Telangana Crime News: నిద్రలోనే బాలింత మృతి.. ప్రసవించిన 5 రోజులకే ఘటన..
Sakshi News home page

వరంగల్‌లో విషాదం: నిద్రలోనే బాలింతకు కార్డియాక్‌ అరెస్ట్‌.. చంటిబిడ్డకు శాశ్వతంగా దూరమైన తల్లి

Aug 19 2023 1:24 AM | Updated on Aug 19 2023 10:55 AM

- - Sakshi

బిడ్డ పుట్టడంతో ఆ ఇంట ఆనందం వెల్లివిరిసింది. కానీ, ఆ ఆనందం ఐదురోజులకే ఆవిరైంది. బిడ్డకు చనుబాలు బట్టిన ఆ బాలింత నిద్రలోనే శాశ్వత నిద్రలోకి జారుకుంది. ఆ పసికందుకు శాశ్వతంగా దూరమైంది.   

వరంగల్‌: వరంగల్‌ సీకేఎం ప్రభుత్వ ప్రసూతి వైద్యశాలలో శుక్రవారం ఉదయం తెల్లవారుజామున గుండెపోటుతో బాలింత మృతి చెందింది. కుటుంబసభ్యులు, వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్‌ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామానికి చెందిన బుస్స సుష్మిత (25) మొదటి కాన్పు ప్రసూతి వైద్యసేవల కోసం సీకేఎం హాస్పిటల్‌లో ఈనెల 13 చేరింది.

ఆదే రోజు సిజేరియన్‌ ద్వారా మగశిశువుకు జన్మనిచ్చింది. శిశువు అనారోగ్యంగా ఉండడంతో నవజాత శిశువుల వార్డులోని ఇంక్యుబేటర్లో ఉంచి వైద్యసేవలు అందిస్తున్నారు. తల్లి సుష్మితను ఐసీయూనుంచి 18న ప్రత్యేక వార్డుకు మార్చారు. శుక్రవారం ఉదయం సుమారు 4:30 గంటల సమయంలో సుష్మిత వెళ్లి శిశువుకు పాలు పట్టించి వచ్చి నిద్రపోయింది.

తిరిగి రెండు గంటల అనంతరం బాబుకు పాలుపట్టాలని తల్లి నిద్రలేపే ప్రయత్నం చేయగా కదలకపోవడంతో వైద్యులను సంప్రదించారు. డ్యూటీ వైద్యులు వెంటనే పరీక్షించి సీపీఆర్‌ నిర్వహించినప్పటికీ ఫలితం లేకపోయింది. నిద్రలో కార్డియాక్‌ అరెస్ట్‌ కావడంతో సుష్మిత మృతి చెందినట్లు సీకేఎం సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నిర్మలకుమారి తెలిపారు. మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement