వైఎస్సార్ సీపీ రాష్ట్ర లీగల్ సెల్ ప్రధాన కార్యదర్శి వెంకటరెడ్డి
నగరంపాలెం: ల్యాండ్ టైట్లింగ్ చట్టంపై రాజకీయ లబ్ధి, ఎన్నికల్లో గెలుపు కోసం టీడీపీ దుష్ప్రచారం చేస్తోందని వైఎస్సార్ సీపీ రాష్ట్ర లీగల్ సెల్ ప్రధాన కార్యదర్శి పోలూరి వెంకటరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు అరండల్పేట 11/3వ అడ్డరోడ్లోని సంఘం కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటరెడ్డి మాట్లాడుతూ ల్యాండ్ టైట్లింగ్ చట్టంపై టీవీల్లో, వీడియోల్లో, ఐవీఆర్ కాల్స్ ద్వారా సీఎం వైఎస్ జగన్ను దెబ్బకొట్టాలని టీడీపీ తప్పుడు ప్రచారానికి శ్రీకారం చుట్టిందని ఆరోపించారు. రాష్ట్ర అధికారి ప్రతినిధి డాక్టర్ సయ్యద్బాబు, రాష్ట్ర కార్యదర్శి అబ్రహం లింకన్, జిల్లా అధ్యక్షుడు సీడీ భగవాన్ మాట్లాడుతూ ప్రస్తుతం ఈ చట్టం అమలులో లేదని చెప్పారు. దుష్ప్రచారంతో తగిన మూల్యం చెల్లించకతప్పదని హెచ్చరించారు. సమావేశంలో న్యాయవాదులు పచ్చల అనీల్, బి.బాలాజీ, కొమ్మారెడ్డి రామకృష్ణారెడ్డి, కాశీం పాల్గొన్నారు.