఇదీ చదవండి : బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే సీటుకు ఎసరు..రంగంలోకి సంపన్న మహిళరష్యన్ ఎంబసీ సైతం మోదీ రష్యా పర్యటన సందర్భంగా భారత్ - రష్యాల మధ్య కుదిరిన ఒప్పందాల అమలుకు సంబంధించి వచ్చిన ఫలితాలు,సమీప భవిష్యత్తుకు సంబంధించిన అవకాశాలను వివరించేందుకు బ్రిక్స్ సదస్సు సందర్భంగా అక్టోబర్ 22న ప్రధాని మోదీతో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించాలని పుతిన్ ప్రతిపాదించారు అని టెలిగ్రామ్లో విడుదల చేసిన ఒక ప్రకటనలో రష్యన్ ఎంబసీ తెలిపింది.కాగా, ఉక్రెయిన్ పర్యటనలో ఆదేశ అధ్యక్షుడు వ్లాదమీర్ జెలెన్ స్కీతో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. కొనసాగుతున్న ఉక్రెయిన్పై రష్యా యుద్ధాన్ని యుద్ధాన్ని ముగించేలా ఉక్రెయిన్-రష్యాలు చర్చలు జరుపుకోవాలని, ఈ రెండు దేశాల్లో శాంతిని పునరుద్ధరించడానికి భారత్ క్రియాశీల పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉందని మోదీ అన్నారు. -
రష్యాపై డ్రోన్లతో విరుచుకుపడ్డ ఉక్రెయిన్
ఉక్రెయిన్, రష్యా దేశాల మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఉక్రెయిన్ సేనలు రష్యాపై దాడులతో విరుచుకుపడుతున్నాయి. రష్యాలోని పలు ప్రాంతాలను స్వాధీనం చేసుకోవటమే లక్ష్యంగా బాంబు, డ్రోన్ దాడులు చేస్తోంది. తాజాగా శనివారం అర్ధరాత్రి రష్యా రాజధాని మాస్కో, ఇతర ప్రాంతాలే టార్గెట్గా ఉక్రెయిన్ ఆర్మీ డ్రోన్ దాడికి పాల్పడినట్లు రష్యా అధికారులు ఆదివారం వెల్లడించారు. మాస్కో వైపు దూసుకువచ్చిన డ్రోన్ను రష్యా ధ్వంసం చేసిందని మాస్కో మేయర్ సెర్గీ సోబ్యానిన్ తెలిపారు.🚨BREAKING/ALERT: Ukraine has launched a massive drone attack on Russia. Over 100+ drones are airborne & flights are being prevented from landing due to the attack. pic.twitter.com/OqWRnH6uh4— The Enforcer (@ItsTheEnforcer) August 31, 2024అదేవిధంగా రష్యా నైరుతి ప్రాంతంలోని బ్రయాన్స్క్ సరిహద్దు ప్రాంతంలో ఉక్రెయిన్ ప్రయోగించిన కనీసం 12 డ్రోన్లు కూడా ధ్వంసం చేసినట్లు ఆ ప్రాంత గవర్నర్ అలెగ్జాండర్ బోగోమాజ్ పేర్కొన్నారు. మానవరహిత దాడిలో కుర్స్క్ ప్రాంతంపై రెండు వాహనాలను కూడా కూల్చివేశామని తాత్కాలిక గవర్నర్ అలెక్సీ స్మిర్నోవ్ తెలిపారు. ఈ ప్రాంతాన్ని ఉక్రెయిన్ సైన్యం పాక్షికంగా స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ డ్రోన్ దాడుల వల్ల ఎలాంటి గాయాలు, నష్టం జరగలేదని రష్యా అధికారులు తెలిపారు. అదేవిధంగా.. గత కొన్ని రోజులుగా దాడుల్లో వేగం పెంచిన ఉక్రెయన్ రష్యా భూభాగాలను స్వాధీనం చేసుకోవటమే టార్గెట్గా ముందుకు సాగుతోంది. -
100 క్షిపణులు.. 100డ్రోన్లు..!
కీవ్: రష్యా మరోసారి పేట్రేగిపోయింది. ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు ఏకంగా 100 వందకు పైగా వివిధ రకాల క్షిపణులు, మరో 100 షహీద్ డ్రోన్లతో ఉక్రెయిన్పై దాడి చేసింది. ‘రష్యా మా కీలకమైన పౌర మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని దుర్మార్గపూరితంగా దాడు లకు తెగబడింది. ఖార్కివ్, కీవ్ మొద లుకొని ఒడెసా, పశ్చిమ ప్రాంతాల వరకు జరిగిన దాడుల్లో భారీగా నష్టం వాటిల్లింది’అని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తెలిపారు. ఈ దాడుల్లో కనీసం ఐదుగురు చనిపోగా, 13 మంది పౌరులు గాయప డ్డారని చెప్పారు. తమ భూభాగంపై రష్యా పాల్పడిన అతిపెద్ద దాడుల్లో ఇదొకటని జెలెన్స్కీ పేర్కొన్నారు. రష్యా సైన్యం ప్రయోగించిన డ్రోన్లు, క్రూయి జ్ మిస్సైళ్లు, హైపర్సోనిక్ బాలిస్టిక్ కింజాల్ క్షిపణులు మొత్తం 15 రీజియన్లలో..అంటే దాదాపు దేశంలోని సగం ప్రాంతాల్లో బీభ త్సం సృష్టించినట్లు ఉక్రెయిన్ ప్రధాని డెనిస్ ష్మిహాల్ పేర్కొన్నారు. ఉక్రెయిన్ ప్రభుత్వ రంగ విద్యుత్ గ్రిడ్ ఆపరేటర్.. ఉక్రెనెర్గో.. దెబ్బతిన్న మౌలిక వ్యవస్థను గాడినపెట్టేందుకు అత్యవసర విద్యుత్ కోతలను ప్రకటించింది. ప్రైవేట్ విద్యుత్ సంస్థ డీటీఈకే కూడా విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేందుకు తమ సిబ్బంది 24 గంటలూ పనిచేస్తున్నారని తెలిపింది. రాజధాని లోని విద్యుత్, నీటి సరఫరా వ్యవస్థలు తీవ్రంగా దెబ్బతిన్నట్లు కీవ్ మేయర్ తెలిపారు. కీవ్పైకి దూసు కొచ్చిన 15 క్షిపణులు, మరో 15 డ్రోన్లను రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నాయన్నారు. కాగా, ఉక్రెయిన్ సైనిక–పారిశ్రామిక సముదాల నిర్వహణకు ఎంతో కీలకమైన విద్యుత్ వ్యవస్థలను తమ దీర్ఘశ్రేణి క్షిపణులు, డ్రోన్లు ఛిన్నాభిన్నం చేశాయని, లక్ష్యాలను అవి గురి తప్పకుండా ఛేదించాయని రష్యా ఆర్మీ ప్రకటించింది.22 డ్రోన్లను కూల్చివేశాం: రష్యాసరటోవ్, యరోస్లావ్ల్ ప్రాంతాలపైకి ఆదివారం రాత్రి, సోమవారం ఉదయం ఉక్రెయిన్ ప్రయోగించిన 22 డ్రోన్లను ధ్వంసం చేసినట్లు రష్యా ఆర్మీ ప్రకటించింది. ఈ ఘటనల్లో పలు నివాస భవనాలు దెబ్బతినగా, నలుగురు గాయపడ్డారని తెలిపింది. కస్క్ రీజియన్లో ఉక్రెయిన్ బలగాలు మరింతగా ముందుకు సాగకుండా అడ్డుకున్నట్లు తెలిపింది. అదేవిధంగా, ఉక్రెయిన్ బలగాలు, ఆయుధ సామగ్రి రవాణాకు కేంద్రంగా ఉన్న పొక్రొవ్స్క్కు అతి సమీపంలోకి రష్యా బలగాలు చేరుకుంటున్నట్లు సమాచారం. Currently, across the country, efforts are underway to eliminate the consequences of the Russian strike. This was one of the largest attacks – a combined strike, involving over a hundred missiles of various types and around a hundred “Shaheds.” Like most Russian strikes before,… pic.twitter.com/0qNTGR98rR— Volodymyr Zelenskyy / Володимир Зеленський (@ZelenskyyUa) August 26, 2024 -
తటస్థం కాదు, భారత్ ఎప్పుడూ శాంతి వైపే: జెలెన్స్కీతో మోదీ
కీవ్: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో భారత ఎప్పుడూ తటస్థంగా లేదని, తాము ఎల్లప్పుడూ శాంతి వైపే ఉన్నామని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. చర్చలు, సంభాషణలు ద్వారానే వివాదాలను పరిష్కరించే ప్రయత్నాలకు భారత్ సమర్ధిస్తుందని పేర్కొన్నారు. ఈ మేరకు ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్స్కీతో కలిసి మీడియా సమావేశంలో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ఉక్రెయిన్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే ఈ సందర్భంగా ఆ దేశ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్స్కీతో మోదీ భేటీ అయ్యారు. రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం పరిష్కార మార్గాలపై ఇరువురు నేతలు చర్చించనున్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ..ఉక్రెయిన్లో యుద్ధాన్ని ముగించడానికి రష్యాతో చర్చలకు కూర్చోవాలని జెలెన్స్కీని మోదీ కోరారు. ఇరు దేశాల మధ్య శాంతిని నెలకొల్పడానికి స్నేహితుడిగా వ్యవహరించడానికి తాను సిద్ధంగా ఉన్నానని వెల్లడించారు.స్నేహితుడిగా సాయం చేసేందుకు సిద్దం: మోదీ‘చర్చలు, దౌత్యం ద్వారా మాత్రమే యుద్దానికి పరిష్కారానికి మార్గం కనుగొనవచ్చు. మనం సమయాన్ని వృధా చేయకుండా ఆ దిశలో పయనించాలి. ఈ సంక్షోభం నుంచి బయటపడటానికి ఇరుపక్షాలు కలిసి కూర్చోని చర్చించాలి. శాంతిని నెలకొల్పేదిశగా జరిగే ఎలాంటి ప్రయత్నాల్లోనైనా క్రియాశీలక పాత్ర పోషించేందుకు భారత్ సిద్ధంగా ఉందని నేను మీకు హామీ ఇస్తున్నాను. ఈ విషయంలో ఒక స్నేహితుడిగా నేను మీకు ఏం చేయాల్సి వచ్చినా అందుకు సిద్ధంగా ఉన్నాననే భరోసా ఇవ్వాలనుకుంటున్నాను’ అని మోదీ పేర్కొన్నారు.జెలెన్స్కీ భుజంపై చేతులు వేసిఅంతకముందు రాజధాని కీవ్లోని అమరుల స్మారక ప్రాంతానికి చేరుకున్న మోదీకి స్వాగతం పలికిన అధ్యక్షుడు జెలెన్స్కీ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. అనంతరం రష్యా దాడిలో మరణించిన చిన్నారులకు మోదీ నివాళి అర్పించారు. అక్కడికి వెళ్లే సమయంలో జెలెన్స్కీ భుజంపై చేతులు వేసిన మోదీ ఆత్మియంగా పలకరిస్తూ ముందుకు సాగారు. ఉక్రెయిన్ ఎదుర్కొన్న అతిపెద్ద సంక్షోభాల ఆనవాళ్లకు సంబంధించి అక్కడి మ్యూజియంలో ఏర్పాటుచేసిన ప్రదర్శనను ఇద్దరు నేతలు వీక్షించారు..గాంధీ విగ్రహానికి నివాళికీవ్లో ఉన్న మహాత్మాగాంధీ విగ్రహానికి మోదీ నివాళి అర్పించారు. బాపూజీ ఆశయాలు విశ్వవ్యాప్తమన్న ఆయన.. కోట్లాది మందికి స్ఫూర్తిదాయకమని చెప్పారు. మానవాళికి మహాత్ముడు చూపించిన బాటలో నడుద్దామని పిలుపునిచ్చారు. -
NATO: విధ్వంసకారి చైనా
వాషింగ్టన్/బీజింగ్: చైనా–రష్యా దేశాల మధ్య బంధం నానాటికీ బలపడుతుండడం పట్ల నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్(నాటో) సభ్యదేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. యుద్ధం పేరిట ఉక్రెయిన్లో విధ్వంసానికి రష్యాకు చైనా అండదండలు అందిస్తోందని మండిపడ్డాయి. డ్రాగన్ దేశం నిర్ణయాత్మక విధ్వంసకారిగా మారిందని ఆరోపించాయి. రష్యాతో భాగస్వామ్యానికి ఎలాంటి పరిమితులు లేవంటూ చైనా నాయకత్వం చేసిన ప్రకటనలను నాటో దేశాలు ప్రస్తావించాయి. రష్యా రక్షణ పారిశ్రామిక రంగానికి చైనా పూర్తిస్థాయిలో మద్దతుగా నిలుస్తోందని, దీనివల్ల రష్యా పొరుగు దేశాలతోపాటు యూరో–అట్లాంటిక్ భద్రతకు పెనుముప్పు పొంచి ఉందని వెల్లడించాయి. అమెరికాలోని వాషింగ్టన్లో నాటోలోని 32 సభ్యదేశాల అధినేతలు, ప్రతినిధులు సమావేశమయ్యారు. కూటమి 75వ వార్షికోత్సవాల్లో పాల్గొన్నారు. కూటమిలో 32వ సభ్యదేశంగా చేరిన స్వీడన్కు సాదర స్వాగతం పలికారు. భేటీ అనంతరం ‘వాషింగ్టన్ సమ్మిట్ డిక్లరేషన్’ పేరిట ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు. చైనా దుందుడుకు విధానాలు, చర్యలు తమ ప్రయోజనాలకు, భద్రతకు, విలువలకు సవాలు విసిరేలా ఉంటున్నాయని మండిపడ్డారు. రష్యాకు మద్దతిస్తే చైనాకే నష్టం ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యదేశమైన చైనా బాధ్యతాయుతంగా మసలుకోవాలని నాటో సభ్యదేశాల ప్రతినిధులు హితవు పలికారు. ఉక్రెయిన్లో అమాయకుల ప్రాణాలను బలిగొంటున్న రష్యాకు సహకరించుకోవడం తక్షణమే నిలిపివేయాలని సూచించారు. ఐక్యరాజ్యసమితి చార్టర్కు కట్టుబడి ఉండాల్సిన బాధ్యత చైనాపై ఉందని పునరుద్ఘాటించారు. రష్యాకు ఆయుధపరంగా, రాజకీయంగా ఎలాంటి సహకారం అందించవద్దని స్పష్టం చేశారు. రష్యాను గుడ్డిగా వెనుకేసుకొస్తే చైనాయే నష్టపోతుందని, ప్రపంచంలో ఏకాకిగా మారుతుందని తేలి్చచెప్పారు. రష్యా–చైనా–ఉత్తర కొరియా దేశాల మధ్య స్నేహ సంబంధాలు కొత్త చివుళ్లు తొడుగుతున్న నేపథ్యంలో దానికి ప్రతిచర్యగా ఇండో–పసిఫిక్ దేశాలతో భాగస్వామ్యాన్ని మెరుగుపర్చుకుంటామని నాటో సెక్రెటరీ జనరల్ జెన్స్ స్టోల్టెన్బర్గ్ ప్రకటించారు. అలజడి యత్నాలు మానుకోండి: చైనా ఉక్రెయిన్పై రష్యా సాగిస్తున్న యుద్ధంలో చైనా విధ్వంసకారిగా మారిందంటూ నాటో కూటమి నేతలు చేసిన విమర్శలను చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి లిన్ జియాన్ గురువారం ఖండించారు. సొంత భద్రత కోసం ఇతర దేశాల ప్రయోజనాలను బలిపెట్టడం నాటో దేశాలకు అలవాటేనని విమర్శించారు. ఆసియాలో అలజడి సృష్టించాలన్న ప్రయత్నాలు మానుకోవాలని చెప్పారు.నాటో సభ్య దేశాలు ఇవి...1.అమెరికా, 2.యునైటెడ్ కింగ్డమ్, 3.అల్బేనియా, 4.బెల్జియం, 5.బల్గేరియా, 6.కెనడా, 7.క్రొయేíÙయా, 8.చెక్రిపబ్లిక్, 9.డెన్మార్క్, 10.ఎస్తోనియా, 11.ఫిన్లాండ్, 12.ఫ్రాన్స్, 13.జర్మనీ, 14.గ్రీస్, 15.హంగేరీ, 16.ఐస్లాండ్, 17.ఇటలీ, 18.లాతి్వయా, 19.లిథువేనియా, 20.లక్సెంబర్గ్, 21.మాంటెనిగ్రో, 22.నెదర్లాండ్స్, 23.నార్త్ మాసిడోనియా, 24.నార్వే, 25.పోలాండ్, 26.పోర్చుగల్, 27.రొమేనియా, 28.స్లొవాకియా, 29.స్లొవేనియా, 30.స్పెయిన్, 31.స్వీడన్, 32.తుర్కియే -
ఎయిర్–డిఫెన్స్ వ్యవస్థలు అందజేస్తాం
వాషింగ్టన్: ఉక్రెయిన్–రష్యా యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ యుద్ధంలో రష్యాకు పరాభవం తప్పదని తేలి్చచెప్పారు. ఉక్రెయిన్కు అండగా నిలుస్తామని, గగనతలంలో శత్రువును మట్టికరిపించే ఎయిర్–డిఫెన్స్ వ్యవస్థలు అందజేస్తామని ప్రకటించారు. తాజాగా ‘నాటో’ 75వ సదస్సులో బైడెన్ ప్రసంగించారు. అమెరికాతోపాటు జర్మనీ, నెదర్లాండ్స్, రొమేనియా, ఇటలీ దేశాలు ఉక్రెయిన్కు అదనంగా ఐదు వ్యూహాత్మక ఎయిర్–డిఫెన్స్ వ్యవస్థలను అందజేయబోతున్నాయని తెలిపారు. రాబోయే రోజుల్లో పదుల సంఖ్యలో టాక్టికల్ ఎయిర్–డిఫెన్స్ వ్యవస్థలను ఉక్రెయిన్కు ఇవ్వబోతున్నామని వెల్లడించారు. తాము అందజేసే క్రిటికల్ ఎయిర్–డిఫెన్స్ ఇంటర్సెప్టర్లతో రష్యాపై యుద్ధంలో ఉక్రెయిన్ పైచేయి సాధిస్తుందని స్పష్టం చేశారు. రష్యా క్షిపణుల దాడులు, వైమానిక దాడుల నుంచి ఉక్రెయిన్ నగరాలతోపాటు ఉక్రెయిన్ సైన్యాన్ని కాపాడే ఇంటర్సెప్టర్లను వందల సంఖ్యలో అందిస్తామని పేర్కొన్నారు. యుద్ధంలో 3.50 లక్షల మందికిపైగా రష్యా సైనికులు మరణించడమో, గాయపడడమో జరిగిందని చెప్పారు. ఉక్రెయిన్ స్వేచ్ఛాయుతమైన, స్వతంత్రదేశంగా కొనసాగుతుందని ఉద్ఘాటించారు. ఎన్నికల దాకా ఎదురు చూడాలా?: జెలెన్స్కీ ఈ ఏడాది నవంబర్లో జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల కంటే ముందే రష్యా అధినేత పుతిన్కు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అన్నారు. నాటో సదస్సులో ఆయన మాట్లాడారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల దాకా ప్రపంచం ఎదురు చూడొద్దని చెప్పారు. ఉక్రెయిన్కు ఎఫ్–16 ఫైటర్ జెట్లు ఇస్తాం: నార్వే ఉక్రెయిన్కు ఆరు ఎఫ్16 ఫైటర్ జెట్లు అందజేస్తామని నాటో సభ్యదేశమైన నార్వే ప్రధాని జోనాస్ ప్రకటించారు. అయితే, ఎప్పటి నుంచి ఈ యుద్ధ విమానాలు ఉక్రెయిన్కు అందజేస్తారన్నది ఆయన వెల్లడించలేదు. -
Switzerland Peace Summit: ఉక్రెయిన్లో శాంతికి ప్రాదేశిక సమగ్రతే ముఖ్య భూమిక
బెర్న్: ఉక్రెయిన్–రష్యా యుద్ధానికి ముగింపు పలికే దిశగా ఎలాంటి శాంతి ఒప్పందానికైనా ఉక్రెయిన్ ప్రాదేశిక సమగ్రతే ముఖ్య భూమిక అవుతుందని 80 దేశాలు తేలి్చచెప్పాయి. ఉక్రెయిన్ ప్రాదేశిక సమగ్రతను, సార్వ¿ౌమత్వాన్ని తాము గౌరవిస్తున్నామని స్పష్టం చేశాయి. ఉక్రెయిన్లో శాంతి సాధన కోసం స్విట్జర్లాండ్లో రెండు రోజులపాటు జరిగిన సదస్సు ఆదివారం ముగిసింది. దాదాపు 100 దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఆదివారం 80 దేశాల ప్రతినిధులు ఉమ్మడిగా ఒక ప్రకటన విడుదల చేశారు. భారత్ సహా కొన్ని దేశాలు ఈ ప్రకటనలో పాలుపంచుకోలేదు. తుది డాక్యుమెంట్పై సంతకం చేయలేదు. యుద్ధం మొదలైన తర్వాత స్వా«దీనం చేసుకున్న ఉక్రెయిన్ భూభాగాలను వెనక్కి ఇచ్చేయాలని పలుదేశాలు రష్యాకు సూచించాయి. స్విట్జర్లాండ్ సదస్సు పట్ల ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ హర్షం వ్యక్తం చేశారు. తమ దేశంలో శాంతికి ఇదొక తొలి అడుగు అని అభివరి్ణంచారు. అయితే, ఈ సదస్సుకు రష్యా మిత్రదేశం చైనా హాజరుకాలేదు. రష్యాను ఆహ్వా నించలేదు. భారత్ తరపున విదేశాంగ శాఖ కార్యదర్శి(పశి్చమ) పవన్ కపూర్ హాజరయ్యారు. -
జీ-7 మద్దతు: ఉక్రెయిన్-రష్యా యుద్ధం! మళ్లీ బీభత్సమేనా!
ఇటలీలోని అపులియాలో నిర్వహించిన జీ-7 దేశాల సమ్మిట్ రష్యాతో పోరాడుతున్న ఉక్రెయిన్కు మద్దతుగా నిలిచింది. అదేవిధంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ సైతం జీ-7 సమ్మిట్లో పలు దేశాధినేతలతో భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో పశ్చాత్య దేశాల మద్దతు కారణంగా ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం మరింత చెలరేగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.మరోవైపు.. ఫ్రాన్స్ బలగాలు ఉక్రెయిన్ యుద్ధం భూమిలో దిగనున్నాయి. యూకే 300 కిలోమీటర్ల రేంజ్ ఉండే స్టార్మ్ షాడో క్షిపణులు అందజేయనుంది. రష్యాను టార్గెట్ చేయడానికి పలు అధునాత రాకెట్లు, మిసైల్స్ను అమెరికా ఉక్రెయిన్కు సరఫరా చేయనుంది. జీ-7 దేశాల సమ్మిట్ ద్వారా ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ జెలెన్స్కీ పాశ్చాత్య దేశాల మద్దతు మరింత కూడగట్టుకున్నట్లు తెలుస్తోంది. అమెరికా భారీ ఆర్థిక, సైనిక సాయాన్ని ఉక్రెయిన్కు అందించేందుకు ఆమోదం తెలిపింది. దీంతో రష్యా ఆధీనంలో ఉన్న క్రిమియాలోని స్థావరాలపై ఉక్రెయిన్ టార్గెట్ చేయనున్నట్లు తెలుస్తోంది.జీ-7 దేశాల సమ్మిట్లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ భారత ప్రధాని మోదీతో కూడా భేటీ అయ్యారు. ఉక్రెయిన్-రష్యా యుద్ధం గురించి జెలెన్స్కీ మోదీకి వివరించినట్లు తెలుస్తోంది. మరోవైపు.. పాశ్చాత్యదేశాలు ఉక్రెయిన్కు సహకరించాడాన్ని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఖండించిన విషయం తెలిసిందే. అదే విధంగా రష్యా సార్వభౌమత్వానికి ముప్పు వస్తే.. అణ్వాయుధాలు వినియోగించడాకి కూడా వెనకడబోమని గతంలోనే ఆయన హెచ్చరించారు. చదవండి: జీ-7లో ప్రధాని మోదీ.. ఉక్రెయిన్కు రష్యా ఆఫర్.. ఏంటంటే? -
Italian Premier Giorgia Meloni: రష్యా ప్రతిపాదన.. ఓ ఎత్తుగడ
బోర్గో ఎగ్నాజియా(ఇటలీ): సరిగ్గా జీ7 శిఖరాగ్ర భేటీ మొదలైన రోజే షరతులు ఒప్పుకుంటే ఉక్రెయిన్లో కాల్పుల విరమణ తక్షణం అమలుచేస్తానని రష్యా అధ్యక్షుడు పుతిన్ చేసిన ప్రకటనను ప్రచార ఎత్తుగడగా అని ఇటలీ మహిళా ప్రధాని జార్జియా మెలోనీ అభివరి్ణంచారు. ఇటలీ సారథ్యంలో ఈ ఏడాది జీ7 భేటీ జరిగాక శనివారం విలేకరుల సమావేశంలో మెలోనీ మాట్లాడారు. ‘‘ కుదిరితే జపాన్, లేదంటే అమెరికా, బ్రిటన్, కెనడాలు సంయుక్తంగా ఉక్రెయిన్కు 50 బిలియన్ డాలర్లమేర రుణాలు ఈ ఏడాది చివరికల్లా అందిస్తాయి. యూరప్లో స్తంభింపజేసిన రష్యా ఆస్తులను వాడుకుని తద్వారా ఈ రుణాలను చెల్లిస్తాయి. యురోపియన్ యూనియన్ సభ్య దేశాలకు ఈ రుణాలతో ఎలాంటి సంబంధం లేదు. అమెరికా, బ్రిటన్ వంటి జీ7 దేశాలే ఈ రుణ అంశాలను చూసుకుంటాయి’ అని స్పష్టంచేశారు. గాజా స్ట్రిప్పై భీకర దాడులతో వేలాది మంది అమాయక పాలస్తీనియన్ల మరణాలకు కారణమైన ఇజ్రాయెల్ను జీ7 దేశాలు ఎందుకు శిఖరాగ్ర సదస్సులో తీవ్రంగా మందలించలేదు? అని మీడియా ప్రశ్నించింది. ‘‘ అసలు ఈ యుద్ధాన్ని మొదలుపెట్టింది ఎవరు అనేది మీరొకసారి గుర్తుచేసుకోండి. హమాస్ మిలిటెంట్లు మెరుపుదాడి చేసి 1,200 మందిని పొట్టనపెట్టుకున్నారు. హమాస్ పన్నిన ఉచ్చులో ఇజ్రాయెల్ పడింది’ అని మెలోనీ వ్యాఖ్యానించారు. ‘‘ అక్రమ వలసలకు వ్యతిరేకంగా జీ7 కూటమి స్పందించడాన్ని స్వాగతిస్తున్నాం. ఆఫ్రికా దేశాలకు నిధుల మంజూరు, పెట్టుబడులు పెంచడం ద్వారా ఆయా దేశాల నుంచి ఐరోపాకు వలసలను తగ్గించవచ్చు’ అని చెప్పారు. ఐరోపా దేశాలకు వలస వస్తున్న ఆఫ్రికా పేదలకు ఇటలీ ముఖద్వారంగా ఉన్న విషయం విదితమే. -
