బేర్‌ పంజా.. రెడ్‌లో ముగిసిన స్టాక్‌మార్కెట్‌ సూచీలు | Sakshi
Sakshi News home page

బేర్‌ పంజా.. రెడ్‌లో ముగిసిన స్టాక్‌మార్కెట్‌ సూచీలు

Published Tue, Apr 30 2024 3:28 PM

Stock Market Rally On Today Closing

దేశీయ స్టాక్‌మార్కెట్లు మంగళవారం నష్టాలతో ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 55 పాయింట్లు నష్టపోయి 22,588 వద్దకు చేరింది. సెన్సెక్స్‌ 188 పాయింట్లు దిగజారి 74,482 వద్దకు చేరింది.

సెన్సెక్స్‌ 30 సూచీలో పవర్‌గ్రిడ్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, మారుతీ సుజుకీ, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, టాటా మోటార్స్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, హెచ్‌యూఎల్‌, ఎస్‌బీఐ, ఎన్‌టీపీసీ కంపెనీ షేర్లు లాభాల్లోకి చేరుకున్నాయి.

టెక్‌మహీంద్రా, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, టీసీఎస్‌, టాటా స్టీల్‌, సన్‌ఫార్మా, ఎల్‌ అండ్‌ టీ, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, భారతీ ఎయిర్‌టెల్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐటీసీ, టైటాన్‌ నెస్లే కంపెనీ షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement
 
Advertisement