షెల్టర్‌ శ్లాబు కూలి యువకుడి మృతి | Sakshi
Sakshi News home page

షెల్టర్‌ శ్లాబు కూలి యువకుడి మృతి

Published Tue, May 7 2024 11:40 PM

షెల్టర్‌ శ్లాబు కూలి యువకుడి మృతి

మధురపూడి: ప్రమాదవశాత్తూ శ్లాబు కూలి సీతానగరం మండలం సింగవరం బాదంచెట్టు కాలనీకి చెందిన మోర్త శ్యామ్‌కుమార్‌ (20) మృతిచెందాడు. ఈ ఘటన మంగళవారం కోరుకొండ మండలం జంబూపట్నంలో చోటు చేసుకుంది. శ్యామ్‌ అటుగా వెళుతుండగా వర్షం కురియడంతో అంబేడ్కర్‌ విగ్రహానికి రక్షణగా ఏర్పాటు చేసిన షెల్టర్‌ శ్లాబు కిందికి వెళ్లాడు. అతనితోపాటు కొందరు జోరుగా కురుస్తున్న వర్షానికి ఈ షెల్టర్‌ కిందికి వెళ్లారు. విపరీతంగా కురిసిన వర్షం కారణంగా శ్లాబు కూలింది. శ్యామ్‌కుమార్‌ తలకు బలమైన గాయమై మెదడు బయటకు వచ్చి, అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదంలో ముంగమూరి పృథ్వికి గాయాలయ్యాయి. ప్రస్తుతం అతను హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడు.కోరుకొండ పోలీసులు మృతి కేసు నమోదు చేస్తున్నట్టు సీఐ నాగమురళి తెలిపారు.

తల్లి రోదన

నన్ను ఒంటరిని చేసి వెళ్లిపోయావా అంటూ కొడుకు శ్యామ్‌ మృతితో తల్లి నాగమణి గుండెలవిసేలా రోదించారు. శ్యామ్‌ మృతితో సింగవరం బాదంచెట్టు కాలనీలో విషాదఛాయలు అలముకున్నాయి. శ్యామ్‌కుమార్‌, తల్లి నాగమణి సింగవరంలో ఉంటున్నారు. తండ్రి విక్టర్‌బాబు హైదరాబాద్‌లోని ఓ స్వచ్ఛంద సేవాసంస్థలో రోజుకూలీగా పనిచేస్తున్నారు.

 
Advertisement
 
Advertisement