G7 Summit 2024: చైనా అండతోనే ఉక్రెయిన్పై రష్యా యుద్ధం
రోమ్: 2022 ఫిబ్రవరిలో ప్రారంభమైన ఉక్రెయిన్–రష్యా యుద్ధం ఇంకా కొనసాగుతోంది. ఉక్రెయిన్పై రెండేళ్లకుపైగా దాడులు కొనసాగించే శక్తి రష్యాకు ఎలా వచి్చంది? అమెరికాతోపాటు పశి్చమ దేశాలు డ్రాగన్ దేశం చైనా వైపు వేలెత్తి చూపిస్తున్నాయి. చైనా అండదండలతోనే ఉక్రెయిన్పై రష్యా సైన్యం క్షిపణులు, డ్రోన్లతో భీకర దాడులు చేస్తోందని, సాధారణ ప్రజల ప్రాణాలను బలి తీసుకుంటోందని జీ7 దేశాలు ఆరోపించాయి. ఇటలీలో సమావేశమైన జీ7 దేశాల అధినేతలు తాజాగా ఈ మేరకు ఒక ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. చైనా తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చైనా అండ చూసుకొని రష్యా రెచి్చపోతోందని ఆరోపించారు. రష్యా యుద్ధ యంత్రానికి చైనానే ఇంధనంగా మారిందని జీ7 దేశాలు మండిపడ్డారు. రష్యాకు మిస్సైళ్లు డ్రోన్లు చైనా నుంచే వస్తున్నాయని ఆక్షేపించారు. జీ7 దేశాలు సాధారణంగా రష్యాను తమ శత్రుదేశంగా పరిగణిస్తుంటాయి. ఈ జాబితాలో ఇప్పుడు చైనా కూడా చేరినట్లు కనిపిస్తోంది. మారణాయుధాలు తయారు చేసుకొనే పరిజ్ఞానాన్ని రష్యాకు డ్రాగన్ అందిస్తోందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ విమర్శించారు. ఉక్రెయిన్పై యుద్ధం మొదలైన తర్వాత రష్యాకు చైనా నేరుగా ఆయుధాలు ఇవ్వకపోయినా ఆయుధాల తయారీకి అవసరమైన విడిభాగాలు, ముడి సరుకులు, సాంకేతిక పరిజ్ఞానాన్ని సరఫరా చేస్తోందని ఆక్షేపించారు. చైనాలో మానవ హక్కుల ఉల్లంఘన ఉక్రెయిన్లో మారణహోమం సృష్టించేలా రష్యాకు సహకరిస్తున్న దేశాలపై, సంస్థలపై కఠిన చర్యలు తీసుకోకతప్పదని జీ7 దేశాల అధినేతలు తేలి్చచెప్పారు. ఉక్రెయిన్పై చట్టవిరుద్ధమైన యుద్ధానికి మద్దతివ్వడం మానుకోవాలని హితవు పలికాయి. ఉక్రెయిన్పై దాడుల తర్వాత రష్యాపై పశి్చమ దేశాలు ఆంక్షలు విధించాయి. దీంతో తమకు అవసరమైన సరుకులను చైనా నుంచి రష్యా దిగుమతి చేసుకుంటోంది. అలాగే రష్యా నుంచి చైనా చౌకగా చమురు కొనుగోలు చేస్తోంది. ఇరుదేశాలు పరస్పరం సహరించుకుంటున్నాయి. టిబెట్, షిన్జియాంగ్తోపాటు హాంకాంగ్లో చైనా దూకుడు చర్యలను జీ7 సభ్యదేశాలు తప్పుపట్టాయి. చైనా మానవ హక్కుల ఉల్లంఘన కొనసాగుతోందని ఆరోపించాయి. మరోవైపు డ్రాగన్ దేశం అనుసరిస్తున్న వ్యాపార విధానాలను అమెరికాతోపాటు యూరోపియన్ యూనియన్(ఈయూ) దేశాలు తప్పుపడుతున్నాయి. ఎలక్ట్రికల్ వాహనాలు, పునరుత్పాదక ఇంధన ఉత్పత్తులు, సోలార్ ప్యానెళ్ల తయారీకి చైనా ప్రభుత్వం భారీగా రాయితీలిస్తోంది. దీంతో ఇవి చౌక ధరలకే అందుబాటులో ఉంటూ విదేశీ మార్కెట్లను ముంచెత్తుతున్నాయి. ఫలితంగా ఆయా దేశాల్లో వీటిని తయారు చేసే కంపెనీలు గిరాకీ లేక మూతపడుతున్నాయి. ఫలితంగా ఉద్యోగాల్లో కోతపడుతోంది. చైనా దిగుమతులతో పశి్చమ దేశాలు పోటీపడలేకపోతున్నాయి. చైనా ఎత్తుగడలను తిప్పికొట్టడానికి చైనా ఉత్పత్తులపై అమెరికాతోపాటు ఈయూ దేశాలు భారీగా పన్నులు విధిస్తున్నాయి. -
Russia-Ukraine war: కిర్గిజ్స్తాన్లో విదేశీయులపై దాడులు
న్యూఢిల్లీ/బిష్కెక్: స్థానికులు, విదేశీయులకు మధ్య ఘర్షణలతో కిర్గిజ్స్తాన్ రాజధాని బిష్కెక్ అట్టుడికిపోతోంది. విదేశీయులను లక్ష్యంగా చేసుకుని కొందరు స్థానికులు దాడులకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా ఇక్కడి మెడికల్ యూనివర్సిటీల్లో చదువుకుంటున్న ఇండియా, పాకిస్తాన్ విద్యార్థులపై అల్లరి మూకలు దాడులకు దిగుతున్నాయి. ఈ నేపథ్యలో బిష్కెక్లోని భారతీయ విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని భారత ప్రభుత్వం శనివారం సూచించింది. గొడవలు సద్దుమణిగేదాకా ఎవరూ బయటకు రావొద్దని, హాస్టళ్లు, ఇళ్లల్లో ఉండాలని స్పష్టం చేసింది. భారతీయ విద్యార్థులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నామని, వారి క్షేమ సమాచారాలు తెలుసుకుంటున్నామని కిర్గిజ్స్తాన్లోని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. బిష్కెక్ లో పరిస్థితి ప్రస్తుతం అదుపులోనే ఉందని, అయినప్పటికీ విద్యార్థులు అప్రమత్తంగా వ్యవహరించాలని, హాస్టళ్లు, ఇళ్లల్లో ఉండాలని స్పష్టంచేసింది. ఏదైనా సహాయం కావాలంటే భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలని బిషె్కక్లోని భారతీయ విద్యార్థులకు భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ సూచించారు. ఈ మేరకు ‘ఎక్స్’లో పోస్టు చేశారు. మన విద్యార్థుల భద్రత గురించి ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నామని, స్థానిక అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు. కిర్గిజ్స్తాన్లో ప్రస్తుతం దాదాపు 14,500 మంది భారతీయ విద్యార్థులు ఉన్నారు. వీరిలో ఎంత మంది బిష్కెక్లో ఉన్నారన్నది ఇంకా తెలియరాలేదు. అయితే, బిషె్కక్లో ప్రశాంతమైన వాతావరణ ఉందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం, పౌరుల భద్రతకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని కిర్గిజ్స్తాన్ విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో స్పష్టంచేసింది. ఎందుకీ ఘర్షణలు? కిర్గిజ్స్తాన్లో అలజడికి మూలాలు ఉక్రెయిన్–రష్యా యుద్ధంలో ఉన్నాయి. ఒకప్పటి సోవియట్ యూనియన్లో భాగమైన కిర్గిజ్స్తాన్ 1991లో స్వతంత్ర దేశంగా మారింది. ఇక్కడి అధికారిక భాష రష్యన్. 2022 ఫిబ్రవరి 24న ఉక్రెయిన్పై రష్యా హఠాత్తుగా దాడి చేయడంతో కిర్గిజ్స్తాన్కు ఒక్కసారిగా కష్టాలు వచి్చపడ్డాయి. రష్యా నుంచి వచ్చే పెట్టుబడులు ఆగిపోయాయి. రష్యాలోని కిర్గిజ్స్తాన్ కారి్మకులకు వేతనాలు రాక సొంత దేశానికి డబ్బులు పంపడం లేదు. దీనికితోడు కిర్గిజ్స్తాన్పై పశ్చిమ దేశాలు ఆంక్షలు విధించాయి. దీంతో ఆర్థిక పరిస్థితి దారుణంగా పడిపోయింది. ఆర్థిక వ్యవస్థ స్తంభించింది. మరోవైపు రష్యా నుంచి లక్షలాది మంది కిర్గిజ్స్తాన్కు వలస వస్తున్నారు. కుటుంబాలతో సహా ఇక్కడే స్థిరపడుతున్నారు. అధికారిక లెక్కల ప్రకారమే 2022 సెపె్టంబర్ నుంచి ఇప్పటిదాకా 1,84,000 రష్యన్లు కిర్గిజ్స్తాన్కు తరలివచ్చారు. ఆర్థిక పరిస్థితి దిగజారడంతో పరిశ్రమలు, దుకాణాలు మూతపడుతున్నాయి. స్థానికులు ఉద్యోగాలు, ఉపాధి కోల్పోతున్నారు. దాంతో వారిలో అసంతృప్తి, అసహనం పెరిగిపోతోంది. విదేశీయులను లక్ష్యంగా చేసుకొని దాడులకు దిగుతున్నారు. ప్రధానంగా రాజధాని బిషె్కక్లోని వైద్య విశ్వవిద్యాలయాల్లో చదువుకుంటున్న ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఈజిప్టు సహా ఇతర దేశాల విద్యార్థులపై వారి కన్నుపడింది. విద్యార్థులు ఉంటున్న హాస్టళ్లు, ఇళ్లల్లోకి గుంపులు గుంపులుగా చొరబడిమరీ దాడి చేస్తున్నారు. ఇదే అదనుగా అల్లరి మూకలు రెచ్చిపోతున్నాయి. విద్యార్థులు సైతం ప్రతిఘటిస్తుండడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారుతోంది. గత కొన్ని రోజులుగా ఘర్షణలు జరుగుతున్నాయి. ఇరువర్గాల మధ్య దాడుల్లో ఇప్పటికే పలువురు గాయపడ్డారు. ముగ్గురు పాకిస్తాన్ విద్యార్థులు మృతి చెందినట్లు వార్తలు వచ్చాయి. -
Russia-Ukraine war: జపొరిజియా అణు ప్లాంట్పై ఉక్రెయిన్ డ్రోన్ దాడులు
కీవ్: రష్యా ఆక్రమిత జపొరిజియా అణు విద్యుత్ ప్లాంట్పై డ్రోన్ దాడి జరిగిందని అధికారులు తెలిపారు. ప్లాంట్లోని ఆరో యూనిట్ డోమ్ సహా పలు చోట్ల ఉక్రెయిన్ మిలటరీ డ్రోన్లు ఆదివారం దాడి చేశాయన్నారు. అయితే ఎటువంటి నష్టం వాటిల్లలేదని, ఎవరూ చనిపోలేదని అన్నారు. ప్లాంట్లో అణుధారి్మకత స్థాయిలు కూడా సాధారణంగానే ఉన్నట్లు వివరించారు. దాడి సమాచారం తమకు అందిందని అంతర్జాతీయ అణు శక్తి సంస్థ(ఐఏఈఏ) తెలిపింది. ఇటువంటి దాడులతో భద్రతాపరమైన ప్రమాదాలున్నాయని హెచ్చరించింది. యూరప్లోనే అతి పెద్దదైన జపొరిజియా అణు విద్యుత్కేంద్రం 2022 నుంచి రష్యా ఆ«దీనంలోనే ఉంది. ఇందులోని ఆరు యూనిట్లు కొద్ది నెలలుగా మూతబడి ఉన్నాయి. -
Russia-Ukraine war: రష్యా క్షిపణి దాడుల్లో 8 మంది మృతి
కీవ్: ఉక్రెయిన్లోని రెండో అతిపెద్ద నగరం ఖార్కీవ్పైకి రష్యా క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది. శుక్రవారం రాత్రి నుంచి జరిపిన దాడుల్లో 8 మంది చనిపోగా మరో 12 మంది గాయపడ్డారు. రష్యా 32 ఇరాన్ తయారీ షహీద్ డ్రోన్లను, ఆరు క్షిపణులను ప్రయోగించగా 28 డ్రోన్లను, 3 క్రూయిజ్ మిస్సైళ్లను కూలి్చవేశామని ఉక్రెయిన్ ఆర్మీ తెలిపింది. తాజా దాడులపై రష్యా మిలటరీ ఎటువంటి ప్రకటనా చేయలేదు. -
Russia-Ukraine war: రష్యాపై డ్రోన్లతో దాడి
కీవ్: రష్యా భూభాగంపై ప్రతి దాడులను ఉక్రెయిన్ ముమ్మరం చేసింది. శుక్రవారం సరిహద్దుల్లోని రష్యాకు చెందిన రోస్టోవ్ ప్రాంతంపైకి ఉక్రెయిన్ పదుల సంఖ్యలో డ్రోన్లను ప్రయోగించింది. ఈ దాడుల్లో మొరొజొవ్స్కీ ఎయిర్ ఫీల్డ్లోని ఆరు సైనిక విమానాలు ధ్వంసం కాగా, మరో ఎనిమిదింటికి నష్టం వాటిల్లిందని ఉక్రెయిన్ తెలిపింది. 20 మంది సిబ్బంది చనిపోయినట్లు ప్రకటించుకుంది. మొరొజొవ్స్కీ ప్రాంతంపైకి వచ్చిన 44 డ్రోన్లను కూల్చివేసినట్లు రష్యా రక్షణ శాఖ తెలిపింది. వైమానిక స్థావరంపై దాడి, యుద్ధ విమానాలకు జరిగిన నష్టంపై రష్యా స్పందించలేదు. దాడుల్లో ఒక విద్యుత్ ఉపకేంద్రం మాత్రం ధ్వంసమైందని పేర్కొంది. సరటోవ్, కుర్స్క్, బెల్గొరోడ్, క్రాస్నోడార్లపైకి వచ్చిన డ్రోన్లను అడ్డుకున్నట్లు రష్యా ఆర్మీ తెలిపింది. -
మొదలైన రష్యా అధ్యక్ష ఎన్నికల పోలింగ్
వ్లాదిమిర్ పుతిన్ పేరు చెబితే ఠక్కున గుర్తొచ్చే దేశం రష్యా. చాలా సంవత్సరాలుగా పుతిన్ ఏలుబడిలో ఉన్న రష్యాలో ఇవాళ్టి నుంచి మూడు రోజులు కీలకంగా మారనుంది. అందుకు కారణం.. ఆ దేశానికి అధ్యక్ష ఎన్నికలు జరుగుతుండడం. గతంలో ఒక్కరోజులో పోలింగ్ పూర్తయ్యేది. అయితే.. దేశ చరిత్రలో తొలిసారిగా వరసగా మూడు రోజులపాటు అంటే 15, 16, 17 తేదీల్లో పోలింగ్కు రష్యా సిద్ధమైంది. శుక్రవారం పోలింగ్ ప్రారంభమైందక్కడ.. ప్రస్తుత పదవీకాలంతో కలిపి పుతిన్ ఇప్పటికే నాలుగు సార్లు(2000, 2004, 2012, 2018)లో అధ్యక్ష పీఠాన్ని అధిరోహించారు. 2008లో ప్రధానిగానూ సేవలందించారు. మానవహక్కుల గొంతుక, విపక్ష నేత అలెక్సీ నావల్నీ గత నెల మారుమూల కారాగారంలో అనుమానాస్పద స్థితిలో చనిపోవడంతో ఈసారి పుతిన్ వ్యతిరేక ఓటింగ్ పెరుగుతుందా? లేదా అనేది వేచిచూడాలి. ఉక్రెయిన్పై దురాక్రమణతో ప్రస్తుతం తన అధీనంలో ఉన్న నాలుగు ఉక్రెయిన్ రీజియన్లలోనూ ఈ ఎన్నిక క్రతువు కొనసాగనుంది. పుతిన్ హవా.. అధ్యక్ష రేసులో పుతిన్ విజయబావుటా ఎగరేస్తారని ఇప్పటికే జాతీయ, అంతర్జాతీయ మీడియా కోడైకూస్తోంది. అయినా సరే పౌర హక్కులను కాలరాస్తూ, నియంత పోకడలతో దేశాన్ని ఏలుతున్న పుతిన్ పాలనకు అంతం పలుకుతామంటూ విపక్ష పార్టీల నేతలు ప్రతినబూనారు. ఎన్నికల రణరంగంలో పుతిన్ను ఓడిస్తామంటూ లిబరల్ డెమొక్రటిక్ పార్టీ ఆఫ్ రష్యా(ఎల్డీపీఆర్) తరఫున అభ్యరి్థగా లియోనిడ్ స్లట్స్కీ, న్యూ పీపుల్ పార్టీ అభ్యరి్థగా వ్లాదిస్లేవ్ దవాన్కోవ్, కమ్యూనిస్ట్ పార్టీ అభ్యరి్థగా నికోలే ఖరిటోనోవ్లు ఎన్నికల బరిలో నిలిచారు. దేశ ఓటర్లలో పుతిన్కు 75 శాతం మద్దతు ఉందని, ఈ ముగ్గురు తలో 5 శాతం ఓట్లతో సరిపెట్టుకుంటారని ముందస్తు పోలింగ్ అంచనాలు విశ్లేíÙస్తున్నాయి. పోలింగ్ ఎక్కడెక్కడ? పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ గురువారం కంటే ముందే మొదలుపెట్టారు. శుక్రవారం సాధారణ ఓటింగ్ మొదలైంది. ఆక్రమిత ఉక్రెయిన్ ప్రాంతాలపై పుతిన్ ప్రధానంగా దృష్టిపెట్టారు. రష్యా భూభాగంలో ఎలాగూ మెజారిటీ సాధిస్తానని పుతిన్ బలంగా నమ్ముతున్నారు. ఉక్రెయిన్ ప్రాంతాల్లో గెలిచి తమది అధర్మ యుద్ధం కాదని ప్రపంచానికి చాటి చెప్పాలని పుతిన్ యోచిస్తున్నారు. ఇక్కడ స్థానిక ఎన్నికలు, రెఫరెండమ్లు ఇప్పటికే నిర్వహించారు. అంతర్జాతీయ నిబంధనలు ఉల్లంఘనకు గురయ్యాయని ప్రపంచదేశాలు మొత్తుకున్నా పుతిన్ పట్టించుకోవట్లేదు. ఈసారి 11.42 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారని తెలుస్తోంది. అర్హులైన ఓటర్లు విదేశాల్లో ఉన్నా సరే ఓటేయొచ్చు. మార్చి 19 కల్లా తొలి దఫా ఫలితాలు వెల్లడి కావచ్చు. తుది ఫలితాలు తెలియాలంటే మార్చి 29వ తేదీకా ఆగాల్సిందే. 2018 గత అధ్యక్ష ఎన్నికల్లో 68 శాతం పోలింగ్ నమోదైంది. ఇంకెన్నాళ్లు పుతిన్ పాలిస్తారు? మరో రెండు పర్యాయాలు దేశ అధ్యక్షుడిగా కొనసాగేందుకు అనువుగా చట్టం చేసి 2021లో పుతిన్ దానిపై సంతకం చేశారు. ఈసారి గెలిచి, 2030లోనూ గెలిస్తే 2036దాకా పుతిన్ దేశాధ్యక్షుడిగా కొనసాగుతారు. రష్యా పాలకుడు జోసెఫ్ స్టాలిన్ తర్వాత అత్యంత ఎక్కువకాలం దేశాన్ని పాలించిన నేతగా పుతిన్ పేరు ఇప్పటికే చరిత్రకెక్కింది. కుంభస్థలిని కొట్టగలరా ? పోటీలో ఏ అభ్యర్థి నిలబడాలి అనేది దాదాపు దేశ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ(సీఈసీ) నిర్ణయిస్తుంది. ఎల్డీపీఆర్ నేత లియోనిడ్ స్లట్స్కీ, న్యూ పీపుల్ పార్టీ నేత వ్లాదిస్లేవ్ దవాన్కోవ్, కమ్యూనిస్ట్ పార్టీ నేత నికోలే ఖరిటోనోవ్లు ఈసారి బరిలో దిగారు. పుతిన్ను వీరంతా విమర్శిస్తున్నప్పటికీ ఉక్రెయిన్తో యుద్ధాన్ని వీరు వ్యతిరేకించలేదు. యుద్ధాన్ని వ్యతిరేకించిన ఏకైక విపక్ష నేత బోరిస్ నదేహ్దిన్ను పోటీకి నిలబడకుండా సీఈసీ అడ్డుకుంది. అభ్యరి్ధత్వానికి సరిపడా సంతకాలను సేకరించలేకపోయారని ఆయన అభ్యరి్ధత్వాన్ని తిరస్కించింది. మరో అభ్యర్ధి యెకటేరియా డుంట్సోవానూ సీఈసీ ఇలాగే పక్కకునెట్టింది. పుతిన్ను ప్రధానంగా విమర్శించే విపక్ష నేత అలెక్సీ నావల్నీ ఇప్పుడు ప్రాణాలతో లేడు. స్లట్స్కీ, దవాన్కోవ్, ఖరిటోనోవ్లు దేశ సమైక్యత విషయానికొచ్చేసరికి పుతిన్కు పరోక్షంగా మద్దతు పలుకుతారు. ఈ లెక్కన దేశ సమైక్యత జెండా పట్టిన పుతిన్కే ఎక్కువ ఓట్లు పడతాయి. దీంతో వీళ్లు పుతిన్ను ఓడించడం అనేది అసంభవం. పుతిన్కు నిజంగా అంతటి ఫాలోయింగ్ ఉందా? రష్యా పౌరులు ఆంక్షల చట్రం, నిఘా నీడలో జీవిస్తారని పశి్చమదేశాలు తరచూ ఆరోపిస్తుంటాయి. దీంతో పుతిన్ను ఇష్టపడే ఎన్నుకుంటున్నారా లేదంటే మరో ప్రత్యామ్నాయం లేక పుతిన్కు జై కొడుతున్నారా అనేది ఇతమిద్ధంగా ఎవరికీ తెలీదు. పుతిన్ పాపులారిటీ 80 శాతాన్ని దాటేసిందని అక్కడి ప్రభుత్వేతర ఎన్నికల మేథో సంస్థ ‘ది లెవడా సెంటర్’ ఇటీవల ప్రకటించింది. అయితే 2023 చివరి నుంచి దేశవ్యాప్తంగా పెరిగిన ద్రవ్యోల్బణం, నిత్యావసరాల ధరవరలు ఎగిసిన నేపథ్యంలో పుతిన్ పాలనపై ప్రజల్లో ఆగ్రహావేశాలు పెరిగాయని సంస్థ విశ్లేషించడం గమనార్హం. తనను వ్యతిరేకించే వాళ్లను పుతిన్ అస్సలు సహించలేడని పుతిన్కు గతంలో ప్రసంగాలు రాసి ఇచ్చిన అబ్బాస్ గలియమోవ్ చెప్పారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఉక్రెయిన్–రష్యా యుద్ధం: హైదరాబాద్ యువకుడు మృతి
సాక్షి, సిటీబ్యూరో/ నాంపల్లి: ఉపాధి, అధిక వేతనం ఆశ.. ఏజెంట్ల మోసం కారణంగా పాతబస్తీకి చెందిన ఓ యువకుడు రష్యాలో మృత్యువాతపడ్డాడు. బజార్ఘాట్కు చెందిన మహ్మద్ అఫ్సాన్ ఉద్యోగం కోసం రష్యాకు వెళ్లగా.. ఏజెంట్ల చేతిలో మోసపోయి రష్యాలోని పుతిన్ ప్రైవేట్ సైన్యంలో చేరాల్సి వచ్చింది. ఇతను ఉక్రెయిన్తో యుద్ధంలో పాల్గొని అక్కడే అసువులు బాశాడు. ఈమేరకు రష్యాలోని భారతీయ రాయబారి కార్యాలయానికి సమాచారం అందింది. వారు బుధవారం అఫ్సాన్ సోదరుడు ఇమ్రాన్కు ఫోన్ చేసి ఈ విషయం తెలిపారు. దీంతో బజార్ఘాట్లో విషాదఛాయలు అలుముకున్నాయి. కాగా అఫ్సాన్ దీన స్థితిని వివరించి కాపాడాలని ఇక్కడి ప్రభుత్వానికి విన్నవించినా ఫలితం లేకపోవడంతోనే తన సోదరుడు చనిపోయాడని ఇమ్రాన్ ఆవేదన వ్యక్తం చేశాడు. నారాయణ్పేట్కు చెందిన మహ్మద్ సుఫియాన్ అనే మరో యువకుడు ఉక్రెయిన్ యుద్ధంలో చిక్కుకుపోయాడని, కనీసం అతడినైనా కాపాడాలని ఇమ్రాన్ విజ్ఞప్తి చేశాడు. ఆయన ఇక్కడ సాక్షి ప్రతినిధితో మాట్లాడుతూ తన సోదరుడిని బాబా బ్లాక్స్ కంపెనీ ఉద్యోగంలోకి తీసుకుందని, ఆ సంస్థ దుబాయ్, ఢిల్లీ, ముంబైలో కార్యాలయాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. భారత్ నుంచి వెళ్లిన వారికి ఆర్మీ హెల్పర్గా ఉద్యోగం ఇప్పిస్తామని ఏజెంట్లు చెప్పారని, చివరికి వారిని సైన్యంలోకి చేర్చి ఉక్రెయిన్ సరిహద్దుల్లో మోహరించినట్లు వివరించారు. కాగా అఫ్సాన్కు భార్యతో పాటు కుమారుడు, కుమార్తె ఉన్నారు. విషయం తెలిసి వీరు కన్నీరుమున్నీరయ్యారు. -
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో హైదరాబాద్ వాసి మృతి
రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం మొదలై.. రెండు సంవత్సరాలు అవుతోంది. తొలుత ఉక్రెయిన్పై భీకర దాడులు చేసి రష్యా ఆధిపత్యం చెలాయించగా.. ఆ తర్వాత ఉక్రెయిన్ పాశ్చాత్య దేశాల సహకారంతో ఎదురుదాడుల్ని పెంచింది. మొదట్లో రష్యా ఆక్రమించిన ఉక్రెయిన్ భూభాగాల్ని ఒక్కొక్కటిగా తిరిగి స్వాధీనం చేసుకుంటోంది. దీంతో రష్యా తన దాడుల్ని మరింత తీవ్రతరం చేసింది. ఉక్రెయిన్ని బలహీనపరిచేందుకు ప్రధాన కార్యాలయాలను టార్గెట్ చేసుకొని, డ్రోన్ దాడులకు పాల్పడుతోంది. ఇటు ఉక్రెయిన్ సైతం ఈ దాడుల్ని తిప్పికొడుతోంది. తాజాగా రష్కా- ఉక్రెయిన్ పోరులో హైదరాబాద్ వాసి మృతి చెందాడు.. ఉక్రెయిన్తో జరుగుతున్న యుద్ధంలో రష్యా తరపున పోరాడుతూ నగరానికి చెందిన మహ్మద్ అఫ్సాన్(30) అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయాన్ని అధికారులు బుధవారం వెల్లడించారు. అయితే ఉద్యోగం విషయంలో మోసపోవడంతో ఆఫ్సాన్ రష్యన్ ఆర్మీలో బలవంతంగా చేరాల్సి వచ్చినట్లు సమాచారం. కాగా రష్యా సైన్యానికి సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న దాదాపు 20 మంది భారతీయులను తీసుకొచ్చేందుకు తాము ప్రయత్నిస్తున్నట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపిన కొద్ది రోజులకే ఈ విషాదం వెలుగుచూసింది. మరోవైపు మహ్మద్ అస్ఫాన్ను రష్యా నుంచి హైదరాబాద్కు తీసుకొచ్చేందుకు సాయం కోసం అతడి కుటుంబుం ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీని సంప్రదించింది. ఈ క్రమంలో ఎంఐఎం మాస్కోలోని భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించగా.. అస్ఫాన్ మరణించినట్లు అక్కడి అధికారులు ధృవీకరించారు. మృతిడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. చదవండి: గర్భవతైన భార్యను, కూతురును వదిలి ఇజ్రాయెల్కు.. అంతలోనే -
లావొక్కింత మితిమీరె!
ప్రపంచం లావెక్కిపోతోంది. అన్ని దేశాల్లోనూ కలిపి స్థూలకాయుల సంఖ్య ఇప్పటికే అక్షరాలా 100 కోట్లు దాటేసింది! 1990 నుంచే వీరి సంఖ్యలో ఏకంగా నాలుగు రెట్ల పెరుగుదల నమోదైంది. మూడు దశాబ్దాల క్రితం దాకా పెద్దల్లోనే ఎక్కువగా కని్పంచిన ఊబకాయ సమస్య ఇప్పుడు చిన్నారుల్లో కూడా పెరిగిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. మారుతున్న జీవన శైలి, ఆహారపు అలవాట్లు, ఆధునిక జీవితపు ఒత్తిళ్లతో పాటు పౌష్టికాహార లోపం కూడా దీనికి ప్రధాన కారణమేనని తాజా అధ్యయనంలో తేలింది. మొత్తమ్మీద ప్రపంచవ్యాప్తంగా 2022 నాటికే వయోజనుల్లో ఊబకాయుల సంఖ్య 88 కోట్లు దాటింది. అలాగే టీనేజీ లోపు వయసు వారిలోనూ 16 కోట్ల పై చిలుకు ఊబకాయంతో బాధపడుతున్నారు. టోంగా, నౌరు, సమోవా తదితర దేశాల్లో మూడొంతులకు పైగా జనం ఊబకాయులేనట! 1990 నుంచి 2022 మధ్య పలు గణాంకాలు తదితరాల ఆధారంగా అధ్యయనం సాగింది. ఈ జాబితాలో అమెరికా కూడా పురుషుల్లో పదో స్థానంలో, మహిళల్లో 36వ స్థానంలో నిలిచింది. ఈ దేశాల్లో అనారోగ్యకరమైన ఆహారపుటలవాట్లే సమస్యకు ప్రధాన కారణమని తేలినట్టు అధ్యయన బృంద సభ్యుడు ప్రొఫెసర్ మజీద్ ఎజాటి వెల్లడించారు. మరోవైపు తక్కువ బరువుతో బాధపడుతున్న వారి సంఖ్యలో 50 శాతం తగ్గదల నమోదైంది. కాకపోతే నిరుపేద దేశాలు, సమాజాల్లో ఇది ఇంకా ప్రబల సమస్యగానే ఉందని అధ్యయనం పేర్కొంది. భారత్లోనూ ఊబకాయుల సంఖ్య 8 కోట్లు దాటినట్టు వెల్లడించింది. తక్షణం మేల్కొనాలి... ఒకప్పుడు ప్రధానంగా పెద్దవాళ్లలోనే కన్పించిన స్థూలకాయ సమస్య ఇప్పుడు స్కూలు వయసు చిన్నారుల్లోనూ ప్రబలమవుతుండటం చాలా ఆందోళనకరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ గేబ్రయేసస్ అన్నారు. చిన్న వయసులోనే గుర్తించి అరికట్టాల్సిన అవసరాన్ని తాజా సర్వే మరోసారి నొక్కిచెప్పిందని చెప్పారు. ఇందుకోసం ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు కూడా పెద్ద ఎత్తున ముందుకు రావాల్సి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఆరోగ్యకరమైన ఆహారం, నియమిత వ్యాయామాలు తదితరాలను జీవన శైలిలో భాగంగా మార్చుకోవడం తప్పనిసరన్నారు. పలు దేశాల్లో ప్రధానంగా పౌష్టికాహార లోపమే స్థూలకాయానికి దారి తీస్తోందని అధ్యయనంలో పాలుపంచుకున్న మద్రాస్ డయాబెటిస్ రీసెర్చ్ ఫౌండేషన్కు చెందిన డాక్టర్ గుహా ప్రదీప అభిప్రాయపడ్డారు. వాతావరణ మార్పులు, కొవిడ్ కల్లోలం, ఉక్రెయిన్ యుద్ధం వంటివన్నీ సమస్యను మరింత జటిలం చేస్తున్నాయని వివరించారు. ‘‘ఇవి ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఖరీదైన వ్యవహారంగా మార్చేస్తున్నాయి. ఫలితంగా చాలా దేశాల్లో ప్రజలకు చాలీచాలని, నాసిరకం ఆహారం అందుతోంది’’ అని ఆవేదన వెలిబుచ్చారు. ఇలా చేశారు... ► అధ్యయనంలో 1,500 మందికి పైగా రీసెర్చర్లు పాలుపంచుకున్నారు. ► ఎన్సీడీ రిస్క్ ఫ్యాక్టర్ కొలాబరేషన్ పేరిట వీరంతా ప్రపంచ ఆరోగ్య సంస్థతో పని చేశారు. ► ప్రపంచవ్యాప్తంగా 190కి పైగా దేశాల నుంచి ఐదేళ్ల పైబడ్డ 22 కోట్ల మందికి పైగా ప్రజల ఎత్తు, బరువు తదితర శారీరక కొలతలను సేకరించారు. ► ఊబకాయాన్ని నిర్ధారించేందుకు బాడీ మాస్ ఇండెక్స్ను ఆధారంగా తీసుకున్నారు. గణాంకాలివీ... ► ప్రపంచవ్యాప్తంగా వయోజనుల్లో 88 కోట్లు, టీనేజీ, ఆ లోపు వారిలో దాదాపు 16 కోట్ల మంది ఊబకాయులున్నారు. ► వయోజన ఊబకాయుల్లో 50 కోట్లకు పైగా పురుషులు కాగా 38 కోట్ల మంది స్త్రీలు. ► 1990లో వయోజనుల్లో ఊబకాయుల సంఖ్య 20 కోట్ల లోపే ఉండేది. ► వారిలో స్త్రీలు 13 కోట్లు కాగా 7 కోట్ల మందికి పైగా పురుషులుండేవారు. భారత్లోనూ... భారత్ కూడా ఊబకాయ సమస్యతో బాధపడుతోంది. ముఖ్యంగా మహిళల్లో ఈ సమస్య బాగా పెరుగుతుందటం ఆందోళన కలిగిస్తోంది. వయోజన మహిళల్లో ఊబకాయులు 1990లో కేవలం 1.2 శాతముండగా 2022 నాటికి ఏకంగా 9.8 శాతానికి పెరిగారు. పురుష జనాభాలో ఊబకాయుల సంఖ్య 0.5 శాతం నుంచి 5.4 శాతానికి పెరిగింది. మొత్తమ్మీద 2022 నాటికి దేశవ్యాప్తంగా 4.4 కోట్ల మహిళలు, 2.6 కోట్ల మంది పురుషులు ఊబకాయంతో బాధపడుతున్నారు. ఇక దేశవ్యాప్తంగా 5–19 ఏళ్ల మధ్య వయసు్కన్న పిల్లల్లో దాదాపు 1.25 కోట్ల మంది ఊబకాయులేనని అధ్యయనంలో తేలింది. 75 లక్షలతో వీరిలో అబ్బాయిల సంఖ్యే ఎక్కువ. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Russia-Ukraine war: మరింత జోక్యంతో అణు యుద్ధమే
మాస్కో: ఉక్రెయిన్లోని లక్ష్యాలను సాధించే వరకు తమ యుద్ధం కొనసాగుతుందని రష్యా అధ్యక్షుడు పుతిన్ కుండబద్దలు కొట్టారు. ఉక్రెయిన్కు అండగా సైన్యాలను పంపించడం ద్వారా మరింత లోతుగా జోక్యం చేసుకోవాలని చూస్తే అణు యుద్ధం తప్పదని పశ్చిమ దేశాలను ఆయన హెచ్చరించారు. వచ్చే నెల్లో దేశాధ్యక్ష పదవికి జరగనున్న ఎన్నికల్లో పుతిన్ విజయం ఇప్పటికే ఖరారైంది. ఎన్నికలను పురస్కరించుకుని గురువారం ఆయన దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. యుద్ధంలో పుతిన్ విజయం యూరప్లో తీవ్ర విపరిణామాలకు దారి తీస్తుందని, దీనిని నివారించేందుకు నాటో దేశాలు ఉక్రెయిన్లోకి ప్రత్యక్షంగా బలగాలను పంపించే అవకాశాలు సైతం ఉన్నాయంటూ ఫ్రాన్సు అధ్యక్షుడు మాక్రాన్ ఇటీవల చేసిన హెచ్చరికలపై ఆయన పైవిధంగా స్పందించినట్లుగా పరిశీలకులు భావిస్తున్నారు. ‘గతంలో మన దేశంలోకి సైన్యాన్ని పంపించిన వారికి ఎలాంటి గతి పట్టిందో మనకు తెలుసు. మళ్లీ అటువంటిదే జరిగితే ఈసారి పరిణామాలు మరింత దారుణంగా ఉంటాయి. మన వద్ద కూడా పశ్చిమదేశాల్లోని లక్ష్యాలను చేరగల ఆయుధాలున్న సంగతిని వాళ్లు గుర్తుంచుకోవాలి. ఆ దేశాలు చేస్తున్న ప్రకటనలు ప్రపంచాన్ని భయపెడు తున్నట్లుగా అగుపిస్తోంది. ఇవన్నీ నిజమైన అణు సంఘర్షణ ముప్పును మరింతగా పెంచుతున్నాయి. దానర్థం మానవ నాగరికత విధ్వంసం. యుద్ధంతో ఎదురయ్యే పెను సవాళ్లు, అణు యుద్ధం తాలూకూ పరిణామాలు వాళ్లకు అర్థం కావా?’అని పుతిన్ ప్రశ్నించారు. ‘దేశం పూర్తిస్థాయి అణు యుద్ధ సన్నద్ధతతో ఉంది. ఎంతో శక్తివంతమైన నూతన ఆయుధాలను సైన్యం మోహరించింది. వాటిలో కొన్నిటిని ఇప్పటికే ఉక్రెయిన్ యుద్ధక్షేత్రంలో ప్రయోగించి చూసింది’ అని చెబుతూ ఆయన శక్తివంతమైన బురెవెస్ట్నిక్ అణు క్రూయిజ్ క్షిపణి వంటి వాటిని ఈ సందర్భంగా ప్రస్తావించారు. నాటో దేశాలపై రష్యా దాడి చేసే ప్రమాదముందంటూ పశ్చిమదేశాలు చేస్తున్న ప్రకటనలను భ్రమలుగా అధ్యక్షుడు పుతిన్ కొట్టిపారేశారు. 2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్పైకి భారీగా సైన్యాన్ని పంపించినప్పటి నుంచి పుతిన్ అణు ముప్పుపై పశ్చిమ దేశాలను పలుమార్లు హెచ్చరించిన విషయం తెలిసిందే. -
Russia: ఉక్రెయిన్ దాడుల్లో భారత యువకుడి మృతి
మాస్కో: రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో భారతీయ యువకుడు ఒకరు మరణించాడు. రష్యా ఆర్మీ వద్దసెక్యూరిటీ హెల్పర్గా పనిచేస్తున్న గుజరాత్కు చెందిన హేమిల్ అశ్విన్భాయ్(23) ఈ నెల 21న ఉక్రెయిన్ జరిపిన వైమానిక దాడుల్లో మృతి చెందాడు. రష్యా, ఉక్రెయిన్ సరిహద్దులోని డొనెస్క్ ప్రాంతంలో హేమిల్ పనిచేస్తున్నప్పుడు ఉక్రెయిన్ దాడులు జరిగాయని భారత్కు చెందిన మరో సెక్యూరిటీ హెల్పర్ సమీర్ అహ్మద్ తెలిపారు. అయితే హేమిల్ మరణంపై తమకు ఎలాంటి సమాచారం లేదని భారత విదేశీ వ్యవహరాల శాఖ స్పష్టం చేసింది. సెక్యూరిటీ హెల్పర్లుగా పనిచేస్తున్న భారత యువకులను ఉక్రెయిన్తో యుద్ధంలో చురుగ్గా పాల్గొనాలని రష్యా బలవంతం చేస్తున్నట్లు వార్తలు వచ్చిన మరుసటి రోజే హేమిల్ ఉక్రెయిన్ దాడుల్లో మరణించాడు. గతేడాది రష్యా ఆర్మీ 100 మంది భారతీయులను సెక్యూరిటీ హెల్పర్లుగా నియమించింది. అయితే వీరందరూ యుద్ధం నుంచి దూరంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం తాజాగా ఒక అడ్వైజరీ కూడా చేసింది. ఏజెంట్ల మోసం వల్లే భారత యువకులు రష్యాలో సెక్యూరిటీ హెల్పర్లుగా పనిచేయాల్సి వస్తోందని ఇటీవల ఎంఐఎం చీఫ్, అసదుద్దీనన్ ఒవైసీ ఆరోపించిన విషయం తెలిసిందే. వీరి విషయంలో భారత విదేశాంగ శాఖ వెంటనే జోక్యం చేసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. . ఇదీ చదవండి.. అమెరికా నౌకపై హౌతీల మిసైల్ దాడి -
USA: రష్యాపై భారీ ఆంక్షలు
వాషింగ్టన్: ఉక్రెయిన్పై యుద్ధానికి తెగబడ్డ రష్యా మీద అమెరికా, యూరోపియన్ యూనియన్ శుక్రవారం మరిన్ని ఆంక్షలకు తెర తీశాయి. ఈసారి కూడా ప్రధానంగా ఆ దేశ ఆర్థిక, రక్షణ, పారిశ్రామిక నెట్వర్కులను లక్ష్యం చేసుకున్నాయి. రష్యా, దాని సన్నిహితులపై ఏకంగా 500పై చిలుకు ఆంక్షలు విధిస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు! మతిలేని హత్యాకాండకు, వినాశనానికి పుతిన్ మూల్యం చెల్లించి తీరాల్సిందేనని స్పష్టం చేశారు. మరోవైపు భారీ ఆయుధాల తయారీ తదితరాలకు ఉపయోగపడే నిషేధిత వస్తువులను రష్యాకు ఎగుమతి చేసిన ఆరోపణలపై పలు విదేశీ కంపెనీలపై కఠిన ఆంక్షలు విధిస్తున్నట్టు ఈయూ సమాఖ్య ప్రకటించింది. నవాల్నీ కుటుంబంతో బైడెన్ భేటీ: అంతకుముందు రష్యా విపక్ష నేత దివంగత అలెక్సీ నవాల్నీ భార్య యూలియా నవాల్నయా, కూతురు దషాతో బైడెన్ భేటీ అయ్యారు. నవాల్నీ మృతి పట్ల దిగ్భ్రాంతి వెలిబుచ్చారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ‘‘నవాల్నీ సాటిలేని ధైర్యశాలి. ఆయన పోరాటాన్ని యూలియా, దషా ముందుకు తీసుకెళ్తారని పూర్తి విశ్వాసముంది’’ అన్నారు. నవాల్నీ మృతదేహానికి గోప్యంగా తక్షణ అంత్యక్రియలు జరిపేందుకు అంగీకరించేలా జైలు అధికారులు తనపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారని తల్లి లుడ్మిలా ఆరోపించారు. ఆలస్యమైతే శవం కుళ్లిపోతుందంటూ బ్లాక్మెయిల్ చేస్తున్నారని ఆవేదన వెలిబుచ్చారు. గురువారం కుమారుని మృతదేహాన్ని చూసిన అనంతరం ఆమె ఈ మేరకు వీడియో విడుదల చేశారు. -
Russia-Ukraine War: యుద్ధం X రెండేళ్లు
సైనికంగా సూపర్ పవరైన రష్యా చోటా దేశమైన ఉక్రెయిన్పై ఉన్నట్టుండి విరుచుకుపడి నేటికి రెండేళ్లు. ఉక్రెయిన్ ‘సంపూర్ణంగా నిస్సైనికీకరణే’ లక్ష్యంగా 2022 ఫిబ్రవరి 24న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చేపట్టిన ఈ దుందుడుకు చర్య ప్రపంచ దేశాలన్నింటినీ నిత్యం ఏదోలా ప్రభావితం చేస్తూనే వస్తోంది. రోజుల్లో ముగుస్తుందనుకున్న యుద్ధం రెండేళ్లు దాటినా కొనసాగుతూనే ఉందంటే ఉక్రెయిన్ కనబరచిన తిరుగులేని తెగువే ప్రధాన కారణం. కానీ కొన్నాళ్లుగా ఉక్రెయిన్ క్రమంగా చతికిలపడుతుండగా రష్యా దూకుడు పెంచుతోంది. అయినా లొంగేందుకు ఉక్రెయిన్ ససేమిరా అంటోంది. పైగా ఆక్రమిత భూభాగాల నుంచి వైదొలగి, తమకు కలగజేసిన అపార నష్టానికి రష్యా భారీగా పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో యుద్ధం ఇప్పుడప్పట్లో ముగిసే సూచనలు కని్పంచడం లేదు... యుద్ధం తొలినాళ్లలో రష్యా దూకుడు ప్రదర్శించింది. రష్యా సేనలు ఉక్రెయిన్ రాజధాని కీవ్ సమీపం దాకా దూసుకెళ్లాయి. యూరప్లోనే అతి పెద్దదైన జపోరిజియా అణు విద్యుత్కేంద్రాన్ని ఆక్రమించడంతో యావత్ యూరప్ ఖండం భద్రతాపరమైన ఆందోళనలతో ఉలిక్కిపడింది. కానీ ఆ జోరుకు నెల రోజుల్లోనే బ్రేకులు పడ్డాయి. ఉక్రెయిన్ దళాలు ముప్పేట దాడులతో రష్యా సైన్యాన్ని దిగ్బంధించాయి. అమెరికాతో పాటు పాశ్చాత్య దేశాల దన్నుతో పైచేయి సాధిస్తూ వచ్చాయి. వాటి తీవ్ర ఆంక్షలతో రష్యా అతలాకుతలమైంది. కానీ సెప్టెంబర్ నాటికి జపోరిజియాతో పాటు కీలకమైన డొనెట్స్క్, లుహాన్స్క్, ఖెర్సన్ ప్రాంతాలను స్వా«దీనం చేసుకున్నట్టు ప్రకటించింది. రష్యాకు చెందిన భారీ యుద్ధ నౌకలతో పాటు క్రిమియాతో రష్యాను కలిపే కీలక బ్రిడ్జిని పేల్చేయడం వంటి చర్యలతో ఉక్రెయిన్ అప్పుడప్పుడూ పైచేయి సాధిస్తూ వచి్చంది. 2023 మేలో ఏకంగా మాస్కోలో పుతిన్ అధికార నివాసమైన క్రెమ్లిన్పై రెండు ఉక్రెయిన్ డ్రోన్లు దూసుకెళ్లి కలవరం రేపాయి. తర్వాత నుంచీ ఉక్రెయిన్ దూకుడు నెమ్మదించసాగింది. ఉక్రెయిన్ డ్రోన్ల దాడి దెబ్బకు తొలుత అపార నష్టం చవిచూసిన రష్యా సైన్యం తానూ అదే బాట పట్టింది. కొంతకాలంగా ఇరు బలగాలూ డ్రోన్లపైనే ప్రధానంగా ఆధారపడుతున్నాయి! విదేశాల నుంచి భారీగా అందుతున్న వాటికి అదనంగా 2023లోనే ఉక్రెయిన్ ఏకంగా 3 లక్షల డ్రోన్లను తయారు చేసుకుంది! వాటిని 2024లో 10 లక్షలకు పెంచజూస్తోంది. వీటికి చిన్న తరహా మిసైళ్లు తోడవుతున్నాయి. ఇప్పుడేంటి...! రష్యా తాజాగా ఉక్రెయిన్లోని అది్వవ్కా నగరాన్ని ఆక్రమించింది. ఆ క్రమంలో అతి భారీగా ఆయుధ సామగ్రిని కోల్పోయింది. కాకపోతే కొన్నాళ్లుగా విపరీతంగా వచి్చపడుతున్న చమురు అమ్మకాల లాభాలతో రెట్టించిన ఉత్సాహంతో యుద్ధాన్ని తీవ్రతరం చేస్తోంది. పైగా లక్షలాదిగా అదనపు సైనికులను సిద్ధం చేసుకుంటోంది. ఇవన్నీ ఉక్రెయిన్కు భారీ హెచ్చరిక సంకేతాలే. స్వీయ సాయుధ సామగ్రి నిండుకుంటుండటమే గాక ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న అమెరికా, పాశ్చాత్య దేశాల నుంచి సాయమూ బాగా తగ్గింది. ఏదేమైనా రష్యా గెలిచేదాకానో, పుతిన్ అధికారంలో ఉన్నంత వరకో యుద్ధం కొనసాగుతుందని భావిస్తున్నారు. ఈ పోరులో ఉక్రెయిన్ మాత్రం ఇప్పటికే బహుశా ఇంకెప్పటికీ కోలుకోలేనంతగా దెబ్బ తిన్నది. అపార నష్టం... ► యుద్ధంలో మరణించిన, క్షతగాత్రులైన రష్యా, ఉక్రెయిన్ సైనికుల సంఖ్య ఏకంగా 5 లక్షలు దాటినట్టు అంచనా. ► 12,000 మందికి పైగా అమాయక ఉక్రేనియ న్లు యుద్ధానికి బలయ్యారు. 20,000 పై చిలుకు మంది క్షతగాత్రులయ్యారు. ► కోటి మంది దాకా ఉక్రేనియన్లు నిర్వాసితులయ్యారు. వీరిలో 60 లక్షలకు పైగా విదేశాలకు వలసబాట పట్టారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అతి పెద్ద వలసగా నిలిచింది. ► అమెరికా, పాశ్చాత్య దేశాలు ఉక్రెయిన్కు ఇప్పటికే బిలియన్ల కొద్దీ ఆర్థిక సాయం, అంతకు మించి అత్యాధునిక ఆయుధ సాయం చేస్తూ వస్తున్నాయి. ► ఐఎంఎఫ్ కూడా 15.6 బిలియన్ డాలర్ల ఆర్థిక సాయం అందజేసింది. యుద్ధంలో ఉన్న ఓ దేశానికి ఆర్థిక సాయం ఐఎంఎఫ్ చరిత్రలోనే తొలిసారి. ► రెండేళ్ల యుద్ధంలో 20 శాతం ఉక్రెయిన్ భూభాగాన్ని మాత్రమే రష్యా ఆక్రమించగలిగింది. అందులోనూ సగం తిరిగి తమ వశమైనట్టు ఉక్రెయిన్ చెబుతోంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
రష్యాకు ఎదురుదెబ్బ
కీవ్: ఉక్రెయిన్పై దురాక్రమణకు దిగిన రష్యాకు బుధవారం భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఒక కమాండర్ రాక కోసం శిక్షణాప్రాంతం వద్ద గుమిగూడిన సైనికులపై రెండు క్షిపణిలు వచ్చి పడ్డాయి. దీంతో 60 మంది రష్యా సైనికులు మరణించారని అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. అయితే ఈ ఘటనపై రష్యా రక్షణ మంత్రి సెర్గియో షొయిగూ నోరు మెదపలేదు. రష్యా అధ్యక్షుడు పుతిన్తో భేటీకి కొద్దిసేపటికి ముందే ఈ దాడి జరగడం గమనార్హం. ఇతర ప్రాంతాల్లో రష్యా సైన్యం విజయాలను పుతిన్కు వివరించిన సెర్గియో ఈ దాడి వివరాలను మాత్రం వెల్లడించలేదు. రష్యా ఆక్రమణలో ఉన్న ఉక్రెయిన్ తూర్పు ప్రాంతం డొనెట్కŠస్ రీజియన్లో ఈ దాడి ఘటన చోటుచేసుకుంది. సెర్బియా ప్రాంతంలో ఉండే 36వ రైఫిల్ బ్రిగేడ్ ట్రుడోవ్స్కే గ్రామంలో ఒక మేజర్ జనరల్ రాకకోసం వేచి చూస్తుండగా ఈ దాడి జరిగింది. ఒకే చోట డజన్లకొద్దీ జవాన్లు విగతజీవులుగా పడి ఉన్న వీడియో ఒకటి అంతర్జాతీయ మీడియాలో ప్రసారమైంది. అమెరికా తయారీ హై మొబిలిటీ ఆరి్టలరీ రాకెట్ సిస్టమ్(హిమార్స్) నుంచి దూసుకొచి్చన మిస్సైళ్లే ఈ విధ్వంసం సృష్టించాయని రష్యా చెబుతోంది. మరోవైపు రష్యా వ్యతిరేకంగా సైనిక వార్తలు రాసే బ్లాగర్ ఆండ్రీ మొరజోవ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈయన టెలిగ్రామ్ చానెల్కు లక్ష మంది చందాదారులు ఉన్నారు. ఉక్రెయిన్ యుద్ధంలో చాలా ప్రాంతాల్లో రష్యా తోకముడిచిందంటూ, వేల మంది సైనికులు చనిపోయారని తాను రాసిన విశ్లేషణాత్మక కథనాలను వెంటనే తొలగించాలంటూ రష్యా సైన్యం నుంచి ఈయన చాన్నాళ్లుగా ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నాడు. ఇంకెవరో వచ్చి చంపే బదులు తానే కాల్చుకుని చస్తానని తన బ్లాగ్లో రాశాడని వార్తలొచ్చాయి. ఇప్పటిదాకా యుద్ధంలో రష్యా 45వేలకుపైగా సైన్యాన్ని కోల్పోయిందని ‘బీబీసీ రష్యా’ తెలిపింది. -
Russia-Ukraine war: చేజారిన తోడే.. బొడ్డుతాడై...
ఉక్రెయిన్. ఒకప్పటి అందాల దేశం. ఇప్పుడు రష్యా రక్త దాహానికి బలైన శిథిల చిత్రం. యుద్ధం మిగిల్చే బీభత్సానికి సాక్షి. పోరులో ప్రాణాలొదిలిన వేలాది మంది ఉక్రెయిన్ యువ సైనికుల జీవిత భాగస్వాములది మాటలకందని దైన్యం. వారిలోనూ అసలు సంతానమే లేనివారిదైతే చెప్పనలవి కాని వ్యథ. ఎవరి కోసం బతకాలో తెలియని నైరాశ్యం. అయితే తమ జీవిత భాగస్వాములు ముందుజాగ్రత్తగా భద్రపరిచి వెళ్లిన వీర్యం/అండాలు వారిలో కొత్త ఆశలు నింపుతున్నాయి. వాటి సాయంతో బిడ్డలను కంటున్నారు. తమను శాశ్వతంగా వీడి వెళ్లిన తోడు తాలూకు నీడను వారిలో చూసుకుంటున్నారు. భవిష్యత్తుపై ఆశలు పెంచుకుంటున్నారు... ఉక్రెయిన్పై రష్యా దండయాత్ర మొదలై రెండేళ్లవుతోంది. 2022 ఫిబ్రవరి 24న ఆ దేశంపై రష్యా సైన్యం హఠాత్తుగా విరుచుకుపడింది. రోజుల్లో తల వంచుతుందనుకున్న ఉక్రెయిన్ దీటుగా పోరాడుతోంది. దాంతో రెండేళ్లయినా పోరు కొనసాగుతూనే ఉంది. యుద్ధమంటేనే ప్రాణనష్టం! ఇప్పటిదాకా ఏకంగా 70,000 మంది ఉక్రెయిన్ జవాన్లు మరణించినట్లు అంచనా. మరో లక్షన్నర మందికి పైగా క్షతగాత్రులుగా మారారు. యుద్ధంలో జవాను వీరమరణం పొందితే అతడి/ఆమె వంశం అంతమైపోవాల్సిందేనా? బతికుండగానే అండాలు, వీర్యం భద్రపర్చుకొని, తాము లేకపోయినా జీవిత భాగస్వామి ద్వారా సంతానం పొందే వెసులుబాటును ఎందుకు ఉపయోగించుకోవద్దు? ఇలాంటి ప్రశ్నలు ఉక్రెయిన్ సైన్యం నుంచి గట్టిగా వినిపించాయి. దీనిపై ప్రభుత్వమూ సానుకూలంగా స్పందించింది. పార్లమెంటులో ఇటీవలే ఒక బిల్లును ఆమోదించింది. అధ్యక్షుడు వొలిదిమిర్ జెలెన్స్కీ సంతకం చేస్తే చట్టంగా మారనుంది. ఇదొక విప్లవాత్మక చట్టం కానుందని నిపుణులు ప్రశంసిస్తున్నారు. యుద్ధంలో మరణించినవారి వీర్యం/అండాలతో సంతానం పొందే అవకాశం ఇప్పటిదాకా ఉక్రెయిన్లో చట్టపరంగా లేదు. ఇక ఈ పరిస్థితి మారనుంది... ► ఉక్రెయిన్ పార్లమెంట్లో ఆమోదించిన బిల్లు ప్రకారం జవాన్లు తమ వీర్యం, అండాలు భద్రపర్చుకోవచ్చు. వారు యుద్ధంలో అమరులైతే వాటి సాయంతో జీవిత భాగస్వాములు సంతానం పొందవచ్చు. ► ఈ కొత్త చట్టాన్ని అంతా స్వాగతిస్తున్నారు. దీని ద్వారా అమర సైనికుల కుటుంబ వారసత్వం కొనసాగుతుందంటున్నారు. ► జవాన్ల వీర్యం/అండాలు ఉచితంగా భద్రపరుస్తామని ఉక్రెయిన్లో పలు సంస్థలు ఇప్పటికే ప్రకటించాయి. యుద్ధం మొదలైనప్ప టి నుంచే ఇలాంటి ఆఫర్లు ఇస్తున్నాయి. ► ఇందుకు వీలుగా యుద్ధంలో మృతి చెందిన జవాన్ల వీర్యం/అండాలను మూడేళ్ల పాటు భద్రపరుస్తారు. ఇందుకు ప్రభుత్వమే ఆర్థిక సాయం అందిస్తుంది. ► వీర్యం/అండాలు భద్రపర్చుకోవడానికి ఆసక్తి చూపుతున్న సైనికుల సంఖ్య ఇటీవల కాలంలో భారీగా పెరిగింది. ప్రభుత్వం అనుమతితో పాటు ఆర్థిక సాయమూ అందిస్తుందని స్పష్టత రావడమే కారణమని తెలుస్తోంది. ► యుద్ధంలో క్షతగాత్రులై, ఆరోగ్యం దెబ్బతిని సంతానోత్పత్తికి, బిడ్డలకు జన్మనిచ్చే సామర్థ్యానికి దూరమైన సైనికులు కూడా వీర్యం/అండాలను భద్రపర్చుకుని సంతానం పొందవచ్చు. ► యుద్ధంలో గాయపడిన పలువురు జవాన్లు ఈ సేవలు ఉపయోగించుకుంటున్నారు. ► ఇలా భద్రపర్చిన వీర్యం/అండాలతో పుట్టే పిల్లలకు చట్టబద్ధంగా అన్ని హక్కులూ ఉంటాయి. అమర వీరులైన తల్లి/తండ్రి పేరును వారి బర్త్ సరి్టఫికెట్లో ముద్రిస్తారు! ► ఇప్పటికే ఒక బిడ్డ ఉన్నవారు కూడా మరో బిడ్డను కనడానికి ముందుకొస్తున్నారు. ఇలా భద్రపర్చుకుంటున్న జవాన్లలో మహిళల కంటే పురుషుల సంఖ్య అధికంగా ఉంది. మన పాప నవ్వుల సాక్షిగా... నువ్వెప్పటికీ నాతోనే... మనసుతో చూడగలిగితే లక్ష భావాలను, కోటి ఊసులను కళ్లకు కట్టే ఫొటో ఇది. ఇందులో నేపథ్యంలోని పోస్టర్లో కనిపిస్తున్నది రష్యాతో పోరులో మరణించిన ఉక్రెయిన్ సైనికుడు విటాలీ. బుల్లి పాపాయిని ఎత్తుకున్నది అతని భార్య విటాలినా. భర్త మరణానంతరం ఆయన వీర్యంతో గర్భం దాల్చి ఈ పండంటి పాపాయికి జన్మనిచి్చందామె. కూతురిని భర్త ఫొటోకు చూపిస్తూ ఇలా భావోద్వేగానికి గురైంది. రష్యాతో యుద్ధం మొదలయ్యే కొద్ది నెలల ముందే విటాలీ ఉక్రెయిన్ సైన్యంలో చేరాడు. ఫ్రంట్ లైన్లో పోరాడుతూ యుద్ధం మొదలైన తొలి నాళ్లలోనే మరణించాడు. అప్పటికే విటాలినా 13 వారాల గర్భవతి. కానీ ఆ గర్భం నిలవలేదు. భర్త క్షేమం తాలూకు ఆందోళనే అందుకు ప్రధాన కారణమని ఇప్పటికీ కన్నీళ్లపర్యంతం అవుతుంటుంది విటాలినా. ‘‘అటు జీవితాంతం తోడుండాల్సిన భర్తను, ఇటు ఇంకా లోకమే చూడని మా కలల పంటను కొద్ది రోజుల తేడాతో శాశ్వతంగా కోల్పోయా. బతుకంతా ఒక్కసారిగా శూన్యంగా తోచింది’’ అంటూ అప్పటి రోజులను గుర్తు చేసుకుందామె. ‘‘ఇలాంటి పరిస్థితిని ఊహించే నా భర్త వీర్యాన్ని భద్రపరిచి వెళ్లాడు. దాని సాయంతో తల్లిని కావాలని నిర్ణయించుకున్నా. అలా ఈ చిట్టి తల్లి ఈ లోకంలోకి అడుగు పెట్టింది. తన రాకతో నాకు నిజంగా సాంత్వన చేకూరింది. పాప వాళ్ల నాన్న పోలికలనే గాక హావభావాలను కూడా ముమ్మూర్తులా పుణికి పుచ్చుకుంది. దైవ కృప అంటే బహుశా ఇదేనేమో. నిజానికి గంపెడు సంతానాన్ని కనాలని, మాది పెద్ద కుటుంబం కావాలని పెళ్లికి ముందు నుంచీ ఎన్నెన్నో కలలు కన్నాం. కానీ విధి రాత మరోలా ఉంది. అయినా తను ముందుచూపుతో తీసుకున్న నిర్ణయం ఈ చిట్టితల్లి రూపంలో ఇలా ఫలించింది’’ అంటుంటే విని చెమర్చని కళ్లు లేవు. కాస్త అటూ ఇటుగా ఉక్రెయిన్ సైనిక వితంతువులందరి గాథ ఇది...! – సాక్షి, నేషనల్ డెస్క్ -
గగనతల రారాజు ‘జిర్కాన్’.. ఎన్నో ప్రత్యేకతలు
రష్యా వద్ద ప్రపంచంలోనే అత్యాధునిక ఆయుధాలున్నట్లు వస్తున్న వార్తలకు బలం చేకూరేలాగా తాజా సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల రష్యా అత్యాధునిక అస్త్రాన్ని ఉక్రెయిన్పై ప్రయోగించింది. ఈ విషయాన్ని మాస్కో బహిర్గతం చేయకపోయినా కీవ్ ఫోరెన్సిక్ పరిశోధనా సంస్థ బృందం గుర్తించింది. ఇటీవల కీవ్పై జరిగిన ఒక దాడిలో రష్యా జిర్కాన్ హైపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణిని వాడినట్లు ఆ బృందం వెల్లడించింది. జిర్కాన్ ప్రత్యేకతలు.. ఒక్కసారి జిర్కాన్ క్షిపణి గాల్లోకి ఎగరడం మొదలుపెడితే దాన్ని ప్రపంచంలోని ఏ అత్యున్నత గగనతల రక్షణ వ్యవస్థ అడ్డుకోలేదు. అమెరికాకు చెందిన మిసైల్ డిఫెన్స్ అడ్వొకసి అలయన్స్ అంచనా ప్రకారం ఈ క్షిపణి గంటకు 9,900 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. ఒకవేళ ఇలా వస్తున్న వార్తలు నిజమైతే ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన క్షిపణి జిర్కాన్. దాన్ని అడ్డుకోవడం దాదాపు అసాధ్యం. ఈ క్షిపణి ప్రయాణించే సమయంలో దాని చుట్టూ ప్లాస్మా మేఘంతో వలయం ఏర్పడుతుంది. గగనతల రక్షణ వ్యవస్థల నుంచి వచ్చే రాడార్ సంకేతాలను అది తనలో కలిపేసుకుంటుంది. దీంతో ఈ క్షిపణిని గుర్తించడానికి వీలుండదు. అమెరికాకు చెందిన ‘ఏజిస్ క్షిపణి రక్షణ వ్యవస్థ’కు శత్రు అస్త్రాలను నేలకూల్చడానికి 8-10 సెకన్ల సమయం అవసరం. ఇంత స్వల్ప వ్యవధిలో జిర్కాన్ 20 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. అందువల్ల ఏజిస్ క్షిపణికి కూడా అది అందదని రష్యా నిపుణులు చెబుతున్నారు. ఇదీ చదవండి: భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే.. -
Russia-Ukraine war: ఆక్రమిత ఉక్రెయిన్పై దాడి.. 28 మంది మృతి
మాస్కో: ఉక్రెయిన్లోని రష్యా ఆక్రమిత లిసిచాన్స్క్ నగరంలోని ఓ బేకరీపై జరిగిన దాడిలో 28 మంది మృతి చెందారు. రష్యా నియమించిన స్థానిక అధికారి ఈ విషయం వెల్లడించారు. బేకరీ కుప్పకూలిపోవడంతో శిథిలాల్లో చిక్కుకుపోయిన మరో 10 మందిని కాపాడినట్లు చెప్పారు. ఘటనపై ఉక్రెయిన్ అధికారులు స్పందించలేదు. ఈ శీతాకాలంలో సుమారు 930 మైళ్ల మేర విస్తరించి ఉన్న యుద్ధ క్షేత్రంలో ఎటువంటి మార్పులు చోటుచేసుకోలేదు. రష్యా, ఉక్రెయిన్ సైన్యాలు ఎక్కువగా దీర్ఘ శ్రేణి దాడులపైనే ఆధారపడ్డాయి. ఇలా ఉండగా, 24 గంటల వ్యవధిలో రష్యా బలగాలు పలు ప్రాంతాల్లో తమ సేనలపైకి పదేపదే దాడులతో ఒత్తిడి తీవ్రతరం చేసినట్లు ఉక్రెయిన్ ఆర్మీ తెలిపింది. -
Farmers movement: యూరప్లోనూ రోడ్డెక్కిన రైతు
సాగు గిట్టుబాటు కావడం లేదంటూ రైతులు పెద్ద ఎత్తున ఆందోళన బాట పట్టారు. భారత్లో కాదు, యూరప్లో! అవును. రైతుల నిరసనలు, ఆందోళనలతో కొద్ది వారాలుగా యూరప్ దేశాలన్నీ ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. రెండేళ్లుగా సాగుతున్న ఉక్రెయిన్ యుద్ధంతో యూరప్ దేశాల్లో అసలే జీవనవ్యయం ఊహించనంతగా పెరిగిపోయింది. దీనికి తోడు గాజాపై ఇజ్రాయెల్ యుద్ధంతో కొద్ది నెలలుగా పరిస్థితి మరింత దారుణంగా మారింది. ఇవి చాలవన్నట్టు సాగు వ్యయం విపరీతంగా పెరిగిపోయింది. పన్నుల భారం మోయలేనంతగా మారింది. ఇలాంటి అనేకానేక సమస్యలు యూరప్ వ్యాప్తంగా రైతులను కుంగదీస్తున్నాయి. ప్రభుత్వాల రైతు వ్యతిరేక విధానాలే సమస్యకు ప్రధాన కారణమంటూ వారు గగ్గోలు పెడుతున్నారు. ఉక్రెయిన్ను కాపాడే ప్రయత్నంలో తమ ఉసురు తీస్తున్నారంటూ మండిపడుతున్నారు. పరిష్కారం కోసం ప్రాధేయపడ్డా ఫలితం లేకపోవడంతో పలు దేశాల్లో రైతులు వేలాదిగా ఆందోళన బాట పట్టారు. ఏకంగా వేల కొద్దీ ట్రక్కులు, ట్రాక్టర్లతో రోడ్లెక్కుతున్నారు. పట్టణాలు, రాజధానులను దిగ్బంధిస్తున్నారు. నడిరోడ్లపై టైర్లను, గడ్డిమోపులను కాలబెడుతున్నారు. ప్రభుత్వాల తీరు తమ పొట్ట కొడుతోందంటూ నిరసనలు, నినాదాలతో హోరెత్తిస్తున్నారు. కొద్ది వారాలుగా పారిస్, బెర్లిన్ మొదలుకుని ఏ నగరంలో చూసినా, ఏ ఐరోపా దేశంలో చూసినా ఇవే దృశ్యాలు!! ఫిబ్రవరి 1న రైతులు ఏకంగా యూరోపియన్ పార్లమెంటు భవనంపైకి గుడ్లు విసరడం, రాళ్లు రువ్వారు! పలు దేశాల్లో పరిస్థితులు రైతుల అరెస్టుల దాకా వెళ్తున్నాయి... రైతుల సమస్యలు ఇవీ... ► యూరప్ దేశాలన్నింట్లోనూ రైతులు ఎదుర్కొంటున్న సమస్యల్లో ప్రధానమైనది గిట్టుబాటు ధర లేమి. ► దీనికి తోడు ఏడాదిగా వారిపై పన్నుల భారం బాగా పెరిగిపోయింది. ఆకాశాన్నంటుతున్న పంట బీమా ప్రీమియాలు దీనికి తోడయ్యాయి. ► విదేశాల నుంచి, ముఖ్యంగా ఉక్రెయిన్ నుంచి చౌకగా దిగుమతవుతున్న ఆహారోత్పత్తులతో వారి ఉత్పత్తులకు గిరాకీ పడిపోతోంది. ► దక్షిణ అమెరికా దేశాల నుంచి చక్కెర, ఆహార ధాన్యాలతో పాటు మాంసం తదితరాల దిగుమతిని మరింతగా పెంచుకునేందుకు ఈయూ తాజాగా ఒప్పందం కుదుర్చుకుంది. ► అధికారుల అవినీతి, సకాలంలో సాయం చేయడంలో అలసత్వం మరింత సమస్యగా మారుతోంది. ► ఈయూ విధిస్తున్న పర్యావరణ నిబంధనలు మరీ శ్రుతి మించుతున్నాయన్న భావన అన్ని దేశాల రైతుల్లోనూ నెలకొంది. ► పర్యావరణ పరిరక్షణకు ప్రతి రైతూ 4 శాతం సాగు భూమిని నిరీ్ణత కాలం ఖాళీగా వదిలేయాలన్న నిబంధనను యూరప్ దేశాలన్నీ అమలు చేస్తున్నాయి. ► పైగా పలు దేశాలు ఏటా పంట మారి్పడినీ తప్పనిసరి చేశాయి. రసాయన ఎరువుల వాడకాన్ని 20 శాతం తగ్గించాలంటూ రైతులపై ఒత్తిడి తీవ్రతరమవుతోంది. ► సాగు అవసరాలకు వినియోగిస్తున్న పెట్రోల్, డీజిల్పై సబ్సిడీ ఎత్తేయాలన్న నిర్ణయం. దీంతో సాగు వ్యయం విపరీతంగా పెరుగుతోందంటూ చాలా యూరప్ దేశాల్లో రైతులు గగ్గోలు పెడుతున్నారు. ముఖ్యంగా యూరప్లో అతి పెద్ద వ్యవసాయ ఉత్పత్తిదారులైన జర్మనీ, ఫ్రాన్స్ రైతులు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ► పోర్చుగల్ నుంచి చౌకగా వచ్చి పడుతున్న వ్యవసాయోత్పత్తులు తమ పుట్టి ముంచుతున్నాయంటూ స్పెయిన్ రైతులు వాపోతున్నారు. ► నిధుల లేమి కారణంగా ఈయూ సబ్సిడీలు సకాలంలో అందకపోవడం రైతులకు మరింత సమస్యగా మారింది. ఇవీ డిమాండ్లు... ► ఆహారోత్పత్తుల దిగుమతులకు ఈయూ అడ్డుకట్ట వేయాలి. ► ఉక్రెయిన్ ఆహారోత్పత్తులను ప్రధానంగా ఆసియా దేశాలకు మళ్లించేలా చూడాలి. ► ముఖ్యంగా ఉక్రెయిన్ నుంచి పౌల్ట్రీ, గుడ్లు, చక్కెర దిగుమతులను నిలిపేయాలి. ► సాగుపై ప్రభుత్వపరంగా పన్నుల భారాన్ని తగ్గించాలి. ► 4% భూమిని ఖాళీగా వదలాలన్న నిబంధనను ఎత్తేయాలి. ► పలు పర్యావరణ నిబంధనలను వీలైనంతగా సడలించాలి. ► పెట్రోల్, డీజిల్పై సాగు సబ్సిడీలను కొనసాగించాలి. ఆందోళనలు ఏయే దేశాల్లో... జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, బెల్జియం, పోలండ్, స్పెయిన్, రొమేనియా, గ్రీస్, పోర్చుగల్, హంగరీ, స్లొవేకియా, లిథువేనియా, బల్గేరియా – సాక్షి, నేషనల్ డెస్క్ -
Russia-Ukraine War: ఉక్రెయిన్లో దాడులు.. 25 మంది దుర్మరణం
కీవ్: రష్యా ఆక్రమిత ఉక్రెయిన్ భూభాగంలో ఆదివారం ఒక మార్కెట్పై జరిగిన దాడిలో 25 మంది ప్రాణాలు కోల్పోయారు. ఉక్రెయిన్ సేనలే ఈ దాడులకు తెగబడినట్లు రష్యా ఆరోపిస్తోంది. దీనిపై ఉక్రెయిన్ ఇంకా స్పందించలేదు. డోనెట్స్క్ నగరం సమీపంలోని టెక్స్టిల్చిక్ ప్రాంత మార్కెట్పై జరిగిన ఈ దాడిలో 20 మందికిపైగా గాయపడ్డారు. మరోవైపు ఆదివారమే రష్యాలోని కింగ్సెప్ జిల్లాలోని ఉస్ట్–లూగా పోర్ట్ రసాయన రవాణా టెరి్మనల్ వద్ద రెండు భారీ పేలుళ్లు, తర్వాత భారీ అగి్నప్రమాదం జరిగిన నేపథ్యంలో ఈ సంఘటనలను రష్యా, ఉక్రెయిన్ల పరస్పర దాడులుగా అంతర్జాతీయ మీడియా అభివరి్ణస్తోంది. నాలుగు ఉక్రెయిన్ డ్రోన్లు దాడి చేయడం వల్లే రసాయన రవాణా టెర్మినల్ వద్ద గ్యాస్ ట్యాంక్ పేలిందని రష్యా స్థానిక మీడియా ఆరోపిస్తోంది. -
ఉక్రెయిన్పై రష్యా డ్రోన్ దాడులు
ఉక్రెయిన్పై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. నూతన సంవత్సరాని స్వాగతం పలికే కొన్ని గంటల మందు రాత్రి ఉక్రెయిన్పై రష్యా సైన్యం డ్రోన్లతో విరుచుకుపడింది. ఉక్రెయిన్లో న్యూ ఇయర్ వేడుకలు జరుపుకుంటున్న పలు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని డ్రోన్ దాడులకు తెగపడింది. ఉక్రెయిన్లోని పలు ప్రాంతాల్లో సుమారు రష్యా 90 డ్రోన్లతో దాడి చేసినట్లు ఉక్రెయిన్ సోమవారం తెలిపంది. Shahed drone attack on Odessa has been underway in New Year's Eve for more than two hours. Debris of kamikaze drones caused several fires in residential buildings so far. At least one person was killed. pic.twitter.com/kX1lxLijvj — Olga Klymenko (@OlgaK2013) January 1, 2024 ఈ డ్రోన్ దాడుల్లో 15 ఏళ్ల బాలుడు మృతి చెందినట్లు ఉక్రెయిన సైన్యం పేర్కొంది. డ్రోన్ దాడుల్లో సమారు ఏడుగురు తీవ్రంగా గాపడినట్లు తెలిపింది. రష్యా చేసిన షాహెద్ డ్రోన్ దాడులతో ఒడెస్సాలోని పలు భవనాల్లో భారీగా మంటల్లో కాలిపోయాయి. అయితే ఉక్రెయిన్ సైతం తమపై దాడులు చేస్తోందని రష్యా ప్రకటించింది. చదవండి: జపాన్లో సునామీ హెచ్చరికలు -
పుతిన్ను ఎలాగైనా ఆపాల్సిందే: బైడెన్
వాషింగ్టన్: ఉక్రెయిన్ను సర్వనాశనం చేసేందుకే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కంకణం కట్టుకున్నారంటూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ దుయ్యబట్టారు. ‘‘ఆయన యుద్ధోన్మాదాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డుకోవాల్సిందే. ఉక్రెయిన్పై రష్యా తాజాగా క్షిపణుల వర్షం కురిపించిన వైనం ఈ ఆవశ్యకతను మరోసారి గుర్తు చేసింది’’ అన్నారు. తమ దేశంపైకి రష్యా ఏకంగా 110 క్షిపణులను ప్రయోగించిందని, ఈ డాడిలో 31 మంది అమాయకులు బలవగా వందలాది మంది గాయపడ్డారని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ గురువారం ప్రకటించడం తెలిసిందే. 2022లో యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇదే అతి పెద్ద దాడి అని ఉక్రెయిన్ వర్గాలంటున్నాయి. ఈ నేపథ్యంలో పుతిన్ను అడ్డుకునేందుకు ఉక్రెయిన్కు మరింత సాయం అందిద్దామని అమెరికా చట్టసభ కాంగ్రెస్కు బైడెన్ పిలుపునిచ్చారు. -
ఉక్రెయిన్పై మళ్లీ నిప్పుల వర్షం
కీవ్: ఉక్రెయిన్పై రష్యా సైన్యం మరోసారి భీకర స్థాయిలో విరుచుకుపడింది. చాలారోజుల తర్వాత అతిపెద్ద దాడికి పాల్పడింది. గురువారం రాత్రి నుంచి ఉక్రెయిన్లోని కీలకమైన లక్ష్యాలపై ఏకంగా 122 క్షిపణులు, 36 డ్రోన్లు ప్రయోగించింది. 18 గంటలపాటు జరిగిన ఈ దాడుల్లో 24 మంది సాధారణ పౌరులు మృతి చెందారని, దాదాపు 130 మంది గాయపడ్డారని ఉక్రెయిన్ అధికార వర్గాలు శుక్రవారం వెల్లడించాయి. ఉక్రెయిన్–రష్యా యుద్ధం మొదలైన తర్వాత ఉక్రెయిన్పై ఇదే అతిపెద్ద వైమానిక దాడి అని పేర్కొన్నాయి. రష్యా సైన్యం ప్రయోగించిన బాలిస్టిక్, క్రూయిజ్ క్షిపణులు, షాహెద్ డ్రోన్లను చాలావరకు కూలి్చవేశామని ఉక్రెయిన్ సైనికాధికారి ఒకరు పేర్కొన్నారు. 2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్–రష్యా నడుమ యుద్ధం ప్రారంభమైన సంగతి తెలిసిందే. -
USA: ఉక్రెయిన్ను $250 మిలియన్ల మిలిటరీ సాయం
రష్యా-ఉక్రెయిన్ మధ్య 673 రోజుల నుంచి యుద్ధ వాతావరణం కొనసాగుతునే ఉంది. ఈ క్రమంలో మరోసారి అగ్రరాజ్యం అమెరికా తన భాగస్వామ్య దేశమైన ఉక్రెయిన్కు $250 మిలియన్ డాలర్ల మిలిటరీ ఆర్థిక సాయం విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. యుద్ధానికి సంబంధించిన ఆయుధాలు, పలు రక్షణ పరికరాలు ఈ ప్యాకేజీ ద్వారా అందజేస్తున్నామని తెలిపారు. అయితే ఈ ఏడాది ఉక్రెయిన్కు ఆమెరికా అందించే చివరి మిలటరీ సాయమని వైట్హౌజ్ వర్గాలు పేర్కొన్నాయి. ‘తమ భాగస్వామ్య దేశమైన ఉక్రెయిన్ స్వాతంత్రం, స్వేచ్ఛ కోసం రష్యాతో పోరాడుతోంది. ఈ సమయంలో తాము ఉక్రెయిన్కు సాయం అందిస్తున్నాం’ అని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ ఓ ప్రకటనలో తెలిపారు. తమ దేశ భద్రతలో భాగంగా ఉక్రెయిన్ దేశ భావిష్యత్తును దృష్టితో పెట్టుకొని మిలటరీ ఆర్థిక సాయం అందిస్తున్నామని తెలిపారు. 2022 ఫిబ్రవరి ఉక్రెయిన్-రష్యాల మధ్య యుద్ధం ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే అప్పటీ నుంచి ఉక్రెయిన్కు ఆమెరికా సుమారు $44.3 బిలియన్ డాలర్ల మిలిటరీ ఆర్థిక సాయం అందించిన సంగతి తెలిసిందే. చదవండి: Russia-Ukraine Conflict: పుతిన్ పిలిచారు.. ఉక్రెయిన్ సంక్షోభానికి తెర పడ్డట్లేనా? -
Russia-Ukraine War: తూర్పు ఉక్రెయిన్పై రష్యా క్షిపణుల వాన
కీవ్: ఉక్రెయిన్లోని డొనెట్స్క్ ప్రాంతం లక్ష్యంగా రష్యా మిలటరీ బుధవారం రాత్రి ఎస్–300 దీర్ఘ శ్రేణి క్షిపణులతో విరుచుకుపడింది. ఆ ప్రాంతంలోని పొక్రోవ్స్్క, నోవోహ్రోడివ్కా, మిర్నోహ్రాడ్ నగరాలపై జరిగిన దాడుల్లో ఒకరు చనిపోగా పదుల కొద్దీ భవనాలు నేలమట్టమయ్యాయి. భవనాల శిథిలాల్లో కొందరు చిక్కుకుని ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొద్ది నెలలుగా భీకర పోరాటం కొనసాగుతున్న అవ్డివ్కా నగరానికి సమీపంలోనే పై మూడు నగరాలున్నాయి. బఖ్ముత్ చుట్టుపక్కల ప్రాంతం, కీలకమైన అవ్డివ్కాలపై పట్టుసాధించేందుకు రష్యా బలగాలు వరుస దాడులకు పాల్పడుతున్నట్లు ఉక్రెయిన్ సైన్యం తెలిపింది. -
Russia-Ukraine War: మాస్కోపై డ్రోన్ల దాడి
మాస్కో: మాస్కో లక్ష్యంగా డజన్ల కొద్దీ డ్రోన్లతో ఉక్రెయిన్ ఆదివారం దాడికి యత్నించినట్లు రష్యా ఆరోపించింది. శనివారం ఉక్రెయిన్ రాజధాని కీవ్పైకి రష్యా 60కి పైగా డ్రోన్లను ప్రయోగించిన విషయం తెలిసిందే. ఆదివారం మాస్కో పరిసర ప్రాంతాలపైకి దూసుకొచి్చన 24 వరకు ఉక్రెయిన్ డ్రోన్లను అడ్డుకున్నట్లు రష్యా తెలిపింది. మాస్కోలోని మూడు వేర్వేరు చోట్ల జరిగిన డ్రోన్ దాడుల్లో ఎవరూ గాయపడలేదని గవర్నర్ ఆండ్రీ ఒవొబియెవ్ తెలిపారు. మాస్కోకు దక్షిణాన ఉన్న తుల నగరంలోని 12 అంతస్తుల అపార్టుమెంట్ను ఒక డ్రోన్ ఢీకొట్టగా ఒకరు గాయపడినట్లు సమాచారం. -
కీవ్పై భారీగా డ్రోన్ల దాడి
కీవ్: ఉక్రెయిన్ రాజధాని కీవ్పైకి రష్యా భారీ స్థాయిలో డ్రోన్ల దాడికి పాల్పడింది. 2022లో తమపై దురాక్రమణ మొదలయ్యాక రష్యా పాల్పడిన అతిపెద్ద డ్రోన్ దాడిగా ఉక్రెయిన్ మిలటరీ పేర్కొంది. శనివారం ఉదయం రాజధానితోపాటు చుట్టుపక్కల ప్రాంతాలపైకి రష్యా ప్రయోగించిన 75 ఇరాన్ తయారీ షహీద్ డ్రోన్లలో 66 డ్రోన్లను కూల్చివేసినట్లు తెలిపింది. వేకువజామున 4 గంటలకు మొదలై దాదాపు ఆరు గంటలపాటు కొనసాగిన ఈ దాడుల్లో పలు భవనాలు ధ్వంసం కాగా 11 ఏళ్ల బాలుడు సహా అయిదుగురు పౌరులు గాయపడ్డారు. -
Russia-Ukraine war: యుద్ధ వ్యతిరేక లేబుళ్లు అంటించినందుకు.. రష్యా కళాకారిణికి ఏడేళ్ల జైలు
మాస్కో: సూపర్మార్కెట్లోని వస్తువులపై ఉండే ధరల లేబుళ్లను తొలగించి, వాటి స్థానంలో యుద్ధ వ్యతిరేక నినాదాలున్న లేబుళ్లు అంటించిన నేరంపై ఓ కళాకారిణికి రష్యా కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. గత ఏడాది ఉక్రెయిన్పై రష్యా దాడులు మొదలయ్యాక.. సెయింట్ పీటర్స్బర్గ్కు చెందిన సాషా స్కోచిలెంకో(33) అనే కళాకారిణి స్థానిక ఫెమినిస్టు బృందం పిలుపు మేరకు స్థానిక సూపర్మార్కెట్లోని వస్తువుల ధర లేబుళ్లను తీసేసి..‘రష్యా ఆర్మీ మరియుపోల్లోని స్కూల్పై బాంబు వేసింది’... ‘రష్యా ఫాసిస్ట్ రాజ్యంగా మారి ఉక్రెయిన్పై దాడి చేసినందుకు మా ముత్తాత రెండో ప్రపంచ యుద్ధంలో పోరాడలేదు’ అంటూ రాసి ఉన్న కొన్ని లేబుళ్లను అంటించింది. ఈ నేరానికి అధికారులు గత ఏడాది ఏప్రిల్ అదుపులోకి తీసుకున్నారు. యుద్ధానికి వ్యతిరేకంగా ఎలాంటి వైఖరి తీసుకున్నా కఠిన శిక్షలకు అవకాశం కల్పిస్తూ పుతిన్ ప్రభుత్వం చట్టాలు తీసుకువచి్చంది. ఈ చట్టాలు అమల్లోకి వచ్చాక జరిగిన మొట్టమొదటి అరెస్ట్ ఇది. దీంతో, విచారణ సుదీర్ఘంగా సాగింది. తనపై వచి్చన ఆరోపణలను సాషా అంగీకరించింది కూడా. తీవ్ర అరోగ్య సమస్యలతో బాధపడుతున్న సాషా జైలులోనే చనిపోయే ప్రమాదముందని ఆమె తరఫు లాయర్లు తెలిపారు. అయినప్పటికీ జడ్జి ఏడేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచి్చనట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఉక్రెయిన్పై యుద్ధాన్ని ప్రభుత్వ టీవీలో లైవ్లో వ్యతిరేకించారన్న ఆరోపణలపై కోర్టు ఒకటి మరినా అనే జర్నలిస్టుకు ఎనిమిదిన్నరేళ్ల జైలు శిక్ష విధించింది. యుద్ధాన్ని నిరసించిన వ్లాదిమిర్ కారా ముర్జా అనే ప్రతిపక్ష నేతకు ఏప్రిల్లో 25 ఏళ్ల జైలు శిక్ష పడింది. -
ఉక్రెయిన్లో రష్యా క్షిపణి దాడి
కీవ్: ఉక్రెయిన్లో సైనిక అవార్డుల ప్రదానోత్సవం జరుగుతుండగా రష్యా సైన్యం క్షిపణిని ప్రయోగించింది. ఈ ఘటనలో 19 మంది ఉక్రెయిన్ సైనికులు మరణించారు. ఉక్రెయిన్లోని జపొరిజాజియాలో శుక్రవారం ఈ సంఘటన జరిగింది. రష్యా క్షిపణి దాడిలో 19 మంది తమ జవాన్లు మరణించినట్లు ఉక్రెయిన్ సోమవారం ధ్రువీకరించింది. వీరంతా 128వ మౌంటెయిన్–అసాల్ట్ బ్రిగేడ్కు చెందినవారు. రష్యా క్షిపణి దాడిని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తీవ్రంగా ఖండించారు. -
ఉక్రెయిన్కు మరో రూ.2,695 కోట్ల సాయం
వాషింగ్టన్: రష్యా సైనిక చర్య వల్ల ఎంతగానో నష్టపోయిన ఉక్రెయిన్కు ఇప్పటికే వివిధ రూపాల్లో సాయం అందించిన అగ్రరాజ్యం అమెరికా మరో భారీ ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. భద్రతా సాయం కింద ఉక్రెయిన్కు 325 మిలియన్ డాలర్లు (రూ.2,695 కోట్లు) ఇవ్వనున్నట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వెల్లడించారు. ఆయన తాజాగా వైట్హౌస్లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో సమావేశమయ్యారు. రష్యాతోయుద్ధంపై వారు చర్చించుకున్నారు. రష్యా దురాక్రమణ నుంచి ఉక్రెయిన్ సార్వ¿ౌమత్వాన్ని కాపాడడమే తమ కర్తవ్యమని బైడెన్ స్పష్టం చేశారు. ఉక్రెయిన్ ప్రజలు అంతులేని ధైర్య సాహసాలు ప్రదర్శిస్తున్నారని ప్రశంసించారు. ఆయుధాలు, పేలుడు పదార్థాలు, క్షిపణి నిరోధక వ్యవస్థలు సహా ఉక్రెయిన్కు రూ.2,695 కోట్ల సాయం అందజేయబోతున్నామని తెలిపారు. అబ్రామ్స్ యుద్ధ ట్యాంకులను వచ్చేవారం ఉక్రెయిన్కు ఇస్తామని వివరించారు. -
గాయపడిన సైనికులకు జెలెన్స్కీ పరామర్శ
న్యూయార్క్: ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశంలో ప్రసంగించడానికి న్యూయార్క్ వచ్చిన ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ యుద్ధంలో గాయపడి న్యూయార్క్లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఉక్రెయిన్ సైనికులను పరామర్శించారు. ఈ సందర్బంగా సైనికులతో మాట్లాడిన అయన వారిని ధైర్యంగా ఉండమై చెబుతూనే రష్యా నాయకులను తీవ్రవాదులుగా సంబోధించారు. ఏడాదిన్నరగా కొనసాగుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో ఎందరో ఉక్రెయిన్ సైనికులు చనిపోగా మరెందరో సైనికులు గాయపడ్డారు. న్యూయార్క్ టైమ్స్ పత్రిక గత నెల ప్రచురించిన కథనంలో ప్రకారం ఉక్రెయిన్ సైనికుల్లో చనిపోయిన వారు గాయపడిన వారు మొత్తం కలిపి ఐదు లక్షలకు పైగా ఉంటారని తెలిపింది. యూఎన్ అసెంబ్లీ సమావేశంలో ప్రసంగించేందుకు, యుద్ధంలో తమ భూభాగాన్ని స్వాధీనం చేసుకోవడానికి మరింత అమెరికా సాయ కోరడానికి ఇక్కడికి విచ్చేసిన జెలెన్స్కీ నేరుగా యుద్ధంలో గాయపడిన సైనికులు చికిత్స పొందుతున్న స్టాటిన్ ఐలాండ్ యూనివర్సిటీ హాస్పిటల్కు చేరుకున్నారు. ఆయన వచ్చేసరికి కృత్రిమ కాళ్లు అమర్చిన సైనికులు నడక ప్రాక్టీస్ చేస్తూ కనిపించారు. మిగిలిన సైనికుల్లో అత్యధికులు వీల్ ఛైర్లలో ఉండగా కొంతమంది కృత్రిమ చేతులు అమర్చి ఉన్నారు. ఈ సందర్బంగా సైనికులతో మాట్లాడుతూ.. తొందరగా ఇంటికి చేరుకోవాలన్న దృఢ సంకల్పం ఉన్న సైనికులను నేనెప్పుడూ చూడలేదు. మీకోసం మేమంతా ఎదురుచూస్తున్నాం. మీ అవసరం మాకు చాలా ఉంది. మీ సంకల్పం చాలా గొప్పది. మీరంతా తొందరగా కోలుకుని తిరిగి ఉక్రెయిన్ రావాలని మన శత్రువుపై గెలుపులో మీరంతా భాగస్వాములు కావాలని కోరుకుంటున్నా అన్నారు. చివరిగా సైనికులకు ధైర్యంగా ఉండమని చెప్పారు. అనంతరం సైనికులతోపాటు అక్కడ హాస్పిటల్ స్టాఫ్ కు ఉక్రెయిన్ గౌరవ అవార్డులిచ్చి సత్కరించి వారితో ఫోటోలు కూడా తీసుకున్నారు. LIVE: Ukraine President Volodymyr Zelenskiy visits a New York hospital Nur 96 Zuschauer bei Reuters?https://t.co/FAvszjzZvE via @YouTube — Alexander Prinz (@prinzartair) September 18, 2023 ఇది కూడా చదవండి: భారత్పై సంచలన ఆరోపణలు చేసిన కెనడా ప్రధాని -
ఇప్పుడు పుతిన్కు నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ అండ!
సియోల్: ఉక్రెయిన్పై యుద్ధానికి సంబంధించి రష్యాకు ఉత్తర కొరియా పూర్తి మద్దతు ప్రకటించింది. తమ జాతీయ భద్రత కోసం రష్యా చేస్తున్న పోరాటంలో ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కు బేషరతుగా పూర్తిస్థాయి మద్దతు ఇస్తున్నట్టు ఉత్తరకొరియా నియంతృత్వ పాలకుడు కిమ్ జోంగ్ ఉన్ వెల్లడించారు. అంతేకాదు ఉక్రెయిన్పై రష్యా యుద్ధాన్ని ‘పవిత్ర పోరాటం’గా అభివర్ణించారు. సామ్రాజ్యవాద వ్యతిరేక శక్తులను ఎదుర్కొనేందుకు తమ దేశం ఎల్లప్పుడూ రష్యాకు మద్దతుగా నిలబడుతుందని తెలిపారు. ఉక్రెయిన్పై దాదాపు ఏడాదిన్నర కింద రష్యా యుద్ధం ప్రారంభించిన విషయం తెలిసిందే. యూరప్ దేశాలు, అమెరికా ఆయుధాలు సాయం చేయడంతో ఈ యుద్ధంలో ఉక్రెయిన్ సమర్థవంతంగా రష్యాకు ఎదురొడ్డి నిలిచింది. ఇన్నాళ్లుగా నిరంతర దాడులతో రష్యాకు ఆయుధాల కొరత తలెత్తింది. ఈ క్రమంలో ఉత్తర కొరియా నియంత కిమ్తో పుతిన్ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. రష్యా తూర్పు కొసన సైబీరియా ప్రాంతంలో ఉన్న వోస్తోక్నీ అంతరిక్ష ప్రయోగ కేంద్రంలో బుధవారం పుతిన్తో కిమ్ భేటీ అయ్యారు. ఆయుధాలు, ఆర్థిక అంశాలపై.. రష్యా, ఉత్తరకొరియా మీడియా సంస్థల కథనాల ప్రకారం.. సోవియట్ కాలం నుంచీ ఉత్తరకొరియాకు అండగా ఉన్న విషయాన్ని పుతిన్ తమ భేటీలో గుర్తుచేశారు. ఇరు దేశాల మధ్య ఆర్థిక సహకారాన్ని, ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్ అంశాన్ని కిమ్ పరోక్షంగా ప్రస్తావిస్తూ.. రష్యాకు తమ పూర్తి మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. ‘‘సామ్రాజ్యవాద శక్తుల నుంచి తన సార్వ¿ౌమ హక్కులను, భద్రతను పరిరక్షించుకునేందుకు రష్యా ‘పవిత్ర పోరాటం’ చేస్తోంది. రష్యా ప్రభుత్వానికి డెమొక్రటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా (ఉత్తర కొరియా) ఎల్లప్పుడూ బేషరతుగా పూర్తి మద్దతు ఇస్తోంది. ఈ విషయాన్ని మరోసారి స్పష్టం చేసేందుకు వచి్చన ఈ అవకాశాన్ని వినియోగించుకుంటాం..’’ అని కిమ్ ప్రకటించారు. శాటిలైట్ల కోసమేగా వచ్చింది! పుతిన్ రష్యా స్వయం సమృద్ధ దేశమని, అయితే కొన్ని అంశాలపై దృష్టి పెట్టాల్సి ఉందని.. వాటిపై కిమ్తో చర్చించానని పుతిన్ వెల్లడించారు. కిమ్తో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఉత్తర కొరియా ఉపగ్రహాలు అభివృద్ధి చేసేందుకు రష్యా సహకరిస్తుందా? అని మీడియా ప్రశ్నించగా.. ‘‘అందుకేగా మేం ఇక్కడికి (భేటీ కోసం) వచ్చింది. రాకెట్ టెక్నాలజీపై ఉత్తర కొరియా నేత చాలా ఆసక్తి కనబరుస్తున్నారు. ఉత్తర కొరియా నుంచి ఆయుధాల కొనుగోలు, మిలటరీ సాయం, ఆంక్షల విషయంలో మాట్లాడేందుకు ఇంకా చాలా సమయం ఉంది..’’ అని పేర్కొన్నారు. రష్యా, ఉత్తరకొరియా మధ్య రవాణా, వ్యవసాయం వంటి పరస్పర ప్రయోజనాలున్న ప్రాజెక్టులు ఎన్నో ఉన్నాయని చెప్పారు. పొరుగు దేశమైన ఉత్తర కొరియాకు మానవతా సాయం అందిస్తున్నామన్నారు. రష్యాలోని మరో రెండు నగరాల్లో కిమ్ పర్యటిస్తారని, యుద్ధ విమానాల ప్లాంట్ను, రష్యా పసిఫిక్ నౌకాదళ కేంద్రాన్ని సందర్శిస్తారని వెల్లడించారు. ఆంక్షలతో కలిసిన ఇద్దరు ఉక్రెయిన్పై యుద్ధం నేపథ్యంలో అమెరికా, యూరోపియన్ యూనియన్ దేశాలు రష్యాపై ఆంక్షలు విధించాయి. చమురు కొనుగోళ్లు, ఇతర లావాదేవీల విషయంలో సమస్యలతో రష్యా ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుంది. మరోవైపు అణ్వస్త్ర క్షిపణుల అభివృద్ధి, ఇటీవల వరుసగా ప్రయోగాలు జరపడం నేపథ్యంలో ఉత్తర కొరియాపై భారీగా ఆంక్షలు అమల్లో ఉన్నాయి. ఇలా పాశ్చాత్య ప్రపంచం దూరం పెట్టిన ఇరుదేశాల నేతలు పరస్పర సహకారం కోసం కలవడం గమనార్హం. అయితే ఉత్తర కొరియా నుంచి ఆయుధాలు కొనడంగానీ, ఆ దేశానికి రాకెట్, శాటిలైట్ టెక్నాలజీని ఇవ్వడంగానీ దారుణమైన పరిస్థితులకు దారితీస్తాయన్న హెచ్చరికలు వినిపిస్తున్నాయి. ఆ ఆయుధాలు ఇవ్వండి సోవియట్ యూనియన్ కాలం నుంచి ఉత్తర కొరియా, రష్యా మధ్య స్నేహ సంబంధాలు ఉన్నాయి. 1950–53 మధ్య జరిగిన కొరియన్ యుద్ధంలో సోవియట్ యూనియన్ ఉత్తర కొరియాకు అండగా నిలిచింది. పెద్ద ఎత్తున ఆయుధాలను అందించడం ద్వారా దక్షిణ కొరియాపై ఉత్తర కొరియా ఆక్రమణకు సహకరించింది. ఆ సమయంలో దక్షిణ కొరియాకు అమెరికా, ఇతర పాశ్చాత్య దేశాలు అండగా నిలవడంతో.. చాలా కాలం యుద్ధ పరిస్థితులు నెలకొన్నాయి. ఉత్తర కొరియాకు సోవియట్ యూనియన్ ఆయుధాల సరఫరా, సహకారం కొనసాగింది. ఈ క్రమంలో నాటి ట్యాంక్ షెల్స్, లాంఛర్లు, మినీ రాకెట్లు లక్షల సంఖ్యలో ఉత్తర కొరియా వద్ద పోగుపడ్డాయి. సోవియట్ డిజైన్ ఆయుధాలే కాబట్టి రష్యా వాటిని నేరుగా వినియోగించుకోగలదు. ఇప్పుడు ఉక్రెయిన్పై యుద్ధంలో వాడేందుకు ఆ ఆయుధాలు ఇవ్వాలని ఉత్తర కొరియాను పుతిన్ కోరారు. మాకు గూఢచర్య ఉపగ్రహ టెక్నాలజీ కిమ్ షరతు రష్యా, చైనా తదితర దేశాల సాయంతో ఉత్తర కొరియా క్షిపణులు, అణ్వస్త్ర సాంకేతికతల విషయంలో ఓ మోస్తరుగా అభివృద్ధి సాధించినా.. ఉపగ్రహాల టెక్నాలజీలో చాలా వెనుకబడి ఉంది. అణు సామర్థ్యమున్న క్షిపణుల ప్రయోగం, ఇతర సైనిక అవసరాల కోసం మిలటరీ/గూఢచర్య ఉపగ్రహాలు తప్పనిసరి. ఈ దిశగా ఉత్తర కొరియా పలుమార్లు ప్రయోగాలు జరిపినా విఫలమైంది. తాజాగా రష్యా ఆయుధాలు అడుగుతున్న నేపథ్యంలో.. మిలటరీ గూఢచర్య ఉపగ్రహాల అభివృద్ధి, సాంకేతికత విషయంలో సాయం చేయాలని కిమ్ షరతు పెట్టినట్టు సమాచారం. ప్రత్యేక రైల్లో.. లిమోజిన్తో సహా.. ఉత్తర కొరియా నుంచి కిమ్ ఏకంగా ఓ ప్రత్యేక రైలులో రష్యాకు వెళ్లారు. క్షిపణి దాడులు జరిగినా కూడా తట్టుకునేలా ప్రత్యేకంగా రూపొందించిన బోగీలు, వెంటనే ఎదురుదాడి చేయడానికి వీలుగా భారీ స్థాయిలో సిద్ధంగా అమర్చిపెట్టిన ఆయుధాలు ఈ రైలు సొంతం. దీనితోపాటు ఎలాంటి దాడులనైనా ఎదుర్కొనే ప్రత్యేకమైన వాహనాన్ని (లిమోజిన్) కూడా వెంట తీసుకెళ్లారు. వోస్తోక్నీ అంతరిక్ష కేంద్రం సమీపంలోకి రైలు చేరుకున్నాక.. కిమ్ తన లిమోజిన్లో భేటీ అయ్యే స్థలానికి చేరుకోవడం గమనార్హం. కిమ్కు పుతిన్ ఎదురెళ్లి స్వాగతం పలికారని, ఇద్దరూ సుదీర్ఘంగా నాలుగు గంటల పాటు చర్చించుకున్నారని.. భేటీ అనంతరం కిమ్కు పుతిన్ ప్రత్యేక విందు ఇచ్చారని రష్యా మీడియా వెల్లడించింది. ఈ పర్యటన సందర్భంగా రష్యా అంతరిక్ష కేంద్రంలో కిమ్ కలియదిరిగారని, అక్కడి ప్రత్యేకతలను తెలుసుకున్నారని వివరించింది. -
అపనమ్మకాన్ని తొలగిద్దాం
న్యూఢిల్లీ: కోవిడ్ మహా సంక్షోభం, ఉక్రెయిన్ యుద్ధంతో విశ్వవ్యాప్తంగా దేశాల మధ్య వేళ్లూనుకుపోయిన అపనమ్మకాలు, భయాలను పారద్రోలాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. జీ20 సదస్సులో తొలి రోజు అగ్రరాజ్యాధినేతలతో శిఖరాగ్ర చర్చల సందర్భంగా ప్రపంచం ఎదుర్కొంటున్న పెను సవాళ్లను మోదీ ప్రస్తావించారు. ‘కోవిడ్ మహమ్మారి కారణంగా ప్రపంచ దేశాల్లో కొత్త భయాలు, అపనమ్మకాలు గూడుకట్టుకున్నాయి. వెనువెంటనే వచి్చపడిన ఉక్రెయిన్ యుద్ధ భయాలు ఆ అగాథాలను మరింత పెంచాయి. ఇప్పుడు అపనమ్మకాలను పోగొట్టాల్సిన సమయం వచ్చింది. విశ్వాసం దిశగా ప్రపంచదేశాలు కలిసి నడవాలి. అవిశ్వాసంపై మనం విజయం సాధించాలి. విశ్వ శ్రేయస్సు కోసం కలసి ముందడుగేద్దాం’ అని పిలుపునిచ్చారు. ప్రసంగం ప్రారంభంలోనే మొరాకోను పెను భూకంపం కుదిపేసిన దుర్ఘటనను ప్రస్తావించి వందలాది మంది మృతులకు ప్రగాఢ సంతాపం తెలిపారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్, సౌదీ యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్, బ్రెజిల్ అధ్యక్షుడు లులా డ సిల్వా సహా జీ20 అధినాయకగణం సమక్షంలో మోదీ ప్రసంగించారు. ప్రసంగంలోని ముఖ్యాంశాలు కొన్ని ఆయన మాటల్లోనే.. ఏటా 100 బిలియన్ డాలర్లు ఇవ్వాల్సిందే పెను వాతావరణ మార్పులు సంభవించకుండా ముందస్తు నివారణ చర్యలకు సమాయత్తమవుదాం. శిలాజ ఇంధనాల నుంచి పునరుత్పాదక ఇంధన వ్యవస్థల వైపు మారాలంటే ట్రిలియన్ల కొద్దీ భూరి నిధులు అత్యావశ్యకం. ఈ సమూల మార్పు ప్రక్రియలో అభివృద్ధి చెందిన దేశాలు అత్యంత కీలకమైన పాత్ర పోషించాలి. 2009లో కోపెన్హాగెన్లో ఐక్యరాజ్యసమితి ‘వాతావరణ’ చర్చల సందర్భంగా 2020 నాటికల్లా అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఏటా 100 బిలియన్ డాలర్ల నిధులు ఇస్తామన్న వాగ్దానాలను సంపన్న దేశాలు నిలబెట్టుకోవాల్సిందే. 55 దేశాల ఆఫ్రికన్ కూటమిని జీ20లోకి ఆహ్వానించడం నాకు గర్వకారణం. కోవిడ్ తెచి్చన మహా విషాదం దేశాల మధ్య విశ్వాసం తగ్గించేసింది. అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థిక అనిశి్చతి, ఉత్తరార్థ గోళ దేశాలు, దక్షిణార్ధ గోళ దేశాల మధ్య లోపించిన సఖ్యత, ఆహారం, ఇంధనం, ఎరువులు, ఉగ్రవాదం, సైబర్ సెక్యూరిటీ, ఆరోగ్యం, ఇంధనం, నీటి భద్రత అంశాల్లో పరిష్కారాలు వెతికి ప్రపంచ సుస్థిరాభివృద్ధికి సమష్టిగా పాటుపడదాం. ‘ఒకే కుటుంబం’ స్ఫూర్తితో సుస్థిరాభివృద్ధి ‘ఒకే కుటుంబం’ స్ఫూర్తితో అభివృద్ధిని సుస్థిరం చేసుకుందాం. దీనిని సాంకేతికత వారధి తోడుగా నిలవనుంది. ప్రతి వర్గం, ప్రతి ప్రాంతాన్ని అనుసంధానిస్తూ సహాయ వ్యవస్థను నిర్మించుకుందాం. అప్పుడే గణనీయమైన మార్పు మహిళల సారథ్యంలో జరిగే అభివృద్ధితోనే 21వ శతాబ్దంలో గణనీయమైన మార్పును చూడగలం. ఇప్పుడు భారత్లో సైన్స్, టెక్నాలజీ, గణితం, ఇంజనీరింగ్ విభాగాల్లో పట్టభద్రులైన వారిలో 45 శాతం మంది అమ్మాయిలే. సైన్స్, టెక్నాలజీలో ప్రతిభ చూపిన వారికి అంతర్జాతీయ అవకాశాలు కలి్పంచేందుకు ‘జీ20 టాలెంట్ వీసా’ అనే ప్రత్యేక కేటగిరీని త్వరలో ప్రారంభిస్తాం. గ్లోబల్ బయో–బ్యాంక్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలో గ్లోబల్ బయో–బ్యాంక్ల ఏర్పాటు సంతోషదాయకం. హృద్రోగాలు, సికెల్ సెల్ అనీమియా, రొమ్ము క్యాన్సర్లపై దృష్టిసారించేందుకు మరింత అవకాశం చిక్కుతుంది. దేశాలను, మనుషులను కేవలం మార్కెట్ల కోణంలో చూడొద్దు. మనకు సహానుభూతి, దీర్ఘకాలిక లక్ష్యాలు తప్పనిసరి. 47 ఏళ్లు కాదు ఆరేళ్లలో సాధించాం ఆర్థిక సమ్మిళితకు 47 ఏళ్లు పడుతుందని ప్రపంచ బ్యాంక్ చెప్పింది. కానీ దానిని భారత్ కేవలం ఆరేళ్లలోనే సాధించింది. గత పదేళ్లలో ఏకంగా 360 బిలియన్ డాలర్ల మొత్తాలను నేరుగా బ్యాంక్ ఖాతాల్లో జమచేసింది. 33 బిలియన్ డాలర్ల నిధులు పక్కదారి పట్టకుండా నివారించింది. ఇది స్థూల దేశీయోత్పత్తిలో 1.25 శాతానికి సమానం. మహిళా సాధికారత ను సరికొత్త శిఖరాలకు చేర్చేందుకు జీ20 ఎంతగానో కృషిచేస్తోంది. అంతర్జాతీయ సరకు రవాణా గొలుసులో విశ్వాసం, పారదర్శకత పెరగాలి. -
G20 Summit: ఢిల్లీ డిక్లరేషన్లో గొప్పేముంది?
క్యివ్: భారత దేశం ఆధ్వర్యంలో ఘనంగా జరుగుతున్న జీ20 శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని ప్రకటించిన ఢిల్లీ డిక్లరేషన్కు సభ్యదేశాలు ఆమోదం తెలిపాయి. ఇందులో ప్రస్తావించిన ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించిన అంశాన్ని కూడా జీ20 దేశాలు ఆమోదించాయి. కానీ ఢిల్లీ డిక్లరేషన్లో ఉక్రెయిన్ యుద్ధం అంశంపై అసంతృప్తిని వ్యక్తం చేశారు ఉక్రెయిన్ విదేశాంగ శాఖ. ఉక్రెయిన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఒలెగ్ నికోలెంకో తన ఎక్స్(ట్విట్టర్) ద్వారా డిక్లరేషన్పై స్పందిస్తూ భారత్ ప్రతిపాదించిన ఢిల్లీ డిక్లరేషన్లో ఎక్కడా రష్యా పేరును ప్రస్తావించకుండా డాక్యుమెంటేషన్ చేసి ఆమోదం పొందడంలో గొప్పేముందని ప్రశ్నించారు. పదాల అమరిక విషయంలో నేర్పును కనబరచి సమావేశాల్లో మా ప్రస్తావన తీసుకొచ్చినందుకు జీ20 భాగస్వామ్య దేశాలకు కృతజ్ఞతలు చెబుతూ మాకు కూడా సమావేశాల్లో పాల్గొనే అవకాశం కల్పించి ఉంటే ఇక్కడి పరిస్థితులను కళ్ళకు కట్టేవాళ్లమని అన్నారు. ఢిల్లీ డిక్లరేషన్లో పదాలను ఈ విధంగా వాడి ఉంటే మరింత అర్ధవంతంగానూ వాస్తవానికి దగ్గరగానూ ఉండేదని చెబుతూ డిక్లరేషన్ను సవరించి మరీ చూపించారు. G20 adopted a final declaration. We are grateful to the partners who tried to include strong wording in the text. However, in terms of Russia's aggression against Ukraine, G20 has nothing to be proud of. This is how the main elements of the text could look to be closer to reality pic.twitter.com/qZqYluVKKS — Oleg Nikolenko (@OlegNikolenko_) September 9, 2023 ఇది కూడా చదవండి: G20 Summit: ఢిల్లీ డిక్లరేషన్పై ఏకాభిప్రాయం సాధించిన భారత్ -
G20 Summit: ఢిల్లీ డిక్లరేషన్పై ఏకాభిప్రాయం సాధించిన భారత్
న్యూఢిల్లీ: ఢిల్లీ వేదికగా జరుగుతున్న జీ20 సదస్సులో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన ఢిల్లీ డిక్లరేషన్కి సభ్యులందరూ ఆమోదం తెలిపారు. ఈ విషయాన్ని జీ20 నిర్వాహక బృందం ప్రతినిధి అమితాబ్ కాంత్ ఎక్స్(ట్విట్టర్) ద్వారా వెల్లడించారు. డిక్లరేషన్లో భాగంగా రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించిన అంశంపై కొంత మేర భేదాభిప్రాయాలు వ్యక్తమైనప్పటికీ చివరకు సభ్యులు ఏకాభిప్రాయం తెలిపి డిక్లరేషన్ని స్వాగతించారు. ప్రధాని ప్రకటన.. ఢిల్లీలోని భారత్ మండపం వేదికగా జరుగుతున్న జీ20 సదస్సులో ప్రెసిడెన్సీ హోదాలో భారత్ అపూర్వ ఘట్టాన్ని ఆవిష్కరించింది. సదస్సులో ప్రధాని చేసిన కీలక ప్రకటనకు సభ్య దేశాలు ఆమోదం తెలిపిన విషయాన్ని ప్రకటిస్తూ.. అందరికీ ఒక శుభవార్త, నిర్వాహక బృందం సమిష్టి కృషి ఫలితంగా న్యూ ఢిల్లీ డిక్లరేషన్ విషయంలో సభ్యుల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. ఈ సందర్బంగా ఈ డిక్లరేషన్ని ఆమోదం పొందినట్లు ప్రకటిస్తున్నాను. దీని కోసం విశేష కృషి చేసిన నిర్వాహక అధికారులకు, మంత్రులకు కృతఙ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు. #WATCH | G-20 in India: PM Narendra Modi says, " I have received good news. Due to the hard work of our team, consensus has been built on New Delhi G20 Leaders' Summit Declaration. My proposal is to adopt this leadership declaration. I announce to adopt this declaration. On this… pic.twitter.com/7mfuzP0qz9 — ANI (@ANI) September 9, 2023 ప్రధాని మార్కు డిక్లరేషన్.. జీ20 షెర్పా అమితాబ్ కాంత్ తన ఎక్స్(ట్విట్టర్) ద్వారా ఈ డిక్లరేషన్లో ప్రధానంగా నాలుగు 'P'ల గురించి ప్రస్తావించారని అవి Planet(భూమి), People(ప్రజలు), Peace(శాంతి), Prosperity(శ్రేయస్సు) కాగా ఐదవ 'P'గా ప్రధాని మార్కు ఉందని నరేంద్ర మోదీని కొనియాడారు. ఢిల్లీ డిక్లరేషన్లో భాగంగా ముఖ్యంగా ఐదు అంశాలపై ఏకాభిప్రాయం కుదిరినట్లు తెలిపారు. 1.బలమైన,స్థిరమైన,సమతుల్యమైన సమగ్రాభివృద్ధి 2.సుస్థిరమైన అభివృద్ధి 3.సుస్థిర భవిష్యత్ కోసం హరిత అభివృద్ధి ఒప్పందం 4.21వ శతాబ్దానికి బహుపాక్షిక సంస్థలు 5.బహుపాక్షికతను పునరుద్దరించడం India got 100 per cent consensus on New Delhi Declaration: G20 Sherpa Amitabh Kant Read @ANI Story | https://t.co/Ow4wFIwXcx#AmitabhKant #NewDelhi #India #G20India2023 #G20SummitDelhi pic.twitter.com/pP8YR3an4P — ANI Digital (@ani_digital) September 9, 2023 ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించిన డిక్లరేషన్.. ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి సభ్య దేశాల మధ్య ఏకాభిప్రాయం సాధించడం ఈ సమావేశాల్లో భారత్ సాధించిన అపూర్వ విజయం. ప్రధాని ప్రకటించిన ఢిల్లీ డిక్లరేషన్ డ్రాఫ్టులో ఎక్కడా 'రష్యా' పేరును ప్రస్తావించకుండా ఉక్రెయిన్ పరిస్థితిని కళ్ళకు కడుతూ అక్కడి ప్రాదేశిక సమగ్రతకు వ్యతిరేకంగా ఎటువంటి చర్యలకు పాల్పడవద్దని సభ్యదేశాలను కోరింది. జీ20 సదస్సు భౌగోళిక రాజకీయ భద్రతా వ్యవహారాలను పరిష్కరించే వేదిక కాదని ప్రపంచ ఆర్ధిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు మాత్రమే ఇది వేదికని తెలిపింది. #G20 New Delhi Leaders' Declaration adopted with the bang of the gavel! Read the full text 📃: https://t.co/DGID0ArdOR#G20India pic.twitter.com/u6lpZZ0ET0 — G20 India (@g20org) September 9, 2023 సార్వభౌమత్వం, అంతర్జాతీయ చట్టాలు, ప్రాదేశిక సమగ్రతకు సంబంధించిన సిద్ధాంతాలను అన్ని దేశాలు గౌరవించాలని, ఒక దేశ స్వాతంత్ర్యానికి వ్యతిరేకంగా చర్యలు తీసుకోరాదని కోరింది. ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించిన ఈ 37 పేజీల డాక్యుమెంట్ 100 శాతం ఏకాభిప్రాయం సాధించినట్లు అమితాబ్ కాంత్ తెలిపారు. యుద్ధంలో బాధిత దేశాలకు ఆర్ధికచేయూతే ఈ సదస్సు ప్రధాన ఉద్దేశమని పేర్కొంది. యుద్ధంలో అణ్వాయుధాలు వినియోగించడం కూడా ఆమోదయోగ్యం కాదని డిక్లరేషన్లో తెలిపింది. ఇది కూడా చదవండి: ఢిల్లీ డిక్లరేషన్ ఆమోదం.. ప్రధాన ఐదు అంశాలు ఇవే.. -
‘మస్క్ తప్పు చేశావ్..ఇప్పటికైనా అర్థమవుతోందా?’
ప్రపంచకుబేరుడు, ట్విటర్ బాస్ ఎలాన్ మస్క్పై ఉక్రెయిన్ మండిపడుతోంది. గత ఏడాది రష్యా యుద్ధనౌకలపై డ్రోన్ దాడిని నిరోధించేందుకు తన స్టార్లింక్ శాటిలైట్ నెట్వర్క్ని ఉపయోగించడానికి అనుమతిని ఎలా నిరాకరించారనే వివరాలు కొత్త జీవిత చరిత్రలో వెల్లడైన నేపథ్యంలో ఉక్రేనియన్ సీనియర్ అధికారి ఎక్స(ట్విటర్)లో స్పందించారు. మస్క్ చాలా పాపానికి పాల్పడ్డాడంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉక్రేనియన్ అధ్యక్ష సలహాదారు మైఖైలో పోడోల్యాక్ మస్క్ జోక్యం తీరని నష్టానికి, అనేకమంది పౌరుల మరణాలకు దారితీసిందని ఆరోపించారు. ఒకోసారి పొరపాటు తీవ్ర తప్పిదంగా మారుతుంది. ఇది అజ్ఞానం, అహం కలయిక ఫలితం. స్టార్లింక్ జోక్యం ద్వారా రష్యన్ నౌకాదళంలో కొంత భాగాన్ని నాశనం చేయడానికి ఉక్రేనియన్ డ్రోన్లను అనుమతించి, రష్యా నౌకాదళాన్ని ఉక్రేనియన్ నగరాలపై కాలిబర్ క్షిపణుల దాడికి అనుమతించింది. ఫలితంగా, అనేకమంది పిల్లలు, పౌరులను పొట్టన పెట్టుకుంటోందంటూ ట్వీట్ చేశారు. (వరల్డ్ రిచెస్ట్ మేన్తో రహస్యంగా కవలలు: ఈ టాప్ ఎగ్జిక్యూటివ్ గురించి నమ్మలేని నిజాలు) అసలు కొంతమంది యుద్ధ నేరస్థులను, హత్య చేయాలనే వారి కోరికను ఎందుకు రక్షించాలనుకుంటున్నారు. తద్వారా వారు పాపానికి ఒడిగడుతున్నారని , దాన్ని ప్రోత్సహిస్తున్నారని ఇప్పటికైనా గ్రహించారా? అని ప్రశ్నించారు. టెక్ బిలియనీర్ మస్క్ జీవిత చరిత్రలోని దీనికి సంబంధించిన అంశాలు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో మైఖైలో పోడోల్యాక్ ప్రకటన వచ్చింది. కాగా బయోగ్రఫీ రైటర్గా పాపులర్ అయిన వాల్టర్ ఐజాక్సన్ మస్క్ బయోగ్రఫీ సీఎన్ఎన్ ప్రచురించిన పుస్తకంలో సాయుధ జలాంతర్గామి డ్రోన్లు "కనెక్టివిటీని కోల్పోయినప్పుడు , ప్రమాదకరం లేకుండా ఒడ్డుకు కొట్టుకుపోయినప్పుడు" క్రిమియా తీరానికి సమీపంలో ఉన్న రష్యన్ నౌకాదళాన్ని ఎలా సమీపిస్తున్నాయో వివరించింది.రష్యా ఆక్రమిత క్రిమియాపై ఉక్రేనియన్ దాడికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అణ్వాయుధాలతో ప్రతిస్పందిస్తాడనే ఆందోళన కారణంగా దాడి జరిగిన ప్రాంతంలో సేవలను నిలిపి వేయమని మస్క్ స్టార్లింక్ ఇంజనీర్లను ఆదేశించారని ఈ పుస్తకంలో పేర్కొన్నారు. మరోవైపు స్టార్లింక్ నెట్వర్క్ను ఆపివేసినట్లు వచ్చిన ఆరోపణలను మస్క్ ఖండించారు. రష్యా -ఉక్రెయిన్ వార్కి మరింత ఆజ్యం పోయకూడదనే ఉద్దేశంతోనే నో చెప్పా నన్నారు. ముఖ్యంగా ఉక్రెయిన్ నుండి క్రిమియన్ నౌకాశ్రయ నగరమైన సెవాస్టోపోల్ వరకు సక్రియం చేయమని చేసిన అభ్యర్థనకు తాను అంగీకరించ లేదని వివరణ ఇచ్చాడు. తన స్పేస్ఎక్స్ కంపెనీ "యుద్ధం-సంఘర్షణ తీవ్రతరం చేసే చర్యలకు సహకరించడం" తనకు ఇష్టం లేదంటూ క్లారిటీ ఇచ్చాడు. అటు రచయిత ఐజాక్సన్ కూడా దీనిపై స్పందించి స్పష్టత ఇచ్చారు. To clarify on the Starlink issue: the Ukrainians THOUGHT coverage was enabled all the way to Crimea, but it was not. They asked Musk to enable it for their drone sub attack on the Russian fleet. Musk did not enable it, because he thought, probably correctly, that would cause a… — Walter Isaacson (@WalterIsaacson) September 9, 2023 Sometimes a mistake is much more than just a mistake. By not allowing Ukrainian drones to destroy part of the Russian military (!) fleet via #Starlink interference, @elonmusk allowed this fleet to fire Kalibr missiles at Ukrainian cities. As a result, civilians, children are… — Михайло Подоляк (@Podolyak_M) September 7, 2023 -
కేంద్రం వైఖరిని సమర్థిస్తున్నాం
లండన్: రష్యా–ఉక్రెయిన్ సంక్షోభం విషయంలో బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న వైఖరిని పూర్తిగా సమర్థిస్తున్నామని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చెప్పారు. విశాలమైన దేశం అయినందున ప్రపంచదేశాలతో ద్వైపాక్షిక సంబంధాలను కొనసాగించాల్సిన అవసరం భారత్కు సహజంగానే ఉంటుందని చెప్పారు. బెల్జియం రాజధాని బ్రస్సెల్స్లో జరిగిన మీడియా సమావేశంలో రాహుల్ మాట్లాడారు. ఉక్రెయిన్ సంక్షోభం విషయంలో మోదీ ప్రభుత్వం తీసుకున్న వైఖరికి రష్యా నుంచి చమురు సరఫరాయే కారణమా అన్న మీడియా ప్రశ్నకు ఆయన పైవిధంగా సమాధానమిచ్చారు. ‘రష్యాతో మాకు సంబంధాలున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ విషయంలో ప్రభుత్వ, ప్రతిపక్షం వైఖరి భిన్నంగా ఉంటుందని నేను భావించడం లేదు’అని వివరించారు. రష్యా నుంచి దూరంగా తమవైపు భారత్ను లాక్కునేందుకు పశ్చిమ దేశాల నేతలు ప్రయత్నించారా అన్న ప్రశ్నకు రాహుల్ గాంధీ.. ‘‘వాస్తవానికి భారత్కు రష్యాతో సత్సంబంధాలున్నాయి. అదేవిధంగా అమెరికాతోనూ సంబంధాలు న్నాయి. భారత్ విశాల దేశం. పెద్ద దేశం కావడం వల్ల అనేక ఇతర దేశాలతో వివిధ స్థాయిల్లో సంబంధాలు కొనసాగుతున్నాయి. ఎవ్వరితోనైనా సంబంధాలు కొనసాగించే హక్కు భారత్కు ఉంది’అని రాహుల్ చెప్పారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 ద్వారా కశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి రద్దు విషయంలో ప్రతిపక్షం వైఖరిపై ఆయన..కశ్మీర్ అభివృద్ధిని కాంగ్రెస్ గట్టిగా కోరుతోంది. అక్కడ శాంతి నెలకొనాలని ఆకాంక్షిస్తోంది’అని రాహుల్ వివరించారు. కశ్మీర్ అంశం పరిష్కారానికి అంతర్జాతీయ దౌత్యం అవసరమని భావిస్తున్నారా అన్న ప్రశ్నకు రాహుల్ సూటిగా సమాధానమిచ్చారు. వాస్తవానికి కశ్మీర్ భారత్లో అంతర్భాగం. కశ్మీర్ మా సొంత విషయం. అందులో భారత్కు తప్ప మరెవ్వరి జోక్యం అవసరం లేదు’అని కుండబద్దలు కొట్టారు. -
G20 Summit: డిక్లరేషన్పై తొలగని ప్రతిష్టంభన
జీ20 శిఖరాగ్ర సదస్సుకు సర్వం సిద్ధమై అగ్రరా జ్యాధినేతలు విచ్చేసి భేటీకి సిద్ధమవుతున్న వేళ ఢిల్లీ డిక్లరేషన్పై ఇంకా ప్రతిష్టంభన తొలగలేదు. శిఖరాగ్ర సదస్సులో దేశాధినేతల మధ్య విస్తృత స్థాయి చర్చలు పూర్తయ్యాక చివరి రోజున ఉమ్మడి తీర్మానం(ఢిల్లీ డిక్లరేషన్) విడుదల చేస్తారు. ఆ తీర్మానంలో ఏఏ అంశాలపై ఉమ్మడి నిర్ణయాలు ప్రకటించాలనే దానిపై ఇంకా ఎలాంటి స్పష్టత రాకపోవడం ఆందోళన కలిగిస్తోంది. డిక్లరేషన్లో పొందుపరచాల్సిన అంశాలపై ఇప్పటికే ఆయా దేశాధినేతల తరఫున అధికారిక ప్రతినిధు(షెర్పా) లు పలుమార్లు కలిసికట్టుగా అంతర్గత చర్చలు జరిపారు. ఈ మంతనాల్లో ఇంతవరకు చెప్పుకోదగ్గ స్థాయిలో ఎలాంటి ఉమ్మడి నిర్ణయాలు తీసుకో లేదు. శిఖరాగ్ర సదస్సులో అధినేతలు ఏమేం అంశాలు చర్చించాలనేది ముందే నిర్ణయం అయిపో తుంది. సదస్సు అత్యంత సాఫీగా సాగేందుకు వీలుగా ఆయా అంశాలపై అధినేతల నుంచి ఉమ్మ డి నిర్ణయాలు వెలువడేందుకుగాను ముందే షెర్పా లు భారీ కసరత్తు చేస్తారు. సభ్య దేశాల అధినేతల అధికారిక ప్రతినిధులైన ఈ షెర్పాలు దౌత్యమార్గంలో అంతర్గతంగా ముందే అందరూ చర్చించుకుంటారు. దీంతో శిఖరాగ్ర సదస్సులో అధినేతలు నేరుగా కలిసి మాట్లాడేటపుడు ఆయా అంశాల లోతుల్లోకి వెళ్లరు. సూత్రప్రాయ అంగీకారం మాత్రమే తెలుపుతారు. మిగిలిన పని అంతా ముందే ఏర్పాటు చేసిపెడతారు కాబట్టి ఆతర్వాతి ప్రక్రియ సులువు అవుతుంది. అయితే, తాజాగా షెర్పాల మధ్య జరిగిన చివరి రౌండ్ చర్చల్లోనూ కొన్ని కీలక అంశాలపై సయోధ్య కుదరనే లేదు. వాటిల్లో పర్యావరణ మార్పు, ఉక్రెయిన్ యుద్ధం వంటి ప్రధాన అంశాలు ఉన్నాయి. ఉక్రెయిన్ యుద్ధాన్ని పేర్కొంటూ ఒక పేరాగ్రాఫ్లో భారత్ చేసిన ప్రతిపాదనలపై షెర్పాల చిక్కుముడి పడింది. ఉక్రెయిన్లో రష్యా ఆగడాలను అడ్డుకునేలా చర్యలు ఆ పేరాగ్రాఫ్లో లేవని అమెరికా, బ్రిటన్, యురోపియన్ యూనియన్లు వేలెత్తిచూపాయి. ఢిల్లీ డిక్లరేషన్లో ఉక్రెయిన్ యుద్ధం అంశంపై ఏకాభిప్రాయం తెలపాలంటే తమ డిమాండ్లు నెరవేర్చాలని అటు పశ్చిమ దేశాలు, ఇటు రష్యా–చైనా పక్ష దేశాలు పట్టుబడుతున్నాయి. దీంతో ఈ అంశంపై సమ్మతి సాధ్యపడలేదు. ఇలాంటి పరిస్థితి రాకూడదనే ముందుగానే జకార్తాలో రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్, భారత విదేశాంగ మంత్రి జైశంకర్లు చర్చలు జరిపి డిక్లరేషన్ సంబంధ అంశాలపై చర్చించినా ఫలితం లేకపోయింది. భారత నాయకత్వ ప్రతిష్టకు సవాల్ తొలిసారిగా జీ20 కూటమి సారథ్య బాధ్యతలు తీసుకున్న భారత్ ఈ సదస్సు తర్వాత ఎలాగైనా సరే ఉమ్మడి తీర్మానం ప్రకటించాలని చూస్తోంది. అయితే అటు పశ్చిమ దేశాలు, ఇటు రష్యా–చైనా పక్ష దేశాలు ఎవరి మంకుపట్టు వారు పట్టడంతో ఉ మ్మడి తీర్మానం సాధ్యమయ్యేలా లేదు. అదే జరిగి తే అంతర్జాతీయంగా భారత ప్రతిష్టకు భంగం వా టిల్లే ప్రమాదం ఉంది. సంయుక్త ప్రకటన సాధ్యంకాని పక్షంలో జీ20 అధ్యక్ష హోదాలో మోదీ కేవలం సారాంశ ప్రకటన విడుదల చేస్తారు. వాతావరణ మార్పు: ఇదే అసలైన అవరోధం చర్చల్లో ఏకాభిప్రాయానికి ప్రధాన అవరోధంగా వాతావరణ మార్పు విధానం నిలుస్తోంది. శిలాజ ఇంధనాల వినియోగాన్ని క్రమక్రమంగా తగ్గించుకోవడం, పునరుత్పాదక ఇంథనాల వైపు మళ్లడం, పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి సామర్థ్యాల పెంపునకు లక్ష్యాలను నిర్దేశించుకోవడం, గ్రీన్హౌజ్ వాయువుల ఉద్గారాలను తగ్గించుకోవడం వంటి అంశాల్లో జీ20 సభ్య దేశాల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఇది షెర్పాల భేటీలో స్పష్టంగా కనిపించింది. 2030 కల్లా పునరుత్పాదక ఇంధన సామర్థ్యాలను క్రమంగా పెంచుకోవాలని, 2035 ఏడాదికల్లా గ్రీన్హౌజ్ వాయువుల ఉద్గారాల స్థాయిని తగ్గించుకోవాలని పశ్చిమ దేశాలు చేసిన ప్రతిపాదనలను భారత్, రష్యా, చైనా, సౌదీ అరేబియాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. శిలాజ ఇంధన ఆధారిత ఆర్థికవ్యవస్థ కలిగిన సౌదీ అరేబియా అయితే ఈ ప్రతిపాదలను ఒప్పుకునేది లేదని తెగేసి చెప్పింది. జ్ఞానాధారిత రంగాలు, ఇతర సెక్టార్ల వైపు మళ్లేందుకు తమకు దశాబ్దాల కాలం పడుతుందని వాదిస్తోంది. వెలువడుతున్న కర్భన ఉద్గారాలు, ప్రకృతిలోకి శోషించబడుతున్న కర్భన ఉద్గారాల నిష్పత్తి సమంగా ఉండేలా అంటే కార్బన్ నెట్ జీరో(కర్భన స్థిరత్వం) సాధించేందుకు జీ7 దేశాలు తొందర పెడుతున్నాయి. శిలాజ ఇంధనాల ఆధారిత విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, వాటి ద్వారా వచ్చే విద్యుత్ సాయంతోనే ఆర్థిక వ్యవస్థలో సుస్థిరాభివృద్ధి సాధిస్తామని ధీమాగా ఉన్న అభివృద్ధి చెందుతున్న దేశాలు.. ఈ జీ7 దేశాల ప్రతిపా దనలను తప్పుబడుతున్నాయి. ‘దశాబ్దాలుగా శిలా జ ఇంధనాలను విపరీతంగా వాడేసి పారిశ్రా మిక విప్లవంతో పశ్చిమ దేశాలు సంపన్న దేశాలుగా అవ తరించాయి. ఇప్పుడు మాకు ఆ అవకాశం ఇవ్వండి. వాతావరణ మార్పుల మాటున అభివృద్ధిని అడ్డుకో కండి’ అని భారత్సహా దేశాలు వాదిస్తు న్నాయి. 2020కల్లా వాతావరణ మార్పులను సమర్థంగా ఎదుర్కొనేందుకు పేద దేశాలకు ఏటా 100 బిలి యన్ డాలర్ల నిధులను ఇస్తామన్న సంపన్న దేశాలు ఆ వాగ్దానాన్ని నెరవేర్చనేలేదు. ఎప్ప టికల్లా సాయం చేస్తాయనేదీ స్పష్టంచేయలేదు. ఇలాంటి పరిస్థితుల్లో క్లైమేట్ పాలసీపై ఉమ్మడి నిర్ణయం ఆశించడం కష్టమే. ఇలాంటి తరుణంలో మొదలవు తున్న జీ20 సదస్సు క్లిష్టమైన కూడలిలో నిల్చుంద నే చెప్పాలి. దేశ ప్రయోజనా లను పక్కనబెట్టి మానవాళి శ్రేయస్సు కోసం అగ్రనేతలు ఏ మేరకు ఉమ్మడి వాగ్దానాలు చేస్తారనేది బిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది. జీ20లో ఏకాభిప్రాయం కుదరక పోతే త్వరలో యునైటెడ్ అరబ్ ఎమిరే ట్స్లో జరగ బోయే కాప్28 సదస్సులోనూ మేలైన ఫలితాలను ఆశించడం అత్యాశే అవుతుంది. –సాక్షి నేషనల్డెస్క్ -
రక్షణ మంత్రిని తొలగించిన ఉక్రెయిన్ అధ్యక్షుడు
క్యివ్: రష్యాతో జరుగుతున్న యుద్ధం నేపధ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ కీలక నిర్ణయం తీసుకున్నారు. క్యివ్ రక్షణ శాఖ మంత్రి బాధ్యతల నుండి ఒలెక్సి రెజ్నికోవ్ను తప్పిస్తున్నట్లు ఆదివారం ప్రకటించారు. ఆయన స్థానంలో రుస్తెం ఉమెరోవ్ను నూతన రక్షణశాఖ మంత్రిగా నియమిస్తున్నట్లు ప్రకటించి ఇది రక్షణశాఖలో సరికొత్త విధానాన్ని అమలుచేయాల్సిన అవసరం ఉందని అన్నారు. అధ్యక్షుడి నిర్ణయం ప్రకటించిన తర్వాత రెజ్నికోవ్ తన రాజీనామాను పార్లమెంటుకు సమర్పించారు. యధాప్రకారం సాయంత్రం జరిగే మీడియా సమావేశంలో వ్లాదిమిర్ జెలెన్స్కీ మాట్లాడుతూ.. ఒలెక్సి రెజ్నికోవ్ రష్యాతో యుద్ధం మొదలైన నాటి నుండి దాదాపు 550 రోజులు యుద్ధంలో కీలక పాత్ర పోషిస్తున్నారని కానీ ప్రస్తుతం రక్షణశాఖలో సరికొత్త విధానాన్ని అనుసరించాల్సిన అవసరముందని అందుకే క్రిమియా రాష్ట్ర సంపద నిధుల సంరక్షకుడిగా వ్యవహరిస్తున్న ఉమెరోవ్కు రక్షణశాఖ బాధ్యతలు అప్పచెబుతున్నామని అన్నారు. పార్లమెంట్ ఉమేరోవ్ అభ్యర్ధిత్వాన్ని ఆమోదిస్తుందని భావిస్తున్నామన్నారు. Zelenskyi's evening speech in which he talks about the replacement of Minister of Defense Oleksii Reznikov. He is replaced by Rustem Umerov. -- "Oleksii Reznikov went through these more than 550 days of full-scale war. I believe that the Ministry needs new approaches and other… pic.twitter.com/o7NCvszWoi — NOELREPORTS 🇪🇺 🇺🇦 (@NOELreports) September 3, 2023 ఉక్రెయిన్ అధ్యక్షుడు తీసుకున్న ఈ నిర్ణయం ఉక్రెయిన్ రక్షణశాఖలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఫిబ్రవరి 2022లో రష్యాతో యుద్ధం మొదలైన నాటి నుండి ఒలేక్సి రెజ్నికోవ్ పాశ్చాత్య దేశాల నుండి బిలియన్ డాలర్ల సహాయాన్ని పొందడంలో కీలక పాత్ర పోషించారు. కానీ రక్షణశాఖలో అంతర్గత ఆరోపణలు పెచ్చుమీరడంతో ఉక్రెయిన్ అధ్యక్షుడు ఈ నిర్ణయం తీసుకున్నారన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అధ్యక్షుడి నిర్ణయాన్ని పార్లమెంట్ ఆమోదిస్తుందనే వార్తలు వెలువడుతున్నాయి. కానీ రెజ్నికోవ్ను ఉన్నట్టుండి బాధ్యతల నుండి తప్పించడాన్నే మీడియా హైలైట్ చేస్తూ రెజ్నికోవ్కు వేరే బాధ్యతలు ఏమైనా అప్పగిస్తున్నారా అన్నది అధ్యక్షుడే తెలపాల్సి ఉంటుంది. రక్షణశాఖలో భారీగా జరుగుతున్న అవినీతి నేపధ్యంలోనే ఉక్రెయిన్ అధ్యక్షుడి ఈ నిర్ణయం తీసుకున్నారని ఆరోపణలు చేసే వారు కూడా లేకపోలేదు. అంతర్జాతీయ అవినీతి దేశాల జాబితాలో ఉక్రెయిన్ 180 దేశాల్లో 116 వ స్థానంలో ఉంది. అవినీతి విషయంలో ఒకప్పటితో పోలిస్తే ఉక్రెయిన్ ఇప్పుడు చాల మెరుగయ్యిందనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. I have submitted my letter of resignation to Ruslan Stefanchuk @r_stefanchuk, Chairman of the Parliament of Ukraine @verkhovna_rada It was an honor to serve the Ukrainian people and work for the #UAarmy for the last 22 months, the toughest period of Ukraine’s modern history. 🇺🇦 pic.twitter.com/x4rXXcrr7i — Oleksii Reznikov (@oleksiireznikov) September 4, 2023 ఇది కూడా చదవండి: జీ20 సదస్సుకు జిన్పింగ్ స్థానంలో చైనా ప్రీమియర్ -
రష్యా డ్రోన్లను కూల్చేసిన ఉక్రెయిన్
క్యివ్: దక్షిణ ఉక్రెయిన్ ప్రాంతమైన ఒడెస్సాపై రష్యా శనివారం మొత్తం 25 డ్రోన్లతో దాడి చేసింది. ఉక్రెయిన్ గగనతల రక్షణ వ్యవస్థ వాటిలో 22 డ్రోన్లను సమర్ధవంతంగా కూల్చేసినట్లు తెలిపింది ఉక్రేయి రక్షణ శాఖ. ఈ దాడుల్లో ఒడెస్సాలో దానుబే నది వద్దనున్న రెనీ పోర్టులో కొద్దిపాటి విధ్వంసం చోటు చేసుకుంది. యుద్ధ ప్రారంభ రోజులతో పోలిస్తే ఉక్రెయిన్ రష్యా దాడులను సమర్థవంతంగానే తిప్పి కొడుతోంది. ఒక పక్క రష్యా దాడులను అడ్డుకుంటూనే మరోపక్క వారిపై ఎదురుదాడి చేస్తోంది. ఇప్పటికే రష్యా చెరలో నుండి అనేక ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకున్న ఉక్రెయిన్ తాజాగా పోర్టు ప్రాంతంలో రష్యా ప్రయోగించిన ఇరాన్ షాహెద్ డ్రోన్లను చిత్తు చేసింది. మొత్తం 25 డ్రోన్లలో 22 డ్రోన్లను నేలకూల్చినట్లు తెలిపింది ఉక్రెయిన్ రక్షణ శాఖ. ఈ దాడుల్లో ఇద్దరు గాయపడగా అక్కడక్కడా ఇఇన్ఫ్రాస్ట్రక్చర్ దెబ్బ తిన్నట్లు వెల్లడించింది ఉక్రెయిన్ సైన్యం. పోర్టు ప్రాంతమైన ఒడెస్సా పోర్టు నుంచి ఉక్రెయిన్ ధాన్యం ఎగుమతి చేసేది. నౌకాశ్రయంలో జరిగిన నష్టం ఎంతనేది ఇప్పుడే చెప్పలేమంది సైన్యం. ఈ పోర్టు ధ్వంసం చేసి ధాన్యం రవాణాను దెబ్బతీయాలన్నది రష్యా ఉద్దేశ్యమై ఉంటుందని తెలిపింది. ఇది కూడా చదవండి: సైనికులు ప్రాణాలు పోతుంటే..పుతిన్ పట్టనట్లు చేస్తున్న పని చూస్తే..షాకవ్వతారు -
సైనికులు ప్రాణాలు పోతుంటే..పుతిన్ పట్టనట్లు చేస్తున్న పని చూస్తే..షాకవ్వతారు
ఇది రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రత్యేకంగా ఉపయోగించే నౌక. దీని పేరు ‘కొసాత్కా’– అంటే ‘కిల్లర్ వేల్’ జాతి తిమింగలం అని అర్థం. పుతిన్ దాదాపుగా మూడేళ్ల కిందటే ఈ భారీ నౌకను సొంతం చేసుకున్నా, ఇటీవలే దీనికి కళ్లుచెదిరే ఖర్చుతో అదనపు హంగులు సమకూర్చడంతో తాజాగా వార్తల్లోకెక్కింది. ఈ నౌకలోని అదనపు హంగుల కోసం 100 మిలియన్ పౌండ్లు (రూ.1.05 లక్షల కోట్లు) ఖర్చు చేయడం విశేషం. ఒకవైపు యుక్రెయిన్తో జరుగుతున్న యుద్ధంలో దాదాపు మూడు లక్షల మందికి పైగా రష్యన్ సైనికులు ప్రాణాలు పోగొట్టుకున్నా, ఏమీ పట్టకుండా పుతిన్ తన నౌకను రాజసంగా తీర్చిదిద్దుకోవడానికి భారీ మొత్తాన్ని ఖర్చు చేయడం ప్రపంచాన్ని నివ్వెరపరుస్తోంది. ఈ నౌక అసలు పేరు ‘ది గ్రేస్ఫుల్’. జర్మనీ రేవు నుంచి పుతిన్ దీనిని 750 మిలియన్ పౌండ్లకు (రూ.7.92 లక్షల కోట్లు) సొంతం చేసుకున్నాక, దీని పేరును ‘కొసాత్కా’గా మార్చుకున్నాడు. యుక్రెయిన్పై సైనిక దాడిని ప్రకటించడానికి కొద్దిరోజుల ముందే ఈ నౌకను రష్యాకు పంపాల్సిందిగా, నౌకా సంస్థను ఆదేశించాడు. ఈ నౌక రష్యా తీరానికి చేరుకున్న 23 రోజుల్లోనే యుద్ధం మొదలైంది. ఒకవైపు యుద్ధం కొనసాగుతుంటే, పుతిన్ మాత్రం ఈ నౌకను తాను కోరుకున్న రీతిలో తీర్చిదిద్దుకునే పనిలోనే నిమగ్నమయ్యాడు. ఇందులో ఖరీదైన క్రిస్టల్ షాండ్లియర్లు, కార్పెట్లు, సోఫాలు, కాఫీ టేబుళ్లు ఏర్పాటు చేయడమే కాకుండా డ్రాయింగ్ రూమ్లలో బంగారు తాపడం చేయించాడు. ఖరీదైన కళాఖండాలను ఏర్పాటు చేయించుకున్నాడు. ఇన్ని హంగులు చేయించుకున్న ఈ నౌక పొడవు దాదాపు అరకిలోమీటరు ఉంటుంది. ఇందులో స్విమింగ్ పూల్స్, పైకప్పు మీద హెలిపాడ్, బంగారు ఫ్రేముల అద్దాలు, బంగారు తాపడం చేయించిన సింక్ పైపులు వంటి ఏర్పాట్లు చాలానే ఉన్నాయి. రష్యన్ అధికార వ్యతిరేక సంస్థ అయిన ‘అలెక్సీ నవాల్నీ’ ఈ నౌక లోపలి హంగుల ఫొటోలను, వాటి ఏర్పాట్లకు అయిన ఖర్చుల వివరాలను ఇటీవల వెలుగులోకి తెచ్చింది. (చదవండి: ఈ పడవ నడవాలంటే ఎండ ఉంటే చాలు! పొద్దుగూకినా ప్రాబ్లం లేదు!) -
వినాశకర సాటన్-ll మిసైల్ను బయటకు తీసిన రష్యా.. ఏమీ మిగలదు!
మాస్కో: రష్యా అత్యంత వినాశకరమైన అణుక్షిపణి (సర్మాత్)సాటన్-ll ను బయటకు తీసి కీలక ప్రాంతాల్లో మోహరించింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈ క్షిపణి విజయవంతమైనప్పుడు దీని గురించి చెబుతూ.. ఇకపై మాతో కయ్యానికి కాలు దువ్వే వారు ఒకటికి రెండు సార్లు ఆలోచించడం మంచిదని ప్రత్యర్థులను హెచ్చరించారు. తాజాగా ఉక్రెయిన్తో యుద్ధం నేపథ్యంలో రష్యా ఈ క్షిపణిని బయటకు తీయడం చర్చనీయాంశమైంది. శుక్రవారం సాటన్-llగా పిలవబడే ఈ సర్మాత్ ఇంటర్కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్స్ను రష్యా సైన్యం బయటకు తీసినట్లు రష్యా అంతరిక్ష పరిశోధనా సంస్థ రోస్కాస్మోస్ ప్రకటించింది. ఈ మేరకు రోస్కాస్మోస్ జనరల్ డైరెక్టర్ యూరి బోరిసోవ్ సాటన్-ll విధినిర్వహణకు సిద్ధమైందని ప్రకటించారు. అసలేంటి సాటన్-ll ప్రత్యేకత.. సాటన్-ll మిసైల్ పొడవు 116 మీటర్ల. 220 టన్నులు బరువుండే ఈ మిసైల్ 10-15 వార్హెడ్లను అమర్చే వీలుంటుంది. అందుకే ఒకటి కంటే ఎక్కువ లక్ష్యాలను సులువుగా ఛేదిస్తుంది. శత్రువుల రాడార్లు, ఎలక్ట్రానిక్ నిఘా వ్యవస్థలు ఈ మిసైల్ను గుర్తించే లోపే ఇది లక్ష్యాన్ని చేరుకుని విధ్వంసాన్ని సృష్టిస్తుంది. సాటన్-ll గంటకు 10 వేల నుంచి 18 వేల కి.మీ. వేగంతో దూసుకుపోతుంది. ఐరోపాలోని ఏ ప్రాంతానికైనా ఇది కేవలం 3 నిమిషాల్లోపే చేరుకోగలదు. ఇక అగ్రరాజ్యం అమెరికా చేరుకోవడానికి ఈ క్షిపణికి కేవలం 14 నిముషాలు మాత్రమే పడుతుంది. ఉక్రెయిన్తో యుద్ధం మొదలై ఏడాదిన్నర పైబడిండి. ఇప్పటికీ యుద్ధం ఒక కొలిక్కి రాకపోగా ఉక్రెయిన్ రష్యా దాడులను సమర్ధవంతనగానే తిప్పికొట్టింది. ఇక ఇప్పుడైతే అమెరికా అండదండలతో ఉక్రెయిన్ డ్రోన్ దాడులు చేస్తూ రష్యా సేనలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. యుద్ధప్రారంభంరోజుల్లో రష్యా స్వాధీనం చేసుకున్న ఒక్కో ప్రాంతాన్ని తిరిగి తన వశం చేసుకుంటోంది. ఇప్పటికే డిఫెన్స్లో పడిన రష్యా సేనలు ఈ నేపథ్యంలోనే ఈ భయానక మిసైళ్లను బయటకు తీసిందని చెప్పేవారు లేకపోలేదు. మరోపక్క రష్యా ఈ క్షిపణిని నాటో సంస్థ మూలస్థంభాలైన అమెరికా, యూకెలపై మాత్రమే ప్రయోగించడానికి సిద్ధం చేసిందనే వారూ ఉన్నారు. ఏదైతేనేం ప్రస్తుతానికైతే రష్యా తన అమ్ములపొదిలోని అత్యంత భయంకరమైన మిసైళ్లను బయటకు తీసి కీలక ప్రాంతాల్లో మోహరించింది. ఇటీవల రష్యా అధ్యక్షుడు పుతిన్ జాతీయ టీవీ ఛానల్లో ప్రసంగిస్తూ.. మాతృదేశాన్ని కాపాడుకోవడానికి మాకున్న అన్ని అవకాశాలను వినియోగించుకుంటామని అన్నారు. అందులో భాగంగానే ఈ చర్యకు ఉపక్రమించారని మాత్రం అర్ధమవుతోంది. BREAKING: Putin has put the ‘Satan-2’ nuclear weapon on combat duty for the first time Putin unveiled the RS-28 Sarmat rocket system along with five other weapons in this video at a conference in March 2018 Putin claimed the Sarmat can fly a trajectory over the South Pole and… pic.twitter.com/otKqUi6uIw — Liam McCollum (@MLiamMcCollum) September 1, 2023 ఇది కూడా చదవండి: ‘నాలుగు కాళ్ల’ వింత కుటుంబం.. పశువుల తరహాలో నడక! -
విదేశీ పర్యటనకు పుతిన్.. అరెస్ట్ వారెంట్ తర్వాత తొలిసారి..
మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఎట్టకేలకు దేశం దాటి కాలు బయటపెట్టనున్నారు. అక్టోబర్లో పుతిన్ చైనాలో పర్యటించనున్నట్లు సమాచారం. కాగా ఉక్రెయిన్తో జరుగుతున్న యుద్ధ నేరాలకుగానూ పుతిన్పై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ఐసీసీ) అరెస్ట్ వారెంట్ జారీ చేసిన తర్వాత ఆయన చేయనున్న తొలి విదేశీ పర్యటన ఇదే కావడం గమనార్హం. వచ్చే అక్టోబరులో జరిగే బెల్ట్ అండ్ రోడ్ సదస్సుకు హాజరుకావాలని చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ పుతిన్ను ఆహ్వానించగా.. ఇందుకు రష్యా అధ్యక్షుడు అంగీకరించినట్లు బ్లూమ్బర్గ్ తన నివేదికలో పేర్కొంది. ఇప్పటికే పుతిన్ చైనా పర్యటన కోసం క్రెమ్లిన్ షెడ్యూల్ను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఐసీసీ అరెస్ట్ వారెంట్ భయంతో ఆయన అన్ని విదేశీ పర్యటనలనూ వాయిదా వేసుకుంటూ వస్తున్నారు. చదవండి: ఆకాశంలో అద్భుతం.. నేటి సాయంత్రం సూపర్ బ్లూ మూన్ దర్శనం అరెస్ట్ వారెంట్ కాగా గతేడాది ఫిబ్రవరిలో ఉక్రెయిన్పై రష్యా యుద్ధంప్రకటించిన విషయం తెలిసిందే. రెండు దేశాల మధ్య ఏడాదిన్నరగా సైనిక చర్య కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో ఉక్రెయిన్లోని చిన్నారులను రష్యా కిడ్నాప్ చేసిందన్న ఆరోపణలపై మార్చిలో అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు పుతిన్పై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. దీని ప్రకారం పుతిన్ ఐసీసీలో సభ్యత్వం ఉన్న దేశాల్లో అడుగు పెడితే ఆయన్ను అరెస్టు చేయాల్సి ఉంటుంది. అప్పటి నుంచి ఆయన రష్యా అంతర్జాతీయ సరిహద్దులు దాటలేదు. ఇక అంతర్జాతీయ క్రిమినల్ కోర్టులో సుమారు 120 సభ్య దేశాలు ఉన్నాయి. అయితే వారెంట్ను అమలు చేసే పరిస్థితి మాత్రం అంతర్జాతీయ దేశాల సహకారంపై ఆధారపడి ఉంటుంది. ఇక పుతిన్ యుద్ధం ప్రారంభించినప్పటి నుంచి పొరుగున్న ఉన్న సోవియట్ యూనియన్ దేశాలు, ఇరాన్లో మాత్రమే పర్యటించారు. ఇటీవల దక్షిణాఫ్రికాలో జరిగిన బ్రిక్స్ సమావేశానికి కూడా గైర్హాజరయ్యారు. వర్చువల్గా పాల్గొని ప్రసంగించారు. ఎందుకంటే రష్యా అధ్యక్షుడు అరెస్ట్ వారెంట్పై సౌత్ ఆఫ్రికా కూడా ఐసీసీకి సంతకం చేసింది. అంతేగాక సెప్టెంబర్లో ఢిల్లీ వేదికగా జరగబోయే జీ20 శిఖరాగ్ర సదస్సులోనూ పుతిన్ పాల్గొనడం లేదు. ఈ మేరకు సోమవారం పుతిన్ మోదీకి ఫోన్ చేసి సమావేశానికి రాకపోవడంపై వివరించారు. ఆయనకు బదులు రష్యా తరపున విదేశాంగమంత్రి సెర్గీ లావ్రోవ్ హాజరవుతారని పేర్కొన్నారు. ఇక చివరిసారి 2022లో చైనాలో పర్యటించారు. మరోవైపు జీ జిన్పింగ్ ఈ ఏడాది మార్చిలో మాస్కోను సందర్శించారు. మూడోసారి చైనా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అదే ఆయన తొలి విదేశీ పర్యటన. చదవండి: ‘బైడెన్ పిచ్చితో మూడో ప్రపంచ యుద్ధమే!’ -
వీడియో చెప్పిన కథ : రష్యాను భయపెడుతోన్న ఉక్రెయిన్ డ్రోన్లు
క్యివ్: రష్యాతో యుద్ధంలో ఉక్రెయిన్ పుంజుకున్నట్లే కనిపిస్తోంది. చిన్న పాపను అడ్డం పెట్టుకుని ఇద్దరు రష్యా సైనికులు పారిపోతున్న దృశ్యాలే అందుకు సాక్ష్యం. ఉక్రెయిన్ డ్రోన్ కెమెరాలో ఈ సంఘటనకు సంబంధించిన దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. అమెరికా అండతో ఇటీవల డ్రోన్ దాడులను ముమ్మరం చేసిన ఉక్రెయిన్ రష్యా సేనలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. దీంతో ఉక్రెయిన్ భూభాగంపై ఉన్న రష్యా సైనికులు ఎప్పుడు ఎటునుంచి ఏ డ్రోన్ దాడి చేస్తుందో అర్ధంకాక భయంతో బిక్కుబిక్కుమంటూ మాస్కోకు తిరుగుముఖం పడుతున్నారు. తాజాగా ఉక్రెయిన్ డ్రోన్ కెమెరాలో రికార్డయిన కొన్ని దృశ్యాల్లో రష్యా సైనికుల ప్రాణభీతి తేటతెల్లమైంది. ఇద్దరు రష్యా సైనికులు ఉక్రెయిన్లోని టోక్మాక్ నగరం నుండి మరో చోటకి వెళ్తుండగా వారి వాహనం దారిమధ్యలో పాడైంది. దీంతో వారిద్దరూ ఏం జరిగిందో చూసేందుకు వాహనం నుండి కిందకు దిగారు. కానీ ఉక్రెయిన్ బలగాలు ఎక్కడ డ్రోన్లతో దాడి చేస్తారోనని భయంతో చిన్న పాపను అడ్డుపెట్టుకున్నారు. వీడియోలో వాహనానికి ఒక పక్కన ఆయుధాన్ని మరో పక్కన నిల్చుని ఉన్న ఒక చిన్న పాపను స్పష్టంగా చూడవచ్చు. వాహనం మరమ్మతు చేస్తున్నంత సేపు పాపను తమ పక్కనే పెట్టుకున్నారు రష్యా సైనికులు. పాప అక్కడున్నంత వరకు డ్రోన్లు తమపై దాడి చేయవన్నది వారి నమ్మకం. అంతలో అటుగా మరొక వాహనం రావడంతో వారిని సాయమడిగిన రష్యా సైనికులు పాపను అక్కడే విడిచిపెట్టి వెళ్లిపోయారు. పాపం వారి ప్రాణాలు కాపాడిన చిన్నారి మాత్రం అక్కడే నిల్చుండిపోయింది. Ukrainian drone footage captures Russian soldiers fleeing near Tokmak. They are in such a hurry that they leave behind a small child and a rifle. pic.twitter.com/yUgML9jJ8J — Visegrád 24 (@visegrad24) August 27, 2023 రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలై రెండేళ్లు కావస్తోంది. ఇరుపక్షాలు శాంతించే దాఖలాలు కనుచూపుమేరలో కనిపించడం లేదు. . యుద్ధం కారణంగా ఇప్పటికే లక్షల సంఖ్యలో సామాన్యులు, సైనికులు మృతిచెందారు. యుద్ధం ఇంకా ఎంతకాలం కొనసాగుతుందో కూడా తెలియని పరిస్థితి. యుద్ధాల గురించి చరిత్ర చెప్పేది ఒక్కటే. యుద్ధం ముగిసిన తర్వాతే అసలు యుద్ధం మొదలవుతుందని.. భావితరాల బ్రతుకులు ఆకలికేకలతో మొదలై వారి చావుకేకలతో కథ ముందుకు సాగుతుంటుందని. ఈ యుద్ధం ఎప్పుడు ఎలా ముగుస్తుందో మరి. ఇది కూడా చదవండి: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు ఉపశమనం -
ప్రిగోజిన్ మరణంపై అనేక అనుమానాలు!
వాషింగ్టన్: రష్యాలోని కిరాయి సైన్యం వాగ్నర్ గ్రూపు అధినేత ప్రిగోజిన్ మరణంపై అమెరికా సంచలన ఆరోపణలు చేసింది. బుధవారం జరిగిన విమాన ప్రమాదంలో ప్రిగోజిన్ సహా పదిమంది దుర్మరణం పాలయ్యారు. అయితే, ఈ విమానం ప్రమాదవశాత్తూ కూలిపోలేదని, ఉద్దేశపూర్వకంగా కూల్చేశారని అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు పేర్కొన్నాయి. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు, విమానం కూలిన తీరుతో పాటు ఇతరత్రా అంశాలను విశ్లేషించి ప్రాథమిక అంచనాకు వచ్చినట్లు తెలిపాయి. ఈ మేరకు పెంటగాన్ అధికార ప్రతినిధి జనరల్ పాట్ రైడర్ ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు. వాగ్నర్ చీఫ్ ప్రిగోజిన్ ప్రయాణిస్తున్న విమానాన్ని క్షిపణితో కూల్చేశారని చెప్పారు. అయితే, దీనిపై మరిన్ని వివరాలను వెల్లడించేందుకు ఆయన ఇష్టపడలేదు. ఈ ఘటనపై అమెరికా విదేశాంగ శాఖ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ.. పుతిన్ తన శత్రువులను తుదముట్టించే క్రమంలోనే ఈ ఘటన జరిగిందని చెప్పారు. విమానం ప్రమాదవశాత్తూ కూలిపోలేదని, కూల్చేశారని వివరించారు. అయితే, పేలుడుకు కారణమేమిటనే విషయం కానీ, తన పేరును కానీ వెల్లడించేందుకు ఆయన ఇష్టపడలేదు. మరోవైపు, తన సెక్యూరిటీతో పాటు తన అనుచరుల భద్రత విషయంలో తమ చీఫ్ ప్రిగోజిన్ చాలా జాగ్రత్తలు తీసుకుంటారని వాగ్నర్ గ్రూపుకు చెందిన సైనికులు చెబుతున్నారు. అలాంటిది కీలక అనుచరులను వెంటబెట్టుకుని ఒకే విమానంలో ఎందుకు ప్రయాణించారో తెలియడం లేదంటున్నారు. వాగ్నర్ గ్రూపులోని కీలక వ్యక్తులంతా సెయింట్ పీటర్స్బర్గ్కు ఎందుకు వెళుతున్నారో కూడా తెలియదని చెప్పారు. ఇదిలా ఉండగా ఇటీవల ఒక అంతర్జాతీయ మీడియా ప్రిగోజిన్ ఆఫ్రికా దేశంలో ఉన్నారని అక్కడ తమ సైన్యంలో ఎవరైనా చేరాలనుకుంటే చేరవచ్చని ఆయన తెలుపుతున్నట్లు ఒక కథనాన్ని ప్రచురించింది. దాని ప్రకారం చూస్తే తిరుగుబాటు నాయకుడిని ఆఫ్రికాలోనే హత్య చేసి దాన్ని విమాన ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ప్రిగోజిన్ చనిపోయాడన్న వార్తపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పందిస్తూ.. వాస్తవాలు ఏమిటో తెలియదు కానీ ఇందులో ఆశ్చర్యమేమీ లేదని అన్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మాక్రాన్ అయితే.. ప్రిగోజిన్ విమాన ప్రమాదంపై హేతుబద్దమైన అనుమానాలున్నాయని అన్నారు. మొత్తంగా రష్యా అధ్యక్షుడు పుతిన్కు ఎదురు తిరిగితే ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయనడానికి ప్రిగోజిన్ ఉదంతాన్ని ఉదహరిస్తూ ప్రపంచ నేతలు స్పందించడం కొసమెరుపు. ఇది కూడా చదవండి: భారత్ చైనా సంబంధాలు బలపడాలి: జిన్పింగ్ -
రష్యాపై ఉక్రెయిన్ డ్రోన్ దాడులు.. ఎయిర్పోర్టులు మూసివేత
మాస్కో: మాస్కో శివార్లలో ఉక్రెయిన్ డ్రోన్లతో దాడి చేయగా వాటిని కూల్చేశామని తెలిపింది పుతిన్ సైన్యం. దీంతో అప్రమత్తమై నాలుగు ప్రధాన ఎయిర్పోర్టుల్లో రాకపోకలను నిలిపివేసినట్లు తెలిపింది రష్యా రక్షణ శాఖ. రష్యాపై ఉక్రెయిన్ డ్రోన్ల దాడులతో విరుచుకుపడింది. మాస్కో సరిహద్దుల్లోని బ్రియాన్స్క్ ప్రాంతంలో క్రాస్నోగోర్స్క్ పట్టణంలో నాలుగు డ్రోన్లు ప్రవేశించడంతో వాటిని రష్యా సైన్యం కూల్చివేసింది. గగనతలాన్ని లక్ష్యంగా చేసుకుని ఉక్రెయిన్ ఈ దాడులకు పాల్పడటంతో అప్రమత్తమై ముందు జాగ్రత్తగా వ్నుకోవో, షెరెమెట్యెవో, డొమోడెడెవో, జుకోవ్స్కీ ఎయిర్పోర్టుల్లో రాకపోకలను నిలిపివేశారు రష్యా అధికారులు. రష్యా ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ ఇటీవలి కాలంలో ఉక్రెయిన్ డ్రోన్ల దాడులను ముమ్మరం చేసిందని గత ఆదివారం కూడా జరిగిన దాడుల్లో డ్రోన్లు రైల్వే స్టేషన్ పైకప్పు భాగంలోకి దూసుకుపోగా ఐదుగురు ప్రాణాలు కోలోయారని గుర్తు చేశారు. ఆ సమయంలో రైల్వే స్టేషన్లో సుమారు 50 మంది ఉండగా మరణించిన ఐదుగురిలో ఇద్దరు ఆసుపత్రికి తరలించడానికి నిరాకరించారని మిగిలిన ముగ్గురు ఆసుపత్రిలో మరణించారని తెలిపారు. అంతకుముందు ఇదే కుర్స్క్ ప్రాంతానికి చెందిన వొల్ఫినోలో కూడా ఉక్రెయిన్ క్షిపణులతో విరుచుకుపడింది. ఇటీవలి కాలంలో మరింత బలాన్ని వెనకేసుకున్న ఉక్రెయిన్ యుద్ధం తొలినాళ్లలో కోల్పోయిన ఒక్కో ప్రాంతాన్ని మెల్లగా తిరిగి చేజిక్కించుకుంటోంది. ఇది కూడా చదవండి: కార్చిచ్చును వంటింట్లో మంటలతో పోల్చిన జో బైడెన్ -
ఉక్రెయిన్కు అత్యాధునిక ఎఫ్–16లు
కీవ్/ఇనెడోవిన్: రష్యాను దీటుగా ఎదుర్కోలేక డీలాపడిన ఉక్రెయిన్లో ఉత్సాహాన్ని నింపే పరిణామం. ఆ దేశానికి అత్యాధునిక ఎఫ్–16 యుద్ధ విమానాలను అందజేయాలనే నిర్ణయానికి అమెరికా పచ్చజెండా ఊపింది. దీంతో నెదర్లాండ్స్, డెన్మార్క్లు అమెరికా తయారీ ఎఫ్–16లను ఉక్రెయిన్కు అందజేసేందుకు ముందుకు వచ్చాయి. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తాజాగా డెన్మార్క్, నెదర్లాండ్స్ల్లో పర్యటించారు. ఆదివారం ఆయన నెదర్లాండ్స్లోని ఎయిండ్ హోవెన్ ఎయిర్బేస్ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆ దేశ ప్రధాని మార్క్ రుట్తో సమావేశమయ్యారు. అక్కడున్న రెండు ఎఫ్–16 విమానాలను పరిశీలించారు. అనంతరం మార్క్రుట్ మీడియాతో మాట్లాడుతూ.. తమ షరతులకు ఉక్రెయిన్ అంగీకరించిన తర్వాతే ఎఫ్–16ల సరఫరా మొదలవుతుందని స్పష్టం చేశారు. ఆ షరతులు ఏమిటన్నది వెల్లడించలేదు. తమ వద్ద ప్రస్తుతం 42 ఎఫ్–16 విమానాలున్నాయని, వీటిలో కొన్నిటిని ఉక్రెయిన్కు ఉచితంగా అందజేస్తామని చెప్పారు. ఉక్రెయిన్కు తాము 19 ఎఫ్–16లను అందజేస్తామని డెన్మార్క్ ప్రధాని మెట్టె ఫ్రెడరిక్సన్ ప్రకటించారు. ఎఫ్–16 యుద్ధ విమానాల పైలెట్లకు 6 నుంచి 8 నెలల శిక్షణ అవసరముంటుందని అధికారులు చెబుతున్నారు. నెదర్లాండ్స్, డెన్మార్క్ల నిర్ణయం చారిత్రకమని జెలెన్స్కీ కొనియాడారు. రష్యా దాడుల్లో ఏడుగురు మృతి ఉక్రెయిన్లోని చెరి్నహివ్ నగరంపై శనివారం రష్యా జరిపిన భీకర క్షిపణి దాడుల్లో సోఫియా అనే ఆరేళ్ల చిన్నారి సహా ఏడుగురు చనిపోగా మరో 150 మంది క్షతగాత్రులయ్యారు. రష్యాలోని కుర్స్క్ ప్రాంత రాజధాని కుర్స్క్ రైల్వే స్టేషన్పై ఉక్రెయిన్ డ్రోన్ దాడి జరిపింది. రైల్వే స్టేషన్ పైకప్పునకు మంటలు అంటుకుని అయిదుగురు గాయపడ్డారు. కాగా, ఉక్రెయిన్ డ్రోన్ దాడితో మాస్కోలోని రెండు ఎయిర్పోర్టుల్ని కొద్ది గంటలపాటు మూసివేశారు. -
రష్యాలో సోషల్ మీడియా సంస్థ రెడిట్కు భారీ షాక్!
ఉక్రెయిన్లో రష్యా సైనిక ప్రచారానికి సంబంధించిన "నకిలీ" సమాచారం ఉందనీ, సంబంధిత "నిషేధించిన కంటెంట్"ను తొలగించ నందుకు రష్యా భారీ జరిమానా విధించింది. రెడిట్కు బారీ పెనాల్టీ విధించిందని మాస్కో కోర్టును ఉటంకిస్తూ ఆర్టీఏ మంగళవారం నివేదించింది. కోర్టు రెడ్డిట్కి 2 మిలియన్ రూబిళ్లు (20,365 డాలర్లు ) జరిమానా విధించింది. అయితే దీనిపై రెడిట్ ఇంకా స్పందించలేదు. వికీమీడియా, స్ట్రీమింగ్ సర్వీస్ ట్విచ్ గూగుల్తో సహా మాస్కో చట్టవిరుద్ధమైన కంటెంట్ను తీసివేయడంలో విఫలమైనందుకు రష్యాలో పరిశీలనలో ఉన్న సైట్ల జాబితాలో రెడిట్ చేరింది. గత సంవత్సరం ఉక్రెయిన్పై దాడి చేసినప్పటి నుండి, రష్యా మీడియా , బ్లాగర్ల ద్వారా సంఘర్షణ కవరేజీపై నియంత్రణలను కఠినతరం చేసింది, దాని సాయుధ దళాల చర్యలను అవహేళన చేసినా, లేదా వాటి గురించి తప్పుడు సమాచారాన్ని ప్రచురించినా కఠినమైన శిక్షలను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. -
క్రిమియాలో 20 డ్రోన్లు కూల్చివేశాం: రష్యా
కీవ్: ఆక్రమిత క్రిమియాపై డ్రోన్ల దాడిని తిప్పికొట్టినట్లు రష్యా తెలిపింది. ఉక్రెయిన్ ప్రయోగించిన సుమారు 20 డ్రోన్లను కూల్చివేసినట్లు శనివారం రష్యా రక్షణ శాఖ పేర్కొంది. ఇందులో 14 డ్రోన్లను గగనతల రక్షణ వ్యవస్థలు కూల్చివేయగా మరో ఆరింటిని జామర్లు నిర్వీర్యం చేశాయని వెల్లడించింది. ఎటువంటి నష్టం వాటిల్లలేదని పేర్కొంది. రష్యా ప్రకటనపై ఉక్రెయిన్ స్పందించలేదు. వరుసగా మూడు రోజులుగా రాజధాని మాస్కోపై డ్రోన్ దాడులు జరగడంతో రష్యా అప్రమత్తమైంది. ఇలా ఉండగా, ఉక్రెయిన్లోని లుహాన్స్క్ ప్రాంతానికి చెందిన ఉరోజ్హయిన్ అనే గ్రామాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నట్లు రష్యా శనివారం ప్రకటించుకుంది. ఖర్కీవ్, జపొరిజియా ప్రాంతాలతోపాటు, అధ్యక్షుడు జెలెన్స్కీ సొంత పట్టణం క్రివ్విరిహ్ల్లో జరిగిన రష్యా బాంబు దాడుల్లో ఇద్దరు చనిపోగా మరో 16 మంది గాయపడినట్లు ఉక్రెయిన్ యంత్రాంగం తెలిపింది. -
భారత్లో జరిగే జీ-20 సదస్సులో అదే హాట్ టాపిక్
వాషింగ్టన్: సెప్టెంబర్ నెలలో జరగనున్న జీ-20 సదస్సులో రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధానికి సంబంధించిన చర్చే ప్రధానం కానుందని చెబుతున్నాయి వైట్ హౌస్ వర్గాలు. ఈ మేరకు అమెరికా అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ ఒక ప్రకటన చేశారు. ఈ దఫా జీ-20 సదస్సు భారత్లో జరగనున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ ప్రథమార్ధంలో న్యూఢిల్లీ వేదికగా అజరిగే ఈ సదస్సుకు అతిరధ మహారధులంతా హాజరు కానున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కూడా పాల్గొనబోయే ఈ సమావేశంలో మిగతా అంశాలతో పాటు రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించిన చర్చ కూడా జరగనుందని సమావేశానికి హాజరుకానున్న అన్ని దేశాలు ఇదే అంశానికి పెద్ద పీట వేసినా ఆశ్చర్యపోనక్కరలేదని అన్నారు అమెరికా అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్. నాటో సభ్యత్వం కోసం ఉక్రెయిన్ ప్రయత్నం చేయడంతో యుద్ధానికి బీజం పడింది. 2022, ఫిబ్రవరి 24న రష్యా స్పెషల్ మిలటరీ ఆపరేషన్ ప్రారంభించింది. డొనెట్స్క్, లుహాన్స్క్ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని మొదలైన యుద్ధం ఏడాదిన్నరగా కొనసాగుతూనే ఉంది. ఇక ఉక్రెయిన్ నాటో సభ్యత్వంపై ఇటీవల జరిగిన సమావేశాల్లో భాగస్వామి దేశాలు సంయుక్తంగా ఒక నిర్ణయానికి వచ్చాయి. రష్యాతో జరుగుతున్న యుద్ధం సమసిపోతే గానీ ఉక్రెయిన్ సభ్యత్వం గురించి ఎటూ తేల్చలేమని తేల్చేశాయి. ఇటీవల సౌదీ రాజు అధ్యక్షతన ఆ దేశంలో జరిగిన సమావేశంలోనూ ప్రధానంగా ఉక్రెయిన్ గురించిన చర్చ జరిగింది. వచ్చే నెల జీ-20 సదస్సులో కూడా అదే హాట్ టాపిక్ కానుంది. ఎక్కడ సమావేశాలు జరిగినా రష్యా ఉక్రేయి యుద్ధం ప్రస్తావన వస్తూనే ఉంది. సుదీర్ఘన్గా కొనసాగుతున్న యుద్ధం తదనంతర పరిణామాల దృష్ట్యా ప్రపంచ దేశాలన్నీ ఏకమై ఎలాగైనా యుద్ధాన్ని ఓ కొలిక్కి తీసుకురావడానికి ప్రయత్నిస్తుండడం మంచి పరిణామమే. ఇది కూడా చదవండి: 24 ఏళ్లయ్యింది.. ఇకనైనా తొలగించండి ప్లీజ్.. మళ్లీ -
అదే జరిగితే ఎక్కువ సంతోషించేది మేమే.. అజిత్ దోవల్
జెదాహ్: ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి సౌదీ అరేబియాలో జరుగుతున్న రెండ్రోజుల సమావేశాల్లో పాల్గొన్న భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ మాట్లాడుతూ యుద్ధ సమసిపోతే అంతకంటే సంతోషం మరొకటి ఉండదని అన్నారు. సౌదీ అరేబియా వేదికగా రెండు రోజుల పాటు జరగనున్న ఈ సమావేశానికి సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ అధ్యక్షత వహించగా మొత్తం 40 దేశాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. ఉక్రెయిన్ యుద్ధం గురించి చర్చించేందుకే వీరంతా సమావేశమయ్యారు. ఈ సమావేశానికి రష్యాను ఆహ్వానించకపోవడం విశేషం. భారత దేశం తరఫున అధికార ప్రతినిధిగా హాజరైన అజిత్ దోవల్ రెండు దేశాల మధ్య సంధిని కుదిర్చే విషయంలో తామెల్లప్పుడూ సిద్ధంగానే ఉంటామని తెలిపారు. అజిత్ దోవల్ మాట్లాడుతూ.. భారతదేశం తరపున మేము తరచుగా రష్యా, ఉక్రెయిన్ ఉన్నతాధికారులతో సంప్రదింపులు చేస్తూ.. దౌత్యాన్ని కుదర్చడానికి తమవంతుగా ప్రయత్నం చేస్తూనే ఉన్నామన్నారు. ఇప్పటికే యుద్ధాన్ని ఆపడానికి అనేక దేశాలు తమకు తోచిన ప్రతిపాదనలు తెరపైకి తీసుకు రాగా వాటిలో కొన్ని మాత్రమే రెండు దేశాలకూ ఆమోదయోగ్యమైనవి ఉన్నాయని అన్నారు. అలా కాకుండా రెండు దేశాలకూ సమ్మతమైన, శాశ్వతమైన, సమగ్ర పరిష్కారం కోసం భారతదేశం ప్రయత్నిస్తోందని తెలిపారు. ఐక్యరాజ్యసమితి ప్రతిపాదించిన అంతర్జాతీయ చట్టాల్లోని నియమ నిబంధనలను భారత్ గౌరవిస్తుందని దాని ప్రకారమే రెండు దేశాల మధ్య సంధి కుదిర్చే ప్రయాత్నం చేస్తామని.. అదే జరిగితే తమకంటే ఎక్కువగా సంతోషించేవారు ఎవ్వరూ ఉండరని అన్నారు. అంతకుముందు జపాన్లో జరిగిన జీ7 సమావేశంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జిలెన్స్కీని కలిసిన భారత ప్రధాని నరేంద్ర మోదీ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం ప్రయత్నం చేద్దామని ఆయనకు ధైర్యం చెప్పిన విషయం తెలిసిందే. ఇది కూడా చదవండి: చికాగోలో రోడ్లపై తిరుగుతున్న హైదరాబాదీ మహిళకు ఉపశమనం -
రష్యా యుద్ధనౌకపై ఉక్రెయిన్ డ్రోన్ దాడి..
మాస్కో: నోవోరోసిస్క్ లోని రష్యా నల్ల సముద్ర నౌకాదళ స్థావరంపై ఉక్రేనియన్ డ్రోన్ దాడికి పాల్పడిండి. ఈ దాడిలో రష్యా యుద్ధనౌక దారుణంగా దెబ్బతింది. దీంతో నౌకాశ్రయంలోని కార్యకలాపాలను నిలిపివేసినట్లు తెలిపింది కాస్పియన్ పైప్లైన్ కన్సార్టియం. ఈ దాడికి సంబంధించిన డ్రోన్ విజువల్స్ ఇంటర్నెట్లో వైరలయ్యాయి. నిరంతరాయంగా కొనసాగుతున్న యుద్ధంలో ఉక్రెయిన్ రష్యాను చావుదెబ్బ తీసింది. ప్రపంచ దేశాలకు చమురు తోపాటు ధాన్యాన్ని సరఫరా చేసే రష్యా నల్ల సముద్ర నౌకాదళ స్థావరంపై ఉక్రేనియన్ డ్రోన్ దాడి చేసింది. దాడిలో ఒలెనెగోర్స్కీ గోర్న్యాక్ అనే యుద్ధ నౌక తీవ్రస్థాయిలో దెబ్బతింది. డ్రోన్ల ద్వారా సుమారు 450 కిలోల టీఎన్టీని మోసుకెళ్లి ఓడను ఢీకొట్టినట్లు ఉక్రెయిన్ ఇంటెలిజెన్స్ వర్గాలుప్రకటించాయి. దాడి సమయంలో యుద్ధనౌకపై సుమారు 100 మంది రష్యా సాయుధులు ఉండి ఉంటారని అంచనా వేస్తున్నారు. రాత్రిపూట జరిగినా కూడా డ్రోన్ కెమెరాలో దాడికి సంబంధించిన దృశ్యాలు స్పష్టంగా కనిపించాయి. ఈ వీడియాను ఉక్రెయిన్ బలగాలు మీడియాకు చేరవేశాయి. దాడి అనంతరం రష్యా బలగాలు రెండు సీ డ్రోన్ల సాయంతో బేస్ వెలుపల ఉక్రెయిన్ డ్రోన్లను ధ్వంసం చేసినట్లు రష్యా డిఫెన్స్ మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. దాడిలో జరిగిన నష్టం గురించి మాత్రం వారు ప్రస్తావించలేదు. ఉక్రెయిన్ రిటైర్డ్ నావికా దళాధిపతి ఆండ్రియ్ రైజంకో మాట్లాడుతూ ఈ దాడుల కోసం ఉక్రెయిన్ సముద్ర డ్రోన్లు దాదాపు 760 కిలోమీటర్లు ప్రయాణించి ఉంటాయని. ఉక్రెయిన్ డ్రోన్లు అంత దూరం ప్రయాణించడం ఇదే మొదటిసారని ఆయన అన్నారు. POV: you ram into a Russian landing warship as a little simple drone pic.twitter.com/u79u5A4Shb — Illia Ponomarenko 🇺🇦 (@IAPonomarenko) August 4, 2023 ఇది కూడా చదవండి: పుతిన్ శత్రువుపై మరిన్ని కేసులు.. ఎంత కాలం శిక్ష పడనుందో తెలుసా? -
యుద్ధ మృతులు 10 వేలు.. ఓ రక్తపిపాసీ... నీకిదే జలాభిషేకం...!
కీవ్: రష్యా దురాక్రమణ తమ దేశంపై మొదలయ్యాక 499 మంది చిన్నారులు సహా 10,749 మంది పౌరులు చనిపోయినట్లు ఉక్రెయిన్ తెలిపింది. ఉక్రెయిన్ ప్రాసిక్యూటర్ జనరల్ ఉన్నతాధికారి యూరి బియెలౌసోవ్ ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాలు వెల్లడించారు. ఆక్రమిత ప్రాంతాలను విముక్తి చేసిన తర్వాతే వాస్తవ సంఖ్య తేలుతుందని చెప్పారు. రష్యా–ఉక్రెయిన్ యుద్ధంలో 500 మంది చిన్నారులు సహా 9 వేల మందికి పైగా పౌరులు మృతి చెందినట్లు జూలై 7న ఐక్యరాజ్యసమితి వెల్లడించిన నివేదిక తెలిపింది. కాగా, రష్యా కాల్పుల్లో ఖెర్సన్ నగరంలోని 18వ శతాబ్దానికి చెందిన చారిత్రక సెంట్ కేథరిన్ కేథడ్రల్ చర్చి దెబ్బతింది. మంటలను ఆర్పుతుండగా మరోసారి దాడి జరిగింది. ► యుద్ధ ట్యాంకర్పై కూర్చున్న రష్యా అధ్యక్షుడు పుతిన్ నిలువెత్తు రక్త ప్రతిమపై వాటర్ గన్తో నీళ్లు పిచికారీ చేస్తున్న ఓ బాలిక. ఇటలీ రాజధాని రోమ్లో జేమ్స్ కొలోమినా అనే కళాకారుడు ఈ ప్రతిమను ప్రతిష్టించారు. -
ఉక్రెయిన్ బందీలపై రష్యా బలగాల అకృత్యాలు
క్యివ్: రష్యా ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో బందీలుగా చెరపట్టబడిన వారిని రష్యా సాయుధ బృందాలు అత్యంత క్రూరంగా హింసిస్తున్నట్లు చెబుతున్నారు ఉక్రెయిన్ అధికారులు. అంతర్జాతీయ మానవతా న్యాయ సంస్థ గ్లోబల్ రైట్స్ కంప్లయన్స్ వారు ఇచ్చిన నివేదిక ప్రకారం 18 నెలలుగా కొనసాగుతున్న యుద్ధంలో మొత్తం 97,000 నేరాలు నమోదుకాగా వాటిలో 220 కేసులలో ఇప్పటికే తీర్పులిచ్చాయి స్థానిక న్యాయస్థానాలు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ను కూడా అరెస్టు చేయాలని కొన్ని న్యాయస్థానాలు తీర్పునిచ్చాయి. కానీ క్రెమ్లిన్ వర్గాలు ఈ తీర్పులకు స్పందిస్తూ అవి దేశరక్షణలో భాగంగా జరిగిన స్పెషల్ మిలటరీ ఆపరేషన్ అంటూ చెప్పుకొచ్చాయి. ఇదిలా ఉండగా బ్రిటీష్, ఐరోపా సంయుక్త దేశాలు, అమెరికా సహకారంతో నడిచే మొబైల్ జస్టిస్ టీమ్ ఇచ్చిన నివేదిక ప్రకారం ఖేర్సన్ పరిసర ప్రాంతంలోని 35 చోట్ల 320 యుద్ధ నేరాలు ఆరోపించబడ్డాయని తెలిపింది. ఉక్రెయిన్ ప్రాసిక్యూటర్ల తాజా విచారణలో ప్రకారం రష్యా రాజకీయ నాయకుడితో ఉక్రెయిన్ కు చెందిన ఇద్దరు చేతులు కలిపి ఖేర్సన్ నుండి ఎందరో అనాధలను ఖైదీలుగా తరలించారు. వారినందరినీ చిత్రహింసలకు గురిచేస్తూ రష్యా సైన్యం లైంగిక దాడులకు కూడా పాల్పడుతోందన్నారు. ఉక్రెయిన్ ప్రాసిక్యూటర్లు ప్రాసిక్యూట్ చేసిన 36 మంది మాత్రం కరెంటు షాక్ ఇవ్వడం, చావబాదడం తోపాటు అత్యాచారానికి పాల్పడతామంటూ బెదిరించినట్టు తెలిపారు. గ్లోబల్ రైట్స్ కంప్లయన్స్ న్యాయ సలహాదారు మాత్రం ఖైదీలపై రష్యా ఆకృత్యాలపై పూర్తి స్థాయి నివేదిక ఇంకా అందాల్సి ఉందన్నారు. ఇది కూడా చదవండి: సముద్రంలో ఒళ్ళు గగుర్పొడిచే సాహసం.. తలచుకుంటేనే.. -
జెలెన్స్కీ సొంత నగరంపై క్షిపణి దాడులు
కీవ్: రష్యా సోమవారం ఉదయం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సొంత నగరం క్రివి్వ్యరిహ్పై రెండు క్షిపణులను ప్రయోగించింది. ఈ దాడుల్లో పదేళ్ల బాలిక సహా ఆరుగురు చనిపోయారు. ఈ దాడుల్లో ఓ అపార్టుమెంట్, నాలుగంతస్తుల యూనివర్సిటీ భవనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పదేళ్ల బాలిక, ఆమె తల్లి సహా అయిదుగురు ప్రాణాలు కోల్పోగా మరో 64 మంది గాయాలపాలయ్యారని నీప్రో గవర్నర్ సెర్హీ లిసాక్ తెలిపారు. ఇంకా కొందరు శిథిలాల కింద చిక్కుకున్నట్లు చెప్పారు. పలు వాహనాలు ధ్వంసమయ్యాయన్నారు. రష్యా పాక్షికంగా ఆక్రమించిన డొనెట్స్క్ ప్రావిన్స్లో జరిగిన దాడిలో ఇద్దరు చనిపోగా మరో ఆరుగురు గాయపడ్డారు. ఈ దాడికి కారణమంటూ ఎవరూ ప్రకటించుకోలేదు. కాగా, మాస్కోపైకి ఆదివారం డ్రోన్లను ప్రయోగించిన ఉక్రెయిన్ సోమవారం రష్యాలోని బ్రియాన్స్క్పై డ్రోన్ దాడి జరిపింది. ఎవరూ చనిపోయినట్లు సమాచారం లేదని స్థానిక గవర్నర్ చెప్పారు. ఖరీ్కవ్, ఖెర్సన్, డొనెట్స్్కలపై రష్యా శతఘ్ని కాల్పుల్లో ముగ్గురు చనిపోగా మరో ఏడుగురు గాయాలపాలయ్యారు. -
రష్యాపై ఉక్రెయిన్ డ్రోన్ల దాడి.. మాస్కో విమానాశ్రయం మూసివేత
మాస్కో: ఆదివారం ఉదయం మాస్కో నగరంలో మొత్తం మూడు డ్రోన్లతో ఉక్రెయిన్ దాడికి పాల్పడగా ఒకదాన్ని నగరం శివార్లలోనే కూల్చేశాయి రష్యా బాలగాలు. రెండిటిని మాత్రం ఎలక్ట్రానిక్ వార్ఫేర్ దెబ్బతీశాయి. ప్రమాదంలో ఎవ్వరికి గాయాలు తగల్లేదని తెలిపింది రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ. దీంతో కొద్దిసేపు మాస్కో విమానాశ్రయాన్ని మూసివేశారు ఎయిర్పోర్టు అధికారులు. ఉక్రెయిన్ సరిహద్దు నుండి సుమారు 500 కి.మీ(310 మైళ్ళు) మేర ఆ దేశం అప్పుడప్పుడు దాడులకు పాల్పడింది. కానీ ఈసారి మాత్రం ఉక్రెయిన్ క్రెమ్లిన్, సరిహద్దులోని రష్యా పట్టణాల మీద దాడి చేసింది. మాస్కో నగర మేయర్ సెర్గీ సొబ్యానిన్ దాడులపై స్పందిస్తూ.. ఈ దాడుల్లో రెండు సిటీ ఆఫీస్ టవర్లు కొంత వరకు దెబ్బతిన్నాయని.. ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని తెలిపారు. ఆదివారం జరిగిన డ్రోన్ల దాడుల్లో ఒకదాన్ని మాస్కో ఒడింట్సోవ్ జిల్లాలోని రక్షణ బలగాలు మట్టుబెట్టాయని మరో రెండు డ్రోన్లను తమ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ ధ్వంసం చేసిందని.. వాటి శకలాలు నిర్మానుష్య ప్రాంతంలో నేలకూలాయని అన్నారు. ఈ కారణంగానే కొద్దిసేపు వ్నుకోవో విమానాశ్రయానికి రాకపోకలను నిలిపివేసినట్లు చెబుతూ దీన్ని మేము తీవ్రవాదుల చర్యగానే పరిగణిస్తున్నామని తెలిపింది రష్యా రక్షణ శాఖ. ఇది కూడా చదవండి: అమెరికా అధ్యక్షుడి రేసులో రిపబ్లికన్ పార్టీ తరపున మరో భారతీయుడు -
ఉక్రెయిన్పై రష్యా దాడులు.. 8 మంది మృతి
కీవ్: ఉక్రెయిన్ వ్యాప్తంగా రష్యా సాగించిన దాడుల్లో 8 మంది పౌరులు మృతి చెందగా పలువురు గాయాలపాలయ్యారు. డొనెట్స్క్లోని నియు–యోర్క్పై రష్యా సైన్యం జరిపిన కాల్పుల్లో నలుగురు చనిపోగా మరో ముగ్గురు గాయపడ్డారని ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. కొస్టియాంటీనివ్కాపై జరిగిన రాకెట్ల దాడిలో 20 వరకు ఇళ్లు, కార్లు, గ్యాస్ పైప్లైన్ ధ్వంసం కాగా ఇద్దరు మృతి చెందారు. ఒకరు గాయపడ్డారు. చెరి్నహివ్పై రష్యా క్రూయిజ్ మిస్సైళ్లు పడటంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. జపొరిఝియా అణు ప్లాంట్ పొరుగునే ఉన్న పట్టణంపై రష్యా దాడిలో ముగ్గురు పౌరులు గాయపడ్డారు. ఇలా ఉండగా, నల్ల సముద్రం ధాన్యం రవాణా ఒప్పందాన్ని రద్దు చేసిన రష్యా ఉక్రెయిన్ నౌకా తీర ప్రాంతం ఒడెసాను లక్ష్యంగా చేసుకుంది. రష్యా మిలటరీ ప్రయోగించిన రెండు క్రూయిజ్ మిస్సైళ్లు గిడ్డంగులపై పడటంతో మంటలు చెలరేగి పరికరాలు ధ్వంసమయ్యాయని, 120 మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలు బూడిదయ్యాయని ఉక్రెయిన్ తెలిపింది. క్రిమియాపై దాడులకు ప్రతీకారంగానే ఈ దాడులకు పాల్పడినట్లు రష్యా తెలిపింది. ఈ పరిణామంపై తుర్కియే అధ్యక్షుడు ఎర్డోగన్ స్పందించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ డిమాండ్లను పశ్చిమదేశాలు నెరవేర్చి, ధాన్యం రవాణా కారిడార్ ఒప్పందాన్ని పునరుద్ధరించుకోవాలని సూచించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్తో ఫోన్ చేసి మాట్లాడతానని, వచ్చే నెలలో తుర్కియేలో ఆయనతో భేటీ ఉంటుందని ఆశిస్తున్నానన్నారు. కాగా, రష్యా ఆక్రమిత క్రిమియాలో వారం వ్యవధిలో రెండోసారి డ్రోన్ పేలింది. క్రాస్నోవార్డిస్క్లోని ఆయిల్ డిపో, ఆయుధ గిడ్డంగిలను డ్రోన్ బాంబులతో పేల్చేసినట్లు ఉక్రెయిన్ తెలిపింది. సోమవారం ఉక్రెయిన్ జరిపిన దాడిలో రష్యాను కలిపే కీలకమైన క్రిమియా వంతెన కొంతభాగం దెబ్బతిన్న విషయం తెలిసిందే. ఇలా ఉండగా, జపొరిఝియా ప్రాంతంలో ఉక్రెయిన్ శతఘ్ని కాల్పుల్లో రియా వార్తా సంస్థకు చెందిన రష్యా జర్నలిస్టు ఒకరు మృతి చెందారు. -
బెలారస్ లో వాగ్నర్ సైన్యం.. అంతా ప్లాన్ ప్రకారమే..?
మాస్కో: రష్యా బలగాలపై తిరుగుబాటు చేసిన వాగ్నర్ సైన్యం చీఫ్ యెవ్జెనీ ప్రిగోజిన్ ప్రస్తుతం బెలారస్ లో ఉన్నట్లుగా చూపిస్తూ ఇటీవల ఒక వీడియో బయటకు వచ్చింది. ఈ నేపథ్యంలో వాగ్నర్ గ్రూప్ బాస్ ప్రిగోజిన్ బెలారస్ లో ఉంటేనే పోలాండ్, లిథువానా సమీపంలోని నాటో ఆస్తులపై చేసేందుకు అనువుగా ఉంటుందంటున్నాయి రష్యా వర్గాలు. లొకేషన్ చేంజ్.. రష్యాపై ఉన్నట్టుండి తిరుగుబాటు చేసిన వాగ్నర్ గ్రూపు సైన్యం చీఫ్ యెవ్జెనీ ప్రిగోజిన్తోనూ రష్యా అధ్యక్షుడు పుతిన్ తోనూ బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకాశంకో మధ్యవర్తిత్వం నడిపి సంధి కుదిర్చిన విషయం తెలిసిందే. సంధి జరిగిన నాటి నుండి ఇంతవరకు వాగ్నర్ గ్రూపు అధినేత యెవ్జెనీ ప్రిగోజిన్ ఎక్కడా బయట కనిపించలేదు. దీనిపై చాలా అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. కానీ ఇటీవల విడుదలైన కొన్ని వీడియోల ఆధారంగా ఆయన బెలారస్ లో ఆశ్రయం పొందినట్లు తెలుస్తోంది. రష్యాకే బెనిఫిట్.. బెలారస్ లో యెవ్జెనీ ప్రిగోజిన్ అక్కడి సైన్యానికి శిక్షణ ఇస్తోన్న కొన్ని వీడియోలు కూడా బయటకు వచ్చాయి. ఈ నేపథ్యంలో రష్యా మాజీ సైన్యాధికారి ఆండ్రీ కర్తపోలోవ్ కొంత స్పష్టత ఇచ్చారు. వాగ్నర్ సైన్యం ప్రస్తుతం బెలారస్ లో ఉండడమే కరెక్టని, అక్కడ ఉంటేనే బెలారస్ సరిహద్దు ప్రదేశాలు పోలాండ్, లిథువానాలతోపాటు ఉక్రెయిన్ లోని నాటో ఆస్తులపై దాడి చేసే వీలుంటుందని, అది రష్యాకు కలిసొచ్చే అంశమేనని తెలిపారు. మరోపక్క ఇదంతా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రణాళికలో భాగమని, దాని అనుసారంగానే తిరుగుబాటు సైన్యాధ్యక్షుడు యెవ్జెనీ ప్రిగోజిన్ను దేశం దాటించి అతని స్థానంలో మరొకరిని వాగ్నర్ బృందానికి నాయకుడిగా నియమించనున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఇది కూడా చదవండి: రిషి సునాక్ ప్రభుత్వానికి షాక్.. ఉప ఎన్నికల్లో ఎదురుదెబ్బ.. -
Russia-Ukraine War: క్రిమియా బ్రిడ్జిపై భారీ పేలుడు.. ఇద్దరి మృతి
క్యివ్: గతేడాది అక్టోబర్ నెలల్లో ట్రక్కు బాంబు పేలిన అదే బ్రిడ్జి మీద మరోసారి పేలుడు సంభవించింది. ఈ సంఘటనలో ఒక జంట మృతి చెందగా వారి బిడ్డ మమ్మీ, డాడీ అంటూ రోదిస్తూ హృదయాలను ద్రవింపజేసింది. క్రిమియా నుండి రష్యాకు కనెక్టివిటీగా ఉన్న ఈ బ్రిడ్జి రష్యా యుద్ధం చేయడంలో నిర్ణయాత్మక పాత్ర పోషించింది. 12 కిలోమీటర్ల పొడవున్న ఈ రోడ్డు కమ్ రైలు వంతెన రష్యా దళాలు వస్తూ పోతూ ఉండడానికి బాగా ఉపయోగపడింది. గత ఏడాది అక్టోబర్ నెలలో ఇదే బ్రిడ్జిపై ట్రక్కు బాంబు పేలిన విషయం తెలిసిందే. దీన్ని మరమ్మతులు చేసి పునరుద్ధరించడానికి నెలల సమయం పట్టింది. ఎట్టకేలకు రవాణా యధాతధంగా సాగుతున్న ఈ బ్రిడ్జి మీద మళ్ళీ పేలుడు సంభవించడం సంచలనంగా మారింది. ఈ ప్రమాదంలో ఒక జంట మృతి చెందారని వారి చిన్నారి మాత్రం చిన్న చిన్న గాయాలతో బయటపడిందని తెలిపారు పశ్చిమ రష్యాలోని బెల్గోరోడ్ గవర్నర్ వ్యాచెస్లావ్ గ్లాడ్కోవ్. బెల్గోరోడ్ నెంబర్ ప్లేటు ఉన్న వాహనం ఒకటి ఈ పేలుడుకు ప్రధాన కారణమని అన్నారు. రష్యా రవాణా మంత్రిత్వ శాఖ ఇది ముమ్మాటికీ ఉక్రెయిన్ చర్యేనని ఆరోపిస్తూ పేలుడుకి గల కారణాలను విచారిస్తున్నట్లు తెలిపింది. క్రిమియా గవర్నర్ సెర్జీ ఆక్సియోనోవ్ ఈ విషయాన్ని టెలిగ్రామ్ ద్వారా ధృవీకరించి రక్షణ చర్యలు చేపట్టామని తెలిపారు. బ్రిడ్జి 145 పిల్లర్ వద్ద పేలుడు సంభవించిందని, బ్రిడ్జి రహదారిపై విపత్తు నిర్వహణ సంస్థల వారు రక్షణ చర్యలు చేపట్టారని. వీలైనంత తొందరగా ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా చేస్తామని తెలిపారు. ఇది కూడా చదవండి: పసిఫిక్ సముద్రంలో చిక్కుకుని.. 60 రోజుల పాటు ఒక్కడే.. -
మా దగ్గరా బోలెడు క్లస్టర్ బాంబులు
కీవ్: ఉక్రెయిన్కు అమెరికా విధ్వంసకర క్లస్టర్ బాంబులను సరఫరా చేయడంపై రష్యా అధ్యక్షుడు పుతిన్ స్పందించారు. తమ వద్ద కూడా క్లస్టర్ బాంబుల నిల్వలు దండిగా ఉన్నాయని ప్రకటించారు. ఈ వివాదాస్పద ఆయుధాలను ఉక్రెయిన్ వాడిన పక్షంలో తగు రీతిలో స్పందించే హక్కు తమకుందని హెచ్చరించారు. ‘మా వద్ద క్లస్టర్ బాంబులు ఉన్నప్పటికీ ఉక్రెయిన్తో జరుగుతున్న యుద్ధంలో ఇప్పటి వరకు వాటిని వాడలేదు. అటువంటి అవసరం కూడా మాకు రాలేదు’ అని చెప్పారు. రష్యా, ఉక్రెయిన్ ఇప్పటికే క్లస్టర్ బాంబులను వాడినట్లుగా పలు ఆధారాలను అసోసియేటెడ్ ప్రెస్, అంతర్జాతీయ మానవతావాద సంస్థలు చూపుతున్నాయి. రష్యాపై ఉక్రెయిన్ ఎదురుదాడి ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. దీంతో, యుద్ధక్షేత్రంలో రష్యా ఆర్మీపై ఉక్రెయిన్ పైచేయి సాధించాలంటే విధ్వంసకర క్లస్టర్ బాంబులే మార్గమని అమెరికా అంచనా వేస్తోంది. క్లస్టర్ బాంబుల సరఫరాపై నెలలపాటు అమెరికా మల్లగుల్లాలు పడింది. ఉక్రెయిన్కు వీటిని అందజేయాలన్న నిర్ణయానికే అధ్యక్షుడు బైడెన్ చివరికి మొగ్గు చూపారు. ప్రమాదకరమైనవిగా భావించే క్లస్టర్ బాంబులను చివరిసారిగా అమెరికా 2003లో ఇరాక్ యుద్ధంలో వాడినట్లు చెబుతోంది. ప్రస్తుతం ఆ దేశం వద్ద 30 లక్షల క్టస్టర్ ఆయుధ నిల్వలున్నాయి. డొనెట్స్క్, ఖెర్సన్ ప్రాంతాలే లక్ష్యంగా గత 24 గంటల్లో రష్యా రెండు షహీద్ డ్రోన్లను, రెండు క్రూయిజ్ మిస్సైళ్లను, రెండు యాంటీ ఎయిర్క్రాఫ్ట్ మిస్సైళ్లతోపాటు 40 వైమానిక దాడులు, 46 రాకెట్ దాడులు జరిపిందని ఉక్రెయిన్ తెలిపింది. -
వాగ్నర్ అనుభవంతో బెలారస్ బలోపేతం!
మిన్స్క్ (బెలారస్): ఉక్రెయిన్లో రష్యా తరఫున యుద్ధంలో పాల్గొన్న ప్రైవేట్ సైన్యం వాగ్నర్ గ్రూప్ అనుభవాన్ని వాడుకోవాలని బెలారస్ భావిస్తోంది. వాగ్నర్ సేన శనివారం ఆ దేశంలో బెలారస్లో అడుగుపెట్టింది. ఇరు సైన్యాల మధ్య సమన్వయం కోసం సంయుక్త సైనిక విన్యాసాలు తదితరాలకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. మెరుపువేగంతో షూటింగ్, ప్రథమ చికిత్సలో బెలారస్ సైనికులకు వాగ్నర్ గ్రూప్ బలగాలు తరీ్ఫదునిస్తున్న వీడియో వైరల్గా మారింది. -
ఉక్రెయిన్లో దక్షిణ కొరియా అధ్యక్షుడు
కీవ్: రష్యా దురాక్రమణకు లోనైన తమ భూభాగాలను తిరిగి దక్కించుకునేందుకు సర్వం ఒడ్డుతున్న ఉక్రెయిన్కు మద్దతు పలుకుతున్న దేశాల సంఖ్య పెరుగుతుంది. శనివారం దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ ఇయోల్ ఉక్రెయిన్లో పర్యటించారు. నాటో భేటీ కోసం లిథువేనియాకు వచి్చన యూన్ సతీసమేతంగా ఉక్రెయిన్ వెళ్లారు. ఉక్రెయిన్ సేనల తీవ్ర ప్రతిఘటనలతో వెనుతిరుగుతూ రష్యా మూకలు సృష్టించిన నరమేథానికి సాక్షిగా నిలిచిన బుచా, ఇరి్పన్ నగరాల్లోని ఘటనాస్థలాలను యూన్ సందర్శించి మృతులకు నివాళులరి్పంచారు. యుద్ధంలో తలమునకలైన ఉక్రెయిన్కు మానవీయ, ఆర్థికసాయం అందిస్తూ ద.కొరియా తనవంతు చేయూతనందిస్తోంది. కానీ ఆయుధసాయం మాత్రం చేయట్లేదు. యుద్ధంలో మునిగిన దేశాలకు ఆయుధాలు అందించకూడదనే తన దీర్ఘకాలిక విధానాన్ని ద.కొరియా ఇంకా కొనసాగిస్తోంది. అయితే మందుపాతరలను గుర్తించి నిరీ్వర్యంచేసే ఉపకరణాలు, అంబులెన్సులు, సైనికయేతర వస్తువులను మాత్రం అందించేందుకు తమ సమ్మతి తెలిపింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతోనూ యూన్ భేటీ అయ్యారు. పలు అంశాలపై చర్చించారు. యుద్ధ తీవ్రంకాకుండా ఆపగలిగే పరిష్కార మార్గాలను అన్వేíÙంచాలని నిర్ణయించారు. -
Ukraine-Russia war: నాటో నాటో.. ఎప్పుడో ఎప్పుడో!
ఎస్.రాజమహేంద్రారెడ్డి: నాటో (నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్) సభ్య దేశాల సమావేశం ఉక్రెయిన్ ఆశలపై నీళ్లు చల్లింది. నాటో.. నాటో అంటూ కలవరించిన ఉక్రెయిన్ ఇప్పుడు నాటు.. నాటు అనక తప్పడం లేదు. గతేడాది మాడ్రిడ్లో జరిగిన సమావేశం అనంతరం స్వీడన్, ఫిన్లండ్లను కూటమిలో చేర్చుకుంటున్నట్టు నాటో ప్రకటించింది. ఆ రెండు దేశాలు జూలై 11, 12 తేదీల్లో లిథువేనియాలో జరిగిన సమావేశాలకు కూడా హాజరయ్యాయి. ఇదే బాటలో నాటో కూటమి తమను కూడా అక్కున చేర్చుకుంటుందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆశించారు. కానీ ఆయన అనుకున్నదొకటైతే జరిగింది మరొకటి! ఉక్రెయిన్ భవిష్యత్తు తమతోనే ముడిపడి ఉంటుందని సమావేశం చివరి రోజు నాటో పేరుకు ఒక ప్రకటన చేసినా, ఆ భవిష్యత్తు ఎప్పుడు ఆరంభమవుతుందో మాత్రం స్పష్టం చేయలేదు. దాదాపు 500 రోజులకు పైగా రష్యాతో యుద్ధం చేస్తున్న ఉక్రెయిన్కు పశి్చమ దేశాలు ఆయుధ సామగ్రితో పాటు యుద్ధ ట్యాంకులు, ఫైటర్ జెట్లను సమకూరుస్తూ అండగా ఉన్నప్పటికీ, ఆ సాయం వెనక ఆయా దేశాల ఊగిసలాట ధోరణి జెలెన్స్కీని కలవరపరుస్తూనే వస్తోంది. ప్రతిదానికీ చేతులు జోడించి ఎదురు చూడాల్సి రావడం ఆయనకు మింగుడు పడటం లేదు. నాటో కూటమిలోకి ప్రవేశం దక్కితే ఈ అవస్థ ఉండదన్నది జెలెన్స్కీ ఆలోచన. నిజానికి నాటోలో చేరితే ఉక్రెయిన్ రక్షణ బాధ్యతను కూటమి దేశాలన్నీ సంయుక్తంగా మోయాల్సి ఉంటుంది. ఉక్రెయిన్ భవితవ్యాన్ని, రష్యాతో జరుగుతున్న యుద్ధ గమనాన్ని శాసించే నాటో సభ్యత్వ వ్యవహారంలో నిజానికి ఏం జరిగింది? ఉక్రెయిన్కు సభ్యత్వమిచ్చేందుకు ఎందుకు నాటో పచ్చజెండా ఊపలేదు? అసలు జెలెన్స్కీ ఆశించిందేమిటి? వివరాల్లోకి వెళ్దాం... అనుకున్నదొక్కటి... జెలెన్స్కీ ఏం ఆశిస్తున్నదీ సుస్పష్టం. గత సెపె్టంబరుకు ముందు ఇదే విషయంపై ఆయన మాట్లాడుతూ, నాటోలో ఉక్రెయిన్కు సభ్యత్వం కావాలన్న తన అభ్యర్థనను 2023 జూలైలో లిథువేనియాలో జరిగే కూటమి సమావేశంలో వ్యక్తం చేస్తానని అన్నారు. కానీ ఈ వ్యాఖ్యల్లో మొక్కుబడితనమే తప్ప గాఢమైన కోరికేమీ ధ్వనించలేదు. ఉక్రెయిన్ ప్రాంతాలైన లుహాన్స్్క, డొనెట్స్్క, ఖెర్సన్, జపోరిజియాలను తమ భూభాగాలుగా గుర్తిస్తున్నట్టు రష్యా అధ్యక్షుడు పుతిన్ గత సెపె్టంబరులో ప్రకటించగానే జెలెన్స్కీ స్వరం మారిపోయింది. నాటోలో తమకు పూర్తి సభ్యత్వమిచ్చే అంశాన్ని ఆగమేఘాల మీద పరిశీలించాల్సిందిగా జెలెన్స్కీ అభ్యరి్థంచడం మొదలెట్టారు. అంటే నాటో సభ్యత్వాన్ని ఉక్రెయిన్ సీరియస్గా ఆశిస్తున్నది కేవలం ఏడాది క్రితం నుంచేనని సుస్పష్టం. నాటో మార్గదర్శకాల ప్రకారం యూరప్లోని ఏ దేశమైనా సభ్యత్వం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. పన్నెండు దేశాల కూటమిగా మొదలైన నాటో సభ్య దేశాల సంఖ్య ఇప్పుడు 32కు పెరిగింది. లిథువేనియాలోని విలి్నయస్లో జరిగిన నాటో భేటీకి హాజరైన జెలెన్స్కీ పనిలో పనిగా లుకిస్కస్ స్క్వేర్లో జరిగిన ఓ సభలో తమ అభీష్టాన్ని అక్కడి జనాలతో పంచుకున్నారు. సభా వేదికపై ‘ఉక్రెయిన్–నాటో 33’ నినాదాన్ని కూడా ప్రదర్శించడం విశేషం. నాటో నేతలకే ఇష్టం లేదు...! లుకిస్కస్ స్క్వేర్ సభా వేదికపై ప్రదర్శితమైన ‘ఉక్రెయిన్–నాటో 33’ బ్యానర్ అక్కడివారి మది దోచినా, ఉక్రెయిన్ మెడలో ఇప్పటికిప్పుడే ‘నాటో–33’ గుర్తింపు కార్డు పడటం మాత్రం నాటో నేతల్లోనే చాలామందికి అసలు ఇష్టం లేదు. అందుకే ‘అప్పుడే కాదం’టూ ఉక్రెయిన్ అభ్యర్థనను సున్నితంగా తిరస్కరించారు. ఒకవైపు యుద్ధం కొనసాగుతుండగా మరోవైపు ఉక్రెయిన్కు సభ్యత్వాన్ని మంజూరు చేస్తే నాటో దేశాలన్నీ రష్యాపై ప్రత్యక్షంగా యుద్ధ బరిలోకి దిగాల్సి వస్తుంది. నాటో నిబంధనల ప్రకారం ఏ సభ్య దేశంపై దాడి జరిగినా కూటమిలోని దేశాలన్నీ సంయుక్తంగా ఎదురు దాడి చేయాల్సి ఉంటుంది. నాటో నిబంధనల్లోని ఆరి్టకల్–5 ఈ విషయాన్ని స్పష్టంగా నిర్దేశించింది. నాటో చరిత్రలో ఇప్పటిదాకా ఒకే ఒక్కసారి, అమెరికాపై 9/11 ఉగ్ర దాడులు జరిగినప్పుడు ఈ నిబంధన అమలైంది. ఒకవేళ ఇప్పుడు గనక ఉక్రెయిన్కు సభ్యత్వమిస్తే కూటమిలోని మిగతా 32 దేశాలూ రష్యాపై యుద్ధానికి దిగాల్సి వస్తుంది. ‘నాటో దేశాల భూభాగంలో ఒక్క అంగుళం కూడా వదులుకోవడానికి మేం సిద్ధంగా లేం. ఇప్పుడు యుద్ధం నడిమధ్యలో ఉంటే తలపడటానికి సిద్ధంగా ఉన్నాం. అసలు ఆ మాటకొస్తే ఇప్పుడు మేమంతా రష్యాతో యుద్ధం చేస్తున్నట్టే లెక్క’ అని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వ్యాఖ్యానించడం గమనార్హం. నాటో కూటమి తమ సభ్య దేశాల పట్ల ఎంతటి అంకితభావంతో ఉంటుందో బైడెన్ ఈ వ్యాఖ్యలతో ప్రపంచానికి చాటారు. అయితే బైడెన్ వ్యాఖ్య వెనక అసలు ఉద్దేశాన్ని బ్రిటన్ రక్షణ మంత్రి జెన్ వాలెస్ కుండబద్దలు కొట్టారు. ‘ప్రస్తుతం యుద్ధం మధ్యలో ఉన్న దేశాన్ని ఇప్పటికిప్పుడు కూటమిలోకి ఆహా్వనించలేం. అలా చేయడం మొత్తం కూటమినీ యుద్ధభూమిలోకి లాగడమే అవుతుంది’’ అంటూ అసలు విషయం చెప్పకనే చెప్పారు. యుద్ధం ముగిశాక గెలుపోటములతో నిమిత్తం లేకుండా వీలైనంత త్వరగా ఉక్రెయిన్ను నాటోలో చేర్చుకుంటామని స్పష్టం చేశారు. ఉక్రెయిన్ సభ్యత్వానికి నాటో ఇలా సూత్రప్రాయంగా అంగీకరించినా అధికార ముద్ర ఎప్పుడు పడుతుందో చెప్పలేం. యుద్ధం ముగిసేదాకా ఉక్రెయిన్కు నాటో మోక్షం లేదని స్పష్టంగా తెలిసిపోతున్నా, యుద్ధం ఎప్పుడు ముగుస్తుందనేది మాత్రం అస్పష్టం! జెలెన్స్కీకీ ముందే తెలుసు...! యుద్ధం జరుగుతుండగా నాటో సభ్యత్వం రావడం కల్లేనని జెలెన్స్కీకీ తెలుసు. అయితే రష్యాపై ఒత్తిడి పెంచేందుకు ఆయన పదేపదే నాటో సభ్యత్వం కోసం డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఆయన గతంలో చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. ‘యుద్ధం జరుగుతుండగా నాటో సభ్యత్వం మాటే ఉండదు. మాకది ఇష్టం లేక కాదు, కానీ అసాధ్యం’ అని జెలెన్స్కీ ఐదారు నెలల క్రితం కీవ్లో తన మనసులో మాటను సుస్పష్టంగా చెప్పారు. అయితే యుద్ధం ముగిసిన వెంటనే నాటో సభ్యత్వం లభించేలా ఓ రోడ్మ్యాప్ను ఖరారు చేసుకోవడానికే పదేపదే ఇలా సభ్యత్వం కోసం డిమాండ్ చేస్తూ వస్తున్నారు. సభ్యత్వంపై ఎటూ తేల్చని నాటో కనీసం ఆ దిశగా ఎలాంటి కార్యాచరణనూ ప్రకటించకపోవడం ఉక్రెయిన్ అధ్యక్షుడిని నిరాశకు గురి చేసింది. ఇది ఒకరకంగా ఉక్రెయిన్ను ఆగమ్యగోచరమైన పరిస్థితిలోకి నెట్టిందనే భావించాలి. ఉక్రెయిన్ ఉక్రెయిన్గా నిలవాలంటే యుద్ధాన్ని గెలవాలి, లేదా రష్యాతో సంధి కుదుర్చుకోవాలి. ఈ రెండు పరిస్థితుల్లోనే ఉక్రెయిన్ నాటోలో చేరగలుగుతుంది. ఓడిపోతే ఉక్రెయిన్ రష్యాలో అంతర్భాగంగా మారిపోతుంది. అప్పుడిక దానికి నాటో ప్రస్తావన అవసరమే లేకుండా పోతుంది. గెలుపోటములను కాలమే నిర్ణయిస్తుంది. కానీ ఇప్పటిదాకా ‘అయితే గియితే’లో ఉన్న నాటో సభ్యత్వ అంశం ‘ఆ సుదినం ఎప్పుడు’ అనేదాకా అయితే వచి్చంది. ప్రస్తుతానికి ఉక్రెయిన్కు ఊరటనిచ్చే విషయం ఇదొక్కటే. యుద్ధం త్వరలో ఓ కొలిక్కి వచ్చి ఉక్రెయిన్కు నాటో తలుపులు తెరుకోవాలని కోరుకుందాం! తెరుచుకుంటాయనే ఆశిద్దాం!! -
నాటో సమావేశాలు: ఒంటరిగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ
విల్నియస్ : లిథువానా రాజధాని విల్నియస్ వేదికగా జరుగుతున్న నాటో దేశాల సమావేశాల నేపథ్యంలో ఉక్రెయిన్ కు నాటో సభ్యత్వంపైనా ఆ దేశానికి ఆయా సభ్య దేశాల మద్దతు ఎలా ఉంటుందనే దానిపైనే అందరి దృష్టి ఉంది. ఇదిలా ఉండగా సమావేశం అనంతరం భోజనానికి ముందు అతిధులందరూ ఒకరినొకరు పలకరించుకుంటూ ఉంటే ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ మాత్రం ఒంటరిగా కనిపించారు. అదే సమయంలో తీసిన ఫోటో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ ఒంటరిగా ఉన్న ఈ ఫోటోపై కామెంట్లు కూడా అంతే సెటైరికల్ గా ఉన్నాయి. నాటో కూటమి ఒక అస్థిరమైన కూటమి అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలకు నాటో దేశాలు ఆగ్రహంతో ఉన్నాయి అందుకే ఆయనను ఒంటరిగా వదిలేశారని ఒకరు రాయగా.. నాటో సమావేశాల్లో ఇదీ ఉక్రెయిన్ అధ్యక్షుడి పరిస్థితి.. అని మరొకరు వ్యంగ్యంగా కామెంట్లు చేశారు. అసలు విషయమేమిటంటే అప్పటివరకు పక్కనే ఉన్న వ్లాదిమిర్ జెలెన్స్కీ భార్య ఓలెనా జెలెన్స్కీ మరో అతిధిని పలకరించేందుకు ఒక అడుగు పక్కకు జరిగింది. దీంతో ఒక్కరే ఉన్న ఫోటో బయటకు రావడంతో రకరకాల కథనాలను పుట్టించారు నెటిజన్లు. ఇదిలా ఉండగా నాటో సమావేశాల్లో ఉక్రెయిన్ అధ్యక్షుడు సందేశమిస్తున్న సమయంలో అతని భార్య ఓలెనా జెలెన్స్కీ ఆయన పక్కనే ఉన్నారు. సమావేశంలో ఆయా దేశాలు రష్యాపై యుద్ధంలో ఉక్రెయిన్ కు తమ సహకారం ఉంటుందని ప్రకటించాయి. ఎటొచ్చి నాటో సభ్యత్వంపైనే స్పష్టత లేని హామీలనిచ్చాయి. ఇది కూడా చదవండి: అమెరికా అధ్యక్షుడి చేతిలో న్యూక్లియర్ బ్రీఫ్ కేస్..? -
అమెరికా అధ్యక్షుడి చేతిలో న్యూక్లియర్ బ్రీఫ్ కేస్..?
లండన్: బ్రిటన్ ప్రధాని రిషి సునక్తో లండన్లోని 10 డౌనింగ్ స్ట్రీట్లో భేటీ అయిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వద్ద న్యూక్లియర్ బ్రీఫ్ కేస్ దర్శనమిచ్చింది. ఆయన ఎక్కడికెళ్తే అక్కడకు ఆయనతో పాటు ఈ బ్లాక్ లెదర్ సూట్ కేసును వెంట తీసుకెళ్లడం రష్యాకు కీడు శంకిస్తోందని చెబుతున్నాయి స్థానిక మీడియా వర్గాలు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అత్యవసర సమయంలో వైట్ హౌస్ దాటి ఎక్కడికైనా బయటకు వెళ్ళినపుడు ఈ న్యూక్లియర్ బ్రీఫ్ కేసును అయన తన వెంట తీసుకెళ్లడం చేస్తుంటారు. కానీ లండన్ పర్యటనకు ఈ బ్రీఫ్ కేసును తీసుకెళ్లడమే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. న్యూక్లియర్ బ్రీఫ్ కేస్ అంటే.. అమెరికా కమాండర్ ఇన్ చీఫ్ హోదాలో అమెరికా అధ్యక్షుడు ఎప్పుడైనా, ఎక్కడి నుంచైనా అణుబాంబుల ప్రయోగానికి ఈ న్యూక్లియర్ బ్రీఫ్ కేసు నుంచి ఆదేశించవచ్చు. 20 కిలలో బరువుండే ఈ బ్యాగ్లో న్యూక్లియర్ లాంచ్ కు సంబంధించిన కోడ్ పొందుపరచి ఉంటుంది. దీన్నే అటామిక్ బాంబు గానూ ప్రెసిడెంట్ అత్యవసర హ్యాండ్ బ్యాగ్ గానూ చెబుతూ ఉంటారు. సాయుధ దళానికి చెందిన సైనికుడు అధ్యక్షుడి వెంట దీన్ని తీసుకెళ్తూ ఉంటారు. రష్యా గురించేనా..? రష్యా ఉక్రెయిన్ యుద్ధం నేపధ్యంలోనే జో బైడెన్ ఈ న్యూక్లియర్ బ్రీఫ్ కేసును తనవెంట తీసుకుని వెళ్లినట్లు చెబుతున్నాయి మీడియా వర్గాలు. ఉక్రెయిన్ పై రష్యా అణుబాంబులు ప్రయోగానికి సిద్ధమైందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఉక్రెయిన్ కు ఆదేశాలిచ్చేందుకే అమెరికా అధ్యక్షుడు తన చేతిలో న్యూక్లియర్ బ్రీఫ్ కేసు తీసుకెళ్లారని వారంటున్నారు. నాటో సమావేశానికి ముందు సన్నాహకంగా బ్రిటన్ ప్రధాని రిషి సునక్తో భేటీ అయిన బైడెన్ ఉక్రెయిన్ నాటో సభ్యత్వం గురించి ఆయనతో చర్చించినట్టు సమాచారం. రష్యాతో యుద్ధం ముగిసిన తర్వాతే ఉక్రెయిన్ సభ్యత్వం గురించి పరిగణిస్తామని ఇదివరకే చెప్పిన బైడెన్ వారికి అడుగడుగునా అండగా నిలుస్తున్నారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఈ సమావేశాలు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఇది కూడా చదవండి: ఉద్యోగిని వేధించిన కంపెనీ.. నష్టపరిహారం కోట్లలోనే..?